ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే అత్యంత కీలకమైన శాఖలను ఉంచుకున్నారు. ఇందులో జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సాధారణ పరిపాలన), హోంశాఖ , మహిళా సంక్షేమ శాఖ, యువజన సంక్షేమ శాఖ, పోలీస్ (శాంతిభద్రతలు) ఉన్నాయి. కే.ఎ. సెంగోట్టయన్ ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారు. బుస్సీ ఆనంద్కు గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల శాఖ, ఆధవ్ అర్జునకు ప్రజాపనులు, క్రీడల శాఖ, అరుణ్ రాజ్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, వెంకట్ రమణన్ ఆహార , పౌర సరఫరాల శాఖ, నిర్మల్ కుమార్ విద్యుత్ , న్యాయ శాఖ, డి.కె. ప్రభు గనులు, ఖనిజ వనరుల శాఖ, రాజ్మోహన్ పాఠశాల విద్యాశాఖ, తమిళ అభివృద్ధి శాఖ, కీర్తన పరిశ్రమల శాఖకు అప్పగించారు.
సీఎం విజయ్, మంత్రులు సెంగోట్టయన్, ఆనంద్, ఆధవ్


