breaking news
Chittoor District News
-
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
శ్రీరంగరాజపురం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని పాతపాళ్యం దళితవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన వరప్రసాద్తోపాటు కుటుంబ సభ్యులు గురువారం క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్లారు. అదే సందర్భంలో అకస్మాత్గా షార్ట్ సర్క్యూట్ కారణంగా అతని పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.30 వేల నగదు, 40 గ్రాముల బంగారు ఆభరణాలు, వరి ధాన్యం, బియ్యం, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు. దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత శాంతిపురం: పంచాయతీ కేంద్రమైన నడింపల్లిలో తన ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేయడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు మారప్ప తెలిపారు. భూ వివాదంపై కుప్పం కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే జేసీబీతో ఇంటిని కూలదోశారని వాపోయాడు. కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని కోరినా వినిపించుకోకుండా ప్రత్యర్థి పక్షం వారు కూల్చివేశారని చెప్పాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిలో ఎవరూ ప్రవేశించ కుండా చూడాలని కోరారు. ప్రభుత్వ కుంట ఆక్రమణ చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేట సమీపంలో సుమారు రూ.40 లక్షల విలువైన ప్రభుత్వ కుంటను స్థానిక టీడీపీ నేత ఆక్రమించుకుంటున్నాడు. ఆరేపల్లి లెక్క దాఖల సర్వే నంబర్ 142/6లో 30 సెంట్ల కుంట ఉంది. ఇక్కడ గతంలో పురాతన కోనేరు ఉండేది. కాలక్రమేణ కోనేరు పూడిపోవడం, రెవెన్యూ రికార్డుల్లో కుంట భూమిగా నమోదైంది. ఇదే అదునుగా భావించిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఆ భూమిపై కన్నేశాడు. రెండు రోజులుగా నిరంతరం మట్టిని తరలించి, కుంటను చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. విలువైన భూములు ఇలా అన్యాక్రాంతం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రగిరిలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేస్తే, నామమాత్రంగా పనులను అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 60 సవర్ల బంగారం, రూ1.5 లక్షల నగదు చోరీ వెంకటగిరి రూరల్: కుమార్తె ఉన్నత చదువులు కోసం ఇంట్లో దాచి ఉంచిన నగదు, బంగారం ఎవరు లేని సమయం చూసి దుండగలు చోరీ చేశారు. ఈ ఘటన పట్టణంలోని తోలిమిట్టలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు..తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణమూర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె ప్రస్తుతం తిరుపతిలో విద్యనభ్యసిస్తూ అక్కడే ఉంది. కుమార్తె బాబోగులు చూసుకునేందుకు బుధవారం తిరుపతికి వెళ్లిన కృష్ణమూర్తి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికే గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా చేసి ఉన్నారు. అనుమానంతో తాను దాచి ఉంచిన బంగారం, నగదును చూడగా కనిపించలేదు. బాధితుడు ఈ విషయమై పోలీసుల కు సమాచారం అందించాడు. స్థానిక ఎస్ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు 60 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దగ్ధమైన వస్తువులు -
కిస్మస్ వేడుకల్లో కలెక్టర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం,కొంగారెడ్డిపల్లిలోని బీటీ మెమోరియల్ చర్చి లో గురువారం జరిగిన కిస్మస్ వేడుకల్లో కలెక్టర్ సుమిత్కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నా రు. కాసేపు దైవ సందేశాన్ని ఆలకించారు. అనంతరం చర్చి పాస్టర్లు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తర్వాత శాలువతో సత్కరించారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం సెలవు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ ఆవరణంలో కూడా భక్తజన సందడి కనిపించింది. భక్తుల తాకిడితో దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆలయ అధికారులకు స్వామి దర్శనం కల్పించారు. రేపు పడిమెట్ల పూజోత్సవం సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం పడిమెట్ల పూజోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో ప్రాముఖ్యత కలిగిన పడిమెట్ల పూజోత్సవాన్ని ఆలయ ధర్మకర్త, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విశేషంగా తరలివచ్చే స్వాములు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
వెంకన్న దర్శనానికి వెళ్తూ..
చౌడేపల్లె: పుంగనూరు మండలం, ప్రసన్నయ్యగారి పల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు(62) తిరుమలకు పాదయాత్రగా వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. ప్రసన్నగారిపల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు గ్రామస్తులతో కలిసి ప్రతి యేటా తిరుమలకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకునేవారు. ఈక్రమంలో గురువారం ఇంటి వద్ద నుంచి బయలుదేరి కాలినడకన వెళ్తుండగా చౌడపల్లె పోలీస్ స్టేషన్కు సమీపంలోని పెద్దయల్లకుంట్ల వద్ద పుంగనూరు నుంచి చౌడేపల్లెకు వెళ్తున్న ఓ స్కూటర్ ఢీకొంది. శ్రీరాము లు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బైక్తోపాటు ఆమినిగుంటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అనుభవించక తప్పదు
చేసిన పాపాలు సోమల(సదుం): కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలను భవిష్యత్లో అనుభవించక తప్పదని, బాబు నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. సోమల మండలంలో గురువారం వారు విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన నాయ కులు చేసిన తప్పిదాలు, అరాచకాలను సైతం వైఎస్సార్ సీపీపై నెట్టేసి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. చేసిన పాపాలను రానున్న రోజుల్లో అనుభవించక తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రస్తుతం నిలిపివేశారని, ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పేదలకు వైద్యం, విద్యను దూరం చేసే ఈ విధానంపై ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. మైనారిటీల సంక్షేమానికి కృషి సోమల: ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మైనారిటీలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఎంపీ మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే, ఎంపీ తెలిపారు. సోమల ఈద్గా వద్ద మైనారిటీలతో సమావేశం నిర్వహించారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ ఈశ్వరయ్య, నాయకులు అమాసమోహన్, గంగాధర్రాయల్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సరస్వతమ్మ, వైస్ ఎంపీపీలు ప్రభాకర్, సయ్యద్బాషా, కల్యాణ భరత్, దామోదరరాజు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం..నిరుపయోగం
అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యల తిష్ట అరగొండలో నిరుపయోగంగా ఉన్న బాలికల హైస్కూల్ అదనపు తరగతి గదులు, ఆట స్థలంలో పిచ్చిమొక్కలు తవణంపల్లె: మండలంలోని అరగొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ 193 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్లో 20 మందిదాకా చదువుతున్నారు. హైస్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. నీటి సరఫరా సైతం సక్రమంగా లేదు. 20 ఏళ్ల క్రితం జెడ్పీ నిధులతో నిర్మించిన మూడు తరగతి గదులు, ఆట స్థలం, మరుగు దొడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వీటి చుట్టూ ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. రోడ్డు దాటలేకనే.. అరగొండ బాలికోన్నత పాఠశాలకు రెండు ప్రదేశా ల్లో సుమారు 200 మీటర్ల దూరంలో అదనపు తరగతి గదులు నిర్మించారు. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఒకే ప్రదేశంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మరోచోట ఉన్న తరగతి గదులకు రాకపోకలకు రోడ్డును దాటి వెళ్లాల్సి ఉంది. దీంతో అటువైపు ఎవ్వరూ వెళ్లడం లేదు. గతంలో నుంచే నిరుపయోగం నేను హెచ్ఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతోంది. అంతకుముందు నుంచే మూడు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఆట స్థలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఆట స్థలాన్ని వినియోగంలోకి తేవడానికి చర్యలు చేపడుతాం. మౌలిక వసతులు కల్పిస్తే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. – మోహన్రెడ్డి, హెచ్ఎం, అరగొండ బాలికోన్నత పాఠశాల -
ఉపాధిలో వేతన వెతలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి కూలీల అవస్థలు అన్నీఇన్నీ కావు. నాలుగు నెలలుగా వేతనాలు, కూలీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించి 15 రోజుల్లో జీతాలు అందించేలా చట్టం ఉన్న ప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 15 నుంచి అందని జీతాలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధి కూలీలు పస్తులుండాల్సి వస్తోంది. చంద్రబాబు సర్కారు ఉపాధి కూలీల పట్ల చిన్నచూపు చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఉపాధి కూలీలకు జీతాలు అందడం లేదు. పేరుకుపోయిన బకాయిలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల జీతాలు రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఇందుకు కారణం కేంద్రమేనని, బడ్జెట్ విడుదల చేయడం లేదని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జీతాలు రాకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పట్టారు. రామకుప్పం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని చోట్ల కూలీలకు అందాల్సిన నిధులు రానివ్వకుండా నొక్కేసేందుకు పచ్చ నేతలు యంత్రాలతో పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. నత్తనడకన ఉపాధి పనులు గ్రామాల అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని డప్పు కొంట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. డ్వామా శాఖ పరిధిలో ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62,848 పనులు మంజూరు చేశారు. అయితే వీటిలో 17,788 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఫీడర్ చానళ్ల పూడిక తీతకు 3,422 పనులను మంజూరు చేయ గా 324 మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలో 23,583 ఫామ్పాండ్స్ పనులను మంజూరు చేయగా ఇప్పటి వరకు 6,678 పూర్తి చేసి మిగిలినవి నిలిపివేశారు. ఆర్భాటంగా నిర్వహించిన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2,395 పశువుల పాకలు మంజూరు చేయగా ఇందులో 682 మాత్రమే పూర్తి చేశారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు 6,678 మంజూరు చేయగా 2,283, కంపోస్ట్ గుంతలు 9,791కి 4,769, పశువుల తొట్టెలు 1,788కి గాను 761 పూర్తి చేసి మిగిలిన పనులను నిలిపివేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో జిల్లా వ్యాప్తంగా 1,434 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 127 రోడ్లు మాత్రమే వేయగలిగారు. -
దేవుడు కనిపించాడు!
దివ్యదర్శన టోకెన్ల క్యూలలో తోపులాట ఆ నగుమోమును చూడాలని.. నిలువెత్తు మూర్తిని దర్శించుకోవాలని.. ఆ అమృతమూర్తిని కనులారా వీక్షించాలని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరునగరికి చేరుకున్నారు. అయితే వారికి ఏడుకొండల వాడి పాదాల చెంతన ఉన్న అలిపిరిలోనే ఆ దేవదేవుడు కనిపించాడు. తోపులాటలో చిన్నా, పెద్దా, వయోవృద్ధులు వర్ణించనలవికానీ అగచాట్లు పడ్డారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో తండ్రీ నిను చూడాలని వచ్చిన మాకు ఇన్ని ఇక్కట్లా అని ఆవేదన చెందారు. పండుగ సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం గురువారం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కు భక్తులు అత్యధిక సంఖ్యలో చేరుకున్న దర్శన టోకెన్ల కోసం అష్టకష్టాలు పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం కంటే మించి రెండింతల మేరకు భక్త జనం చేరుకోవడంతో క్యూలన్నీ కిక్కిరిసి పోయాయి. దివ్యదర్శన టోకెన్ జారీ కౌంటర్ వద్ద భక్తులు పోటెత్తడంతో నిలువరించే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది చర్యలు ఏమాత్రం ఫలించలేదు. భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాటలు చోటుచేసుకుని అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కంచెలను దాటే ప్రయత్నంలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ ఏ మాత్రం దగ్గలేదు. నిర్దేశించిన మేరకు టోకెన్ల జారీ పూర్తి అయిందనే విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహంగా ఊసురోమంటూ వెనుదిరిగారు. కాగా ఈ ఘటన చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్ కెమెరాను ఏవీఎస్ఓ లాక్కున్నారు. – తిరుపతి అన్నమయ్యసర్కిల్ -
యూరియా..లేదయ?
రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ఏ ఎరువుల దుకాణానికి వెళ్లినా కావాల్సినంత యూరియా దొరికేది. సకాలంలో పంటలకు వేసుకునేవారు. కానీ ఇప్పుడు యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరుగుతున్నా ఎక్కడా దొరకడం లేదు. వచ్చే అరకొర యూరియా ఎక్కడికీ చాలడం లేదు. ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ఎస్కేలు.. ఫర్టిలైజర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ.. అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరులోని రైతు సమాఖ్య సెంటర్, గ్రోమార్ దుకాణాల వద్ద యూరియా కోసం క్యూకట్టిన రైతులు (ఫైల్) బ్లాక్లో బస్తా యూరియా రూ.500 పైమాటే స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకలో యూరియాను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి ఆటో డ్రైవర్లకు ఇది బాగా కలిసి వస్తోంది. నిత్యం బోర్డర్కు వెళ్లడం.. పది బస్తాలను ఆటోలో తెచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. కర్ణాటకలో బస్తా యూరియా ధర రూ.270 కాగా అది బ్లాక్లో రూ.500 దాటుతోంది. ఎరువుల దుకాణాల్లో నోస్టాక్ జిల్లాలోని ఎరువుల దుకాల్లో యూరియా స్టాకు లేదు. వీరికి హోల్సేల్గా సరఫరాచేసే ఏజెన్సీలు యూరియా కావాలంటే కాంప్లెక్స్ తీసుకోవాలంటూ మెలిక పెట్టాయి. దీంతోపాటు ఇక్కడ ఎమ్మార్పీ రూ.275కి విక్రయించాల్సి ఉండగా..ట్రాన్స్ఫోర్ట్ చార్జీలు అదనంగా ఉంటున్నాయి. దీంతో బస్తా రూ.300పైగా విక్రయించాలి. లేని సమస్యలకెందుకని ఫర్టిలైజర్స్ యూరియాను అసలు కొనడం లేదు. దీనికితోడు ప్రభుత్వం సైతం ఆర్ఎస్కేలు, రైతు సమాఖ్య, గ్రోమార్ సెంటర్లకు మాత్రమే యూరియాను పంపుతోంది. పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతు న్న కష్టాలు అన్నీఇన్నీకావు. మొన్నటి దాకా కాంప్లెక్స్ లేదా ఫర్టిలైజర్స్ కొంటేనే యూరియా అమ్మిన ఎరువుల దుకాణదారులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్గా అందే జిల్లాలోని గ్రామోర్ అవుట్లెట్లు, రైతు సమాఖ్య దుకా ణాలకు వందలాది మంది రైతులు క్యూకడుతున్నారు. వారిని నియంత్రించేందకు పోలీసు బందోబస్తు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నారుమళ్లకు సైతం యూరియా దొరకడం లేదు. ఏపీ రైతుల దెబ్బ కు పక్కనే ఉన్న కర్ణాటకలో సైతం స్టాకు లేకుండా పోయింది. ఉన్న స్టాకును కొందరు బ్లాక్ మార్కెట్లోకి తరలించి స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల్లో కావాల్సినంత యూరియా దొరగ్గా కూటమి పాలనలో మాత్రం ఎందుకు యూరియాకు డిమాండ్ వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడా యూరియా లేదు జిల్లాలో యూరియా దొరక్క రైతులు పొరుగునే ఉన్న కర్ణాటకకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. భారీగా పెరిగిన వరి సాగు జిల్లాలో గత ఖరీఫ్లోనూ వరిసాగు పెరిగింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దీంతో సాధారణ వరిసాగు ఈ రబీలో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నారుమళ్ల సీజన్ నడుస్తోంది. దీంతోపాటు మొక్కజొన్న, పశుగ్రాసం, మల్బరీ పంటలకు సైతం రైతులు యూరియాను వాడుతున్నారు. జిల్లాలో డిమాండ్ మేరకు యూరియా అలాట్మెంట్ మాత్రం పెరగడం లేదు. గంటల్లో ఖాళీ ఇటీవల జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో ఒక్కో పంచాయతీకి రూ.250 బస్తాల యూరియా వచ్చింది. ఇది కేవలం గంటల్లో ఖాళీ అయిపోయింది. ఇందులో సింహభాగం కూటమి నేతలకే చేరిపోయింది. ఫలితంగా అవరసమైన రైతులు బ్లాక్లో కర్ణాటక నుంచి అధిక ధరతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లా సమాచారం జిల్లాలో యూరియా నో స్టాక్ దొరకలేదు ఓ బస్తా యూరియా కోసం వారం రోజులుగా పలమనేరు లోని దుకాణాల వద్దకు తిరు గుతున్నా. కానీ ఫలితం లేదు. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అన్నా ఇప్పుడు యూరియా దొరకడం లేదు. మా బంధువుల ద్వారా కర్ణాటకలోని వడ్డిపల్లికెళ్లి బస్తా యూరియా తెచ్చుకున్నా. – సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం -
ఘనంగా హనుమాన్ చాలీసా
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో గురువారం హనుమాన్ చాలీసాను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంకీర్తనలు, భజనల తో భక్తులను హోలలాడించారు. కార్యక్రమాని కి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారికి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
మన్నిక, నాణ్యతకు ప్రతీకగా భారతి సిమెంట్
నాయుడుపేట టౌన్: మన్నిక, నాణ్యతలకు ప్రతీక భారతి సిమెంట్ అని, ఇది అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతోందని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి పాస్టర్ ఆదర్ష్ ప్రీతం కొనియాడారు. నాయుడుపేటలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి వద్ద ఆ సంఘం పెద్దలు యువతతో కలిసి పాస్టర్ కేక్ కట్ చేసి భారతి సిమెంట్స్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ వేడకలను భారతి సిమెంట్స్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారతి సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించి క్యాలెండర్లను ఆవిష్కరించారు. భారతి సిమెంట్స్ కంపెనీ నెల్లూరు జిల్లా డిప్యూటీ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చైర్మన్ కారల్ మధు, కేఎంవీ కళాచంద్ర, సండే స్కూల్ సూపరిండిండెంట్ ప్రేమ్చంద్, భారతి సిమెంట్స్ డీలర్లు కామిరెడ్డి అమరేంద్రరెడ్డి, కరీంబాయి, చెంచయ్య మొదలియార్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు బెన్హర్, కాళహస్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
నరసింహపురంలో కోడి పందేల జోరు
పాలసముద్రం : మండలంలోని నరసింహపురం పంచాయతీ తమిళనాడు సరిహద్దులో బుధవారం కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు సరిహద్దులో కొన్ని రోజులుగా కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయని చెబుతున్నా రు. తిరుమళరాజుపురం (రైస్మిల్) కూడలిలో తమిళనాడు వాసులు కోడి పుంజులతో వచ్చి పందేలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ ఎస్వీయూ తిరుపతి సిటీ : దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. యువజన ఉత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి యూనివర్సిటీకి వచ్చిన కళాబృందాలను బుధవారం వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఎస్వీ యూనివర్సిటీ ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకోవడం గర్వకారణమన్నారు. వారిని ప్రోత్సహించిన కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలు సాధించిన జ్ఞాపికలను యూనివర్సిటీ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ చెండ్రాయుడు, కల్చరల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ కేఎం భాను, డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,583 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,936 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.936 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలి తిరుపతి అన్నమయ్యసర్కిల్: వచ్చే నెలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రుల కమిటీలు సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసినట్లు వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. – ఈ ఏడాది 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే హాజరు కావాలని సూచించారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని తెలిపారు. అదనపు ఎస్పీలు విమనోహరాచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడం జరిగిందని, ఈ డిసెంబర్ 31వ తేదీలోగా మరో 5 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరుతో 50 వేల సర్వీసుల మార్కును చేరుకోవాలని జిల్లా స్థాయి విద్యుత్ అధికారులకు సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్పై అవగాహన సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంపై వినియోగదారుల్లో అవగాహనను పెంపొందించాలని సీఎండీ సూచించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఇతర గృహ వినియోగదారులను కూడా సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ’కరెంటోళ్ళ జనబాట’ కార్యక్రమం జరిగిన తీరుపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, కే.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పీహెచ్ జానకీరామ్, ఎం.మురళీకుమార్, పి. సురేంద్రనాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, విజయన్, రామచంద్రరావు, చక్రపాణి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖరరావు, రాఘవేంద్రరావు, రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సుధాకర్, సంపత్ కుమార్, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
పుంగనూరు : క్రిస్మస్ను పురస్కరించుకుని క్రైస్తవులకు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి విడివిడిగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్.. శాంతి నెలకొల్పడమే చిత్తూరు అర్బన్ : సమాజంలో శాంతి నెలకొల్పడంతో పాటు ప్రతి ఒక్కరిపై కరుణ, సహనం కలిగి ఉండటమే క్రిస్మస్ పండుగ లక్ష్యమని ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. పరస్పర గౌరవంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మంచి విలువలను పాటించాలని కోరారు. బీఎల్వోల జీతాల పెంపు చిత్తూరు కలెక్టరేట్ : బీఎల్వోల జీతాలను పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు బుధవారం కలెక్టరేట్కు అందాయి. జిల్లాలోని బీఎల్వోలకు ఇకపై రూ.12 వేలు, బీఎల్వో సూపర్వైజర్లకు రూ.18 వేలు సంవత్సరానికి, స్పెషల్ ఇన్సెంటివ్ ప్రత్యేక డ్రైవ్స్ కార్యక్రమాలకు రూ.2 వేలు చొప్పున అందజేయనున్నారు. పెంచిన జీతాలు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి జీతం, పాక్షికంగా పనిచేసిన వారికి అనుబంధంగా చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు. వరసిద్ధుడికి రూ.1.60 కోట్ల ఆదాయం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.1,60,25,165 ఆదాయం వచ్చింది. బంగారం 16 గ్రాములు, వెండి 1.650 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,316, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.25,720 వచ్చింది. యూఎస్ఏ 636 డాలర్లు, సింగపూర్ 162 డాలర్స్, మలేషియా 23 రింగిట్స్, యూఏఈ 5 దిర్హామ్స్, ఆస్ట్రేలియా 370 డాలర్స్ , సౌదీ 185 రియాల్స్ వచ్చాయి. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 28న ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్బీ ప్రసాద్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్, ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పోటీలు ఈ నెల 28 వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ లో జరుగుతాయన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు, ట్రోఫీలు, పతకాలు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27 వ తేదీ లోపు www. apchess.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9000475799, 9849313676 నంబర్లో సంప్రదించాలని కోరారు. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి -
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌకసదుం : మంత్రులు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములను తక్కువ ధరకే పప్పు బెల్లాల్లా పంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదుం మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పెద్దిరెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఠంచన్గా అందించి అన్ని వర్గాలను గత ప్రభుత్వ పాలనలో ఆదుకున్నామని గుర్తు చేశారు. పలు పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలుపై కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తిమ్మారెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, పార్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖమ్రుద్దీన్, మస్తాన్, ధనశేఖర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో బుధవారం క్రిస్మస్ కోలాహలం మొదలైంది. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ మందిరాలు, విశ్వాసుల గృహాలు నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. త్యాగానికి ప్రతీక అయిన క్రిస్మస్ వేడుకను జరుపుకునేందుకు క్రైస్తవులు సన్నద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్ దీపాలతో అలకరించారు. చర్చి లోపలి భాగంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పలుచోట్ల ఏసు జన్మ వృత్తాంతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు క్రైస్తవులు తమ గృహాలను సుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచి ఏసును స్తుతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలు, ప్రార్ధనలు నిర్వహించారు. పిల్లలు, యువజనులు క్రీస్తు జనన వృత్తాంతాన్ని వివరించే నాటికలు ప్రదర్శించారు. గురువారం ఉదయం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు జరగనున్నాయి. కాగా క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, చర్చిల అలంకరణ సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాన్బాస్కో చర్చిలో క్రిస్మస్ ట్రీకాణిపాకం : జిల్లాలో జరుగుతున్న స్కానింగ్, అబార్షన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సాక్షి దినపత్రికలో మంగళవారం కన్నింగ్..స్కానింగ్ కథనం ప్రచురితమైంది. అలాగే బుధవారం అబార్షన్ల అనకొండలు పేరిట కథనం వచ్చింది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాతో పాటు అక్రమ స్కానింగ్ గుట్టు రట్టు కావాలని ఆదేశించారు. ఏయే జిల్లాలో అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలోని వైద్యులు, ఏఎన్ఎంలు దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని హెచ్చరించారు. అక్రమస్కానింగ్లు ఏ రకంగా జరుగుతున్నాయి..? వారికి ఎవరెవ్వరూ సహకరిస్తున్నారు..? వారికి ఎంటీపీ కిట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? అవి ఎలా సరఫరా జరుగుతున్నాయి? ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? ఆడిట్ జరుగుతోందా అనే విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా అబార్షన్లు, అక్రమ స్కానింగ్లు ఆగేనా?.క్రీస్తు జన్మవృత్తాంతం.. జాన్బాస్కో చర్చిలో అలంకరణఅక్రమ స్కానింగ్, అబార్షన్లపై ఆగ్రహం -
నకిలీ వి‘ప’త్తు!
చౌడేపల్లె: పడమటి మండలాల రైతులు టమాట సాగుపై దృష్టి సారించారు. నారుకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నర్సరీ నిర్వాహకులు నకిలీ నారును అంటగడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో దశలవారీగా టమాట పంటను సాగుచేయనున్నారు. సీజన్ దగ్గరపడుతుండడంతో పలువురు నర్సరీ నిర్వాహకులు విత్తనాలు విత్తి మొలకల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. తక్కువ నీటి సౌకర్యం ఉన్న రైతు కూడా అధిక దిగుబడులు పొందడానికి మార్కెట్లో వెలువడిన కొత్తరకం విత్తనాలపై ఆశపడుతున్నారు. నర్సరీలో ప్రస్తుతం సాహో, సల్లార్, కావేరి, 778, శివంగితోపాటు పలు కొత్త రకం టమాట మొలకలు లభిస్తున్నాయి. ముందుగానే రిజర్వేషన్లు మొలకల కోసం రైతులు ముందుగానే నర్సరీ యజమానుల వద్ద ఒప్పదం కుదుర్చుకుంటున్నారు. ఒక్కొక్క టమాట మొలకను రూ.1.2 పైసల నుంచి రూ.2 వరకు విక్రయిస్తున్నారు. నారు పెంచేందుకు 27 రోజులు పడుతుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఎకరం పొలానికి 7 వేల నుంచి 8 వేల టమాట మొలకలు అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. నకిలీ నారు, నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.టమాట నారుకు భలే డిమాండ్ నకిలీల జోరు టమాట మొలకల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు బయట ప్రాంతం నుంచి నారును సరఫరా చేస్తున్నారు. దీంతో నకిలీ విత్తనాలతో తయా రు చేసిన నారు జోరుగా విక్రయిస్తున్నట్టు రైతులు ఆ రోపిస్తున్నారు. అధికారులకు సమాచారం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
–త్రుటిలో తప్పిన ప్రమాదం కార్వేటినగరం : చెరకు ట్రాక్టర్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని చిన్నకనుమ వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవిందస్వామి కథనం మేరకు వివరాలిలా.. బెంగళూరు నుంచి కేఎస్ ఆర్టీసీ బస్సు పుత్తూరుకు వెళుతుండగా ఎస్ఎన్జే షుగర్ ఫ్యాక్టరీకి చెరకు లోడ్తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. బస్సు డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై ఇంత వరకు ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ గోవిందస్వామి తెలిపారు. తప్పిన ప్రమాదం అసలే ప్రమాదాలకు నిలయంగా ఉన్న చిన్న, పెద్ద కనుమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో కూడా అదే కనుమపై ఇటుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనుమకు ఎడమ వైపు సుమారు 30 అడుగుల లోతు లోయ ఉంది. కానీ చెరకు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో బస్సు ఎడమ వైపు వాలకుండా చెరుకు లోడ్డు ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
వేతన.. యాతన
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన 104 ఉద్యోగులు పల్లెల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆపద్బాంధవులకు ఆపదొచ్చింది. 104 అంబులెనన్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువుతోంది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారి జీవితాలు తలకిందులవుతున్నాయి. అదనపు భారం కొండెక్కింది. వేధింపులు తార స్థాయికి చేరాయి. ప్రశ్నిస్తే..వేటు వేస్తున్నారు. ప్రభుత్వ అండదండలతో యాజమాన్యం విడ్డూరంగా వ్యవహరిస్తోంది. వారి పోరు పడలేక ఉద్యోగులు రోడ్డెక్కారు. నిరవధిక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) జిల్లాలో 729 గ్రామాలకు గాను ’104’ వాహనాలు కేవలం 42 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉన్నారు. మొత్తం మీద 93 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంది. కానీ ఆ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వీడని వేధింపులు సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని ముండిపడుతున్నారు. రెండు వాహనాలకు ఒక డ్రైవర్కు డ్యూటీ వేయడం. ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపి రాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్ కూడా ఆన్లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఫార్మసీ పనులు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారానే చేయిస్తున్నారు. ఈ తరణంలో ప్రజలకు జరకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యలని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెలవులు ఏవీ.. కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. వారి బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. వా రు వృద్ధాప్యంలో తరచూ అనారోగ్యం పాలవుతుంటా రు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య ప రిస్థితుల సమయంలో సెలవులివ్వకుండా వేధింపుల కు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగు లు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం క ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల నుంచి కోతలు గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న ఆరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సీనియర్ల నుంచి నెలకు రూ.800 , జూనియర్ల నుంచి నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో. ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పే వారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడు మూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు సక్రమంగా చెల్లింస్తుందని, అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు. నిరసనలు ఇలా... నిబంధనలకు తూట్లు భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్ద తలకాయల మద్దతుతో రెచ్చిపోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగనట్టు సమాచారం. గత నాలుగురోజులుగా చేపడుతున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు నిర్వాహకులు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తోందని పలువురు వాపోతున్నారు. -
రేసు కుక్కల దాడి
గుడిపాల : రేసు కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. గుడిపాల మండలం వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి తమ వ్యవసాయ పొలాల వద్ద దూడను కట్టి ఉంచాడు. ఆ పొలాలకు ఆనుకునే అటవీ ప్రాంతం ఉంది. మంగళవారం రాత్రి రేసు కుక్కలు వచ్చి దూడపై దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు చిరుతపులి దాడి చేసిందని భయాందోళన చెందారు. అటవీశాఖ పారెస్ట్ బీట్ ఆఫీసర్ కుసుమకుమారి సంఘటనా స్ధలాన్ని పరిశీలించి చిరుతపులి దాడి చేయలేదని చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి రేసుకుక్కలు దాడిచేసినట్లు నిర్ధారించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ సాయిసుధ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి దూడకు పంచనామా చేశారు. రాత్రి వేళల్లో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పాడి పశువులను ఉంచొద్దని గ్రామస్తులకు సూచించారు. -
పోలీసు శిక్షణను పరిశీలించిన ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని జిల్లా పోలీ సు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో కానిస్టేబుళ్లకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ పరిశీలించా రు. కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారికి ఇటీవల శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం డీటీసీలో జరుగుతున్న తరగతులను పరిశీలించి, అభ్యర్థులతో మాట్లాడారు. ఇక్కడ అందుతున్న వసతులు, సదుపాయాలపై ఆరా తీ శారు. అలాగే బోధనా పద్ధతులు, ఉపయోగిస్తున్న పరికరాలు, సిలబస్పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇన్స్పెక్టర్ అమరనాథరెడ్డి ఉన్నారు. ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వర ఆలయంలో హుండీల ద్వారా రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో రూ.1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే భక్తులు 25.300 గ్రాముల బంగారం, 352.17 కిలోల వెండి కానుకలుగా సమర్పించారన్నారు. విదేశీ కరెన్సీ అమెరికా 31 డాలర్లు, మలేషియా 13, సింగపూర్ 3, యూఏఈ 2, దిర్హమ్లు. ఇంగ్లాండ్ 2, కెనడా 2 డాలర్లు వచ్చినట్లు తెలిపారు. -
ఆడబిడ్డని చెరువులో పడేశారా?
బంగారుపాళెం : ఆడబిడ్డ భారమని పుట్టిన వెంటనే చెరువులో పడేశారా.. భారం తగ్గించుకుందా మనుకున్నారా..లేక ఇతర కారణాలతో పుట్టిన బిడ్డను వదిలించుకుందామనుకున్నారో.. భూమి మీద పడి కళ్లు తెరవక ముందే, ఆడ శిశువుకు నూరేళ్ల నిండిపోయాయి. నవమాసాలు మోసి కన్నపేగు తెంచకుండానే పుట్టిన బిడ్డను చెరువులో పడేశారు. ఈ సంఘటన మండలంలోని తుంబకుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బిక్కిరెడ్డి చెరువులో శిశువు మృతదేహం తేలాడుతుండగా బుధవారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆడ శిశువుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డను చెరువులో పడేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన శిశువు గురించి గ్రామంలో విచారణ చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేక ఇతరులు ఎవరైనా బిడ్డను పడేసి వెళ్లారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు. -
డీకే చుట్టూ చర్చ!
