ఆటోను ఢీకొన్న కంటైనర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కంటైనర్‌

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

ఆటోను

ఆటోను ఢీకొన్న కంటైనర్‌

– ఇద్దరికి గాయాలు

బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్‌లో గురువారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై లగేజీ ఆటోను కంటైనర్‌ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పలమనేరు నుంచి బంగారుపాళెంకు టమాట లోడ్డులో వస్తున్న లగేజీ ఆటోను మొగిలి ఘాట్‌ వద్ద బెంగళూరు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్‌ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజ, అర్షద్‌ఆలీ గాయపడ్డారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్‌ సిబ్బంది చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆటోను ఢీకొన్న కంటైనర్‌ 1
1/2

ఆటోను ఢీకొన్న కంటైనర్‌

ఆటోను ఢీకొన్న కంటైనర్‌ 2
2/2

ఆటోను ఢీకొన్న కంటైనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement