Chittoor District News
-
రెండు బైక్లు ఢీకొని ఒకరి మృతి
గంగవరం: మండలంలోని మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు గడ్డూరు కాలనీకి చెందిన జుబేర్(20), రామసముద్రానికి చెందిన శ్రీధర్(20) మదర్ థెరిసా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు ద్విచక్ర వాహనంలో పలమనేరు వెళ్తున్నారు. అదే మార్గంలో మేలుమాయి గ్రామానికి చెందిన మేసీ్త్ర దొరస్వామి(55) మేసీ్త్ర పని ముగించుకుని పలమనేరు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలోని మేలుమాయి క్రాస్ వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వారిని 108 అంబులెన్స్లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. సీఎంసీకి వెళుతుండగా మార్గమధ్యంలో దొరస్వామి మృతిచెందారు. ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధంతరంగా ఆగిన పశువైద్యశాల భవన నిర్మాణం
గంగాధర నెల్లూరు: మండలంలోని నందనూరు గ్రామంలోని పశువైద్యశాల భవన నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేయలేమని చేతులెత్తేశాడు. దీంతో రైతులు తమ పశువులకు వైద్య సేవలు అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రమైన గంగాధరనెల్లూరులోని పశువైద్యశాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని నందనూరు పంచాయతీలో పశు వైద్యశాల భవనం నిర్మాణం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలు మంజూరు చేసింది. అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పనులు చేపట్టాడు. గోడలు పూర్తి చేసి పైకప్పుకూడా వేశాడు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు మంజూరుకాలేదు. దీంతో పనులు చేయలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. ఈ వైద్యశాల పూర్తయితే నందనూరు, కలిజవేడు, పాపిరెడ్డి పల్లి, కొట్రకోన, పెనుమూరు సరిహద్దులోని పలు గ్రామాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. పశువైద్యశాల భవనం అర్ధంతరంగా ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వైద్య సేవలను తాత్కాలికంగా గ్రామపంచాయతీ భవనం వద్ద నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 50కి పైగా పాడి ఆవులు వైద్య సేవల కోసం తీసుకువస్తున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద పశువులకు సంబంధించిన మందులు, రికార్డులను ఉంచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి పశువైద్యశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్ధగిరి హుండీ ఆదాయం రూ.11.19 లక్షలు
తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలోని హుండీల ద్వారా రూ.11.19 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతి, ఈవో మునిశేఖర్ తెలిపారు. అర్ధగిరి క్షేత్రంలోని మండపంలో బుధవారం ఎండోమెంట్ అధికారి రాధిక పర్యవేక్షణలో హుండీల్లోని కానుకలను లెక్కించారు. గత సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.11,19,899లు వచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో అరగొండ గ్రామీణ బ్యాంకు అధికారి పి.ఎం.ఉమామహేష్, ట్రస్టుబోర్డు సభ్యులు సుబ్రమణ్యం, శ్రీధర్నాయుడు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. నేడు పాఠశాలలకు పని దినం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు గురువారం పనిచేస్తాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన పాఠశాలలకు సెలవు ఉంటుందని డీఈవో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు. అంగన్వాడీ హెల్పర్పోస్టులకు ఇంటర్వ్యూలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చిత్తూరు, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు, ఐరాల, బంగారుపాళ్యం, పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 187 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు వచ్చిన మహిళా అభ్యర్థులతో ఆర్డీవో కార్యాలయం కిక్కిరిసింది. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తాయని ఒకే రోజు ఆరు ప్రాజెక్టుల పరిధిలో పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సమాచారం. బాగా ఆలస్యం అవుతుండడంతో రెండు ప్రాజెక్టులకు ఇంటర్వ్యూ లు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దీంతో ఐరాల, జీడీ నెల్లూరు సీడీపీవో ప్రాజెక్ట్ పరిధిలోని పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓపై చర్యలు! చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆమెను రాష్ట్ర శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో చిత్తూరు డీఎంహెచ్ఓగా అనంతపురం జిల్లా డీఐఓగా పనిచేస్తున్న నాగశశిభూషణ్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆయన ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వార్డుల పునర్విభజన షురూ..!
చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులను పెంచడంతోపాటు జనాభా ప్రాతిపదికన వార్డులను పునర్భజన చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలన – పట్టణాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు గ్రేడ్ల ఆధారంగా ఉన్న వార్డులు, డివిజన్లను తాజాగా జనాభా ప్రామాణికంగా వర్గీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వార్డుల పెంపు ఇలా.. జనాభా ఆధారంగా వార్డుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 2 లక్షలలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లలో 60 డివిజన్లు ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటి వరకు ఉన్న 50 డివిజన్ల సంఖ్య 60కి చేరుకోనుంది. పలమనేరులో 26 ఉన్న వార్డులు 40కు, నగరిలోని 29 వార్డులు 40కి చేరుకోనున్నాయి. వార్డుల పునర్విభజన ఎలా చేయాలనేదానిపై ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు అందాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాతే అధికారులు వార్డుల స్వరూపం మార్చడంతో పాటు, గెజిట్ ప్రచురించడం, ఆపై ప్రజల నుంచి అభ్యతరాలు స్వీకరించడం చేయాలి. తుదిగా వార్డుల సంఖ్య పెంచుతూ, పునర్విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. వచ్చే ఏడాది జనగణన పూర్తయ్యి, మునిసిపల్ ఎన్నికలకు వెళ్లేలోపు కొత్త వార్డులు–డివిజన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిబంధనలు.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికే అమలులో ఉన్న వార్డులు, డివిజన్ల సంఖ్య తదుపరి జనగణన ఫలితాల వరకు మార్చకూడదు. ఇక పాలకవర్గాలు (కౌన్సిల్) ఉన్న చోట పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా పెరిగిన వార్డులు అమలులోకి వస్తాయి. ఈ లెక్కన కుప్పం మునిసిపాలిటీలో సెప్టెంబరు తర్వాతే వార్డుల సంఖ్య పెరగనుంది. -
అపోలో స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలో నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ స్పోట్స్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. ఏకేసీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే–2026లో భాగంగా చేపట్టిన ఈ క్రీడా పోటీలకు విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ను వీసీ వినోద్ భట్ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్వహించిన టార్చ్ రన్ కార్యక్రమం క్రీడాస్ఫూర్తికి ప్రతీ కగా నిలిచింది. బాస్కెట్ బాల్, వాలీబాల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. తొలి బాస్కెట్ బాల్ పోటీని రిజిస్ట్రార్ ఎం.పోతరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు రిజిస్ట్రార్ ఎస్.అనీల్కుమార్, ఏఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ జె ఆగస్టీన్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ జగదీశన్, ఏఐపీఎస్ డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్రెడ్డి, స్టూడెంట్స్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ మురళీకష్ణ, ఫిజికల్ డైరెక్టర్లు దిలీప్, సుమలత, స్పోర్ట్స్ క్లబ్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ జి.స్వప్న పాల్గొన్నారు. -
పటిష్టంగా జనగణన ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జనగణన ప్రక్రియను పట్టిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. జనగణన ప్రక్రియలో శిక్షణ అత్యంత కీలకమన్నారు. మండల స్థాయి సిబ్బందిని 5 నుంచి 6 ఆరుగురితో చిన్న చిన్న బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇవ్వాలన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ జనగణనపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. జనణనలో సేకరించిన వివరాలు రాబోయే 10 నుంచి 15 ఏళ్ల వరకు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక విధానాల అమలుకు జనగణన వివరాలే ప్రాతిపదికన్నారు. జిల్లా స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సందేహాల నివృత్తికి ముఖ్య అంశాలతో కూడిన లీఫ్లెట్లు, ప్రశ్నోత్తరాల పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రైనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ దీపక్ భరద్వాజ్, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. -
యువతే దేశానికి అసలైన సంపద
చిత్తూరు కలెక్టరేట్ : యువతే దేశానికి అసలైన సంపదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నెహ్రూ యువజన శాఖ ఆధ్వర్యంలో కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం నిర్వహించారు. కాశ్మీర్లోని 6 జిల్లాల నుంచి వచ్చిన 132 మంది యువతీ యువకులకు జిల్లా యంత్రాంగం సాదర స్వాగతం పలికింది. ఇందులో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భారత్ మాత్రం అపారమైన యువశక్తితో విరాజిల్లుతోందన్నారు. భారతదేశంలో ఖనిజాలు, గనుల కంటే అత్యంత విలువైనది యువతరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ప్రత్యేకత అని చెప్పారు. విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ భారతీయుల ఐక్యత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందన్నారు. దేశంలో అలజడులు సృష్టించే శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి యువకుడు శాంతిని కాపాడే పీస్ అంబాసిడర్గా ఎదగాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ మాట్లాడుతూ యువత ఉగ్రవాదం, నక్సలిజం వంటి దేశద్రోహ చర్యలు, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. మై భారత్ స్టేట్ డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాశ్మీర్ యువత ఇక్కడి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను తెలుసుకుంటారని చెప్పారు. స్థానిక పర్యాటక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారని తెలిపారు. రెండు ప్రాంతాల యువత మధ్య భావవినిమయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి, అకడమిక్ డైరెక్టర్ శైలజ, ఏవో రాజగోపాల్, మై భారత్ జిల్లా యువ అధికారి ప్రదీప్, అకౌంట్స్ ఆఫీసర్ బాబురెడ్డి పాల్గొన్నారు. -
హక్కుల కోసం పెన్షనర్ల నిరసన
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల హక్కులకు రక్షణ కల్పించాలని ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా నాయకులు సహదేవనాయుడు, భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ సరికాదన్నారు. దాని వల్ల పెన్షనర్లకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ధర్నా చేస్తున్నట్టు వివరించారు. గత ఏడాది మార్చి 25న పార్లమెంటులో ఆమోదించిన ఆర్థిక సవరణ బిల్లులో పెన్షనర్ల విభజన అధికారాన్ని కేంద్రం పొందిందన్నారు. దీనివల్ల ప్రస్తుతం పాత పెన్షన్ పొందుతున్న వారు భవిష్యత్లో పెన్షన్ పెరుగుదల సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నల్ల చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయిందన్నారు. అనంతరం డీఆర్వో మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రాజారావు, మురళి, సునందరెడ్డి, రంగనాథమ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
ఖో–ఖో పోటీల్లో మెరిసిన ఉద్యోగులు
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిభ చూపారు. వారిని బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించారు. డీఈవో మాట్లాడుతూ మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల్లో టీచర్లు ఏపీ జట్టు తరపున పాల్గొని కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. విద్యాబోధనలోనే కాకుండా క్రీడా రంగంలోనూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. అనంతరం ప్రతిభ చాటిన సురేష్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీ, మంగళపల్లి), ముత్తు (పీఈటీ, జెడ్పీ ఎండీ, మంగళం), దేవేంద్ర (పీఈటీ, జెడ్పీ కీరమంద)ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీలు సిరాజ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్కు అభినందన కార్వేటినగరం: జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఉద్యోగి మనోజ్కుమార్(ఇంజినీరింగ్ అసిస్టెంట్ కార్వేటినగరం) ప్రతిభ చూపాడు. ఆయనను బుధవారం ఎంపీడీవో మధుసూదన్ అభినందించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖో–ఖో పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. అందులో ఏపీ జట్టు ప్రతిభ కనబరిచిందన్నారు. ఆ జట్టులో కార్వేటినగరం ఇంజినీరింగ్ అసిస్టెంట్ మనోజ్కుమార్ పాల్గొని కాంస్య పతకం సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏవో విద్యావతి, పీఆర్ ఏఈ దినేష్, చెంగల్రాయులు యాదవ్ పాల్గొన్నారు. -
31న ముగియనున్న నవజీవన్శ్రీ పాలసీ
పుత్తూరు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అమలుచేస్తున్న నవజీవన్శ్రీ పాలసీ(911)ని ఈ నెల 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు స్థానిక బ్రాంచి మేనేజర్ పి.ఎస్.హేమాద్రి తెలిపారు. ఆయన బుధవారం తమ సిబ్బందితో కలిసి నవజీవన్శ్రీ పాలసీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవజీవన్శ్రీ పాలసీ కింద సింగిల్ ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితానికి భద్రత పొందవచ్చునని తెలిపారు. గ్యారెంటీ అడిషన్ లాభం కూడా ఉంటుందని పేర్కొన్నారు. జీరో వయస్సు నుంచి 65 ఏళ్ల వారు పాలసీ చేసుకోవచ్చని వెల్లడించారు. కుటుంబ భద్రత, పిల్లల భవిషత్తు కోసం ఇది ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. భారీ జరిమానా యాదమరి: మండల పరిధిలోని వరిగపల్లి వద్ద ఇటీవల పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సేల్స్ ట్యాక్స్ అధికారులు నిందితులకు రూ.9 లక్షల భారీ జరిమానా వసూలు చేసి, వాహనాన్ని విడుదల చేసినట్లు స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. కారు ఢీకొని యువకుడికి గాయాలు గంగవరం: మండలంలోని అప్పినపల్లి క్రాస్ వద్ద బుధవారం బైక్ను కారు ఢీకొనడంతో యువకుడు గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కల్లుపల్లి గ్రామానికి చెందిన బాబు కుమారుడు గోకుల్సాయి(19), ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు ద్విచక్ర వాహనంలో పలమనేరు వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో మదనపల్లి వైపు వస్తున్న కారు అప్పినపల్లి క్రాస్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గోకుల్సాయికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గ్రీన్ రేటింగ్పై అవగాహన సదస్సు
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : రాష్ట్రంలోని పరిశ్రమలలో సుస్థిర విధానాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా బుధవారం ‘గ్రీన్ రేటింగ్’పై శ్రీసిటీలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీపీసీబీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం ‘గ్రీన్ రేటింగ్’ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా భాగం కావాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచాలనే లక్ష్యాన్ని, తీర ప్రాంతంలో ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రణాళికను ప్రస్తావించారు. సుస్థిరత శ్రీసిటీలో భాగం శ్రీసిటీలో గ్రీన్ రేటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు డాక్టర్ కృష్ణయ్యకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుస్థిరత అనేది శ్రీసిటీలో అంతర్భాగమని పేర్కొ న్నారు. హరిత భవనాలు, పునరుత్పాదక శక్తి వినియోగం, సమర్థవంతమైన నీటి, వ్యర్థాల నిర్వహణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఏపీపీసీబీ రూపొందించిన ప్రోత్సాహక వ్యవస్థతో తమ పరిశ్రమలు క్రమంగా ప్రపంచ స్థాయి హరిత ప్రమాణాలను పాటిస్తున్నాయని చెప్పారు. అనంతరం సీఐఐ గ్రీన్కో దక్షిణ ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ చైర్మన్ నిహాల్ కౌల్ మాట్లాడారు. ఇంధన శక్తి, నీరు, వ్యర్థాల వినియోగాన్ని క్రమబద్ధం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కంపెనీకి లాభాలు కూడా సాధ్యమవుతాయని చెప్పారు. సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ముత్తుసెళియన్ స్వాగత ఉపన్యాసం చేశారు. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ సదుపాయాలు త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని డాక్టర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. -
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
పెనుమూరు(కార్వేటినగరం): కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెనుమూరు మండటలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని అత్తిమాకులపల్లికి చెందిన సుకన్య(32) కు చిత్తూరు రూరల్ మండలం సీఎం కాలనీకి చెందిన నాగేంద్రబాబుతో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 6, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రబాబు భార్యాపిల్లలతో కలిసి అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నారు. దంపతులు తరచూ గొడవ పడేవారు. మంగళవారం కూడా దంపతుల గొడవ జరిగింది. నాగేంద్రబాబు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని సొంత గ్రామం సీఎం కాలనీకి వెళ్లి పోయాడు. దీంతో మనస్థాపం చెందిన సుకన్య బుధవారం గ్రామంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహం కోసం గాలించారు. మృతదేహం జాడకనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతికి గల కారణాలను ఆరాతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్పంచులపై కూటమి కక్ష
కుప్పం రూరల్: వైఎస్సార్ సీపీ మద్దతుదారులుగా ఉన్న సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోందని చిత్తూరు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త భరత్ ఆరోపించారు. ఆయన బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 91 పంచాయతీలకు గాను 77 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారని చెప్పారు. గెలిచిన సర్పంచులు ఎలాంటి పక్షపాతం లేకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. భారీ గెలుపును తట్టుకోలేని టీడీపీ నాయకులు అప్పట్లో తీవ్రంగా నిరాశకు గురయ్యారని తెలిపారు. 2024లో టీడీపీ ప్రభుత్వం రావడంతో వైఎస్సార్ సీపీ సర్పంచులపై అక్కసు వెళ్లగక్కుతున్నట్టు విమర్శించారు. తాగునీరు, పారిశుధ్యం, పైపులైన్ల ఏర్పాటు, బోర్ వెల్ రిపేర్లు వంటి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోందని దుయ్య బట్టారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకూ బిల్లులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సజావుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కలెక్టర్ను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా టీడీపీ నియామక పదవిలో ఉన్న కడా ప్రాజెక్టు డైరెక్టర్ను అడగాలని తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కడా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, ఎంపీడీవోల వద్దకు వెళ్లమంటున్నారని, అక్కడికి వెళితే టీడీపీ నాయకులను కలవాలంటూ బదులిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని విమర్శించారు. బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు. -
30న టిడ్కో ఇళ్ల అప్పగింత
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈనెల 30వ తేదీన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కమిషనర్ పి.నరసింహప్రసాద్ తెలిపారు. బుధవారం టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, మౌలిక వసతులు, సదుపాయాలపై అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. కమిషనర్ వెంట ప్రజారోగ్యశాఖ అధికారి లోకేష్, మునిసిపల్ ఇంజినీరు వెంకటరామిరెడ్డి, టిక్కో డీఈ వెంకటముని, ఏఈ ధనంజయరెడ్డి ఉన్నారు. పోలీస్ స్టేషన్కుడ్రోన్ కెమెరా అందజేత చిత్తూరు అర్బన్: గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమెరాను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అందించారు. గంగాధరనెల్లూరుకు చెందిన బిల్డర్ ప్రసన్నకుమార్ విరాళంగా ఇచ్చిన ఈ కెమెరాను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్కు అందచేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు దీన్ని ఉపయోగించాలని ఎస్పీ ఆదేశించారు. అపోలోలో వరల్డ్ ఆప్టోమెట్రీ డే చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని ది అపోలో యూనివర్సిటీ పరిధిలోని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డివిజన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆప్టోమెట్రీ డే–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కంటి ఆరోగ్య ప్రాముఖ్యత, నాణ్యమైన విజన్ కేర్ సేవలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వీసీ వినోద్ భట్ హాజరై ప్రసంగించారు. గౌరవ అతిథిగా అదనపు రిజిస్ట్రార్ అనీల్ కుమార్తోపాటు వైద్య నిపుణులు ఆల్ఫ్రెడ్ జె అగస్టీన్, భాస్కర్ రెడ్డి, సుచరిత, కుమార్ అమత్, రాకేష్ కుమార్ యాదవ్, అఖిల్ పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలు లేని జిల్లాగా మారుద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మారుద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారం జిల్లా ఎస్పీ తుషార్డూడితో కలిసి చిత్తూరు జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు వెన్నెముక వంటి యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జిల్లాలోని 25 జెడ్పీ హైస్కూళ్ల పరిసరాల్లో వారం రోజుల్లోపు రూ.2 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే డ్రాయింగ్, వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి కళాశాలలో ఒక నోడల్ అధికారిని నియమించి హాస్టళ్లలో అవగాహన పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. విద్యార్థులకు టొబాకో ఉత్పత్తులు విక్రయించే వారిపై దాడులు చేయాలని పోలీస్, ఫుడ్ సేఫ్టీ, ఈగల్ టీమ్స్ను ఆదేశించారు. నగరి, కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, ఆన్లైన్లో అక్రమంగా మందులను ఆర్డర్ చేసి విక్రయించే మెడికల్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్, గంజాయి సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ముట్టుకోరు: ఎస్పీ తుషార్ డూడి ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ‘దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ జోలికి వెళ్లడు‘ అని అన్నారు. జిల్లాను డ్రగ్ రహితంగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా గంజాయి సాగుపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఈగల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కీర్తన, వ్యవసాయ శాఖ జేడీ మురళి, ఈగల్ ప్రతినిధి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
యువతే దేశానికి అసలైన సంపద
యువతే మన దేశానికి అసలైన సంపద అని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. గ్రామాలకు 104 వాహనంలో ఆల్బెండజోల్ సస్పెన్షన్, అల్యూమినియం హైడ్రోక్లోరైడ్, మెగ్నీషియం+సమిథికాన్ సిరప్, ఆంట్రాక్సోల్ సిరప్, ఎమోక్సిసిలిన్ క్యాప్సుల్స్, ఎటెనిరాల్, బెం జోయిక్ యాసిడ్–సాల్సిలిక్ యాసిడ్ ఆయింట్మెంట్, బిమటోఫ్రాస్ట్ ఐ డ్రాప్స్, సిఫిక్సిమ్ సస్పెన్షన్, సిప్రోఫ్లోక్సాసిన్ ఇయర్, ఐ డ్రాప్స్, క్లోట్రిమోజోల్ క్రీము, డాంపెరిటోన్ సస్పెన్షన్, ఇటో ఫైలిన్–రి యోఫైలిన్ ఇంజక్షన్, ఫ్రామిసైటిస్ సల్ఫేట్ క్రీమ్, ప్రామిసైటిన్+డెక్సామిథాజోన్+కోట్రిమజోల్ ఆయింట్మెంట్, ఫెరాక్రీలం అయింట్మెంట్, ప్యూరాజోలిడాన్ సస్పెన్షన్, లివోసిట్రిజిన్ సిరప్, లివో సిట్రిజిన్ మాంటీలుకాస్ట్ ట్యాబ్లెట్స్, మెట్రోనిడజోల్ సస్పెన్షన్, మెట్రోనిడజోల్ 400 ఎంజీ ట్యాబ్లెట్స్, మినరల్ ఆయిల్–హైడ్రాక్సీ ప్రొఫైల్ సంయుక్త ఐ లూబ్రికెంట్, ఓఆర్ఎస్, పారాసిటమాల్ ఇంజక్షన్లు, ప్రీమెతిరిన్ క్రీమ్, పావిడన్ ఆయోడిన్ 5 శాతం అయింట్మెంట్, టెల్మిసార్ధన్ 40 తదితర మందులు ఉండడం లేదు. సిరంజీల్లో 2 సీసీ, 5 సీసీ లేవు, ఐవీ సెట్లు, బ్యాండ్ ఎయిడ్లు 10, 15 సెంటీమీటర్లు, టార్న్ క్విట్ పీడియాట్రిక్ లింబ్స్, పేపర్ ప్లాస్టర్ 3 ఇంచ్, గ్లాజులు మీడియం, లార్డ్, డిస్పోజబుల్ గ్లాజులు, డిజిటల్ బీపీ మెషిన్ కూడా లేకుండానే 104 సేవలను కొనసాగిస్తున్నారు. మందుల కొరతతో కొన్నిచోట్ల షార్ట్ ఎంకై ్వరీ మందులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని కొందరు సిబ్బంది వాపోతున్నారు. డ్రగ్స్ స్టోర్ నుంచే స్టాక్ రావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. పట్టి పీడిస్తున్న మందుల కొరత -
నిశీధిలో డైట్
నిధుల లేమి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కార్వేటినగరం డైట్కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇక్కడ దాదాపు తెలుగు, తమిళ భాషలకు సంబంధించి 260 మందికి పైగా ఛాత్రోపాధ్యాయులు శిక్షణ తీసుకునే వారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ డైట్పై శీతకన్ను వేయడం, ప్రైవేటు కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఇక్కడ దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడ డైట్లో రక్షణ కొరవడింది. బయటి వ్యక్తులు సైతం డైట్ వసతి గృహంలో ఉంటున్నట్టు సమాచారం. ఇప్పటికై నా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి డైట్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్వేటినగరం : కార్వేటినగరంలోని జిల్లా ఉన్నత విద్య శిక్షణ సంస్థ(డైట్)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులు డైట్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా తయారైంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే అంధకారం నెలకొంటోంది. వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చీకట్లో కాలం వెల్లదీయాల్సి వస్తోంది. వసతి గృహం నుంచి అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట విష పురుగుల సంచారం అధికంగా ఉండడంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని వాపోతున్నారు. సెల్ ఫోన్ల వెలుతురులో బయటకు రావాల్సి వస్తోందని చెబుతున్నారు. కార్వేటినగరంలోని డైట్లో మొత్తం 67 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాలలో సుమారు వంద మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ అరకొర వసతుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల డైట్ ఆవరణలో కొండ చిలువ సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మనీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మట్టి తోలి మాయ చేశారు డైట్లో పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తూ గుంతను తలపించేది. ఈ సమస్యను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ రూ.10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మకై ్క మట్టి తోలి చదును చేయకుండా చేతులు దులుపుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. భవనాలు పెయింటింగ్ వేసి రూ.లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిటికీలకు మెస్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ పనులు చేయలేదన్నారు. అలాగే సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తొలగించారు. వాటి స్థానంలో నూతనంగా గదుల నిర్మాణం కోసం మట్టిని తవ్వి వదిలేసినట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి డైట్లో జరిగిన నిధుల గోల్మాల్పై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మురికి కూపంలా డైట్ డైట్లో పారిశుద్ధ్యం లోపించింది. నీటి ట్యాంకు వద్ద నీరు వృథాగా పోతుండడంతో బురదమయంగా మారింది. ట్యాంకు చుట్టూ పాచి పట్టి దుస్థితికి చేరింది. దోమలు వృద్ధి చెంది రాత్రిళ్లు దాడి చేస్తుండడంతో సరిగ్గా నిద్ర పట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ట్యాంకును శుభ్రం చేయడంతోపాటు నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. -
కేజీబీవీలలో పటిష్ట భద్రత
– నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో విద్యార్థినుల భద్రతను మరింత మెరుగు రిచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడంతో పాటు, క్రమశిక్షణను పర్యవేక్షించడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టారు. 8 కేజీబీవీల పనితీరును జిల్లా కేంద్రంలోని సమగ్రశిక్ష శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఏర్పా టు చేసిన మానిటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. సిబ్బంది పనితీరు, విద్యార్థుల ఆహార నాణ్యతను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించవచ్చని తెలిపారు. కేజీబీవీ జీసీడీఓ ఇంద్రాణి పాల్గొన్నారు. నిఘా నీడలో విద్యాలయాలు -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 71 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 97, సర్వీసు లైన్ పరంగా 03 కలిపి మొత్తం 171 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. అందులో 9 సమస్యలను పరిష్కరించామన్నారు. మిగిలినవి ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరిష్కరించనున్నట్లు వివరించారు. పీసీఆర్ పాఠశాలలో జేడీ తనిఖీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలను జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులపై ఆయన ఆరా తీశారు. జేడీ మాట్లాడుతూ భవనం వారసత్వ సంపద దెబ్బతినకుండా, ఆధునిక సాంకేతికతతో పనులు చేపట్టాలన్నారు. గోడల పటిష్టత, పైకప్పు లీకేజీ నివారణ చర్యలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోడింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, డీసీఈబీ సెక్రెటరీ హేమాద్రి, ఎంఈఓ పాండ్యన్, హెచ్ఎం పూర్వాణి, పీడీ దేవా తదితర అధికారులు పాల్గొన్నారు. 4 నుంచి ‘మై సైన్స్ గ్యారేజ్’ తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 4 నుంచి ఏడాది పొడవునా మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 3, 4, 5వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లలే స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఈ గ్యారేజ్ను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్ను సైన్స్ సెంటర్ అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు రూ.2వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
టులిప్స్తో గంజాయ్!
అటు గంజాయి.. ఇటు టులిప్స్! చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ఇటీవల గంజాయి వాడకం విచ్చలవిడిగా తయారయ్యింది. పలు జూనియర్ కళాశాలల నుంచి డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల ఆవరణలో గంజాయి నింపిన సిగరెట్లను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ‘జాయింట్’గా పిలుచుకుంటున్న గంజాయి సిగరెట్ల పట్ల యువత సులువగా ఆకర్షితులైపోతున్నారు. ఒక్కో సిగరెట్ రూ.100 రూ.200 వరకు దొరుకుతోంది. జిల్లాలోకి వచ్చే ప్రధాన గంజాయి వనరు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని సరిహద్దు జిల్లాల నుంచే చిత్తూరులోకి ఎక్కువగా వస్తోంది. అయితే పూతలపట్టులోని బండపల్లె గంజాయి డంప్ కేంద్రంగా ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడి నుంచి పలమనేరు.. బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న పలువురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బాల్యానికి టులిప్ భయం గంజాయి విషయం అటుంచితే.. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు పాఠశాల స్థాయి విద్యార్థుల్లోకి వెళుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు, నగరి, పలమనేరు ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని టులిప్స్గా పిలుచుకుంటున్నారు. చిత్తూరు నగరంలో ప్రతి ఒక్క దుకాణంలో పొగాకుతో తయారైన ఈ టులిప్ ప్యాకెట్లు లభిస్తున్నాయి. చిన్నచిన్న పొట్లాల్లో కనిపించే వీటిని తీసుకుని నాలుకపై పెట్టుకోవడం, నోట్లో పెట్టుకుంటే మత్తు ఎక్కుతుందని భావించి పిల్లలు వీటికి బానిసై పోతున్నారు. చిత్తూరులో టులిప్ నియంత్రణ చేయిదాటిపోతోంది. నిత్యం పోలీసులు పాఠశాలల ఆవరణల్లో తనిఖీలు చేస్తూ, వీటిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నా.. అంతే మొత్తంలో మళ్లీ మార్కెట్లోకి ప్రత్యక్షమవుతోంది. వీటిని దిగుమతి చేస్తున్న స్మగ్లర్లను పట్టుకుంటే తప్ప ఈ జాడ్యంకు కళ్లెం వేయడం సాధ్యం కాదు. చిత్తూరులో పొగాకు ఉత్పత్తులపై దాడులు చేస్తున్న పోలీసులు, అధికారులుగుడిపాల స్టేషన్ వద్ద రెండు రోజుల క్రితం సీజ్ చేసిన పొగాకు ఉత్పత్తులు ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీడీ రవికుమార్ వెదురుకుప్పం: జాబ్ కార్డ్ అప్లోడ్ ఎందుకు చేయలేదంటూ టీకేఎం పురం క్షేత్ర సహాయకుడుపై డ్వామా పీడీ రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కింద గ్రామాల్లో వివిధ పనుల కోసం 10.79 కోట్లు నిధులు వెచ్చించారు. దీనికి సంబంధించి సామాజిక తనిఖీ జరగగా మంగళవారం వెదురుకుప్పంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ రవికుమార్ ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం బుక్లు కళ్లుమూసుకుని రాస్తావా అంటూ జేఈ మునిరత్నంను అడిగారు. మొక్కల పెంపకానికి సంబంధించి బిల్లులు ఎలా చెల్లించారని టెక్నికల్ అసిస్టెంట్ రూపేష్పై అసహనం వ్యక్తం చేశారు. ఏపీడీ సునీల్ కుమార్, ఎంపీడీఓ పురుషోత్తం, ఏపీఓలు మీనాకుమారి, ఇందు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. రూ. 22,267 రికవరీకి ఆదేశం మండలంలోని 2024–2025 సంవత్సరంలో జరిగిన గ్రామీణ ఉపాధి పథకంలో వేజ్ పేమెంట్ కింద రూ.7.79 కోట్లు, మెటీరియల్ పనుల కింద రూ. 3 కోట్లు ఖర్చు పెట్టగా ఇందులో రూ.22,267 రికవరీకి పీడీ రవికుమార్ ఆదేశించారు. వీటిని తక్షణమే రికవరీ చేయాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు కర్ణాటక.. ఇటు తమిళనాడు.. మధ్యలో చిత్తూరు జిల్లా. 15 నిమిషాల్లో రాష్ట్రం దాటే అవకాశం. ఈ మాత్రం హింట్ ఇస్తే రెచ్చిపోతాం అన్నట్లు.. స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రధానంగా గంజాయితో పాటు ఇప్పుడు పొగాకు ఉత్పత్తులు జిల్లాలోకి భారీగా దిగుమతి అవుతున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారవుతోంది. సీరియస్గా తీసుకుంటాం టులిప్స్, గుట్కా లాంటివాటిపై కొన్ని చోట్ల నిషేధం ఉంటే.. మరికొన్ని చోట్ల విక్రయాలు చేసుకునే వెసులుబాటు ఉంది. మన జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు అంతర్రాష్ట్రాలకు చేరువలో ఉండడంతో పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతవుతున్నాయి. అయినాసరే మా వాళ్లు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నారు. ఇదే వృత్తిగా ఎంచుకున్న స్మగ్లర్లను ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదు. దీనిపై సీరియస్గా ముందుకు వెళుతున్నాం. చర్యలు కఠినంగా ఉంటాయి. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు. -
బాధ్యతగా మత్స్యకారుల భద్రత
తిరుపతి మంగళం : పులికాట్ సరస్సు పరిధిలోని సుమారు 20వేల మంది మత్స్యకారుల భద్రతను కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు పార్లమెంట్లో మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ మాట్లాడుతూ రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో పెద్ద యాంత్రిక పడవలతో పొరుగు రాష్ట్రాల జాలర్లు అక్రమంగా చొరబడి వలలు, పడవలకు నష్టం కలిగించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి, శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత, మత్స్యకారుల అక్రమ చొరబాట్ల నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ మండళ్లు ఏర్పాటు చేస్తే సమస్యల తీరిపోదని స్పష్టం చేశారు. తీరంలో కట్టుదిట్టంగా గస్తీ పెట్టాలని, అక్రమంగా చొరబడిన మర పడవలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని శాశ్వత అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,483 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
గ్యాస్ మంట
పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్రీ పాయింట్లు, హోటళ్లలో ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ధరలు పెంచినట్లు బోర్డులు పెట్టారు. గుడిపాలలో చాలా వరకు హోటళ్లు వారు గ్యాస్ పొయ్యికి బదులు కట్టెల పొయ్యికి మారిపోయారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, పానీపూరి సెంటర్లు, చిన్న హోటళ్లను మూసివేశారు. కొన్ని ఇళ్లలో గ్యాస్ స్టవ్లకు బదులు ఆరుబయట కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నారు. గుడిపాల మండలంలో పాటు చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. – గుడిపాల గ్యాస్ పెరగడంతో హోటల్లోని మెనూలో 10 రూపాయలు పెంచుతూ బోర్డు , గుడిపాలలో కట్టెల పొయ్యిపై వంటలు -
పరిహారంపై అక్షింతలు
పలమనేరు: పూర్వపు పలమనేరు రెవిన్యూ డివిజన్లోని సదుం మండలం కభంవారిపల్లి పంచాయతీ చింతపర్తివారిపల్లి వద్ద గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కొత్త చెరువు ప్రాజెక్టును నిర్మించింది. దీని నిర్మాణం కోసం అక్కడి రైతు ల నుంచి భూములను ఎల్ఏ ద్వారా సేకరించారు. కానీ వారికి ఆపై నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. వీరిలో కొందరు హైకోర్టుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇక్కడి రెవెన్యూ అధికారులు వెంటనే పరిహారాన్ని రైతులకివ్వాలని ఆదేశించడంతో ఇప్పుడు దారిలోకి వచ్చిన అధికారులు ఈ పనులను చేపడుతున్నారు. వీరిలోనూ కొందరికి పరిహారం దక్కలేదు. దీంతో వీరు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతపర్తివారిపల్లి వద్ద పచ్చార్లొంకపై గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కొత్త చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి పూను కుంది. ఇందుకోసం ఆ ప్రాంతంలోని 82 ఎకరాల పట్టాభూములు, 43.53 ఎకరాల డీకేటీ భూములు, 52 ఎకరాల ప్రభుత్వభూమి మొత్తం 176 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించారు. ఇందుకు నష్టపరిహారంగా బాధిత రైతులకు రూ.13.76 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే పరిహారం ఇవ్వకుండా రైతులను పరిహాసం చేశారు. దీనిపై ఆగ్రహించిన వై.లక్ష్మమ్మతోపాటు మరో 65మంది పిటిషనర్లుగా ఇరిగేషన్శాఖ, సీఈఓ ఇరిగేషన్, కలెక్టర్, ఆర్డీఓ, సదుం తహశీల్దార్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతివాదులుగా చేస్తూ హైకోర్టులో 2024లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం బాధితులకు అవార్డు పాసైనప్పటినుంచి ఇప్పటిదాకా ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. దీంతో రైతులు కోర్టు ధిక్కరణకు వెళ్లగా తాజాగా హైకోర్టు అక్షింతలు వేయడంతో పరిహారం ఇచ్చేందుకు అధికారులు పూనుకున్నారు. మరో తిరకాసు మొత్తం బాధిత రైతుల్లో 88 మందికి రూ.8కోట్ల దాకా పరిహారం దక్కింది. పరిహారం దక్కని రైతులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దకొచ్చి సదుం రెవెన్యూ అధికారులకు డబ్బులిచ్చిన వారికి మాత్రం పరిహారం ఇస్తూ తమలాంటిి పేదలకు అన్యాయం చేశారంటూ ఆరోపించారు. ఆర్డీఓ వీరికి నచ్చజెప్పినా పట్టించుకోలేదు. సదుం మండల తహశీల్దార్తోపాటు వీఆర్ఓ దాకా తమ సమస్యకు కారణమంటూ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో చింతపర్తివారిపల్లి వద్ద నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టు , వడ్డీతో పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు అందరికీ న్యాయం చేస్తాం కొంతమంది రైతులు వచ్చి రకరాకాల ఆరోపణలు చేసిన మాట నిజమే. కానీ మొత్తం రైతుల్లో అన్ని బ్యాంకు ఖాతా నెంబర్లు కరెక్ట్గా ఉన్నవారి ఖాతాలకు అవార్డు జమ అయింది. కొందరు రైతులు గతంలో గ్రామీణ బ్యాంకు ఖాతాలను ఇచ్చారు. అయితే ఆ బ్యాంకు ఇప్పు డు కెనరా బ్యాంకుతో కలిసినందున ఖాతాలు మారా యి. సీఎఫ్ఎంఎస్లో ఖాతాలకు సంబంధించిన సమస్యలతో రిజెక్ట్ అయినమాట నిజ మే. చాలామందికి డాక్యుమెంట్లు, ఖాతాలను అప్డేట్ చేశాం. మిగిలినవారి సమస్యలను పరిష్కరిస్తాం. అయి తే ఈ వ్యవహారంలో అధికారులు మామూళ్లు తీసుకున్నారనేది నిజం కాదు. – భవానీ, ఆర్డీఓ, పలమనేరు -
ట్రైనీ సబ్ రిజిస్ట్రార్గా నాగార్జున
చిత్తూరు కార్పొరేషన్: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ట్రైనీ సబ్ రిజిస్ట్రార్లగా సుస్మిత, నాగార్జునను నియమించారు. బంగారుపాళ్యం కుర్మాయిపల్లెకు చెందిన నాగార్జున కడప సీఐఎస్ఎఫ్ ఎస్ఐగా ఉత్తరాఖండ్లో 2018–2026 వరకు విధులు నిర్వహించారు. తదుపరి ఉన్నత పరీక్షలు రాసి వైఎస్ఆర్ జిల్లా ఏటీడబ్ల్యూగా బాధ్యతలు చేపట్టారు. గ్రూప్స్–2లో ఎంపికై చిత్తూరు జిల్లాకు కేటాయించబడ్డా. సంవత్సరం పాటు ట్రైనీ సబ్ రిజిస్ట్రార్గా నగరంలో పనిచేయనున్నారు. ఆయనకు నియమాకపత్రాలను జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి మంగళవారం అందజేశారు. నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు పులిచెర్ల(కల్లూరు): నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వివిధ కోర్టుల్లో ష్యూరిటీగా వినియోగిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంపీడీఓ పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ సీళ్లు తయారు చేసి, వాటితో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ద్వారా తిరుపతి, పా కాల, పుంగనూరు, పీలేరు, చిత్తూరు కోర్టుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు ష్యూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సీళ్లు, రబ్బరు స్టాంపులు, ఇంక్ప్యాడ్, వ్యాల్యుయేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకొన్నారు. పులిచెర్ల 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన డి.ఆంజనేయులు, సి.రవి, చిన్నగొట్టిగల్లుకు చెందిన నీలం వెంకటరమణ, తిరుపతికి చెందిన పి.బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కుప్పం రూరల్: చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండ లం మోట్లచేను గ్రామంలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మృతి చెంది... మంగళ వారం బయటపడ్డ సంఘటన వివరాలు స్థానికుల కథనం మేరకు ఇలా ఉంది. మోట్లచేను గ్రామానికి చెందిన భూపతి(38)కి, భార్య మధ్యన తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా ఇరువురు గొడవలు పడ్డారు. ఆదివారం తరువాత భూపతి కనిపించకుండా పోయాడు. తీరా మంగళవారం గ్రామం సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసు కుని వేలాడుతున్న భూపతి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. భూపతి మృతి చెందిన తీరు... సంఘటనలో ఆనవాళ్లను బట్టి స్థానికు లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులపై దాడి చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఏసీబీ అధికారులపై దాడి చేసినందుకు సనంగి రామకృష్ణ, సనంగి సతీష్ అనే అన్నదమ్ములపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ సీఐ నెట్టి కంఠయ్య కథనం మేరకు.. చిత్తూరులోని స్టాంపులు–రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో బయట రైటర్లు ఉన్న పలు దు కాణాల్లో తనిఖీలు చేశారు. ఏసీబీ కానిస్టేబుళ్లు ధనుంజయ్, లీలాప్రసాద్ తనిఖీలు చేస్తున్న సమయంలో వెలుపల ఉన్న రైటర్స్ దుకాణంలో ఉన్న రామకృష్ణ, సతీష్ వాదనకు దిగారు. ఆపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేశారు. దీంతో ఏసీబీ సీఐ నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ‘గాలేరు– నగరి’ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్ తిరుపతి అర్బన్: గాలేరు–నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి పూల మొక్కను అందజేశారు. పాఠశాలకు మౌలిక వసతులు గుడిపాల: పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. మంగళవారం నరహరిపేట జెడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలోని బిల్డింగ్లకు పెయింటింగ్, విద్యార్థులకు డెస్క్లు, పాఠశాల పైకప్పుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను తెలియజేస్తేపరిష్కరిస్తామన్నారు. ప్రకృతి సేద్యంతో అధిక ఆదాయం తవణంపల్లె: ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం వస్తుందని జిల్లా రీసోర్స్ సెంటర్ అధికారి లక్ష్మీప్రసన్న తెలిపారు. మంగళవారం మండలంలోని చెర్లోపల్లెలో పీఎం ఆర్కేవీవై(ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) పథకం కింద రైతులకు వ్యవసాయ సాంకేతికత, సమగ్ర పోషక నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈఓ కుసుమ, ఏఓ వందన, రైతులు పాల్గొన్నారు. -
మామిడి ముందస్తు అంచనా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మామిడి దిగుబడి అంచనాను ఉద్యాన శాఖ అధికారులు పూర్తి చేశారు. తోతాపురి 40024 హెక్టార్లకు 483981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చునని అంచనా వేశారు. అలాగే బేనీషా 6856 హెక్టార్లకు 42242 టన్నులు, కాదర్ 2702 హెక్టార్లకు 18834 టన్నులు, నీలం 5178 హెక్టార్లకు 42242 టన్నులు, మల్లిక 1349 హెక్టార్లకు 10444 టన్నులు, ఇత ర రకం 3217 హెక్టార్లకు 23509 టన్నుల దిగుబడి ఉండవచ్చునని ముందస్తుగా గుర్తించారు. మొత్తంగా 59326 హెక్టార్లు ఉండగా సుమారు 621252 హెక్టార్లల్లో దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యం చిత్తూరు రూరల్ (కాణిపాకం): రానున్న రెండు సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాలో క్షయవ్యాధి కేసులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం టీబీ నిర్ధారణ సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లాలో సుమారు 2,500 నుంచి 3,000 వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరికి సమయానికి మందులు అందజేస్తున్నామని తెలిపారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభించి, ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే టీబీ పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, చుడా చైర్మన్ కఠారి హేమలత, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్పొరేట్కు ప్రభుత్వ భూములు – సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ నగరి: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేయాలంటూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నగరి టవర్ క్లాక్ సెంటర్ నుంచి నిర్వహించిన ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు వందల ఎకరాలు దోచిపెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ కచ్చితంగా అందరికీ పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, పార్టీ నాయకులు మురళి, శిరావుద్దీన్, యేసయ్య, రాజేంద్రన్, సతీష్. నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు పార్వతి, కుట్టి, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఏసీబీ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన ఏసీబీ తనిఖీలు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం సాయంత్రం 4.55 గంటలకు తనిఖీలు ప్రారంభించి 24 గంటలు పూర్తిగా తనిఖీలు చేశారు. సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన సమయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక అటెండర్ అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఆ సిబ్బంది మంగళవారం సైతం విధులకు హాజరు కాలేదు. సబ్రిజిస్ట్రార్, ఇతర విభాగాల సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు, వారి అసిస్టెంట్లను విచారించారు. పలు ఫైల్స్ను పరిశీలించారు. నిషేధిత భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని ఏసీబీ గుర్తించి, వివరాలు సేకరించింది. ఏసీబీ తనిఖీల సమయంలో కార్యాలయంలోని వివిధ ప్రదేశాల్లో రూ.30,200, ఉద్యోగుల వద్ద రూ.4,440, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.79,090 లభించాయి. అనధికార నగదు రూ.1,12,730ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 15 మంది దస్తావేజు లేఖరుల్ని విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో డాక్యుమెంట్ రైటర్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు -
ఉపాధ్యాయుల రణభేరి
– నిరాహార దీక్షకు మద్దతు పలికిన సీపీఐ జాతీయ కార్యదర్శి నగరి: ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమ లు, పెండింగ్ డీఏల విడుదల, ఆర్థిక బకాయిల సాధ న కోసం రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాలలో ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మంగళవారం చిత్తూరు జిల్లా, నగ రి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఈ నిరాహార దీక్షా శిబిరంలో యూటీఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మణిగండన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. 12వ పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లవుతున్నా అమలుకు ప్రయత్నించకపోవడం ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలను అమలు చేయడంతో పాటు, ఆర్థిక బకాయిలన్నిటినీ ఆరు మాసాలలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూట మి ప్రభుత్వం ఆ వైపుగా కనీసం ఆలోచించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. తిరుపతి జిల్లా సహాధ్యక్షురాలు గీతమ్మ మా ట్లాడుతూ తక్షణం నూతన పీఆర్సీని ఏర్పాటు చేసి అది అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11500 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ మెమో నెంబరు 57 మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతర్ చేసిందని జిల్లా కార్యదర్శి కె.వంశీకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహరదీక్షలు చేపడతామన్నారు. అప్పటికీ చలించకుంటే ఏప్రిల్ 22వ తేదీ చలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శేఖర్, పూర్వ రాష్ట్ర కౌన్సిల ర్లు పీఆర్ మునిరత్నం, కుప్పరాజు, జిల్లా నాయకులు జయరాజ్, నరేష్, రవీంద్రబాబు, కొలత్తూరు భాస్క ర్, జాన్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులతో పాటు నిరాహార దీక్షా శిబిరంలో బైఠాయించారు. కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓ అనుపమకు వినతిపత్రాన్ని అందజేశారు. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. వాటిని దశ ల వారీగా పరిష్కారించనున్నట్లు వివరించారు. ‘సంపన్న కారి కార్యక్రమం’ వరం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు సంపన్న కారి కార్యక్రమం వరం లాంటిందని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాల అభివృద్ధికి రూపొందించినదే సంపన్న కారి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటు నాలుగు లక్షల వరకు సున్నా వడ్డీ రుణ సదుపాయం అందిస్తారన్నారు. జిల్లాలో ఇందుకు అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం రవి, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, రవి, డీఆర్డీఏ అధికారులు కేశవులు , మణి పాల్గొన్నారు. -
ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిప ల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ సుమిత్కుమార్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్, కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి కలెక్టరేట్లోని చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్యేక అధికారిగా సుమిత్కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే పాలకవర్గాల (కౌన్సి ల్) గడువు పూర్తవడంతో.. కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి మునిసిపల్ ఎన్నికలు జరిగేంత వరకు కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. ఏడాదిగా పెండింగ్ చిత్తూరు కార్పొరేషన్: వ్యవసాయ సర్వీసుకు గత ఏడాది ఫిబ్రవరిలో డబ్బులు కట్టినా విడుదల చేయలేదని సోమల నుంచి రైతు మునేంద్రబాబు ఫిర్యాదు చేశారు. సోమవారం ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే పుంగనూరులోని నగరి ఎస్ఎస్ గ్రామంలో ఉదయం 7–8 గంటల మధ్యలో లోఓల్టేజీ సమస్య వేధిస్తోందని వినియోగదారుడు వాసుదేవయ్యశెట్టి తెలిపారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఈ హామీ ఇచ్చారు. -
అర్హులు ఎవరంటే?
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే ఐదు శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్న్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉన్న వారికి ఐదు శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు. చిత్తూరు కలెక్టరేట్ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31లోగా (www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనుంది. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30వ తేదీ వరకు ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఏడు కేంద్రాల్లో నిర్వహణ ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ)లలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భావి శాస్త్రవేత్తలకు వేదికగా యువికా–2026 సద్వినియోగం చేసుకోవాలి 9వ తరగతి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యువ విజ్ఞాని కార్యక్రమానికి జిల్లాలోని 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ణానం పై ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదిక. ఈ శిక్షణలో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 శాతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. – సుమిత్కుమార్గాంధీ, కలెక్టర్, చిత్తూరు -
పొగాకు ఉత్పత్తుల రవాణా గుట్టురట్టు
అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను యాదమరి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసు గ్రీవెన్స్కు 28 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదా లు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమ స్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయ డంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. -
సంక్షేమం పట్టదా బాబూ?
కార్వేటినగరం: సంపద సృష్టించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతానని నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు విస్మరించారని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు.సోమవారం ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల కడుపుకొట్టేందుకు సిద్ధమైందన్నారు. గత వైఎస్సార్సీపీ హ యాంలో పేదల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అమలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు రెండేళ్లు అవుతు న్నా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్సిక్స్ హిట్ అంటూ ప్లాప్ షోలు చూపించి పేదల నడ్డి విరుస్తోందన్నారు. యువతకు కొత్తగా రుణాలు ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. గ్రామాల్లో నీటి పన్ను, చెత్త పన్ను, చిరు వ్యాపారస్తులపై కూడా ట్రేడ్ ఫీజుల పేరిట ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. పరామర్శ ఆళత్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకు డు ముత్యాలశెట్టి(53) అనారోగ్యంతో మృతి చెందా రు. సమాచారం అందుకున్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆయన గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి పిల్లల భవిష్యత్తుకు తాను బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా కొత్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసులునాయుడు అన్న సుబ్రమణ్యంనాయుడు భార్య లక్ష్మీదేవి(65) అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామానికి వెళ్లి లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మాజీ జేసీఎస్ కన్వీనర్ పురంధర్, నాయకులు చిరంజీవిరెడ్డి, మురాజ్, శ్రీనివాసులునాయుడు, జనార్దన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చిరంజీవులునాయుడు, ధర్మయ్య, శేఖర్రెడ్డి, కుమార్, ధనకోటేశ్వరరావు, అర్జున్, పెద్దబ్బ, సురేష్నాయుడు ఉన్నారు. -
యువతను దగా చేస్తున్న బాబు
తిరుపతి మంగళం: ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను నమ్మించినట్లే యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇస్తానంటూ చంద్రబాబు యువతను దగా చేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు ఉదయ్వంశీ మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా కేవలం ప్రచారం కోసం 10,060 ఉద్యోగాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి న కూటమి ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీలను నిలబెట్టుకోలేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
సెమిస్టర్ ఫలితాలు విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఎన్.పి.సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రథ మ సెమిస్టర్ ఫలితాలు సోమవారం ఎస్వీ యూ నివర్సిటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రణాళిక, అభివృద్ధి మండలి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎన్.పి.వెంకటేశ్వరచౌదరి మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు కేవలం విద్యలోనే కాకుండా క్రీడలు, ఇతర అంశాల్లో సైతం ప్రతిభను చాటుతుండడం గర్వ కారణమన్నారు. సీపీడీసీ సభ్యులు, పూర్వ విద్యార్థిని డాక్టర్ ఎం.శైలజా మాట్లాడుతూ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను గౌర వించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.మనోహర్ మాట్లాడుతూ కళాశాల స్వయం ప్రతిపత్తి సాధించిన తొలి ప్రయత్నంలోనే 76.54 శా తం ఉత్తీర్ణత సాధించడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు మార్కుల మెమోలను అందజేశారు. -
వర్మీకంపోస్టు, జీవామృతం వల్ల లాభాలు
పుత్తూరు: మండలంలోని రామసముద్రం గ్రామానికి చెందిన ఎస్.మహేశ్వరరావు, పద్మావతి దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రైతు కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. మహేశ్వరరావుకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించి పదేళ్ల క్రితమే మొదలు పెట్టారు. మనం అందించే వ్యవసాయ ఉత్పత్తులు ఆకలిని తీర్చడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్నది ఆ దంపతుల ఆశయం. ఇందుకు వర్మీకంపోస్టును ఎంచుకున్నారు. దీంతో పాటు జీవామృతం, ఘనజీవామృతాలను గత పదేళ్లుగా తామే తయారు చేస్తూ, ఇతర రైతులకు విక్రయిస్తూ, తామూ వినియోగిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలా వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలు మరో రెండు చోట్ల మాత్రమే ఉండడం గమనార్హం. రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణ కాల్వలో రామ్మోహన్నాయుడు, వడమాలపేట మండలం, వేమూరులో అయ్యప్పనాయుడు వర్మీకంపోస్టులను నిర్వహిస్తున్నారు. జీవామృతం తయారీ ఇలా.. ఆవులను పెంచాలి ప్రతి రైతు ఆవులను పెంచాలి. నా తల్లిదండ్రులు నిర్మాలాదేవి, వెంకటాచలంనాయుడు నాకు 50 దేశీయ ఆవులనిచ్చారు. నేను వాటిని 70కి పెంచాను. నా భార్య పద్మావతి ప్రకృతి సేద్యం చేయడంలో పూర్తి సహకారం అందిస్తోంది. ఇద్దరం కలసి ఆవు పేడతో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నాం. పంటల సాగులో దానిని వినియోగిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నాం. మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకొనే ఆహారం విషతుల్యం కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన పంటలు తయారు పండించడానికి ప్రతి రైతు ముందుకు రావాలి. వర్మీకంపోస్టును స్వయంగా తయారు చేస్తున్నాం. పలువురికి విక్రయిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎస్.మహేశ్వరరావు, పద్మావతి, వర్మీకంపోస్టు తయారీదారి దంపతులు, రామసముద్రం, పుత్తూరు మండలం కూరగాయలు పండించాలి ప్రస్తుత సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయమే మార్గం. ప్రతి కుటుంబం 15 రకాల కూరగాలను పండించే విధానాన్ని అందిపుచ్చుకోవాలి. 1996లో తిరుపతిలో ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంస్థ (వర్డ్) ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కోసం పనిచేస్తున్నాం. ఈ కోవలో నడుస్తున్న రైతులందరికీ ప్రభుత్వం తనవంతు సహకారం అందించాలి. అలాగే హైస్కూల్ నుంచి యూనివర్సీటీ విద్యార్థుల వరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవాటు చేయాలి. – డాక్టర్ కె.గంగాధరం, కార్యదర్శి, వర్డ్, తిరుపతి ఆ దంపతులకు ప్రకృతి సేద్యంపై మక్కువ ఎక్కువ. వర్మీకంపోస్టు, జీవామృతం ద్వారా వ్యవసాయం చేయడంలో ముందుంటారు. గత పదేళ్లుగా వర్మీకంపోస్టును తయారు చేస్తునానరు. దాన్ని నిస్సారమైన భూముల్లో సైతం వినియోగిస్తూ తద్వారా ఆ భూములను సారవంతం చేసి పునరుజ్జీవం పోస్తున్నారు. తాము తయారు చేసిన వర్మీకంపోస్టును ఇతర రైతులకూ విక్రయిస్తూ, వారిని ప్రకృతి సేద్యం పైపుగా నడిపిస్తున్నారు. వారే పుత్తూరు మండలానికి చెందిన మహేశ్వరరావు, పద్మావతి దంపతులు. వర్మీకంపోస్టు, జీవామృతం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పొగాకు ఉత్పత్తుల రవాణా గుట్టురట్టు
యాదమరి: అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను యాదమరి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపిన వివరాలు మేరకు.. సోమవారం ఉదయం యాదమరి పోలీసు బృందం బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టాటా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎటువంటి బిల్లులు లేకుండా పొగాకు ఉత్పత్తుల ప్యాకె ట్లు బయటపడ్డాయి. బెంగళూరుకు చెందిన వాహన డ్రైవర్ నదీమ్ పాషా, తబ్రీజ్ను అదుపులోకి తీసుకుని విచారించగా, అదే ప్రాంతానికి చెందిన తమ యజమాని ఆదేశాల మేరకు సరుకుని తిరుపతికి తరలిస్తున్నామని వెల్లడించారు. వాహనంలో సుమారు రూ.8,99,496 విలువ చేసే 93 సంచుల పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వరల్డ్ టీబీడే వేడుకలు రేపు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులో మంగళవారం వరల్డ్ టీబీ డే–2026 వేడుకలు నిర్వహించనున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి గాంధీ విగ్ర హం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నా రు. సమావేశంలో టీబీ నిర్మూలనపై అవగాహన కల్పించ డంతో పాటు టీబీ ముక్త పంచాయతీ కార్యక్రమంలో భాగంగా 27 టీబీ రహిత పంచాయతీలకు గాంధీ విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఉత్తమంగా పనిచేసిన వారికి సత్కారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ పాలసముద్రం : మండలంలోని బలిజకండ్రిగ సమీపంలో టీటీడీ దేవస్థానానికి ఎదురూగా ధర్మరాజుల గుడికి తూర్పు భాగమైన అడవిలో పేకాట ఆడుతున్న వారిపై సోమవారం నగరి ఇచార్జ్ డీఎస్సీ సాయినాథ్, కార్వేటినగరం సీఎం హనుమంతప్ప, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, ఎస్బీ కానిస్టేబుల్ శివకుమార్, ఐడీ సిబ్బంది దాడి చేశారు. బలిజకండ్రిగ సమీపంలో రాత్రి పూట పేకాట ఆడుతున్నట్టు అందిన రహస్య సమాచారం మేరకు ఎస్పీ తుషార్డూడీ ఆదేశాలతో దాడి చేసినట్టు ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లు పట్టుబడగా.. మరో ఎనిమిది మంది పరారైనట్టు పేర్కొన్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.55,680 నగదు, ఐదు మోటారు సైకళ్లు, తొమ్మిది మొబైల్ ఫోన్లు, మూడు పేకాట కట్టులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టయిన వారిలో జీ.గోవింద (50), ఎన్.నరసింహన్(38), ఎమ్.రామన్(28), సీ.అరుల్దాస్(49), ఈ.శివరాజ్ (35), ఎమ్.కృష్ణన్ (56) ఉన్నట్టు తెలిపారు. వీరందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసి చిత్తూరు కోర్టులో హాజరు పరిచినట్టు వెల్లడించారు. ఇళ్ల పట్టాలపై విచారణకు ఆదేశం రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీ, లక్ష్మీనారాయణ కాలనీలో ఇళ్ల పట్టాలపై విచారణకు జిల్లా కలెక్టర్ సుమితకుమార్ సోమవారం అదేశాలు జారీ చేశారు. సర్వే నం.1605–1, 1606–2లో 172 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి, సొమ్ము చేసుకున్నారని రొంపిచెర్లకు చెందిన దొరబాబునాయుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలో ఏసీబీ బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తూనే అదే సమయంలో డ్యాకుమెంట్ రైటర్ల దుకాణంలో సోదాలు చేశారు. పలువురు రైటర్లను అదుపులో తీసుకొని కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో రైటర్ రామకృష్ణ తనిఖీకి వచ్చిన ఏసీబీ కానిస్టేబుల్ పై దాడికి దిగారు. తనిఖీకి వచ్చిన సిబ్బందితో ఐడీ కార్డు చూపాలనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రామకృష్ణ గొడవకు దిగి దాడి చేయడంతో టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో రామకృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భారీగా నగదు స్వాధీనం చిత్తూరు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో సీఐలు నరసింహారావు, విద్యసాగర్, రమణతో కూడిన బృందం తనిఖీల్లో చేపట్టింది. రిజిస్ట్రార్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లలో జరిగిన లావాదేవీలను పరిశీలించారు. అక్కడ నిర్ణీత నగదుకు మించి రూ.95 వేలు ఎక్కువగా ఉండడాన్ని గుర్తించారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తనిఖీలప్పుడు కార్యాలయంలోని దస్తావేజు లేఖరులు, వారి సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫోన్ పే లావాదేవీలను పరిశీలించి.. ఈ నగదు ఎవరు పంపారని ఆరా తీశారు. -
జగనన్నతోనే మైనారిటీల అభివృద్ధి
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. పెనుమూరు మండలానికి చెందిన జిల్లా కోఆప్షన్ మెంబర్ అమీన్తో పాటు మైనారిటీ నేతలు ఆదివారం పుత్తూరులోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలసి ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాను న్న 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. జగనన్న పాలనలోనే ముస్లిం, మైనారిటీలకు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించమే కాకుండా మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని అందించిన ఘనత కూడా జగనన్నదేనని, అదే విధంగా మైనారిటీలకు అన్ని రంగాల్లోను అగ్ర పీఠం వేసి అన్ని విధాలుగా ఆదుకోవడంలో జగన్మోహన్రెడ్డిది కీలక పాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని మైనారిటీ సంఘాల నేతలు ఏకతాటిపై నిలిచి 2029 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి మళ్లీ సంక్షేమాలను అందుకోవాలని సూచించారు . ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రిని గజమాలతో ముస్లిం నాయకులు ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకులు అమీన్, ఉమర్అలీ, షబ్బీర్, అమృత్, ఇమ్రాన్, ముహాక్తీయర్,షయూబ్,జునైద్, నవాబ్, జాఫర్, కౌసర్ పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
కోడెగిత్తల జోరు
వెదురుకుప్పం: పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని పాతగుంటలో జరిగిన జల్లికట్టు(ఎద్దుల పందేలు) దుమ్మరేపాయి. అట్టహాసంగా సాగిన జల్లికట్టు యువకుల్లో జోష్ తెచ్చింది. రామచంద్రాపురం, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఎద్దులను పందేనికి తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎద్దులకు పలకలు, వస్త్రాలు కట్టి పందేలకు వదిలారు. కోడెగిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోగా ఎద్దులను నిలువరించి పలకలు పట్టేందుకు యువత పోటీపడ్డారు. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి యువకులు ఆనందం పంచుకున్నారు. ఈ పోటీల్లో ఎద్దుల కింద పడి పలువురు గాయపడ్డారు. చెరువులో పడి రెండు కోడె గిత్తలు మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. సందడే..సందడి పాతగుంటలో ఆదివారం జరిగిన జల్లికట్టులో జగన్ నినాదంతో మారుమోగింది. యువత పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటంతో కూడిన పలకలు, వైఎస్సార్సీపీ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ జెండాలు, పలకలతో కూడిన కోడె గిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోతున్న క్రమంలో యువత జై జగన్ జైజై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు స్థానిక సర్పంచ్ భువనేశ్వరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బండి గోవర్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందన్, వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి బొజ్జారెడ్డి అల్లె వద్ద పూజలు చేసి పోటీలు ప్రారంభించారు. ఎద్దుల పందేలను ప్రారంభిస్తున్న సర్పంచ్ భువనేశ్వరి జనసందోహం -
గజవాహనంపై జగదభిరాముడు
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం రాత్రి గజవాహనం జగదభిరాము డు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి హనుమంత వాహన సేవ వేడుకగా సాగింది. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని సాంస్కృతిక వేదికపై ఆదివారం ప్రదర్శించిన పలు సంగీత, నృత్య కళా బృంద ప్రదర్శనలు భక్తులను అలరించాయి. -
30 ఏళ్ల పాలకులు ఎందుకు చెయ్యలేదు?