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు డీకే.ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ పిల్లలైన డీఏ.శ్రీనివాస్, డీఏ.కల్పజ అరెస్టు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆదికేశవులునాయుడుకు సన్నిహితుడైన రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో శ్రీనివాస్, అతని అక్క కల్పజను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రటకన విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన రియలర్ట్ కె.రఘునాథ్ 2019 మేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే తన భర్త మృతికి కారణం శ్రీనివాస్ తదితరులేనంటూ మృతుడి భార్య మంజుల పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు వీలునామా సృష్టించి, తన భర్త చనిపోయేముందు ఆస్తులను బదిలీ చేయాలని బలవంతం చేశారని.. మంజుల ఫిర్యాదు చేశారు. తొలుత బెంగళూరు పోలీసులు, ఆపై సిట్ కేసు నమోదు చేసి శ్రీనివాస్ తదితరులకు క్లీన్చిట్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మంజుల, ఆమె కుమారుడు రోహిత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు 2022లో కేసును సీబీఐకి అప్పగించారు. కేసు విచారణను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా కల్పజ, శ్రీనివాస్ను సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. ఆదికేశవులు నాయుడు, ఆయన భార్య సత్యప్రభ చిత్తూరుకు చెందిన వాళ్లు కావడం.. ఇక్కడే రాజకీయ పదవులు అనుభవించడంతో ఈ వార్త నగరంలో దావానంలా వ్యాపించింది. శ్రీనివాస్, కల్పజను అరెస్టు చేశారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక నిందితులు ఇద్దరితో పాటు బెంగళూరు డీఎస్పీ మోహన్ను సైతం అరెస్టు చేసి బెంగళూరు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండు విధించింది. నిందితులు ముగ్గురినీ ఏడు రోజుల పాటు సీబీఐ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతవారం ఆదికేశులు నాయుడు సోదరుడు బద్రీనారాయణ మృతి చెందగా, అంత్యక్రియలకు.. పెద్దకర్మకు శ్రీనివాస్, కల్పజ తదితరులు చిత్తూరులో కనిపించారు. తాజాగా వీళ్ల అరెస్టు రాజకీయన వర్గాల్లో టాక్ ఆఫ్ టౌన్గా మారింది. -
వినూత్నం.. తక్షణ పరిష్కారం!
చిత్తూరు కార్పొరేషన్: సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ ఈ కార్యక్రమానికి నాంది పలికారు. మంగళవారం జిల్లాలో కార్యక్రమం ప్రారంభమైంది. ఇక వారంలో రెండు రోజులు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది సంబంధిత సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించి యాప్లో నమోదు చేయనున్నారు. విన్నూత కార్యక్రమం ఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ ఐఏఎస్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సంస్కరణల్లో భాగంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమాని ప్రారంభించారు. తొలుత యాప్ను తిరుపతిలో విద్యుత్శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీదుగా ఆరంభించారు. అనంతరం డిస్కం(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) కలెక్టర్ కర పత్రాలను విడుదల చేశారు. మంగళవారం నుంచి అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లారు. సమస్యలు యాప్లో నమోదు ● ప్రతి మండలానికి చెందిన సెక్షన్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. ● ఆయా ప్రాంతాల్లోని 11 కేవీ సహా ఎల్టీ లైన్ల వెంట యంత్రాంగం తనిఖీ చేస్తుంది. ● పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు లేదా వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, కూలిపోయేలా ఉండడం, తీగలు వేలాడడం, పాతవి కావడం, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు పగిలిపోవడం, రక్షణ కంచె లేకపోవడం, చేతికందేలా తీగలు ఉండడం వంటి వాటిని పరిశీలిస్తారు. ● ఫొటో తీసి కంపెనీ యాప్లో నమోదు చేస్తారు. ఆలస్యమయ్యే పనులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ● వారంలో మంగళ, శుక్రవారాల్లో ఏఈతో సహా సిబ్బంది సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ● పనితీరు పరిశీలించడానికి జిల్లా స్థాయిలో జీఎం కృష్ణారెడ్డిని నోడల్ అధికారిగా నియమించారు. -
పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
బంగారుపాళెం: పది పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మంగళవారం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. పదో తరగతి విద్యార్థులు సోషయల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలోని వంటగది, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయల గురించి హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై చర్చించారు. భోదనాంశాలపై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. ఎంఈఓలు నాగేశ్వర్రావు, రమేష్బాబు పాల్గొన్నారు. అప్పలాయగుంటలో పీవీ సింధు వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామిని మంగళవారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారి వేణుగోపాల్ దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రోగులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం చిత్తూరు కలెక్టరేట్ : రోగులకు నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యమని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సీఎంసీ చిత్తూరు క్యాంపస్తో పీపీపీ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. సీఎంసీ చిత్తూరు క్యాంపస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లా కేంద్రంలోని మిట్టూరు ప్రభుత్వ పాత ప్రసూతి ఆసుపత్రిలో సీఎంసీ వైద్యులను నియమించి వైద్య చికిత్సలు అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మొబైల్ మెడికల్ యూనిట్లతో వైద్యసేవలందించనున్నట్లు తెలిపారు. సీఎంసీ డైరెక్టర్ డా.విక్రమ్ మ్యాథ్యూస్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్యసేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం పీపీపీ విధానంలో ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. డీఎంహెచ్ఓ డా.సుధారాణి, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్, చిత్తూరు సీఎంసీ క్యాంపస్ అసోసియేట్ డైరెక్టర్ డా.ఉదయ్జకారియా పాల్గొన్నారు. సోలార్ ఈ–సైకిల్ పుత్తూరు పట్టణ పరిధిలోని రాచపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేష్ సోలార్ ఈ–సైకిల్ను రూపొందించాడు. కష్టపడే స్వభావం, సృజనాత్మక ఆలోచనలతోనే ఇలాంటివి సాధ్యమని పలువురు అభినందనలు తెలిపారు. వెంకటేష్ మరెన్నో విజయాలు సాధించాలని హెచ్ఎం మంగపతి ఆకాంక్షించారు. – పుత్తూరు -
కూటమిలో కులచిచ్చు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమిలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేనలో ఒకే సామాజిక వర్గం వారికే గుర్తింపు, పదవులు ఇస్తున్నారని, మి గిలిన బడుగు, బలహీన వర్గ నేతలను కరివేపాకులా వాడుకుంటున్నారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వా రు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో రెడ్డి సామాజిక వర్గం నేతలంటేనే చాలా చులకనగా చూస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ సామాజిక వర్గం నేతలు ముఖ్యులు.. అదే సామాజిక వర్గంలోని వారికి పదవులు రాకుండా.. అడ్డుకుంటు న్నారంటూ మండిపడుతున్నారు. ఆ రెండు పార్టీల్లో తాము తప్ప మరొకరు ఎదగడానికి వీల్లేకుండా కుట్ర లు చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానానికి లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తాజా పరిణామాలే నిదర్శనం. టీడీపీ అధిష్టానం తిరుపతి, చి త్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించిన వి షయం తెలిసిందే. ఈ పదవులు కట్టబెట్టడంలోనూ కొంత మంది ప్రమేయంతో అధినాయకులు తమకు ఇవ్వకుండా..తమ సామాజిక వర్గం నేతలే అడ్డుకున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు కమ్మసామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సీఆర్ రా జన్ బీసీ కావడంతో అతన్ని కొనసాగించలేదని విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఎంతటి వారినైనా సీ ఆర్ రాజన్ గట్టిగా మాట్లాడడం, ప్రశ్నించడం వంటి చేస్తున్నారనే కారణంతోనే అతన్ని కొనసాగించలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అ ుుతే సీఆర్ రాజన్ని తొలగించి వేరొకరికి ఇస్తే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, షణ్ముగరెడ్డి అయితే నోరెత్తడనే ఉద్దేశంతోనే అతనికి అధ్యక్ష పదవిని ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ రాజు కుటుంబానికి మొండిచేయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో తిరు పతి నుంచి జెండా పట్టిన నాయకుడిగా ఎన్టీఆర్ రాజుకు పేరుంది. నాటి నుంచి నేటి వరకు నందమూరి, నారావారి కుటుంబాన్నే నమ్ముకుని టీడీపీ జెండా మోస్తూనే ఉన్నారు. ఈసారైనా ఆ కుటుంబంలోని శ్రీధర్వర్మకు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఆశించారు. అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీలోని బలమైన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జనసేనలో మాకు స్థానం లేదా? జనసేనలో పవన్ కళ్యాణ్పై అభిమానంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమకు గుర్తింపు ఇవ్వకుండా.. పదవులకు దూరంగా ఉంచుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో ఒకే సామాజిక వర్గం వారు మాత్రమే పెత్తనం చెలాయించాలని, వేరొకరు పార్టీలో కీలకంగా మారడానికి వీల్లేకుండా పథకం ప్రకారం దూరం పెడుతున్నారనే ప్రచా రం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఎంఆర్పల్లి పరిధిలో ఓ నాయకుడి నివాసంలో జరిగిన పుట్టిన రోజు విందు వేడుకల్లో జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనసేనలో తమకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి) పదవులు లేవు, గుర్తింపు లేకుండా చేస్తున్నారని మండిపడినట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. జనసేనలో ప్రధాన సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గం నేతల మధ్య రచ్చ జరగడంతో ఇద్దరు నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పి పంపివేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేనలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరడంతో కొందరు ఈ సమాచారాన్ని అమరావతికి చేరివేసినట్లు బోగట్టా. -
జిల్లా సమాచారం
పెట్రోల్ బంకులు 140 బోర్డర్లోని కర్ణాటక పెట్రోల్ బంకులు 40 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చమురు ధరలు చమురు లీటరు ధర రూ. పెట్రోల్ 110.27 డీజిల్ రూ.99కర్ణాటకలో చమురు ధరలు చమురు లీటరు ధర రూ. పెట్రోల్ 102.78 డీజిల్ 90.87 -
అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామన్న పెద్ద బాబు, చిన బాబు ● గుడుపల్లె సభలో చంద్రబాబు హామీ ● యువగళంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలతో నారా లోకేష్ హల్చల్ ● అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా అమలుకాని హామీ ● రెండు జిల్లాల్లో రోజుకు రూ.5.4 కోట్ల
పలమనేరు: ‘పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పెట్రో ల్, డీజిల్ ధరలు తక్కువ. ఇక్కడ జగన్మోహన్రెడ్డి పెట్రోల్ ధర లు పెంచేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకుల వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ హంగా మా సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయారు. పె ట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. దీనికారణంగా జిల్లా లో రోజుకు వాహనదారుల పై రూ.5.4 కోట్లకుపైనే అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.167.4కోట్లు, ఏడాదికి రూ.2,008.8 కోట్లుదా కా ప్రజలు అదనంగా చెల్లించా ల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.4,017.6 కోట్లు దాకా ప్రజలపై భారం పడింది. పెట్రో ధర తగ్గిస్తామని బాబు కర్రుకాల్చి వాత పెట్టారని పలువురు వాపోతున్నారు. ఆంధ్రలో వెలవెల..కర్ణాటకలో కళకళ చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి ఆనుకొని గండ్రాజుపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. మండల కేంద్రమైన వీకోట టౌన్కు ఆనుకొనే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కొనసాగుతోంది. అలాగే తిరుపతి జిల్లాలో ఇటు నగరి, పిచ్చాటూరు, సత్యవేడు నుంచి తమిళనాడు సరిహద్దు వెళ్తుంది. అటు నాయుడుపేట నుంచి తమినాడు బోర్డర్ ఉంది. ఆయా సరిహద్దుల్లోని ఆంధ్ర పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. అదే కర్ణాటక, తమినాడు పెట్రోల్ బంకులు కళకళలాడుతున్నాయి. కారణం.. ధరల్లో వ్యత్యాసాలు ఉండడమే. ఒక్క పలమనేరు నియోజకవర్గంలోనే దాదాపు 20 పెట్రోల్ బంకుల దాకా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మొగిలి ఘాట్లో లారీ బోల్తా
మొగిలి ఘాట్లో సోమవారం రాత్రి లారీ బోల్తా పడింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2023 జనవరి 30న యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ పలమనేరు సమీపాన కర్ణాటక పరిధిలో ఉన్న పంతాన్హల్లికి చేరుకున్నారు. అక్కడి పెట్రోలు బంకుకు చేరుకుని కర్ణాటక రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను మీడియాకు చూపారు. సెల్ఫీ తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం కంటే కర్ణాటకలో పెట్రోలు ధరలు తక్కువ ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటకలో ఉన్న ధరలే ఏపీలో కూడా ఉంటాయన్నారు. -
‘సూపర్’ మోసం బాబూ!
పులిచెర్ల (కల్లూరు): సూపర్–6 పేరుతో చంద్రబాబు ప్రజలను వంచించడం బాధాకరమని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాపోయారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సూపర్–6 పేరుతో పలు పథకాలను ప్రవేశపెట్టి తీరా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గిట్టు బాటు ధరలు లేక రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఎన్నికల తర్వాత మండలంలో పెద్దిడ్డి తొలిసారిగా పర్యటించడంతో కార్యకర్తలో జోష్ తెచ్చింది. -
కొండెక్కిన కోడిగుడ్డు!
పలమనేరు: ఉన్నట్టుండి కోడిగుడ్ల ధర పెరగడంతో సామాన్యులపై ధరాభారం తప్పడం లేదు. గత నెలలో గుడ్లు హోల్సేల్గా ఒకటి రూ.6 దాకా ఉండగా ఇప్పుడు రూ.7.3 పైసలకు చేరింది. రిటైల్లో రూ.8 దాటింది. జిల్లాలో ఫౌల్ట్రి ఉత్పత్తులు తగ్గడమేగాక బయటి రాష్ట్రాల నుంచి గుడ్ల సరఫరా భారీగా తగ్గుముఖం పట్టడం, ఇదే సమయంలో ఇక్కడి నుంచి బయటి దేశాలకు పెరిగిన ఎగుమతులతోనే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో భారీగా తగ్గిన ఉత్పత్తి జిల్లాకు మన ఉత్పత్తులతోపాటు తమిళనాడు నుంచి ఎక్కువగా గుడ్లు వచ్చేవి. అయితే ప్రస్తుతం జిల్లాలో సరాసరి గుడ్ల ఉత్పత్తి 50 నుంచి 60 శాతం దాకా తగ్గింది. దీనికి తోడు తమిళనాడు నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గాయి. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణకు తమిళనాడు నుంచి అధికంగా గుడ్లు వెళ్తున్నాయి. దీంతో జిల్లాకు అక్కడి వ్యాపారులు ఓ గుడ్డు రూ.6 ఖర్చవుతోందని, దీన్ని ఇక్కడికి తరలించేందుకు రవాణా చార్జీలతో కలిపి విక్రయిస్తుండడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో స్థానికంగానూ ఉత్పత్తులు లేక ఈ పరిస్థితి నెలకొందని ఫౌల్ట్రీ రైతులు అంటున్నారు. నాణ్యమై గుడ్లు అనుమానమే! పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీలకు నాణ్యమైన గుడ్లు అందడం గగనమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పేపర్ రేట్ మేరకు గుడ్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులిస్తుంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్లు చిన్నసైజు గుడ్లను దింపడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రజలు సైతం పోష్టికాహారం కోసం గడ్లు కొనడం ఎక్కువైంది. బేకరీల్లో ఎక్కువగా గుడ్ల వినియోగం ఉంటుంది. డిమాండ్కు సరిపడా సరుకు లేక ధరలు భారీగా పెరిగినట్టు సమాచారం. -
పాఠశాల స్థలం కబ్జా చేసిన జనసేన నేత
తిరుపతి కల్చరల్: ప్రాథమిక పాఠశాల స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జా చేసి దగా చేస్తున్న జనసేన నేత తులసీ ప్రసాద్పై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఐరాల మండపం, దివిటివారి పల్లెకు చెందిన మునికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా, ఐరాల మండలంలోని దివిటివారిపల్లెలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన కొంత స్థలంలో వాటర్ ప్లాంట్ పేరుతో 2017లో జనసేన నేత తులసీప్రసాద్ ఒక భవనం కట్టాడన్నారు. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పడంతో వారు పనులు అడ్డుకున్నట్టు తెలిపారు. ఆపై అతడు టీడీపీ కార్యర్త సహాయంతో భవనం నిర్మించాడన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో పాఠశాల స్థలంలో ఎలాంటి భవనానలు నిర్మాణం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అప్పటి గ్రామ సర్పంచ్ పాఠశాలకు స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వారిని కలిసి 2023 సెప్టంబర్ 17న భవనాన్ని కూల్చివేశారని తెలిపారు. దీంతో పగ పెంచుకున్న తులసీ ప్రసాద్ కోర్టులో కేసు వేసి పాఠశాల స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా వచ్చిన నిధులు సైతం వినియోగించకుండా కబ్జాదారుడు అడ్డుకున్నాడన్నారు. అక్టోబర్లో అతడు తన మనుషులతో వచ్చి పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, అతని దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు కట్టలేదన్నారు. తహసీల్దార్కు చెప్పినా రాజకీయ ఒత్తిడితో స్పందించలేదని వాపోయారు. పాఠశాల ఆక్రమణపై జిల్లా ప్రభుత్వ అధికారులు స్పందించి తగు విచారణ చేసి పాఠశాల స్థల ఆక్రమణదాడిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
● జిల్లాలో విచ్చలవిడిగా అబార్షన్లు ● మార్కెట్లో జోరుగా కిట్ల విక్రయాలు ● పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
కాణిపాకం: జిల్లాలో 1,200 పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. 2 వేల వరకు ఆర్ఎంపీ, నకిలీ వైద్యులున్నారు. వీరిలో చాలామంది వైద్య చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఇష్టానుసారంగా నాడిపట్టి వైద్యం చేస్తున్నారు. స్కానింగ్లో ఆడ, మగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తున్నారు. దీనికి చిత్తూరు జిల్లా కేంద్రం అడ్డగా మారింది. అలాగే గంగాధరనెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు నుంచి అధికంగా వస్తున్నారు. నకిలీ తంత్రం గర్భిణులు మొదటి కాన్పులో ఆడబిడ్డ పుడితే.. రెండో బిడ్డ మగ బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది.. ఏ బిడ్డో తెలుసుకోవాలని చాలా మంది తహతహలాడిపోతుంటారు. ఇందుకు ఖర్చుకు వెనకాడకుండా అక్రమ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆడబిడ్డగా నిర్థారణ అయితే వెంటనే అబార్షన్కు సిద్ధపడిపోతున్నారు. ఈ అబార్షన్లను కొందరు ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులు అవకాశంగా మార్చుకుంటున్నారు. రూ.20వేలు తీసుకుని అబార్షన్లు చేసి పంపుతున్నారు. పెళ్లి కాకుండానే గర్భవతులవుతున్న వారికి అబార్షన్లు చేయాలంటే రూ.30వేల వరకు ఫీజు గుంజుతున్నారు. ఈ అబార్షన్లకు క్షేత్ర స్థాయిలోని కొందరు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, ఆర్ఎంపీల వద్ద పనిచేసే కొందరి సహకారం పుష్కలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఆడిట్ ఎక్కడా? అబార్షన్లకు సంబంధించి ఏటా ఆడిట్ జరగాలనే నిబంధన ఉంది. అయితే ఆ రకంగా జిల్లాలో జరగడం లేదు. ఇటీవల జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు గుచ్చి గుచ్చి చెప్పారు. కానీ ఆ రకంగా అధికారుల్లో కదలికలు కనిపించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మందికి అబార్షన్ చేశారు.? ఎందుకు చేశారు? అనే విషయాలను ఆరా తీయాల్సి ఉంది. ఇక కొన్ని ఆస్పత్రుల్లో అబార్షన్లు చేసి వాటిని రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కానీ ఆ వివరాలు శుద్ధ అబద్ధమని వైద్యశాఖలోని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. ఎంటీపీకి కిట్స్ ఎక్కడివి? స్పందించని అధికారులు జిల్లాలో ఇష్టానుసారంగా అబార్షన్లు జరుగుతున్న అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై తనిఖీ చేస్తున్న పీసీపీఎన్డీటీ అధికారుల కాళ్లను కట్టిపడేశారు. కుర్చీలకు అతుక్కుపోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో అబార్షన్ల అనకొండలు హద్దు మీరుతున్నాయి. విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తూ కడుపులోని పిండాన్ని చిదిమేస్తున్నాయి. ఇలానే వదిలేస్తే ఆడ పిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారో.. లేదో వేచి చూడాలి మరి.పెరుగుతున్న అబార్షన్ల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 2024–25లో 32,534 మంది గర్భిణులు నమోదయ్యారు. వీటిలో తొలి గర్భవతులు 12,129, రెండు..అంతకంటే ఎక్కువ గర్భవతులు 20,405గా గుర్తించారు. ఈ కాలంలో 1,691 మంది అబార్షన్ అయ్యారు. 2025–26 (ఏఫ్రిల్ నుంచి డిసెంబర్) 20,824 మంది గర్భిణులుగా లెక్కల్లోకి ఎక్కారు. మొదటి గర్భవతులు 8,007, రెండో సారి.. అంతకంటే ఎక్కువ గర్భవతులు 12,816 మందిగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 1,016 మంది అబార్షన్లు చేసుకున్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, జీడీనెల్లూరు నియోజవర్గాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు గుర్తించినవి మాత్రేమే. దొంగ చాటుగా జరుగుతున్న అబార్షన్లు లెక్కల్లోకి రావడం లేదని అధికారులు అంటున్నారు. అబార్షన్ కిట్లు(ఎంటీపీ) విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. మెడికల్ షాపులు, ఆర్ఎంపీ, నకిలీ వైద్యుల వద్ద కూడా ఈ కిట్లు తేలికగా దొరికుతున్నాయి. వీరికి పలు మెడికల్ ఏజెన్సీల ద్వారా సరఫరా అవుతున్నట్టు ఆ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. గైనిక్ డాక్టర్ చీటీ లేకుండా ఎంటీపీ కిట్లను మెడికల్ షాపు నిర్వాహకులు విక్రయించకూడదు. కానీ కిట్లు విచ్చలవిడిగా లభ్యం కావడంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు జరిగిపోతున్నాయి. కిట్ల అమ్మకంపై నిఘా పెట్టాల్సిన జిల్లా జౌషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
రాష్ట్ర స్థాయి విజేతలకు అభినందనలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవల విశాఖపట్టణం జిల్లాలోని కేడీపేటలో నిర్వహించిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి సాప్ట్బాల్ పోటీల్లో గెలుపొందిన పీసీఆర్ పాఠశాల విద్యార్థులను డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. సబ్ జూనియర్ సాప్ట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో చదువుతున్న అక్షిత రజిత పతకం సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికై వచ్చే నెల 9 నుంచి హర్యానాలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. హెచ్ఎం పూర్వాణి, శాంతిపురం ఎంఈఓ సెల్వపాండ్యన్, పీడీ దేవా పాల్గొన్నారు. తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 60,764 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,077 మంది భక్తులు తల నీలాలు అర్పించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. -
మొగిలి ఘాట్లో లారీ బోల్తా
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద సోమవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు కాగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోలారు నుంచి చైన్నెకి అల్యూమినియం రాడ్లను తరలిస్తున్న లారీ మొగిలి ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన రైలింగ్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాలికి గాయమైంది. రహదారిపై లారీ బోల్తాపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రహదారిపై బోల్తాపడిన లారీని క్రేన్ సహాయంలో రోడ్డు పక్కకు తొగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
2025–26గర్భిణుల నమోదు, అబార్షన్ల వివరాలు
నియోజకవర్గం గర్భవతుల తొలి రెండు, అంతకంటే అబార్షన్లు సంఖ్య గర్భవతులు ఎక్కువ గర్భవతులు చిత్తూరు 2,708 1,076 1,632 51 జీడీనెల్లూరు 3,450 111 2,269 197 కుప్పం 3,306 1,132 2,174 110 నగరి 1,717 706 1,012 73 పలమనేరు 3,716 1,515 2,201 152 పుంగనూరు 3,118 1,246 1,872 195 పూతలపట్టు 2,809 1,151 1,656 238 -
‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్టు మారింది చినబాబు, పెద బాబు హామీల తీరు. రెండేళ్ల క్రితం కర్ణాటక సరిహద్దులో హల్చల్ చేశారు. కర్ణాటకలో పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో క
●పలమనేరులో వ్యాపారం లేక వెలవెలబోతున్న పెట్రోల్ బంకు 6లీటరుకు రూ.8 ఆదా మన రాష్ట్రం కంటే తమిళనాడులో పెట్రోల్ ధర లీటర్కు 8 తక్కువ. మా ప్రాంతం రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడికి వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. నగరి నుంచి 14 కి.మీ వెళితే తమిళనాడుకు చెందిన పెట్రోల్ బంక్ ఉంది. అక్కడకు వెళ్తుంటాం. ఫుల్ ట్యాంక్కు రూ.120 దాకా ఆదా అవుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. కానీ ఇంతవరకు తగ్గించలేదు. – ప్రకాష్, ముడి పల్లి గ్రామం నగరి మండలంఅక్కడే పట్టుకుంటాం మా గ్రామం నుంచి 11 కి.మీ వెళితే నంగళిలో డీజిల్ లీటర్ రూ.90గా ఉంది. మా ట్రాక్టర్కు కర్ణాటకలో ఫుల్ట్యాంకు పట్టించుకొని వస్తుంటాం. డీజిల్ రేట్లు తగ్గిస్తామని మొన్నటి ఎన్నికలకు ముందు కూటమి నాయకులు స్టేట్మెంట్లు కుమ్మరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ధర మాత్రం తగ్గించలేదు. ఇంకా ఎంతదాకా పోతోందో వీటి ధరలు. – రామాంజులు, చిన్నమనాయినిపల్లి, గంగవరం మండలం -
లోపాలకు తావులేకుండా నిత్య కై ంకర్యాలు
● సమీక్షలో దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిన దేవస్థానంలో స్వామి వారికి నిర్వహించే నిత్య కై ంకర్యాలు ఎలాంటి లోపాలకు తావివ్వకుండా భక్తిప్రపత్తులతో నిర్వహించాలని రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్లాల్ ఆదేశించారు. మంగళవారం కాణిపాకానికి వచ్చిన ఆయన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆన్లైన్ సేవలు, ఈ–ఆఫీస్, ఈ–ఫైలింగ్, అర్చకుల ప్రమోషన్లు, ఆలయంలో స్వామి వారికి చేసే పూజార్చనలు, సేవలు..ఇత్యాది వాటిపై సమీక్షిస్తూ ప్రధాన అర్చకులకు ఆయన పైవిధంగా సూచించారు. క్యూలలో వెళ్లే భక్తులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, గణేశా అని సంబోధించాలని సూచించారు. తర్వాత ఆన్లైన్ టికెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి సౌకర్యాలను తెలుసుకున్నారు. తొలుత వరసిద్ధి వినాయకస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈఓ పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు ఆయన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సాగర్బాబు, ఈఈ వెంకట నారాయణ, ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు శివప్రసాద్, ఏఈఓ లు రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, ధనంజయ, సూపరింటెండెంట్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో రైతు మృతి వి.కోట: విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. మండలంలోని యాలకల్లు పంచాయతీ వైసీ బండపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్యగౌడు కుమారుడు రామయ్యగౌడు (67) వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లాడు. తమ పొలానికి సరఫరా అయ్యే విద్యుత్ వైర్లు రెండూ తెగి చెట్లుపై పడి ఉండడాన్ని గమనించాడు. ఆపై విద్యుత్ సరఫరా లేని సమయంలో వైర్లను సరిచేయడానికి ప్రయత్నించాడు. అతను సరి చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా రావడంతో రామయ్య షాక్కు గురై చెట్టు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని వి.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండుప్రాణాన్ని బలిగొందని రైతులు మండిపడ్డారు. హేత్వికకు ఎలైట్ వరల్డ్ రికార్డులో చోటు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరానికి చెందిన ఒకటవ తరగతి విద్యార్థిని హేత్విక ఎలైట్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ రెడ్డిశేఖర్రెడ్డి మనువరాలు హేత్విక ఇటీవల తమిళనాడు రాష్ట్రం వేలూరులో నిర్వహించిన ఎలైట్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో స్పెల్ మారథాన్ అంశంలో పాల్గొంది. ఆ విద్యార్థిని ఈ పోటీల్లో 4 నిమిషాల్లో 50 పదాలను అక్షరదోషాలు లేకుండా మౌఖికంగా చెప్పినందుకు ఈ వరల్డ్ రికార్డు లభించింది. ఇదే విద్యార్థిని నృత్య పదర్శనలోనూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరో రికార్డును సాధించడం విశేషం. రెండు వరల్డ్ రికార్డులు సాధించిన చిన్నారి హేత్వికను పలువురు అభినందిస్తున్నారు. -
ధనుర్మాసం.. పుణ్యమార్గం
దళితుడని..శవాన్ని పోనిచ్చేది లేదని! దళితుడి శవాన్ని శ్మశానానికి వెళ్లనిచ్చేది లేదంటూ ఓ అగ్రకులస్తుడు అడ్డుకున్న ఘటన గంగవరంలో చోటు చేసుకుంది. మాసానాం మార్గశిర్షోహం..మార్గశిరం తనకు ఇష్టమైనదని శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు. శ్రీమహావిష్ణువుకు ఈ మాసమంటే అంత్యంత ప్రీతి. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన నాటి నుంచి మకరరాశిలో ప్రవేశించే వరకు ఉన్న నెలరోజుల కాలమే ధనుర్మాసంగా పిలుస్తారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమై ఆయన్ని చేరుకోవడానికి మార్గం చూపించేదే ఈ మాసం. ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కథనం. తిరుమల: సూర్యడు ధనస్సురాశిలో ప్రవేశించే మహత్తర ఘట్టమే ధనుర్మాసం. ఈ హేమంత సమయాన అందరిలోనూ భక్తిభావం తొణికిసలాడుతుంది. ఈ నెలంతా వైష్ణవాలయాల్లో భక్తులు భక్తిభావంతో పూజలు చేస్తారు. అందుకే ఈ మాసం విశిష్టమైది. శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించేది ధనుర్మాసం. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1.23 గంటలకు ఈ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయణాన్ని నివేదిస్తున్నారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై సేవ కొనసాగనుంది. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కై ంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఆండాళ్ తిరుప్పావై పారాయణం ప్రాశస్త్యం భగవంతుని సాన్నిథ్యం పొందాలని ఆకాంక్షించే సాధకులకు గోదాదేవి అనుభవ పూర్వకంగా రచించిన తిరుప్పావై లోకానికే దివ్య సందేశం. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఏకాంతంగా తోమాల, అర్చన, అర్జిత సేవలు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా జనవరి 14వ తేదీ వరకు తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించరు. ఈ సేవలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు డిసెంబర్ 29 నుంచి జనవరి 1వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులను అనుమతించరు. -
స్కానింగ్!
కన్నింగ్.. కాణిపాకం: జిల్లాలో పలు చోట్ల అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. చిత్తూరు, యాదమరి, నగరి, కుప్పం వంటి ప్రాంతాల్లో ఇలాంటి స్కానింగ్ సెంటర్లు కుప్పలుతెప్పలుగా కొనసాగిస్తున్నారు. ఆయా స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ, మగ అని తేల్చేస్తున్నారు. ఆపై అబార్షన్లకు రెఫర్లు చేసి కమీషన్లు గుంజుకుంటున్నారు. వీరిని టచ్ చేసే ధైర్యముందా? కలెక్టర్ మందలించినా! అక్రమ స్కానింగ్ కట్టడికి చర్యలు చేపట్టాలని పలుమార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ మందలించారు. డెకాయ్ ఆఫరేషన్ చేపట్టాలని, అందు కావాల్సిన ఖర్చులను కూడా భరిద్దామని సూచించారు. అయినా వైద్య శాఖ వెనకడగు వేస్తోంది. అక్రమ స్కానింగ్ సెంటర్ల రట్టు చేసే విషయంలో గుట్టుగా ఉంటోంది. డెమో విభాగం సైతం ముందడుగు వేయడం లేదు. తద్వారా అక్రమ స్కానింగ్ పుంజుకుంటోంది. తమిళనాడులో కేసులు అక్రమ స్కానింగ్, అబార్షన్లపై తమిళనాడు పోలీసులు స్పందిస్తున్నారు. అక్కడ కేసులు నమోదైతే వాటిని తక్షణమే అమలు చేసి అరెస్ట్లు, రిమాండ్కు పంపుతున్నారు. దీంతో తమిళనాడు వాసులు మకాం చిత్తూరు జిల్లాలో పెట్టారు. అక్కడి గర్భిణులను ఇక్కడకు తీసుకొచ్చి అబార్షన్లు చేయిస్తున్నారు. రెండో సంతానం ఆడ బిడ్డ ఉంటే వారిని టార్గెట్ చేస్తున్నారు. స్కానింగ్ చేయించి.. దగ్గరుండి అబార్షన్లు చేయించి పంపిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. అబార్షన్లకు రూ.10వేలు గుంజుగుంటున్నారు. తద్వారా జిల్లాలో ఆడ పిల్లల నిష్ఫత్తి పూర్తిగా పడిపోతోంది. ఆరు నెలల క్రితం చిత్తూరు నగరంలో స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి అక్రమ స్కానింగ్ గుట్టును రట్టుచేశారు. దీనికి సంబంధించి 20 మందిపైగా కేసులు నమోదు చేయించారు. అందులో పలువురు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కానీ ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకుని మిగిలిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కొంత మందిని వదిలి పెట్టిన కారణంగా వారు మకాం మార్చి చిత్తూరు కలెక్టరేట్కు సమీపంలో ఉన్న ప్రశాంత్నగర్లో గుట్టు స్కానింగ్ను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం వైద్యారోగ్య శాఖలోని పలువురు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరి కేంద్రంలోని ఓ సెంటర్లో అక్రమ స్కానింగ్ నడిపిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. తమిళనాడు సరిహద్దు కావడంతో.. నగరిలో అక్రమ స్కానింగ్ సెంటర్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి అధిక సంఖ్యలో గర్భిణులు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్రమ స్కానింగ్ చేస్తూ...అబార్షన్లు చేయిస్తున్న ఓ మహిళను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదమరి మండల కేంద్రంలో కూడా ఓ ఆర్ఎంపీ డాక్టర్ అక్రమ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అబార్షన్లు చేయిస్తూ.. వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇందుకు కావాల్సిన మందులు, మాత్రలు స్థానికంగా లభ్యమవుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందింది. అదేవిధంగా కుప్పంలో కూడా అక్రమ స్కానింగ్ ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులే చెబుతున్నారు. వారిని టచ్ చేస్తే.. బెదిరింపులు వస్తాయని భయపడుతున్నారు. -
పేదల ఆశాజ్యోతి జగన్
శ్రీరంగరాజపురం: పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. సోమవారం ఆయన స్థానిక నాయకులను పరామర్శించి.. మీడియాతో మాట్లాడారు. జగనన్న జన్మదిన వేడుకలు గ్రామాలలో పండుగ వాతావరణంలో జరిగాయన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా జగనన్న అభిమానులు వైభవంగా నిర్వహించడం శుభ సూచకమన్నారు. 2029లో జగనన్న ముఖ్యమంత్రి చేయడమే ప్రజలందరి లక్ష్యమన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆరు మండలాల నాయకుల సహకారంతో జగనన్న జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 50 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 50 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదునూ ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ‘కరెంటోళ్ల జనబాట’కు శ్రీకారం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ప్రారంభించిన కార్యక్రమం అప్లికేషన్ను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కరెంటోళ్ల జనబాటను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి మంగళ, శుక్రవారాలు నిర్ధేశిత గ్రామాలు, వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారన్నారు. విద్యుత్శాఖ ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈ మునిచంద్ర, పీవో రెడ్డెప్ప పాల్గొన్నారు. రెండో రోజు 8,911మందికి చుక్కల మందు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సోమవారం కూడా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగింది. రెండో రోజు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 8,911 మంది పిల్లలకు చుక్కల మందు వేశారు. కాగా రెండు రోజులుగా 2,07,438 మందికి పోలీయో చుక్కలు వేసినట్టు డీఐఓ హనుమంతరావు తెలిపారు. జెడ్పీలో కారుణ్య నియమాకాలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ పరిధిలో 11 మందికి కారుణ్య నియమాకాలు చేపట్టారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు నియమాక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. వీటితోపాటు రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. బాధ్యతయుతంగా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. -
మార్పు మొదలైంది!
