కాంగ్రెస్తోనే బీసీలకు న్యాయం
సిరిసిల్లటౌన్/వేములవాడ: కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు, మహిళలకు న్యాయం జరిగిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో శనివారం ప్రచారం చేశారు. వేములవాడను జర్మనీ రమేశ్బాబుతో వెనుకపడేశారని, వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఆది శ్రీనివాస్ ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారన్నారు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేశారు.
నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, చీటి ఉమేశ్రావు, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.