మూడేళ్లలో చేసిన అభివృద్ధి.. చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలి నగరి : గత ప్రభుత్వంలో తొలి రెండేళ్లు కరోనా తీవ్రతతో గడచిపోగా మిగిలిన మూడేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మూడు దశాబ్దాలుగా పాలించిన వారు ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోయారని మాజీ మంత్రి ఆర్కేరోజా నిలదీశారు. ప్రజలకు మంచి చెయ్యాలనే తపన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. ఆదివారం తన నివాస కార్యాలయంలో ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న పుత్తూరు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ఆమె సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తీవ్రతతో గడిచిపోయిందన్నారు. ఆ సమయంలో ప్రజలకు తామందరం ఎంతో అండగా నిలిచామన్నారు. మిగిలిన మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో తాజ్మహల్ లాంటి షాదీమహల్ కట్టించామని, పార్కు, పాలిటెక్నిక్ కళాశాల, క్రిమేషన్ షెడ్డు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మున్సిపల్ కార్యాలయం, ఆస్పత్రి నవీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. గతంలో పాలించిన నాయకులు వీటిని ఎందుకు చెయ్యలేక పోయారన్నారు. నియోజకవర్గ కేంద్రం నగరిలో టీటీడీ కల్యాణ మండపం లేదని, వడమాలపేట మండలంలో ప్రసిద్ధి చెందిన టీటీడీ ఆలయం ఉన్నా అక్కడ టీటీడీ మండపం లేదని గతంలో ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. నేత్ర దేవత దేశమ్మ దేవత ఆలయం నుంచి పలు ఆలయాలు నిర్మించామని గతంలో ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ఇవి చెయ్యాలంటే ప్రజలకు మంచి చెయ్యాలనే తపన వారికుండాలన్నారు. జగనన్న నుంచి పొందిన స్ఫూర్తితో తాను చెయ్యగలిగానన్నారు. తోపు..తురుము అని చెప్పుకునే నాయకు లు ఎందుకు వీటిని చెయ్యలేకపోయారో ప్రజలే ఆలోచించాలన్నారు. కట్టిన షాదీమహల్ను వినియోగంలోకి తేలేని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానిదన్నారు. వినియోగంలోకి తెస్తే ఎక్కడ రోజమ్మకు పేరొస్తుందోనని అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఆయన చివాట్లు పెట్టినా వినియోగంలోకి రాలేదన్నారు. మరోమారు ఈ విషయమై గత మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలెక్టర్ను సంప్రదిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పుత్తూరు ఆస్పత్రికి రూ.9 కోట్లు మంజూరు చేసుకొని రాగా దానిని సత్యవేడుకు పంపి పుత్తూరుకు రూ.1.5 కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే తండ్రిదన్నారు. వారు తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆనందపడుతూ పుత్తూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అవసరం లేని చోట ఫ్లై ఓవర్ కట్టి ప్రజలను ఇబ్బంది పడేలా చెయ్యడం మినహా ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యేగానీ, ఆయన తండ్రిగానీ ఎందుకు అభివృద్ధి పనులు చెయ్యలేక పోయారన్నారు. ప్రజలే ఈ విషయం గ్రహించి నేడు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. కొండచుట్టు మండపం విషయంలో .. పవిత్ర కొండచుట్టు మండపాన్ని రహదారి వెడల్పులో పోకుండా కాపాడుకుందామని వెళితే 2023లో గాడిదలు కాస్తున్నారా ? అంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడటంపై మాజీ మంత్రి రోజా స్పందిస్తూ జాతీయ రహదారి పనులు మంజూరై భూముల స్వాధీనానికి టెండర్ వదిలింది 2008 ఆగస్టు నెల 20వ తేదీన అన్నారు. దానికి సంబంధిత పత్రికా ప్రకటనలను చూపారు. అయితే రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఢిల్లీ వరకు వెళ్లి 2023లో ఆగిన పనులకు చలనం తెచ్చి రోడ్డు పనులను తాను ప్రారంభించానన్నారు. 2008లో సర్వే చేసిన మేరకు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. నాడు నగరిలో ఒక సీనియర్ నాయకుడు, పుత్తూరులో ప్రస్తుత ఎమ్మెల్యే తండ్రి ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. ఆపై టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారే ఉన్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆయన తండ్రి వెంట తిరుగుతూ ఉన్నాడన్నారు. అప్పుడు చేసిన సర్వేలో మండపం తొలగించేలా ఉంటుందని వీరికి తెలియదా అని మాజీ మంత్రి రోజా సూటిగా ప్రశ్నించారు. 2008లో ఎవరు పాలకులు ఉన్నారో తెలియని అజ్ఞానంలో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. నిజానికి కొండచుట్టు మండపం విషయంలో గాడిదలు కాసింది ఎమ్మెలే, ఆయన తండ్రే అన్నారు. అవాంతరాలు ఎదురైనా మండపాన్ని కాపాడుతా? రోడ్డు విస్తరణ పనుల్లో మహానేత వైఎస్సార్ విగ్రహం తొలగించే సమయంలోనే కొండచుట్టు మండపం కూలుస్తారనే విషయాన్ని నాయకులు చెప్పారని వెంటనే ఆ విషయంలో తాను చైన్నెకి వెళ్లి జాతీయ రహదారి ప్రాజెక్టు అధికారులతో చర్చించడం, కోర్టుకు వెళ్లి స్టే తేవడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కారిని కూడా కలవడం జరిగిందన్నారు. దానిపై నేటి వరకు పోరాడుతున్నానని కొండచుట్టు మండపం కాపాడే బాధ్యతను నేను తీసుకున్నానన్నారు. అయితే దానిపై చర్యలు చేపట్టాల్సిన ఎమ్మెల్యే.. ఆవిడ తలచుకుంటే మండపాన్ని కాపాడేస్తుందా అంటూ పలువురి వద్ద ఎద్దేవా చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కొలవుదీరే 21 మంది దేవతల ఆశీర్వాదం తనకు ఉంటుందన్నారు. తప్పక మండపాన్ని కాపాడగలుగుతానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు ప్రజల కోసం పనిచేసే టైం లేదన్నారు. ఒక డిపార్ట్మెంట్ చినబాబు చూసుకుంటే.. మరో డిపార్ట్మెంట్ బాలగోపాల్ చూసుకుంటున్నారని, దోచుకుందాం, దాచుకుందాం అన్నరీతిన పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక్క కొండ కూడా వదల్లేదని కొండలన్నీ క్వారీలకు అప్పగించి గ్రావెల్, కంకర, ఇసుక అంటూ అన్నీ దోచుకుంటున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో క్వారీల్లో ఏ మేరకు వనరులు తీశారో, ప్రస్తుతం రెండేళ్లలోనే ఎంత తీశారో లెక్కిస్తే తేలిపోతుందన్నారు. తిరుమల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలని మాజీ మంత్రి ఆర్కేరోజా విమర్శించారు. అబద్దాలతో అధికారపీఠం ఎక్కిన ఆయన ..చేసింది ఏమీ లేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతిలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పింఛన్లు లేవని ఏ హామీ నెరవేర్చకుండా తాను అధికారంలోకి వచ్చాకా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పడం కన్నా మరో విడ్డూరం ఏదీ లేదన్నారు. మన జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన తిరుమలనే అపవిత్రం చేస్తున్న చంద్రబాబు జిల్లాలో పుట్టినందుకు జిల్లావాసులు సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. టీడీపీ, జనసేన నాయకులు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని వారి కింద ఉన్న స్క్రాప్తో ప్రెస్ మీట్ పెట్టించడం, తిట్టించడం మాత్రమే చేస్తున్నారన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు మంచి చేయడం, మనం చేసిన అభివృద్ధి పనులు వారికి తెలియజేయడం పార్టీ శ్రేణుల కర్తవ్యమన్నారు. తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా పదవి బాధ్యతలు పూర్తిచేసుకున్న కౌన్సిలర్లు గజమాలతో మాజీ మంత్రి రోజాను సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, పార్టీ లీగల్సెల్ కన్వీనర్ రవీంద్ర, పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
శిక్షణకు హాజరుకావాలి
చిత్తూరు కలెక్టరేట్: జనగణనపై నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు క్షేత్రస్థాయి ట్రైనర్లు తప్పనిసరిగా హాజరు కావాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న 70 మందిని క్షేత్రస్థాయి ట్రైనర్లుగా నియమించామన్నారు. మొదటి విడతలో ఈనెల 23, 24, 25 తేదీల్లో కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లలో శిక్షణ ఉంటుందన్నారు. రెండో విడతలో ఈనెల 26, 28, 29 తేదీల్లో చిత్తూరు డివిజన్ క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణనివ్వనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి ట్రైనర్లు ఆ తర్వాత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన వివరించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 77,864 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,348 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
పరీక్షల దోపిడీ!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ల్యాబ్ల వ్యవహారం నియంత్రణ తప్పి దోపిడీ స్థాయికి చేరుకుంది. అడ్డ గోలుగా అమాయకుల రక్తాన్ని గుంజేస్తున్నాయి. రోగుల రక్తమే ఆదాయ మార్గంగా మార్చేశాయి. ప్రజ ల ఆరోగ్యంపై ఆధారపడి నడవాల్సిన ఈ వ్యవస్థ, ఇప్పుడు పూర్తిగా వ్యాపార ధృక్పథంతో నడుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పక్కనపెట్టి అనేక ల్యాబ్లు ఇష్టారాజ్యంగా సేవలు అందిస్తూ రోగులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ దందా వైద్య ఆరోగ్య శాఖ కళ్లగప్పగించుకుని చూస్తోందనే విమర్శలు భగ్గుమంటున్నాయి. ప్రజల భయమే పెట్టుబడి సాధారణ ఆరోగ్య సమస్యలకే ‘పెద్ద సమస్య కావచ్చు’ అని భయపెట్టి టెస్టులు చేయించుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆరోగ్యంపై ఉన్న భయాన్ని ల్యాబ్లు తమ లాభాలకు ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు జరగకపోవడం, ఫిర్యాదులపై స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. ‘ఆఫర్ల’ పేరుతో మాయాజాలం ‘‘ఫుల్ బాడీ చెకప్ ఆఫర్’’, ‘‘డిస్కౌంట్ ప్యాకేజ్’’ వంటి ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తున్న ల్యాబ్ లు, ఆ తర్వాత అవసరం లేని అదనపు టెస్టులు జోడించి భారీగా బిల్లులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భయం, అనుమానం కలిగించేలా మాట్లాడి టెస్టు లు చేయించుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాబ్ల దందాలో అత్యంత కీలక అంశం కమిషన్ వ్యవస్థ. కొన్ని ఆస్పత్రులు, డాక్టర్లు, సిబ్బంది ల్యాబ్లతో కుమ్మకై ్క ప్రతి టెస్ట్పై రూ.200 నుంచి రూ.250 వరకు కమీషన్ పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. డెమోను డమ్మీ చేసేశారు.. ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, స్కానింగ్ సెంటర్, ల్యాబ్ల పర్యవేక్షణ ఒకప్పుడు డెమో విభాగం చేతిలో ఉండేది. అడపాదడప పర్యవేక్షణ చేస్తూ...తప్పిదాలను సరిదిద్దేలా చర్యలు చేపట్టేవారు. అయి తే రెండేళ్ల కాలంలో ల్యాబ్ పర్యవేక్షణ శూన్యమైంది. రిజిస్ట్రేషన్ లేని ల్యాబ్లను గాలికొదిలేశారు. రెన్యూవల్ను ఆమాడదూరంలో పెట్టేశారు. వీటి నుంచి కమీషన్లు తీసుకుంటూ...గప్చుప్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాఖలోని ఓ ఉన్నతాధికారికి అంటకాగిన సిబ్బంది రిజిస్ట్రర్కానీ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్, ల్యాబ్లను తన గుప్పెట్లో పెట్టుకుని మామూళ్ల మత్తులో ఉండిపోతున్నారని శాఖలోని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. అడ్డగోలు వ్యాపారానికి చెక్పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ల్యాబ్లో రక్త నమూనాలను పరీక్షిస్తున్న దృశ్యం (ఫైల్)అనవసర టెస్టులతో.. భారీ బిల్లులు చిన్న సమస్యలకే పెద్ద పెద్ద టెస్టులు రాయించడం ఇప్పుడు సాధారణమైంది. వైద్య అవసరం లేకపోయినా ప్యాకేజీల పేరుతో రోగులకు టెస్టులు సూచిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఒక్కో టెస్ట్కు రూ.600 నుంచి ప్రారంభమై, కొన్ని సందర్భాల్లో రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి, పేద కుటుంబాలు ఈ ఖర్చులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి ల్యాబ్లో టెస్టుల ధరల జాబితా ప్రదర్శించాలి. కానీ చాలా ల్యాబ్లలో ఈ నియమం అమలు కావడం లేదు. రోగి అడిగితేనే ధర చెబుతూ, ప్రతి ఒక్కరికి వేరువేరు రేట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండా వందల ల్యాబ్లు జిల్లాలో పనిచేస్తున్న ల్యాబ్లలో గణనీయమైనవి సరైన రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నాయి. జిల్లా లో అధికారికంగా సుమారు 500పైనే ల్యాబ్లున్నా యి. అయితే వీటిలో కూడా రెవెన్యూవల్ కానివి వందల్లో ఉన్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కానివి జిల్లా వ్యాప్తంగా 300పైనే ఉండవచ్చునని అధికారులు అంచనా వేశారు. చాలా మంది ఇంట్లోనే ల్యాబ్లు ఏర్పాటు చేసుకుని...కొన్ని ఆస్పత్రులకు కమీషన్ల పేరుతో ఎరవేస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా ల్యాబ్ టెస్టులు పుంజుకుంటున్నాయి. చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధి, సుందరయ్యవీధి, సుబేదారువీధి, దర్గా సర్కిల్, గురునగర్ కాలనీ, కొంగారెడ్డిపల్లి, మిట్టూరు, తోటపాళ్యం, జిల్లా ప్రభుత్వ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వీటిలో చాలా వరకు కనీస ప్రమాణా లు పాటించకుండా టెస్టులు నిర్వహించడం వల్ల ఫలితాల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రోగుల చికిత్స కూడా తప్పు దోవ పట్టే ప్రమాదం ఉంది. -
వంటింట నూనెల మంట
– ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం కార్వేటినగరం: పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు చిత్తూరు జిల్లాలోని వంటిళ్లలో మంట పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నూనె ధరలు ఒక్క సారిగా పెరిగి జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో లీటరు నూనె ధర రూ.5 నుంచి 10 రూపాయల మేర పెరిగింది. జిల్లాలో రోజుకు సుమారు 120 టన్నులకు పైగా ఆయిల్ విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. 10 రోజుల క్రితం ఒక కంపెనీ ఆయిల్ ధర రూ, 162 ఉండగా ప్రస్తుతం రూ, 170కి పెరిగింది. మరోక రకం ఆయిల్ ధర రూ.115 నుంచి 125కి చేరింది.ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నూనె ధరలు దిగి రాకుంటే ఆహారం పదార్థాల ధరలు పెంచక తప్పదని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. -
ఇదేనా స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చే గౌరవం !
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మె ల్యే టీసీ రాజన్ (107) రెండ్రోజుల క్రితం అనా రోగ్యంతో బెంగళూరులోని ఆస్పత్రిలో మృతి చెందితే పలమనేరులో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. దేశం కోసం స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం స్థానిక తహసీల్దార్ సైతం అంత్యక్రియలకు హాజరు కాకపోవడం గమనార్హం. దీంతో కుటుంబీకులు, బంధువులు, స్థానికులే ఆఖ రి మజిలీని చేపట్టారు. గతంలో ఆయన బతికున్నప్పుడు జిల్లాలో జరిగే రిపబ్లిక్డే, పంద్రాగ స్టు వేడుకలకు ముఖ్య అతిథిగా పిలిచి సన్మానించిన కలెక్టర్లు ఆయన మరణించాక ఎందుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదనే మాట సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు.సాధారణ వ్యక్తిలా టీసీ రాజన్కు అంత్యక్రియలను నిర్వహిస్తున్న దృశ్యం పలమనేరులోని రాజన్ అద్దె ఇల్లు నిజాయితీ గల నేత పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం రాయలపేటలో 1918లో రాజన్ జన్మించారు. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరపున గెలుపొంది ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుడిగా , ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను తీర్చిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బతుకు ఇబ్బందిగా మారినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఉండేందుకు ఇల్లులేక, అద్దె ఇంట్లో బతికారు. తనకు రావాల్సిన పింఛనుకు సంబంధించి లంచం ఇవ్వడానికి మనసు రాక దశాబ్ధకాలంగా కలెక్టరు కార్యాలయం నుంచి భారత రాష్ట్రపతి వరకు తిరిగినా లాభం లేకుండా పోయింది. గతంలో టీడీపీ పాలనలో పంద్రాగస్టు వేడుకలకు తిరుపతికొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఫ్రీడం ఫైటర్స్కు రూ.15 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాలు అమలుకాలేదు. -
దంపతులను కబళించిన మృత్యువు
పూతలపట్టు(యాదమరి): తిరుమల యాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంటి వద్ద ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో కారులో బయలుదేరగా.. విధి ఆడిన వింత నాటకంలో ఏ కారులో అయితే ఉత్సాహంగా బయలుదేరారో అదే కారు వారి పాలిట మృత్యుశకటంగా మారుతుందని గ్రహించలేకపోయారు. మరో రెండు గంటల్లో తిరుమలకు చేరుకోనుండగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెలుతున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు దంపతులు సహా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం పి. కొత్తకోటలో చోటు చేసుకుంది. పూతలపట్టు పోలీసుల వివరాలు మేరకు.. కర్ణాటక రాష్ట్రం మాండ్య ప్రాంతానికి చెందిన సతీష్ (50) తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పూతలపట్టు మండల పరిధి పి.కొత్తకోట సమీపంలో స్వయంగా కారు నడుపుతున్న సతీష్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ముందు వెలుతున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో కూర్చున్న సతీష్, భార్య భాగ్యలక్ష్మి(45) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న శశాంక్, పవని, మహాలక్ష్మి, తుషారకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో సమీప పి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సతీష్, క్షతగాత్రులను అంబులెన్సులో తరలిస్తున్న పోలీసులు -
దాహార్తి తీర్చండి మహాప్రభో!
శ్రీ రంగరాజపురం: తమ గ్రామంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న పట్టించుకోని ప్రభుత్వాధికారుల తీరుపై కొత్తపల్లి మెట్ట గ్రామస్తుల నిరసన రోడ్డుపైకి చేరింది. శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమెట్ట గ్రామంలో పాత బోరు పనిచేయకపోవడంతో గ్రామంలో నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త బోరు వేయించినప్పటికీ ఇంకా కనెక్షన్ ఇవ్వకపోవడంతో తమ గ్రామంలో నీటి ఇబ్బందులు తీవ్రతరంగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని గ్రామస్తులు రోడ్లపైకి ఎక్కారు. వేసవి ఇంకా మొదలు కాకుండానే నీటి ఎద్దడి ఉంటే మరి మండు వేసవిలో గ్రామస్తుల పరిస్థితి ఏమిటో అధికారులు ప్రభుత్వమే కాపాడాలి డి మాండ్ చేశారు. సత్వరమే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
సరస్వతమ్మ @ సెంచరీ
కలికిరి: అన్నమయ్య జిల్లా కలికిరి మండలం టి.సండ్రావారిపల్లి గ్రామం తొగటపల్లిలో గోరంట్ల సరస్వతమ్మ తన వారసులతో కలిపి 100వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జన్మదిన వేడుకకు సరస్వతమ్మ కుమారులు, వారి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఇలా నాలుగు తరాల వారు హాజరయ్యారు. ఇది అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకున్నారు. గోరంట్ల సరస్వతమ్మ కుమారులు గోరంట్ల గోపీనాథరెడ్డి, లోకనాథరెడ్డి, ప్రేమనాథరెడ్డి, కుమార్తె పండితమ్మ వారి పిల్లలతో కలిసి సరస్వతమ్మను ఆత్మీయంగా సన్మానించి తమ ఉన్నతికి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకతో గ్రామంలో పండుగ సందడి కనిపించింది. -
బంగారు ఆభరణాలు చోరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లిలో చోరీ జరిగిన ఘటనను ఆదివారం గుర్తించారు. ఇక్కడ నివాసం ఉంటున్న ఒక కుటుంబం గత 40 రోజులుగా బెంగళూరులో ఉంటోంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగుల గొట్టి 25 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు వన్టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. నిత్యావసర సరుకులు, ల్యాప్టాప్లు వితరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): సామాజిక సేవలను మరింత విస్తృతం చేయాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్న్స్ క్లబ్ జిల్లా గవర్నర్ అశ్వత్థ నారాయణస్వామి అన్నారు. ఆదివారం చిత్తూరులోని ఓ హోటల్లో నిర్వహించిన లయన్స్క్లబ్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యాన్నదానం చేస్తున్న పలు సంస్థలకు బియ్యం, విద్యార్థులకు రెండు ల్యాప్ టాప్లు అందజేశారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురిని సత్కరించారు. లయన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరులో ఎలక్ట్రిక్ శ్మశాన వాటిక నిర్మాణం, కలెక్టరేట్లో వాటర్ ప్లాంట్ నిర్మించడం సంతృప్తి కలిగించిందని పేర్కొనారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, సభ్యులు విజయ్ భాస్కర్రెడ్డి, భానుమూర్తిరెడ్డి, ప్రతాప్ యాదవ్ , రంగారెడ్డి, భక్తవత్సల రెడ్డి, శ్రీనివాసమూర్తి, మల్లిఆచారి, భాస్కర్, రాజారెడ్డి పాల్గొన్నారు. -
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
మూల్యాంకన షెడ్యూల్ ఇలా.. చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా మొదలవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతో పాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. మూల్యాంకనంలో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మూల్యాంకనం చేయాలని అధికారులు సూచించారు. 20 రోజులపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి 1,67,700 పేపర్లు జిల్లాకు విచ్చేశాయి. ఆ పేపర్లను జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో పకడ్బందీ బందోబస్తు నడుమ భద్రపరిచారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 1,67,700 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,60,925 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,60,925 కోడింగ్ పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం రెండు విడతల్లో 20 రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో మూల్యాంకనం నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 10 నుంచి 1 గంట వరకు, 2వ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ ఒక పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. సిబ్బంది నియామకం మూల్యాంకనం కోసం 480 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 60 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 160 స్క్రూటినీ నైజర్లు, 15 మంది ఏసీఈలను నియమించినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తి మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులను బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్గా డీఐఈవో రఘుపతి వ్యవహరిస్తారు. జనరల్–1 గా పీసీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అబ్ధుల్ మజీద్, జనరల్–2, సీనీట్–1, సీనీట్–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు వ్యవహరిస్తారు. వీరితో పాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్లు ఎగ్జామినర్లు, స్క్రూటినీ నైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు సైతం ఆయా కళాశాలలకు చేరాయి. నేటి నుంచి ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం విడత మొదలయ్యే తేదీ దిద్దనున్న సబ్జెక్ట్ వివరాలు మొదటి మార్చి 22వ తేదీ నుంచి తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్, గణితం, సంస్కృతం రెండవ మార్చి 25వ తేదీ నుంచి బాటనీ, జువాలజీ, కామర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ -
అలసత్వం వహిస్తే చర్యలు
జిల్లాలో 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధుల కు కేటాయించిన సిబ్బంది తప్పక హాజ రు కావాలి. విధులకు కేటాయించిన లెక్చరర్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి మూల్యాంకన విధులకు పంపాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించడం జరగదు. మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్ట్రీమింగ్ చేయించాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. – రఘుపతి, డీఐఈవో, ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్ -
విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి
ముగియనున్న గడువు తిరుపతి సిటీ: పలు వర్సిటీల్లో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే 2026కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు ప్రవేశ పరీక్షలకు ఈనెల చివరితో దరఖాస్తులకు గుడువు తేదీ ముగియనుంది. విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించి సంబంధిత పీజీ, యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రవేశ పరీక్షలకు తుది గడువుల వివరాలిలా ఉన్నాయి. ప్రవేశ పరీక్ష చివరి తేదీ ఏపీ ఐసెట్ మార్చి 23 ఏపీ ఎడ్సెట్ మార్చి 26 ఏపీ పీజీసెట్ మార్చి 28 ఏపీ ఈఏఎమ్సెట్ మార్చి 24 ఏపీ లాసెట్ జరిమానాతో మార్చి 24 ఏపీ పాలీసెట్ ఏప్రిల్ 4 -
టీడీపీకి దళిత నేత రాజీనామా
వెదురుకుప్పం : దళితులపై చిన్నచూపుతో అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్న టీడీపీలో ఇమడలేకున్నాం...కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా దళితుల సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా పావుగా వాడుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగి న బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు కొత్తపల్లె శంకర్ ప్రకటించారు. ఈమేరకు శనివారం వెదురుకుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను విడగొట్టి బలిపశువులు చేసినట్లు ధ్వజమెత్తారు. రెండు సంవత్సరాల కూటమి పాలనలో దళితుల సంక్షేమం కోసం వారి అబివృద్ధి కోసం ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేపట్టకపోవ డం దారుణమన్నారు. సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో వాటిని ఏ ఎస్సీ కాలనీలో ఖర్చు చేశారో తెలియదన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ పోస్టులను భర్తీ చేయ కపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, వివక్షకు నిదర్శనమన్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు దళితుల కు న్యాయం చేస్తారని భావించి కష్టపడి పనిచేసినట్లు గుర్తు చేశారు. అయితే దళితుల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు దళితులందరూ ఏకమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీలను ఎంతో హేళనగా చూస్తూ ఎన్నో అవమా నాలకు గురిచేస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అందరూ ఏకమవుతున్నట్లు చెప్పారు. టీడీపీలో ఉన్న దళితులందరూ ఎందుకు ఓటేశామా అంటూ వ్యతిరేక భావాలను వ్యక్త పరుస్తున్నట్లు చెప్పారు. దళిత వ్యతిరేక ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎస్సీల సంక్షేమాన్ని కోరే, అంబేడ్కర్ ఆశయ సాధ న కోసం నడిచేవాళ్లందరూ కూటమి ప్రభుత్వాన్ని వీడనున్నట్లు చెప్పారు. -
టమాట గుజ్జు.. ఫ్యాక్టరీల మోజు
కాణిపాకం: టమాట గుజ్జుపై ఫ్యాక్టరీలు మొగ్గు చూపుతున్నాయి. పది ఫ్యాక్టరీలు టమాట పేస్ట్ తయారీలో బిజీగా ఉంటున్నాయి. రోజువారీగా 1500 నుంచి 1700 టన్నులు సేకరిస్తున్నాయి. మరో 2 వేల టన్నుల కాయలొచ్చినా పేస్ట్ తయారీకి సిద్ధంగా ఉన్నాయి. మార్కెటింగ్ సులభం కావడంతో పేస్ట్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. టమాట పంట విస్తీర్ణం పెరగడంతో మార్కెట్లో ధరలు పడిపోతుండగా, పళ్లగుజ్జు పరిశ్రమలు మాత్రం ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్నాయి. సాధారణంగా మామిడి సీజనన్ కు మాత్రమే పరిమితమయ్యే ఈ యూనిట్లు ఇప్పుడు టమాట పేస్ట్ తయారీలోకి అడుగులు వేస్తున్నాయి. 6 వేల ఎకరాలో సాగు జిల్లాలో 6 వేల ఎకరాల్లో టమాట సాగు ఉంది. జనవరి నుంచి ప్రారంభమైన టమాట సాగు ఇప్పటి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి 3 వేల ఎకరాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 5 వేల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారు. పలమనేరు, చౌడేపల్లి, సోమల, సదుం, శాంతిపురం, వి.కోట, గంగవరం, కుప్పం, గుడిపల్లి, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి వంటి మండలాల్లో టమాట సాగు అధికంగా ఉంది. మొదటి రకం టమాటను రైతులు కోతకు వచ్చిన స్థానికంగా ఉండే మార్కెట్కు తరలించి అమ్మకానికి పెడుతుంటారు. కొనుగోలు ఇలా... పళ్లగుజ్జు పరిశ్రమలు జిల్లాలో ప్రస్తుతం 10 ఫ్యాక్టరీలు పేస్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు ముఖ్యంగా రెండో రకం టమాటలను కిలోకు సుమారు రూ.4 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. పలమనేరుతో పాటు పీలేరు, కలకడ, కలికిరి, ములకల చెరువు నుంచి టమాటను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ రోజుకు 250 నుంచి 300 టన్నుల వరకు టమాటలను ప్రాసెస్ చేస్తున్నాయి. గుజ్జు తయారీ లెక్కలు ఇలా.... ఫ్యాక్టరీలు కిలోకు రూ.4కు కొనుగోలు చేసిన టమాటతో తయారైన పేస్ట్ను సాస్ తయారీ కంపెనీలు కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ పేస్ట్ను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా 18 నెలల వరకు నిల్వ ఉంచే సామర్థ్యం ఉండటం పరిశ్రమలకు అదనపు లాభంగా మారింది. మామిడి సీజన్ లేనప్పుడు సాధారణంగా మే నుంచి ఆగస్టు వరకు మామిడి గుజ్జు తయారీలో బిజీగా ఉండే ఫ్యాక్టరీలు, ఆ మధ్యలో ఖాళీగా ఉండే సమయాన్ని ఇప్పుడు టమాట పేస్ట్తో భర్తీ చేస్తున్నాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి మామిడి సీజన్ ప్రారంభం కానుండగా, కేరళ నుంచి కాదర్ కాయలు, అలాగే విజయవాడ ప్రాంతం నుంచి మామిడి సరఫరా ప్రారంభమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యంత్రాలకు పని చెబుతున్నాం... మ్యాంగో సీజన్ తర్వాత ఖాళీగానే ఉంటాం. ఆ సమయంలో టమాట పేస్ట్ చేస్తున్నాం. జిల్లాలో 10 ఫ్యాక్టరీల వరకు టమాట పేస్ట్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పేస్ట్ అమ్ముడుబోతున్నాయి. సాస్ కంపెనీలు కొనేస్తున్నాయి. మార్కెటింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు. మామిడి సీజన్కు టమాటను ఆపేస్తాం. – రఘురాం చౌదరి , పళ్ల గుజ్జు పరిశ్రమల జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు రోజువారీగా రూ.500 టన్నులకు పైగా దిగుబడి జిల్లాలో రోజువారీగా సుమారు 500 టన్నుల నుంచి 700 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. వీటిలో 200 టన్నుల కాయలు జిల్లా వ్యాప్తంగా అమ్మకానికి వెళుతుంటాయి. మిగిలిన టమాట మొత్తం మార్కెట్ల నుంచి తమిళనాడులోని చైన్నె, కోయంబత్తూరు, సేలం, విజయవాడ, కలకత్తా వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయి. మొదటి రకం టమాట ధర ప్రస్తుతం కిలో రూ.8 నుంచి రూ.12 మధ్యే ఉంది. రెండో రకం టమాటకు మాత్రం మార్కెట్లో కొనుగోలు చేసేవారు కరవుతున్నారు. అయితే ఈ టమాటను పలు పళ్ల గుజ్జు పరిశ్రమలు అందిపుచ్చుకుంటున్నాయి. -
టమాట గుజ్జు.. ఫ్యాక్టరీల మోజు
టమాట గుజ్జుతో సాస్ చేసే పనుల్లో పరిశ్రమలు బిజీగా ఉంటున్నాయి. ధరలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. 24న అథ్లెటిక్స్ పోటీలు చిత్తూరు కలెక్టరేట్: శాప్ లీగ్లో భాగంగా ఈనెల 24న చిత్తూరులోని డీఎస్ఏ స్టేడియంలో మాస్టర్ వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ ఉదయభాస్కర్ తెలిపారు. 100, 400, 800, 1,500 మీటర్ల పరుగు పందెం, లాంగ్జంప్, డిస్కస్త్రో, షాట్ఫుట్, హైజంప్, జావెలిన్త్రో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 35–45 సంవత్సరాలలోపు పురుషులు/మహిళలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల వారు https:// sports. ap.gov.in అనే వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలు ఈనెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. చిత్తూరులో చేనేత–హస్తకళా మేళా చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత–హస్తకళా మేళా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు వినియోగదారులను మెప్పిస్తున్నాయి. మేళాలో సిల్క్, కాటన్తో తయారైన పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఎంబ్రాయిడరీ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గద్వాల్, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ వంటి ప్రసిద్ధ చేనేత ప్రాంతాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. ఇక బెడ్షీట్లు, బెడ్కవర్లు, హ్యాండ్క్రాఫ్ట్ వస్తువులు, కాటన్ షర్టింగ్ వంటి అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఈ మేళా ద్వారా జిల్లా ప్రజలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తులు అందించడంతో పాటు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మేనేజర్ సంజెమ్ జెయిన్ తెలిపారు. -
డీఎల్ఏటీఓకు రాష్ట్ర స్థాయి అవార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): టీబీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీటీసీసీఓఎన్–2026 (ఏపీ టీబీ చెస్ట్ కాన్ఫరెన్స్) కార్యక్రమంలో జిల్లా డీఎల్ఏటీఓ డాక్టర్ జి.వెంకట ప్రసాద్కు బెస్ట్ డీఎల్ఏటీఓ–2025–26శ్రీ అవార్డు ప్రదానం చేశారు.శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీబీ నియంత్రణలో విశేష కృషి చేసినందుకు ఆయనను ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట ప్ర సాద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, టీబీ నిర్మూలన లక్ష్యంతో మరింత కృషి చేస్తానని తెలిపారు. ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట భద్రత చిత్తూరు అర్బన్: రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. శనివారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని మసీదులు, ప్రార్థనా మందిరాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను, నిఘాను ఉంచా రు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా ట్రాఫిక్ను పర్యవేక్షించారు. -
● భక్తిశ్రద్ధలతో రంజాన్ సంబరాలు ● నమాజ్లతో పులకించిన ఈద్గా, దర్గాలు
ఈద్ ముబారక్ ! నెల‘రోజా’లు భక్తిశ్రద్ధలతో సాగిన దీక్షలు శుక్రవారం నెలవంక తొంగి చూడడంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఈద్గాలకు ర్యాలీగా వెళ్లి సామూహికంగా నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పండుగపూట బంధుమిత్రులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు తోచిన ధాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. – పలమనేరు -
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు కలిసి రావడంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఆలయ ప్రధాన మార్గాలు, ప్రాంగణం జనంతో నిండిపోయింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ నిర్వహణతో పాటు తాగునీరు, భద్రత, పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. అదనపు సిబ్బందిని మోహరించి రద్దీని నియంత్రిస్తున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జాబ్ క్యాలెండర్ దగా చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ దగా అని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్రెడ్డి విమర్శించారు. వీటి ద్వారా 4 విడతలు, 41 నోటిఫికేషన్ల ద్వారా 10,060 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. గత పాలనలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా ప్రస్తుతం వాటిని ఎందుకు భర్తీ చేయలేదన్నా రు. గ్రూప్ 1, 2 పోస్టులు, ఇంజినీరింగ్ విభాగం, టీచర్ పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయన్నారు. గత పాలనలో 1.34 లక్షల ఉద్యోగాలను సచివాలయాల ద్వారా భర్తీ చేశారన్నారు. -
పరిష్కారం ఏదీ?
ప్రశ్నలతోనే సరి.. చిత్తూరు కార్పొరేషన్: సభ్యులంటే మండల స్థాయిలోనూ అధికారులకు లోకువే, జిల్లా స్థాయిలో అధికారులు కనీసం సమావేశానికి హాజరు కాకుండా మరింత చులకనగా చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబఽంధిత అధికారుల వివరణ కోరుతూ నోటీసుల ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడును ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య రానివ్వద్దు పెద్దపంజాణిలో 2 హెల్త్సెంటర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలన్నారు. ప్రమాదకర లైన్లను మార్పు చేయాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగినా బిల్లులు విడుదల కావడం లేదన్నారు. ఎర్రవారిపాళ్యం ఆస్పత్రిలో రూమ్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తంబలపల్లె, ములకలచెరువుల నందు నూతన పీహెచ్సీ భవనాలు నిర్మించాలన్నారు. అక్రమాలు అరికట్టాలని.. కుప్పంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని జెడ్పీటీసీ సభ్యుడు శరవణ వాపోయారు. రేషన్ దుకాణంను డీలర్లు సూపర్ మార్కెట్గా మార్చారని, వేల రూపాయల సరుకులు కొంటే గానీ పేదలకు బియ్యం ఇవ్వడం లేదని సమస్యను తెలిపారు. ఆ సరుకులు కొనాలనే నిబంధన ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు. టన్నుల కొద్దీ బియ్యంను అక్రమంగా విక్రయిస్తున్నరని విమర్శించారు. జిల్లా అధికారులు తనిఖీ చేయకపోవడంతో అక్రమాలు పెరుగుతున్నాయన్నారు. ఎంఈఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆ స్థానంలో మరొకరిని నియమించాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది లేమితో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. గుడుపల్లె మండలంలోని రెడ్డిపాళెంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ మార్చాలన్నారు. దొంగతనం అయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ సర్వీసులు తమ డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయన్నారు. కుప్పం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు గుంతలు పడి అధ్వాన్నంగా ఉందన్నారు. పేరుకుపోయిన రూ.కోట్ల బకాయి బిల్లులు ఎన్ఆర్జీఎస్ పథకం కింద చేసిన పనుల బకాయిలు రూ.కోట్లు పేరుకుపోయాయని వడమాలపేట, ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్రెడ్డి, కరుణాకర్రెడ్డి ప్రశ్నించారు. గత పాలనలో జరిగిన పనులకు సైతం బిల్లులు క్లోజ్ చేశారని, కానీ డబ్బులు చెల్లించలేదన్నారు. పంచాయతీ పరంగా కొత్త పనుల మంజూరు కావడం లేదన్నారు. గతంలో జరిగిన పనులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మండల గ్రాంట్స్ నందు గ్రావెల్ తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నారని అలాగే జెడ్పీ గ్రాంట్స్ పరంగా ఇవ్వాలని నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్ డిమాండ్ చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. నక్కలచెరువు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, పనుల పూర్తికి నిధులు ఇవ్వడం లేదన్నారు. సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్లు అసంపూర్తిగా ఉన్నాయని వాటి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని రామసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయానికి వెళ్లేదారిలో రూ.2 కోట్లతో గత పాలనలో రోడ్డు పనులు మంజూరు అయ్యాయన్నారు. రూ.70 లక్షల పనులు జరిగాయని, మిగిలినవి మధ్యలోనే ఆపివేశారన్నారు. చేసిన పనుల నందు 20 శాతం తక్కువ బిల్లులు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేస్తున్నారని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించారు. ఆయనను మార్చాలని పుత్తూరు మండల సమావేశంలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఏఈని తక్షణం మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్డీఆర్ పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. సదుం మండలంలో కాలువలు నిర్మించకుండా రోడ్డు వేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి తెలిపారు. చౌడేపల్లె–సోమల–సదుం ఆర్అండ్బీ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చౌడేపల్లె జెడ్పీటీసీ సభ్యుడు దామోదారరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
అకాల వర్షంతో పంటనష్టం
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలంలో బుధ, గురువారాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా భారీగా పంట నష్టపోయారు. మండల పరిధిలోని పాదిరేడు, టి.సి.అగ్రహా రం, లక్ష్మమ్మ కండ్రిగ పరిసర ప్రాంతాల్లో సు మారు 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకు వచ్చిన సమయంలో ఇలా అకాల వర్షం కారణంగా పంట మొత్తం పడిపోయి నీట ము నగడంతో తాము పూర్తిగా మునిగిపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థినులకు గాయాలు బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని కమ్మనపల్లె ఆదర్శ పాఠశాల వద్ద శుక్రవారం ఇద్దరు విద్యార్థినులు రహదారి దాటుతున్న సమయంలో బొలెరో వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 9వ తర గతి చదువుతున్న వనజశ్రీ, ఆశారెడ్డి పాఠశాల ముగియగానే స్వగ్రామానికి వెళ్లేందుకు రహదారిపైకి వచ్చారు. ఆ సమయంలో బొలెరో వాహనం ఢీకొంది. ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఢీ.. యువకుడి దుర్మరణం శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై గుండిశెట్టిపల్లి సమీపంలో లారీ బైకును ఢీకొనడంతో యువకుడు మృత్యువాత పడ్డాడు. శుక్రవారం రాత్రి బైకుపై వెళ్తున్న గుండిశెట్టిపల్లికి చెందిన రవికుమార్(30)ను శాంతిపురం వైపు నుంచి వి.కోట వైపునకు వెళ్తున్న బోరు సపోర్టింగ్ లారీ ఢీకొంది. దీంతో వెంకట్రామప్ప కుమారుడు రవికుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహమైంది. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించాయి. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. -
గడ్డి లారీ దగ్ధం
వెదురుకుప్పం: పశుగ్రాసం తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తూ దగ్ధమైన ఘటన శుక్రవారం సాయంత్రం వెదురుకుప్పం మండలం దామరకుప్పం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు...శుక్రవారం సాయంత్రం మండలంలోని పచ్చికాపల్లం నుంచి వెదురుకుప్పం వైపు పశుగ్రాసం లోడ్తో వాహనం బయలు దేరింది. మార్గమధ్యలోని దామరకుప్పం వద్ద సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగలు తగిలి నిప్పు రవ్వలు ఎగిసి పడి గడ్డికి అంటుకున్నాయి. దీంతో గడ్డితో పాటు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లారీలో మంటలు ఎగిసి పడడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో రోడ్డు పక్కన పొలంలోకి లారీని నడిపి వదిలేశాడు. దీంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పైనే ఉంటే పెను ప్రమాదం సంభవించేది.దీంతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేదన్నారు. కాగా రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలను సరి చేయాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. -
కట్టడిలేని ‘కల్తీ’
చిత్తూరు కార్పొరేషన్: మనం తీసుకొనే ఆహార పదార్థాలకు సంబంధించి జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ పరిధిలోకి వస్తాయి. మనిషి ఆరోగ్య పరిరక్షణలో ఈశాఖ పాత్ర కీలకం. అలాంటి సంస్థ సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ఉద్యోగుల కొరత, పని ఒత్తిడి, ప్రైవేటు ఉద్యోగుల హల్చల్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, శాంపిల్స్ సేకరణలో దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నా యి. లోటుపాట్లను అవకాశంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆహార తనిఖీ వాహనం చిత్తూరు జిల్లాకు మంజూరు చేస్తే పలు ఆహార పదార్థాల ఫలితాలు అప్పుడే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా పనులు జరగడం లేదు. సంస్థ లక్ష్యం ఇదీ.. హోటళ్లు, బేకరీలు, గోధుమ, పసుపు, నూనెలు, పండ్ల వ్యాపారాలు తదితర ఆహార పదార్థాల విక్రయ తయారీ కేంద్రాల్లోని కల్తీలను ఆహార నియంత్రణ శాఖ పరిశీలించాలి. అందుకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు డివిజన్లో చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పలమనేరు నియోజకవర్గాలు రాగా, కుప్పం డివిజన్ పరంగా కుప్పం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నగరి, పుంగనూరు మండలాలు వస్తాయి ఫిర్యాదులు వచ్చినా లేదా ఏదైనా అనుమానం ఉన్నా తనిఖీలు చేపడతారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు. నెలకు 12 నమూనాల పరిశీలన వివిధ పదార్థాలు..వస్తువుల నుంచి నెలకు 12 శ్యాంపిల్స్ తీయాలి. ఒక శ్యాంపిల్తో పాటే అదనంగా రెండు తీసుకుంటారు. ఆ ప్రకారం ఒక నెలకు మొత్తం 36 శ్యాంపిల్స్ తీస్తారు. ఒక్కో శ్యాంపిల్ చొప్పున కల్తీ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్లోని నాచారంలోని లేబొరేటరీకి పంపిస్తారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు పరీక్షల్లో నాసిరకం అని తేలితే శ్రీసబ్ స్టాండెడ్, మిస్ బ్రాండెడ్ అని అంటారు. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరుగుతుంది. అలాగే తినడానికి వీలులేని పదార్థాలు, వస్తువులను శ్రీఆన్సేఫ్శ్రీ అంటారు. దీనికి న్యాయ స్థానం శిక్ష ఖరారు చేస్తుంది. సంబంధిత వ్యక్తికి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు భారీగా జరిమానా పడటంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా ఈశాఖ ప్రభుత్వ రంగ సంస్థలైన హాస్టళ్లు, ఐసీడీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆహార పథకాలను కూడా పర్యవేక్షించే అధికారం ఉంది. సిబ్బంది కొరత కీలకమైన ఈ శాఖకు సిబ్బంది కొరత శాపంగా మారింది. జూనియర్ సహాయకులు, సీనియర్ సహాయకులు, అటెండర్ల లేమితో అవస్థలు పడుతున్నారు. పని ఒత్తిడి పేరుతో అధికారులు పనులను ఆలస్యం చేస్తున్నారు. ఏడాది కాలంలో చిత్తూరు డివిజన్లో 77, కుప్పం డివిజన్లో 102 తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం 240 చేయాల్సి ఉంది. ఇందులో 10 సబ్స్టాండ్, 4 ఆన్సేప్ కేసులు నమోదు చేయగా వారి వద్ద నుంచి రూ.3 లక్షలకు పైగా జరిమానాలు విధించారు. జిల్లా మొత్తానికి ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. మరో ఇన్స్పెక్టర్ అవసరం ఉన్నా కేటాయింపులు లేవు. తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా కుప్పలు, తెప్పలుగా హోటళ్లు , రెస్టారెంట్లు, తినుబండరాలు, వస్తువులను తయారు చేసే కేంద్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాగా ఈ శాఖ పరిధిలో అధికారికంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. లైసెన్స్ పరిధిలోకి పెద్ద హోటళ్లు, నూనె తదితర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు వస్తాయి. రిటైల్ డిస్ట్రిబ్యూటర్లు తదితర వ్యాపార కేంద్రాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ పరిధిలో చిన్న హోటళ్లు ఉంటాయి. అధికారికంగా అన్నింటిని కలుపుకున్నా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగినవి తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో పంచనామా నిర్వహిస్తున్న విశ్రాంత ఉద్యోగి, ప్రైవేటు డ్రైవర్ (ఫైల్) ఆహారభద్రత ప్రమాణాల శాఖ కార్యాలయం ఏడాది కాలంలో తీసిన శాంపిల్స్ 179 అందులో సబ్స్టాండ్ 10 అన్సేఫ్ 4 మొత్తం లైసెన్స్ డీలర్లు 550 రిజిస్ట్రేషన్ డీలర్ల్లు 1000 కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’ సహాయ ఆహార నియంత్రణ శాఖ ప్రతిదానికి వసూళ్లు ? ఏడాదికి రూ.12 లక్షలు కంటే తక్కువ వ్యాపారం చేసేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటికి ప్రభుత్వం రుసుం రూ.100 ఏడాదికి కానీ రూ.2 వేలు అప్పనంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రూ.12 లక్షలు పైగా జరిగే వ్యాపారాలకు లైసెన్స్ ఫీజు రూ.2 వేలు వీటికి రూ.5 వేలు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అంతే కాదు నెలవారీ తనిఖీలకు వెళ్లినప్పుడు శాంపిల్స్ సేకరిస్తారు. అందులోనూ లైసెన్స్దారుల నుంచి వేలకు వేలు పిండుతున్నారని వాపోతున్నారు. తనిఖీల్లో భాగంగా మూడు శాంపిల్స్ తీస్తారు ఇందులో ఆన్సేఫ్ అని వస్తే బాధితుడు చాలెంజ్ చేసుకోవడానికి నెలరోజులు సమయం ఉంటుంది. కానీ చాలెంజ్ చేసినప్పుడు సెంట్రల్ ల్యాబ్లో తిరిగి పరీక్షలకు పంపినప్పుడు ఎటువంటి సమస్య లేదనే వస్తోందని సమాచారం. వసూళ్లతో అధికారులు బేరం కుదుర్చుకొని మేనేజ్ చేస్తున్నారనే అపవాదు ఉంది. అంతే కాకుండా అధికారులు డ్రైవర్లను అడ్డుగా పెట్టుకొని దోపిడీకి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరుకు తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పంచనామాకు సైతం విశ్రాంత ఉద్యోగి, డ్రైవర్ ద్వారా చేయిస్తున్నారు. డీలర్లపై వారి పెత్తనం పెరిగింది. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. -
ఫిర్యాదు చేయండి
లైసెన్స్, రిజిస్ట్రేషన్స్కు అదనపు వసూళ్లు తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అలాగే రాష్ట్ర, కేంద్ర ల్యాబ్ల నందు శాంపిల్స్ తనిఖీల నందు కొన్నిసార్లు మిస్మ్యాచ్ వస్తున్నాయి. సిబ్బంది కొరతతో శాంపిల్స్ సేకరణకు బయట వారిని వినియోగిస్తున్నాం. కోర్టు కేసులతో ఇన్స్పెక్టర్లు నెలవారీ శాంపిల్స్ లక్ష్యంగా అధిగమించలేకపోతున్నారు. సమస్యల పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, సహాయ ఫుడ్ కంట్రోలర్, ఆహార భద్రత, ప్రమాణాలశాఖ -
వరసిద్ధుడి సేవలో ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర విద్యుత్, సహజవాయువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీఐ వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అలాగే రాష్ట్ర సమాచార కమిషనర్ శరత్చంద్ర కల్యాణ చక్రవర్తి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, డీజీఐ వెంకటరమణ -
జూనియర్ కళాశాలలకు సరికొత్త క్యాలెండర్
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ బోర్డు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా సంవత్సరాన్ని ముందస్తుగా ఏప్రిల్1 నుంచే ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు జూని యర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతా యి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1వ తేదీ నుంచి కళాశాల లు తిరిగి పూర్తిస్థాయిలో పని చేస్తాయి. మొత్తం పనిదినాలు ఇలా... ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 314 రోజులకు గాను, 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. మిగిలిన 82 రోజులు ఆదివారాలు, పండుగ సెలవులుగా ప్రకటించారు. ప్రభుత్వ కళాశాల ల్లో సంఖ్యను పెంచడ మే లక్ష్యంగా జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్ప టికే గత ప్రభుత్వంలో చేపట్టిన ‘నాడు–నేడు’ తో కళాశాలల రూపురేఖలు మారాయని, డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయా లని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు అందాయి. అర్ధగిరి అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి అన్నిశాఖల సమన్వయంతో పనిచేయాలని ఉపాధి పథకం రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ ఆదేశించారు. శుక్రవారం అర్ధగిరి క్షేత్రంను దర్శించుకొని అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆలయంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతితో సమావేశమై అభివృద్ధి పనుల ప్రణాళిక తయారీపై చర్చించారు. అర్ధగిరి క్షేత్రంలో సుమారు 179 ఎకరాల్లో కొండ చుట్టూ పైభాగంలో ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేసి(డిపిఆర్) నివేదిక పంపాలన్నారు. ఆయనతో పాటు డ్వామా పీడీ రవికుమార్, ఏపీడీలు మల్లికార్జున, సుబ్రమణ్యం, ఏపీఓ బాల, వాటర్షెడ్ డెవలప్మెంట్ , ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటిలెక్క తేలుద్దాం
దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ‘జనగణన–2027’ ప్రక్రియకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈసారి రెండు దశల్లో గణనను నిర్వహించనున్నారు. గ్రామ, పట్టణ స్థాయిల నుంచి జాతీయ స్థాయి వరకు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ గణాంకాలు దోహదపడనున్నాయి. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం ఆనవాయితీ. అయితే 2021లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. చివరి సారిగా 2011లో జనాభా లెక్కల సేకరణ చేయగా, ప్రస్తుతం కొత్తగా సేకరణకు చర్యలు చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2027 జనగణన ప్రక్రియకు సంబంధించి ముందస్తు కసరత్తు వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మొదటి దశ : రెండో దశ : 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సమాచారంమొత్తం జనాభా 5732,66చ.కి.మీ జిల్లా విస్తీర్ణం 16,43,224 రెవెన్యూ డివిజన్లు 4 అర్బన్ జనాభా 3,13,898 రూరల్ జనాభా 13,29,326 అసెంబ్లీ నియోజకవర్గాలు 5 (పూర్తి), 2 (పాక్షికం) మండలాలు 28 రెవెన్యూగ్రామాలు 762 ఎస్సీలు 3,61,461 ఎస్టీలు 44,367 ‘జనగణన’కు కసరత్తు పకడ్బందీగా చేస్తాం జిల్లా వ్యాప్తంగా జనగణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్, నియమ, నిబంధనల ప్రకారం ఈ కసరత్తు చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బంది, పర్యవేక్షణకు అధికారులను నియమించారు. జనగణన ప్రక్రియపై ఇటీవలే శిక్షణ పూర్తి చేశాం. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నాం. – సుమిత్ కుమార్ గాంధీ, కలెక్టర్ -
‘పది’ మూల్యాంకనంలో మార్పులు వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు చేయడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పరీక్షల విధానంలో వినూత్న మార్పులు చేసిన కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం చోటు చేసుకున్నట్లు మండిపడ్డారు. కాగా ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యే పది జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో ట్యాబ్ ఆధారిత విధానం అమలు చేయడం తగదన్నారు. ఈ విధానం అమలుకు రూ.30 లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఆ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని విమర్శించారు. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా మార్కుల నమోదులో తప్పిదానికి భారీ జరిమానా నిబంధన పెట్టడం అధికారుల అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ మొరాయించడం, నెట్ కవరేజ్ సరిగా లేకపోవడం తదితర సమస్యలు ఏర్పడినప్పుడు జరిమానా ఎవరికి విధించాలని ప్రశ్నించారు. మార్కుల నమోదుకు రాత్రిళ్లు వేచి ఉండక తప్పదని హెచ్చరించారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ఆరు సబ్జెకులను రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మూల్యాంకన కేంద్రాల్లో మొదట అమలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
● ఊపిరి తిత్తుల వ్యాధితో అస్వస్థతకు గురైన బాలుడు ● మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక సాయం ● రెండు శస్త్ర చికిత్సల అనంతరం కోలుకున్న బాలుడు ● చమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఙతలు తెలిపిన తల్లిదండ్రులు
పుత్తూరు: మండల పరిధిలోని మజ్జిగ గుంట కాలనీకి చెందిన శివ కుమారుడు గౌతమ్(8) కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంలో తల్లిదండ్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు ఊపిరితిత్తులు 90 శాతం పాడయ్యాయని, ఖర్చుతో కూడుకొన్న ఆపరేషన్ అవసరమవుతుందని తేల్చి చెప్పారు. దీంతో దిక్కుతోచని ఆ తల్లిదండ్రులు సాయం చేసే వారి కోసం అన్వేషించారు. ఆశాదీపంగా మాజీ మంత్రి ఆర్కే రోజా వారి మదిలో మెదిలారు. ఆలస్యం చేయకుండా ఆమె వద్దకు వెళ్లి కుమారుడి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆర్కే రోజా రుయా ఆసుపత్రికి వెళ్లి బాలుడ్ని మెరుగైన వైద్య శస్త్ర చికిత్సల కోసం నారాణాద్రి ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. దీంతో వైద్యులు గౌతమ్కు రెండు పర్యాయాల పాటు శస్త్ర చికిత్సలు చేసి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. ప్రసుత్తం గౌతమ్ వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నాడు. శుక్రవారం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన రోజా గౌతమ్ను, తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్లు త్వరలో గౌతమ్ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చెమ్మగిల్లిన కళ్లతో మాజీ మంత్రి ఆర్కే రోజాకు కృతజ్ఙతలు తెలిపారు. -
బాబుపై వ్యతిరేకత
రెండేళ్లలోనే ‘బాబు సర్కారు గద్దెనెక్కి రెండేళ్లు.. అప్పటి నుంచి ఆడంబరపు మాటలు.. అభివృద్ధి పేరిట ఆకాశయానాలు.. అప్పుల కుప్పలు.. వెరసి పడకేసిన అభివృద్ధి.. అమలుకు నోచుకోని హామీలు.. అందని సంక్షేమం.. ఫలితంగా బాబు పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్లో ఇబ్బందులు లేకుండా.. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్, ఎలక్షన్ ఏజెంట్లకు ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు, చైన్నెలో స్థిరపడివారి ఓట్లు 15వేల నుంచి 20 వేలు ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మనకంటే ముందుగా ఎన్నికలు జరగడంతో అక్కడ ఓట్లు వేసి, మళ్లీ ఇక్కడ ఓట్లు వేస్తున్నారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు నుంచి వచ్చి పంచాయతీకి రూ.కోటి వరకు ఖర్చు చేసినవారు ఉన్నారన్నారు. ఇలాంటి డబుల్ ఓటింగ్ వేసే వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంతసేపు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం, దుర్భాషలాడడం తప్ప మరొకటి లేదన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించి, అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను చేర్చకుండా చూడాలన్నారు. పార్టీ నేతలమైన తాము ఎంత కష్టపడినా బూత్కమిటీలు, బీఎల్వోలు సక్రమంగా పనిచేస్తేనే వైఎస్సార్ సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి సమావేశానికి బూత్ కమిటీలు, బీఎల్వోలు హాజరుకావాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మనపార్టీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి గ్రహణం పట్టుకుందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పడకేసి, రాష్ట్ర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తెచ్చే రూ.లక్షల కోట్ల అప్పులు దేనికి ఖర్చుపెడుతున్నారో ఆ దేవుడికే ఎరుకన్నారు. ఏదైనా మాట్లాడితే అమరావతి అభివృద్ధి తప్ప చంద్రబాబు నోట మరొకటి రాదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. రాబోయే ఎన్నికల్లో అలా కాకుండా పట్టిష్టంగా బూత్కమిటీలు పని చేసి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ బూత్కమిటీలు సమర్థవంతంగా పనిచేసినప్పుడే వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ఆ బాధ్యత మనందిరిపై ఉందన్న విషయాన్ని బూత్కమిటీలన్నీ గుర్తు పెట్టుకుని పనిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ గెలుపునకు బూత్ కమిటీలే కీలకమన్నారు. జగనన్న మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, మాజీ మేయర్ శిరీష, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, బూత్కమిటీ నాయకులు పాల్గొన్నారు.దొంగ ఓట్లతో జాగ్రత్త -
వైభవంగా ఉగాది ఉత్సవం
తిరుపతి కల్చరల్: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పంచాంగ పరిష్కర్త, ఆగమ సలహా మండలి అధ్యక్షుడు వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలుకోవడమే పంచాంగమని తెలిపారు. అనంతరం పంచాంగ కర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. తర్వాత ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు ఎస్వీయూ విశ్రాంత ఆశాచర్యుడు ఆచార్య దామోదర్ నాయుడు కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముందు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు , విద్యార్థులు చక్కని మంగళధ్వని, ప్రార్థన వినిపించారు. తర్వాత ఎస్వీ ఉన్నత వేదాధ్యమన సంస్థ ఆధ్వర్యంలో వేది పండితులు వేద స్వస్తి నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి రఘునాథ్, సంక్షేమం విభాగం డిప్యూటీ ఈఓ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో..క్యాన్సర్!
స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్) జిల్లాలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 30 ఏళ్లు దాటిన మహిళలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. వారినే నమ్ముకున్న కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతోంది. కడుపున పుట్టిన బిడ్డలను అనాథలను చేసి వీధిన పడేస్తోంది. ఈ మహమ్మారిపై సరైన అవగాహన లేకపోవడం.. మహిళలు స్క్రీనింగ్ టెస్ట్లకు భయపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాణిపాకం: జిల్లా జనాభా సుమారు 15 లక్షలు ఉండగా ఇప్పటివరకు ఆరోగ్యశాఖ చేపట్టిన స్క్రీనింగ్ కార్యక్రమాల్లో 6.2 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కేసులు 131, అనుమానిత కేసులు 3,200, ఒరల్ క్యాన్సర్ నిర్ధారణ కేసులు 192, అనుమానిత కేసులు 6,100, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 171, అనుమానిత కేసులు 1,040 నమోదయ్యాయి. ఈ గణాంకాలు జిల్లాలో క్యాన్సర్ ముప్పు ఎంత వేగంగా పెరుగుతోందో తెలియజేస్తున్నాయి. స్క్రీనింగ్ టెస్టులకు దూరం ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉంచింది. అయినప్పటికీ ప్రజలు వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదు. గ్రామీ ణ ప్రాంతాల్లో అవగాహన లోపం, భయం, నిర్ల క్ష్యం కారణంగా పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఇక తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స ఉంది. పీఓయూ రూమ్ నెం.222లో ప్రతి మంగళ, గురువారాల్లో నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై కూడా ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష అవసరమని, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యలైనా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేయొద్దు మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా లేకపోవడం, పరీక్షలకు ముందుకు రాకపోవడం వల్ల రోగం ముదిరిన తర్వాతే గుర్తిస్తున్నారు. అసాధారణ రక్తస్రావం, నొప్పులు వంటి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కుప్పం ప్రాంతంలో ఒరల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పొగాకు, గుట్కా, మద్యం వంటి అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. నోట్లో పుండ్లు, మచ్చలు వచ్చినా చాలా మంది వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తున్నారని వారు అంటున్నారు. జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు -
జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు
చిత్తూరు రూరల్ (కాణిపా కం): జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపా రు. గత నెల సాక్షి దినపత్రికలో విత్తు..రాయితీ చిత్తు పేరుతో వార్త ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించింది. మేనెలో విత్తనాల పంపిణీ చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్తార్ విందులో జెడ్పీ చైర్మన్ వి.కోట: సమాజంలో శాంతి, ఐక్యత కోసం మూస్లింలు చేస్తున్న కృషి అభినందనియమని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. గురు వారం పట్టణంలోని జామీయ మసీద్లో నిర్వహించిన ఇప్తార్ విందులో ఆయన పాల్గొన్నా రు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం శాంతి, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని కొనియడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్దే.గౌస్, ముస్లింలు షామీర్ జప్రూల్లా, అరిప్, ఖాదర్, జెడ్పీ చైర్మన్ తనయులు అమరేంద్ర, నరేంద్ర, శ్రీనివాసులు పాల్గొన్నారు. లేగదూడపై చిరుత దాడి! వి.కోట: లేగదూడపై చిరుత దాడిచేసిన ఘటన మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల వివరాలు..మండలంలోని ఎస్ బండపల్లి పంచాయతీ ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన గురువిరెడ్డి అనే రైతు గురువారం ఉద యం తమ బావి వద్ద లేగ దూడను కట్టేసి వచ్చాడు. సాయంత్రం బావి దగ్గరకు వెళ్లగా దూడను చిరుత దాడి చేసి చంపేసి తినేసి ఆన వాళ్లు గుర్తించాడు. పొలంలో చిరుత కాలిగుర్తులు గమనించారు. అధికారులు దీనిపై విచారించి.. చిరుత..? లేక హైనాన అనే విష యం తేల్చాలని ఆయన కోరారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్ తిరుమల : టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్ అనే వ్యక్తి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, దర్శన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం యోగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం యోగేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని, టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తిరుమలకు రానీయకుండా కూడా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాముడు హెచ్చరించారు. టీటీడీ ట్రస్టులకు రూ.37.55 లక్షల విరాళాలు తిరుమల : టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు గురువారం పలువురు దాతలు రూ.37.55 లక్షలు విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన సుజన్ జ్యువెలరీ అధినేత రవికుమార్ రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. అలాగే హైదరాబాద్కు చెందిన మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన మరో దాత ఆలపాటి సత్యదేవ్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే జైలు
ఆక్రమణలు తొలగించండి గంగాధరనెల్లూరు: శ్రీసిద్ధేశ్వర స్వామి కొండ గ్రామంలో ప్రభుత్వ గయాలు భూమిలో ఉన్న దేవదాయ భూములను ఆక్రమించిన వారిపై ఎట్టకేలకు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వింజం రెవెన్యూ గ్రామం సర్వే నెం.296లో ఉన్న ప్రభుత్వ గయాలు భూమి ఆక్రమణల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్గా స్పందించింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫున అడ్వకేట్ పసపల సుధాకర్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. మొదటి వాయిదా విచారణలో గయాలు భూమిలో సుమారు నాలుగు ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్టు, ముఖ్యంగా సతీష్కుమార్, సాగి కుమార్ ఆక్రమించారని రికార్డులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి వాయిదాలో తహశీల్దార్ పూర్తి రికార్డులతోపాటు సంబంధిత భూ స్కెచ్ను నేరుగా కోర్టుకు సమర్పించి, భూమి స్వరూపం, సబ్డివిజన్ జరిగిన భాగాలు, మిగిలిన గయాలు భూమి వివరాలను ఒరిజినల్ రికార్డును కోర్టుకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు వచ్చిన.డబ్ల్యూపి నెం.3565/2026 కేసులో, జీడీనెల్లూరు మండల డిప్యూటీ తహశీల్దార్ కోర్టుకు హాజరై ఒరిజినల్ రికార్డులను సమర్పించారు. 1977లో సర్వే నం.296పై సబ్డివిజన్ జరిగినట్లు, మిగిలిన 45.18 ఎకరాల గయాలు భూమిలో కొండ ప్రాంతంగా ఉన్నట్లు తెలిపారు. ఆ భూమిలో కొంత భాగం వ్యక్తులు ఆక్రమించినట్లు కోర్టుకు తెలియజేయగా, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కోర్టు ఆక్రమణదారులకు సెక్షన్ 7–6 కింద నోటీసులు జారీ చేసి ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన వివరాలను తదుపరి విచారణలో సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు కేసును 09.03.2026 తేదీకి వాయిదా వేసింది. ప్రజా ప్రయోజనాలకు చెందిన ఈ భూమి భవిష్యత్తులో మరలా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు దృష్టికి పసపల సుధాకర్రెడ్డి న్యాయవాది తీసుకువచ్చారు. శ్రీసిద్ధేశ్వర స్వామి గ్రామానికి చెందిన హిందూ సంఘాలు పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎట్టకేలకు హైకోర్టు ఆక్రమణదారులపై మొట్టికాయలు వేయడంతో న్యాయం గెలిచిందని సంతోషపడ్డారు. -
పండుగ పూటా పస్తులే
– స్విమ్స్ యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్న వేళ స్విమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న 800 మంది కార్మికులు చేపట్టిన ఆకలి పోరాటం 22వ రోజుకు చేరుకుంది. పండుగ రోజున కూడా తమ దీక్షా శిబిరం వద్దే తమ పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగోపాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించే రోజున ప్రజలు ఇళ్లలో సంతోషం నిండిపోతుంటే, స్విమ్స్ కార్మికుల ఇళ్లలో మాత్రం ఆకలి, ఆందోళన మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా, కార్మికులను చర్చలకు పిలవకుండా యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేవలం రూ.13,500 తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న కార్మికులు పండుగ రోజున కూడా తమ పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు సేవలు అందించే వార్డ్ బాయ్లు, పేషెంట్ కేర్ అసిస్టెంట్లను ‘శానిటేషన్ కార్మికులు’గా తక్కువ చేసి చూడడం అమానుషమన్నారు. ఇతర టీటీడీ అనుబంధ సంస్థల్లో ఉన్నట్లే గౌరవం, వేతనాలు స్విమ్స్ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారుల మొండి వైఖరి కారణంగా వందలాది కుటుంబాలు పండుగ రోజున కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఈ పోరాటాన్ని ఆపలేరని, వెంటనే హోదా మార్పు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి, గోపి, సూరి, వెంకటేష్, బాలకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వారధిపై ఆర్టీసీ బస్సులు ఢీ.. 10 మందికి గాయాలు
తిరుపతి క్రైం: నగరంలోని గరుడ వారధిపై గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన ఆర్టీసీ బస్సు శ్రీనివాసం సమీపంలోని ఫ్లైఓవర్పై ప్రయాణికులను దింపుతుండగా వెనకనుంచి వచ్చి మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పది మందికి స్వల్ప గాయాలయ్యా యి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఈస్ట్ సీఐ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్ వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
జ్యూస్ ఫ్యాక్టరీలో షెడ్లు దగ్ధం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజు లపెళ్లూరు సమీపంలోని రసా జ్యూస్ ఫ్యాక్టరీ లో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నాలుగు షెడ్లు దగ్ధమయ్యాయి. దీంతో భారీ నష్టం వట్టిల్లిందని యాజమాన్యం తెలిపింది. ఉగాది పండుగ కావడంతో ఫ్యాక్టరీలోని షెడ్ల లో కార్మికులు లేరని, దీంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదని పేర్కొంంది. శ్రీకాళహస్తి నుంచి ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి, పక్కనే ఉన్న మరో షెడ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలానికి రెవెన్యూ, పోలీ సు సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు. కేజీ సత్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడి మృతి బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నలగాంపల్లె పంచాయతీ, పాపానివారిపల్లెలో ప్రభు అనే వ్యక్తి కోళ్లఫారంలో బీహార్కు చెందిన లితేష్కుమార్ పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై కేజీ సత్రం గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభు ఎడమవైపు మట్టి రోడ్డుపై పడిపోయాడు. లితేష్కుమార్(19) జాతీయ రహదారిపై పడ్డాడు. అదే సమయంలో అటువైపు వస్తున్న ట్యాంకర్ లారీ లితేష్కుమార్ తలపై తొక్కించుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
జగన్తోనే ప్రజల జీవితాల్లో ఆనందం
ఉగాది వేడుకలు నారాయణస్వామి వెదురుకుప్పం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పరాభవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని గురువారం పుత్తూరు లోని క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని పచ్చికాపల్లం పంచాయతీకి చెందిన యువత పెద్ద ఎత్తున మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయ ణస్వామి ఆయన సతీమణి పరంజ్యోతిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా పేదలకు నేరుగా డబ్బులు అందేవని గుర్తు చేశారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే నవరత్నాలను మించి పేదలకు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా సంక్షేమ పథకాల అమలు పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధిలేకుండా పోయిందన్నారు. ఉన్నదిపోయి కొత్తవి ఏదీ రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్ఫృహల మధ్య జీవితాలను గడపాల్సివస్తోందని తెలిపారు. పేద ల భాగోగులను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అబద్ధాలు, అసత్యాలు, అరాచకాలతో పాలన సాగిస్తున్నట్లు మండిపడ్డారు. కేవలం ప్రచారార్బాటాలు తప్ప బడుగు, బలహీనవర్గాలకు ఒరి దింది ఏమీ లేదన్నారు. పేదల మోములో చిరునవ్వు రావాలంటే అది ఒక్క జగనన్నతోనే సాధ్య మని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉన్నా పక్కన పెట్టి పేద ల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రతి పేదవాడి ఇంట్లో పండుగ రోజేనని చెప్పారు. ఆర్థిక అసమానతలను తొలగించడం కోసమే జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యదర్శి బోడిరెడ్డినరేష్రెడ్డి, ఎస్సీ సెల్ కార్యదర్శి మురళి, యువత నాగరాజరెడ్డి, భాస్కర్రెడ్డి, మనోజ్కుమార్రెడ్డి, విజయభాస్కర్, వెంకటముని, నాగరాజు, ఉదయ్ పాల్గొన్నారు. -
తుమ్మలగుంటలో కల్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులు తిరుపతి రూరల్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేశారు. ఆ తరువాత ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు సమర్పించిన పట్టు వస్త్రాలతో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం సర్వకార్య శుభఫల ప్రదాయకమని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు అన్ని కార్యాల్లో శుభాలు కలగాలని చెవిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. చెవిరెడ్డితోపాటు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. -
ఉగాది వేళ..ఆధ్యాత్మిక శోభ
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉగాది విశిష్టత ప్రతిబింబించేలా శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో హైగ్రీవుడిని సంహరించి, నాలుగు వేదాలను రక్షించి, బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న దృశ్యాన్ని టీటీడీ శిలారూపంలో ఆవిష్కరించింది. అలాగూ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద చేసిన పుష్పాలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి ఆలయం ముందు శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాన్ని ఉద్యానవన విభాగం కార్మికులు కళాత్మకంగా రూపొందించారు. మరోవైపు, శ్రీరాముడు, చిన్నికృష్ణుడు, వేణుగాన కృష్ణుడి నమూనాలు ఉగాది ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మికతను జోడించాయి. – తిరుమల ఆలయం వెలుపల పుష్పాలతో రూపొందించిన ఏనుగులు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న శ్రీమహావిష్ణువు ఆవు, దూడలతో ఆడుకుంటున్న రాధాకృష్ణులు మామిడికాయలను చోరీ చేస్తున్న చిన్నికృష్ణుడు -
ఘనంగా ఉగాది పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సతమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చందన, పంచామృతం, క్షీర, నారికేళ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
నవ వసంతం.. ఉగాది సంబరం
పుష్పాలంకరణతో ఆకట్టుకున్న వరసిద్ధుడి ఆలయం కాణిపాకం: ఉగాది సంబరం అంబరమంటిది. పరాభవ నామ నామసంవత్సరానికి గురువారం జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. ఇళ్ల వాకిళ్లకు మామిడి ఆకులు, పూలతోరణాలు కట్టి అందంగా ముస్తాబు చేశారు. ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు. సమ్మేళనమై ఉగాది పచ్చడిని రుచి చూశారు. భక్తుల రాకతో ఆలయం ఉగాది శోభను సంతరించుకుంది. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని విదేశీ పుష్పాలతో సుందరంగా అలకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేక, పూజలు కొనసాగాయి. పంచాంగ శ్రవణాన్ని పురోహితులు పఠించారు. ముందుగా ఉత్సవమూర్తులు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, వేదపండితులు పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్రెడ్డి పాల్గొన్నారు. భక్తులు కిటకిట కాణిపాకం ఆలయం వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడం, ఉగాది పర్వదినం తోడవడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వేకువ జామునుంచే భక్తులు క్యూకట్టారు. రాత్రి వరకు కూడా రద్దీగా కనిపించింది. భక్తుల రద్దీ పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు -
నేడు వైఎస్సార్సీపీ బూత్కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం
తిరుపతి మంగళం : పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవా రం ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ కమి టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు నాగూరి యోగాంజనేయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, బూత్కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆటో, కారు ఢీ – నలుగురికి తీవ్ర గాయాలు చంద్రగిరి: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చంద్రగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద ఎదురెదురగా ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధులకు వెళుతూ.. ఏర్పేడు: ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో నాగంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు ఎస్ఐ రవిప్రకాష్ కథనం మేరకు.. ఏర్పేడు మండలం ఆమందూరు బీసీ కాలనీకి చెందిన గురుస్వామి, ప్రమీల దంపతుల కుమారుడు చెంచు గురుచంద్ర(28) రాక్మెన్ కంపెనీలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పాగాలి సమీపంలోని రాక్మెన్ కంపెనీకి వెళ్లేందుకు బైక్పై ఇంటి నుంచి బయలుదేరాడు. నాగంపల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి ఎదురుగా ముందు వెళుతున్న కట్టెల లోడ్ ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న చెంచు గురుచంద్ర తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
అందరి జీవితాల్లో ఆనందం నిండాలి
చిత్తూరు కార్పొరేషన్: అందరి జీవితాల్లో ఆనందం నిండాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆకాంక్షించారు. గురువారం కలెక్టరేట్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, వేద విజ్ఞానం సంప్రదాయాల్ని వారసత్వంగా కొనసాగించాలన్నారు. ఉగాదిని పండుగకే పరిమితం చేయకుండా ఇందులోని విశిష్టతను తెలుసుకోవాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్ మాట్లాడుతూ ఉగాది యుగానికి ఆది అని అభివర్ణించారు. అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అర్చకులు చిలకమర్తి వెంకటసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరంలో అన్నింటా జిల్లా ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు. వేద పండితులు వెంకటసుబ్బారావు, శ్రీధర్అయ్యర్, పద్మనాభగురుకుల్, రామకృష్ణఆచార్య, పార్థసారథిని ప్రభుత్వం తరఫున సత్కరించి గౌరవించారు. ఉగాది కవి సమ్మేళనంలో కవితలను ఆలపించిన కవులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. అలాగే పండ్ల పరిశ్రమ, మామిడి రైతులకు చేసిన సేవలను గుర్తించి ఆలిండియా ఫుడ్ ప్రొసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ బాబిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్రకుమార్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చిట్టెమ్మ, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బాబిని సన్మానిస్తున్న ఇన్చార్జ్ కలెక్టర్, అధికారులు మాట్లాడుతున్న ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ -
ఆ కూత రాదే?
రోజూ చిత్తూరు మీదుగా వెళ్లే రైళ్లు – 19 ప్రయాణికుల సంఖ్యృ – 3,600 రిజర్వేషన్ ప్రయాణికులు – 300 పైన రోజువారీ రైల్వేస్టేషన్ ఆదాయం – రూ.3 లక్షలు స్టేషన్ ర్యాంక్ – ఎన్ఎస్జీ–4చిత్తూరు కార్పొరేషన్: పేరుకే జిల్లా కేంద్రం. ఇక్కడి నుంచి రవాణా సదుపాయాలు అంతంతమాత్రమే. స్థానిక రైల్వేస్టేషన్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి నుంచి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో పలు ప్రముఖ నగరాలకు సైతం చిత్తూరు స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. అయితే ప్రధాన నగరాలకు వెళ్లే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు చిత్తూరులో స్టాపింగ్ లేదు. ఇక్కడ ఆగని రైళ్ల కోసం ప్రయాణికులు చిత్తూరు నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న తమిళనాడులోని కాట్పాడికి, లేదా 33 కి.మీ దూరంలో ఉన్న పాకాల, 72 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. ముఖ్యంగా చైన్నె ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తోందో తెలియడం లేదు. వీటి పై ఇటు పాలకులు, అటు అధికారులు స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కుప్పంకే ప్రాధాన్యత కుప్పంలో పలు రైళ్లు ఆపాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఇటీవల సీఎం చంద్రబాబు కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన వాస్కోడగామ–వేలాంకణి, దాదర్సెంట్రల్–పాండిచ్చేరి ఎక్స్ప్రెస్లను కుప్పం రైల్వేస్టేషన్లో స్టాపేజ్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీచేశారు. కానీ జిల్లా కేంద్రంలో రైళ్లు ఆగకపోవడం, చైన్నెకి నేరుగా రైలు లేకపోవడం పై పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఎంపీ మిథున్రెడ్డి వినతి చైన్నె –మదనపల్లె రోడ్డు మధ్య రైలు నడిచేలా కోవిడ్ సమయంలో రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వీటి పై రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి రైల్వే మంత్రిని కలిసి వినతి చేశారు. ఈ రైలు చైన్నెలో ఉదయం 8 గంటలకు బయలుదేరి 11.25 గంటలకు చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లె రోడ్కు వస్తుందని, తర్వాత తిరిగి 2.45 గంటలకు మదనపల్లె రోడ్ నుంచి బయలుదేరి రాత్రి 8.55 గంటలకు చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ చేరుకునేలా షెడ్యూల్ను గతంలో నిర్ణయించారు. ఈ రైలును ప్రారంభిస్తే రెండు రాష్ట్రాలకు చెందిన చిత్తూరు, చైన్నె, మదనపల్లె వాసులకు ఎంతో సౌకర్యం ఉంటుంది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో? కాట్పాడిలో ఆగే రైలు చిత్తూరులో ఆగితే నగరవాసుల కల తీరుతుందని పలువురు అభిప్రాయపడుతన్నారు. చిత్తూరు నుంచి దేశంలోని ముఖ్య నగరాలైన ఢిల్లీ, కలకత్తా, బాంబే, అహ్మదాబాద్తో పాటు నాగపూర్, బెంగళూరు వంటి నగరాలకు రైలు సదుపాయం ఉంది. కానీ వాటి కంటే తక్కువ దూరంలో ఉన్న చైన్నెకి రైలు సదుపాయం లేదు. చిత్తూరు నుంచి చైన్నెకి రైలు సదుపాయం కల్పించాలని చిత్తూరు స్మార్ట్ సీటీ డెవలప్మెంట్ సభ్యులు స్థానిక రైల్వేస్టేషన్లో ప్రజాభిప్రాయాలు తీసుకుని రైల్వేశాఖకు సైతం పంపారు. కానీ దీనిపై పాలకులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు. స్టేషన్ మాస్టర్కు అందజేస్తున్న సంతకాల జాబితా(ఫైల్) వీటిని ఆపే దమ్ముందా? తిరుపతి–రామేశ్వరం, హౌరా–పాండిచ్చేరి, ఓకా–రామేశ్వరం, తిరుపతి–రామేశ్వరం, టాటా–యశ్వంత్పూర్, కన్యాకుమారి, హఠియా–యశ్వంత్పూర్, హౌరా–పాండిచ్చేరి రైళ్లు చిత్తూరు మీదుగా వెళ్తుంటాయి. కానీ వీటికి ఇక్కడ స్టాపింగ్స్ లేవు. వీటిలో ప్రయాణించాలంటే పాకాల లేదా తిరుపతి, కాట్పాడికి వెళ్లి ఎక్కాల్సిందే. -
క్వాంటమ్ టెక్నాలజీలో ఎస్వీయూ కీలక ప్రాత పోషించాలి
తిరుపతి సిటీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ టెక్నాలజీకి దోహదపడేలా ఎస్వీయూ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీయూ వీసీ చాంబర్లో ఆయన క్వాంటమ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యవస్థకు దోహదపడేలా విద్యార్థులను, పరిశోధకులను, అధ్యాపకులను సిద్ధం చేయడంలో ఎస్వీయూ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు పాల్గొన్నారు. -
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జన్మించినప్పటి నుంచే ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ చిన్నారి జీవితంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల డాక్టర్లు వెలుగులు నింపారు. నెలలు నిండకముందే పుట్టిన ఆ పాపకు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, కొత్త జీవితాన్ని ప్రసాదించారు. తిరుపతి జిల్లా పాకల మండలం దామలచెరువుకు చెందిన శిరీషా–విజయకుమార్ దంపతులకు పుట్టిన పాప ప్రారంభం నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. పాలు సరిగా తాగకపోవడం, తల పరిమాణం అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో కుటుంబం ఆందోళనకు గురైంది. పరిస్థితి విషమించడంతో వెంటనే చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, పాప మెదడులో రక్తస్రావంతో పాటు నీరు చేరినట్టు గుర్తించారు. ఇది హైడ్రోసెఫలస్ అనే ప్రమాదకర స్థితి. ప్రాణాపాయం ఉన్న ఈ కేసును వైద్యులు సవాలుగా స్వీకరించారు. మొదట పాపకు వస్తున్న ఫిట్స్ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. అనంతరం అత్యంత జాగ్రత్తలతో క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీకి సిద్ధమయ్యారు. తక్కువ బరువు, పలుచని చర్మం కారణంగా ప్రతి క్షణం ప్రమాదకరంగా మారిన ఈ ఆపరేషన్ను న్యూరో శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె.సాయినాథ్రెడ్డి నేతత్వంలో విజయవంతంగా పూర్తిచేశారు. మెదడులో చేరిన నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేక స్టంట్ను అమర్చి, రక్తప్రసరణను సక్రమంగా పునరుద్ధరించారు. ఆపరేషన్ తర్వాత పాప ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అపోలో ఆధ్వర్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి మానవత్వానికి చిరునామాగా నిలిచింది. -
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు తిరుపతికి చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొండూరు మోహన్ కుమార్ రాజు కుమార్తె డాక్టర్ శ్రావ్య రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాత తల్లిదండ్రులు సుధా, మోహన్ కుమార్ రాజు, భర్త యుగంధర్ చేతుల మీదుగా డీడీని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో విరాళం ఇచ్చానని చెప్పారు. తన వ్యక్తిగత, కుటుంబ ఉన్నతితో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు గాయాలు
పలమనేరు: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ గాయపడిన ఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మునిలక్ష్మి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై భారీ శబ్దం రావడంతో కొందరు స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి ప్రమదాన్ని తప్పించారు. గాయపడిన మునిలక్ష్మిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చట్టబద్ధంగానే కొనుగోలు చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న స్థలాన్ని చట్టబద్ధంగానే విక్రయించినట్లు థియే సోఫికల్ సొసైటీ ఇండియా చాప్టర్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వారణాసిలోని తమ సొసైటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో చిత్తూరులోని ఆస్తులను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఈ భవనం పురాతనమైనది కావడంతో ఇప్పటికే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నివాసయోగ్యానికి అనుకూలంగా లేదని ధ్రువీకరణ పత్రం సైతం పొందామన్నారు. భవన నిర్మాణ కూల్చివేత పనులన్నీ తమ అనుమతితోనే జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. శిల్పి జక్కన్నకు కళారత్న పురష్కారం పలమనేరు: నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం, నేలపల్లికి చెందిన ప్రముఖ శిల్పి తొండవాని పురుషోత్తమాచార్య అలియాస్ జక్కన్న(80)కి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా శిల్పకళారంగంలో చూపిన ప్రతిభకు ఏడాదికి గాను కళారత్న పురష్కారానికి ఎంపిక చేసింది. ఆ మేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అజయ్జైన్ నుంచి బుధవారం ఆదేశాలందాయి. ఉగాది సందర్భంగా ఆయనకు ఈ పురష్కారాన్ని అందించనుంది. కాగా జక్కన్నకు స్థానిక పలమనేరు రచయితల సంఘం, తెలుగు సాహిత్య సాంస్క్రృతిక సమితి నిర్వాహకులు అభినందలు తెలిపారు. ‘దివ్యాంగశక్తి’ ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులని.. వారి సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్నవారని ఇన్న్చార్జి కలెక్టర్ రాజేంద్రన్ కొనియాడారు. బుధవారం చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్లో ‘దివ్యాంగ శక్తి’ (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 33,848 మంది దివ్యాంగులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, చుడా చైర్మన్ కఠారి హేమలత పాల్గొన్నారు. -
గ్రూప్–డీ పరీక్షలకు ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నేతృత్వంలో రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డీ 2026 పోటీ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచిత శిక్షణ ఉంటుందని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తులను తిరుపతి ఎమ్మార్పల్లి బీసీ స్టడీ సర్కిల్, కృష్ణానగర్, ఎమ్మార్పల్లి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వంద మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతోపాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణ అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి మార్కు లిస్టులు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డీ పరీక్షకు దరఖాస్తు చేసిన ఆన్లైన్ జిరాక్స్, 2 పాస్ పోర్ట్ సైజ్ పొటోలు జతపరచి ఇవ్వాలని స్పష్టం చేశారు. బీసీ స్టడీ సర్కిల్ 9441456039, 9346221553 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు. స్కూల్ వ్యాన్ను ఢీకొన్న ట్రాక్టర్ తిరుపతి రూరల్: మండలంలోని కేసీపేట పంచాయతీ భాగ్యనగరం వద్ద బుధవారం రాత్రి ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ను ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వచ్చే స్కూల్ వ్యాన్పైకి దూసుకు వెళ్లగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కదలలేని స్థితిలో వున్న స్కూల్ వ్యాన్ను నెమ్మదిగా పక్కకు తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఎవరికీ పెద్ద గాయాలు లేనందున అందరు ఊపిరిపీల్చుకున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం వద్ద ఉన్న వెరిటాస్ సైనిక్ స్కూల్ వ్యాన్ పిల్లలను వదిలేసి తిరిగి పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినందున పెను ప్రమాదం తప్పింది. -
ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరికిన కేసులో ఇద్దరికీ ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్, ఎరగ్రుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లా ఇస్లాంనగర్కు చెందిన సాదిక్ బాషా, గణేషన్ మురుగన్ ఎరచ్రందనం చెట్లను నరికి తొమ్మిది దుంగలుగా మార్చి తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 326 కిలోల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియామకం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియమించారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మురళికృష్ణ (సూపరింటెండెంట్) ను నియమించారు. ఆయన రెండు జిల్లాల పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తారు. అలా గే ఏప్రిల్ 4,5 తేదీల్లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ట్యాబ్ ఆధారిత మార్కుల ఎంట్రీ సిస్టమ్ను, మూల్యాంకనం పనితీరును పరిశీలన చేస్తా రు. పదో తరగతి మూల్యాంకన కేంద్రాల్లో 300 ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి అనుమతులిచ్చారు. ట్యాబ్ పరికరాల నిరంతర చార్జింగ్, పవర్ సాకెట్లతో కూడిన పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇందుకు గాను ప్రత్యేక నిధులను కేటాయించారు. నేడు దివ్యాంగ శక్తి ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బుధవారం చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రారంభించనున్నట్లు డీపీటీఓ రాము ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పథకం ద్వారా 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారికి సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని పేర్కొన్నారు. నాన్–స్టాప్, ఇంటర్స్టేట్ సర్వీసులకు ఈ సౌకర్యం వర్తించదని స్పష్టం చేశారు.100 శాతం దృష్టి లోపం లేదా మేధోపరమైన వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. డిజిటల్ బస్ పాస్ కలిగిన వారు తప్పనిసరిగా సదరన్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలని, కండక్టర్లు అర్హతను పరిశీలించి జీరో ఫేర్ లేదా రాయితీ టికెట్లు జారీ చేస్తారని వివరించారు. కాణిపాకంలో కియోస్క్లు కాణిపాకం: భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కీలక కాణిపాకం దేవస్థానంలో ముందడుగు పడింది. ఆలయంలో టికెట్లు, ఆర్జిత సేవ లు, విరాళాలు సులభంగా పొందేందుకు ఆలయ అధికారులు 8 కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్లను ఎమ్మెల్యే మురళీమోహన్ మంగళవారం ప్రారంభించారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మిషన్లు భక్తులకు వేగవంతమైన సేవలు అందించనున్నాయి. ప్రారంభానికి ముందు ఆర్జిత సేవా కౌంటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచ లకిషోర్, బోర్డుసభ్యులు పాల్గొన్నారు. 14 మంది పందెం రాయుళ్లపై కేసు పెనుమూరు (కార్వేటినగరం): కోడి పందేలు ఆడుతున్న 14 మందిపై దాడులు చేసి కేసు నమోదు చేసిన సంఘటన పెనమూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా... మండల పరిధిలోని శాతంభాకం పంచాయతీ బలిజపల్లి చెరువుకు తూర్పుభాగాన ఖాళీ స్థలంలో మామిడి చెట్టు కింద కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన రహస్య సమాచార మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో రూ.15,350 నగదు, ఏడు కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కోడి పందేలు ఆడుతున్న 14 మంది అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మనేక్షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో ఎంఓయూ ఏర్పేడు: దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో నూతన ఆవిష్కరణల కోసం తిరుపతి ఐఐటీ, ద మనేక్షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ రీసెర్చ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీలో మంగళవారం ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, మానేక్షా సెంటర్ ముఖ్య పోషకుడు, గౌహటి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవేంద్ర జలిహాల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా భద్రతా సంస్థలు, ప్రముఖ భాగస్వాముల సహకారంతో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష రంగంపై అధునాతన పరిశోధనలు చేయనున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మనేక్షా సెంటర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డా. సుబ్రతా సాహా, మానేక్షా సెంటర్ సీవోవో శంఖ సువ్ర భౌమిక్, తిరుపతి ఐఐటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలి
ఐరాల : లాభసాటి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కోరారు. మంగళవారం మండలంలోని 45 కొత్తపల్లెలో జిల్లా వ్యవసాయాధికారి మురళి ఆధ్వర్యంలో స్థానిక రైతులకు రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా అన్ని శాఖలను సమన్వయం చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుతున్న కాలనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ఫ్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలపై పంచసూత్రాల విధానాన్ని రైతులు అవలంబించేలా అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్యం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం వలన జరిగే మేలును వివరించాలన్నారు. జిల్లా వ్య వసాయాధికారి మురళి మాట్లాడుతూ.. రైతులు ఒకే రకం పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను సాగు చేసుకోవాలని, ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలన్నారు. పంటల సాగుకు నీటిని పొదుపుగా వాడడంతో పాటు, భూగర్భ జలాలను పెంచే విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యసాయం జెడ్బీఎన్ఎఫ్ నుంచి పీఎండీఎస్ కిట్స్ 25 రకాల ధాన్యాలు రైతులకు పంపిణీ చేశారు. జేసీ రైతులకు పంచ సూత్రాల కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమామహేశ్వరి, డీఆర్సీ ఏఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ లోకేశ్వరి, ఎంపీడీఓ చంద్రశేఖర్రెడ్డి, ఏఓ శివప్రసాద్, ఆర్ఎస్కే సిబ్బంది రామచైతన్య, నరేష్, శంకర్, అశ్విని, జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది భారతి, యతీంద్రనాయుడు, రేఖ, వాణి, రైతులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి మురళి రైతులకు ధాన్యాలు పంపిణీ చేస్తున్న జేసీ -
గ్యాస్ కొరత అవాస్తవం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ప్రస్తుతం 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయిని, దాదాపు 16 వేల సిలిండర్లు బఫర్ స్టాక్గా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.వినియోగదారులు బుక్ చేసిన 48 గంటల లోపే సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. గ్యాస్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రతి ఏజెన్సీ వద్ద ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08572–242734కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయితే వినియోగదారులు కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. -
టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు , సెకండ్ గ్రేడ్ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపా రు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ జాబితాను మేనేజ్మెంట్ల వారీగా (జిల్లా పరిషత్, ప్రభుత్వం, మున్సిపాలిటీలు , కార్పొరేషన్) విభజించి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో నమోదు చేశామన్నారు . గతంలో (మార్చి 1న) విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని సవరించిన అనంతరం తుది జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు చెప్పారు. అలాగే ఎంఈఓ డీవైఈవో మెయిల్స్కు పంపినట్లు తెలిపారు. సవరించిన ఈ జాబితాలపై ఇంకా ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే, తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పా రు. అభ్యంతరాలను ఈనెల 23వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. కడా పీడీ ఆకస్మిక తనిఖీ కుప్పం: నియోజకవర్గంలోని మూడు గురుకుల పాఠశాలలో కడా పీడీ వికాస్ మర్మత్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మంగళవారం రామకుప్పం, కడపల్లి, గణేష్పురంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల వసతి గృహాల్లో తనిఖీ చేట్టా రు. వసతి గృహాల్లో విద్యార్థులకు వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాలు, హాస్టల్స్ తాగునీరు, మురుగు దొడ్లు పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహాల భోజనాల నాణ్యత, వంట గదులు పరిశుభ్రత, భోజనాల రుచి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బదిలీ చిత్తూరు కలెక్టరేట్: ఐవోసీఎల్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటశివను నంద్యాల జిల్లా ఆత్మకూ రు ఆర్డీవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. -
జెడ్పీ విభజనకు కసరత్తు?
ఉమ్మడి జిలాలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మందికి పైగా జెడ్పీ ఉద్యోగులున్నారు. విభజన సమయంలో ఉద్యోగులు ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటున్నారు? ఆ తర్వాత సీనియార్టీ కేడర్ ప్రతిపాదికన జాబితాను అధికారులు సిద్దం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుత జిల్లా పరిషత్ పునర్వ్యవస్థికరించడం, కొత్త జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన, తాతాక్కలిక భవనాల గుర్తింపు, కేటాయింపు , జడ్పీ భవనాల నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జెడ్పీ ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాల వారీగా పూర్తి స్థాయి ఆదేశాలు రావాల్సి ఉంది. ఉద్యోగుల జాబితా తయారీ, ఇతర వాటిపై సృష్టత రావాలి అని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలియజేశారు. చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కేంద్రంగా జెడ్పీ పరిపాలన సాగుతోంది. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఉండటంతో వాటి విభజన చేయలేదు. ప్రస్తుతం వారి పాలన గడువు సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో జెడ్పీల విభజన చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎం సూచనప్రాయంగా ప్రకటించారు. దీంతో కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి వేరుపడి కొత్తగా మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిషత్ ఏర్పా టు కానున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటూ పాలకుల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. దీంతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇది వరకే కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ ఏర్పాటవుతాయని, తద్వారా ఎన్నికలు జరుగుతాయంటూ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తెలియజేశారు. ఇప్పటి వరకు కడప ఉమ్మడి జిల్లా కింద రాయచోటి నియోజకవర్గంలోని మండలాలుండగా ఇవన్నీ మదనపల్లె కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా పరిషత్ కిందకు చేరనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కింద ఉన్న పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలోని మండలాలు అన్నమయ్య జిల్లా పరిషత్లో చేరనున్నాయి. ఐదు నియోజవర్గాల పరిధిలోని 25 మండలాల పరిధి కింద జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ ఉద్యోగోన్నతులు జరగ్గా.. కొత్త జిల్లాలకు కేటాయింపునకు వీలుగా సీఈవోల నియామకానికి కసరత్తు దాదాపు పూర్తి చేశారు. ఆర్థికశాఖ అనుమతులు రాగానే కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు, వాటికి సీఈవోలు,ఉద్యోగుల సర్దుబాటు వ్యవహారం పూర్తి కానుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త జడ్పీ అధికార యంత్రాంగం చేపట్టనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు 2021లో జరగ్గా ఆ తర్వాతనే 2022 ఏప్రిల్ జిల్లాల పునఃవ్యవస్థీకరణ జరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్ పాలన సాగింది. ఇక జిల్లాల వారీగా జిల్లా పరిషత్ అందుబాటులోకి వస్తాయి. వ్యవస్థ ఏర్పాటుతో పాటు రాజకీయంగానూ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. 17సీటీఆర్55: జెడ్పీ కార్యాలయం సీనియార్టీ ప్రాతిపాదికన -
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుమంత్ విజయం
చిత్తూరు అర్బన్: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ఎన్వీ సుమంత్ విజయం సాధించా రు. సుమంత్ చిత్తూ రు నగరంలోని తోటపాళ్యం కాగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఓ ట్ల లెక్కింపులో చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూ రు, తిరుపతి జిల్లాల నుంచి 1409 ఓట్ల కోటాను సాధించిన ఆయన.. బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనట్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత ప్రకటించారు. చిత్తూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రస్తుత రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథరెడ్డి తనయుడే సుమంత్ కావడం గమనార్హం. ఆయన గెలుపుపై జిల్లాకు చెందిన పలువురు న్యాయ వాదులు, న్యాయవాద సంఘాలు సైతం అభినందనలు తెలిపారు. నాణ్యమైన కరెంటు సరఫరాకు కృషి పెనుమూరు(కార్వేటినగరం): విద్యుత్ విని యోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన విద్యుత్ను అందించాలని ఎస్ ఈ ఇస్మా యిల్ అహ్మద్ అన్నారు. మంగళ వారం పెనుమూరు విద్యుత్ సబ్స్టేషన్ను తని ఖీ చేశారు. వేసవి దృష్యా విద్యుత్ వినియో గం పెరిగే అవకాశం ఉందని దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ను అందించాలని పేర్కొన్నారు. గ్రామాలలో విద్యుత్ వినియో గంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాత బకాయిలను వేగవంతంగా వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం సబ్స్టేషన్ రికార్డులను పరిశీలించి తగు సూచనలిచ్చారు. ఆయన వెంట చిత్తూరు రూరల్ ఈఈ సురేష్కుమార్, పెనుమూరు ఏఈ తులసీ ప్రసాద్ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం వి.కోట : బైక్పై వెళ్తున్న వ్యకిని గుర్తుతెలియని లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం వేకువ జామున మండలంలోని నెర్నిపల్లి గ్రామానికి చెందిన అక్బర్ సాహెబ్(60) పలమనేరు జాతీయ రహదారి దొడ్డిపల్లి క్రాస్ సమీపంలో తన బైక్పై రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గుర్తు తెలియని లారీ అక్బర్ బైక్ను ఢీకొని ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అక్బర్ అక్కడికక్క డే మృతి చెందాడు. గమనించిన స్థానికలు పోలీ సులకు ఈ ఘటన పై సమాచారం ఇవ్వగా సీసీ ఫుటేజ్ సాయంతో ప్రమాదానికి కారణమైన లారీ ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజర్గా కృష్ణానాయక్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్గా కృష్ణానాయక్ను ప్రభు త్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు నూతనంగా ప్రాజెక్ట్ మేనేజర్గా నియమితులైన ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. -
గోమాతపై దాష్టీకం
నగరి : పట్టణంలో మూగజీవిపై అమానుష దాడి చోటుచేసుకుంది. కూరగాయలు తినిందనే కారణంతో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గోమాతను తీవ్రంగా గాయపరిచిన ఘటన బస్టాండు ప్రాంగణంలోని సంత మైదానంలో కలకలం రేపింది. మున్సిపల్ పరిధిలోని కీలపట్టు దళితవాడకు చెందిన సుబ్రమణ్యం కుటుంబానికి చెందిన ఆవు చూలుతో ఉంది. ఏమరపాటుగా వదిలేయడంతో ఆవు సోమవారం సాయంత్రం సంత మైదానంలోకి వెళ్లి కొన్ని దుకాణాల వద్ద ఉన్న కూరగాయలను తిన్నట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న గుర్తుతెలియని దుకాణదారు, ఎవరూ లేని సమయంలో ఆవు వెనుక భాగంలో కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆవును వెతుక్కుంటూ వచ్చిన యజమాని సోమవారం రాత్రి ఆవు ఆక్రందన విని అక్కడికి చేరుకోగా, తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించింది. వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా, వైద్యులు 24 కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. మూగజీవిపై ఇలాంటి క్రూర చర్యకు పాల్పడిన నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
పెండింగ్ పనుల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశా లల్లో పెండింగ్లో ఉన్న నాడు– నేడు (మనబడి మన భవిష్యత్) పనులను సమగ్రశిక్ష జేడీ మువ్వా రామలింగం మంగళవారం పరిశీలించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో నాడు–నేడు కింద పనులు చేపట్టారు. రెండో విడత పనుల్లో జిల్లావ్యాప్తంగా 830 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనులను చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. దీంతో రూ.30 కోట్లు నిధులు ఆయా పాఠశాలల ఖాతాల్లో అలాగే ఉన్నా యి. త్వరలో పెండింగ్లో ఉన్న పనుల పూర్తికి ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు విచ్చేసిన జేడీ మువ్వారామలింగం పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో పెండింగ్ పనులను తనిఖీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఏపీసీ వెంకటరమణ, ఎంఈఓలు మోహన్, గణపతి పాల్గొన్నారు. -
139 విద్యుత్ సమస్యల గుర్తింపు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట చేపట్టారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 30 సమస్యలు, డీటీఆర్ 1, ఎల్టీ లైన్ల పరంగా 90, సర్వీసు లైన్లకు 18 కలిపి మొత్తం 139 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఆస్తి పన్నుపై వడ్డీ బాదుడు! చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుపై వడ్డీ మాఫీని 50శాతానికే పరిమితం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వాళ్లకు.. అప్పటి వరకు ఉన్న వడ్డీపై 50 శాతం మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆస్తి పన్నుపై మొత్తం వడ్డీ మాఫీ చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్నుపై దాదాపు రూ.26.02 కోట్లు వడ్డీ ఉండగా.. ఇందులో 50 శాతం మాఫీ చేసిన తర్వాత ప్రజలపై రూ.13 కోట్ల వడ్డీ భారం పడుతోంది. అలాగే కుప్పం మున్సిపాలిటీలో రూ.97 లక్షలు, పలమనేరులో రూ.14 లక్షలు, నగరిలో రూ.68 లక్షలు వడ్డీని ప్రజలు భరించాల్సి వస్తోంది. మొత్తం రూ.14.8 కోట్లు వడ్డీని తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యుత్ సర్వీసుల విడుదలకు ఆదేశం చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్ఫార్మర్లు స్టాకు వస్తోందని వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో విడుదల చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఆదేశించారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్, రూరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండు డివిజన్ల పరిధిలో దాదాపు 1000 వ్యవసాయ సర్వీసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ల నిల్వలు పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయని, ఏప్రిల్ ఆ సంఖ్య మరింత పెర గే ప్రమాదముందని హెచ్చరించారు. ఆ సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ చౌర్యంపై ప్రత్యేక నిఘా పెట్టాని ఆదేశించారు. సమావేశంలో ఈఈలు మునిచంద్ర, సురేష్, హరి పాల్గొన్నారు. హోటల్లో గ్యాస్ చార్జీలు! చిత్తూరు అర్బన్: చైన్నెలోని హోటళ్లలో భోజ నం చేసినా, పార్శిల్ తీసుకెళ్లినా గ్యాస్ చార్జీలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన చిత్తూరు నగరంలోనూ జరిగింది. నగరంలోని ఓ హోటల్లో మంగళవారం ఉదయం టిఫిన్ పార్శిల్ తీసుకున్న వ్యక్తికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. గ్యాస్ పేరిట అదనంగా మరో రూ.10 బిల్లులో చేర్చింది. దీంతో వినియోగదారులు ఆ హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దేవునితో రాజకీయాలు దురదృష్టం
– మాజీ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు: దేవునితో రాజకీయాలు చేయడం దుర దృష్టకరమని, ఆలయాల వద్ద పాలిటిక్స్కు స్థానమే లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పుత్తూరులోని శ్రీధర్మరాజస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ద్రౌపదీ దేవి 40 అడుగుల భారీ విగ్రహానికి పూజలు చేశా రు. అనంతరం రోజా మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ఆలయాల వద్ద సైతం కుటిల రాజకీయాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ద్రౌపదీదేవి రాజగోపురానికి రూ.20 లక్షలను మంజూరు చేయించామని, మరో రూ.5లక్షల సొంత నిధులు అందించామని, మొ త్తం రూ.25లక్షలతో నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.అలాగే అమ్మవారి గర్భగుడిని సైతం ఆధు నికీకరించామన్నారు. అప్పట్లో ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాకుంభాభిషేకంలో రాజకీయాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేశామ ని తెలిపారు. అయితే ఆలయ ఆవరణలో తాము ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ప్రస్తుత పాలకులు అహంకారంతో ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టను సైతం పార్టీ కార్యక్రమంగా నిర్వహించి భక్తులను అవమానించారని విమర్శించారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని దేవాలయాల్లో రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్ చైర్మన్ డి.జయప్రకాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకాంబరం, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశులు, నేతలు రవీంద్ర, రాజేశ్వరి, మునిరత్నం, చక్రి, బాలాజీ, గుణ, ఈశ్వ రయ్యయాదవ్, ప్రవీణ్, దిలీప్కుమార్, కుట్టి, లారీ మోహన్, మనోహర్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివలింగం, సుబ్రమణ్యం, చిన్నా, శివ, శీనా పాల్గొన్నారు. -
యువతకు వరం..‘జాబ్ కనెక్ట్’
చిత్తూరు కలెక్టరేట్ : యువతకు సీడాప్ జాబ్ కనెక్ట్ ఓ వరమని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం చిత్తూరులోని టీటీడీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సీడాప్ జాబ్ కనెక్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీడీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా మేనేజర్ సరితారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు, పరిశ్రమలకు వారధిలా పనిచేయడమే సీడాప్ జాబ్ కనెక్ట్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. జాబ్ మేళాకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 170 మంది హాజరయ్యారన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 102 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నట్లు వివరించారు. -
రెడ్బుక్ రాజ్యాంగం..
అప్రజాస్వామిక పాలన●అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తున్న నేతలుతిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులుభయపడం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లన్నీ వారితో నింపినా భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన గూండాలు దాడులు చేస్తే వారిని వదిలిపెట్టి, దాడిలో గాయపడిన మా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం దుర్మార్గం. ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై అక్రమ కేసు నమోదు చేయడం, నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, మరికొంత మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు, రెడ్బుక్ పాలనకు నిదర్శనం. – డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి బాధితులపై కేసులు పెడతారా? వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి బాధితులపైనే కేసులు పెడతారా..? చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలంటే చులకనగా చూస్తున్నారు. మగువ, మత్తుపదార్థాలతో కూటమి నేతలు జోగుతున్నారు. అధికార అహంకారంతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాసలీలల బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత లేదు. శ్రీవారి భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు నిజంగా శ్రీవారిపై భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడుని తొలగించాలి. – నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం భ్రష్టు పట్టించారు టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా టీటీడీ ప్రతిష్టను బీఆర్ నాయుడు భ్రష్టుపట్టించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నీ అపరాచాలే. ఇలాంటి చైర్మన్ ఎప్పుడూ లేడు. ఇక రారు కూడా. ఆయనను ఇంకా చైర్మన్గా కొనసాగిస్తే అంత కంటే మహాపాపం మరొకటి ఉండదు. ఇప్పటికై నా చేసిన తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు తప్పుకోవాలి. – సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ నిరసన తెలిపే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతోనే కూటమి పాలన సాగిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎస్సీలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. కామ కలాపాలు సాగించే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా కొనసాగించడం దారుణం. – నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తసాక్షి ప్రతినిధి, తిరుపతి/మంగళం: రెడ్బుక్ రాజ్యాంగంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం ఈ మేరకు తిరుపతి, చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన మెరుపు ధర్నాలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచడంపై మండిపడ్డారు. తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యాలు నశించాలంటూ నినదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో ఎన్నడూ దాడులు జరిగి న దాఖలాలే లేవు. నైతిక విలువలు లేని బీఆర్ నా యు డిని టీటీడీ చైర్మన్గా కొనసాగించడం కంటే మహా పా పం మరొకటి ఉండదు. ఆయన్ని ఉపేక్షించడంలో ఆంతర్యమేంటో చెప్పాలి. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తబీఆర్ నాయుడుని తొలగించాలి తిరుమల శ్రీవారి పరమభక్తుడిని, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏడు కొండలనే చూస్తానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికై నా స్పందించాలి. బీఆర్ నాయుడు అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలే తప్ప ప్రజాపాలన లేదు. అక్రమ కేసులు పెడితే భయపడి ఇంట్లో ఉంటామనుకుంటే పొరబాటే. – చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్న్యాయమే గెలిచింది.. అధర్మం ఓటమి పాలైంది.. ఇందుకు నిదర్శనం అక్రమ కేసులో అరెస్టయిన అందరినీ విడుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పడమే.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి రాసలీలలను వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. వీరిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. అధికార పార్టీ సూచనల మేరకు పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్ బాబు అలియాస్ సురేష్, ఏ అజయ్కుమార్, ఈ.అనిల్కుమార్ రెడ్డి, బి అరుణ్ కుమార్ యాదవ్ అలియాస్ అరుణ్ యాదవ్, బృంగి నవీన్, ఎల్ .దినేష్, ఎన్. బాబు, ఏ. కోటి ,బి గీతా యాదవ్ అలియాస్ గీతాదేవి, ఎం. సాయికుమారి, కె లక్ష్మి ,జి విజయలక్ష్మి, కె.వి పద్మజ తదితరులను అరెస్టు చేశారు. దీనిపై న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు అందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. చిత్తూరు కార్పొరేషన్ : టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టడంపై మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ మహిళలను టీడీపీ నేతలు అసభ్యంగా దూషించడం హేయమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పాలనను ఇప్పటి వరకు చూడలేదని విమర్శించారు. బీఆర్నాయుడు రాసలీలలు బయటపడినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం ఫోన్లోనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినందుకు అప్పటి ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీని వెంటనే తొలగించారని గుర్తుచేశారు. బీఆర్ నాయుడు వీడియోలు వెలుగు చూసినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నిరసనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ సంఖ్యలో మొహరించారు. కార్యక్రమంలో నేతలు గాయత్రీదేవి, విజయసింహారెడ్డి, కేపీ శ్రీధర్, సరళమేరీ, అంజలిరెడ్డి, హరిషారెడ్డి, సూర్యప్రతాప్రెడ్డి, సుగుణశేఖర్, అప్పొజీ, రజనీకాంత్, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, మనోజ్రెడ్డి, వెంకటేష్, ప్రతిమారెడ్డి, అల్తాఫ్, నారాయణ, దేవరాజులు, మనోహర్, డేవిడ్ పాల్గొన్నారు. చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం ఇస్తున్న విజయానందరెడ్డి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు ‘‘ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు ప్రభుత్వం పాతరేసింది.. పేదల సంక్షేమానికి తిలోదకాలిచ్చింది.. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసింది.. కుటిల రాజకీయాలకు తెరతీసింది.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడమే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోంది. ప్రశ్నించిన వారిని జైలుపాలు చేస్తోంది.. నిలదీస్తే నిలువునా దాడులు చేయిస్తోంది.. నైతికత లేని వారిని అందలం ఎక్కిస్తోంది.. అన్యాయాలే అజెండాగా అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది‘‘ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలను దారుణంగా కొట్టిన టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలకు అండగా నిలిచి బాధితులపై ఆక్రమ కేసులు నమోదు చేసిన పోలీసుల వైఖరిని ఖండించారు. సర్కారు తీరును ఎండగడుతూ మంగళవారం చిత్తూరు..తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహాల వద్ధ మహాధర్నా చేపట్టారు.చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన ఆగ్రహం -
‘అనుభవం’ లేదు సర్!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర విద్యాశాఖ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ వింత నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెచ్చిపెట్టాయి. విద్యార్థులను, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని జూనియర్ టీచర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియర్ టీచర్లను విస్మరించడం వల్ల మొదటి రోజు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. జూనియర్ల చేతుల్లో చీఫ్ బాధ్యతలు పరీక్షల నిర్వహణలో అత్యంత కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యతలను ఈ సారి ఎటువంటి అనుభవం లేని వారికి కట్టబెట్టారు. గతంలో పదేళ్లుగా చీఫ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన వారిని ప్రస్తుతం పక్కన పెట్టారు. గతంలో ఎన్నడూ చీఫ్ బాధ్యతలు నిర్వహించని, చీఫ్ విధులపై అవగాహన లేని జూనియర్ టీచర్లకు చీఫ్ బాధ్యతలను అప్పగించారు. విచిత్రమేమిటంటే, గతంలో చీఫ్ సూపరింటెండెంట్లుగా పనిచేసిన సీనియర్ టీచర్లను ప్రస్తుతం సాధారణ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ విధానం విద్యాశాఖలోని సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. బెదిరింపు ధోరణి విద్యాశాఖ అధికారుల వింత ధోరణి పై ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఇన్విజిలేషన్ విధుల నుంచి మినహాయింపు కోరుతున్న వారిని అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక వేళ విధులకు హాజరుకాకపోతే జూన్ వరకు సెలవు పెట్టాల్సి ఉంటుంది అంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా మొదటి రోజు పరీక్ష జిల్లాలో మొదటి రోజు ల్యాంగ్వేజెస్–1 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని అబ్జర్వర్ మువ్వారామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పరీక్ష కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఏవైనా మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ కేంరద్రాన్ని తనిఖీ చేసిన అబ్జర్వర్ విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపుతున్న పోలీసులు, సిబ్బందిపది పబ్లిక్లో ప్రయోగాలు! మొదటి రోజు 252 మంది గైర్హాజరు జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 129 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ల్యాంగ్వేజ్ పేపర్–1 (తెలు గు, ఉర్దూ, తమిళం) పరీక్షకు 252 మంది గైర్హాజరయ్యారు. 21,062 మంది విద్యార్థులకు గాను 20,810 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్ష నిర్వహణలో జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్ మువ్వారామలింగం విస్తృతంగా పలు కేంద్రాల ను తనిఖీ చేశారు. డీఈవో రాజేంద్రప్రసాద్ 8 పరీక్ష కేంద్రాలను, ప్లైయింగ్ స్క్వాడ్ లు 14 మంది 63 కేంద్రాలను పరిశీలించారు. 96 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారు. పలు పరీక్ష కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులు ధరించకుండా కనిపించారు. తొలి రోజే తడబాటు కొత్త చీఫ్ సూపరింటెండెంట్లకు అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొదటి రోజే తడబాటుకు లోనయ్యారు. గంగవరం, పలమనేరు ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ప్రశ్నపత్రాల పంపిణీలో తారుమారు చోటుచేసుకుంది. కుప్పం, జీడీనెల్లూరు, నగరి ప్రాంతాల్లో సైతం ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తారుమారైన పత్రాలను విద్యార్థులకు అందజేయడం, ఆ తర్వాత వాటిని సరిదిద్దడం, సమయపాలన పాటించకపోవడం వంటి ఫిర్యాదులు జిల్లా వ్యాప్తంగా వెలువెత్తాయి. దీంతో నిమిషాల సమయం వృథా కావడంతో విద్యార్థులు ఆందోళనకు లోనయ్యారు. అలాగే చాలా పాఠశాలల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాల్లో రెండు, మూడు బిందెలు నీటిని పెట్టి చేతులు దులుపుకున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.45 అవుతున్నా విద్యార్థులను లోనికి అనుమతించకుండా బయటే నిరీక్షించేలా చేశారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ!
కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● అర్జీలు స్వీకరించిన ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ చిత్తూరు కలెక్టరేట్: సమస్యలు పరిష్కరించండి సారూ..! అంటూ పలువురు అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నా రు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు ఉన్నతాధికారుల ఎదుట తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర న్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థా యి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. భూ సేకరణపై ఆందోళన కుప్పం ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చేస్తున్న భూ సేకరణ ప్రక్రియలో భూ బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్బాబు, చిత్తూరు నియోజకవర్గం ఇన్చార్జ్ టిక్కిరాయల్లు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ బాధితులకు ముందుగా ప్రభుత్వం నిర్ధేశించిన పరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే భూ సేకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు. ఒక వేళ పరిహారం అందజేయకుండా భూ సేకరణకు ప్రయత్నిస్తే, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇన్చార్జ్ కలెక్టర్కు సమస్యలు మొరపెట్టుకుంటున్న అర్జీదారులున్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు -
మామిడి చెట్లు దగ్ధం
గంగాధరనెల్లూరు : మండలంలోని తూగుండ్రం పంచాయతీ దళితవాడకు చెందిన కళ్యాణి, అన్నాదొరైకి చెందిన 150 మామిడి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు సమీపంలోని గుట్టకు నిప్పు పెట్టడంతో గుట్టతో పాటు పక్కన ఉన్న పొలంలోకి మంటలు వ్యాపించాయి. చేతికి వచ్చే దశలో మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. టీటీడీకి కూరగాయల వితరణ పలమనేరు: తిరుమలలోని అన్నదాన కేంద్రానికి పట్టణంలోని మార్కెట్ నుంచి 12 టన్నుల కూరగాయలను రాష్ట్ర సంచార జాతుల సంఘ అధ్యక్షుడు పూసల రవి ఆధ్వర్యంలో సోమవా రం అందజేశారు. టీటీడీ వాహనానికి దాతలు పూజలు చేసి గోవిందనామ స్మరణ మధ్య తిరుమలకు సాగనంపారు. ఇందులో మండీ యజమానులు రెడ్డెప్పరెడ్డి, కందస్వామి తదితర శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. 166 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షకు 166 మంది గైర్జాజరైనట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 734 మంది విద్యార్థులకు గాను 568 మంది హాజరైనట్టు ఆయన వెల్లడించారు. పోలీసు గ్రీవెన్స్కు 42 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. సేవకు పురస్కారాలు చిత్తూరు ఆర్బన్: పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను సోమవారం ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి తొమ్మిది మందిని ఈ పురస్కారాలు వరించాయి. ఎస్ఆర్.రాజశేఖర్రాజు, ఏఎస్పీకి మహోన్నత సేవా పతకం, జీ,గోపాల్ ఆర్ఎస్ఐ(డీఏఊఆర్)కు ఉత్తమ సేవా పతకం, చిత్తూరు వన్టౌన్ సీఐ ఎన్.మహేశ్వర, ఐరాల ఏఎస్ఐ కే.వేణుగోపాల్నాయుడు, ఎం.పరంధామనాయుడు, ఏఎస్ఐఐ, శ్రీరంగరాజపురం, ఎన్.ఉదయకుమార్, హెచ్సీ, మహిళా పీఎస్, చిత్తూరు, ఎం.ఎస్.సుమన్, ఏఆర్ పీసీ (డీఏఆర్), చిత్తూరు, వి.సురేష్, ఏఆర్ హెచ్సీ (డీఏఆర్), చిత్తూరు, బి.ఢిల్లీ, హెచ్సీ, గుడిపాల పీఎస్కు సేవా పతకాలు వరించాయి. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు చిత్తూరు కలెక్టరేట్ : పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేయించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. -
సచివాలయ ఉద్యోగికి గాయాలు
రొంపిచెర్ల: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలైన ఘటన అన్నమయ్య– చిత్తూ రు జిల్లా సరిహద్దులో సోమవారం ఉదయం జరి గింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం, పెద్దమల్లెల రైతు సేవాకేంద్రంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్గా పని చేస్తున్న రాజకుమార్ పీలేరు నుంచి ద్విచక్ర వాహనంలో విధులకు బయలు దేరారు. పీలేరు మండలం, ఎర్రగుంటపల్లె సమీపంలోని స్సీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి రాజకుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకుమార్ వేలూరు సీఎంసీలో కోమాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ బాధ్యతల స్వీకరణ కుప్పం: ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ఆచార్య ఎస్.సి.మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ యున్సివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను కుప్పం ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాన్ని విద్య, పరిశోధన, పరిపాలన రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం వర్సిటీలో ఉద్యోగులు ఆయనను కలసి శుభాంకాంక్షలు తెలిపారు. -
‘మురుగు’ ఆలోచనలొద్దు?
రైతులను ముంచేస్తారా..? మామిడి కాయల మార్కెట్ యార్డుకు 40 ఏళ్లుగా వస్తూ పోతున్నాం. రైతులకు అనువైనా స్థలం. ఇక్కడ మురుగునీటి శుద్ధ కేంద్రం ఏర్పాటు చేస్తే..రైతులకు ఇబ్బంది తప్పదు. కాయలు తోలుకొస్తే..ఇక్కడ ఎలా ఉండాలి. రాత్రి పగలు...ఇక్కడే పడి ఉంటాం. ఆ కంపును భరించలేం. మామిడి కాయల మార్కెట్లో ఆ కేంద్రం వద్దు. ఊరు చివరన పెట్టండి. – దొరస్వామి, మామిడి రైతు, చిత్తూరు ప్లాంట్ వద్దు మార్కెట్ యార్డులో కొన్నేళ్లుగా ట్రేడర్ నడుపుతున్నాం. ఏడాదిలో నాలుగు నెలలు మార్కెట్ రద్దీగా కనిపిస్తోంది. లారీలు వచ్చి క్యూకడతాయి. వాటికి సరిపడినంత స్థలం ఉంది. రెండు ఎకరాల స్థలం మురుగు నీటి శుద్ధ కేంద్రానికి ఇచ్చేస్తే.. మార్కెట్ స్థలం కుంచించుకుపోతుంది. మామిడి వ్యాపారాలకు అంతరాయం ఏర్పడుతోంది. – రత్నంరెడ్డి, ట్రేడర్, చిత్తూరు చిత్తూరు రూరూల్ (కాణిపాకం): చంద్రబాబు సర్కార్ వ్యవసాయ మార్కెట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోంది. మార్కెట్ స్థలంలో మురుగు నీటి శుద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతు కార్యకలపాలను భ్రష్టు ప ట్టించేలా చూస్తోంది. మురుగునీటి శుద్ధ కేంద్ర ఏర్పా టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ...మార్కెటింగ్ శాఖ జేడీకి సోమవారం ట్రేడర్లు, రైతులు ఫిర్యాదు చేశారు. మామిడి వ్యాపారానికి కీలక కేంద్రం చిత్తూరు జిల్లా మామిడి పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. పంటను చిత్తూరు నగరంలోని కట్టమంచి వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మామిడి సీజన్ సమయంలో ఈ మార్కెట్ యార్డు రైతులకు ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ సమయంలో రోజువారీగా సుమారు 50 లారీలలో మామిడి పండ్లు లోడింగ్ చేసి రాజస్థాన్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వ్యాపారం ద్వారా వేలాది మంది రైతులు, కూలీలు, వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. మార్కెట్ యార్డులో మొత్తం 43 షాపులు ఉండగా, అందులో సుమారు 34 షాపులు నడుస్తున్నాయి. అయితే అత్యంత విలువైన ఈ మార్కెట్ యార్డులోనే మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు జరగుతున్నాయి. మార్కెట్ స్థలంలో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తే వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని పలువురు పేర్కొంటున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రమంటే? ఇళ్ల నుంచి, డ్రైనేజీ లైన్ల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) అంటారు. ఈ కేంద్రంలో మురుగు నీటిలో ఉన్న చెత్త, మలినాలను ప్రత్యేక పద్ధతుల్లో తొలగించి నీటిని శుభ్రం చేస్తారు. శుద్ధి చేసిన నీటిని తోటలు, పార్కు లు, పరిశ్రమల అవసరాలకు వినియోగిస్తారు. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభు త్వం ఈ కేంద్రా లను ఏర్పాటు చేస్తుంది. అయి తే నివాస ప్రాంతాలు లేదా వ్యాపార ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబు తున్నారు. వ్యాపారాలకు ఆటంకం మార్కెట్ యార్డు స్థలంలో రెండు ఎకరాల భూమిని మురుగునీటి శుద్ధి కేంద్రం కోసం కేటాయిస్తే వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని రైతులు, ట్రేడర్లు చెబుతు న్నారు. ముఖ్యంగా మామిడి సీజన్ సమయంలో పెద్ద సంఖ్యలో లారీలు మార్కెట్ యార్డు కు వచ్చి పోతుంటాయి. ఇలాంటి సమయంలో స్థలం తగ్గిపోతే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో ప్రస్తుతం వ్యాపారస్తులు కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం జరిగి తే తమ దుకాణాలను తరలించాల్సివస్తుందని, అప్పుడు వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం కూ డా నిలిచిపోవచ్చని అంటున్నారు. చుట్టుపక్క ల నివసిస్తున్న ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. నగర శివారులో ఏర్పాటు చేయాలి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మార్కెట్ యార్డు లో కాకుండా నగర శివారు ప్రాంతాల్లో లేదా అనువైన ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాల ని రైతులు, ట్రేడ ర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో విజయ డెయిరీ, చక్కెర ఫ్యాక్టరీలు, మత్స్యశాఖ ఆస్తుల తర్వాత ఇప్పుడు మార్కెట్ యార్డు స్థలంపై కూడా కన్నేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతులు, ట్రేడర్ల సమావేశం మార్కెట్ స్థలం ధారాదత్తం చేసే కుట్ర ఈ విషయంపై సోమవారం మార్కెట్ యార్డు లో రైతులు, ట్రేడర్లు సమావేశమయ్యారు. మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికా రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రీజినల్ మార్కెటింగ్ శాఖ జేడీ రామాజంనేయులను కలసి వినతి పత్రం అందజేశారు. -
దాడులూ మాపైనే.. కేసులూ మాపైనేనా?
శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు విచక్షణరహితంగా దాడులకు పాల్పడడం హేయం. దాడులు మాపైనే, కేసులు మాపైనే. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దాడులు చేసే సంస్కృతి ఇంతవరకు లేదు. ఆ ఘనత కూడా టీడీపీకే దక్కుతుంది. మహిళలు, నాయకులపై విచక్షణరహితంగా దాడులుచేసి గాయపరిచారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రచించిన రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. – భూమన అభినయ్రెడ్డి, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగాయపడిన భృంగి నవీన్నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేస్తున్న పోలీసులు -
నిరసన తెలిపితే నిర్బంధం
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు అధికార జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా గాయపడిన వారినే అరెస్టు చేసి, అక్రమ కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం ఉంటే ఏదైనా చెయవచ్చు అన్నదానికి నిదర్శనమే తిరుపతి శిల్పారామం వద్ద సోమవారం జరిగిన ఘటన. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు ఓ మహిళతో వంటగదిలో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. నాడు ప్రెస్మీట్ అనంతరం దూరంగా ఉన్న బీఆర్ నాయుడు సోమవారం తిరుపతికి చేరుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకమండలి అయిన బీఆర్ నాయుడు వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లకార్డులతో హోటల్ ముందు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టీడీపీ నేతలు జేబీ శ్రీనివాసులు, పులిగోరు మురళితో పాటు వారి అనుచరులు అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నా.. నిరసనను అడ్డుకునే అధికారమే లేని టీడీపీ నేతల బరితెగింపును న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. అంతటితో ఆగని టీడీపీ గూండాలు ‘కామాందులు ఎలా ఉంటారో రండి చూపిస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ మహిళ నాయకులను అసభ్య పదజాలాలతో దూషించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతటితో ఆగని అధికారపార్టీ నేతలు.. పోలీసులతో గాయపడిన వారిని, నిరసన తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు. సంబంధమే లేని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి 13 మంది వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్టేషన్లో కూర్చోబెట్టడానికి న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఆ 13 మందిలో మహిళలు కూడా ఉండడం గమనార్హం. -
నిబంధనలు పాటించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ద్విచక్ర వాహన షోరూం డీలర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీటీసీ నిరంజన్రెడ్డి ఆదేశించారు. సాక్షి దినపత్రికలో ఇటీవల ‘దోపిడీ బండి’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిపై రవాణశాఖ అధికారులు స్పందించారు. చిత్తూ రు నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో డీటీసీ సోమవారం షో రూం డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని చెప్పారు. స్ఫూర్తిప్రదాత పొట్టిశ్రీరాములు చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ అన్న పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన మన రాష్ట్రానికే కాకుండా, భారతదేశం గర్వించదగ్గ గొప్ప స్ఫూర్తిప్రదాత అని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాల్చి చంపేశారా? వెదురుకుప్పం: మండలంలోని కొమరగుంట పంచాయతీ బందార్లపల్లె సమీపంలోని మేకలబండ వద్ద గుర్తు తెలియని కాలిన యువకుడి శవం బయట పడడం కలకలం రేపింది. సోమవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్పీ రాజశేఖర్, నగరి ఇన్చార్జి డీఎస్పీ సాయినాథ్, కార్వేటినరగం సీఐ హనుమంతప్ప సిబ్బందితో కలిసి ఘటనా స్థలిలో కాలిన యువకుడి శవాన్ని పరిశీలించారు. అనంతరం నగరి ఇన్చార్జి డీఎస్పీ బందార్లపల్లె రోడ్డు వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువకుడిని ఏదో కారణం చేత చంపి కాల్చినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తోందన్నారు. యువకుడి వయస్సు సుమారు 20 ఏళ్లు ఉండొచ్చని తెలిపారు. అమ్మ జ్ఞాపకాలతోనే! నగరి : తెల్లవారితే పదో తరగతి పరీక్షలు. కానీ అంతకుముందు రోజే తల్లి హఠాత్తుగా మరణించింది. గుండె నిండా అమ్మ జ్ఞాపకాలు, కళ్ల నిండా కన్నీళ్లు ఉన్నా.. తన తల్లి చివరి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షకు హాజరైంది. వివరాలు.. నగరి మున్సిపల్ పరిధి నెత్తంకండ్రిగకు చెందిన రైతు రామిరెడ్డి, మునిలక్ష్మి దంపతుల కుమార్తె పూ ర్ణిమ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డారు. కాయకష్టం చేసైనా కూతుర్ని ప్రయోజకురాలు చేయాలని తల్లి భావించింది. కానీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పూర్ణిమ తల్లి ఆదివారం అకస్మాత్తుగా మరణించింది. సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. తల్లి మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిని కోల్పోయిన బాధ పూర్ణిమకు తీరని లోటుగా మారింది. అయితే తన తల్లి చివరి కోరిక చదువేనని గుర్తుచేసుకున్న పూర్ణిమ, గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ‘తల్లి కలను నెరవేర్చడమే ఇప్పుడు నా లక్ష్యం’ అనే భావంతో పరీక్ష రాస్తున్న పూర్ణిమ అందరినీ భావో ద్వేగానికి గురిచేస్తోంది. -
ప్రమాణం చేయగలరా?
‘‘సూళ్లూరుపేటనియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మట్టి దందాలకు తమకు సంబంధం లేదని వేంకటేశ్వరస్వామివారిపై ప్రమాణం చేసి చెప్పగలరా? నియోజకవర్గంలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతారా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య. అక్రమాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తండ్రికి దేవుడంటే భయం లేదు. భక్తి కూడా లేదు. ఆయన ఏకంగా వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపులకు తమకు సంబంధం లేదని చెప్పడంతోనే అర్ధమవుతుంది.– కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే -
అక్రమార్కులను పట్టించినందుకు అరెస్టు
పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతల దౌర్జన్యాలను ప్రశ్నించిన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారు. పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో కాంట్రాక్టర్, కూటమి నాయకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా భారీ హిటాచీలతో నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు, సాగునీరు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపై సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి స్థానిక రైతులతో కలిసి ఇసుక దోపిడీని అడ్డుకుని, పలు యంత్రాలు, లారీలను పోలీసులకు అప్పగించారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకపోగా, ఇసుక దోపిడీని అడ్డుకున్న రైతులు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని తిరుపతి విమానాశ్రయం వద్ద, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు అట్ల గోపాలయ్య, శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సురేష్రెడ్డిను వారివారి నివాసాల వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, దొరవారిసత్రం పోలీస్స్టేషన్కు తరలించారు. నాయుడుపేటలో వైద్య పరీక్షలు అనంతరం నాయుడుపేట కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి నెల్లూరు జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి అరెస్టుకు రెక్కీ సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఎలాగైనా అరెస్టు చేయాలని డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో రెక్కీ నిర్వహించారు. పెళ్లకూరు మండలం కలవకూరులో స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవడంతో పాటు సోమవారం నాయుడుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం చేస్తున్న అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ పోలీస్ బలాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే సంజీవయ్యను అరెస్టు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంజీవయ్య నివాసం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా మొహరించడంతో పోలీసులు ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. అందుకే 144 సెక్షన్ విధించారు. సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు. -
ఇసుక రీచ్ అడ్డుకున్నందుకే అక్రమంగా కేసు
పెళ్లకూరు మండలంలో అక్రమ ఇసుక రీచ్ అడ్డుకున్నందుకే నాపై అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నాకు కనీసం ముందుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఆ తరువాత నాయుడుపేట రూరల్ పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారు. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంతో సాగునీరు అడుగంటి పోతుండడంతో కలవకూరు వద్ద నదిలో శాంతి యుతంగా నిరసన తెలిపాను. ఆ కక్షతోనే నాపై అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేశారు. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి -
ఏం సాధించారు?
చిత్తూరు అర్బన్: 2021 మునిసిపల్ ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకు గాను 46 సీట్లను కై వశం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మూడేళ్లకు పైగా వైఎస్సార్సీపీలో పదవులు అనుభవించిన వాళ్లు.. ఆపై కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి ఆ కార్పొరేటర్ల భవిష్యత్తు..? మళ్లీ వైఎస్సార్సీలోకి రానిస్తారా..? పోనీ మధ్యలో వెళ్లినా.. టీడీపీ సీటు ఇస్తుందా..? మరి అప్పటి వరకు టీడీపీలో పనిచేసిన కార్యకర్తల పరిస్థితి..? ఏంటి..? ఒకరిద్దరు మినహా.. మిగిలిన కార్పొరేటర్లు వార్డులో పది మంది ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా..? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రస్తుత తాజా మాజీ కార్పొరేటర్ల మది లో మెదలుతున్న ప్రశ్నలు. మంగళవారంతో పాలకవర్గం పదవీ కాలం ముగియనుండగా.. ప్రత్యేకాధికారిగా నియమితులైన కలెక్టర్ సుమిత్కుమార్ పరి పాలన వ్యవహారాలపై బుధవారం నుంచి నిర్ణయాలు తీసుకోనున్నారు. దూకేశారు 2024 మేలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో చిత్తూరు కార్పొరేషన్లోని పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జూలైలో ఏకంగా 24 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి దూకేశారు. అంటే దాదాపు 20 నెలలు టీడీపీలో ఉన్నారు. పార్టీ మారిన కార్పొరేటర్లలో కొందరిని ఏంసాధించారంటూ ‘సాక్షి’ ప్రశ్నిస్తే.. వారిలో బాధ తప్ప మరేం కనిపించ లేదు. ‘కష్టమో, నష్టమో ఒక్క పార్టీలో ఉండిపోయి ఉంటే బాగుణ్ణు.. ఇక్కడకు వచ్చి సాధించింది ఏమీలేదు..’ అని కొందరు, ‘ప్రజల కోసం వార్డులో నా లుగు పనులు చేయించుకున్నాం..’ అంటూ కొందరినిట్టూర్పు. ‘అసలు రానున్న మునిసిపల్ ఎన్నిక ల్లో నాకు టికెట్టు ఇస్తారనే నమ్మకం లేదు. అప్పటి వరకు వార్డు ఇన్చార్జ్గా ఉన్న వ్యక్తికే టీడీపీలో టికెట్టు ఇస్తారట, ఇటు ఉన్న పార్టీని వదిలేశాం, మధ్యలో చేర్చుకున్న పార్టీ వదిలేసింది..’ అంటూ ప్రజాప్రతినిధులు నిర్వేదం వ్యక్తం చేశారు. అదో చరిత్ర 2021 మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి బ్రాండ్తో చిత్తూరు కార్పొరేషన్ కుర్చీని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఏకంగా 37 డివిజన్లలో వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్లు ఏకగ్రీవంగా గెలుపొందారు. 13 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించగా అందులోనూ 9 స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. టీడీపీ 3, స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు. మొత్తంగా మేయర్తో కలిపి 46 డివిజన్లను ఓ ప్రాంతీయ పార్టీ గెలుచుకోవడం చిత్తూరు మునిసిపల్ చరిత్ర లో ఓ సరికొత్త అధ్యయనం సృష్టించింది. మోదం–ఖేదం పార్టీని వీడేటప్పుడు కొందరు కార్పొరేటర్లు వచ్చి వైఎస్సార్పీసీ ఇన్చార్జ్ విజయానందరెడ్డికి తమ మనసులో మాట చెబితే.. మరికొందరు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. కానీ ఆయన నుంచి వచ్చిన సమాధాం ఒక్కటే.. ‘మీరు చిన్న పిల్లలు కాదు. ఎవరి వల్ల గెలిచారు..? ఆ పార్టీలోకి వెళితే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా..? ఏం చేస్తున్నారు..? అని ఆలోచించుకోండి. ఒక్కసారి వెళితే మళ్లీ పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కొద్దు.., మీ ఇష్టం’ అన్నారు. పార్టీ మారిన మేయర్తో సహా 24 మంది కార్పొరేటర్లను వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారి స్థానంలో కొత్త వ్యక్తులను తయారు చేసుకుని, పార్టీని బలోపేతం చేసుకున్నారు. కానీ ఏకంగా 24 మందిని చేర్చుకున్న గురజాల జగన్మోహన్ నాయుడుకు మాత్రం మునిసిపల్ ఎన్నికల వేళ ఇబ్బందులు తప్పేలా లేవు. తాజా మాజీలకు సీట్లు ఇవ్వాలా..? అప్పటి వరకు జెండాలు మోసిన ఇన్చార్జ్లకు స్థానం కల్పించాలా? ఒకరికి సీటు ఇచ్చి, మరొకరికి ఇవ్వ కుంటే ఫిర్యాదులు, ఎంపీ చెప్పినవాళ్లు, పూతలపట్టు నియోజకవర్గంలోకి వచ్చే డివిజన్లు, జనసేన–బీజేపీ పొత్తు లాంటి అంశాలతో ఆయనకు ఖేదం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అక్షర ఆంధ్ర పరీక్ష విజయవంతం
పెనుమూరు(కార్వేటినగరం): జిల్లాలో అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం అయిందని, 99 శాతం మంది అభ్యాసకులు హాజరయ్యారని వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు ఎస్.మహ్మద్ అజాద్ అన్నా రు. ఆదివారం పెనుమూరు మండలం కలవకుంట మండల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ డీడీ మాట్లాడుతూ.. అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకున్న అభ్యాసకులకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పరీక్ష నిర్వహించడం జరిగిందని అభ్యాసకులు వారికి అనుకూలమైన సమ యంలో వచ్చి రెండు గంటల పాటు పరీక్ష రాయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా లక్ష్యం 65,185 అభ్యాసకులను నిర్ణయించారని , పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1583 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1583 మంది అంగన్వాడీ టీచర్లను అలాగే స్థానికంగా ఉన్న ఇతరులను ఇన్విజిలేటర్లుగా నియమించామని పేర్కొన్నారు. అభ్యాసకులు వారికి అనుకూలమైన సమయంలో రెండు గంటలు పరీక్ష రాయడం జరిగిందని తెలిపారు. ప్రతి విభాగంలో పాస్ మార్కులు 17గా నిర్ణయించామని, ఏదైనా విభాగంలో 17 మార్కుల కన్నా తక్కువగా వచ్చినట్లయితే 5 గ్రేస్ మార్కుల ను కలపవచ్చని, అంగన్వాడీ టీచర్లు, అలాగే ఇతర ఇన్విజిలేటర్లు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసిన తరువాత మార్కులను అవార్డు లిస్టులో వేసి అవార్డు లిస్టును వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లకు ఇవ్వాల్సి ఉంటుందని, మార్కుల ను అలాగే హాజరును అక్షర ఆంధ్ర యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఆదివారం జరిగిన అక్షర ఆంధ్ర పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 64,560 మంది అభ్యాసకులు హాజరు కావడంతో 99 శాతం హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను ఉప సంచాలకులతో పాటు పర్యవేక్షకులు జయప్రకాష్రెడ్డి, డీఆర్డీఏ ఏపీఎం చిరంజీవి, పలువు రు పరిశీలించారు. -
రెండు కార్లు ఎదురెదురుగా ఢీ
● గూగుల్ మ్యాప్లో చూస్తూ మార్గం తప్పిపోయిన వైనం ● ఈక్రమంలో పుత్తూరు మీదుగా చైన్నె వెళ్తుండగా ఘటన ● ఒకరికి తీవ్రగాయాలు , అయిదుగురికి స్వల్పగాయాలు గంగాధర నెల్లూరు: రెండు కార్లు ఎదురెదురుగా అప్పిరెడ్డి కండ్రిగ వద్ద ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో అయిదుగురికి చిన్నపాటి గాయాలైన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది . స్థానిక పోలీసుల కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలంలోని ఎట్టేరి పంచాయతీ అప్పిరెడ్డి కండ్రిగ వద్ద ఆదివారం సాయంత్రం చిత్తూరు– పుత్తూరు జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి చైన్నెకి గూగుల్ మ్యాప్లో మార్గం తప్పిపోయి జీడీ నెల్లూరు–పుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్న కారు , వెదురు కుప్పం మండలంబొమ్మయపల్లి గ్రామం నుంచి చిత్తూరు వైపునకు ప్రయాణిస్తున్న మరో కారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెంగళూరు నుంచి చైన్నెకి వెళుతున్న తిరుమలేష్ కుటుంబ సభ్యులు కలై వాణికి తీవ్ర గాయాలు కాగా , మరో కారులో ఉన్న బొమ్మాయిపల్లికి చెందిన మధుతో పాటు ఇద్దరు కుమారులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కలై వాణిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధు కుమారులు ఇద్దరిని వేలూరు సీఎంసికి తరలించినట్లు తెలిపారు . అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
కరెంట్ షాక్తో యువకుడి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): చిత్తూరు నగరంలో కరెంట్ షాక్తో 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంం.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం చిత్తూరు నగరంలోని గోపాలపురం వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలోని మోటార్ను ఆన్ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి శాంతిపురం: మండలంలోని ఎంకేపు రం పంచాయతీ, కృష్ణాపురానికి చెందిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృత్యువా త పడ్డాడు. గ్రా మానికి చెందిన ఖాదర్బాషా కుమారుడు నవా జ్(19) శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఉదయం బంధువులు, మిత్రులు గ్రామ పరిసరాల్లో గాలించారు. కృష్ణాపురం–పొన్నేపల్లి మధ్య ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు వేలాడుతున్న నవాజ్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ ఘట నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్లు చూస్తే కొట్టి చెట్టుకు ఉరి వేసి, అనంతరం తల పగులగొట్టి నట్టుగా ఉంది. పోలీసులు మృతదేహాన్ని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శాంతిపురంలో ఓ మోటారు రీ వైండింగ్ మెకానిక్ వద్ద పనిచేస్తున్న నవాజ్ వివాద రహితుడుగా కృష్ణాపురం వాసులు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియకపోవడంతో కేసును ఛేదించడానికి పోలీసులు ఆధారాల సేకరణ కోసం ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఎద్దుల పందేలకు వెళ్లి వ్యక్తి దుర్మరణం కుప్పం రూరల్: ఎద్దుల పందేలు చూసేందుకు వెళ్లి అక్కడ ఎద్దు పొడవగా వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన రామకుప్పం మండలం, పీఎంకే తండాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. రామ కుప్పం మండలం, కావలిమడుగు గ్రామానికి చెందిన రాజప్ప(50) ఎద్దుల పందేలను చూ సేందుకు ఆదివారం పీఎంకే తండాకు వెళ్లాడు. అక్కడ ఓ ఎద్దు మీదికి వచ్చి రాజప్పను పొడి చింది. రాజప్ప తీవ్రంగా గాయపడ్డాడు. సహ చరులు హుటాహుటిన కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజప్ప ప్రాణాలు వదిలాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ పరామర్శ పెనుమూరు (కార్వేటినగరం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తల్లి విజయా రెడ్డి వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్ర సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డిని ఫోన్లో ఓదార్చి పరామర్శించారు. రాకేష్ రెడ్డి తల్లి విజయారెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. -
అవస్థల ‘రహదారి’
నగరి : పుత్తూరు నుంచి తిరువళ్లూరు వరకు చేపట్టిన జాతీయ రహదారి ప్రయాణికులకు అవస్థల రహదారిగా మారింది. పలు ప్రాంతాల్లో నిర్వహణ లోపం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ముప్పుతిప్పలు పడుతున్నారు. రాష్ట్ర సరిహద్దు తమిళనాడులోని తిరుత్తణి నుంచి నగరి మీదుగా పుత్తూరు ఓవర్ బ్రిడ్జి వరకు 205 చైన్నె సెక్షన్ 716, 71 తిరుపతి–తిరుత్తణి నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి, రెండు వైపులా సర్వీసు రోడ్డు రూపుదిద్దుకుంటోంది. తిరుపతి నుంచి తిరువళ్లూరు వరకు రూ.864 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేయగా అందులో తిరుత్తణి పుత్తూరు మధ్య పనులు ఆగిపోయాయి. రెండేళ్ల క్రితం ఈ పనులు మాజీ మంత్రి ఆర్కేరోజా చొరవతో ప్రారంభమైంది. 20.05 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును విస్తరించే పనులు చేపట్టారు. ఈ మార్గంలో వీఎన్ఆర్ పేట జంక్షన్ వద్ద, వీకేఆర్ పురం వద్ద, కీళపట్టు ఆంజనేయ స్వామి ఆలయ సర్కిల్, ఓంశక్తి ఆలయ సర్కిల్, కొండచుట్టు మండపం సర్కిల్, ప్రభుత్వ ఆస్పత్రి సర్కిల్ వద్ద, కనంమిట్ట వద్ద, వేపగుంట క్రాస్ల వద్ద అండర్ పాస్ రోడ్లు, కుశస్థలినదిపై మేజర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దేశమ్మ దేవాలయ ఆర్చి సమీపం ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఉయ్యాల కాలువ, జీవీఆర్ కళ్యాణమండపం సమీపం, పరమేశ్వర మంగళం వద్ద మినీ బ్రిడ్జులు, 60 ప్రాంతాల్లో కల్వర్టులు ఈ పనుల్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ పనులు ప్రారంభమై సుమారు 18 నెలలుగా జరుగుతోంది. అయితే ఈ పనులు ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రణాళిలేకుండా పనులు జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రణాళికా రహితంగా సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలేయడంతో దుకాణదారులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టడం వల్ల తాగునీటి పైపులు పగిలిపోతుండటంతో పలుచోట్ల తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. సర్వీసు రోడ్డు వేసే ప్రాంతంలో రోడ్డును ఆనుకొని అర అడుగు ఎత్తులో కాలువలు నిర్మిస్తున్న సిబ్బంది అవసరమైన ప్రాంతాల్లో ఎత్తు తగ్గించి దారి వసతి కల్పించాలి. అలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో రోడ్డుకు ఆనుకొని నివసించే వారు, పక్క వీధుల్లోకి వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలతో రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడడంతో ప్రజలే మట్టి పోసి గట్టులు కట్టి రోడ్డును దాటుతున్నారు. రోడ్డు పనుల్లో పలు ప్రాంతాల్లో సరైన సూచిక బోర్డులు లేకపోవడం, ఉన్న రోడ్లలో ఏ రోడ్డు చివరి వరకు ఉందో? ఏ రోడ్డు మధ్యలో ఆగిపోతుందో ? వాహనదారులకు తెలియని పరిస్థితి. కొండలు కరిగిపోతున్నా పూర్తికాని పనులు నిర్మాణ సమస్యలు ఓ వైపు ఉండగా జాతీయ రహదారి పేరిట నగరి నియోజకవర్గంలో ఉన్న కొండలు కరిగిపోతున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారులు భారీ యంత్రాలతో కొండలను పిండి చేసేస్తున్నారు. కంకర, గ్రావెల్ విచ్చల విడిగా తరలించేస్తున్నారు. జాతీయ రహదారి ప్రామాణికాల మేరకు పనుల చేపడతామని చెబుతున్నా రెండేళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించిన అధికారులు పనులు, ఇప్పటికి 18 నెలలు కావస్తున్నా ఇంకా జరగాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయి. నిర్మించాల్సిన ఓవర్ బ్రిడ్జిలు, అండర్పాస్లు చాలావరకు ఉన్నాయి. ప్రమాదానికి గురైన లోనైన ట్రాక్టర్, బస్సు (ఫైల్) వాహనాలు వెళ్లే సమయంలో రేగుతున్న మట్టి -
ఇసుక జోరు.. తమ్ముళ్ల పోరు
భగ్గుమంటున్న సొంత పార్టీ నేతలుతిరుపతి సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు కేంద్రంగా ఇసుక అడ్డగోలు వ్యాపారం హద్దులు దాటింది. మాఫియా డంప్లు చేసి దందాను దర్జాగా చేస్తోంది. అధికారుల కళ్ల ముందే కోట్ల రూపాయల దందాను కొనసాగిస్తోంది. ఈ అక్రమ వ్యాపారం రోజు రోజుకూ రెచ్చిపోతోంది. వావిల్తోట వయా తమిళనాడుకు పరుగులు పెడుతోంది. బీఎన్ఆర్పేట నుంచి మంచినీళ్లకుంట మీదుగా రయ్రయ్మంటోంది. ఇలా ప్రకృతి సంపదను కొల్లగొట్టి మాఫి యా కోట్లకు పడగలెత్తుతోంది. ఈక్రమంలో ఓ వర్గానికి చెందిన మాఫియా పోలీసుల చేతిలో లాక్ అవ్వడంతో.. తమ్ముళ్ల మధ్య వర్గపోరు మొదలైంది. ‘డంప్లు కాదు...ఇసుక కొండలే’... పూతలపట్టు మండలం వావిల్తోట, చిత్తూరు బీఎన్ఆర్పేట ప్రాంతాలు ప్రస్తుతం ఇసుక దందాకు అడ్డాగా మారాయి. వావిల్తోట నుంచి ఇసుక తోడి మురకంబట్టులో దాచిపెడుతున్నారు. అలాగే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంప్లు కొండలను తలపిస్తున్నాయి. నదులు, వంక నుంచి తవ్విన ఇసుకను ముందుగా ఇక్కడే నిల్వ చేసి తర్వాత లారీల్లో లోడ్ చేసి అక్రమ వ్యాపారానికి ఆజ్యం పోస్తున్నారు. సరిహద్దులు దాటుతున్న లారీలు చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడుకు ఇసుక రవాణా సులభంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వరుసగా లారీలు బయలుదేరి సరిహద్దు దాటుతున్నాయి. అక్కడ భారీ డిమాండ్ ఉండటంతో ఈ దందా మరింత ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గుడిపాల మండల సరిహద్దులోని మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి మాత్రం పట్టపగలే బహిరంగంగా లారీల్లో రయ్రయ్మంటున్నాయి. అక్కడ లారీ ఇసుక రూ. 1.20 లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ ఇసుకకు భారీగా డిమాండ్ పెరగడంతో అక్రమ లారీల సంఖ్యను పెంచారు. మురకంబట్టు నుంచి రోజువారీగా 15 లారీల నుంచి 20 లారీలు, మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి 30 నుంచి 40 లారీలు వెళుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు వ్యాపారం జరుగుతున్నట్లు వారు అంటున్నారు. ఆ ఇద్దరే..దమ్ముంటే పట్టుకోండి చూద్దాం? గుడిపాల మండలంలోని ఆ ఇద్దరు చోటా నేతలు ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరారు. తమిళనాడులో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని ఇసుక వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ డంప్ల నుంచి కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడుకు తన్నుకుపోతున్నారు. వీరి కంట్లో పడినవారంతా పాతాళానికి పడిపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండతో...అక్రమ వ్యాపారాన్ని రెండేళ్లుగా దర్జాగా నడిపిస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. వారి తమిళనాడు వ్యాపారానికి పోటీగా వచ్చేవారికి నరకం చూపిస్తున్నారని మండి పడుతున్నారు. దమ్ముంటే..వాళ్లను పట్టుకోండి చూద్దామని ఓ వర్గ తెలుగు తమ్ముళ్లు సవాల్ విసురుతున్నారు. ఇసుక వ్యాపారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకే పార్టీకి చెందిన నేతల మధ్యే విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ పోటీ మరింత పెరిగితే పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో పెరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధికారులు సమగ్రంగా దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే చిత్తూరు జిల్లాలో ఇసుక దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవకు దారి తీసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. మురకంబట్టు... లారీలు మాత్రమే లాక్ గతనెల మురకంబట్టు నుంచి ఇసుక తరలిస్తు న్న ఓ లారీని చిత్తూరు తాలూకా పోలీసులు పట్టుకుని గుడిపాల పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి నిఘా పెట్టి రెండు ఇసుక లారీలను పట్టుకున్నారు. అరెస్ట్ కూడా చూపించారు. అయితే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల నుంచి వెళ్లే లారీలకు మాత్రం పెద్దగా అడ్డంకులు లేకుండా రవాణా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మురకంబట్టు తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక మార్గానికి బ్రేక్ మరో మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
పలమనేరు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులోకి వెళుతున్న ఓ బస్సు ముందు టైర్ పక్కనే వెళుతున్న ఓ వృద్ధురాలి కాలుపై తొక్కించడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం స్థానిక ఏటీఎం వద్ద చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి పలమనేరుకు వస్తున్న బస్సు బస్టాండులోకి వెళ్లే సమయంలో పక్కనే వెళుతున్న గంటావూరుకు చెందిన మునెమ్మ(65)ను కాలుపై బస్సు ముందు చక్రం ఢీకొనడంతో కాలు విరిగింది. స్థానికులు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములకు తీవ్ర గాయాలు వి.కోట: గుర్తు తెలియని కారు అతి వేగంగా వచ్చి టూవీలర్ను ఢీకొట్టడంతో అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని కుంబార్లపల్లి గ్రామానికి చెందిన షబీర్ కుమారులు అమ్జాద్(27), అతిక్(24) చెరుకు జ్యూస్ వ్యాపారం చేసుకుని జీవించేవారు. వీరిద్దరూ రామకుప్పం మండలంలో చెరుకు జ్యూస్ వ్యాపారం ముగించుకుని ఆదివారం సాయంత్రం టూ వీలర్లో వీ.కోటకు బయల్దేరారు. అదే సమయంలో వీ.కోట నుంచి పెర్నంబట్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు అతి వేగంగా వచ్చి టూవీలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమ్జాద్, అతిక్ దాదాపు పది అడుగుల దూరం ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అతిక్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో కుప్పం పీఈఎస్కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చెరుకు బకాయిల చెల్లింపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : చెరుకు రైతులకు అందాల్సిన బకాయిల చెల్లింపునకు చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో నేతమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీ నిర్వాహకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు, రైతుల దీర్ఘకాలిక బకాయిల పరిష్కారానికి కసరత్తు చేపడుతామన్నారు. బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు రైతులకు రూ.35.92 కోట్లు, ఉద్యోగుల జీతాలు దాదాపు రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల వసూలు ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బకాయిలు త్వరగా ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో చక్కెర కర్మాగారం కమిషనర్ ముత్యాలు, రైతు సంఘం ప్రతినిధులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, ఉద్యోగ సంఘం నాయకులు భాస్కర్రెడ్డి, సంపత్ పాల్గొన్నారు. -
నాడు
నేడుసచివాలయ సేవలు గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి 500కి పైగా సేవలను ప్రజలకు అందించింది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా, ఈ– క్రాప్ ధాన్యం కొనుగోలు వంటి సేవలు 100కి పైగా అందించేవారు. నేడు రైతు సేవా కేంద్రాలు అలంకారప్రాయం కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చి ఎరువులు, పురుగు మందుల సరఫరాను నిలిపి వేశారు. దీంతో ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల షాపులకు రెక్కలొచ్చాయి. -
కమనీయం..దేవదేవుడి కల్యాణం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం పద్మావతీ, ఆండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. ఆలయ పండిత బృందం ముందుగా గణపతి హోమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ మాంగల్య ధారణ కమనీయంగా నిర్వహించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
మాఫీ చేస్తారా? లేదా?
చిత్తూరు అర్బన్: పట్టణాల్లో అభివృద్ధి పనులకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నులే. ఏటా మార్చి వస్తోందంటే మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను వసూళ్లపై ఓ ప్రణాళిక ఉంటుంది.కానీ ఈ ఏడాది అధికారులు వేసుకున్న ప్రణాళికలకు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడంలేదు. కారణం ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తామంటూ ఇటీవల రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్సుల్లో కమిషనర్లకు స్పష్టత ఇచ్చారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడకపోవడంతో పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొంది. రూ.26 కోట్ల బకాయిలు జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 83,477 భవనాల నుంచి ఆస్తి పన్నులు వసూలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లా నుంచి రూ.40.54 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, బకాయిల రూపంలో రూ.8.97 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంగా రూ.56.25 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆదివారం నాటికి రూ.26.28 కోట్లు వసూల య్యాయి. అంటే దాదాపు 48 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇంకా మిగిలిన 52 శాతం వసూళ్లు నిలిచిపోయాయి. ‘మాఫీ’పైనే ఆశలు ఇటీవల రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ అధికారు లు కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి.., రెండు రోజుల్లో ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ జీ.వో వెలువడుతుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని అధికారులు ప్రజలకు చేరవేశారు. కానీ ఈ సమావేశం జరిగి పది రోజులు కావస్తున్నా, ప్రభు త్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఫలితంగా పన్నుల వసూళ్లల్లో మందగమనం నెలకొంది. -
విజయీభవ
జిల్లా సమాచారం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశించారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, వైద్య ఆరోగ్య సిబ్బంది విధుల్లో ఉంటారు. హాల్టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. పరీక్ష సమయాల్లో వివిధ రూట్లకు మరిన్ని బస్సులు తిప్పేలా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ వెబెక్స్లో పరీక్షల నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై సందేహాలు, ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం నంబర్ 9032185001ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలు 129 బాలురు (రెగ్యులర్) 10,737 బాలికలు (రెగ్యులర్) 10,264 బాలురు (ప్రైవేట్, వన్స్ఫెయిల్డ్) 1,318 బాలికలు (ప్రైవేట్, వన్స్ఫెయిల్డ్)726 మొత్తం విద్యార్థులు 23,095 -
ఇంటి వద్దకే రేషన్
గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందేలా చేసింది. ప్రజలకు అవసరమైన ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని జగనన్న సురక్ష పేరుతో నేరుగా ఇంటి వద్దకే అందించింది. రేషన్ కూడా ఎండీయూ వాహనాలతో ఇంటి వద్దే పంపిణీ చేసింది. ప్రస్తుతం సేవలు అందక నరకయాతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ను నిలిపివేయడంతో పింఛన్ లబ్ధిదారులు నరకయాతన పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం, రెవెన్యూ సమస్యలు, ఇతర ప్రభు త్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
నాడు: విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఫ్యామిలీ డాక్టర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గడప వద్దకే వైద్యాన్ని అందించారు. ఈ కాన్సెప్ట్లో గ్రామాల్లో 14 రకాల వైద్య పరీక్షలు జరిపి 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం సేవలు దూరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సేవలు రోగులకు దూరమయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలు నిర్వీర్యం చేసి అధికారులను సర్వేల పేరుతో గ్రామాల్లో తిప్పడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ కుర్చీలతో దర్శన మిస్తోంది. -
పరీక్షల్లో అలసత్వం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : పది పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ మనబడి మన భవిష్యత్ శాఖ జేడీ మువ్వా రామలింగంను జిల్లా అబ్జర్వర్గా నియమించారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రానికి విచ్చేశారు. జిల్లాలో పది పరీక్షల నిర్వహణపై క్షేత్రస్థాయి అధికారులతో వెబెక్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లను ఆరా తీశారు. పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు ఉంటా యని హెచ్చరించారు. పది పరీక్షలు పూర్త య్యే వరకు ఆయన జిల్లాలో ఉంటూ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు. టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ చిత్తూరు అర్బన్ : పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏఎస్పీ రాజశేఖర్ రాజు ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవ్వరూ గుంపులుగా ఉండడం చేయొద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే డయల్–112కు సమాచారం ఇవ్వాలని కోరారు. నో మొబైల్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్ మువ్వా రామలింగం వెల్లడించారు. ఆదివారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాస్ కాపీయింగ్కు తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. అధికారులకు కూడా అనుమతి లేదు..... పరీక్ష కేంద్రాల పరిధిలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చేందుకు అనుమతి లేదన్నారు. మీడియాకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలకు తావు లేకుండా పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించారన్నారు. నిబంధనలను అతిక్రమించి మొబైల్ ఫోన్లతో పట్టుబడితే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరీక్షలను తనిఖీ చేసేందుకు ప్లైయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఈవో రాజేంద్రప్రసాద్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, సూపరింటెండెంట్ స్వర్ణకుమారి, ఎంఈవోలు గణపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
● పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25 ● ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24 ● విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి తిరుపతి అర్బన్: పదో తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథ రెడ్డి వెల్లడించారు. శనివారం వరదరాజనగర్లోని విశ్వం పోటీపరీక్షల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో 2026 సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది తర్వాత పాలీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరి సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని తెలిపారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీ ద్వారా బిటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశముంటుందని వెల్లడించారు. ఏపీ పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్ 4 వరకు గడువు ఉందని, పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ ఉంటుందని చెప్పారు. అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు ఉందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24వ తేదీన ఉంటుందన్నారు. ఏపీఆర్జేసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యను ఉచితంగా చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 36 ఏళ్లుగా పాలిటెక్నిక్ కోచింగ్లో విశ్వం ఇన్స్టిట్యూట్ అద్భుత ఫలితాలు సాధించిందని, ముఖ్యంగా 2025 పాలీసెట్ ప్రవేశ పరీక్షలో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 8688888802, 93999 76999 సంప్రదించవచ్చని తెలిపారు. -
చెరుకు రైతు కన్నెర్ర
నగరి : ఆరుగాలం శ్రమించి చెరుకు పంట సాగు చేసిన రైతులకు ఆరేళ్లుగా చెరుకు ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడం, విన్నవించుకుంటున్నా జిల్లా స్థాయి అధికారులు న్యాయం చెయ్యకపోవడం, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, ఎమ్మెల్యే వాటిని నెరవేర్చకపోవడంతో ఆగ్రహించిన నేటమ్స్ షుగర్స్ రైతులు, కార్మికులు శనివారం రోడ్డెక్కారు. మండల కేంద్రమైన నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు రోడ్డుపై బైఠాయించారు. ఆరేళ్లుగా ఆర్థికంగా చితికిపోయిన వారి ఆవేదన ఆందోళనగా పెల్లుబికింది. మాకు న్యాయం జరిగేదెప్పుడు? మా గోడు వినేదెవరు అంటూ భారీ ఎత్తున ఆందోళన చేశారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎస్పీ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. బకాయిలు చెల్లించాలి ఈ సందర్భంగా చెరుకు సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరంలో క్రషింగ్ సీజన్లో చెరుకు సరఫరా చేసిన 10150 మంది రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.37 కోట్లు బకాయి పడిందన్నారు. అలాగే ఫ్యాక్టరీ కార్మికులు 298 మందికి చెల్లించాల్సిన బకాయిలు రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆరేళ్లుగా రావలసిన డబ్బులు రాక ఆర్థికంగా చితికిపోయామన్నారు. కొందరు రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. పలువురు రైతులు భూములు అమ్ముకొని రైతు కూలీలుగా మారారన్నారు. అప్పులు చేసి పుస్తెలు అమ్ముకున్నవారు ఉన్నారన్నారు. తీవ్ర ఆవేదనకు లోనై అనారోగ్యం పాలై చనిపోయిన రైతులున్నారన్నారు. ఇలా నేటమ్స్ షుగర్ ప్యాక్టరీకి ఆరేళ్ల క్రితం చెరుకు తోలిన రైతుల బాధలు వర్ణనాతీతమన్నారు. హామీలు ఏమయ్యాయి బాబూ ? ‘నిండ్రలో నేటమ్స్ షుగర్స్ మూతపడింది. దానిని తెరిచే బాధ్యత తీసుకుంటాం’... షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో పుత్తూరు బహిరంగ సభలో హామీ ఇచ్చారన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే బకాయిలు ఇప్పించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలు ఏౖమయ్యాయని పశ్నించారు. నగరికి ముఖ్యమంత్రి విచ్చేసిన సమయంలో ఆయనను కలవడానికి అపాయింట్మెంట్ దొరక లేదన్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు తప్పవన్నారు. రాస్తారోకో చేస్తూ తిరుపతి–చైన్నె రహదారిపై బైఠాయించారు. దీంతో సుదూరం వరకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో సంఘటనా స్థలానికి పరుగు పరుగున అధికారులు విచ్చేశారు. రూరల్ సీఐ భాస్కర్, తహసీల్దార్ ఈశ్వర్, జిల్లా షుగర్ క్రేన్ కమిషనర్ ముత్యాల నాయుడు రైతుల వద్దకు వచ్చి వారితో చర్చించారు. సమస్య తీరే వరకు లేవమంటూ రైతులు భీష్మించుకొని కూర్చొవడంతో వారి చర్యలు విఫలమయ్యాయి. గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో తహసీల్దార్ జిల్లా కలెక్టర్కు సమాచారం అందించగా ఆయన రైతు నాయకులతో మాట్లాడారు. నిరసనకారులతో చర్చిస్తున్న అధికారులు రహదారికి అడ్డంగా పడుకున్న రూ.కోటి బకాయి రావాల్సిన రైతు సోముకలెక్టర్ హామీతో ఆందోళన విరమణ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆందోళనకారులతో మాట్లాడుతూ.. చెరుకు రైతుల బకాయిలు, కార్మికుల బకాయిల విషయమై గతంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటకు వచ్చే సమయంలో ఆయనతో నేరుగా చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కర్మాగారంలో ఉన్న స్క్రాప్, ఇనుప సామానులు వేలం వేసి వచ్చే రాబడిని రైతులు, కార్మికులకు చెల్లిస్తామన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తనను కలవాలన్నారు. దీంతో శాంతించిన రైతులు, కార్మికులు ఆందోళన విరమించారు. ఆపై పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘ నాయకులు నారాయణస్వామి రెడ్డి, శ్రీనివాస యాదవ్, పట్టాభిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్, బీఎస్పీ పార్టీ నాయకులు నాగూర్, కార్మికనాయకులు భాస్కర్రెడ్డి, నరసింహులు, హేమలత,సంపత్కుమార్, మణి, తోయజాక్ష, బాబురెడ్డి, చంద్రశేఖర్రాజు, శేఖర్, సుదర్శననాయుడు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాలు ఢీ
పూతలపట్టు(యాదమరి): అంబులెన్సు 108 వైఫల్యం వలన ఓ యువకుడి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. శనివారం స్థానిక ఎస్వీ సెట్ కాలేజీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల వివరాలు మేరకు..గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు గ్రామానికి చెందిన హేమంత్ చిత్తూరు నుంచి ఎస్వీ సెట్ కాలేజీ సర్వీస్ రోడ్డు వైపుగా వస్తున్నాడు. అదే సమయంలో జశ్వంత్, పునీత్ అనే యువకులు కాలేజీ నుంచి బయటకు వచ్చే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. చావు బతుకులు మధ్య పోరాటం చేస్తున్న యువకులకు ప్రాణదానం చేయాల్సిన అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో హేమంత్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే ఆటోలో పక్కనే ఉన్న ఆర్వీఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం , అత్యవసర సమయంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వలనే బాధితులు పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. -
అదనపు వసూళ్లు చేస్తే చర్యలు
– సందేహాలకు కంట్రోల్ రూం ఏర్పాటు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి శంకరన్ తెలిపారు. సాక్షి దినపత్రికలో శనివారం గ్యాస్ దందా పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై ఆయన స్పందించారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పు డు సమాచారం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందేహాలు ఉన్న వారు 08572–242734 నంబర్కు పని దినాల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో వినియోగదారులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద తహసీల్దార్ను సరఫరాపై పర్యవేక్షణ కోసం నియమించిన ట్లు చెప్పారు. ప్రజలు వదంతుల ను నమ్మి వెంటవెంటనే గ్యాస్ రీఫిల్లింగ్ బుకింగ్ చేయవద్దని అధికారులు సూ చించారు. వినియోగదారులు గ్యాస్ బిల్లులో పేర్కొన్న ధర మాత్రమే డెలివరీ సిబ్బందికి చెల్లించాలని, అదనపు రుసుం డిమాండ్ చేసినట్లయితే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై అలాగే డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
గ్యాస్ సిలిండర్ల కోసం ఘర్షణ
గంగవరం : మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా సిలిండర్లు సక్రమంగా అందకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. గంగవరంలోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు శనివారం భారీగా జనం చేరుకున్నారు. ఏజెన్సీ సిబ్బంది టోకెన్ల వారిగా ఒక్కొక్కరికీ సిలిండర్లు అందజేశారు. అందరికీ సిలిండర్లు ఇవ్వాల్సిందేనని వినియోగదారులు ఏజెన్సీ నిర్వాహకులపై ఘర్షణకు దిగారు. ఈక్రమంలో కార్యాలయ అద్దాలను పగులగొట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సిలిండర్లు బుక్ చేసుకుని వారం గడిచినా తమకు సిలిండర్లు సరఫరా కాలేదని ఇళ్లలో వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలగజేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. సీఐ రాంభూపాల్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు డిమాండ్ ఎక్కడా లేదని అవసరమైన వారు ముందుగా బుక్ చేసుకున్నట్లయితే నేరుగా మీ ఇళ్లకే సరఫరా జరుగుతుందన్నారు. అంతేగానీ సిలిండర్ల కొరత అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. -
● మెడికల్ షాపుల పేరిట క్లినిక్లు ● జిల్లాలో పుట్టగొడుగుల్లా మెడికల్ షాపుల్లో ఆస్పత్రులు ● నకిలీ అవతారమెత్తిన కొందరు కేటుగాళ్లు ● ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణశాఖ అధికారులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు సిబ్బంద
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026కాణిపాకం/తిరుపతి తుడా : జిల్లాలో మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న అక్రమ వైద్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. మందులు విక్రయించాల్సిన మెడికల్ షాపులు అనుమతి లేకుండానే క్లినిక్లుగా మారిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన మెడికల్ షాపుల్లో కొన్నిచోట్ల చిన్న ఆస్పత్రుల్లా వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు దూరంగా ఉండ టం, చిన్నపాటి సమస్యలకే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రజలు దగ్గరలో ఉన్న మెడికల్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని మెడికల్ షాపులనే క్లినిక్లు గా మార్చేశారు. సరైన అర్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు డాక్టర్లుగా మారి రోగులకు చికి త్స అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో మెడికల్ షాపులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొన్నేళ్లలో మెడికల్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారిక అంచనాల ప్రకారం రెండు జిల్లా ల్లో కలిపి 2500 పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 మెడికల్ షాపుల్లో క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులు డాక్టర్లు సూచించిన మందులను మాత్రమే విక్రయించాలి. అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అనేక షాపులు చిన్న వైద్య కేంద్రాల్లా మారిపోయాయి. ప్రజారోగ్యంపై ముప్పు. అర్హతలేని వ్యక్తులు వైద్యం చేయడం వల్ల రోగుల ఆరో గ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పరీక్షలు లేకుండా మందులు ఇవ్వడం, అవసరం లేని ఇంజెక్షన్లు వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో దగ్గరలోనే చికిత్స లభిస్తుందని భావించి ప్రజలు ఈ మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. నకిలీ డాక్టర్ల హడావుడి ఫార్మసీ లైసెన్స్ను కేవలం మందులు విక్రయించడానికి మాత్రమే పొందినా, అదే పేరుతో కొందరు క్లినిక్లు నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, కడుపు నొప్పి వంటి సాధారణ వ్యాధుల కు అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇంజెక్షన్లు వేయడం, సైలెన్ లు పెట్టడం వంటి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆర్ఎంపీలతో చేతులు కలిపి రోగులకు నాడీ పట్టించి మందులు ఇవ్వడం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు నిజమైన వైద్య సేవల నుంచి దూరమై నకిలీ వైద్యులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఔషధ నియంత్రణ శాఖపై విమర్శలు అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉన్నప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ క్లినిక్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమది కాదని, అది వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని చెబుతూ బాధ్యతను ఒక శాఖ నుంచి మరో శాఖపైకి నెట్టేస్తున్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలో మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమ వైద్యంపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ క్లినిక్లు నిర్వహిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
రాజీ మార్గమే రాజమార్గం
చిత్తూరు అర్బన్ : న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి రాజీమార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ ను చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా జడ్జి ప్రారంభించారు. లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించు కున్న తరువాత దీనిపై అిప్పీలు వెళ్లడానికి వీలుండదని.. ఇదే అంతిమ తీర్పన్నారు. అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో కలిపి 35 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒకటే మార్గం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కోసం చిత్తూరు, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లోని న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలంటే.. అదాలత్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, శ్రీదేవి, ఉమాదేవి, శ్రీనివాసరావు, శిల్ప, బాబాజాన్, చిత్తూరు న్యాయవాదు ల సంఘం అధ్యక్షులు శంకర్ నాయుడు పాల్గొన్నారు. -
విభజన.. ఖాళీల దరువు
చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీలకు కార్యదర్శుల కొరత లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం పంచాయతీల వికేంద్రీకరణకు సిద్ధమైంది. ఆదా యం జనాభాను బట్టి జిల్లాలో పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించింది. ఇందుకు సంబంధించి ఆదేశాలును సైతం విడుదల చేశారు. అయితే కార్యదర్శుల కొరత తీరుస్తామంటున్న ప్రభుత్వం ఇటు కొత్త ఉద్యోగుల కల్పన చేయడం లేదు. అటు పంచాయతీల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయడం లేదు. ఇదే సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థపై నిత్యం విషం చిమ్ముతూనే కార్యదర్శుల బాధ్యతలు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీ కార్యదర్శులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. సచివాలయ వ్యవస్థతోనే ముందుకు జిల్లాలో మొత్తం 621 పంచాయతీలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే వరకూ మూడు, నాలుగు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ఓ కార్యదర్శి తాను పనిచేస్తున్న పంచాయతీతో పాటు మరో రెండు, మూడు పంచాయతీలకు ఇన్చార్జిగా ఉండేవారు. దీనివల్ల పరిపాలన మొత్తం స్తంభించేది. ఇలాంటి సమస్యలకు గత పాలనలో చెక్ పడింది. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం వాటికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను నియమించడంతో గ్రామాల్లోనే అనేక రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, వాటిని డిజిటలైజేషన్ చేయడం వంటి పనులు సచివాలయం కేంద్రంగా జరిగేవి. సచివాలయాల నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు ధ్రువీకరణ పత్రాలు అందడంతో ప్రజలకు పంచాయతీ అవసరాలు చాలా వరకూ తీరాయి. మరీ ముఖ్యంగా కార్యదర్శి లేక పడే ఇబ్బందులు ప్రజలకు తప్పాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నెమ్మదిగా నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. వలంటీర్ వ్యవస్థ ఎత్తివేసి ఆ భారాన్ని ఉద్యోగులపై మోపింది. ఇదే సమయంలో పంచాయతీ పరిపుష్టి చేస్తామంటూ ఈ వ్యవస్థను మొత్తం ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇలా.. ప్రస్తుతం రూర్బన్(స్పెషల్ గ్రేడ్)తో కలిపి గ్రేడ్–1,2.3 కింద పంచాయతీ విధానం తీసుకొచ్చారు. దీనివల్ల కార్యదర్శులకు తప్పనిసరిగా స్థానచలనం కలుగుతుంది. గ్రేడ్లలో వ్యత్యాసం ఉంటే జీతాల విడుదలలో సమస్యలు తలెత్తాయి. పదివేలకు పైబడి జనాభా ఉన్న లేదా రూ.కోటి ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా (రూర్బన్)గుర్తించారు. వీటికి డిప్యూ టీ ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని ప్రత్యేక కార్యదర్శిగా నియమించనున్నారు. రూర్బన్ పంచాయతీలకుగాకు చిన్న పురపాలక సంఘంగా రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో రెవెన్యూ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు బిల్కల్టెకర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మేసీ్త్ర, ఇద్దరు సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, డ్రైయిన్ క్లీనర్, ఎలక్ట్రిషియన్, సహాయ ఎలక్ట్రిషియన్, ిపిట్టర్, ట్యాంకు క్లీనర్, ఇంజనీరింగ్ అసిస్టెంటు, వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. గ్రేడ్–1 పంచాయతీ కింద ఏడాది ఆదాయం రూ.30 లక్షల పైబడి రూ.కోటి కన్నా తక్కువ ఆదాయం, 3 వేలకు పైబడి, పది వేలకన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు వీటి పరిధిలోకి వస్తాయి. గ్రేడ్–2 కింద 2–3 వేల జనాభా ఉన్నవి, గ్రేడ్–3 , 2 వేల జనాభా కంటే తక్కువ ఉన్నవి వస్తాయి. వి.కోట పంచాయతీ కార్వేటినగరం పంచాయతీ గ్రేడ్–3 కింద 377 పంచాయతీలు జిల్లాలో రూర్బన్ కింద గంగవరం, కాణిపాకం, కార్వేటినగరం, వి.కోటలు ఉన్నాయి. గ్రేడ్–1 కింద 100 పంచాయతీలు, గ్రేడ్–2 కింద 140 పంచాయతీలు, గ్రేడ్–3 లో 377 పంచాయతీలు వస్తాయి. గ్రేడ్–1 పంచాయతీలో ఒక్కో పంచాయతీకి 20 మంది, గ్రేడ్–2లో ఒక్కో పంచాయతీకి 12 మంది, గ్రేడ్–3లో 9 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం గ్రేడ్–4, 5 పంచాయతీలను రద్దు చేస్తూ అక్కడి వారికి గ్రేడ్–3, 2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించనున్నారు. కార్యదర్శుల కొరత ఇటీవల పదో న్నతుల నందు దాదాపు భర్తీ చేస్తున్న మిగిలిన ఉద్యోగుల ఖాళీలు, పదోన్నతులు, రెగ్యులైజేషన్ చేస్తే పాలన వేగంగా జరుగుతుంది. జనాభాకు అనుగుణంగా గుర్తింపు జిల్లా పునర్విభజన తర్వాత 697 పంచాయతీలు 621కు కుదించారు. ఆ లెక్కన జిల్లాలో గ్రేడ్ –1 పంచాయతీలు 37 కాగా అందులో కార్యదర్శులు గ్రేడ్– 2, 56, కార్యదర్శులు 51, గ్రేడ్–3 ,106 కాగా కార్యదర్శులు 103, గ్రేడ్–4 242 ఉండగా కార్యదర్శులు 185 ఉన్నారు. 2011 జనాభాకు అనుగుణంగా పంచాయతీలను గుర్తింపు చేపటడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జనాభాకు అనుగుణంగా గ్రేడ్లు నిర్ణయించాల్సి ఉంది. పంచాయతీల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. పంచాయతీలో ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నా యి. వీటిని భర్తీ చేయాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని కోరుతున్నారు. వీరికి అవకాశం కల్పించాల్సి ఉన్నా ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్న జేఏ, బీసీలు సైతం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా డిమాండ్ల పరిష్కరించకుండా వికేంద్రీకరణ చేస్తే ఫలితం ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. -
‘పది’ పరీక్షలకు సన్నద్ధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్, ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని డీఈవో రాజేంద్రప్రసా ద్ అన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేసి న ఏర్పాట్లను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పది పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 219 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 9032185001 ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విద్యాసంవత్సరం రెగ్యులర్ విధానంలో బాలురు 10,787, బాలికలు 10,264 మొత్తం 21,051, ప్రైవేట్ (వన్స్ ఫెయిల్డ్) విధానంలో బాలురు 1,318, బాలికలు 726, మొత్తం 2,044 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో సూపరింటెండెంట్ స్వర్ణ, పది పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, సిబ్బంది మురళి, సల్లార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్దకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీ బస్సుల్లో హాల్టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారన్నారు. 144 సెక్షన్ అమలు జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఈవో తెలిపారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను కచ్చితంగా మూసివేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల కేంద్రాల్లో ఉండే జిరాక్స్ మిషన్లు ప్రత్యేక రూంలో భద్రపరచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష విధుల్లో ఉండే చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్, ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్ఫోన్ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తీసుకెళ్లేటప్పుడు ద్విచక్రవాహనాలను వాడకూడదన్నారు. -
17న ఉద్యోగ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న ఉద్యోగ మేళా (సీడాప్ జాబ్కనెక్ట్) నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ), సీడాప్ సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉన్న టీటీడీసీ ప్రాంగణంలో ఉద్యోగ మేళా జరుగుతుందన్నారు. జిల్లాలోని 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ మేళాలో టీసీఎల్ (తిరుపతి), టాటా ఎలక్ట్రానిక్స్ (హోసూర్), బ్లింకిట్ (చైన్నె) తదితర కంపెనీలు హాజరవుతాయన్నా రు. ఎంపికయ్యే అభ్యర్థులకు సంబంధిత కంపెనీల నియమ, నిబంధనల మేరకు జీతాలు ఇస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వివరాలు నమోదు, ఇతర సమాచారానికి 8712495517, 9441872140 నంబర్లలో సంప్రదించాలన్నారు. హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్లు(ఒరిజినల్, జిరాక్స్) తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పీడీ కోరారు. నిఘా సంస్థల పాత్ర కీలకం తిరుపతి సిటీ: కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతి భద్రతలు, సామాజిక అంశాల నియంత్రణపై నిఘా సంస్థల పాత్ర కీలకంగా మారనుందని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ రాజనీతి శాస్త్రం, ప్రభు త్వ పాలనా శాస్త్ర విభాగం పూర్వ విద్యార్థుల సహకారంతో శుక్రవారం వర్సిటీ సెనేట్ హాల్లో ‘చట్టబద్ధ నిఘా రాజకీయ పరిణామాలు.. ఒక విమర్శాత్మక దృక్పథం’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పరిణా మాల దృష్ట్యా భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. శాస్త్ర సాంకేతిక యుగంలో నిఘా సంస్థల ప్రాబల్యం గణనీయంగా పెరుగుతోందని తెలిపా రు. విభాగధిపతి ఆచార్య బీవీ మురళీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నిఘా చర్యలు చట్టపరమైన విధానాల ద్వారా అమలవుతాయన్నారు. చట్టబద్ధ నిఘా ప్రధాన ఉద్దేశం జాతీయ భద్రతను కాపాడడం, నేరాలను నిరోధించడం, ప్రజాశాంతిని పరిరక్షించడమన్నారు. సదస్సుకు హాజరైన జార్ఘండ్ రాష్ట్ర మానవ వనరుల విభాగం పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ క్రాంతి కుమార్ గడిదేసి మాట్లాడుతూ ప్రధానంగా కృత్రిమ మేధస్సు పోలీసు వ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపుతోందని, పోలీసింగ్ డేటా ఆధారిత అంశాలపై ఆధారపడుతోందన్నారు. ఈ సదస్సులో డాక్టర్ సాంబమూర్తి, కోకన్వీనర్లు డాక్టర్ ఐఎస్ కిషోర్, పి సాయికుమారి, డాక్టర్ సీఎల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు. -
హమ్మయ్య..బతికిపోయాడులే!
గంగవరం : విద్యుత్ స్తంభంపైన కరెంటు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. కరెంటు తీగలపైనే వేలాడుతూ కొంతసేపు శరీరంలో చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు.. చూసినవాళ్లందరూ అతడు మరణించాడనుకున్నారు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అతడు పైకి లేవడంతో హమ్మయ్య బతికిపోయాడులే అని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలకు మండలంలోని గుండుగల్లు సబ్ స్టేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ)గా మహేంద్ర(34) విధులు నిర్వహిస్తున్నాడు. కరెంటు మరమ్మతు కారణంగా నాలుగు రోడ్ల వద్ద విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతు పనులు పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా తీగల్లో విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు కొద్దిసేపు తీగలపైన వేలాడుతూ అలాగే ఉండిపోయాడు. గమనించిన స్థానికులకు షాక్ గురైన అతడు చనిపోయి ఉంటాడనుకున్నారు. విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్లి వెంటనే కరెంట్ సరఫరా ఆపేసి అతడిని కిందికి దించే ప్రయత్నం చేశారు. అంతలో అతడు పైకి లేవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు బాధితుడిని చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స చేసి సాయంత్రానికి ఇంటికి పంపించారు. -
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పెను విషాదం తప్పింది. పాడుబడ్డ 108, 104 వాహనాల స్క్రాప్ తొలగింపు సమయంలో గ్యాస్ కట్టర్లు వినియోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే ఒక 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. అపోలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్కారప్ వాహనాలతోనే ప్రమాదం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పాడుబడ్డ 108, 104 వాహనాలకు ఇటీవల వేలం నిర్వహించారు. వేలంలో 23 వాహనాలను దక్కించుకున్న స్క్రాప్ యజమానులు వాటిని అక్కడి నుంచి తరలించి తమ ప్రాంగణంలో విడగొట్టాల్సి ఉండగా ఆస్పత్రి ఆవరణలోనే గ్యాస్ కట్టర్లతో కటింగ్ పనులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక 108 వాహనంలోని సీట్లకు మంటలు అంటుకుని కేవలం ఐదు సెకన్లలోనే వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది. వాహనంలో ఉన్న ఫోమ్, ప్లాస్టిక్ పదార్థాలు, చుట్టుపక్కల ఎండిన చెత్త, చెట్లు ఉండటంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కొద్దిసేపట్లోనే పక్కనే ఉన్న మరో స్క్రాప్ వాహనానికి మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగిన విషయం గుర్తించిన అపోలో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. అందుబాటు లో ఉన్నవాటితో మంటలను ప్రాథమికంగా అదుపు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఆగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే 108 వాహనాల కార్యాలయం, శిశు వార్డు ఉండటం తీవ్ర ఆందోళన కలిగించింది. మంటలు అదుపులోకి రావడంలో కాస్త ఆలస్యం అయినా 108 కార్యాలయంతో పాటు శిశు వార్డుకూ మంటలు వ్యాపించే పమ్రాదం ఉండేది. రోగుల తరలింపు మంటల చెలరేగడంతో శిశు వార్డు వైద్యాధికారి అప్రమత్తమై అక్కడున్న రోగులను వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు స్క్రాప్ యజమానుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్క్రాప్ యజమానులు గ్యాస్ కట్టర్ల కోసం కమర్షియల్ సిలిండర్లనే వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి భద్రతా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి ఆవరణలో ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ షరతులతో స్క్రాప్ తొలగింపు పనులు అప్పగించారు? డొమెస్టిక్ సిలిండర్లు వాడారా? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాలిపోయిన పాత వాహనాలుమంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది -
‘అన్నదాత సుఖీభవ’ నిధులు
గుడిపాల: రైతులందరికీ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను పంటల సాగులో వినియోగించుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండలంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడతలుగా 2 లక్షలా 5 వేల 753మంది రైతులకు 400 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ వ్యక్తిగత ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధాన పంటగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధి , పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్నదని రైతులు ఉద్యానశాఖ పంటలపై ఆసక్తి చూపాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ప్రభుత్వం రూ.14 వేలు అందజేసిందన్నారు. అనంతరం కలెక్టర్తో కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష, ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్, సింగిల్విండో చైర్మన్ ప్రతాప్నాయుడు, వ్యవసాయాధికారులు సంగీత, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
గ్యాస్ దందా!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో గ్యాస్ బాంబ్ పేలుతోంది. బండపై...పలు ఏజెన్సీలు బండబాదుడు బాదుతున్నాయి. కొరతంటూ..వినియోగదారులకు కోతపెడుతోంది. బుకింగ్ ఫుల్కు పుల్స్టాఫ్ పెడుతూ...బ్లాక్ మార్కెట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, టిఫిన్న్ సెంటర్లు, బేకరీలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా తగ్గిందనే పేరుతో గ్యాస్ ఏజెన్సీలు బుకింగ్లను పెండింగ్లో పెట్టి, అదే సిలిండర్లను అదనపు డబ్బులు తీసుకుని దొంగచాటుగా విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 వరకు ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందని ఏజెన్సీలు చెబుతున్న ప్పటికీ, వాస్తవానికి కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్కు తెరతీసినట్టు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్కు భారీ డిమాండ్ జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలు కమర్షియల్ గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్లు చేసినా సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. బ్లాక్లో అమ్మకాలు..? వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేస్తే ‘స్టాక్ లేదు’, ‘సరఫరా రాలేదు’ అంటూ పలు ఏజెన్సీలు సమాధానం చెబుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కొందరికి అదనపు డబ్బులు తీసుకుని సిలిండర్లు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో గ్యాస్ సిలిండర్పై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసే వారు. ప్రస్తుతం పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఒక్కో సిలిండర్పై రూ.200 నుంచి రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారు లు చెబుతున్నారు. ముఖ్యంగా హోటల్ యజమానులు, చిన్న వ్యాపారులు ఈ అదనపు చార్జీలను చెల్లించక తప్పడం లేదని అంటున్నారు. డెలివరీ బాయ్ల పాత్రపై ఆరోపణలు కొన్ని చోట్ల డెలివరీ సిబ్బంది ముందుగా సిలిండర్లను నిల్వ ఉంచి, తర్వాత అదనపు డబ్బులు ఇచ్చే వారికి మాత్రమే అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని వినియోగదారులు అంటున్నా రు. దీంతో సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టించుకోని అధికారులు గ్యాస్ దందాపై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్య లు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులు ఫోన్న్ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడిలో అధికారులు జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కొరత పేరుతో జరుగుతున్న దందాపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్మార్కెట్కు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుని సిలిండర్ల సరఫరాను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు. -
పదిలమైన వ్యూహం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి... ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. భవిష్యత్తు ఉన్నత విద్యాభ్యాసానికి, పునాది వేసే తొలి మెట్టు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఆందోళన, కంగారు, ఒత్తిడి మొదలవు తాయి. అయితే పరీక్షలు అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసం ఉంటే పది పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ (10కి10) సాధించడం సులువేనని మానసిక, విద్యా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు భయాన్ని వీడి, విజయతీరాలను చేరుకోవడానికి నిపుణులు అందిస్తున్న సమగ్రమైన మెలకువలపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రణాళిక అవసరం కచ్చితమైన టైమ్ టేబుల్ ముఖ్యం. రోజువారీ దినచర్యలో ఏ సమయానికి ఏ సబ్జెక్టు చదవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం, ఉదయం పూట ప్రశాంతమైన సమయాన్ని కేటాయించాలి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయో బ్లూ ప్రింట్ ద్వారా అవగాహన పెంచుకోవాలి. ఎక్కువ మార్కు ల వెయిటేజీ ఉన్న పాఠాలపై ముందుగా దృష్టి పెట్టాలి. చదివిన ప్రతి అంశాన్ని ఒక చిన్న నోట్ బుక్లో పాయింట్ల వారీగా రాసుకోవాలి. ఫార్ములాలు, ముఖ్యమైన తేదీలు, కీ వర్డ్స్ కోసం మైండ్ మ్యాప్స్ ఉపయోగిస్తే చివరి నిమిషంలో రివిజన్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ప్రశ్న పత్రాల సాధన ప్రస్తుత ఏడాదిలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను రివిజన్ చేసుకోవాలి. వాటిని నిర్ణీత సమ యంలో (3 గంటల్లో) రాయడానికి సాధన చేయాలి. దీనివల్ల సమయ నిర్వహణ అలవడుతుంది. మోడల్ పేపర్లు రాసిన తర్వాత, ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో విశ్లేషించుకుని సరిదిద్దుకోవాలి. పరీక్ష హాలులో పాటించాలి తొలి 15 నిమిషాల సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష మొదలవడానికి ముందు ప్రశ్న పత్రం చదువుకోవడానికి ఇచ్చే 15 నిమిషాల సమయం విలువైంది. ఇందులో పేపర్ మొత్తాన్ని ఒకసారి చదివి, బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా గుర్తించాలి. జవాబు పత్రం చూడగానే దిద్దే ఉపాధ్యాయుడికి మంచి అభిప్రాయం కలగాలి. రెండు జవాబుల మధ్య సరైన గ్యాప్ వదలడం, ముఖ్యాంశాలను అండర్ లైన్ చేయడం, అవసరమైన చోట కొట్టి వేతలు లేకుండా రాయడం అలవర్చుకోవాలి. ఏ సెక్షన్కు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ఒక అంచనాతో ఉండాలి. ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోయి సమయం వృథా చేయకూడదు. రాని ప్రశ్నలను చివర్లో ఆలోచించి రాయాలి. షీట్లో వివరాలు నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బబ్లింగ్ చేసేటప్పుడు హడావుడి పడకూడదు. అడిషనల్ షీట్స్ తీసుకుంటే వాటికి నంబర్లు వేసి దారం గట్టిగా కట్టాలి. ఆరోగ్యం , తల్లిదండ్రుల పాత్ర పరీక్షల సమయంలో నిద్ర వాయిదా వేసుకోకూడదు. పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీ పడుతూ నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర మెదడును చురుకుగా ఉంచుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమైనది. ఈ సమయంలో పిల్లలపై మార్కుల ఒత్తిడి తీసుకురాకూడదు. ఇతరులతో పోల్చి వారి ఆత్మన్యూనతను పెంచకూడదు. ‘నువ్వు చేయగలవు, ఎంత వస్తే అంత రాయ్, మేమున్నాం’ అనే భరోసా ఇస్తే పిల్లలు రెట్టించిన ఉత్సాహంతో పరీక్షలు రాస్తారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు (న్యాయవిభాగం): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్లు ఏర్పాటు చేయగా చిత్తూరులో ఐదు బెంచ్ల ద్వారా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులు, బీమా సంస్థలు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సహకరించాలని కోరారు. జాతీయ స్థాయి ఆదర్శ పంచాయతీగా నాయనూరు కుప్పం: జాతీయ స్థాయిలో ఆదర్శ పంచాయతీగా కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీ ఎంపికై ంది. దీనికి గాను కేంద్ర అధికార బృందం నాయనూరు పంచాయతీలో శుక్రవారం పర్యటించింది. గత ఐదేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయనూరును పంచాయతీ కేంద్రంగా విభజన చేసింది. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. దీంతో ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధి జాతీయ స్థాయిలో మెరిసింది. ఏప్రిల్లో అవార్డు ప్రదానం చేయనున్నట్టు అధికార బృందం పేర్కొంది. -
అతివకు ఆదర్శం
చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహితీవనంలో తనదైన ముద్ర వేసిన తొలి తెలుగు కవయిత్రి, ఆతుకూరి మొల్ల మహిళా సాధికారతకు నిలువుటద్దమని డీఆర్వో మోహన్ కుమార్ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్తో పాటు పీవీకేఎన్, సావిత్రమ్మ ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో కవయిత్రి మొల్ల జయంతి ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మొల్ల విగ్రహానికి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. తెలుగు సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన తొలి తెలుగు కవయిత్రి, భక్త శిఖామణి ఆతుకూరి మొల్ల అని అన్నారు. ఆమె నేటి తరానికి, ముఖ్యంగా మహిళా లోకానికి గొప్ప ఆదర్శప్రాయురాలని కొనియాడారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల, సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ నాటి సామాజిక పరిస్థితులను అధిగమించి సాహిత్యం వైపు అడుగులు వేశారని ఆయన గుర్తుచేశారు. ఆమె రచించిన రామాయణం పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా సరళమైన, స్వచ్ఛమైన తెలుగులో ఉండటం వల్లే కాలపరీక్షను తట్టుకొని నిలిచిందన్నారు. నేటి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, తమలోని సృజనాత్మకతను వెలికితీసి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రబ్బానీ భాషా, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రాయలసీమ కుమ్మరి యూత్ సెక్రెటరీ హరిప్రసాద్, హరి బాబు, చలపతి, సోమశేఖర్ పలువురు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య సౌరభం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొల్ల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల ఒక అద్వితీయమైన స్థానాన్ని ఆక్రమించారని కొనియాడారు. తెలుగు భాషా సాహిత్య సంపదలో ‘మొల్ల రామాయణం’ ఒక ఆభరణం వంటిదని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు చెన్నకేశవులు, జయచంద్రుడు, గోపీనాయక్, జ్యోత్స ్న, నిరోషా, బాలకృష్ణా, సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు. సుందరకాండకు సాహితీ నీరాజనం... తెలుగు సాహిత్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన తొలి తెలు గు కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలు సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న తెలుగు అధ్యాపకులు డాక్టర్ జి. ధర్మమూర్తి మాట్లాడుతూ.. మొల్ల సాహిత్య ప్రతిభను విద్యార్థులకు వివరించారు. మొల్ల రచించిన రామాయణంలో సుందరకాండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అద్భుతమైన గ్రంథంగా తీర్చిదిద్దారని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి, అధ్యాపకులు శివశంకర్ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో చంద్రశేఖర్ (69) అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. బంగారుపాళ్యం మండలం మొగిలిమిట్టూరుకు చెందిన చంద్రశేఖర్కు మానసిక సమస్యలున్నాయి. గతనెల హైదరాబాదులో ఉన్న తన కుమారు డు మురళి వద్దకు వెళ్లాడు. 24వ తేదీన హైదరాబాదు నుంచి చిత్తూరుకు రైలులో తన తండ్రిను మురళి ఒంటరిగా పంపించాడు. ఆ మరుసటిరోజు తన తండ్రి ఇంటికి వచ్చాడా..? అని ఆరాతీస్తే రాలేదని తెలిపారు. అప్పటి నుంచి చంద్రశేఖర్ కోసం అతని కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. శుక్రవారం మధ్యా హ్నం చిత్తూరు నగరంలోని పట్రాంపల్లె వద్ద ఓ వృద్ధుడు పొలాల్లో పడుంటే.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబరుకు సంప్రదిస్తే మురళీ ఘటనా స్థలానికి వచ్చి చూసి, తన తండ్రి చంద్రశేఖర్గా గుర్తించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కవయిత్రి మొల్లకు నివాళులు చిత్తూరు అర్బన్: తెలుగు తొలి మహిళ కవయి త్రి ఆతుకూరి మొల్లకు చిత్తూరు పోలీసు శాఖ నివాళులర్పించింది. మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరులోని పోలీసు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఏ ఆర్ ఏఎస్పీ దేవదాసు , డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మైనార్టీ భవన నిర్మాణానికి కృషి చిత్తూరు కలెక్టరేట్: త్వరలో మైనార్టీ భవనాన్ని నిర్మించడానికి స్థల సేకరణ కార్యక్రమం వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్కుమార్ గాంఽధీ పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం తరఫున శుక్రవారం ఇఫ్తార్ విందును ఇచ్చారు. కార్యక్రమాన్ని స్థానిక ఉర్దూషాదీ మందిర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ నగర మేయర్ అముద పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నగరంలో షాదిఖానా నిర్మించడానికి స్థల సేకరణ చేస్తామని తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నా రెడ్డి, ఈడీ మైనారిటీ ఆర్థిక సంస్థ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఫిజికల్ సైన్సు ఇలా..
● మొదట 8 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, తర్వాత 2 మార్కుల, 1 మార్కు ప్రశ్నలు స్పష్టంగా రాయాలి ● 8 మార్కుల ప్రశ్నలు రాసేందుకు బ్లూప్రింట్ పరంగా ముఖ్యంగా మానవుడి కన్ను, రంగుల ప్రపంచం, రసాయనిక చర్యలు, సమీకరణలు, విద్యుత్తు ప్రవాహం, అయస్కాంత ఫలితం, విద్యుత్, కార్బన్ సమ్మేళనాలు, లోహాలు, ఆలోహాలు పాఠాలను క్షుణ్ణంగా చదవాలి ● 4 మార్కుల ప్రశ్నలకు ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, కాంతి పరావర్తనం చదవాలి. వీటి నుంచే చిత్రపటాలు, రేఖా చిత్రాలు వస్తాయి ● అలాగే ఎఫ్ఏ పరీక్షలు,, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్టు ప్రశ్నపత్రాలను సేకరించి సన్నద్ధం కావాలి. – గంటామోహన్, స్కూల్ అసిస్టెంట్ -
తెలుగు అభ్యసన ఇలా..
● అవగాహన, ప్రతిస్పందన విభాగంలో అడిగే ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో జవాబులు రాయాలి. ● పద్యభాగం, గద్య భాగం, ఉపవాచకాల నుంచి వచ్చే లఘు, వ్యాస రూప సమాధాన, సృజనాత్మక ప్రశ్నలకు వాటి స్వభావం మేరకు తగిన విధంగా జవాబులు స్పష్టంగా రాయాలి. ● భాషాంశాలకై పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉన్న అభ్యాసాలు, పుస్తకం చివరలోని పదవిజ్ఞానం, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి–వికృతి పదాలను అవలోకనం చేసుకోవాలి. ● బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అ, ఆ, ఇ, ఈ ఐచ్ఛికాలలో సమాధానాన్ని గుర్తించడంతో పాటు సంబంధిత పదాలు కూడా రాయాలి. ● చక్కని దస్తూరీతో పాటు విరామ చిహ్నాలు పాటిస్తూ, అక్షర దోషాలు లేకుండా చూపుకోవాలి – చండ్ర నరేష్, తెలుగు ఉపాధ్యాయుడు -
బాధిత రైతులకు పంట నష్ట పరిహారం
గుడిపాల: ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందజేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మురళి తెలిపారు. ఆయన గురువారం అటవీశాఖ, ఉద్యా నవనశాఖ అధికారులతో కలిసి ముత్తువాళ్లూ రు గ్రామంలో ఏనుగుల దాడుల్లో దెబ్బతిన్న మామిడి, అరటి, వరి పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటల వివరాలతో నివేదికను కలెక్టర్కు అందజేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, కచ్చితంగా నష్ట పరిహా రం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టాభి, డీఆర్ఓ కరణ్సింగ్, ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్, వ్యవసాయాధికారి సంగీత, ఉద్యానశాఖాధికారి ప్రవీ ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు డిల్లీరాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
హిందీ సబ్జెక్టు ఇలా..
● ప్రశ్నపత్రంలోని మొదటి బాగంలో 35 మార్కులకు గాను పాసేజ్ పశ్నలు, కవి పరిచయం, రచయిత పరిచయం అడుగుతారు. వీటిని సమాధానం పరచడం సులభం. ప్రశ్నలలోని మూల పదాలను వెతికితే సమాఽధానాలు పొందవచ్చు ● పద్యభాగంలోని 4 దోహా (పద్యాలు)లను నేర్చుకుంటే ఇతర చిన్న ప్రశ్నలను నేర్చుకోవాల్సిన అవసరముండదు ● స్వరాజ్యకీ నీవ్, అంతర్రాష్ట్రీయ్ స్తర్ పర్ హిందీ, దక్షణీ గంగా, గోదావరి నుంచి లఘు ప్రశ్నలను అడిగే అవకాశముంది ● ఉపవాచకంలో దో కళాకార్లోని ప్రశ్నలన్నీ నేర్చుకుంటే చాలు ● పద్యభాగంలో బరస్తేబాదల్, కణ్ కణ్కా అధికారి సారాంశాలను నేర్చుకోవాలి. గద్యభాగంలో ఈద్గాహ్, లోక్ గీత్ పాఠ్యాంశాలను అభ్యసించాలి. ● లేఖలో చుట్టీప్రత్ , పుస్తక్ వికేత్ర కేశాయ్,కేపత్ర్, పితాజోకోపత్ర్ నేర్చుకుంటే మంచిది, నిబంధ్లో రాష్ట్ర భాష హిందీ, ప్రియత్యౌహార్, స్వచ్చభారత్, పర్యావరణ ప్రదూషణ్, పుస్తకాలమ్, విజ్ఞాన సెలభ్హానీ మొదలైనవి నేర్చుకుంటే మంచిది, – సుధాకర్, స్కూల్ అసిస్టెంట్