●చిత్తూరు అర్బన్: ఒక మనిషి ప్రాణం ఎంతో విలువైంది. అతనిపై ఆధారపడి ఓ కుటుంబం ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా జరిగితే జీవితంలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. కన్నతల్లిదండ్రులకు కర్భశోకం మిగులుతుంది. కట్టుకున్న భార్య, పిల్లలు వీధిన పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇలాంటి పరిస్థితికి పుల్స్టాప్ పెట్టేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. వాహనదారులకు హెల్మెట్ తప్పని సరి చేసింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తోంది. దశల వారీగా కఠినంగా అమలు చేసేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగానే నో హెల్మెట్.. నో పెట్రోల్..నినాదంతో ముందుకెళ్తోంది. తిరుపతి జిల్లాలో ఇప్పటికే హెల్మెట్ లేకుంటే ద్విచక్ర వాహనాలకు పెట్రోలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో సైతం పోలీసుశాఖ దీన్ని దశల వారీగా అమలు చేయడంతో పాటు వాహన చోదకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. మృత్యువాతపడుతున్నా.. ‘బాబు, కొంచెం ఆలోచించండి.. హెల్మెట్లు పెట్టుకోండి. నీతోపాటు నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా కాపాడినట్లవుతుంది. ఎందుకంటే నీ జీవితం నీ కుటుంబ సభ్యుల జీవనంపై ఆధారపడి ఉంది..’’ అంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు. దీన్ని కొందరు ఏమాత్రం తలకెక్కించుకోవడం లేదు. హెల్మెట్లు ధరించకుండా ద్విచక్రవాహనాలు నడపొద్దని పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో గత మూడేళ్లలో 257 మంది మృత్యువాతపడ్డారు. చనిపోయినవాళ్లల్లో 40 శాతం మంది యువత ఉండడం గమనార్హం. బాధ్యతగా ఫీల్ అవ్వండి ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్లు ధరించాల్సిందే. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్లు లేకుండా వాహనాలను లోపలకు అనుమతించడం లేదు. హెల్మెట్లు పెట్టుకుంటే ప్రమాదం జరిగినపుడు ప్రాణాలతో బయటపడొచ్చు. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా ఇదో బాధ్యతగా ఫీల్ అవ్వండి. పోలీసుల కోసం కాదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మా వాళ్లు అవగాహన కల్పిస్తున్నారు. వీలైనంత త్వరలోనే కలెక్టర్తో చర్చించి ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ అమలు చేస్తాం. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు అసలు ద్విచక్రవాహనాలు నడిపేవాళ్లు ఎంత మంది హెల్మెట్లు వాడుతున్నారు..? ఎంత మంది వాడడం లేదు..? అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రోన్లతో గుర్తిస్తున్నారు. జరిమానాలే లక్ష్యంగా కాకుండా ప్రజల్లో తొలుత చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలు రక్షించుకోవడానికి హెల్మెట్లు వాడాలనే స్వీయ ఆలోచనను తీసుకొస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకోని మైనర్లకు వాళ్ల తల్లిదండ్రుల ఎదుట కౌన్సెలింగ్, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు పెట్టుకోకుండా మృతి చెందిన వాళ్లతో మాట్లాడించడం చేస్తున్నారు. తుదిగా కలెక్టర్తో చర్చించి త్వరలోనే హెల్మెట్ లేకుంటే పెట్రోలు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోనున్నారు. -
క్రిస్మస్ వేడుకల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుడిపాల: ముందస్తుగా జరుపుకున్న క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గుడిపాల మండలం, అరుల్పురం గ్రామంలో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తమిళనాడు అధ్యక్షుడు జాషువా అధ్యక్షతన పాస్టర్లు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలందరికీ దుస్తులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే పేదలందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. మాటచెప్తే మడపతిప్పని నాయకుడు జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు..? మీరే గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఏది దొరికితే అవి దోచుకొనే పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. రాబోయే కాలంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ సూపర్సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాలన్నారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ప్రెసిడెంట్ జాన్మార్క్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ రమేష్ప్రసాద్, బిషప్ ధనరాజ్, కార్పొరేటర్ మధురెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం రాజేంద్ర తెలిపారు. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలు నిర్వహించారన్నారు. జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన పాఠశాలకు చెందిన దీప్తి, ఉమేరా, జయశ్రీ, కావ్య కీలక పాత్ర పోషించి జిల్లా జట్టు గెలుపునకు కృషి చేసినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభచాటి జాతీయ ఖోఖో పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బాలికలు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా బాలికలను, క్రీడాకారులకు తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ మధుబాబును ఉపాధ్యాయులు అభినందించారు. ఇన్చార్జి హెచ్ఎం జనార్దన్రెడ్డి, పీడీలు గిరిజ, సరస్వతి పాల్గొన్నారు. ఖోఖో పోటీలకు ఎంపిక వి.కోట : జూనియర్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని పాముగానిపల్లీ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని జి.లక్ష్మి ఎంపికై నట్లు హెచ్ఎం భాస్కర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లా పొంగూరులోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో లక్ష్మి ఉత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న్నట్లు వివరించారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె రాష్ట్ర ఖోఖో జట్టు తరఫున పాల్గొంటుదన్నారు. పాఠశాల యాజమాన్యం శిక్షణ ఇచ్చిన పీడీ హరిప్రసాద్ను, విద్యార్థిని అభినందించింది. -
కొత్తగా సన్నద్ధం!
కార్వేటినగరం: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ఆరు పేపర్ల స్థానంలో ఐదు పేపర్లు మాత్రమే అమలు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు నూతన విధానంలోనే సన్నద్ధమవుతున్నారు. గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మారిన మార్కుల కేటాయింపునకు అనుగుణంగా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం ఇంటర్ కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి నూతన సంస్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్ విద్యలో ఇంటర్ విద్యామండలి ఈ ఏడాది నుంచి ఫస్టియర్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గణితం, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రాల సరళి కూడా మారింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఇంటర్ బోర్డు అధికారులు నూతన పరీక్ష విధానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీసీలో ఇలా.. ఎంపీసీ గ్రూపునకు సంబంధించి మొత్తం 500 మార్కులకు గాను ఇందులో రాత పరీక్షకు 470 మార్కులు, ప్రయోగాలకు 30 మార్కులు (ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15) కేటాయించారు. ఇప్పటి వరకు మ్యాథ్స్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించేవారు (పేపర్–1ఏకు 75, పేపర్–1బీకి 75 మార్కుల చొప్పున మొత్తం 150 మమార్కులు). ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. పాస్ మార్కులను 35గా నిర్ణయించారు. గతంలో ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60 మార్కులకు ఉండేది. ఆ స్థానంలో ఈ రెండు సబ్జెక్టులను ఒక్కో పేపర్కు 85 మార్కులు ఉండేలా మార్పులు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటాయి. బైపీసీలో ఇలా.. బైపీసీలో కొత్తగా బయాలజీ పేపర్ బైపీసీ గ్రూపులో మొత్తం 500 మార్కులు ఉంటాయి. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్కు 45 మార్కులు (ఫిజిక్స్15, కెమిస్ట్రీ15, బయాలజీ15) కేటాయించారు. గతంలో బోటనీ 60, జువాలజీ 60 మార్కులకు ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం(బయాలజీ) ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్ధేంశించారు. అయితే మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు రెండు సబ్జెక్టులను సమన్వయం చేసుకుంటూ చదువుతున్నారు. పాస్ మార్కులు 29గా నిర్ణయించారు. జిల్లాలో ఇంటర్ కళాశాలల వివరాలు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు స్పష్టత వచ్చింది మొదట్లో పేపర్లు తగ్గాయని, మార్కులు పెరిగాయని తెలిసినప్పుడు కాస్త కంగారు పడ్డాం. కానీ మా లెక్చరర్లు కొత్త విధానంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. 100 మార్కుల మ్యాథ్స్ పేపర్, 85 మార్కుల ఫిజిక్స్ పేపర్ రాయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మా కళాశాలలో కూడా నూతన విధానానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. – నందిని, ఇంటర్ సెకండియర్ విద్యార్థి, బైపీసీ, కార్వేటినగరంఅవగాహన కల్పిస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన సంస్కరణలపై విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించాం. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 5 పేపర్లు ఉంటాయి. సిలబస్ను కూడా హేతుబద్ధీకరించారు. ఇది జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వ కళాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వీలుగా ఉంటుంది. – రఘుపతి, ఇంటర్ బోర్డు జిల్లా అధికారి -
పోలీసు ఉద్యోగం ఉపాధి కాదు.. బాధ్యత
చిత్తూరు అర్బన్: పోలీసు ఉద్యోగమంటే ఉపాధి మాత్రమే కాదని.. ప్రజల పట్ల బాధ్యతగా ఉంటూ సేవా భావంతో పనిచేయడమని చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ అన్నారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులు క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. నాగులు నెలల క్రితం వెలువడ్డ పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన 139 మంది అభ్యర్థులకు సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ ప్రారంభమైంది. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ.. సమయపాలన, నిబద్ధతతో పనిచేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ బ్యాచ్గా చిత్తూరు అభ్యర్థులు పేరు తెచ్చుకోవాలన్నారు. ఏఎస్పీ రాజశేఖర్రాజు, డీఎస్పీలు సాయినాథ్, రాంబాబు, చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, ఇన్స్పెక్టర్లు అమర్నాథ్రెడ్డి, చంద్రశేఖర్, వీరేష్ పాల్గొన్నారు. కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు రేపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 24న నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మమతారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సదుం పోలీస్ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలకు వయోపరిమితి లేదని, 85 కేజీల బరువు లోపు ఉండాలని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డుతో రావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28 వరకు కర్నూలు జిల్లా పంచలింగాలలో జరిగే 72వ రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9490005167, 8555046157 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. -
దళితుడని.. శవాన్ని పోనిచ్చేది లేదని!
గంగవరం: దళిత కులస్తుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు పోనీయకుండా టీడీపీకి చెందిన అగ్రకులస్తుడు అడ్డగించిన ఘటన మండలంలో సోమవారం వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని పసుపత్తూరు పంచాయతీ, వీరశెట్టిపల్లి గ్రామంలో దళిత కులానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యతో మృతి చెందాడు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం కుటుంబీకులు, బంధువులు కలిసి గ్రామ సమీపంలోని శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా పసుపత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ అగ్ర కులస్తులు శ్రీనివాసులు, అతని కొడుకు సుబ్బు ఇద్దురూ కలిసి అడ్డుకున్నారు. తమ పశువుల షెడ్డు ఆనుకుని ఉన్న దారిలో పోనివ్వడం కుదరదని బెదిరించారు. తాతల కాలం నుంచి ఈ దారిలోనే శ్మశానానికి, గంగమ్మ ఆలయానికి వెళ్తున్నామని, ఇప్పుడు ఎందుకు వెళ్లనివ్వరో చెప్పాలంటూ దళితులు ప్రశ్నించారు. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దారి తమ అధీనంలో ఉందని, శవాన్ని పోనిచ్చే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్నారు. ప్రశ్నించిన దళితులపై పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గణేష్ అనే వ్యక్తితో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బాధితుల ఫిర్యాదును స్వీకరించకపోగా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసినట్టు వాపోయారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే అధికార పార్టీ నేతలు శవ రాజకీయాలు చేసి తమకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. దీనిపై జిల్లా అధికారులను ఆశ్రయిస్తామని వారు తెలిపారు. -
పారిశుద్ధ్యం మెరుగుపడాలి
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఎంపీ నిధులతో జీడీ నెల్లూరు మండలానికి 63 లక్షల విలువలతో 20 ఈ ఆటోలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాలకు కూడా ఈ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, మేయర్ అముద, చూడా చైర్పర్సన్ హేమలత, డీపీఓ సుధాకర్ పాల్గొన్నారు. ● ముస్తాబు కార్యక్రమాన్ని సంక్షేమ వసతిగృహాల్లో అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. ● పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంపై ఆడిట్ జరపాలని ఆదేశించారు. పీఎంవో, సీఎం, మంత్రుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ!
చిత్తూరు కలెక్టరేట్ : ‘సారూ...మీరే మాకు న్యాయం చేయాలి’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు క్యూ కట్టారు. ఎన్ని సార్లు తిరుగుతున్నా క్షేత్ర స్థాయిలో న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో వివిధ సమస్యలపై 353 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
జగమంత సంబరం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బెంగళూరులో వైఎస్ జగన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డినేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. విద్యార్థులకు పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాండ్ కాంపిటీషన్స్ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేర కు జారీ చేసిన ఉత్తర్వులు ఆదివారం డీఈఓ కార్యాలయానికి అందాయి. ఆ ఉత్తర్వుల మేరకు 1875లో బకించంద్ర చటర్జీ స్వరపరిచిన జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. జిల్లా స్థాయిలో గెలుపొందే విద్యార్థులు జోన ల్, రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో సూచించారు. పోలియో లేని సమాజానికి సహకరించాలి చిత్తూరు అర్బన్ : పోలియో వ్యాధి లేని సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పిల్లలకు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడుతో కలిసి పల్స్పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పాల్గొన్నారు. ముగిసిన రెవెన్యూ క్రీడలు చిత్తూరు కలెక్టరేట్ : రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆదివారంతో ముగిశాయి. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లు, కలెక్టరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు క్రీడా పోటీ ల్లో పాల్గొన్నారు. నిరంతరం విధుల నిర్వహణలో తల మునకలై ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పర్యవేక్షించారు. క్రికెట్, షాట్ పుట్, జావిలిన్ త్రో, టెన్నిస్, చెస్, క్యారమ్స్, పరుగు పందెం క్రీడా పోటీలను నిర్వహించారు. మూడు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. పోటీల్లో గెలుపొందిన రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రం లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీవోలు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. అన్న ప్రసాదానికి రూ.10 లక్షల విరాళం వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ చైతన్య ఆరె అనే భక్తుడు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఆలయ అధికారి ఎ.వేణుగోపాల్కు రూ.10 లక్షల డీడీని అందజేశారు. దాతకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సాగిన సంబరాలు అంబరాన్నంటాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా అంతటా ఊరువాడా, చిన్నా, పెద్ద తేడా లేకుండా జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు రక్తదానం, అన్నదానం శిబిరాలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జయహో జగనన్న అంటూ అభిమానులు హోరెత్తించారు. చిత్తూరు కార్పొరేషన్ : అధికారంలో ఉన్నా..లేకున్నా అభిమానులు, కార్యకర్తల్లో అదే జోరు.. అదే హోరు కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. జయహో జగన్.. వన్స్మోర్ జగనన్నా అంటూ అభిమానులు నినదించారు. జగనన్న మళ్లీ నీ పాలన రావాలన్నా అంటూ హోరెత్తించారు. ● చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మంది పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లెలో జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి హాజరై కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. కూటమి పాలనకు భవిష్యత్తు లేదని అధికార మదంతో రెచ్చిపోతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారనే నమ్మకం ఉందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కో ఆప్షన్ సభ్యులు అను ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గిరింపేట డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్కట్ చేసి అన్నదానం చేశారు. గుడిపాల మండలం నందు నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ● పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ కేక్కట్ చేసి అన్నదానం చేశారు. అలాగే వి.కోటలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో కలసి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారదర్శకమైన పాలనను జగనన్న అందించారన్నారు. గతంలో అందిన సంక్షేమ ఫలాలను ప్రజలు తలచుకుంటున్నారన్నారు. ఎక్కడికి వెళ్లిన సమస్యలే కనపడుతున్నాయన్నారు. ● పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం ముత్యాలమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ పూజలు చేశారు. అనంతరం కేక్కట్ చేసి అన్నదానం చేశారు. ఐరాల, పి.కొత్తకోటలో అన్నదానం చేసి కేక్ కట్ చేశారు. యాదమరిలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి కేక్కట్ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు శ్రీకాంత్రెడ్డి, రామచంద్రారెడ్డి, నాయకులు గౌహతిరెడ్డి, సుధాకర్రెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● గంగాధరనెల్లూరు నియోజకవర్గం జీడీ నెల్లూరు, పాలసముద్రం, కార్వేటినగరం, పెనుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం కేక్కట్ చేసి అన్నదానం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల పై కేసులు పెట్టడం మాని హామీల అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్బలగన్, ఎంపీపీ లతా, మండల కన్వీనర్లు శేఖర్రాజు, తులసీయాదవ్, వెంకట్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుప్పం : ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్సీ భరత్ పలమనేరు : వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుబంగారుపాళెం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, లలిత కుమారి తదితరులుపుంగనూరు : పట్టణంలో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప, అనీషారెడ్డి, అలీమ్బాషా జీడీ నెల్లూరులో భారీ కేకును కట్ చేస్తున్న కృపాలక్ష్మి చిత్తూరు : పార్టీ కార్యాలయ ఆవరణలో రక్తదానం చేస్తున్న నాయకులు నిధులు వంకపాలు చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట వంకలో వేసిన మట్టిరోడ్డు ఆదివారం తెగిపోయింది. వివరాల్లోకి వెళితే..వారం కిందట వంకలో మట్టి రోడ్డు వేశారు. ఇందుకు ప్రభుత్వం రూ. 12 లక్షలు మంజూరు చేయగా..జీడీ నెల్లూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత ఈ రోడ్డును వేశారు. మొక్కుబడిగా రోడ్డు వేయడంతో రెండు రోజుల్లోనే రోడ్డు అక్కడక్కడా కుంగిపోయింది. పెద్ద పెద్ద చీలికలు పడ్డాయి. నాణ్యతలేని సిమెంట్ పైపులు, పాత పైపులు దింపడంతో నాలుగు రోజు లకే నాణ్యత తేలిపోయిందని గ్రా మస్తులు చెబుతున్నారు. ఆదివారం రోడ్డు మధ్యలో వంక తెగి...మట్టికొట్టుకు పోయింది. ప్రవా హం అంతంత మాత్రంగానే ఉన్న..వేసిన మట్టికొట్టుకుపోవడంతో..రోడ్డు నాణత్యను ప్రశ్నిస్తోంది. కాగా నాణ్యత లేని రోడ్డుపై శనివారం సాక్షి దినపత్రికలో నాణ్యత డొల్ల ..నిధులు గుల్ల అనే శీర్షికన కథనం ప్రచురించింది. రోడ్డు కుంగిన విషయాన్ని ముందస్తుగానే సాక్షి హెచ్చరించింది. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యతలేని రోడ్డు వేసి..నిధులు దోచేశారని వారు మండిపడుతున్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ తర్వాత ప్రజల మనన్నలు పొందిన గొప్ప వ్యక్తి జగనన్న అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల ఆయన పాలనలో సుభిక్షంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభు త్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయకుండా కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. నగరిలో ర్యాలీగా టవర్క్లాక్ సెంటర్ వద్దకు చేరుకొని, అక్కడ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా, జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి మాట్లాడారు. పేద ప్రజల గుండె ధైర్యం జగనన్న ఆయన పై అభిమానం వేడుకల్లో కనిపిస్తోందన్నారు. జగనన్న సీఎం చేయడానికి సైనికుల్లా కష్టపడతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు నీలమేఘ, హరి, నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, నాయకులు పాల్గొన్నారు. పుంగనూరు పాతబస్టాండ్ వద్ద కేక్కట్ చేసి అన్నదానం చేశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప , మున్సిపల్ చైర్మన్ ఆలీంబాషా పాల్గొన్నారు. ఈవీఎంల గోల్మాల్తో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందన్నారు. అధికారంలో వచ్చాక ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదన్నారు. పుంగనూరు మండలంలో ఎంపీపీ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్కట్ చేసి అన్నదానం చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు హనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
కొండ చిలువ కలకలం
కార్వేటినగరం : మేజర్ పంచాయతీ కార్వేటినగరం సమీపంలోని పచ్చికాపల్ల మార్గంలోని జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. జగనన్న కాలనీలో వీధి దీపాలు లేక పోవడంతో చీకటిలో ఇంటి ఆవరణానికి భారీ కొండ చిలువ రావడంతో గుర్తించిన ఇంటి యజమాని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుకొని కొండ చిలువను కొట్టి చంపేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా కోళ్లు కనిపించడం లేదని, దొంగలు తీసుకెళ్లి ఉంటారని అనుకున్నా స్థానికులు తీరా ఇది కొండచిలువ పనేనని భయ బ్రాంతులకు గురైయ్యారు. జగనన్న కాలనీలో వీధి దీపాలు లేవని మూడు నెలల కిందట కాలనీ సందర్శనకు వచ్చిన జిల్లా కలెక్టర్కు విన్నవించామన్నారు. వెంటనే స్పందించి కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ప్రకృతి సంపద దోచేస్తున్నారు
చంద్రబాబు సర్కారు పాలనలో ప్రకృతి సంపద దోచేస్తున్నారు. కొండలనే కాకుండా చెరువులనూ వదలకుండా మట్టిని అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కబ్జాదారుల ఆగడాలు ఎక్కువైపోయాయి. నిన్నేమో జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉండే కట్టమంచి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. రోజుకు వందల సంఖ్యలో మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించింది. అలాగే ప్రజలు గ్రీన్ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడంతో కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం జిల్లా కేంద్రానికి సరిహద్దులో పలమనేరు రోడ్డులో ఇరువారం వద్ద జాతీయ రహదారికి పక్కనే ఉన్న కాజూరు చెరువులో మట్టి తవ్వకాలు ప్రారంభించారు. టీడీపీ మాజీ ఎంపీకి చెందిన పాఠశాలకు ఆనుకుని ఉన్న దారిలో వందల ట్రాక్టర్లలో మట్టిని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. -
ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా నాల్గవ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.సుబ్ర మణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, సహాయ ఎన్నికల అధికారి రాష్ట్ర కార్యదర్శి రమణ, ఎన్నికల పర్యవేక్షకుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఈ.సుబ్రమణ్యం వివరాలను వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు (ఈఈ ఇరిగేషన్, చిత్తూరు), సహాధ్యక్షుడు రాజా (సీటీఓ–2, చిత్తూరు), ఉపాఽ ద్యక్షుడిగా జయచంద్ర(వెటర్నరీ డిపార్ట్మెంట్, చిత్తూరు), బ్రహ్మయ్య(అగ్రికల్చర్, పలమనేరు), కార్యదర్శి గా లోకనాథ్(ఆర్అండ్బీ, చిత్తూరు), సంయుక్త కార్యదర్శులుగా ఉషారాణి(ఎస్సీ వెల్ఫ్ర్, చిత్తూరు), భాస్కర్(ఆర్టీఓ ఆఫీసు, చిత్తూరు), ప్రచార కార్యదర్శిగా నవీన్సాయి(జెడ్పీ, చిత్తూరు), కోశాధికారిగా రామచంద్రయ్య(డీఈఈ ఇరిగేషన్, చిత్తూరు)లు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాఘువులు, నాయకులు రమేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవంగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దీవెనలకోసం భక్తులు బోయకొండకు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండలో ఎటు చూసినా జన సంద్రంగా మారింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారని అధికారులు వెల్లడించారు. కోర్కెలు తీరిన భక్తులు ిపిండి ,నూనెదీపాలు, దీవెలతో అమ్మ వారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. -
మహారాజపురంలో అనకొండలు
మహారాజపురం పడమర వైపు మట్టిని తవ్వుతున్న దృశ్యం, తూర్పు వైపు కొండను తవ్వేసిన దృశ్యం సాక్షి టాక్స్ఫోర్సు : చిత్తూరు జిల్లా విజయపురం మండలం మహారాజపురంలో మూడు నెల క్రితం రెండు ప్రైవేటు సంస్థ గ్రావెల్ తరలింపునకు తాత్కాలిక అనుమతి తీసుకుంది. ఒక సంస్థకి 15 వేల క్యూబిక్ మీటర్, మరో సంస్థకు 16 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ రెండు సంస్థలు మూడు నెలలుగా నకిలీ బిల్లుతో సు మారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టిని తరలించినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నకిలీ బిల్లుతో తరలిస్తున్న టిప్పర్లలను స్థానిక ప్రజలు పట్టుకొని అధికారులకు పట్టించినా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. రోజుకి 200 టిప్పర్లు మహారాజపురం కొండపై నిత్యం 10 పొక్లయిన్లు , 200 టిప్పర్లు తిరుగుతున్నాయి. ఒక టిప్పర్లో 12 క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకు 200 టిప్పర్లలో సుమారు 2,400 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేస్తున్నారు. ఈ ప్రకారం ఆ రెండు సంస్థలు తాత్కాలికంగా తీసుకొన్న అనుమతి ప్రకా రం 15 రోజుల్లో మట్టి అంత తరలించేశారు. కానీ మూడు నెలలుగా రోజుకు 40 టిప్పర్లకే ఒరిజినల్ బిల్లులు ఇస్తూ మిగిలిన 160 టిప్పర్లకు నకిలీ బిల్లులతో మట్టిని తరలించేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా నకిలీ బిల్లుతో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎనికల్లో ఇచ్చిన హామీ ఏమైంది. తాము అధికారంలోకి వస్తే, తమిళనాడుకు పిడికెడు మట్టి వెళ్లకుండా చూసుకొంటానని చెప్పిన శాసన సభ్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని, ఎన్నికలలో ఇచ్చిన మాట ఏమైందని స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై న అక్రమ క్వారీపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది. దీనిపై వివరణ కోరేందుకు జిల్లా అధికారికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. షాడో ఎమ్మెల్యే హస్తం అక్రమ క్వారీ యజమాన్యం వెనుక ఓ షాడో ఎమ్మెల్యే హస్తం బలంగా ఉండడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తరలించేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతోంది. క్వారీ యజమాన్యం వెనుక షాడో ఎమ్మెల్యే హస్తం ఉండడంతో స్థానిక ప్రజలు, మండల, జిల్లా స్థాయి అధికారులు సైతం వారి వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. -
కాసులుపట్టి !
చెరువు మట్టి .. అమరావతి : జిల్లా కేంద్రంలో మట్టి, గ్రావెల్ మాఫి యా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ లే అవుట్లకు తరలిస్తున్నా రు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి అను మతి తీసుకోవాలి. క్యూబిక్ మీటర్ తవ్వకానికి రూ.150 నుంచి రూ.200 వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తరువాతే తవ్వకాలు చేపట్టాలి. కానీ, ఇవేమీ జిల్లా కేంద్రంలో కనిపించడం లేదు. అక్రమ మట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి పచ్చ నేతల జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి చె ల్లించాల్సిన వేల రూపాయల సెస్కు ఎగనామం పెడుతున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న చెరువులు, రాళ్ల గుట్టలు, ఎర్రమట్టి దిబ్బలు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని కాజూ రు చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి వందల లోడ్లు తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దూరాన్ని బట్టి.. మట్టి రేట్లు స్థానిక పచ్చనేతలు కొంత మంది ఇరిగేషన్ శాఖకు చెందిన కాజూరు చెరువులో నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. జేసీబీలతో వందల లోడ్లు తవ్వి భూమాతకు కన్నీరు పెట్టిస్తున్నారు. తవ్విన మట్టిని జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు, ఇసుక బట్టీలకు తరలించి అమ్మేస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ లోడు అయితే రూ.2000 నుంచి రూ.4 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగంపై చంద్రబాబు సర్కారుకు చెందిన నేతలు సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి చర్యలు తీసుకోకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసేందుకు సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఈ అక్రమ మట్టి తవ్వకాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అడ్డుకట్ట వేస్తారా? మిన్నుకుండి పోతారా ? అనేది వేచి చూడాల్సి ఉంది. కాపలాగా రౌడీలు కాజూరు చెరువులో మట్టి అక్రమ రవాణాను తరలించే సమయంలో బయటి వ్యక్తులు రాకుండా రౌడీలను కాపలా పెట్టారు. ఈ రౌడీలు అటువైపు వెళ్లిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాజూరు చెరువులో మట్టి దందా కొద్ది రోజులుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కనీసం పట్టించుకునేవారు కరువయ్యారు. ఆ అక్రమ మట్టి తవ్వకాలపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదుతో పాటు వాహనాలను సీజ్ చేస్తే తవ్వకాలు ఆగే అవకాశం ఉంది. అయితే ఆ రకమైన చర్యలు చేపట్టడంలో జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆపేవారు.. అడిగేవారే లేరు.. జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న కాజూరు చెరువు కబ్జాకు గురవుతోంది. చిత్తూరు నగరానికి తాగు, సాగునీరు అందించేందుకు గంగినేని, కట్టమంచి, కాజూరు చెరువులు ప్రధానమైనవి. వర్షాకాలంలో ముఖ్యమైన ఈ మూడు చెరువులు నిండితే నగరానికి తాగునీటితో పాటు కింది భాగంలో ఉన్న రైతుల భూములకు నీళ్లందుతాయి. రెవెన్యూ రికార్డుల్లో జడియం చెరువుగా, వాడుకలో కాజూరు చెరువుగా పిలిచే ఈ చెరువు సర్వే నంబర్ 159, 170లో దాదాపు 200 ఎకరాల మేరకు వ్యాపించి ఉంది. కాజూరు, ఇరువారం, కొండ ప్రాంతం, పోతంబట్టు ప్రాంతాల నుంచి ఏడు సప్లై ఛానళ్లు ఉన్నాయి. కాలక్రమేణా వీటిలో ఐదు ఛానళ్లను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. దీంతో పెద్ద వర్షం కుసినప్పటికీ కాజూరు చెరువులోకి నీరు రావడం లేదు. చెరువు రోడ్డును ఆనుకుని ఉండటం, రోజు రోజుకూ నగరం విస్తరించడంతో కబ్జాదారుల కన్ను కాజూరు చెరువుపై పడింది. చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న కారణంగా ఈ చెరువుపై పచ్చనేతల కబ్జాదారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం స్థానిక ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. -
పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తాం
తవణంపల్లె : మండల కేంద్రంలో మునగ ఆకుతో తయారు చేసే పౌడర్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి స్పష్టం చేశారు. శనివారం తవణంపల్లె వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారులతో మునగ పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీదేవి మాట్లాడుతూ.. తవణంపల్లె రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీఓ) భవనంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రైతులు మునగ సాగు చేయడంలో మెలకువలు గురించి వివరించారు. ఉద్యానవన శాఖ ఏడీ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించారు. మాట్లాడుతూ ఆసక్తి కలిగిన రైతులు ఉపాధిహామీ పథకం కింద మునగ సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కేశవులు, ఎల్హెచ్ ఏపీఎం రమణ, ఏపీఎంలు నాగరత్న, ఈశ్వరి, అరుణ, రవి, రవికుమార్, సంగన్న, ఏపీఓ బాల సీసీలు, రైతు ఉత్పత్తిదారులు ,హైదరాబాద్ ఎ–1 ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు జగనన్న బాసట
తిరుపతి సిటీ : ‘‘తిరుపతి కొర్లగుంటకు చెందిన నిరుపేద కుటుంబం మాది. అమ్మానాన్న ఇద్దరూ భవన నిర్మాణ కూలీలు. నేను, తమ్ముడు ఇద్దరం సంతానం. వారి చేతి కష్టంతో మమ్మలను చదివిస్తూ వచ్చారు. నేను 2019లో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజు చెల్లించలేనిస్థితిలో ఆశలు వదులుకున్నాను. అమ్మానాన్నతో పాటు నేనూ కొన్ని రోజులు పనికి వెళ్లాను. ఆ సమయంలో జగనన్న 2019లో సీఎం అయిన వెంటనే టీడీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు. దీంతో కళాశాల యాజమాన్యం బీటెక్ సర్టిఫికెట్లు ఇచ్చింది. 2020లో తిరుపతిలో మెగా జాబ్మేళాకు ఎంపికై రూ.9 లక్షల ప్యాకేజీ అందుకున్నాను. ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికాకు పంపించారు. ప్రస్తుతం నేను రూ.25 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నాను. ‘‘ మళ్లీ నిన్ను సీఎంగా చూడాలి.. హ్యాపీ బర్త్డే టూ యూ జగనన్న’’ – శ్రావణి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, తిరుపతి -
● సకల వర్గాలకు సంక్షేమం అందించిన నేత ● నేడు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగాప్రత్యేక కథనం
మా ఇంటి దీపం వెలిగించాడు శాంతిపురం: ‘‘నాకున్న 1.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని భార్య జయంతి, కొడుకు పృథ్విఆదిత్యతో ఉన్నంతలో సంతోషంగా జీవించేవాడిని. మూడేళ్ల క్రితం నా కొడుకు ఆనారోగ్యానికి గురయ్యాడు. నెల రోజుల పాటు మేము ఆస్పత్రుల చుట్టూ తిరిగితే ఊపిరి తిత్తులు తీవ్రమైన ఇన్పెక్షన్కు గురైనట్టు తేల్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గురించి తెలిసినా, నా బిడ్డ ఎదుర్కొంటున్న జబ్బుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు స్థానికంగా లేక ఇబ్బంది పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్యం కోసం చేసిన ఖర్చులు తమ శక్తికి మించి అయిన వారి సాయం తీసుకున్నా అదీ సరిపోలేదు. నానాటికీ అనారోగ్యం ముదురుతూ శ్వాస తీసుకోవడానికి అల్లాడుతున్న నా చంటి బిడ్డను చూస్తూ ఉండలేక సతమతమయ్యారు. చివరకు బెంగళూరులోని రెయిన్బో అస్పత్రికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు. రూ.10 లక్షలకు పైగా విలువైన చికిత్సలను ఉచితంగా అందించడంతో పృథ్విఆదిత్య గండం నుంచి గట్టెక్కాడు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పట్లో తమ కష్టాన్ని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని తలుచుకుని ధర్మేంద్ర దంపతులు చేతులు జోడించి నాటి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. మా లాంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి మంచి మనసున్న పాలకులే కావాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – ధర్మేంద్ర, ఆరిముత్తనపల్లి, శాంతిపురం మండలం తిరుపతి, సాక్షి ప్రతినిధి: సకల వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారు. 18 నెలల నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనను, నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనతో పోల్చుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా నాటి సంక్షేమ పాలనను గుర్తుచేసుకుంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకుడిగా అభివర్ణిస్తున్నారు. నాడు ఐదేళ్లలో చేసిన సంస్కరణల గురించి చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేసి చూపించిన నాయకుడిగా నిలిచిపోయారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలో వేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని మహిళలు కీర్తిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. వలంటీర్లు నియమించి కులమతాలు పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందించారు. నాడు– నేడు ద్వారా ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. విద్యా వ్యవస్థ బాగు కోసం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారు. 17 మెడికల్ కళాశాలలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మాటలు, ప్రకటలతో కాకుండా మహిళా సాధికారతను చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరునే ఇచ్చి సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. అటువంటి నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
మారుతున్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
హైకోర్జు జడ్జి జస్టిస్ జయసూర్య చిత్తూరు అర్బన్ : చట్టాల్లో వస్తున్న మార్పులు, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పులపై ప్రతీ ఒక్క న్యాయమూర్తి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య ఆదేశించారు. శనివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లాలోని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జరిగిన సమావేశంలో జస్టిస్ జయసూర్య మాట్లాడుతూ.. చట్టాల్లో వస్తున్న మార్పులపై జడ్జీలకు పూర్తిస్థాయిలో పట్టు ఉండాలన్నారు. అప్పుడే సరైన తీర్పులు వెలువరించే అవకాశం ఉంటుందన్నారు. క్రిమినల్ చట్టంలో నేరాల తీరు, ప్రాసిక్యూషన్ నియంత్రించడం, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు శిక్షలపై చర్చించారు. ఇక కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి బి.శ్యాంసుందర్, రిటైర్డు జిల్లా జడ్జి కేపీ బాలాజీ రీసోర్స్ పర్సన్గా వ్యవహరించి పలు అంశాలపై ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, న్యాయమూర్తులు సూర్యనారాయణమూర్తి, శ్రీనివాసరావు, భారతి, గురునాథ్, అర్చన, రామ్గోపాల్ పాల్గొన్నారు. -
దారి తప్పుతున్న లాటరీ దర్యాప్తు
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో నగరంలో నిషేధిత లాటరీ టికెట్ల ముద్రణ, టికెట్లు విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడంలో ఓ పోలీసు అధికారి వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. నగరంలో విచ్చల విడిగా లాటరీ టికెట్ల విక్రయాలు, దానికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంపై ‘సాక్షి’ పత్రికలో ఇటీవల ‘పచ్చ లాటరీ’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ దందాపై ఎస్పీ తుషార్ డూడీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పెష ల్ బ్రాంచ్ విభాగంతో లాటరీ వ్యవహారంపై కీలక సమాచారం తెప్పించుకున్నారు. ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులు, పోలీసులపైనా నిఘా పెట్టారు. దీంతో నెపం తమపై పడుతుందని గ్రహించిన ఖాకీలు ఇటీవల లాటరీ టికెట్ల విక్రయదారులను వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గతంలో లాట రీ టికెట్లు విక్రయించి, ప్రస్తుతం దానిజోలికి వెళ్లకుండా కూలీ పనిచేసుకుంటున్న పేదలపై ఓ ఖాకీ తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులను.. వాళ్ల ఇంటికి వెళ్లి నిద్రలేపి మరీ కేసులు పెట్టారని విమర్శలు ఉన్నాయి. తాము లాటరీ టికెట్లు విక్రయించడంలేదని, కూలీ పనికి వెళుతున్నామని చెబుతున్నా పట్టించుకోకుండా కేసులు పెట్టడంతో పాటు.. ఇద్దరు వ్యక్తుల ఫోన్పే నుంచి డబ్బులను సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
హెచ్ఎంపై విచారణ
వీకోటప్రభుత్వ పాఠశాల హెచ్ఎంపై చిత్తూరు డీవైఈవో పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఇంటిల్లిపాదికీ సంక్షేమం వరదయ్యపాళెం: ‘మాది తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు గ్రామం. మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నా భర్త తో పాటు ఇద్దరు కుమార్తెలు గురుప్రియ, చంద్రుప్రియ, కుమారుడు వంశీ ఉన్నారు. మాతో పాటు నా భర్త తల్లి రుక్ష్మిణి ఉంది. మేమందరం ఒకే ఇంట్లో ఉంటాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నా భర్తకు రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 చొప్పున ప్రతి సంవత్సరం అందింది. నాకు సున్నా వడ్డీ పథకం కింద రూ.2వేలు, బీఫార్మసీ చదువుతున్న పెద్ద కుమార్తె గురుప్రియ, ఈసీఈ చదువుతున్న ద్వితీయ కుమార్తె చందుప్రియకు జగనన్న విద్యాదీవెన పథకం దారా లబ్ధి చేకూరింది, ఇంటర్మీడి యట్ చదువుతున్న కుమారుడు వంశీకి అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల చొప్పున మా బ్యాంకు ఖాతాలో జమైంది. మా అత్తమ్మ రుక్మిణికి వితంతు పింఛను కింద ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ముట్టింది. ఇలా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఏడాదికి రూ.1,07,000, ఆర్థిక సహాయం అందేది. జగనన్న పాలనలో 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అందుకున్నాం. మా కుటుంబానికి సాయం చేసి, అండగా నిలబడిన జగనన్న వెయ్యేళ్లు వర్ధిల్లాలి. అన్నా నీకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.’’ – భాను కుటుంబం, చిన్నపాండూరు, వరదయ్యపాళెం మండలం -
రైతు బతుకును పండగ చేశాడు
కాణిపాకం: ‘‘రైతు బతుకు జగనన్న పండగ చేశాడు. నేను పుట్టినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పరితపించే మరో నాయకుడిని చూడలేదు. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లకు పెళ్లయి పిల్లలున్నారు.ఊరు చివరన మాకు 2.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో చెరుకు, వరి పండిస్తున్నాం. అడపాదడపా రాగులు సాగు చేస్తాం. 2019కి ముందు వ్యవసాయ ఆధారిత మందులు, ఎరువుల కోసం తమిళనాడుకు వెళుతున్నాం. 8 కిలోమీటర్ల దూరం ఆటోలో వెళ్లి మందులు, ఎరువులు తెచ్చుకునేవాళ్లం. అప్పట్లో పండించే పంట తెగుళ్ల నుంచి కాపాడుకోలేకపోయాం. పంట ఎత్తిపోతే నష్టపరిహారం కూడా అందించే వారు కాదు. పంటపై తీసుకున్న రుణాలకు రుణమాఫీ కాగాపోగా అప్పుల పాలయ్యాం. 2019 తర్వాత జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. జననేత పాలనలో వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని ఆయన నిరూపించారు. పంట సాగుకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా అందించారు. మా గ్రామ సమీపంలో శ్రీకావేరిరాజుపురం వద్ద రైతు భోరోసా కేంద్రాన్ని నిర్మించారు. ఆర్బీకేలో నాణ్యత గల ఎరువులు, యూరియా, వేరుశనగ, కంది, జనుము, మినుములు, అలసంద వంటి పలు రకాల విత్తనాలను తీసుకున్నాం. యంత్రపరికాలు కూడా అందించారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.13.500 మా బ్యాంకు ఖాతాకే పడేది. సాగు చేసే పంటకు బీమా వసతి కల్పించారు. పంట నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చేవారు. రైతు భరోసా కేంద్రం వచ్చాక పాడి ఆవులకు ఊళ్లోనే వైద్యం చేసేవాళ్లు వచ్చారు. దాణాలు, సీజనల్ వ్యాధుల నివారణకు మందులు ఉచితంగా వేసేవారు. ఫోన్ చేస్తే పశు సంచార వాహనం ఇంటి వద్దకే వచ్చేది. ఇలాంటి గొప్ప సేవలు అందడంతో మేము కూడా కొండత భరోసా వచ్చింది. పేదల అభ్యున్నతే ధ్యేయంగా పాటుపడిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.’’ – రాజేంద్ర, ఎస్కేఆర్పురం, పాలసముద్రం మండలం -
నేడు పల్స్పోలియో
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం జరగనుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయనున్నారు. ఇందు కు గాను 50 పీహెచ్సీ, 15 అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో 2,21,502 మంది ఐదేళ్ల లోపు పిల్లలను గుర్తించారు. 142 రూట్లల్లో 1415 బూత్లను ఏర్పాటు చేశా రు.ఈ బూత్లలో పిల్లలకు చుక్కలు వేసేందుకు 5800 వ్యాక్సినేటర్లను నియమించారు. 2830 మందితో ఇంటింటా పర్యటనకు కేటాయించారు. జిల్లా కేంద్రానికి 7 లక్షలు డోస్లు చేరుకున్నాయి. వీటిని చిత్తూరు జిల్లా తో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు కూడా అందజేయనున్నామని డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలో పోలియో చుక్కల కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి అక్కడ మానవహారం, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ, మేయర్ అముద మాట్లాడుతూ.. పిల్లలందరికీ ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఐఓ హనుమంతరావు, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, సూపరింటెండెంట్ ఉషశ్రీ, ఆర్ఎంఓ సంధ్య, వైద్యాధికారులు లోకేష్, ప్రవీణ, గిరి, అనూష పాల్గొన్నారు. -
104 ఉద్యోగులపై వేధింపులు తగదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : 104 ఉద్యోగులపై యాజమాన్య వేధింపులు తగదని 104 ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు విక్టర్ మండి పడ్డారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట శనివారం 104 ఉద్యోగుల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులో యాజమాన్యం కోత పెట్టిందన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వేతనం రూ.18,500 ఇవ్వాలన్నారు. 5 ఏళ్లు సర్వీసు దాటిన వారికి స్లాబ్ మార్చి వేతనాలు చెల్లించాలన్నారు. రద్దు చేసిన క్వాజువల్ లీవులు పునరుద్ధించాలన్నారు. మందులు 104లోనే అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ గిరిధర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సభ్యులు భాస్క ర్, శ్రీకాంత్, మణికంఠ తదితరులున్నారు. -
ఉపాధిని రద్దు చేయొద్దు!
చిత్తూరు కార్పొరేషన్: ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని మౌన దీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసే యోచనలో ఉందన్నారు. ఈ పథకానికి వెచ్చించాల్సిన నిధులను 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నిబంధనలు మార్చాలని చూస్తున్నట్టు తెలిసిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం గొప్పలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా నాయకులు ఓబుల్రాజు, నాయకులు సురేంద్రన్, గిరిధర్ గుప్తా, చిట్టెమ్మ, ప్రసాద్, ప్రతాప్ పాల్గొన్నారు. -
‘సర్వే’శ్వరా?
ఇంటింటికీ వెళ్తూనే ఉండండి చిత్తూరు కలెక్టరేట్ : సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పూటకొక సర్వే పేరుతో ఇంటింటికీ తిప్పుతోంది. తాజాగా మరో కొత్త సర్వేకు శ్రీకారం చుట్టడంపై పలువురు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఈ సర్వేను నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలివ్వడంపై మండిపడుతున్నారు. మూలిగే నక్కపై.. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఒక రకంగా వారిని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పది మంది చేయాల్సిన పనిని ఒకరికి అప్పగించి తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం మోపింది. ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈ నెల 15న సర్వే ప్రారంభించి జనవరి 12కు పూర్తి చేయాలి. సర్వేలో సేకరించాల్సిన సమాచారం వంద శాతం ఈ–కేవైపీ తప్పనిసరి. ప్రతి వ్యక్తి ఆధార్ ద్వారా వెరిఫై చేయాలి మొబైల్ యాప్ సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేయాలి వ్యక్తిగత డేటా, కుటుంబ స్థాయి డేటా సేకరించాలి పేరు, లింగ (జెండర్), పుట్టిన తేదీ, ఆధార్ సేకరణ తప్పనిసరి మొబైల్ నంబరు– ఒక నంబరు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ప్రస్తుత చిరునామాను డాక్యుమెంట్ ఆధారంతో చెక్ చేయాలి నైపుణ్యాలు, వృత్తి, ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్, డాక్యుమెంట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. ఇంటి వివరాలు– నీటి సరఫరా, ఎల్పీజీ, విద్యుత్, టాయ్లెట్, రూఫ్ వంటివాటిని సర్వేయర్ వెరిఫై చేయాలి. ఇంటి యజమాని (హౌజ్హోల్డ్) కలిగి ఉన్న ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ సామగ్రి, పశువులు, తదితర వివరాల నమోదు చేయాలి. జిల్లా సమాచారం -
దాచి పెట్టి దోపిడీ!
సాక్షి టాస్క్ఫోర్స్: ఇసుక దోపిడీలో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. అక్రమంగా తవ్వకాలు చేసి తెల్లబంగారాన్ని దోచేస్తున్నారు. వంకలో తవ్వకాలు చేసి... ఆపై డప్ చేసి రహదారి కోసమంటూ టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడ టిప్పర్ ఇసుక లక్షలకు విక్రయి స్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్టవేసేందుకు అధికార పార్టీ నాయకులే సిద్ధమవ్వడం గమనార్హం. చిత్తూరు మండలం, ముత్తుకూరు రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ తవ్వకాలు చేసి ముత్తుకూరు– తచ్చూరు జాతీ య రహదారి కూడలి సమీపంలో డంప్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ డంప్ను ప్రా రంభించారు. రీచ్ నుంచి డంప్కు రోజుకకు 80 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుక చేరుతోంది. డంప్ నుంచి జేసీబీల ద్వారా టిప్పర్లకు లోడ్ చేస్తున్నారు. రహదారి పేరుతో తరలింపు డంప్ నుంచి గుడిపాల మండలంలో జరిగే రోడ్డుకని తెల్లబంగారాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. అయితే గుడిపాల మీదుగా తమిళనాడుకు పట్టుకెళుతున్నారు. తమిళనాడులో డిమాండ్ ఉండడంతో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పొన్నై, తిరుత్తణి, చైన్నె, సోలింగరం తదితర ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అడిగే దమ్ముందా? ఈ ఇసుక అక్రమ వ్యాపారాన్ని ముత్తుకూరుకు చెందిన ఓ నేత, గుడిపాలకు చెందిన మరో నేత కలిసి చేస్తున్నారు. ముత్తుకూరుకు చెందిన ఆ నేతే రీచ్ నుంచి డంప్ ప్రాంతానికి ట్రాక్టర్ల ద్వారా చేర్చడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడుకు తరలించే ప్రక్రియ మొత్తం గుడిపాలకు చెందిన నేత చూసుకుంటున్నాడు. ఈ విషయం మండలంలోని పలువురు నేతలకు తెలియడంతో వారు తిరుగుబావుటా ఎగురవేశారు. గుడిపాలలో ఉండే వ్యక్తులు మా అడ్డాలో అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అధికారులు అడ్డుకునే దమ్ము లేకుంటే అధినేతకు ఫిర్యాదు చేస్తామని టీడీపీలోని ఓ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. -
కొడితే సిక్సే!
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో క్రికెట్, షటిల్ ఇతర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్కుమార్ ఉద్యోగులతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం ఉద్యోగులకు క్విజ్ పోటీలు జరిగాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు నిర్వహించారు. డీఆర్వో మోహన్కుమార్ పోటీలను పర్యవేక్షించారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, పలమనేరు ఆర్డీవో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ బ్యాటింగ్ చేస్తున్న కలెక్టర్క్విజ్ పోటీలు -
పేదల దేవుడు వైఎస్ జగన్
వెదురుకుప్పం : చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల తలరాతలను మార్చిన దేవుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి ప్రజల అభున్నతికి బాటలు వేశారని కొనియాడారు. నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనారిటీ అంటూ బడుగులను అక్కున చేర్చుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్ అని వెల్లడించారు. సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండాలన్న సంకల్పంతో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందించి, పాలనలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఏకంగా 31 లక్షల మంది పేదలకు స్థలంతోపాటు ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏ పథకమైనా పేదల సంక్షేమమే ప్రామాణికంగా తీసుకుని అమలు చేసినట్లు వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగు పరచి పేదల గుండెల్లో కొలువుదీరారని చెప్పారు. జగన్ పుట్టినరోజును ప్రతి పేదవాడి ఇంట్లో పండుగగా భావిస్తున్నారని తెలిపారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గవ్యాప్తంగా జననేత జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంతో కూటమిలో వణుకు మొదలైనట్లు తెలిపారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
సాక్షి టాస్క్ఫోర్స్ : బంగారుపాళెం మండలం మట్టి అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మట్టి మాఫి యా మండలంలోని కొండలు, గుట్టలను తవ్వేసి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా మొగిలివెంకటగిరి రెవెన్యూ, పాలేరు జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గుట్టను 20 రోజుల నుంచి జేసీబీతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులేవీ..? మట్టిని తవ్వడానికి మైనింగ్ అనుమతులు తప్పనిసరి. అక్రమార్కులు అధికార పార్టీ నాయకుల అండతో అనుమతులు లేకుండానే మట్టిని తవ్వుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని మట్టి అక్రమ రవాణా గురించి పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మట్టిని టిప్పర్ల ద్వారా బంగారుపాళెం మీదుగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో దుమ్ము, ధూళి కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్టు దుకాణదారులు, ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము వెదజల్లుతోందని చెబుతున్నారు. -
అయ్యో..తులసీ
నగరి : నగరి మండలంలోని ఎం.కొత్తూరు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విలేజ్ సర్వేయర్ టీ.తులసీరామ్ (29) మృతిచెందాడు. పోలీసులు తెలి పిన సమాచారం మేరకు.. విజయపురం మండలం, కాళికాపురం సచివాలయలో విలేజ్ సర్వేయర్గా తులసీరామ్ విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు డీఎస్ఎస్ఎల్ఆర్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడానికి నగరికి స్కూటర్పై వస్తుండగా దేశమ్మ దేవాలయ సమీపం, ఎం.కొత్తూరు మార్గంలో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన తులసీరామ్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నగరి మున్సిపాలిటీ నగరిపేటకు చెందిన ఇతను ఇటీవల గుడుపల్లి మండలం, చీకటిపల్లికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం డిప్యూటేషన్పై కాళికాపురం సచివాలయంలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందాడు. మృతినికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. నిత్యం సర్వేలు, కాన్ఫరెన్స్లు ఇటీవల బాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు నిత్యం ఏదో ఒక సర్వే, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తోంది. వారు కుదురుగా సచివాల యాల్లో ఉండడమే లేదు. ఇలా తిరగడమే నేడు ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వైద్యం @ 22!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కోచోట నిత్యం 70 నుంచి 150కి పైగా ఓపీలు నమోదవుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో రావడం లేదు. ఇద్దరు డాక్టర్లులుంటే.. ఒకరు 104 సేవలు చూసుకోవాలి. మకొకరు...ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలి. కానీ ముఖ హాజరు వేసుకుని సర్వేలు, క్షేత్ర తనిఖీల పేరుతో బయటకు వెళ్తున్నారు. సొంత క్లినిక్లో కూర్చుని జేబులు నింపుకుంటున్నారు. లేకుంటే యూనియన్ల పేరుతో దర్జాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. డెప్యూటేషన్ అంటూ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. దీంతో పలు పీహెచ్సీలు ఖాళీగా బోసిపోతున్నాయి. ఈ విషయాలు తెలిసినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇటీవల చిత్తూరు నగరంలోని చవటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయగా వైద్యులు 10 గంటలు దాటినా రాలేదు. విచారిస్తే ఆ డాక్టర్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ జూనియర్ అధికారి బంధువని తెలిసింది. ఇటీవల ఎంపీ శ్రీరంగరాజుపురం పీహెచ్సీని తనిఖీ చేస్తే డాక్టరు విధుల్లో లేరని గుర్తించి.. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి పూట ఉండరే? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాత్రి పూట కూడా పనిచేసేలా ఆదేశాలున్నాయి. స్టాఫ్ నర్సులు డ్యూటీలో ఉండాలనే నిబంధన ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాత్రి పూట వైద్య సేవలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ప్రసవాలను స్థానికంగానే చేయాలనే లక్ష్యంతో నిర్దేశించింది. కానీ ఆ దిశగా పీహెచ్సీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. పడకేసిన ప్రాథమిక వైద్యం వైద్యానికి డబ్బులా? బాబు ప్రభుత్వం వచ్చాక వైద్య సేవలు తూతూమంత్రంగా మారాయి. పలు కేంద్రాల్లో ఆరోగ్య సేవలకు కాసులు గుంజుకుంటున్నారు. సూది వేస్తే రూ.50, కట్టుకడితే రూ.50 నుంచి రూ.100, సైలెన్బాటిల్ పెడితే రూ.100 నుంచి రూ.200, ల్యాబ్ టెస్ట్కు రూ.100 నుంచి రూ.300 వరకు గుంజుతున్నట్టు సర్వేలో తేలింది. అలాగే ఇక్కడ పలు టెస్టులు చేయాలేమని.. బయట చేసుకోవాలని, దీనికి రూ.600 అవుతుందని చెప్పి వసూలు చేస్తున్నట్లు సర్వేలో పలువురు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అందిన సేవలకు డబ్బులు అడిగారని సర్వే చేయగా.. 83,160 మంది స్పందించారు. ఇందులో 31,325 మంది(37.67శాతం) డబ్బులు అడిగారని సమాధానమిచ్చారు. ఈ లోపాలతో జిల్లా 22 స్థానంలో నిలిచింది. మొత్తం మీద వైద్య సేవలపై 61.7 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తే.. 38.3 శాతం మంది అసంతృప్తిని వ్యక్తపరిచారు. వీటన్నింటికీ ప్రధాన కారణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణాలోపమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. మందులు, మాత్రలు ఏవీ? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు కూడా లేవని గుర్తించింది. చాలా వరకు బయట రాసిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ లోపాలను 30,651 మంది(37.82శాతం) వెల్లడించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పూర్తిగా లోపిస్తోంది. ఈ విషయాన్ని 34,724 (42.65 శాతం) మంది గుచ్చి చెప్పారు. -
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
వెదురుకుప్పం: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని పోక్సో చట్టం కింద శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్ కథనం మేరకు.. వెదురుకుప్ప మండలం, ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన ఓ బాలిక(14) ఆగస్టు 24వ తేదీ 11 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన శంకరయ్య కుమారుడు డి.మురళి (49) బాలిక ఇంటికి వెళ్లాడు. ఆపై బాలికను బెడ్ రూమ్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడి బాలిక ఎవ్వరికీ చెప్పలేదు. అయితే అప్పుడప్పుడూ బాలికకు కడుపునొప్పి వచ్చేది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గురువారం తల్లిదండ్రులు బాలికను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించడంతో 22 వారాల గర్భం ఉన్నట్టు తేలింది. అవాకై ్కన బాలిక తల్లిదండ్రులు వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం తన కుమార్తైపె లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మురళిపై వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా శుక్రవారం సాయంత్రం దేవళంపేట వద్ద పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు 2012లో ఓ కేసులో నేరస్తుడని తెలిపారు. డీఎస్పీ వెంట కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐ నవీన్బాబు ఉన్నారు. -
ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవద్దు
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడి తేవద్దని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛగా బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీమ్ పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ సెలవు రోజులైన ఆదివారం, రెండో శనివారం, పండుగ రోజుల్లో పనిచేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అనంతరం డీఈవో రాజేంద్రప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. -
ఆన్లైన్లో తుది మెరిట్లిస్టు జాబితా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి వెల్లడించారు. సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘గుట్టుగా మెరిట్ లిస్టు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆమె ప్రొవిజనల్ మెరిట్ లిస్టును తోసిపుచ్చి.. తుది మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెట్టిన విషయా న్ని బహిర్గతం చేశారు. ఇక ఏయే పోస్టులను భర్తీ చేస్తున్నారో వెల్లడించారు. స్టాఫ్నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, సపోర్టింగ్ స్టాఫ్, లాస్ట్గ్రేడ్ సర్వీసు పోస్టులను మాత్రమే భర్తీ చేయనన్నట్లు ప్రకటించారు. మిగిలిన పోస్టులు వాయిదా పడ్డాయన్నారు. కాగా తుది మెరిట్లిస్టునుwww.chittoor.ap.gov.in అనే సైట్లో ఈనెల 22వ తేదీ వరకు చూసుకోవచ్చని వెల్లడించారు. టెట్కు 130 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 130 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 542 మందికి గాను 456 మంది, మధ్యాహ్నం 541 మందికిగాను 497 మంది హాజరయ్యారని చెప్పారు. టెట్ ఐదు కేంద్రాల్లో జరిగిందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం, తిరుమణ్యం రెవెన్యూ అటవీ ప్రాంతంలో క్రూర మృగాల కదలికలను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి వి.సాయిబాబా తెలిపారు. ఈ నెల 16వ తేదీన తిరుమణ్యం అటవీ ప్రాంతంలో చిరుత మేకలను చంపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చిరుత దాడిలో మేకలు చనిపోలేదని స్పష్టం చేశారు. చిరుత ఒకదాని మీదనే దాడి చేసి, నోటితో కరచి తీసుకెళ్లిపోతుందని వివరించారు. ఈనెల 16న నాలుగు మేకలు మృతి చెందడానికి అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) కారణమై ఉంటాయన్నారు. ఏది ఏమైనా గ్రామస్తుల సంరక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజర్ బీ.సుదర్శన్రెడ్డి, ఎఫ్ఎస్ఓ వై.శంకరప్ప, ఎఫ్బీఓ ఎం.మునినాయక్, ఎంపీటీసీ రవి ఉన్నారు. నేడు హైకోర్టు న్యాయమూర్తి సమీక్ష చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య శనివారం చిత్తూరుకు రానున్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో పూర్వపు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 నుంచి సమావేశం ప్రారంభం కానుంది. -
ఆ టీడీపీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలి
చిత్తూరు అర్బన్: దర్యాప్తులో ఉన్న కేసు నుంచి తన పేరు తొలగించాలని బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరుకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు శోభారాణి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చిత్తూరుకు చెందిన టీడీపీ మహిళా కార్పొరేటర్ (న్యాయవాది కూడా) గురువారం రాత్రి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం, తన చావుకు డీఎస్పీ, సీఐలతో పాటు శోభారాణి కూడా కారణమని చెప్పడం తెలిసిందే. దీనిపై శోభారాణి స్పందిస్తూ తన సోదరుడి ఆత్మహత్య కేసులో ఆ కార్పొరేటర్ను నిందితులిరాలిగా చేరిస్తే, తన పేరు తొలగించాలని దర్యాప్తు అధికారులను బెదిరించడం కేసును పక్కదారి పట్టించడమే అవుతుందని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ పోలీసులను బెదిరిస్తే కేసు ఎందుకు నమోదుచేయరని ప్రశ్నించారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల్లోకి మరోలా సంకేతం వెళుతుందని తెలిపారు. ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కుప్పం విద్యార్థి కుప్పంరూరల్: కుప్పం డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్లో తృతీయ సంవత్సరం చదువుతున్న పి.రేవంత్ సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎస్వీ యూనివర్సిటీ తరుఫున ఎంపికై నట్లు కళాశాల చైర్పర్సన్ శాంతానాగరాజు చెప్పారు. తిరుపతిలో జరిగిన కాలేజీ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, డిసెంబర్ 25న చైన్నెలో జరిగే పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పి.రేవంత్ను శుక్రవారం కళాశాల అధ్యాపకులు అభినందించారు. -
న్యాయ విభాగంలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వైఎస్సార్సీపీ న్యాయ విభాగం కమి టీలో నియమాకాలు చేపడుతూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. జిల్లా అధ్యక్షుడిగా సూర్యప్రతాప్(చిత్తూరు), ఉపాధ్యక్షుడిగా మల్లికార్జునరెడ్డి(పుంగనూరు), విజయకృష్ణారెడ్డి(చిత్తూరు), సురేష్రెడ్డి(జీడీనెల్లూరు), ప్రధాన కార్యదర్శులుగా సఫివుల్లా (చిత్తూరు), హరిబాబు(జీడీనెల్లూరు), ప్రకాష్రెడ్డి(పూతలపట్టు), చంద్రప్ప(కుప్పం), ఉదయభాను(నగరి), మోహన్రెడ్డి(పలమనేరు), హరినాథరెడ్డి(పుంగనూరు), కార్యదర్శులుగా స్టీఫెన్, వాసుదేవరెడ్డి(జీడీనెల్లూరు), మోహన్, ప్రసాద్రెడ్డి (పూతలపట్టు), హరికృష్ణ(కుప్పం), మురళీరాజు(నగరి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్రెడ్డి(పలమనేరు), ప్రకాష్, అంజిబాబు (పుంగనూరు)లతో పాటు 12 మంది ఈసీ మెంబర్లను నియమించారు. -
దీన్ని ఏమందురు?
నకిలీ మద్యంపై తనిఖీలు సరే.. లీకేజీలకు కారణం? చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో లభిస్తున్న మద్యం బాటిళ్లలో.. కొన్ని లీకేజీలు అవుతున్నాయి. ఇవి కల్తీ మద్యమా..? ఒక కంపెనీ మద్యానికి బదులుగా మరో కంపెనీ మద్యం ఏదైనా మిక్డ్స్ చేస్తున్నారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. చిత్తూరులో ఇలా.. ఇటీవల చిత్తూరు నగరంలోని తిరుపతి రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో మద్యం తీసుకున్న వ్యక్తి, బాటి ల్ మూత నుంచి మద్యం లీకేజీ అవుతుండడాన్ని గమచించారు. ఇదేమిటని దుకాణ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే లీకేజీ అవుతున్న బాటిల్ తీసుకుని, మరో బాటిల్ ఇచ్చి పంపిచేశాడు. కానీ బాటిల్ మూత లీకేజీ అవుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్యాంపిల్స్ తీస్తున్న ఎకై ్సజ్ పోలీసులు ల్యాబ్కు వీటిని పంపిస్తే ఇందులో ఏదైనా కల్తీ జరిగిందా..? రసాయనాలు ఉండాల్సిన పరిమాణంకంటే ఎక్కువగా ఉన్నాయా..? అనే రిపోర్టు వస్తుంది తప్ప.. రూ.300 విలువ చేసే మద్యంలో చీప్లిక్కర్ కలిపారా..? అనే నివేదిక రాదు. దీన్ని అలుసుగా చేసుకుని కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్ల మూతలను చాకచక్యంగా తొలగించి, అందులో తక్కువ ధర ఉన్న మద్యాన్ని కలుపుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో బాటిళ్లను పరీక్షించకుండా, దుకాణ నిర్వాహకులు ఇచ్చే నెలవారి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తనిఖీలు నామమాత్రం అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో గతేడాది అక్టోబర్లో 104 ప్రైవేటు మద్యం దుకాణాలను బాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక కల్లుగీత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు మరో పది దుకాణాలను కేటాయించింది. జిల్లాలో నెలకు సగటున రూ.33 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతీ నెలా ఆయా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లలోని అధికారులు దుకాణాలు తనిఖీలు చేసి, అక్కడ ఉన్న ఏదో ఒక మద్యాన్ని తీసుకుని, వాటి నాణ్యత పరీక్షించడానికి ల్యాబ్కు పంపడం వారి విధినిర్వహణలో భాగంగా జరుగుతోంది. కానీ ఎకై ్సజ్ అధికారులు శ్యాంపిల్స్ సేకరించే ప్రక్రియ ఓ యాంత్రికంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా రూ.99 మద్యం తీసుకుని.. రూ.300 ధర ఉన్న బాటిళ్లల్లో పోసి, విక్రయిస్తున్నారని పలువురు మద్యం ప్రియులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ షాక్తో ఆవు మృతి
చౌడేపల్లె: విధ్యుతాఘాతానికి గురై ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రైతు మోహన్నాయుడు తన ఆవును మేత కోసం గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి తోలుకెళ్లాడు. అక్కడ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన కొయ్యలు విరిగి కింద పడడంతో ఆ వైర్లు తగిలి షాక్కు గురై ఆవు మృతిచెందింది. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..! బంగారుపాళెం: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. సీఐ శ్రీనివాసులు కథనం.. తిరుపతి జిల్లా, బైరాగిపట్టెడకు చెందిన వడ్డె రాజరాజు సమీప బంధువు వి కోటలో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం నాగరాజు అతని అన్నకుమారుడు మణికంఠతో కలసి ద్విచక్ర వాహనం(స్కూటీ)పై వెళ్లారు. ఆపై అంత్యక్రియలు ముగి సిన తరువాత స్కూటీపై తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో మండలంలోని నలగాంపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున నాగరాజు(55) నిద్రమత్తులో కింద పడ్డాడు. తలకు బ లమైన గాయం తగలడంతో మృతి చెందాడు. చలి మంటలో పడిన వృద్ధుడి మృతి రొంపిచెర్ల: చలిమంటలో పడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని బండ మీదపల్లెకు చెందిన మునిశేఖర్ (64) ఈ నెల 2వ తేదీన మద్యం సేవించి వీధిలో వేసిన చలి మంటలో చలి కాచుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మూడు దుకాణాల్లో చోరీ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మూడు దుకాణాల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. కట్టమంచిలోని ఓ ద్విచక్ర వాహన షోరూమ్, సూపర్ మార్కెట్, సిమెంటు దుకాణాల్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. దాదాపు రూ.50 వేల వరకు నగదు చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తప్పుడు సాక్ష్యంపై విచారణ చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్యల కేసులో న్యాయ స్థానంలో తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసు విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తూ చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు – ప్రత్యేక మహిళా కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. కేసు విచారణలో భాగంగా తప్పుడు సాక్ష్యం చెప్పిన ఘటనలో 14 మంది శుక్రవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. వీళ్లల్లో ఏడుగురు రాత పూర్వక సంజాయిషీని న్యాయమూర్తికి అందించారు. మరో ఏడుగురు కొంత సమయం అడగడంతో వచ్చే నెల 2వ తేదీ వరకు సమయమిస్తూ, అదే రోజు కేసు విచారణ చేయనున్నట్లు ప్రకటించారు. సాఫ్ట్బాల్ పోటీలకు ప్రకాష్ ఐరాల: జాతీయస్థాయి సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ పోటీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రకాష్ ఎంపికై నట్లు హెచ్ఎం వాసుదేవన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రకాష్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు వెల్లడించారు. పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉంది. దీనిపై ఈ నెల 16న పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా స్కూటరిస్ట్ అడ్రస్ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురూ స్కూటర్ వద్ద దొరికిన ఆధార్కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్ షాపులో హెల్పర్గా పనిచేసేవాడు. ఈ నెల 15 రాత్రి వెల్డింగ్ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలు దేరాడు. -
ఐదుగురి అరెస్ట్
బంగారుపాళెం: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శుక్రవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కాటప్పగారిపల్లె వద్ద అక్టోబర్ 15న జాతీయ రహదారిపై కారు (కేఏ05 ఎండీ4456)వేగంగా వెళ్తు డివైడర్ను ఢీకొని రైట్ సైడ్లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారునిపైకి దూసుకెళ్లింది. ఆపై రహదరి పక్కన కాలువళక్ష బోల్తాపడింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్, కారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. కారును పరిశీలించగా అందులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో చిత్తూరు గ్రీమ్స్పేటకు చెందిన రాజశేఖర్(33), నవీన్(34), రాకేష్(30), పునీత్కుమార్(24), ముఖేష్(22)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. చిత్తూరు టౌన్కు చెందిన ఆరీఫ్, కర్ణాటక రాష్ట్రం కటికినహళ్లికి చెందిన సయ్యద్ఫైరోజ్, తిరువణ్ణామలై జిల్లా జమునముత్తూరుకు చెందిన అజిత్, గోవింద్ను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు రాజుపల్లె విద్యార్థి పెద్దపంజాణి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అండర్–14 విభాగంలో మండలంలోని రాజుపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.చరణ్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు జనార్ధనరెడ్డి తెలిపారు. శుక్రవారం విద్యార్థికి అభినందనలు తెలిపారు. పీడీ దొరై పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పచ్చికాపల్లం విద్యార్థులు వెదురుకుప్పం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు హిమజ, పూజిత, హేమంత్, మోక్షిత్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ దామోదరం, పాఠశాల కమిటీ చైర్మన్ చెంగల్రాయులు, పీడీ చెన్నకేశవులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: పురోగమిస్తున్న విజ్ఞానశాస్త్ర అభివృద్దిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజానికి అవసరమైన కొత్త ఆవిష్కరణలు తయారుచేసే విధంగా ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎంపికై న వారు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. చుడా చైర్పర్సన్ హేమలతో, జిల్లా సైన్స్ అధికారి అరుణ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి తొమ్మిది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. -
ఆర్థిక సంఘం నిధులు విడుదల
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాకు రూ.28.52 కోట్లు రాగా 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించారు. జిల్లాలో 696 గ్రామ పంచాయతీలుండగా వాటిలో పలు కారణాలతో 13 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 683 పంచాయతీలకు నిధులను జమచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మొదట ఆన్టైడ్ కింద రూ.11.4 కోట్లు, టైడ్ నిధి కింద రూ.17.11 కోట్లు కలిపి మొత్తం రూ.28.52 కోట్లను విడు దల చేశారు. వీటిని పంచాయతీల్లో విద్యుత్ చార్జీలు, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శ్మశానవాటికల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఆ లెక్చరర్ను సస్పెండ్ చేయండి కార్వేటినగరం: డైట్ కళాఽశాలలో పనిచేస్తున్న ఆ లెక్చరర్ను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. డైట్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సురేష్ కొంతమంది లెక్చరర్లతో గ్రూపులు కట్టి లైంగికంగా వేధిస్తున్నారని, దసరా సెలవులకు ముందు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా మెసేజీలు పెట్టి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్టు ప్రిన్సిపల్కు లిఖిత పూర్వకంగా ఫి ర్యాదు చేశారు. పలు మార్లు తీరు మార్చుకోవా లని ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ప్రిన్సిపల్ వరలక్ష్మి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఆ మేరకు సురేష్ ను డైట్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయా లని ఆదేశించారు. రిలీవ్ చేసి సస్పెండ్ చేయా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డొంక కదులుతోంది! – అవినీతి కేసులో సర్వేయర్, వీఆర్ఓ పుంగనూరు: స్థానిక గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములు రూ.20 వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో తాజాగా మండల సర్వేయర్తో పాటు ఆ గ్రామ వీఆర్ఓపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. రెండవ రోజు కూడా ఏసీబీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. మండల సర్వేయర్, వీఆర్ఓను విచారణకు రావాలని ఆదేశించగా.. వారు రాకపోవడంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్, సర్వేయర్ ఇద్దరూ సెలవులో వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలను సరికొత్త సంస్కరణలతో నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని ఇంటర్ బోర్డు ఈఆర్టీడబ్ల్యూ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణుక్యుడు తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలను కొత్త సంస్కరణలతో నిర్వహించనుందన్నారు. గురువారం అధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్తో స్థానిక విజయం ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రామాణిక విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇన్విజలేటర్లు, పర్యవేక్షక సిబ్బంది, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. డీఐఈఓ రఘుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, పారదర్శకంగా పరీక్షలు రాసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక ఐరాల: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలని ఆర్జేడీ శ్యామూల్ ఆదేశించారు. గురువారం మండలంలోని ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూల్ను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యస సామర్థ్యాలపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వంద రోజల ప్రణాళికతో పాటు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నపత్రాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతి రోజూ ఓ పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించాలని, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించాలని ఆదేశించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం వైస్.గేటులోని ప్రాథమిక పాఠశాలకు కేంద్ర విద్యాశాఖ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) రావడంతో పాఠశాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈఓ–2 భానుప్రసాద్, ఏసీఎంఓ మధుసూదన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా మెరిట్ లిస్ట్?
కాణిపాకం: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతుల్లేకుండా ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి జిల్లా అధికారులు దరఖాస్తులు ఆహ్వనించారు. ఆపై స్క్రూట్నీ ప్రక్రియ తర్జన భర్జన నడుమ సాగించారు. తీరా కొన్ని పోస్టులకు మాత్రమే రాష్ట్ర శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ గుట్టుగా జరిపిస్తున్నారు. ప్రొవిజన్ల్ మెరిట్లిస్టు జాబితాను ఆన్లైన్లో గోప్యంగా ఉంచారు. ఫైనల్ మెరిట్ లిస్టును గురువారం రాత్రికి పూర్తి చేశారు. ఆ ఫైల్ను శుక్రవారం కలెక్టర్ ముందు ఉంచనున్నారు. ఈ భర్తీపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఎన్హెచ్ఎం పోస్టులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్టోబర్లో దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్ ఆఫీసర్ 13 పోస్టులు, స్టాఫ్ నర్సు 20 పోస్టులు, ఫైన్సాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ –1, ల్యాబ్ టెక్నీషియన్ –3, ఫిజియోథెరపిస్ట్– 1, ఆడియో మెట్రిషియన్– 2, శానిటరీ అటెండర్– 2, సపోర్టింగ్ స్టాఫ్– 4, సెక్యూరిటీ గార్డు –2, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్– 8 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గాను మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చాయి. గోప్యమెందుకో? వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నెల రోజులపాటు స్క్రూట్నీ చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు స్క్రూట్నీ ప్రక్రియను ముగించారు. 9వ తేదీ రాత్రి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ఆన్లైన్లో పెట్టారు. అయితే ఆ జాబితాను బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. మీడియా, ఆ శాఖలోని పలువురు అధికారులకు కూడా తెలియకుండా ప్రొవిజనల్ మెరిట్లిస్టును నడిపించారు. ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరణ చేయగా.. 18వ తేదీ రాత్రికి ఫైనల్ మెరిట్ లిస్టు సిద్ధం చేశారు. శుక్రవారం ఈ ఫైల్ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రొవిజన్ మెరిట్ లిస్టు ఆన్లైన్లో ఉంచిన విషయాన్ని గుర్తించలేకపోయామని పలువురు అభ్యర్థులు మదన పడుతున్నారు. పత్రిక ప్రకటన లేకుండా ఆన్లైన్లో ఎలా ఉంచారని వారు ప్రశ్నిస్తున్నారు. సిఫార్సు లేఖలకు తలొంచారా? ఎన్హెచ్ఎం పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం నుంచి సిఫార్సు లేఖలు 500పైగా సిఫార్సు లేఖలు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లేఖలకు అధికారులు తలొంచారా.. లేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. రెండు జిల్లాల్లో ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిజమైతే పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలున్నాయి.జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అభ్యర్థుల్లో అనుమానాలు పోస్టుల భర్తీ విషయంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్ర శాఖ అనుమతి తీసుకోలేదు. దరఖాస్తులు ఆహ్వానించిన విషయం పై అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఆపై ఫైల్ను తీసుకుని విజయవాడకు పరుగులు పెట్టారు. జిల్లా అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. చాలా పోస్టుల భర్తీపై కోతలు పెట్టారు. కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతులిచ్చారు. ఆ పెండింగ్ వివరాలను కూడా శాఖ అధికారులు ఇంతవరకు బయట పెట్టలేదు. కోటి ఆశాలతో దరఖాస్తు చేసుకుంటే.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
చట్టాన్ని వినియోగించుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్: వినియోగదారులు హక్కు ల పరిరక్షణ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. గురువారం నగరంలోని ఎన్పీఎస్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర, పరిష్కారం’ అంశంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ నష్టం జరిగినప్పుడు నేరుగా వినియోగదారుడే రూ.5లక్షల వరకు ఫీజు లేకుండా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చనన్నారు. నాణ్యత ప్రమాణాలులేని వస్తువులు, సేవా సంస్థల లోపంతో నష్టం వాటిలినప్పుడు ప్రశ్నించేతత్వం ఉండాలని ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఉషాదేవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019 విశిష్టమైందన్నారు. ఆన్లైన్ వ్యాపారంలో కూడా నష్టం జరుగుతోందని, వాటి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, కళాశాల వినియోగదారుల క్లబ్ కో–ఆర్డినేటర్ రమాదేవి, ఫోరం సభ్యుడు సలీం పాల్గొన్నారు. -
సమరశంఖమై!
సంతకమే.. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. అన్ని వర్గాలతో పాటు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులే దాదాపు... లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కారుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన కూటమి సర్కార్పై సమరశంకం పూరించారు. వైద్య విద్యను గ్రామీణ, పట్టణ, పేద విద్యా ర్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర చేపన్నుతున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన వెల్లువ పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. అప్పట్లోనే వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు వెచ్చించారు. అందులో మూడు వేల కోట్ల మేర ఖర్చుచేసి ఐదు మెడికల్ కళాశాలను ప్రారంభించారు. వందల సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రారంభమైన కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్నారు. మరో 12 వైద్య కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావొచ్చాయి. అయితే చంద్రబాబు సర్కారు వాటి నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా పీపీపీకి మొగ్గు చూపుతోంది. పీపీపీ విధానంతో ప్రైవేట్కు అప్పగించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విధానాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైద్య సీట్లు వద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడంపై భగ్గుమంటోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని పెదవి విరుస్తోంది. -
విధులకెళ్లి.. విగత జీవివయ్యావా తల్లీ!
పూతలపట్టు( యాదమరి): ‘పండు..డ్యూటీకి వెళ్తున్నా.. రేపు ఇంటికి రాగానే చిత్తూరులో షాపింగ్కు వెళ్దాం. అక్కడ నీకేమి కావాలో తీసిస్తా..’ అని చెప్పి విధులకు వెళ్లావు కదమ్మా.. ఇప్పుడు విగత జీవిగా మారావా తల్లీ అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు .. పెనుమూరు మండలం, గుత్తావాండ్ల వూరు గ్రామానికి చెందిన వెంకటేష్నాయుడు భార్య గాయత్రి(30) పూతలపట్టు మండలం, పేటమిట్టలో ఓ కర్మాగారంలో విధులు నిర్వర్తిస్తోంది. బుధవారం యథావిధిగా విధులకు హాజరైంది. రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తన సహచర ఉద్యోగినులతో పాటు స్వగ్రామానికి బయల్దేరింది. రంగంపేట క్రాస్ వద్ద పీలేరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐషర్ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న గాయత్రితో పాటు.. మౌనిక, జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు గాయత్రి మార్గమధ్యంలో మృతి చెందింది. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూతలపట్టు సీఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. కుటుంబ పోషణ కోసం విధులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా.. అమ్మా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ప్రజలు క్షమించరు బాబూ!
చిత్తూరు రూరల్(కాణిపాకం): మెడికల్ కళాశాలలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు క్షమించరని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలను రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలంన్నిటినీ నిర్వహిస్తామని మంగళగిరి పాద యాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజారోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని పది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం జీ.వో నెంబర్ 590ని జారీ చేసినట్టు తెలిపారు. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. నాయకులు గోపీనాథ్, మణి, దాసరి, చంద్ర, విజయగౌరీ, రమాదేవి, పెద్దరెడ్డి కవిత, జబిలబి, కుమారి, కోమల, బాలాజీరావు, లతారెడ్డి, గుర్రప్ప, రఘు, మునిరత్నం ఫైరోజ్, ప్రవీణ్కుమార్, వసంత్, రమ్య, చైతన్యశ్రీ, భార్గవ్ పాల్గొన్నారు. -
అవగాహన లోపం.. ప్రజలకు కన్నీటి శాపం!
నక్కబండలో తాగునీటికి కటకట పుంగనూరు: అధికారుల అలసత్వం కారణంగా పది రోజులుగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సి వస్తోంది. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని నక్కబండ ఏరియాలో 1,550 కుటుంబాలున్నాయి. ఇక్కడ పైపులైన్ల మరమ్మతుల పేరుతో పబ్లిక్ కొళాయిలను పెరికేశారు. డబ్బు కడితేనే కొళాయిలు వేస్తామంటూ మున్సిపల్ అధికారులు, కొంత మంది చోటీ టీడీపీ తెగేసి చెబుతున్నారు. దీంతో స్థానికులు పది రోజులుగా సరిపడా నీళ్లులేక అల్లాడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంతమాత్రం ఆలోచించలేరా? మండల పరిధిలోని నక్కబండను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి చేర్పించారు. 1,550 కుటుంబాలు కలిగిన నక్కబండలో ముస్లిం మైనార్టీలు, దళితులు అధి క సంఖ్యలో నివాసం ఉన్నారు. ఆ ప్రాంతంలో మంచినీటి సర ఫరా ఇబ్బందిగా ఉందంటూ ప్రజలు పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం నక్కబండలోని అన్ని పైపులైన్లను జేసీబీలతో తొలగించారు. కొత్త పైపులైన్లు వేసే కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలేదు. అన్ని వీధుల్లోని పైపులైన్లు, పబ్లిక్ కొళాయిలు పెరికివేశారు. దీంతో నీటి సమస్య తలెత్తింది. డబ్బు కడితేనే కనెక్షన్ మున్సిపల్ అధికారులు కొళాయి కనెక్షన్కు ఒక్కొక్కరూ రూ.7,500 చెల్లించాలని, లేకపోతే మంచినీటి సరఫరా చేయలేమని తెగేసి చెప్పారు. తాము కూలీలమని, బీపీఎల్ పథకం కింద రూ.500 చెల్లిస్తామని చెప్పినా అధికారులకు మనసు కరగలేదు. దీని కారణంగా పది రోజులుగా ఆ ప్రాంతంలో మంచినీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ అభిమానులకు ఇబ్బందులు నక్కబండ ప్రాంతంలో ముస్లిం, మైనారిటీలు, దళితుల్లో ఎక్కువభాగం వైఎస్సార్సీపీ అభిమానులే. మున్సిపల్ అధికారులు కావాలనే నక్కబండ వాసులను వేధిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పబ్లిక్ కొళాయిలను కూడా పెరికివేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం, ఆ ప్రాంత వాసుల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. టీడీపీ చోటా నేతల దంద నక్కబండ ప్రాంతంలో ఓ టీడీపీ చోటా నాయకుడు దంద చేస్తున్నాడని, ఇద్దరు ఫిట్టర్లను నియమించి, వారి వద్ద నుంచి ఇంటికి రూ.100 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ చర్చలు నక్కబండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఏర్పడడంతో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా గురువారం కమిషనర్ మధుసూదన్రెడ్డితో పాటు ఆ ప్రాంత వాసులతో సమావేశమయ్యారు. అక్కడ ఉన్న పేదకూలీలందరికీ రూ.500తో కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ అధికారుల ఓవర్ యాక్షన్ కారణంగా వందలాది కుటుంబాలకు తాగునీటి సమస్య ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. -
● కూలుస్తూ..తొలగిస్తూ!
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముందస్తు నోటీసులు ఇచ్చిన విగ్రహాలు, ఆలయాలతో పాటు పలు కట్టడాల తొలగింపును గురువారం నుంచి అధికారులు ప్రారంభించారు. తహసీల్దార్ రవికుమార్, సీఐ మల్లికార్జున్, జాతీయ రహదారి అధికారులు పోలీసు బలగాలతో ఉదయం నుంచే తొలగింపు పనులు ప్రారంభించారు. నేత్రదేవత ఆలయ ఆర్చి, కాకవేడు కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రహరీగోడ, వీకేఆర్ పురం వద్ద గల ఓంశక్తి ఆలయ ప్రహరీ, నత్తం కండ్రి వద్ద గల శక్తి ఆలయ ప్రహరీలు, బస్ షెల్టర్లను ప్రొకై ్లన్లు, హిటాచీలు, క్రేన్ల సాయంతో తొలగించేశారు. కీళపట్టు వద్ద ఉన్న ఆంజేయ స్వామి ఆలయ తొలగింపులో నిర్వాహకులు ఆలయంలోని వస్తువులు పూర్తిగా తీసుకోలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని, భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలాగే పెకళించి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని తహసీల్దార్కు విన్నవించుకున్నారు. దీంతో వారికి నాలుగు రోజుల సమయం కేటాయించారు. మిగిలిన నిర్మాణాల తొలగింపును జాతీయరహదారి అధికారులు చకచకా కానిచ్చేశారు. – నగరి -
నా ప్రాణం పోయినా.. పది మందీ బతకాలి!
● శ్రీనివాస్రెడ్డి అవయవదానం ● పలువురికి పునర్జన్మ వి.కోట: ‘నా ప్రాణం పోయినా పది మందీ బతకాలి’ అన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్లాడు. అందుకే బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుఒడికి చేరినా.. ఆయన కుటుంబ సభ్యులు తన అడుగు జాడల్లోనే నడిచి పదుగురికి పునర్జన్మనిచ్చారు. వివరాలు.. మండలంలోని కొంగాటం పంచాయతీ, చింతల ఎల్లాగరానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రతాప్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి(61) ఈ నెల 15వ తేదీ రాత్రి బైక్ పై వెళుతూ రాజపేటరోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. బెంగళూరులోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్డెడ్కు గురయ్యాడు. కుటుంబ సభ్యలు గురువారం బెంగళూరుకు చేరుకుని శ్రీనివాసులు రెడ్డికి చెందిన గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు, పాంకియాట్రీస్ను ఇతరులకు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇతని అంత్యక్రియలు శుక్రవారం మండలంలోని చింతఎల్లాగరంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఎందుకు గైర్హాజరవుతున్నారు? చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు దాదాపు వెయ్యి మందికిపైగా క్లాసులకు గైర్హాజరవుతున్నారని, వారు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలని హెచ్ఎంలను డీఈఓ రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదోతరగతి విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించగా సీ, డీ గ్రూపు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు 15,239 మంది ఉండగా 1,477 మంది గైర్హాజరవుతున్నారన్నారు. వీరందరూ ఎందుకు పాఠశాలలకు హాజరు కావడంలేదని సంబంధిత హెచ్ఎంలను ప్రశ్నించామన్నారు. వీరిలో ఎక్కువగా తవణంపల్లె, పూతలపట్టు, పలమనేరు ఇతర మండలాల వారు ఉన్నారన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకోవాలని ఆదేశించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి పెనుమూరు(కార్వేటినగరం): పదో తరగతిలో వంద శాతం పలితాలు సాధించేలా విద్యాబోధన కొనగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం పెనుమూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, గుడ్యానంపల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు అద్యధిక మార్కులతో వంద శాతం ఫలితాలు సాఽధించేలా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదే విదంగా ఎమ్మార్సీకి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. కొనసాగుతున్న టెట్ చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో టెట్ పరీక్షలు 9వ రోజు కొనగాయి. గురువారం ఉదయం 250 మందికి గాను 242 మంది, మధాహ్నం 85 మందికిగాను 68 మంది హాజరైనట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. -
బెల్టుషాప్పై దాడి
శ్రీరంగరాజుపురం: మండలంలోని కొత్తపల్లిమిట్ట ప్రాంతంలో ఉన్న బెల్టుషాపుపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 42 మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. బెల్టుషాపు నిర్వహిస్తున్న భారతి అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. విద్యుద్దీపాల కోసం రూ.8 లక్షలు గుడిపాల: చిత్తూరు–వేలూరు రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు నుంచి తమిళనాడు సరిహద్దు గొల్లమడుగు వరకు రోడ్డు పక్కన విద్యుత్ దీపాలు వేయడానికి కలెక్టర్ రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్బాబు తెలిపారు. గురువారం ఆ రహదారిని ఆయన పంచాయతీరాజ్ ఈఈతో చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.8 లక్షలు మంజూరు చేశారన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 50 వీధిలైట్లు అవసరమవుతాయన్నారు. పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్నాయుడు, ఎంపీడీఓ శిరీషా తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్: విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యమని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. బుధవారం నగరంలోని వల్లియప్ప నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థి దశలో సేవాభావంతో పనిచేసే ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వెల్లడించారు. ఎన్ఎస్ఎస్వలంటీర్లు క్రమశిక్షణతో వారం రోజులపాటు స్పెషల్ క్యాంపులో పాల్గొని సేవలందించాలన్నారు. విభిన్న అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్పెషల్ క్యాంపులతో విద్యార్థులల్లో సమైక్యత భావం వస్తుందని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షమ్స్ అక్తర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి పాల్గొన్నారు. పసి పిల్లలపై లైంగిక దాడులు బాధాకరం యాదమరి: పసి పిల్లలపై లైంగిక దాడులు జరుగుతుండటం అత్యంత బాధాకరమని జిల్లా న్యాయ సహకార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు మహిళల చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..ప్రస్తుతం రోజురోజుకూ మహిళలు, బాలికలపై హింస, వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. చదువుకోవాల్సిన వయస్సులో తల్లిదండ్రులు బాల్య వివాహాలు జరిపిస్తున్నారని, దీని కారణంగా వారి ఆరోగ్యంతో పాటు బంగారు భవిష్యత్తును మొగ్గలోనే చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలకు భద్రత కల్పించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరేంద్ర, ఏపీఎం ఈశ్వరి, నాయకులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ఉడిపి మఠం పీఠాధిపతి తిరుమల: తిరుమలలోని శ్రీవారి బుధవారం ఉడిపిలోని సోడే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడీ ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, పోటు పేస్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
తవణంపల్లె : విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ ఆకాక్షించారు. బుధవారం మండలంలోని అరగొండ బాలుర హైస్కూల్లో మండల స్థాయి విజ్ఞాన మేళా ప్రదర్శన ( సెన్స్ ఫెయిర్) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. మండలంలోని ఆరు ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులు తయారు చేసిన సెన్స్ ప్రయోగాలను డీఈఓ రాజేంద్రప్రసాద్, ఎంఈఓలు హేమలత, మోహన్రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సెన్స్ ప్రయోగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఏడు టీములను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎంఈఓ హేమలత తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల సెన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సృజనకు పదునుపెట్టాలి బంగారుపాళెం : సృజనాత్మక ఆలోచన పెంపొందించుకునేందుకు ‘విద్య వైజ్ఞానిక ప్రదర్శన’లు గొప్ప వేదికలని ఎంఈఓ రమేష్బాబు అన్నారు. బుధవారం బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని 14 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 110 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు మేళాలో పాల్గొన్నారు. విద్యార్థుల విభాగంలో తుంబకుప్పం, కీరమంద, గుండ్లకట్టమంచి, మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనలతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తుంబకుప్పం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజేంద్రన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
వెదురుకుప్పం: మండలంలోని పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్లో అండర్–14 జిల్లా స్థాయి బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ దామోదరం తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. కాగా బాలిక విభాగం నుంచి ఢిల్లీకళ్యాణి, దీపిక(నాగరాజకుప్పం), హిమజ, పూజిత(పచ్చికాపల్లం), జనని(తిరుమలయ్యపల్లె), జూలీ(జంబాడ), లక్ష్మీప్రియ( శ్రీకాళహస్తి), తేజస్విని(మంగళంట్రెండ్స్), రకియెకసూర్(మదనపల్లె), హేమ(మునగలపాళెం), బాలుర విభాగంలో... లక్ష్మీనరసింహారెడ్డి(నగరి), దిలీప్ (శ్రీకాళహస్తి), వెంకట్, మహేష్ (జంబాడ), పార్థీవ్ (శ్రీకాహస్తి), నితీన్ (జంబాడ), చరణ్(నాగరాజుకుప్పం), భరత్(శ్రీకాళహస్తి), హేమంత్(పచ్చికాపల్లం), అయాన్(బైరెడ్డిపల్లె) ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు త్వరలో జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎంపిక పోటీలు చెన్నకేశవులు, అన్సర్ బాషా, గోపి, లోకేష్, త్రిలోకసుందరి, జయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న విద్యార్థులకు ఎంఈఓ దామోదరం, ప్రధానోపాధ్యాయులు అశోక్ అభినందనలు తెలియజేశారు. -
అవినీతి తిమింగలాలు
పుంగనూరు: పుంగనూరు రెవెన్యూలో అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. 20 సెంట్ల భూమి సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.35 వేలు ఒప్పందం చేసుకుని, రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా గ్రామ సచివాలయ సర్వేయర్ను ఏసీబీ పట్టుకుంది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి కథనం.. మండలంలోని మంగళం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములును అదే గ్రామానికి చెందిన రైతు ఉమాశంకర్ 20 సెంట్ల పొలాన్ని సర్వేచేసి, సర్టిఫికెట్ ఇవ్వమని కోరారు. దీనిపై సర్వేయర్ రూ.50 వేలు ఇస్తే సర్వేచేసి, రెవెన్యూ సర్టిఫికెట్ ఇస్తామని, లేకపోతే చేసేది లేదని తెగేసి చెప్పాడు. అంత డబ్బు ఇవ్వలేనని రైతు ఉమాశంకర్ చెప్పాడు. పలు మార్లు రెవెన్యూ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఎలాగైన రెవెన్యూ అధికారుల అవినీతిని బయటపెట్టాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతు ఉమాశంకర్ సర్వేయర్ వద్దకు వెళ్లి రూ.35 వేలకు బేరం కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు ఉమాశంకర్ తహసీల్దార్ కార్యాలయంలో రూ.20 వేలు సర్వేయర్ శ్రీరాములుకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పలురకాల ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా సర్టిఫికెట్లను జారీచేసే అధికారం తహసీల్దాకు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయ అధికారులు కలసి సర్వేయర్ శ్రీరాములుతో ఈ పని చేయిస్తున్నారా?..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్పేలోనే నేరుగా లంచాలు రైతులను బహిరంగంగా లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలోనే లంచాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఈ మేరకు పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే కోణంలో ఇద్దరు వీఆర్వోలు లంచాలను ఫోన్ పేలో వేసుకోగా కలెక్టర్ వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఏసీబీ దాడుల్లో సర్వేయర్ దొరకడం చర్చనీయాంశమైంది. పుంగనూరులో అవినీతి అనకొండలు పుంగనూరు రెవెన్యుశాఖలో అవినీతి తిమింగలాలు పాతుకుపోయాయి. గత ఏడేళ్ల క్రితం ఆర్ఐగా పనిచేస్తున్న ఉదయ్కుమార్ని ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే తహసీల్దార్ రెడ్డెప్పను కూడా అరెస్ట్ చేశారు. లంచాలు అడిగితే ఫిర్యాదు చేయండి పుంగనూరులోని ప్రభుత్వ అధికారులు ఎవరైన ఏ పనికై నా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి తెలిపారు. ఫిర్యాదు చేసే వ్యక్తుల పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకారం అందిస్తే ఉత్సాహంగా పనిచేసి అవినీతి అధికారుల భరతం పడుతామని తెలిపారు. అవినీతిపై 9440446190, 1064 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం
పుంగనూరు: మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంపై బుధవారం మండలంలోని వనమలదిన్నె సచివాలయంలో రైతులకు ఏఎస్ఓ అరుణ శిక్షణ ఇచ్చారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మించుకునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మల్బరీ సాగుతో సంవత్సరానికి రూ.3 లక్షలు ఆదాయం పొందవచ్చనని ఆమె పేర్కొన్నారు. రైతుల సందేహాలను ఆమె నివృత్తి చేశారు. కార్యక్రమంలో టీఏ నవీన్బాబు పాల్గొన్నారు. గుడుపల్లెలో.. గుడుపల్లె: రైతులు మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం పెంచుకోవచ్చని కుప్పం సెరికల్చర్ ఏడీ మోహన్బాబు అన్నారు. బుధవారం స్థానిక శ్రీశక్తి భవనంలో మండలంలోని రైతులకు పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్బరీ సాగు చేసే రైతులకు కావలసిన పరికరాలు, పనిముట్లతో పాటు బ్లీచింగ్, సున్నం నేత్రికలు సబ్సిడీపై ఇస్తామన్నారు. అలాగే, షెడ్డు నిర్మాణానికి, మల్బరీ మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ నిధులు ఇస్తామన్నారు.కార్యక్రమంలో నాయకులు, సెరికల్చర్ అధికారులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
కుప్పం రూరల్: జేఎన్టీయూ విశ్వవిద్యాలయం స్థాయి పోటీలకు బ్యాడ్మింటన్ జట్లను బుధవారం ఎంపిక చేసినట్లు బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు చెప్పారు. వర్సిటీ పరిధిలోని 22 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 92 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు పేర్కొనానరు. పురుషుల జట్టు కింద ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు, ఐదుగురుని స్టాండ్బైగా ఎంపిక చేసినట్లు చెప్పారు. మహిళా విభాగంలో ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు, నలుగురుని స్టాండ్ బైగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సెలెక్షన్లలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాల నుంచి ముగ్గురు ఎంపికై నట్టు పేర్కొన్నారు. ఎంపికై న ఆటగాళ్లు వచ్చే వారం జరిగే వర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వర్సిటీ పరిశీలకులు టి.నారాయాణరెడ్డి, వైస్ చైర్మన్ డా.సునీల్రాజ్, ప్రిన్సిపల్ సుధాకర్బాబు, ఫిజికల్ డైరెక్టర్ సతీష్కుమార్ పాల్గొన్నారు. -
ప్రణాళికతో చదివితే.. ‘పది’ంతల విజయం!
విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. బంగారు భవితకు పునాది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలి మెట్టు. అలాంటి పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో అధికారులు వంద శాతం ఉత్తీర్ణత సాధనకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందు కోసం జిల్లాలో 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. డిసెంబర్ నుంచి మార్చి వరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని, మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్మెంట్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా వారికి ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. రోజు వారీ ప్రత్యేక తరగతులు డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 వరకు రెమిడియల్ క్లాసులు, తరువాత 9.15 నుంచి సాయంత్ర 4 గంటల వరకు నాలుగు సబ్జెక్టుల బోధన ఉంటుంది. సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ప్రతి రోజూ ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులను ఆన్న్లైనన్ చేస్తారు. ఆ మరుసటి రోజు ముందు రోజు చదవిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలో వచ్చిన మార్కులపైన పునఃశ్చరణ తరగతులు ఉంటాయి. ఇలా ఐదు రోజులపాటు శని, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ప్రణాళిక అమలు చేస్తున్నారు. జనవరిలో కేవలం సంక్రాంతికి సంబంధించి బోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులు మినహా మిగతా రోజులు యథావిధిగా ప్రణాళిక అమలు చేయనున్నారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 380ప్రైవేట్ హైస్కూల్స్ 185మొత్తం ఉన్నత పాఠశాలలు 565పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 26,789 -
జిల్లాలో పింఛన్ల సమాచారం
దివ్యాంగుల పింఛన్లు 34,538 మొత్తం పింఛన్లు 2,68,066 చిత్తూరు: సదరం రీవెరిఫికేషన్కు వచ్చిన దివ్యాంగులు (ఫైల్)రీవెరిఫికేషన్లో అనర్హులుగా 2,000కాణిపాకం: దివ్యాంగులు సదరం స్లాట్లకు పాట్లు పడుతున్నారు. పనిచేయని సదరం పోర్టల్తో కుస్తీ పడుతున్నారు. రెండు రోజులు మాత్రమే పోర్టల్ తళుక్కుమని మాయమైంది. తర్వాత సైట్ మొరాయిస్తోంది. సచివాలయాల చుట్టూ దివ్యాంగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. స్లాట్ సతాయించడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొదటి నుంచీ వివక్షే జిల్లాలో దివ్యాంగులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారికి రీ వెరిఫికేషన్ పేరుతో కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వం, కొత్త వారికి ధ్రువపత్రాల జారీలోనూ వివక్ష చూపుతోంది. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ కోసం వైద్య పరీక్షలకు దరఖాస్తు చేసుకుందామని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళితే అక్కడి సిబ్బంది సదరం సైట్ మొరాయిస్తోందని చెబుతున్నారు. గతంలో ఆన్లైన్ చేసిన వారికి వెయిటిం గెస్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి కొందరికి పరీక్ష తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు పూర్తి స్థాయి వైకల్యం ఉండి, మంచంలోనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకూ ఆ సైట్ ఓపెన్ కాలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్కెళ్లి అర్జీలిచ్చి ఆశగా ఎదురు చూస్తున్నారు. స్లాట్ బుకింగ్ ఏదీ గత నవంబర్ 10న సదరం స్లాట్ బుకింగ్కు మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటన విడుదల చేసింది. గతనెల 14వ తేదీ నుంచి ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఓ రెండు రోజులు మాత్రం సైట్ ఓపెన్ అయ్యి.. తర్వాత మూగబోయింది. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా స్లాట్ బుకింగ్కు సుమారు 15 వేల మంది దాకా ఎదురుచూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆప్షన్ కనిపించడం లేదు దివ్యాంగుల్లో పూర్తి వైకల్యంతో మంచంపైనే ఉన్న వారికి రూ.15వేల పింఛన్ ఇస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్న వారు సందరం ద్వారా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ధ్రవ పత్రాలు తీసుకున్నారు. వాటిని మరళా అప్లోడ్చేస్తేనే పింఛన్కు అర్హత సాధిస్తారు. ఆ సైట్లో ఆ ఆప్షన్ కనిపించడం లేదని దివ్యాంగులు చెబుతున్నారు. నవంబర్ నెలంతా మొరాయించిందని వాపోయారు. డిసెంబర్ నెల వెళ్లి చూస్తే స్లాట్ ఫుల్అని చూపిస్తోందని అంటున్నారు. వేధిస్తున్నారు భార్యకు మోకాలు పగిలి పోయింది. వికలాంగులనీ చూడకుండా సదరం సర్టిఫికెట్ పేరుతో వేధిస్తున్నారు. ముందుగా చిత్తూరు నుంచి కార్వేటి నగరానికి పంపారు. ఇలా రెండు సార్లు వెళ్లాం. అక్కడ వెరిఫై చేసి మళ్లీ కార్వేటినగరానికి పంపించారు. ఇలా ఎన్నిసార్లు తిప్పుకుంటారో అర్థం కావట్లేదు. కూలి పని వదులుకొని తిరుగాల్సి వస్తోంది. వాళ్లు ఇచ్చే పెన్షన్ కోసం ఇన్ని ఇబ్బందులు అవసరమా. – వెంకటాచలం, అమ్మన్ కోయిల్ వీధి, చిత్తూరు అవస్థలు పడుతున్నాం అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు వ్యయప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక చోట సదరం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. వారంలో ఒక రోజు డాక్టర్లు వచ్చి క్యాంపునకు వచ్చే దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి అంగవైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. వారికి ఇష్టం వచ్చిన చోట సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించేవారు. నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ అక్కడికి వచ్చి సర్టిఫికెట్లు పొందేవారు. ఇప్పుడు ఇబ్బందులు పడాల్సివస్తోంది. –రఘుపతిరాజు, వైఎస్సార్టీయూ జిల్లా కార్యదర్శి, బంగారుపాళ్యంసదరంరీవెరిఫికేషన్కు వచ్చిన దివ్యాంగులు (ఫైల్)సదరం కోసం ఎదురుచూస్తున్న వారు సుమారు 15వేల మంది -
ఎనిమిది నెలలుగా..
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి విద్యార్థులు భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చిన్నదొరై. తవణంపల్లె మండలం, అరగొండ చారాలలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి గుండె పోటు రావడంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో 8 నెలల క్రితం సర్జరీ చేయించుకున్నాడు. ఇతను తాఫీ మేస్త్రి. భార్య, ముగ్గురు పిల్లలను ఉన్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయడంతో కష్టమైన పనులు చేయొద్దని డాక్టర్లు సలహాలిచ్చారు. నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రలు, మందులు కొనుగోలు చేస్తు న్నాడు. ప్రభుత్వం నుంచి వికలాంగుల సర్టిఫకెట్ కోసం సదరం స్లాట్ బుక్ చేయడానికి అరగొండ సచివాలయానికి కొన్ని నెలలుగా తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. -
కోతకు కుట్ర
చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లలో కోతపెట్టేందుకు కుట్ర పన్నుతోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దివ్యాంగులపై కత్తి పెట్టింది. బోగస్ పేరుతో వారిని తిప్పించుకుంది. రీ వెరిఫికేషన్ పేరుతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణ చేయించింది. అర్హులుగా ఉన్నవారిని కూడా అనర్హులుగా వేటు వేసింది. దీంతో వారంతా రోడెక్కారు. వీటిని కప్పి పుచ్చేందుకు మళ్లీ వెరిఫికేషన్ అంటూ ఆశజూపింది. తర్వాత సదరం స్లాట్ను తెరపైకి తీసుకొచ్చి..మాయ చేసింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల సంఖ్యను కుదించేందుకు చేస్తున్న కుట్ర అని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. -
రెండు కళ్లూ లేవు
అవినీతి తిమింగలాలు పుంగనూరులో తిష్టవేసిన అవినీతి రెవెన్యూ తిమింగలాలు పట్టుబడ్డాయి. ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ చిక్కాయి.సర్వర్ పనిచేయడం లేదంట ఈమె పేరు టి.నాగమ్మ. తడుకు ఎస్టీ కాలనీ. ఈమెకు రెండు కళ్లు లేవు. గత ప్రభుత్వంలో ఈమె వేలిముద్రలు పడకపోవడం, ఐరిష్ తీయలేక ఆధార్ కార్డు పొందకపోయింది. అప్పటి వలంటీర్ ఈమెను తీసుకెళ్లి కంటిని ఓ మేరకు తెరిపించి ఐరిష్ తీయించి ఆధార్ కార్డు వచ్చేలా చేశారు. ఆపై దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. వలంటీర్ వ్యవస్థను బాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇరుగుపొరుగు వారి సాయంతో వెళ్లి ఒకమారు సదరంలో దరఖాస్తు చేసుకుంది. అయినా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మరోమారు సదరంలో దరఖాస్తు చేసుకుందామంటే తీసుకెళ్లేవారు లేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు జీ.వెంకటప్ప. ఐరాల మండలం, గూబలవారిపల్లె. ఈయన గత ఏడాది గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. ఈయన దివ్యాంగ పింఛన్ కోసం గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం సచివాలయంలో స్లాట్ బుకింగ్ కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు. అక్కడి సిబ్బంది సర్వర్ పనిచేయడం లేదు.. రేపు రండి చూద్దాం అంటూ తిప్పి పంపిస్తున్నారు. ఏడాదిగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కాస్త ఓపిక తెచ్చుకొని సచివాలయానికి వెళ్లితే మీ ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లండి ఫోన్ చేస్తాం అంటూ సిబ్బంది తిప్పిపంపుతున్నారని వాపోతున్నాడు. -
ఐఐటీలో ఉత్కంఠగా స్పోర్ట్స్మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ సారథ్యంలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో నాలుగో రోజు బుధవారం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా ఐఐటీ రూర్కీ నిలిచింది. దీంతో వెయిట్లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. కాగా చెస్, టెన్నిస్ పోటీలు కొనసాగుతున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్గా ఐఐటీ రూర్కి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 60 కిలోల విభాగంలో మౌన్సోలిన్ నౌలక్ 189 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మొత్తం ఐదుగురు ఐఐటీ రూర్కీ క్రీడాకారులు ప్రతిభ చూపారు. అలాగే 65 కిలోల విభాగంలో ఆరుగురు, 71 కిలోల విభాగంలో ఐదుగురు, 79 కిలోల విభాగంలో ఒక్కరు, 79 ప్లస్ కిలోల విభాగంలో ఐదుగురు మొత్తం 22 మంది ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. అలాగే ఐఐటీ రోపర్ 9 మందితో రెండోస్థానం, ఐఐటీ కాన్పూర్ 8మందితో మూడో స్థానంలో నిలిచాయి. వారణాసి, బాంబే ఐఐటీల నుంచి ఐదుగురు చొప్పున, గౌహతి, ఖరగ్పూర్ ఐఐటీల నుంచి ఇద్దరు చొప్పున, మద్రాస్, గాంధీనగర్ ఐఐటీలు ఒక్కరు చొప్పున వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభను చూపారు. అలాగే 65కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి అభిషేక్కుమార్, 79 కిలోల విభాగంలో ఐఐటీ కాన్పూర్ విద్యార్థి దృవ్శెట్టి, 71 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి దాస్ అనుప్కుమార్, 60 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి మౌన్సోలిన్ నౌలక్ మొదటిస్థానాలలో నిలిచారు. చెస్లో ఐఐటీ ఖరగ్పూర్ మొదటి స్థానం చెస్ పోటీల్లో ఐఐటీ ఖరగ్పూర్ అద్భుతంగా ఆడి, 9.5 పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ కాన్పూర్ 9 పాయింట్లతో, ఐఐటీ బాంబే, వారణాసి 8 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో చేరువలోనే నువ్వానేనా? అంటూ పోటీ పడుతున్నాయి. 7.5 పాయింట్లతో మద్రాస్, ఇండోర్, గౌహతి కూడా పోటీలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది. -
జీతమో రామ‘చంద్రా’!
చిత్తూరు అర్బన్: రాష్ట్రం మొత్తంలేని సమస్య ఒక్క చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 500 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకటో తేదీన అందాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరో నెల కూడా వచ్చేస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని దిగువ మధ్యతరగతి వేతన జీవుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏం తినాలి? కార్పొరేషన్లో పనిచేస్తున్న 500 మందికి పైగా ఆప్కాస్ ఉద్యోగులకు సకాలంలో వేతనలు అందకపోవడంతో వాళ్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంట్లో తినడానికి బియ్యం లేక కొందరు, పిల్లలకు ఫీజులు, నిత్యావసర సరుకులు, ఆస్పత్రి ఖర్చులు.. ఇలా అన్నింటికీ వేతనాలపైనే ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నెలవారి వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మరికొందరు తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించకపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. కొందరు కార్మికులు ప్రజారోగ్యశాఖలోని అధికారులను దీనిపై ప్రశ్నిస్తే.. శ్రీమేం బిల్లులు పంపించేశాం. ఏదైనా ట్రెజరీలో సమస్య ఉంది. వెళ్లి వాళ్లను అడగండిశ్రీ అంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదమే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లోని ప్రజారోగ్య విభాగంలో 324 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 124, కార్యాలయం, ఇతర శాఖల్లో కలిపి మొత్తం 500 మంది వరకు కార్మికులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళారులను తీసేసి, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్స్డ్ సర్వీస్ (ఆప్కాస్) పేరిట.. నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమయ్యేలా ఓ సంస్థను రూపొందించారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆప్కాస్ను పక్కకుపెట్టి ఒక్కో ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో వేతనాలు ఇచ్చే ప్రక్రియను తీసుకొస్తోంది. దీనివల్ల మళ్లీ ఉద్యోగులు దళారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, కమీషన్ల దందా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లోని ఆప్కాస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను ఓ బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరచేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చిత్తూరు కార్పొరేషన్లో ఆప్కాస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు తెరవడంతో సిబ్బంది ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లలేదు. వేతన బిల్లులు చేసే సమయంలో ఓ బ్యాంకు ఖాతా, మరో బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్ ఉండడంతో సమస్య నెలకొంది. కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. -
ఫొటోలకు ఫోజులు..
కనిపించరా బాలకార్మికులు? చౌడేపల్లె: బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిచ్చి ఇక తమ పని అయిపోయిందంటూ లేబర్ ఇన్స్పెక్టర్ మధుబా బు, వివిధ శాఖల అధికారులు హడాహుడి చేశారు. మంగళవారం వారపు సంత కావడంతో ఆయా షాపుల వద్ద ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అధికారులందరూ ఏకమై నామమాత్రంగా టీస్టాల్స్, ఫ్యాన్సీ స్టోర్ల వద్ద బాలకార్మికులను గుర్తించినట్లు ఫొటోలకు ఫోజులిచ్చి వెనుదిరిగారు. అసలు ఆయా షాపుల వద్ద తనిఖీలకు అధికారులు రాకముందే అక్కడ పనిచేసే బాలకార్మికులను సంబంధిత యజమానులు ఇండ్లకు పంపేశారు. కొన్ని షాపుల్లో కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి వెట్టిచాకిరీ చే యిస్తున్నట్లు గుర్తించినప్పటికీ యజమానులపై చర్యలు తీసుకోలేదు. అలాంటప్పుడు తనిఖీలు ఎందుకని..మామూళ్ల కోసమేనా.. అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. -
అడవి బిడ్డల ఆవేదన!
కానరాని గిరిజన సంక్షేమ శాఖ కుప్పం: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గిరిజనులకు భద్రత కరువైయింది. కూలి పనులకు రాకపోతే పూరి గుడిసెలు తొగిస్తాం.. సాగు చేస్తున్న పంట పొలలాను రాత్రికి ర్రాతే దున్నేస్తామంటూ అగ్రవర్ణాల వారి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా పట్టించుకునేవారు లేరు. మూడు రోజలుగా కుప్పం మండల పరిధి లోని దాసేగానూరు ఎస్టీల వేధింపులపై ప్రతికల్లో కథనాలు వెలువడ్డాయి. అయినా గిరిజనులను ఆదుకునేవారు లేరు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టిటీ సైతం స్పందించకపోవడం గమనార్హం. గిరజన సంక్షేమ శాఖ జాడ ఎక్కడ? దాసేగానూరు ఎస్టీ కాలనీలో 30 గిరిజన కుటుంబాలున్నాయి. వీరి సమస్యలపై స్పందించాల్సిన గిరిజన సంక్షేమ శాఖ కుప్పంలో జాడలేదు. పట్టణానికి కూత వేట దూరంలో ఉన్న ఈ కాలనీపై భూస్వాములు వేధింపులకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయాలు పత్రికలు, సోషయల్ మిడియాలో కోడై కూస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. కుప్పం అభివృద్ధి విదేశాలకు పాకిందని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు సైతం వారికి అండగా నిలవకపోవడం విమర్శలకు తావిస్తోంది. కడా .. ఎక్కడ? కుప్పం ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ (కడా) సైతం గిరిజనల సమస్యలపై దృష్టిసారించడం లేదు. పొలాల్లో గుట్టలపై వేసుకున్న గుడిసెలను తొలగిస్తామంటూ భూస్వాములు భయాందోళనకు గురిచేస్తున్నారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు. -
లారీని ఢీకొట్టిన బస్సు
పూతలపట్టు(యాదమరి): తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ గోపి కథనం.. మంగళవారం ఉదయం వేకువజామున మండల పరిధి కిచ్చన్నగారిపల్లి గ్రామ సమీపంలో నెల్లూరు నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది. అదే సమయంలో ముందు ప్రయాణిస్తున్న లారీని అధిగమించే క్రమంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. సీఐ గోపి ఆదేశాలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని మరొక బస్సులో బెంగళూరుకు పంపేలా ఏర్పాట్లు చేశారు. -
కుప్పంలో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇవ్వండి
– రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ మిథున్రెడ్డి కుప్పం: త్వరలో విజయవాడ నుంచి బెంగళూరు రాకపోకలు సాగించే వందే భారత్ రైలుకు కుప్పంలో హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కుప్పంలో వందే భారత్ రైలు నిలపాల్సిన అవసరంపై వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ విజ్ఞప్తి మేరకు మిథున్ రెడ్డి లేఖను రైల్వే త్రికి అందజేశారు. కుప్పం నుంచి విజయవాడకు వెళ్లేందుకు వందే భారత్ రైలు ఎక్కాలంటే 200 కిలో మీటర్లు దూరంలో బెంగళూరులోని కృష్ణరాజపురం లేక తమిళనాడులో కాట్పాడి జంక్షన్లకు వెళ్లి ఎక్కాల్సి ఉంటుంది. కుప్పం ప్రజల అవపరాలకు దృష్టిలో పెట్టుకుని వందే భారత్ రైలును కుప్పంలో నిలపాలని ఆయన వినతి పత్రం అందజేసినట్లు ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ట్రయల్ రన్ గుడిపాల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ అమ్మవారి గుడిని దర్శించుకొనేందుకు రానున్నారు. తిరుపతికి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆమె విచ్చేయనున్నారు. వాతావరణం అనుకూలించక పోయినట్లయితే రోడ్డు మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తుగా రోడ్డు మార్గాన్ని డీఎస్పీ సాయినాథ్ మంగళవారం వాహనాల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి గుడిపాల మండలం మార్గం ద్వారా సీఐ శ్రీధర్నాయుడు, ఎస్ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ చేపట్టారు. 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికె ట్లు, అటెస్టడ్ కాపీలు, సర్వీసు పుస్తకం, ఆరు ఫొటో లు, రూ.100 స్టాంపు పత్రాలతో 20వ తేదీ ఉద యం 9 గంటలకు చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హాజరు కావాలని కోరారు. అదేరోజు లగేజీ సైతం తీసుకురావాలన్నారు. కానిస్టేబుల్గా ఎంపికై న 196 అభ్యర్థుల్లో పురుషులకు ఏటూరు జిల్లా లోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రంలో, మహి ళలకు ఒంగోలు పోలీసు శిక్షణా కేంద్రానికి తరలిస్తామన్నారు. తొమ్మిది నెలల పాటు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఉంటుందన్నారు. -
మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలి
పుంగనూరు: అబద్ధపు హామీలతో విద్యార్థులను మోసంచేస్తే సహించేది లేదని బాబు ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గోకుల్ సర్కిల్ వద్ద మానవహారం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరచిపోయారన్నారు. విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ 107, 108 జీవోలను రద్దు చేయకపోగా, 590 జీవో ద్వారా మెడికల్ కళాశాలలను కార్పొరేటర్లకు ధారాదత్తత చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకుని ప్రభుత్వమే బాధ్యతగా చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన సంఘాలతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ప్రవీణ్కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు మున్న, జిల్లా ఉపాధ్యక్షుడు సంజయ్, నాయకులు వసంత్అమన్, సీపీఐ నాయకులు రమణారెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సోలార్దే భవిత
చిత్తూరు కార్పొరేషన్: సోలార్ వాడకం భవిష్యత్లో పెరగనుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. మంగళవారం ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు ఉద్యోగులు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. రాష్ట్రంలో భారీగా 200 మెగా వాట్స్ పీఎం కుసుం యూనిట్ను పెడుతున్నామన్నారు. దీని ద్వారా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ఇప్పటికే రుణ సదుపాయంతో సబ్సిడీ ద్వారా పీఎం సూర్యఘర్ పథకం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివాసాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు పాటించాలన్నారు. అనంతరం ట్రాన్స్కో ప్రాజెక్టు డైరెక్టర్ అయూబ్ఖాన్ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొదుపు పాటించాలన్నారు. సోలార్ జీఎం విజయన్, ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, భాస్కర్నాయుడు, పీఓ రెడ్డెప్ప, డీఈఈలు ప్రసాద్, శేషాద్రి, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ సుమిత్కుమార్ ప్రతిజ్ఞ చేయిస్తున్న డైరెక్టర్ అయూబ్ఖాన్ -
సీకాం కళాశాలకు అరుదైన గౌరవం
తిరుపతి సిటీ: ఢిల్లీ వేదికగా విజయ్ వివస్ సందర్భంగా వెటరన్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్–2025 కార్యక్రమంలో తిరుపతి సీకాం డిగ్రీ కళాశాలకు హానర్స్ ఆఫ్ పార్టిఫికేషన్ కళాశాల అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి సంజయ్సేథ్, అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్, వెటరన్స్ ఇండియా వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బీకే మిశ్రా చేతుల మీదుగా సీకాం కళాశాలల డైరెక్టర్ టీ.ప్రణీత్ స్వరూప్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీకాం కళాశాల నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా సేవలందిస్తోందన్నారు. దీంతో ఇప్పటికే కళాశాల ప్రత్యేక హోదా సాధించిందన్నారు. దేశభక్తి, సేవారంగాలల్లో సైతం కళాశాల ముందంజలో ఉందని చెప్పారు. -
అభ్యంతరాల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల ఓటర్ల జాబితా కసరత్తులో భాగంగా వేగవంతంగా అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 203 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 16వ తేదీ నాటికి 15,75,899 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని ఈవీఎం యంత్రాల గోడౌను పరిశీలించారు. డీఆర్వో మోహన్కుమార్, పలు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఉదయ్, శ్రీనివాసులు, సురేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ -
ఆ సెక్షన్ల పనితీరు మారాల్సిందే
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలు సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ట్రాన్స్కో జిల్లా నోడల్ అధికారులు కృష్ణారెడ్డి, మురళీ హెచ్చరించారు. మంగళవారం ఎస్సీ కార్యాలయంలో క్షేత్ర స్థాయి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్శాఖ పై ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చే విధంగా నడుచుకోవాలన్నారు. అందులో భాగంగా సిబ్బంది ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వినియోగదారులు ఫోన్చేస్తే మర్యాదగా సమాధానం ఇవ్వాలన్నారు. జిల్లాలో గిరింపేట, సంతపేట, నిండ్ర సెక్షన్ల పనితీరు బాగుందన్నారు. అదే విధంగా గంగవరం, పాలసముద్రం, యాదమరి సెక్షన్ల పనితీరు అధ్వాన్నంగా ఉందన్నారు. సంస్థ జీతాలు ఇస్తోందని పనిచేయడానికని సాకులు చెప్పడానికి కాదన్నారు. విద్యుత్ సరఫరా, సిబ్బంది అందుబాటులో ఉన్నారా..? అనే అంశాల పై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుంటోదన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తే వాటిని తెలపాలన్నారు. ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
అమ్మో..చలి పులి!
సోలార్ పథకాలపై సమీక్ష చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న సోలార్ పథకాలపై ట్రాన్స్కో డైరెక్టర్ అయూబ్ఖాన్ అధికారులతో సమీక్షించారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో పలు అంశాలపై మాట్లాడారు. వ్యవసాయానికి సోలార్ ద్వారా విద్యుత్నిచ్చే పీఎం కుసుం పథకం పనులు త్వరలో ప్రారంభంకానున్నట్టు తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వాటిని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించమన్నారు. జిల్లాలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వాడుతున్న ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు ఉచితంగా సోలార్ ఫలకాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 2 సబ్స్టేషన్లు మంజూరు చేశారన్నారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సోలార్ జీఎం విజయన్, ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, శ్రీనివాసమూర్తి, భాస్కర్నాయుడు, పీఓ రెడ్డెప్ప పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం చోరీపై కేసు బంగారుపాళెం: ద్విచక్ర వాహనం చోరీపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళెం జెండా మాను వీధిలో నివాసముంటున్న రియాజ్ తన ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ ఏపీ40 డీయూ 8586)ని ఈ నెల 11వ తేదీన స్థానిక కుసుమ హోటల్ వద్ద పార్కు చేసి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కబ్జాదారునిపై ఫిర్యాదు బంగారుపాళెం: మండలంలోని మొగిలి వద్ద పాఠశాల స్థలం, శ్మశాన స్థలం కబ్జా చేసిన ఆక్రమణదారుడిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్, ప్రిన్సిపల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలోని మొగిలి ఊరగుట్ట వద్ద గిరిజన గురుకుల పాఠశాల నిర్మా ణానికి కేటాయించిన స్థలం, గిరిజనులు వినియోగించుకుంటున్న శ్మశాన స్థలాన్ని మొగిలి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదివారం ఆక్రమించుకుని చదును చేసిన విష యం తెలిసిందే. భూకబ్జాపై సోమవారం సాక్షి దినపత్రికలో శ్రీటీడీపీ నాయకుల భూకబ్జాశ్రీ శీర్షకన కథనం ప్రచురితమైంది. పాఠశాల, శ్మశాన స్థలాలను కబ్జాచేసిన మొగిలి గ్రామానికి చెందిన ఏకాంబరంనాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ షబ్బీర్బాషా, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరులో గజగజపలమనేరులో మంచు దుప్పటిపలమనేరులో పరిస్థితి ఇదీ.. -
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
చౌడేపల్లె: అతిగా మద్యం సేవించి చౌడేపల్లి మండలంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని తామరాకులకుంటకు చెందిన కుట్టి అలియాస్ బీరయ్య(31) మంగళవారం కూలి పనులతోపాటు అటవీ ఫలసాయం సేకరించి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజులుగా మేకల చిన్నేపల్లె పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించి రోడ్డు పక్కనే పడి ఉన్నాడు. మంగళవారం స్థానికుల సమాచారంతో అతని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. అతని మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. కొందరు అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మృత్యువాత పడి కుటుంబీకులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. -
చిరుత దాడిలో మేకలు మృతి
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం తిరుమణ్యం పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చిరుత దాడి చేసి నాలుగు మేకలను చంపినట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై చిరుత దాడి చేయడాన్ని గ్రామస్తులు చూసినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున శబ్దం చేయడంతో చిరుత పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారన్నారు. తిరుమణ్యం గ్రామానికి వెళ్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించినట్లు తెలిపారు. పుత్తూరు ఫారెస్ట్ అధికారులకు సైతం సమాచారం అందించారు. ఈ నెల 12న పుత్తూరు ప్రాంతంలో కనబడిన చిరుతే వడమాలపేట మండలంలోకి ప్రవేశించి ఉంటుందని, దానిని బంధించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
వెన్నుపోటు!
రైతుకుచెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తామంటూ బుకాయింపు ‘చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం’.. అంధకారంలో కార్మికుల భవితవ్యం నేటమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీలో 298 మంది ఉద్యోగులు పనిచేవారు. ఆకస్మాత్తుగా ఫ్యాక్టరీ లాక్డౌన్ ప్రకటించడంతో వారి బతుకు రోడ్డున పడింది. వారి జీతాల్లో నుంచి కోత విధించిన ప్రావిడెంట్ ఫండ్ కూడా అందలేదు. కొందరు బతుకుదెరువు కోసం ఉన్న గ్రామాన్ని వదలి సుదూర ప్రాంతాలకు వెల్లిపోయారు. ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన జీతపు బకాయిలు, పీఎఫ్, గ్రాట్యుటీల కోసం ఫ్యాక్టరీల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు. యాజమాన్యంపై కేసులు పెట్టినా ఇప్పటి వరకు సత్ఫలితాలు లేవు. రూ.15 కోట్ల మేర బకాయిలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. నగరి : జిల్లాలో చెరుకు సాగు సంక్షోభంలో పడింది. గతంలో పుంగనూరు వాణి షుగర్స్, శ్రీకాళహస్తి మయూర, నిండ్ర నేటమ్స్, నెలవాయి ఎస్ఎన్జే షుగర్స్ ప్రైవేటు పరిశ్రమలు కాగా, రేణిగుంట, చిత్తూరులో ప్రభుత్వ కర్మాగారాలు ఉండేవి. సుమారు 40 వేల ఎకరాలకు పైగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరుకు పంట సాగుచేసేవారు. ఒక్క నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోనే 14 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పంట రైతులు సాగుచేసేవారు. అన్ని పరిశ్రమలు మూతబడి కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే ఉండడంతో చక్కెర పరిశ్రమ యాజమాన్యం చెప్పిందే వేదంగా మారిపోయింది. రైతులు చెరుకు సాగుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 17వేల ఎకరాల్లో సాగులో ఉండగా నేటమ్స్ పరిధిలో 5వేల ఎకరాలకు పడిపోయింది. ఆరేళ్ల క్రితం క్రషింగ్ సీజన్లో చెరుకు తరలించుకొని రైతులకు బకాయిలు ఇవ్వక చేతులెత్తేయడంతో పలువురు తమ భూములను అమ్ముకున్నారు. తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం పడిపోయిన సాగు విస్తీర్ణం పలు ఫ్యాక్టరీలు మూతబడడం, ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వక అప్పుల పాలుచేయడం, పండించినా జిల్లాలో తరలించేందుకు ఒక్క ఫ్యాక్టరీనే ఉండడంతో రైతులు మెలమెల్లగా చెరుకు సాగుకు స్వస్తి పలుకుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో జిల్లా లో చెరుకు సాగు ఘననీయంగా తగ్గిపోయింది. -
పలమనేరులో టెన్షన్..టెన్షన్!
మళ్లీ అక్రమ నిర్మాణ రగడ! పలమనేరు: పలమనేరు పట్టణంలో మళ్లీ అక్రమ నిర్మాణ రగడ రాజుకుంది. గతంలో గుడియాత్తం మెయిన్ రోడ్డుకు ఆనుకొని స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పేరిట ఓ వ్యక్తి రస్తాపోరొంబోకులో పక్కా భవనా న్ని నిర్మించేందుకు యత్నించారు. దీన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అడ్డు కున్నారు. ఇక్కడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలువురిపై కేసులు నమోదు చేశారు. దీనిపై వారు హైకోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఇలా ఉండగా ఇదే అక్ర మ నిర్మాణాన్ని సోమవారం రాత్రి రహ స్యంగా చేపడతారనే విషయం తెలిసి మళ్లీ తాను దీన్ని అడ్డుకుంటాన్నంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ సామాజిక మాద్యమాల ద్వారా హెచ్చరించారు. దీంతో పలమనేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారుల తప్పిదాలతోనే... అధికారుల చేసిన తప్పులు ఎప్పటికై నా వారికి శాపాలుగా మారాల్సిందే. ఇప్పుడు పలమనేరు పట్టణంలో హాట్టాపిగ్ మారి న స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పీఏ అని చెప్పుకుంటున్న పార్థసారథి వ్యవహారాన్ని లోతుగా గమనిస్తే గతంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖలు చేసిన తప్పులు కనిపిస్తున్నాయి. నోరు మెదపని అధికారులు ఇలా ఉండగా మళ్లీ అక్రమ నిర్మాణం సాగుతుందనే విషయమై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. టీపీవో ఇందిర సైతం మాట్లాడలేకపోవడం కొసమెరుపు. సెంటు ఎలా పెద్దదైందో? సెంటు స్థలానికి ప్లాన్అప్రూవల్ అయ్యి ఉంటే ఇప్పుడు అక్కడ సైట్ ఎలా పెద్దదైంతో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులకే తెలియాలి. ఎప్పటికప్పుడు నిబంధనలు పాటించకుండా అధికారులు చేసిన తప్పిదాలు ఇప్పుడున్న అధికారులకు శాపాలు గా మారి అధికార పార్టీ మాట వినాలా లేకా రూల్పొజిషన్లో పోవాలా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దానికి ఎలా పట్టా ఇచ్చారు? పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో కాలే జీ సర్కిల్ వద్ద 2018లో నాటి రెవెన్యూ అధికారులు సర్వే నం.350/2లో సెంటు స్థలానికి ఓ మహిళకు సెంటు స్థలంలో పట్టా ఇచ్చారు. ఆ సర్వే నంబరులో మొత్తం వీస్తీర్ణం 5.34 సెంట్లు రస్తాపోరంబోకుగా రికార్డుల్లో ఉంది. అసలు రస్తాలో ఎలా పట్టాలిచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ స్థలం కిందనే పలు తాగునీటి పైపులైన్లు, పక్కనే ఓవర్హెడ్ ట్యాంకు, కౌండిన్య పైప్ లైన్లుంటే అప్పటి మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు ఎలా ప్లాన్ అప్రూవల్ చేశారనేది అంతుపట్టడం లేదు. ప్లాన్ అప్రూవల్ ఇచ్చినా పట్టాదారు ఎందుకు అప్పట్లోనే పక్కా నిర్మాణం చేపట్టలేదో తెలియరాలేదు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని, అధికారభయంతోనే అప్పటి అధికారులు అప్రూవల్ చేశారనే మాట వినిపిస్తోంది. దీనిపై ఇటీవల జరిగిన మున్సిపల్ మీట్లోనూ పలువురు కౌన్సిలర్లు సమస్యను లేవనెత్తారు. ఇది తప్పేనని రెవెన్యూ అధికారులు సైతం అక్కడే సెలవిచ్చారు. -
సమస్య పరిష్కరించండి
ఇంటి స్థలం సమస్యను పరిష్కరించాలని బాధిత మహిళ తులసి అధికారులను వేడుకున్నారు. ఈ మేర కు ఆమె మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసాపల్లికి చెందిన తనకు సర్వే నం.183లో ఇంటి స్థలం ఉందన్నారు. ఆ స్థలం పై వెరొకరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. తనకు న్యాయం చేయాలని చిత్తూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు చులకనగా చూస్తున్నారన్నారు. తమ గ్రామానికి చెందిన విజయకుమార్, అతని భార్య శశి, కుమారుడు జితేంద్ర పేరుతో ఈసీ వస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు మాయ చేసి వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్నారు. -
కరెంటు షాక్కుగురైన ఎస్పీడీసీఎల్ ఉద్యోగి
శాంతిపురం: మఠం పంచాయతీలోని సంతూరు వద్ద కరెంటు షాక్కు గురై ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి పురుషోత్తం తీవ్రంగా గాయడపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. దండికుప్పం పంచాయతీలోని చౌడంపల్లికి చెందిన పురుషోత్తం దండికుప్పం సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. తనకు సెలవు ఉన్న రోజుల్లో రెస్కో లైన్మెన్లు, హెల్పర్లతో కలిసి ఫీల్డ్ పనులకు వెళ్తుంటాడు. సోమవారం ఒక ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ మరమ్మత్తు కోసం రెస్కో హెల్పర్ నాగరాజు పురమాయించడంతో పురుషోత్తం ఆ పని చేసేందుకు సంతూరు వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న ఇద్దరు రైతులను ఉప్పు, బొగ్గుల కోసం ఒకరిని, బోల్టు నట్టుల కోసం మరొకరిని పురుషోత్తం పంపించాడు. నిమిషాల వ్యవధిలో బారీ శబ్దం రావడంతో ఆ రైతులు వెనక్కి తిరిగివచ్చే సరికి ట్రాన్స్ఫార్మర్పై పడి కాలుతున్న పురుషోత్తంను గుర్తించారు. తక్షణం గుండిశెట్టిపల్లి సబ్స్టేషన్కు రైతులు ఫోన్ చేసినా తీసేవారు లేరు. దీంతో తమకు తెలిసిన రెస్కో సిబ్బందికి సమాచారం ఇచ్చి, వారు సబ్స్టేషన్లోని లైన్మెన్కు తెలిపి విద్యుత్ సరఫరాను ఆపించారు. అనంతరం కాళ్లు, ఒళ్లు తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని ట్రాన్స్ఫార్మర్పై నుంచి కిందికి దింపారు. 108 అంబులెన్సు ద్వారా కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కరెంట్ షాక్తో కూలీ మృతి
గుడుపల్లె : కరెంట్ షాక్ తగిలి బాలకృష్ణ( 48) అనే కూలీ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం.. మండలంలోని చీకటిపల్లె గ్రామానికి చెందిన అనుమంతప్ప ఇంటి పక్కన రేకుల షేడ్డు వేసేందుకు అదే గ్రామానికి చెందిన బాలకృష్ణను కూలి పనులకు వెళ్లాడు. షెడ్డు పనులు చేస్తున్న సమయంలో ఇనుప పైపును షెడ్డు పైకి తీసుకుని వెళ్తుండగా పైన ఉన్న కరెంట్ తీగలకు పైపు తగిలింది. ఒక్కసారిగా బాలకృష్ణ కరెంట్ షాక్కు గురై కింద పడిపోయాడు. స్థానికులు అతన్ని కుప్పంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చట్టబద్ధంగా వెళ్లండి చిత్తూరు అర్బన్: ప్రజలకు అందుబాటులో ఉంటూ.. న్యాయం కోసం స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుపై చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 43 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు అందుకున్నారు. ఘన నివాళి చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు మహనీయుడని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ కొనియాడారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లారీని ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు – ఒకరి పరిస్థితి విషమం పుంగనూరు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మిని లారీ ఢీకొని నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని సుగాలిమిట్టవద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అశోక్ (29), శివకుమార్ (30), ప్రదీప్ (29), క్లీనర్ అస్సాం (28) కలసి పుంగునూరుకి వస్తుండగా మార్గమధ్యంలోని సుగాలిమిట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. లారీ ముందుబాగం నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రులను స్థానికులు పుంగునూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో అశోక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. -
నేడు కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు
చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు మంగళవారం విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న 196 మంది అభ్యర్థులకు బస్సుల్లో సోమవారం విజయవాడకు పంపించారు. అంతకుముందు చిత్తూరులో అభ్యర్థులతో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయని, ఈ నెలలోనే శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారన్నారు. పోలీసు ఉద్యోగానికి ఎంపికై న ప్రతీ ఒక్కరూ నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీ య స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని నీలీషా ఎంపికై నట్లు సోమవారం హెచ్ఎం రాజేంద్ర, పీడీ గిరిజ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా చిన్నతిప్పసముద్రంలో రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నీలీషా పాల్గొని ప్రతిభచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు తెలిపారు. ఈ నెల18 నుంచి 21వ తేదీ వరకు మధ్యప్రదేశ్లో జరగనున్న బాస్కట్బాల్ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థిని నీలీషాను పీడీ గిరిజతో పాటు, ఉపాధ్యాయులు అభినందించారు. రెండు బైక్లు ఢీ – ఇద్దరికి తీవ్ర గాయాలు చౌడేపల్లె: చౌడేపల్లె –తిరుపతి ప్రధాన రహదారిలోని ఆమినిగుంట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లెకు చెందిన మోహిత్(25) పెట్రోల్ బంక్ సమీపంలో గల ఓ ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్తుండగా ఎదురుగా ఆమినిగుంట వైపు నుంచి పుంగనూరు మండలం, బండ్లపల్లికి చెందిన గిరి(55) బైక్పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన గోపి , మోహిత్ -
ఆలయ భూమిని సంరక్షించండి
– ఆందోళన చేపట్టిన ఇరువారం ప్రజలు చిత్తూరు కలెక్టరేట్ : చోళ రాజుల కాలం నాటి ఆలయ భూములను కబ్జా చేస్తున్నా రని జిల్లా కేంద్రంలోని ఇరువారానికి చెందిన గుణశేఖర్, విశ్వనాథ్ ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామ ప్రజలు సోమవారం కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 20వ వార్డు ఇరువారంలో సర్వే నం.345లో 2.5 ఎకరా భూమి కాళికాదేవి ఆలయానికి సంబంధించిందన్నారు. కొందరు వ్యక్తులు ఆ భూమి ఆక్రమణకు యత్నించారన్నారు. ఎండోమెంట్, రెవెన్యూ అధికారులు ఆక్ర మణదారులకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. చోళరాజు కాలంలో ఆలయానికి భూములు ఇచ్చారని, ఆ భూము లు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆ భూములపై కన్నేశారన్నారన్నారు. ఆ భూములను పురోహితులు అనుభవించవచ్చే గానీ, అమ్మడం, లీజుకు ఇవ్వడం వంటివి చేయకూడదన్నారు. అయితే ప్రస్తుతం కొంత భూమిని లీజుకు ఇచ్చారన్నారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆలయ భూమిలో బోరు వేస్తున్నారన్నారు. ఆ భూమిని కమర్షియల్గా వినియోగించడం కుదరన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ భూమి కబ్జా కాకుండా కాపాడాలని కలెక్టర్ను కోరినట్టు వెల్లడించారు. ఇరువారం ప్రజలు జ్యోతి, కమల, దుర్గాప్రసాద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
షాట్పుట్లో ప్రతిభ
గంగాధర నెల్లూరు: జిల్లా స్థాయి పారా ఒలింపిక్స్ పోటీలలో గంగాధర =నెల్లూరు భవిత కేంద్రం విద్యార్థి మహేందర్ మొదటి బహుమతి గెలుచుకున్నట్టు ఎంఈఓలు ఆంజనేయులుశెట్టి, గుణశేఖర్రెడ్డి తెలిపారు. చిత్తూరులో ఈ నెల 12న జిల్లా స్థాయి పారాఒలింపిక్ పోటీలు నిర్వహించారన్నారు. ఇందులో స్థానిక భవిత కేంద్రంలో చదువుతున్న వేల్కూరు గ్రామానికి చెందిన బుద్ధి మాంద్యం గల ఎనిమిదో తరగతి విద్యార్థి మహీదర్ షాట్ పుట్ పోటీలో పాల్గొని మొదటి బహుమతి కై వసం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటరమణ, కో–ఆర్డినేటర్ మధు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్టు వెల్లడించారు. వైకల్యం శరీరానికే కానీ మానసిక స్థైర్యానికి కాదని మహిదర్ నిరూపించాడని ఎంఈఓ కొనియాడారు. ఐఈఆర్టీ టీచర్లు పుష్పావతి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని నినాదాలు
● కోటి సంతకాల ప్రతులతో తిరుపతిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ ● 11 నియోజక వర్గాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైద్యవిద్య ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు జనం సిరా చుక్కలే కోటి సంతకాలు రూపం దాల్చుకుని గర్జించాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులతో తిరుపతిలో చేపట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని పద్మావతిపురంలో ర్యాలీ చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఆయా నియోజక వర్గాల సమన్వయకర్తలు ఇటీవలే తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. కోటి సంతకాల ప్రతులను తిరుపతి నుంచి అమరావతికి తరలించే సందర్భంలో జిల్లా కేంద్రమైన తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపుతో పుంగనూరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. గంగాధరనెల్లూరు నుంచి మాజీ మంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. నగరి నుంచి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రగిరి నియోజక వర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి, విద్యార్థి సంఘం అధ్యక్షులు చెవిరెడ్డి హరిషత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. చిత్తూరు నియోజక వర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో తిరుపతిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఆధ్వర్యంలో పలమనేరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల్లో తిరుపతికి తరలివచ్చారు. సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. పూతలపట్టు నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చారు. కుప్పం నుంచి ఎమ్మెల్సీ, నియోజక వర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన హోరుతిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో నగరంలోని పద్మావతీపురం, శ్రీనివాసపురం ప్రాంతాలు కిటకిటలాడాయి. పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఐటీ కళాశాల వరకు, అక్కడి నుంచి తిరుపతి–తిరుచానూరు రహదారిలోని గరుడ వారధి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు, పార్టీ మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. జగనన్నకు మంచి పేరు వస్తుందనే ప్రైవేటుపరం రాష్ట్రంలో 17మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా జగనన్న 17 మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో ఐదు వాటిని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా 70శాతం పూర్తయ్యాయి. మెడికల్ కళాశాలల నిర్మాణాలతో జగనన్నకు మంచి పేరు వస్తుందన్న అసూయతో వాటిని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు పేద, మధ్య తరగతి వారికి వైద్య విద్య అందకుండా గల్లంతు చేసేందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఆయనకు ఎప్పుడూ పేదలంటేనే గిట్టదు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, పేద విద్యార్థుల ఆశలను అడియాశలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – నారాయణ స్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్లకు దారాదత్తం చంద్రబాబు నాయుడుకు పేదలంటే గిట్టదు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టడంపైనే దృష్టి పెడుతారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి రూ.వేల కోట్లు దోచేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పేద పిల్లల భవిష్యత్తును కాలరాసే కుట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో స్థాపించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద, మధ్య తరగతి వారి పిల్లల భవిష్యత్తను కాలరాసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. – భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు
పుంగనూరు: సైబర్ నేరగాళ్లు మున్సిపాలిటీలో కమిషనర్ పేరుతో పన్నులు ఫోన్పేకు పంపాలంటూ సోమవారం ఉదయం నుంచి ఫోన్లు చేయడంతో భవన యజమానులు బెంబేలెత్తిపోయారు. ఈ విషయంపై కమిషనర్ మధుసూదన్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పన్ను వసూళ్ల కోసం సచివాలయ ఉద్యోగులు, మున్సి పల్ సిబ్బంది నేరుగా సంప్రదిస్తారని, బకాయి లు మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలకు మోసపోయి, పన్నులు ఫోన్పే ద్వారా చెల్లించవద్దని, ఫోన్ రాగానే విచారించి, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని, ఎవరు మోసపోవ ద్దని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. 21న పల్స్పోలియో చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఈనెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఐఓ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవా రం పల్స్ పోలియో రూట్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా రెండు చుక్క లు వేయించాలన్నారు. ఇందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 221502 ఐదేళ్ల లోపు పిల్లలున్నారన్నారు. వీరందరికీ 14,730 వైల్స్ అవసరమవుతోందన్నారు. 142 రూట్లల్లో 5,794 బూత్ల ద్వారా పల్స్ పోలియో వేయనున్నట్టు తెలిపారు. సీడీపీఓలు, ఎంఈవోలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తారన్నారు. శిక్షణలో ఎస్ఓ జార్జ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. రైతులకు కావాల్సినంత యూరియా చిత్తూరు రూరల్ (కాణిపాకం): రబీ సీజన్కు అవసరమైన మేర యూరియా అందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. 20,183 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేశామన్నారు. గత రెండు నెలల వ్యవధిలో 4,127 మెట్రిక్ టన్నుల యూ రియా సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీలర్లు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోండి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనార్థం ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. స్వామి దర్శనంతో పాటు సేవలు, ప్రసాదం, వసతి బుకింగ్ సేవలు కూడా ఆన్లైన్ ద్వారానే పొందవచ్చన్నారు. వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చిత్తూరు కలెక్టరేట్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇందన పొదుపును పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. డీఆర్వో మోహన్కుమార్, ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో ఒక స్క్రబ్టైఫస్ కేసు కాణిపాకం: జిల్లాలో సోమవారం ఒక స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. ఐరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు స్క్రబ్ టైఫస్గా నిర్థారించారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 435 కేసులు దాటాయని అధికారులు చెబుతున్నారు. -
నోటిఫికేషన్ ఇచ్చింది వైఎస్ జగన్.. బాబు సర్కారు పెట్టిన పేరు ‘యువగళం’
– జెండా ఊపిన ఎస్పీ చిత్తూరు అర్బన్: 2022 నవంబర్లో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయించారు. 2023 జనవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేశారు. ఆపై ఎన్నికల నేపథ్యంలో మెయిన్స్ జరగలేదు. అటు తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుది పరీక్షలు నిర్వహించి ఈ ఏడాది జూన్లో ఫలితాలను విడుదల చేసింది. ఆర్నెళ్ల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు స్టైఫండ్ కూడా కోల్పోయారు. ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులకు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటించి, అభ్యర్థులందరినీ విజయవాడకు తీసుకెళ్లారు. గతంలో నారా లోకేశ్ పాద యాత్రకు ‘యువగళం’ అనే పేరుపెట్టగా..ఇప్పుడు ప్రభుత్వ కార్యాక్రమానికి కూడా అదే పేరుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
కబ్జాకు యత్నిస్తున్నారు
దేవాలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని గంగవరం మండలం, శ్రీలంక కాలనీ గ్రామ స్తులు శశికుమార్, రామారావ్ తెలిపారు. గంగవరం రెవెన్యూ దాఖలాలో ఉండే సర్వే నం.314లో 3.5 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. మండల రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గంగవరం శ్రీలంక కాలనీ గ్రామస్తులకు దేవాలం నిర్మించుకునేందుకు టీడీడీ దేవస్థానం తరఫున అనుమతి ఇచ్చారన్నారు. దేవుని స్థలాన్ని కబ్జా చేయడం దారుణమన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. గ్రామస్తులు గంగాధరం, పవన్, చందు పాల్గొన్నారు. -
చలో తిరుపతికి 150 కార్లతో ర్యాలీ
చిత్తూరు కార్పొరేషన్: పేదలను నాశనం చేసేలా చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలో సేకరించిన సంతకాల పత్రులను తిరుపతి నుంచి విజయవాడకు తరలించనున్నారు. వాటికి మద్దతుగా ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి 150 కార్లతో భారీ ర్యాలీగా చలో తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమూరు క్రాస్ వద్ద గల అయ్యప్పగార్డెన్ నుంచి ర్యాలీని విజయానందరెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి రెడ్డెప్పతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వ వెద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూడడం సరికాదని విజయానందరెడ్డి దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం నియోజవర్గంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. చిత్తూరు నుంచి 62,500 సంతకాల పత్రులను ఈనెల 10న తిరుపతిలో జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డికి అందజేసినట్లు గుర్తుచేశారు. జిల్లా నుంచి సేకరించిన సంతకాలను తిరుపతి నుంచి విజయవాడకు పంపనున్న నేపథ్యం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి ర్యాలీకి సంఘీభావంగా తిరుపతికి వెళుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపాల పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్, రూరల్ పార్టీ అధ్యక్షుడు జయపాల్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు రాహుల్రెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, హరీషారెడ్డి, మధురెడ్డి, నారాయణ, ఆను, చాన్బాషా, శివ, కృష్ణారెడ్డి, హేమారెడ్డి, శిరీష్రెడ్డి, అన్బు, లక్ష్మణస్వామి, మనోజ్రెడ్డి, ప్రసాద్రెడ్డి, అల్తాఫ్, అప్పొజీ, వెంకటేష్, శివారెడ్డి, రాంగణేష్, రజనీకాంత్, అమర్నాథరెడ్డి, త్యాగ, టిమ్ము, మధు, ప్రతిమారెడ్డి పాల్గొన్నారు. 150 కార్లతో భారీ ర్యాలీగా తిరుపతికి వెళ్తున్న నాయకులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న విజయానందరెడ్డి, రెడ్డెప్ప -
అమ్మ ఆఖరి చూపు కోసం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తల్లి ఇక లేరనే మాట విని ఆ కన్న కొడుకు గుండె బరువెక్కింది. కన్నీళ్లతో అమ్మను స్మరిస్తూ.. అమ్మ ఆఖరి చూపు కోసం కష్టాలు అన్నీఇన్ని కావు. విదేశం నుంచి స్వదేశం చేరుకోవడానికి యూఎస్లో ఫ్లైట్ టిక్కెట్ దొరకని పరిస్థితి. ఆదివారం అమ్మ కరుణతో..అధిక రేటుకు టిక్కెట్ చిక్కింది. హుటాహుటిన బయలు దేరిన ఆ కొడుకు భసవంత్రెడ్డి సొంతూరుకు చేరుకొని తల్లి శ్రీకళాదేవి మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అంత్యక్రియలు సమాప్తం.. తీర్థయాత్రలకు వెళ్లిన చిత్తూరు వాసులు పలు వురు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈక్రమంలో గిరింపేట మరాఠివీధికి చెందిన శ్రీకళాదేవి (64) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టు మార్టు గదిలో ఉంచారు. యూఎస్ నుంచి కు మారుడు భసవంత్రెడ్డి ఆదివారం ఉదయం చిత్తూరుకు చేరుకోగానే ఇంటి కి వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆపై స్వగ్రామమై న శేషాచలపురం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా మృతురాలి ఇంటి విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడికి ఓదార్పు స్వగ్రామానికి చేరుకున్న శ్రీకళాదేవి మృతదేహానికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి నివాళులర్పించి బాధితరాలు కుమారుడిని ఓదార్చారు. విదేశాల నుంచి స్వదేశం చేరుకోవడానికి పడ్డ కష్టాలను చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు విజయ్రెడ్డి తదితరులున్నారు. పలమనేరు : దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ ఉన్నత చదువుల్లో ఉండడంతో తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అవే వారి చివరి యాత్ర గా మారుతాయని అనుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన సునంద, శివశంకర్ రెడ్డి దంపతులు ఇద్దరూ అసువులు బాశారు. వీరి మృతదేహాలు శనివారం పలమనేరుకు చేరుకున్నాయి. వీరి అంత్యక్రియలు పెద్దపంజాణి మండలం లింగాపురంలో ఆదివారం నిర్వహించారు. అశ్రునయనాల మధ్య ఇద్దరినీ ఒకేచోట ఆ భార్యాభర్తలను పలమనేరు పట్టణం మీదుగా తీసుకెళ్లి పెద్దపంజాణి మండలంలోని లింగాపురంలో వారి సొంత భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ హృదయ విచారకర సంఘటన అక్కడున్న వారిని కలచివేసింది. ఇలా ఉండగా బీడీఎస్ చేస్తున్న వీరి కుమారుడు వేంకటసాయి దిక్కులేనివాడిగా మారాడు. కలిసి బతికారు.. కలిసే కన్నుమూశారు.. -
మొరవెత్తిన దేవర!
చౌడేపల్లె: పూర్వీకుల నుంచి పాటిస్తున్న ఆచారం, సంప్రదాయాలను నేటికీ చౌడేపల్లె మండలం, చారాల గ్రామంలో ఆచరిస్తున్నారు. చరిత్రలో ఎక్క డా లేని విధంగా ఆ గ్రామానికి సమీపంలో గల చారాల చెరువు మొరవ పోతే ఆ గ్రామ ఆడబిడ్డగా పేరుగాంచిన చౌడేశ్వరీదేవికి పైళ్లెన కొత్త దంపతులు తొలి సారిగా జన్మించిన బిడ్డతో కలిసి దేవర్లు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగలా జరుపుకోవడం విశేషం. దేవర చేయడానికి దేవర సామగ్రి, పొటేళ్లను చారాల గ్రామానికి వచ్చిన కోడలు ఆమె పుట్టినింటి నుంచి తీసుకురావడం విశేషం. ఎలా చేశారంటే ఆదివారం చారాల గ్రామ సమీపంలోని ఓదులపేట వద్ద గల చౌడేశ్వరీదేవి కుంట కట్ట కింద వెలసిన ఆలయం వద్ద మేళ తాళాల నడుమ గ్రామం నుంచి దేవర బుట్లతో కొత్త దంపతులు చేరుకున్నారు. ఈ చెరువు నిండి మూడేళ్లు కావడంతో ఆ గ్రామంలో మూడేళ్లలోపు పెళ్లి చేసుకున్న వారు చౌడేశ్వరీదేవికి సారెతోపాటు గంప ద్వారా దేవర చేశారు. మొక్కుబడిగా పొట్టేళ్లు సమర్పించారు. దంపతులచేత అమ్మవారికి పూజలు చేసి వారికి పుట్టిన బిడ్డలకు చెవి, ముక్కు పుడకలు కుట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడ పండుగ వాతావారణం నెలకొంది. బంధుమిత్రుల సందడి కనిపించింది. చారాల చెరువు మొరవ పోతే ..దేవర్లు చేయాల్సిందే! చెరువు నిండితేనే దేవర్లు? నా వయస్సు 85 ఏళ్లు. నాకు తెలిసినప్పటి నుంచి చెరువు నిండి మొరవ వెళ్లితేనే చౌడేశ్వరీదేవి ఆలయం వద్ద దేవర్లు చేస్తారు. ఒకసారి 11 ఏళ్లు తరువాత దేవర్లు చేశాం. ఆ సమయంలో సుమారు 52 పొటేళ్లతో ఆడ బిడ్డ చౌడేశ్వరీదేవికి మొక్కులు చెల్లించారు. ఎప్పుడు చెరువు నిండి మొరవ పోతే కొత్తగా పెళ్లయిన దంపతులు పూజలు చేయడం ఆనవాయితీ. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. – జగడం పాపిరెడ్డి, ఎరికలపల్లె, చారాల పంచాయతీ -
చంద్రబాబు ప్రభుత్వం రైతులను విస్మరించింది
నగరి: చంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తి గా విస్మరించిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వరి రైతులు నిలదీస్తే మంత్రి పార్థసారథి ప్రస్టేషన్కు వెళ్లిపోయారన్నారు. జగనన్న పాలనలో రైతుల్ని కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వారానికి ఇద్దరు రైతులు చనిపోతున్నారని గుర్తుచేశారు. 18 నెలల కాలంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక హెలి కాప్టర్లలో జల్సాలు చేస్తూ విహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరి, మామిడి, చెరు కు, ఉల్లి, పొగాకు, టమాట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తుంటే వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నా రు. రైతులకు మేలు చేయని వారు పదవుల్లో ఉండడానికి అనర్హులని వారు వెంటనే రాజీనామా చేయాలన్నారు. బోయకొండకు పోటెత్తిన భక్తులు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు దీపాలు వెలిగించి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. క్యూలెన్లలో భక్తుల రద్దీ కారణంగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొండపై చలి తీవ్రత అధికం కావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం
తిరుపతి సిటీ: భాషపై పట్టు సాఽధించి ప్రతిభకు పట్టం కట్టడమే లక్ష్యంగా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన సాక్షి స్పెల్బీకి విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం విద్యాసంస్థల్లో నిర్వహించిన స్పెల్బీ సెమీఫైనల్ పరీక్షకు విద్యార్థులు పోటెత్తారు. ఈ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వ్యాఫి, అసోసియేట్ స్పాన్సర్గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. క్వార్టర్ ఫైనల్లో ప్రతిభ చూపి సెమీస్కు చేరిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన సెమీస్కు సుమారు 500 మంది విద్యార్థులు హాజరై తమ సత్తా చాటారు. ఉదయం 10.15కి పరీక్ష ప్రారంభమైన మధ్యాహ్నం 12గంటలకు ముగిసింది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాక్షి సిబ్బంది పకడ్బందీ ఏర్పాటుల చేశారు. పిల్లలు రాణించేలా ప్రోత్సాహం ఆంగ్లంలో పిల్లల రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా గ్రూప్ స్పెల్బీ పరీక్షలు నిర్వహిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు సహకరిస్తోంది. దీంతో పదాల ఉచ్ఛారణ, కొత్త పదాలను తెలుసుకోవడం, స్పెల్లింగుపై పట్టు సాధించి పోటీ పరీక్షలకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఫైనల్కు చేరుకోవడమే లక్ష్యం సాక్షి స్పెల్బీ సెమీస్కు మా అమ్మాయి ఎంపికై ంది. ఫైనల్కు చేరుకోవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. సాక్షి స్పెల్ బీతో ఆంగ్ల భాషపై భయం అనేది పోయింది. స్పెల్ బీ కోసం సాక్షి అందించిన మెటీరియల్లో సరికొత్త పదాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రొత్సహిస్తున్న సాక్షికి ధన్యవాదాలు. – రాఘవేంద్రనాయుడు, స్వప్న, విద్యార్థిని సాయి రుషిత తల్లిదండ్రులు, నాగార్జున స్కూల్, వైఎస్సార్ కడప జిల్లా ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నాం స్పెల్బీ పరీక్షలకు హాజరై ఇప్పటే రెండు రౌండ్లలో ప్రతిభ చూపి సెమీఫైనల్కు చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీంతో ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నామనిపిస్తోంది. నూతన పదాలు, వాటి అర్థాలు, స్పెలింగ్లు తెలుసుకుంటున్నాం. దీంతో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న మా అకడమిక్ విద్యకు సైతం ఎంతో ఉపయోగపడుతోంది. – ఆరాధ్య, ప్రణవీ, సిల్వర్ ఓక్స్ స్కూల్, నెల్లూరు పోటీ ప్రపంచంలో ఉపయోగం విద్యార్థులు సాక్షి స్పెల్ బీ పరీక్షలకు హా జరుకావడంతో పోటీ ప్రపంచంలో దీటు గా నిలబడేందుకు ఉపయోగపడుతుంది. మా విద్యార్థి సెమీస్కు చేరడం అభినందనీయం.స్పెల్బీ మెటీరియల్ సైతం అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో విద్యార్థులు నూతన పదాలపై పట్టు సాధిస్తారు. ఇలాంటి పోటీ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను ప్రొత్సహిస్తున్న సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – విద్యార్థి పునీత్తో టీచర్ ప్రమీల, క్యాండర్ నేషనల్ పబ్లిక్ స్కూల్, తిరుపతి సంతోషంగా ఉంది సాక్షి స్పెల్బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లలో ఉత్తీర్ణత సాధించి సెమీస్కు చేరడం సంతోషంగా ఉంది. స్పెల్ బీ పరీక్షలో నూతన పదాల స్పెల్లింగ్స్తో పాటు పదాల ఉచ్ఛారణ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. తోటి విద్యార్థులతో పోటీ పడి పరీక్షలు రాయడంతో మాలోని ప్రతిభ, సామర్థ్యం తెలుస్తోంది. – గీతిక, జశ్విత, 5వ తరగతి, విశ్వం స్కూల్, తిరుపతిథ్రిల్లింగ్గా ఉంది సాక్షి స్పెల్బీలో పాల్గొనడంతో ఇంగ్లిషు భాషలో మా సత్తా ఎంటో తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ఉత్తీర్ణులై సెమీస్కు చేరాం. పరీక్ష బాగా రాశాం. ఎన్నో కొత్త పదాలకు స్పెల్లింగ్ రాయడం థ్రిల్లింగా ఉంది. మా ఆలోచనకు పదును పెట్టి పదాలకు స్పెల్లింగ్స్ రాస్తున్నాం. దీంతో మేము చదివే ఇంగ్లిషు సబ్జెక్ట్ సులువుగా అనిపిస్తోంది. – తమన్ కృష్ణ, హర్మన్ కృష్ణ, ఎడిఫై స్కూల్, తిరుపతి పిల్లలలో ఆసక్తి పెరుగుతోంది సాక్షి స్పెల్బీపై పిల్లల లో ఆసక్తి పెరుగుతోంది. మా అమ్మాయి ఒకటో తరగతి చదువుతోంది. స్పెల్ బీ పరీక్ష ను సునాయాసంగా రాయడం సంతోషంగా ఉంది. సెమీఫైనల్ వరకు రావడం, పరీక్షలో ఉచ్చరిస్తున్న పదాలను అర్థం చేసుకుని స్పెల్లింగ్లు రాస్తుంటే ఎంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సాక్షికి రుణపడి ఉంటాం. – రమ్య,విద్యార్థిని సాయిరుషిత తల్లి, క్యాంఫోర్డ్ స్కూల్, తిరుపతి ఎంతో ఆసక్తిగా జరిగింది సాక్షి స్పెల్ బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లు ఒక ఎత్తు. కానీ, ఆదివారం జరిగిన సెమీఫైనల్ ఎంతో ఆసక్తిగా జరి గింది. నూతన పదాలను నేర్చుకున్నాం. వాటికి స్పెల్లింగ్లు కొత్తగా ఉన్నాయి. బాగా రాశాం. ఫైనల్కు చేరుకుంటామనే నమ్మకం ఉంది. విద్యార్థులను సాక్షి మీడియా ఎంతగానో ప్రొత్సహిస్తోంది. – హర్షిత, మోనిక, 7,8వ తరగతి విద్యార్థులు, ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్, నెల్లూరు పరీక్ష బాగా రాశాం సాక్షి స్పెల్బీ సెమీఫైనల్ పరీక్ష బాగా రాశాం. చాలా ఈజీగా అనిపించింది. స్పెల్బీ మెటీరియల్ పోటీ పరీక్షలతో పాటు మా అకడమిక్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పరీక్షలు మరిన్ని సాక్షి మీడియా నిర్వహించాలి. మేము మరిన్ని పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నాం. – హుమేమ, మహి, 4వ తరగతి విద్యార్థులు, విద్యోదయ అపెక్స్ స్కూల్, నెల్లూరు భయం పోయింది గతంలో ఇంగ్లిషు భాష అంటే కాస్త జంకేవాళ్లం. సాక్షి స్పెల్బీ పోటీ పరీక్షలకు హజరుకావడంతో ఆ భయం పోయింది. ఆంగ్లభాష అంటే ఇంతేనా అని మాపై మాకు నమ్మకం కలిగింది. భాషపై పట్టుతో పాటు స్పెల్లింగ్, పదాల ఉచ్ఛారణ తెలుసుకున్నాం. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు. – చరణి, సాత్విక్, 6వతరగతి విద్యార్థులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వైఎస్సార్ కడప జిల్లా -
భూ..చిత్తు..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జింతాత..చిత..చిత..జింతాతత అంటూ ఓ తెలుగు యువత భూ మాయలొడయ్యాడు. ఊరిలో కాపుకాసి ఓ మహిళ అనుభవంలో ఉన్న భూమికి ఎసురు పెట్టించాడు. ఆ మహిళా లబోదిబోమని ఊరంతా భూ బాగోతాన్ని బహిర్గతం చేయడంతో జింతాత..చిత..చిత..జింతాతతా కథ ఊరంతా ప్రచారమైంది. బాధితుల వివరాల మేరకు ...చిత్తూరు మండలం దిగువమాసాపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు వంశపారంపర్యంగా వరించిన 5 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. పిచ్చిమొక్కలు మొలిచి ఏపుగా పెరిగింది. సెంటు రూ.2 లక్షలు పలుకుతోంది. దీనిపై తెలుగు యువతకు కన్ను పడింది. భూమిని కొట్టేయాలని ఇద్దరు టీడీపీ నాయకులను మురిపించాడు. తాచుపాముల వలే వారి వెంట పడ్డారు. అధికారుల లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఆ 5 సెంట్లను భూమిని ఏకంగా మూడు నెలలకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ స్థలంపై గతవారం బాధితురాలికి..పక్కంటివాళ్లకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇంతలోనే ఆక్రమించుకున్న యువత అక్కడి చేరుకుని..ఇది తనభూమి అని చెప్పడంతో బాధితురాలు అవాకై ్కంది. తీరా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించింది. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి సహకారంతో జరిగిందని, సర్వేయర్ రిపోర్టు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. ఈవిషయం తెలుసుకున్న బదిలీపై వెళ్లిన ఆ రెవెన్యూ అధికారి బాధితురాలిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్కు ఫిర్యాదు చేయవద్దని వేడుకుంటున్నారని, సోమవారం కచ్చితంగా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితురాలు చెబుతోంది. కాగా ఇలాంటి భూ మాయలు చాలానే జరిగాయని, అందుకే ఆ అధికారిపై బదిలీ వేటు పడిందనే విమర్శలు వస్తున్నాయి. -
వద్దురా కన్నా.. ఇది హైవేరా చిన్నా !
హైవేలో రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు, వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అవగాహన లేని డ్రైవింగ్, అతివేగం, తొందరపాటు నిర్ణయాలతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటిదే ఆదివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అంతంతమాత్రం అనుభవం ఉన్న ఓ మైనర్ బాలుడు మరో ముగ్గురిని కూర్చోబెట్టుకుని ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య ఇలాంటి ప్రయాణాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. – గుడిపాల -
అదరగొట్టిన అరగొండ ఆణిముత్యం
మన అమ్మాయే మిస్ ఆంధ్ర రన్నరప్ ● 15 ఏళ్లకే రాష్ట్ర స్థాయిలో మెరిసిన బాలిక సహస్ర తవణంపల్లె : మండలంలోని అరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ కుమార్తె సహస్ర 15 ఏళ్లకే పదో తరగతి చదువుకొంటూ.. టీనేజీ విభాగం అందాల పోటీల్లో మిస్ ఆంధ్ర రన్నరప్గా నిలిచి రాష్ట్ర స్థాయిలో అరగొండ పేరు ను నిలబెట్టింది. అరగొండకు చెందిన శ్రీధర్, భార్య పల్లవి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ బెంగుళూ రులో స్థిరపడ్డారు. తమ ఏకై క కుమార్తె సహస్ర బెంగుళూరులోని ఓర్కిడ్జ్ ఇంజర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సహస్రకు చిన్న నాటి నుంచి అందాల షోలో పాల్గొనడం, క్రికెట్తో పాటు డాన్స్పై మక్కువ. ఇంటర్ నేషనల్ స్కూల్లో అందాలు షోలు నిర్వహించి సహస్రను బాగా ప్రోత్సహించారు. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి బెంగుళూరులోని కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ స్కూల్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. డాన్స్లోనూ రాణిస్తోంది. సహస్ర అభిరుచికి అనుగుణంగా ప్రోత్సాహం ఇవ్వడంతో రాష్ట్ర స్థాయిలో మిస్ ఆంధ్ర పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది. క్రికెట్లోనూ మంచి కోచింగ్ తీసుకొని 15 సంవత్సరాలు తర్వాత జాతీయ స్థాయిలో రాణి స్తుందని తల్లిదండ్రులు ఆకాక్షించారు. ఓర్కిడ్జ్ ఇంజర్నేషనల్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు అందాల షోలు నిర్వహించి ప్రోత్సహించడం వల్లే తమ కుమార్తె సహస్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో స్థానం సంపాదించిందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పవి త్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అరగొండ పేరును రాష్ట్ర స్థాయిలో సహస్ర మారుమోగించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రతిష్టాత్మక పరీక్ష
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రతిష్టాత్మక పరీక్షగా చెప్పవచ్చు. ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం. పోటీ ప్రపంచంలో దీటుగా నిల బ డాలంటే ఆంగ్లంపై పట్టు అవసరం. ఆ దిశగా సాక్షి మీడియా విద్యార్థులను ప్రొత్సహించడం అభినందనీయం. సెమీఫైనల్కు విశ్వం విద్యాసంస్థ వేదిక కావడం గర్వంగా ఉంది. – ఎన్.విశ్వచందన్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్, విశ్వం విద్యాసంస్థలు, తిరుపతి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు సాక్షి స్పెల్బీ పరీక్షకు హాజరుకావడంతో మా అబ్బాయి ఆంగ్ల భాషపై పట్టు సాధించి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు. పదాల ఉచ్ఛారణపై పట్టు వస్తోంది. తప్పులు లేకుండా స్పెలింగ్ లు రాసేందుకు ఈ పరీక్షలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రెండు రౌండ్లలో అర్హత సాధించి మూడో రౌండ్ స్పెల్ బీ సెమీస్కు మా అబ్బాయి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. – అనిత, రెండవ తరగతి విద్యార్థి హరిన్ తల్లి, రెయిన్బో స్కూల్, నెల్లూరు -
ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇటీవల తిరుపతిలో వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో జిల్లాలోని రద్దీ ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. శనివారం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మహిళ మృతి సదుం: కారు ఢీకొన్న ప్రమాదంలో మండలానికి చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్తుల కథనం మేరకు.. మర్రిమాకులపల్లెకు చెందిన ద్వారకనాథనాయుడు భార్య వనజ (40) అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో ని కంచెవారిపల్లె వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. బలమై న గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహానికి శనివారం అత్యక్రియలు నిర్వహించారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల్లో పోటీతత్వం ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో పోటీతత్వం ముఖ్యమని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో నైపుణ్యం ఉంటుందన్నారు. విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. పోటీ పరీక్షల పట్ల ఆసక్తి చూపి ప్రతిభ సాధించాలన్నారు. ఈ ఏడాది నవంబర్ 27, 28 తేదీల్లో జిల్లా స్థాయిలో జరిగిన కౌశల్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. ఈ పోటీల్లో మొదటి ర్యాంకు సాధించిన 8వ తరగతి విద్యార్థిని సరే సబ్రిన్ (రొంపిచెర్ల, బాలికల పాఠశాల), 9వ తరగతిలో మహమ్మద్ సాహిబ్ (మున్సిపల్ హైస్కూల్, కొత్త ఇండ్లు, పుంగనూరు), 10వ తరగతిలో విశాల్ (జెడ్పీ, నెల్లేపల్లి, జీడీనెల్లూరు మండలం) ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారిని డీఈవో అభినందించారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1,500, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1000 చొప్పున నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించారు. జిల్లా సైన్స్ అధికారి అరుణ్కుమార్, కౌశల్ జిల్లా జాయింట్ కో–ఆర్డినేటర్ యుగంధర్రెడ్డి, గుడిపాల ఎంఈవో హసన్బాషా పాల్గొన్నారు. -
ఎలా బతికేది తల్లీ?
● జిల్లాకు చేరిన చింతూరు రోడ్డు ప్రమాద మృతదేహాలు ● కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు ● ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ చిత్తూరురూరల్ (కాణిపాకం): ‘ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలా..? యాత్రకు పోబుద్ధి లేదన్నావే. అందరొచ్చారు..లేవ య్యా’ అంటూ మృతుడు నాగేశ్వరరావు భార్య అముల్ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుక్రవారం వేకువజామున చింతూరులో జరిగిన ఘూర రోడ్డు ప్రమాదంలో చిత్తూ రు నగరానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అందులో నాగేశ్వరరావు (68), శ్రీకళాదేవి (64), శ్యామల(67) ఉన్నారు. అలాగే తవణంపల్లి మండలం, నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37)కూడా మృతిచెందారు. ఈ మృతదేహాలు శనివారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. ఒంటరిదాన్ని చేశావయ్యా! చిత్తూరు నగరం, గిరింపేటలోని మరాఠి వీధికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహం చింతూరు నుంచి మధ్యా హ్నం 3.15 గంటలకు ఇంటికి చేరింది. దీంతో మరాఠివీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, కుటుంబీకులతో ఇంటివద్ద ఆర్తనాదాలు మిన్నంటాయి. భర్త మృతదేహం వద్ద భార్య అముల్భాయ్ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఇన్నాళ్లు ఇద్దరున్నాం.. ఇప్పుడు ఒంటరిదాన్ని చేశావంటూ ఆమె రోదించిన తీరు గుండెలు బరువెక్కేలా చేసింది. అనంతరం 4.30 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కొలిచి..గుండెలవిసి! మరాఠివీధిలోని నాగేశ్వరరావు, అముల్భాయ్ ఆ ధ్యాత్మిక దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సకలదేవతలను పూజించేశారు. ని త్యం పూజలు చేస్తూ గడిపేవారు. దేవుడంటే అపారమైన భక్తి. ఎక్కడ పూజలు జరిగినా ముందు వరుసలో నిలిచేవాళ్లు. ఆ చింతన అయ్యప్పస్వామి భక్త భజన మండలిలో వీళ్లకు సభ్యులుగా అవకాశం క ల్పించారు. దుర్గానగర్ కాలనీలో జరిగే అయ్యప్పస్వామి భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవా రని ఆ వీధిలోని వారు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్తూరు ఆస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహం చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహాన్ని భద్రపరిచారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కొడుకు భసవంత్రెడ్డి శనివా రం యూఎస్ఏ నుంచి స్వదేశం రానున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు చేయనున్నట్టు ఆమె బంధువులు పేర్కొన్నారు. శ్యామలకు తుది వీడ్కోలు చిత్తూరు కార్పొరేషన్: చింతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరుకు చెందిన ట్రాన్స్కో విశ్రాంత ఉద్యోగి శ్యామల(67)కు శనివారం తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అక్కడి నుంచి స్థానిక కొంగారెడ్డిపల్లెలో ఆమె తమ్ముడు విశ్రాంత ఎస్ఐ సదాశివంరెడ్డి నివాసం వద్దకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శ్యామల కుమారుడు ప్రసాద్, ఆయన భార్య సరిత, కూతురు నీలిమ, మనవరాళ్లు యుక్త, ముక్త, దీక్షిత ఆమెను చూసి ఏడ్చేశారు. టూరుకు వెళ్లకపోయినా బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో ఉన్న అనుభవాలను నెమరువేసుకున్నారు. పర్యాటకాన్ని ఇష్టపడే శ్యామల గత నెలలో నీలిమ, దీక్షితతో కలిసి సింగపూర్కు వెళ్లినట్లు సీనియర్ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. శ్యామల అన్నలు రామ్కుమార్రెడ్డి, సదాశివంరెడ్డి, వదినలు పుష్పలత, సంపూర్ణమ్మ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తలు సునంద, శివశంకర్రెడ్డి (ఫైల్) సంతాపం మృతురాలు శ్యామలకు వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడి సంతాపం తెలిపారు. ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆ పార్టీ ఉద్యోగుల, పెన్షన్సర్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, ట్రాన్స్కో అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్ని శ్రద్ధాంజలి ఘటించారు. అప్పుడే వెళ్లిపోయావా ‘దొర’! తవణంపల్లె: ‘రుచికరమైన వంటలు చేసి అందరి మనసు దోచుకున్నావు. భార్యా, బిడ్డలకు కూడా లోటులేకుండా చూసుకున్నావు. ఇప్పుడు హఠాత్తుగా మమ్మల్ని వదిలివెళ్లావు. మాకె దిక్కెవరు స్వామీ’ అంటూ మండలంలోని నారసింహనపల్లెకు చెందిన దొరబాబు మృతదేహం వద్ద భార్య, బిడ్డలు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు– మారేడుమిల్లి ఘాట్ రోడ్డు, రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37) మృతిచెందారు. ఆయన వంట మాస్టర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. మృతునికి భార్య సుమలత, కుమార్తెలు పావని, మౌనిక, కుమారుడు మోహన్కృష్ణ ఉన్నారు. తన తండ్రి మృతదేహం వద్ద పిల్లలు రోదిస్తూ.. ఆర్తనాదాలు పెట్టడం గుండెల్ని మెలిపెట్టింది. ‘నా పిల్లలకు తండ్రిని దూరం చేశావా..దేవుడా..! ఇక మా కు దిక్కెవరు స్వామీ’ అంటూ మృతుని భార్య గుండెలు బాదుకుంటూ రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. అనంతరం దొరబాబు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
భలే ఫేమస్!
కోట్లలో వ్యాపారాలు పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంత రాష్ట్రంలోనే ఫేమస్. ఇక్కడికి ఖరీదైన కార్లతోపాటు అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారులు క్యూ కడుతుంటారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంటారు. వారంలో ఒక్క శనివారం మాత్రమే జరిగే ఈ సంతలో కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. బక్రీద్, రంజాన్ తదితర పండుగ రోజుల్లో అయితే ఇది రెట్టింపు అవుతుంటుంది. అసలు ఒక్క పొట్టేళ్ల సంత ఇంత ఫేమస్ కావడానికి కారణాలేంటో మీరే ఓ లుక్కేయండి. పలమనేరు: రుచికరమైన భోజనాలు.. నాణ్యమైన ఆహార పదారాలు దొరుకుతాయంటే ప్రజలు ఎంత దూరమైనా వెళ్లిపోతుంటారు. తమకిష్టమైన వాటిని ఆరగిస్తుంటారు. అలాగే తమకవసరమైన వంటకాలను ఇళ్లకు తెచ్చుకుని కుటుంబ సభ్యులతో కలిసి భుజిస్తుంటారు. అలా ఒక్కోదానికి ఒక్కోరకంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇలాంటిదే పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంత రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ నుంచి సైతం వ్యాపారులు వచ్చి నచ్చిన పొట్టేళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన కార్లలో రాక ఇక్కడ కొన్న మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను ఎక్కువగా కొనే వ్యాపారులు టెంపోల్లో తరలిస్తుంటారు. చాలామంది వీటి కోసం కార్లలో వచ్చి తీసుకెళుతుంటారు. నచ్చిన పొట్టేళ్లను కొని కార్లలో దూర ప్రాంతాలకు తరలిస్తుంటారు. సాధరణంగా కొత్తగా ఈ సంతకు వచ్చే వారెవరైనా ఇక్కడ కనిపించే వందల కొద్దీ ఖరీదైన కార్లను చూసి ఇన్ని కార్లు ఎందుకొచ్చాయంటూ ఆశ్చర్యపోవాల్సిందే. వారపు సంత రోజు కిలోమీటర్ల మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్లు, వాహనాలను అదుపు చేసేందుకు పోలసులుండాల్సిదే. ఆ రెండు పండుగల కోసమే బక్రీద్ పండుగలో మాంసాహారం చాలా ముఖ్యం. స్థోమతగల ముస్లిం కుటుంబీకులు ఖుర్భానీ పేరిట పేదలకు మాంసాన్ని దానం చేస్తారు. ఈ పండుగకు ఎంత ఖరీదైన పొట్టేళు, మేకలను కొంటే వారికి అంత గౌరవంగా భావిస్తారు ముస్లింలు. అసలు ఈ పండుగ కోసమే ఈ ప్రాంతంలో చాలామంది పొట్టేళ్లను సంరక్షిస్తుంటారు. ఏడాదంతా వీటిని సాకి బక్రీద్కు మాత్రమే విక్రయిస్తుంటారు. పలు ప్రాంతాల నుంచి జీవాలు కేవలం బైరెడ్డిపల్లి సంతలో విక్రయించేందుకు ఉమ్మడి చిత్తూరు, అనంతపూర్ జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. వీటకి పచ్చి గడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి సంరక్షిస్తారు. దీంతో కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. వీటని ఇక్కడి సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. సంతలో జరిగే చేతి రుమాలు కింది వ్యాపారం బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంతకు క్యూ కడుతున్న వ్యాపారులు ఒక్కడి సంతలో కోట్ల రూపాయల మేర వ్యాపారాలు జరుగుతుంటాయి. గత బక్రీద్ సంత మాత్రమే రూ.20 కోట్ల దాకా వ్యాపారం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణ శనివారాల్లో ఇక్కడికి 20వేలకు పైగా పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు వస్తుండగా పండుగ సంతలకు సుమారుగా 40 వేల నుంచి 50 వేలదాకా వస్తుంటాయి. జత పొట్టేళ్లు రూ.40 వేల నుంచి అత్యధికంగా రూ.2 లక్షలకు పైగా పలుకుతుంటాయి. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని మంగళంపేట హైస్కూల్ను శనివారం కడప రీజనల్ జాయింట్ డైరెక్టరు శామ్యూల్ తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మేటివ్ అసెస్మెంట్–1 వంద రోజుల ప్రణాళిక పరీక్షలను పరిశీలించారు. ఉత్తమ మార్కులు సాధించిన మల్లేష్, ఆలియాతాజ్మిన్ ను అభినందించారు. అనంతరం పాఠశాలలో గ్రీనరీ, ఆర్వోసిస్టం, విద్యార్థుల మరుగుదొడ్లను తనిఖీ చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య, హెచ్ఎం ఫజురుల్లా పాల్గొన్నారు. -
17న మొగిలిలో తలనీలాల పోగు వేలం
బంగారుపాళెం: మండలంలోని మొగిలీశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17న తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి బహి రంగ వేలం నిర్వహించనున్నటు ఈఓ ముని రాజ శనివారం తెలిపారు. ఆలయం ఆవరణ లో ఉదయం 10.30 గంటలకు దేవదాయశాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం ఉంటుందన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ.10 వేలు ఽడిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. వివరాలకు కార్యాయలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు. ఓపెన్ చెస్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ పోస్టర్ను ఆంధ్ర చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఆర్బీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ మేరకు శనివారం ఆ సంఘం జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న చిత్తూరులో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో గెలుపొందే విజేతలకు రూ.1.29 లక్షల విలువ గల నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. పేర్ల నమోదుకు 98493 13676, 90004 75799ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు దినేష్, గిరిధర్, కృష్ణకిశోర్, మల్లికార్జున పాల్గొన్నారు. గ్రేడ్ 2 నుంచి జేఎల్ఎంలుగా మార్పు చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ పరిధిలో పనిచేస్తున్న జేఎల్ఎం గ్రేడ్–2ను పోస్టులను జేఎల్ఎంలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు సచివాలయ పరిధిలో అందుబాటులో ఉంటూ సంబంఽధిత ట్రాన్స్కో సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 285 మంది ఉండగా వీరికి జేఎల్ఎం గ్రేడ్–2 హోదా ప్రకారం బేసిక్ పే రూ.23,780 చొప్పున జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం వారిని జేఎల్ఎంలుగా గుర్తించడంతో రూ.30,800 చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఇక వీరికి ట్రాన్స్కో ఉద్యోగులు విధివిధానాలు వర్తించనున్నాయి. ‘విశ్వం’కు బెస్ట్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఇటీవల 2025– 26 విద్యా సంవత్సరానికి గాను తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్కు ‘‘బెస్ట్ అకడమిక్ ఎక్సలెన్న్స్ స్కూల్’’, ‘‘బెస్ట్ ఇన్న్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్’ అవార్డులు సొంతం చేసుకుంది. విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ విశ్వనాథ్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వం పాఠశాలలో నాణ్యత, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజీలేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి భావాలను అలవరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడిగా రాఘవులు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా రాఘవులు (జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి) వరుసగా రెండో సారి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 17 స్థానాలకు గాను చిత్తూరు జిల్లాలోని 6 తాలూకాల పరిధిలోని 18 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో కార్యదర్శి పదవికి రెండు నామినేషన్లు దాఖలు కాగా, మిగిలిన స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. అయితే యూనియన్ నేతల రాజీయత్నాల అనంతరం కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన మహేష్ అనే ఉద్యోగి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అధ్యక్షులుగా రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా మురళి (డీఈవో కార్యాలయం) ఎన్నికయ్యారు. వీరితో పాటు 14 మంది కార్యవర్గ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికై న రాఘవులు విలేకరులతో మాట్లాడారు. తమ మూడేళ్ల పదవీకాలంలో జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సహ ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ సెక్రటరీ శ్యామసుందరరావు, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వరరావు వ్యవహరించారు. -
పకడ్బందీగా కెరీర్ ఫెస్ట్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కెరీర్ ఫెస్ట్ను పకడ్బందీగా నిర్వహించాలని సమగ్రశిక్షశాఖ ఏపీసీ వెంకటరమణ ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో కెరీర్ ఫెస్ట్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కెరీర్ ఫెస్ట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న జిల్లా స్థాయిలో కెరీర్ ప్రదర్శనను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేజీబీవీ జీసీడీవో ఇంద్రాణి, కెరీర్ఫెస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ ఛాయేంద్రకుమార్ పాల్గొన్నారు. రాజీమార్గమే ఉత్తమం చిత్తూరు లీగల్: న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి రాజీమార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. జిల్లా న్యాయ స్థానాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను జిల్లా జడ్జి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్న తరువాత దీనిపై అప్పీలుకు వెళ్లడానికి వీలుండదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్ కోసం 32 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒకటే మార్గం అన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, శ్రీదేవి, ఉమాదేవి, మాధవి, షేక్ బాబాజాన్, వెన్నెల, చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శంకర్ నాయుడు పాల్గొన్నారు. ఆటోను ఢీకొన్న కారు – ఆరుగురికి గాయాలు బంగారుపాళెం: మండలంలోని నల్లంగాడు గ్రామం వద్ద శనివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. తుంబకుప్పం నుంచి బంగారుపాళెం వస్తున్న ప్యాసింజర్ ఆటోను నల్లంగాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నల్లంగాడు, పెరుమాళ్లపల్లెకు చెందిన ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,202 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,864 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. -
నూతన వసతి గృహానికి భూమి పూజ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన సంక్షేమ వసతి గృహం ఉపయోగకరమని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో రూ.కోటి బడ్జెట్తో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన కణ్ణన్ పాఠశాల, కళాశాల అభివృద్ధికి వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్మన్ కఠారి హేమలత, కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మౌలా పాల్గొన్నారు. -
వణుకు పుట్టిస్తోంది!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 7 దాకా దట్టంగా మంచు కురుస్తోంది. జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు. మరోవైపు వాహనదారులకు ముప్పు తిప్పలు ఎదుర్కొంటున్నారు. పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. ఇక ఈనెల 25న క్రిస్మస్, డిసెంబర్ 31, జనవరి 1, సంక్రాంతి పండుగలు ఉండడంతో జర్నీకి ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిపించని రోడ్లు రోడ్లపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం నుంచి మంచు ప్రభావం పెరుగుతోంది. 100 నుంచి 200 మీటర్ల వరకు రోడ్డు కనిపించడం లేదు. ఉదయం 9 దాటినా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. దగ్గరికి వచ్చే దాకా ఎదురుగా వచ్చే బండ్లు కానరావడం లేదు. వాహనం ముందు దారుందో, వాహనం ఆగి ఉందో తెలియడం లేదు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు బెంగళూరు మార్గం, చిత్తూరు–వేలూరు, చిత్తూరు–పుత్తూరు, పలమనేరు–కుప్పం, ఇరువారం క్రాస్–తిరుపతి, పలమనేరు– పుంగనూరు రహదారులపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో దట్టమైన మంచు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే కొత్త రోడ్లపై మలుపులు, రహదారుల స్థితిగతులపై అవగాహన ఉండాలి మంచు తెరలు తొలిగిపోయాకే ప్రయాణాన్ని కొనసాగించాలి. వాహనానికి వెనుక, ముందు రేడియం స్టికర్లను అతికించాలి. వాహనానికి ఫాగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవాలి. పసుపు వర్ణంతో వెలిగే ఈ దీపాలు శీతాకాలంలో ఎంతో మంచిది. –బండి స్పీడ్ లిమిట్లో పెట్టుకోవాలి. ముందు వెళ్తున్న వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయొద్దు. వెహికల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి వాహనాలను రోడ్ల పక్కకు తీసుకెళ్లి ఖాళీ ప్రదేశంలో లేదా వెలుతురు ఉన్న చోట నిలపాలి. బండి ఆగిపోతే నంబరు 100కు ఫోన్న్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి అద్దాలను తుడిచే వైఫర్లు సక్రమంగా ఉంచుకోవాలి. వాహనం పూర్తిగా కండిషన్న్లో ఉండాలి -
మద్యం షాపు వద్దంటూ మహిళల నిరసన
పుత్తూరు : తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం నడిబొడ్డున మద్యం షాపు ఏర్పాటుకు నాలుగోసారి ప్రయత్నించిన నిర్వాహకులకు నిరాశే మిగిలింది. శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా తిరుపతి రోడ్డులో గౌడ మద్యం షాపును తెరిచారు. విషయం తెలుసుకొన్న స్థానిక రామారావు, రామానాయుడు కాలనీలకు చెందిన మహిళలు షాపు ముందు బైఠాయించారు. దీంతో మద్యం షాపు వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకొన్న డీఎస్పీ రవికుమార్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు మద్యం షాపు నిర్వాహకులు అమ్మకాలు లేకపోయినా షాపును యథావిధిగా తెరిచే ఉంచారు. దీంతో మహిళల సంచారం ఎక్కువగా ఉన్న తిరుపతి రోడ్డులోని కాలనీల మధ్య షాపు ఏర్పాటు వద్దంటూ మహిళలు భీష్మించుకొని కూర్చొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు షాపు ముందే బైఠాయించి మద్యం అమ్మకాలు జరగకుండా అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పికెట్ వేసి కూర్చొన్నారు. ఇలా మద్యం షాపు ఏర్పాటును మహిళలు అడ్డుకోవడం ఇది నాల్గవసారి. గత నవంబర్ 5, 15, 22వ తేదీల్లోనూ ఇదే షాపు ప్రారంభోత్సవాలను స్థానిక మహిళలు అడ్డుకోవడం గమనార్హం. మద్యం షాపు వద్ద బైఠాయించిన మహిళలు, పక్కనే పోలీస్ పికెట్ రాత్రి అయినా మద్యం షాపు వద్ద మహిళల నిరసన -
చిరుత దాడిలో దూడ మృతి
ఐరాల : చిరుత పులి దాడిలో దూడ మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని చెంగనపల్లెలో చోటు చేసుకుంది. మండల అటవీశాఖ అధికారి రాకేష్కుమార్ కథనం మేరకు.. చెంగనపల్లెకు చెందిన మనోహర్ తన ఆవులతో పాటు దూడను ఉదయం గ్రామం సమీపంలోని కొత్త చెరువు వద్ద మేతకు వదిలి ఇంటికి వచ్చాడు. తిరిగీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. దూడ పొదుగు భాగంలో కొరికిన ఆనవాళ్లు ఉండటంతో చిరుత దాడి చేసిందని నిర్ధారించారు. పశువులను మేత కోసం కొత్త చెరువు వద్ద ఉంచరాదని సూచించారు. రైతులు, ప్రజలు రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లరాదని కోరారు. మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తిపై కేసు పుంగనూరు : మండలంలోని అడవినాథునికుంటకు చెందిన మహేందర్రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని టి.వాసవి అనే మహి ళ వద్ద రూ.4.87 లక్షలు తీసుకుని మోసగించినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమ ణ తెలిపారు. శుక్రవారం రాత్రి ఎస్ఐ మాట్లాడుతూ.. బాధితురాలికి ఉద్యోగం ఇవ్వక, డబ్బులు ఇవ్వకుండా తన గ్రామానికి పిలిపించి, కుటుంబ సభ్యులతో చంపేస్తామని బెదిరించారని వాసవి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు మహేందర్రెడ్డి, రత్నారెడ్డి, విజయమ్మలపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడి నియామకం చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్సీపీలో జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మేకల శివకుమార్రెడ్డిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించినట్లు తెలిపారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బండి స్పీడు తగ్గించాలి చిత్తూరు రూరల్(కాణిపాకం) : బండి గమ్యం చేరడం..డ్రైవర్ చేతిలోనే ఉంటుందని, దీంతో పాటు బండి కండిషన్ కూడా అత్యంత ముఖ్యమని డీటీసీ నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ఉద్దేశించి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సు డ్రైవర్లు స్పీడు తగ్గించు కోవాలన్నారు. రోడ్డుపై వారికి పట్టు ఉండాలన్నారు. నిద్ర మత్తు ఉంటే బండిని పక్కన పెట్టడం మంచిదన్నారు. లేకుంటే రెండో డ్రైవర్కు బండి ఇచ్చి..కునుకు తీయాలన్నారు. గమ్యం చేరే వరకు ఏకాగ్రత కచ్చితంగా అవసరమన్నారు. చలి, వర్షాకాలంలో ఘాట్, పెద్ద మలుపులు ఉండే ప్రాంతాల్లో అతి జాగ్రత్తగా బండి నడపాలన్నారు. అలాంటి మార్గంలో అతి వేగం పనికిరాదన్నారు. నెమ్మదిగా వెళ్లడం మంచిదన్నారు. దట్టమైన మంచు కమ్ముకుని..రోడ్డు కనిపించని పక్షంలో బస్సును పక్కన పెట్టడం అత్యుత్తమన్నారు. లేకుంటే అన్ని లైట్లు ఆన్ చేసి అత్యంత జాగ్రత్తగా వెళ్లాలన్నారు. డేంజర్ జోన్లు, మలుపు బోర్డులను చూసుకుంటూ బస్సు నడపాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం దట్టమైన మంచు అని చెప్పారు. బస్సు నిర్వాహకులు ఎప్పటికప్పుడు బస్సు కండిషన్ను చూసుకోవాలన్నారు. డ్రైవర్లకు తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తూ ఉండాలన్నారు. డ్రైవింగ్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలన్నారు. బస్సుల నిర్వహణలో లోటుపాట్లు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రూ.20 లక్షల అంబులెన్స్ విరాళం కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అధికారులు శుక్రవారం అంబులెన్స్ను విరాళంగా ఇచ్చారు. రూ. 20 లక్షలు విలువ చేసే అంబులెన్స్ను బ్యాంకు చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బ్యాంకు అధికారులకు దర్శన సేవలు అందించారు. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు, ధనపాల్ సిబ్బంది వాసు తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద సూచికల ఏర్పాటు, సోలార్ బ్లింకర్లను, రోడ్ సైన్బోర్డులు, రోడ్డు మార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమం పై సమీక్షించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 22 పాఠశాలల్లో ఓఎస్ఎస్ఏటీ సంస్థ సహకారంతో టీచర్లు, విద్యార్థులు సాంకేతిక ఆధారిత విద్యపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు. -
36 బైక్లు..ముగ్గురు దొంగలు అరెస్టు
గుడిపాల : వారందరూ కరుడుగట్టిన దొంగలు. ఇదివరలోనే చిత్తూరు, తమిళనాడులో పలు కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి అక్కడున్న వారితో పరిచయాలు పెంచుకొని బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడేవారు. వీరందరూ కలిసి తమిళనాడులో 34 ద్విచక్ర వాహనాలు, చిత్తూరు ప్రాంతంలో రెండు వాహనాలను చోరీ చేసుకొని తక్కువ ధరకు అమ్మేవారు. వీరిని గుడిపాల పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి బైక్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గుడిపాల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ.. గుడిపాల పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు బైక్ దొంగలను పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. గుడిపాల మండలం చిత్తపారకు చెందిన కిరణ్కుమార్( 34), తమిళనాడు రాష్ట్రం కాట్పాడి సమీపంలోని లత్తేరికి చెందిన వైరముత్తు(39), కాట్పాడికి చెందిన జయసూర్య(35) కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారన్నారు. వీరితో పాటు గుడిపాల మండలం పల్లూరు గ్రామానికి జయప్రకాష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. 2024 సంవత్సరంలో కాట్పాడి, వేలూరులో దొంగతనం చేసి ఆంధ్రాలో మోటార్ సైకిళ్లు అమ్ముతుండగా కాట్పాడి పోలీసులు పట్టుకొని వారిని జైలుకు పంపారన్నారు. జైలులో ఉన్నప్పుడు లత్తేరికి చెందిన వైరముత్తుతో పరిచయం ఏర్పడి జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొని ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత కిరణ్, వైరముత్తు, జయప్రకాష్, జయసూర్య అందరూ కలిసి గుడిపాల, యాదమరి, వేలూరు జిల్లాలో 36 బైక్లను దొంగతనం చేశారు. వారిని గొల్లమడుగు వద్ద అరెస్టు చేసి, బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. ఇందులో కిరణ్పై 8 కేసులు, వైరముత్తుపై 29 కేసులు, జయసూర్యపై 3 కేసులు ఉన్నాయని జయప్రకాష్ పరారీలో ఉన్నట్లు అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. సీఐ శ్రీధర్నాయుడు, ఎస్ఐ రామ్మోహన్ పాల్గొన్నారు.


