ఏర్కాడులో పర్యాటకుల సందడి | - | Sakshi
Sakshi News home page

ఏర్కాడులో పర్యాటకుల సందడి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

పోలీసుల బందోబస్తుతో టాస్మాక్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

ఏర్కాడులో పర్యాటకుల బోటింగ్‌ రైడ్‌

సేలం: సేలం జిల్లాలోని ఏర్కాడును పేదల ఊటీ అని పిలుస్తారు. ఈ పర్యాటక ప్రదేశానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రోజ్‌ గార్డెన్‌, లేడీస్‌ సీట్‌, అన్నాపార్క్‌, లేక్‌ పార్క్‌, పకోడా పాయింట్‌, సర్వరాయన్‌ గుహ ఆలయం, బోట్‌ హౌస్‌ వంటి ఏర్కాడులోని ప్రధాన ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేశారు. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఏర్కాడులో వాహనాలు బారులు తీరి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ట్రాఫిక్‌ జామ్‌ అయిన రోడ్లపై ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసు లేరని ఆరోపిస్తూ, పర్యాటకులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement