Chittoor District News
-
సంజీవనిపై వైద్య సిబ్బందికి శిక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సంజీవని ప్రాజెక్ట్పై రీఓరియంటేషన్ శిక్షణతో పాటు మాతా–శిశు ఆరోగ్యంపై శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి, సీఎంసీ సంజీవని ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ తపన్ పాల్గొని వైద్యాధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలను వివరించారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సేవలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే సంజీవని ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. పేషెంట్ కేర్ సెంటర్ వద్ద ఆధార్ ఐడీ, మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ నుంచి అన్ని వైద్య సేవల వివరాలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా అపాయింట్మెంట్లు, స్పెషలిస్ట్ సేవలు, ఇంటి వద్ద అత్యవసర చికిత్స, రిమైండర్ సేవలు అందజేస్తామన్నారు. సంజీవని ప్రాజెక్టుపై ఈ నెల 21న కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్వోలకు విస్తృత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ను సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం మాతా శిశు ఆరోగ్యంపై సమీక్ష చేపట్టారు. గర్భిణుల తక్షణ నమోదు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, అవసరమైన పరీక్షలు, టీనేజ్ గర్భిణుల పర్యవేక్షణపై పలు సూచనలు చేశారు. అన్ని ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరగాలని, సమయానికి టీకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ను 100 శాతం పూర్తి చేసి యూవిన్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. -
చట్టాలపై అవగాహనతోనే న్యాయం
చిత్తూరు అర్బన్: దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చి న బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలపై జడ్జీలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే కక్షిదారులకు న్యాయం అందుతుందని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్ నినాల జయసూర్య తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చిత్తూరు, మదనపల్లె, తిరుపతి లోని జడ్జీలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన న్యాయాధికారులు కేసుల విచారణ, సాక్ష్యాల నమోదు, కక్షిదారులకు న్యాయం జరగాలంటే కొత్త చట్టాలపై పట్టు ఉండాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడు తూ ఐపీసీ–బీఎన్ఎస్ మధ్య సంబంధం, కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్లు, రద్దు చేసిన అంశాలు, పోక్సో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితర అంశాలపై చర్చించారు. రిసోర్స్ పర్సన్లు రిటైర్డు జిల్లా జడ్జీలు విరూపాక్ష దత్తాత్రేయ గౌడ, కృష్ణయ్య పలు అంశాలను వివరించారు. జడ్జీలు రమేష్, శ్రీదేవి, భారతి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలదే కీలకపాత్ర చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలదే కీలకపాత్ర అని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన రెండు రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. డీఈవో మాట్లాడుతూ పాఠశాల అంటే వందలాది మంది పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దే దేవాలయమన్నారు. అనంతరం హెచ్ఎంల సంఘం రూపొందించిన ప్రత్యేక హ్యాండ్ బుక్ను హెచ్ఎంలకు అందజేశారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, రిసోర్స్పర్సన్లు చెంగల్రాజు, గిరిరాజా, హేమాద్రి, రమేష్ పాల్గొన్నారు. -
ఏపీఐఐసీకి 10.33 ఎకరాల భూమి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని తేనేబండ రెవెన్యూలో ఇరువారం–చెర్లోపల్లి బైపాస్ మధ్య 10.33 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలాన్ని ఎస్టీల హబ్గా తీర్చిదిద్దాలని జిల్లా అధికారు లు భావించారు. చదును చేసే పనులు ప్రారంభించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఎకరా భూమి రూ.కోటి వరకు పలుకుతోంది. దీంతో కొందరు ఎస్టీల పేరుతో కొట్టేయాలని చూశారు. బినా మీలను ముందస్తు బుకింగ్ చేయించుకున్నారు. రూ.3 లక్షలు ఉంటే భూమి తీసిస్తామని ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ విషయం ఆనోటాఈ నోటా పడి కలెక్టర్కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మారిన ప్లానింగ్ దళారుల దందాను పసిగట్టిన అధికారులు ప్లాన్ను మార్చేశారు. ఈ భూమిని కమర్షియల్గా మార్పు చేస్తూ ఏపీఐఐసీకి అప్పగించారు. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా భూమిని రూ.కోటిగా ధర ప్రకటించారు. ఈ భూమిని విలువను, రోడ్డు వసతిని ఒక కంపెనీ గుర్తించింది. రెవెన్యూ అధికారులు ప్రణాళికలను వేగవంతం చేసి ఏపీఐఐసీకి ద్వారా ఆ కంపెనీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలో ఈ భూమి మొత్తం ఈస్ట్ మెన్ కంపెనీ చేతికి వెళ్లనుందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే 2,500 మందికి ఉపాధి దొరుకుతుందని రూరల్ తహసీల్దార్ కల్యాణి పేర్కొన్నారు. చిత్తూరు తేనెబండ రెవెన్యూలో ఎస్టీల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎస్టీలను కొంత మందిని ఓ చోటకు తీసుకొచ్చి వారి అభివృద్ధికి బాట లు వేయాలనుకుంది. వారికి స్థలం కేటాయించి వసతులు కల్పించాలని భావించింది. ఈ మేరకు 10.33 ఎకరాల భూమిని చదును చేసింది. స్థలం విలువ తెలుసుకున్న కొంతమంది దళారులు దాన్ని స్వాహా చేయాలని చూశారు. ఈ విషయం కల్టెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్లాన్ మారింది. ఆ భూమిని ఏపీపీఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. -
చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
వెదురుకుప్పం: ప్రతిపక్షాలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా చరిత్ర హీనులుగా మిగిలిపోయినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు 50 శాతం రిజిర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళలను ఘోరంగా అవమానించారని చెప్పారు. మహిళల ఓట్లు కావాలని, చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించకూడదా అని ప్రశ్నించారు. 2023లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో పదవులు, నామినేటెడ్ పదవులు, సంక్షేమ పథకాల అమలులోనూ మహిళలకు పెద్ద పీట వేసినట్టు చెప్పారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు భారీ గా నష్టపోయే ప్రమాదముందని నారాయణస్వామి తెలిపారు. 2011 జనాబా ప్రాతిపదికన తీసుకుంటే మరింత నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నది అందరి అభిమతమన్నారు. డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతాయనే ఆశాభావం ఉన్నప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ప్రతిపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయని, కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను అజెండాలో పెట్టి ఉంటే భాగుండేదన్నారు. మహిళలకు చంద్రబాబు దగా మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా నోరుమెదపడం లేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని మహిళలు గమనించాలన్నారు. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని మహిళా పక్షపాతి అంటున్నాడని, తెలంగాణలో మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్తో చీకటి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. ఆలాగే రెండేళ్లు కావస్తున్నా ఒక్క మహిళకు కూడా సెంటు ఇంటి స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా మహిళలపై ఉన్న ప్రేమ అని ఎద్దేవా చేశారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీలు భవిష్యత్లో మనుగడ అసాధ్యమన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లోనూ చైతన్యవంతులు అయితేనే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. -
సెకండియర్లోనూ ఇంప్రూవ్మెంట్
చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ సెకండియర్లోనూ ఇంప్రూవ్మెంట్కు అవకాశం కల్పించినట్టు ఇంటర్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2026 మార్చి పరీక్షల్లో రెండో ఏడాది పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ప్రథమ సంవత్సరం తరహాలో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చన్నారు. విద్యార్థులు రాసిన పేపర్లలో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే తుది ఫలితాల్లో పరిగణలోకి తీసుకుంటారన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణులైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అర్హులన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం లేదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తాము పాస్ అయ్యే వరకు ఎన్ని సబ్జెక్టులకై నా పరిమితి లేకుండా హాజరుకావచ్చన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి రూ.600, రెండు సంవత్సరాలకు కలిపి హాజరయ్యేవారు రూ.1200 చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజుతో పాటు ఇంప్రూవ్మెంట్ రాసే ప్రతి సబ్జెక్టుకూ అదనంగా రూ.160 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు ఉపయోగించిన పాత రిజిస్ట్రేషన్ నంబర్తోనే దరఖాస్తు చేసుకోవాలని డీఐఈవో తెలిపారు. -
ఆమెదే నిర్ణయాధికారం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. జాబితాలను పంచాయతీ కేంద్రాలు, సచివాలయాల్లో పెట్టారు. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించారు. ఈ ఓటర్ల జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. నిర్ణేతలు మహిళలే! జిల్లాలో 27 మండలాలు, 623 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 5,914 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్లు 10,26,821 మంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది. 11,388 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. వాటిలో జీడీనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పురుషులు 18,368 మంది, మహిళలు 18,232 మంది, కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లెలో పురుషులు 17,824 మంది, మహిళలు 17,719 మంది, కుప్పంలో పురుషులు 29,355 మంది, మహిళలు 29,000 మంది, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో పురుషులు 21,990 మంది, మహిళలు 21,964 మంది ఉన్నారు. మిగిలిన 23 మండలాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో ట్రాన్స్జెండర్ల సంఖ్య 27గా గుర్తించగా అందులో కుప్పంలో 8 మంది ఉన్నారు. బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, పులిచెర్ల, పూతలపట్టు, ఎస్ఆర్పురం, తవణంపల్లె, వెదురుకుప్పం, యాదమరి, గుడు పల్లె, రామకుప్పం, కార్వేటినగరంలో ఒకరు, ఇద్దరు ఉన్నారు. జాబితా విడుదలకు ముందు అధికారులు ఓటర్ల మ్యాపింగ్ కూడా చేపట్టారు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ వారిదే పైచేయి. ఈ ఓటరు జాబితాను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.స్థానికంలో మహిళా ఓటర్లే అధికం -
లంచాల్లో నం.1!
చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారితో పాటు కొందరు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారికి స్థానచలనం కల్పించి చేతులు దులుపుకున్నా పరిస్థితి మారలేదు. ఇప్పుడు ఏకంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అవినీతి ఆరోపణలపై సస్పెండ్కు గురవడం జిల్లా పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. తీరు మారదా? చిత్తూరు నగరంలోని కట్టమంచిలో గత ఏడాది ఓ దొంగతనం జరిగింది. దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, నివేదిక తెప్పించుకున్నారు. కానీ విచారణలో ఏం తేలిందనే విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. కేవలం ఓ అధికారిని మాత్రం వీఆర్కు పంపించారు. ఆర్నెళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల స్టేషన్లో పనిచేస్తున్న ఓ హోంగార్డును సొంత పనులకు పంపించారనే ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ను వీఆర్కు తీసుకున్నారు. ఈ వ్యహారంలో ఇన్స్పెక్టర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి హెడ్ కానిస్టేబుల్ను బలిపశువును చేశాడనేది స్టేషన్ సిబ్బంది ఆవేదన. ఫలితమివ్వని వాస్తు మార్పులు వన్టౌన్ స్టేషన్లో పనిచేసే ఒకరిద్దరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సిబ్బందిని వాడుకున్నారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ పనిచేసే మిగిలిన వాళ్లు నలిగిపోతున్నారు. అధికారులు చెప్పిన పనులు చేస్తూ.., వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇతర సిబ్బందిపై తప్పుడు మాటలు చెప్పడం, స్టేషన్లో జరిగే విషయాలను నేతలకు ఉప్పందించడం లాంటి విమర్శలు ఎదుర్కొనేవాళ్లు బాగానే ఉన్నారని.. ఏమీ తెలియని తమపై ఒత్తిడి పెరుగుతోందని పలువురు వాపోతున్నారు. అయితే గతంలో జరిగిన ఘటనలకు దృష్టిలో పెట్టుకున్న ఇన్స్పెక్టర్ ఈశాన్యంలో బరువు ఉండటమే దీనికి కారణమని భావించి, పలు తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను ఈశాన్యం నుంచి తీయించి, మరోవైపుకు మార్చారు. తన సీటును ఉత్తరంవైపు కాకుండా తూర్పువైపు పెట్టుకున్నారు. కానీ మారాల్సింది తప్పుచేసే వాళ్ల బుద్ధి అని గుర్తించలేకపోయారు. వివాదాలకు కేంద్రంగా చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటా.. రెండా..? -
4 టన్నుల గంజాయి కాల్చివేత
ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం .. జీఎస్టీతో భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేశారని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎస్వీయూ ఆచార్య సవరయ్య తెలిపారు. మహిళా పక్షపాతి జగనన్న మహిళా పక్షపాతి జగనన్న అని చిత్తూరు వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026దొరికితేనే దొంగ..లేకపోతే దొర అన్న చందంగా తిరుపతి, చిత్తూరు జిలాల్లో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మన్యంలో పండిస్తున్న గంజాయి ఘాటు జిల్లాను కుదిపేస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో సాగు చేస్తున్న గంజాయి విశాఖ నుంచి రేణిగుంటకు చేరవేస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనికితోడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కళాశాలల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి గుట్టు. రేణిగుంట: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కిలోల గంజాయిని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేణిగుంట మండలంలోని తూకివాకం వద్ద ఉన్న సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా కరెంట్ యంత్రం ద్వారా కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి, ఐజీ ర్యాంక్ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి, ఇతర డ్రగ్స్పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో గత రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సీజ్ అయిన గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకుని డిస్పోజ్ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం బెంగళూరు, చైన్నెకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తిరుపతికి వచ్చి, ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీలను పెట్టి రైళ్లు, బస్సులు, లగేజీలను పరిశీలించి చేసి సీజ్ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభయహస్తం శక్తి యాప్ చిత్తూరు కలెక్టరేట్ : శక్తి యాప్ ఆపదలో అభయహస్తం అని మహిళా స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో మహిళల భద్రత, చట్టా లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలు, పిల్ల ల భద్రతే పరమావధిగా పోలీసు శాఖ అడుగులు వేస్తోందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్ ద్వారా పోలీసులకు తక్షణమే సమాచారం ఎలా పంపాలి అనే అంశం పై ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాన్ని అధిగమించాం చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా మైనింగ్ శాఖ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన ఆదా య లక్ష్యాన్ని అధిగమించిందని ఆ శాఖ డీడీ సత్యనారాయణ పేర్కొన్నారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జిల్లాకు మొత్తం రూ. 196.05 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.195.67 కోట్ల మేర వసూళ్లు సాధించి 99.81 శాతం ప్రగతి నమోదు చేసినట్లు తెలిపారు. డివిజన్లన్వారీగా చూస్తే, చిత్తూరు డివిజన్న్లో రూ.145.52 కోట్ల లక్ష్యానికి గాను రూ.150.33 కోట్లు వసూలు చేసి 103.31 శాతం సాధించినట్టు తెలిపారు. అదే సమయంలో పలమనేరు డివిజన్లో రూ.50.53 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.45.34 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలిపారు. భవిష్యత్లో మిగిలిన లోటు ను భర్తీ చేసేందుకు చర్యలు చేపడ తామని తెలిపారు. వివరాల నమోదు తప్పనిసరి చిత్తూరు కార్పొరేషన్: కార్మిక బీమా పథకంలో నమోదైన అర్హులైన భవననిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మికశా ఖ కమిషనర్ ఆలోచన తెలిపారు. ఇదివరకే నమోదైన వారు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న నాలుగు పథకాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నమన్నారు. వివాహ బహుమతి, ప్రసూతి ప్రయోజన పథకం తదితర పథకాలను 2026 మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు చిత్తూరు ఎఎల్ఓ–1 రాజయ్య 9492555223, చిత్తూరు ఎఎల్ఓ–2 ఆనందబాబు 9492555224, పుత్తూరు, పుంగనూరు ఎఎల్ఓ మధుబాబు 9492555225 నంబర్లను సంప్రదించాలని కోరారు. సాక్షి, టాస్క్ఫోర్స్: ‘‘తిరుపతి జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న 35 పోలీస్ స్టేషన్లలో 208 కేసుల్లో గడచిన రెండు, మూడేళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు అక్షరాలా 4,098 కిలోలు. విస్తుగొలిపే ఈ అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే తిరుపతి జిల్లాలో యువత భవితను చిత్తు చేస్తున్న మత్తుపదార్థం గంజాయికి ఇది తార్కాణం. ఓ వైపు రాష్ట్ర పాలకులు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని గుక్కతిప్పుకోకుండా శపథాలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.’’ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం తిరుపతి, రేణిగుంటలకు వచ్చే గంజాయిలో సింహభాగం పక్క రాష్ట్రాలకు తరలించి, జిల్లాకు అవసరమైన సరుకును వేరు చేసి, ఇక్కడ నియమించుకున్న టీములు ద్వారా పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాలలతోపాటు హాస్టళ్లు, పీజీల వద్దకు చేరుకుని చిన్నపాటి కవర్లలో నింపిన గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. అలాగే హోటళ్లలో బస చేసే యాత్రికులకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లెక్కకు మించి ఎల్లలు దాటుతున్న గంజాయి తిరుపతికి చేరే గంజాయిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటేనే కేవలం నాలుగు డివిజన్లలోనే నాలు గు టన్నుల గంజాయి పట్టుబడి కోర్టు అనుమతితో గంజాయిని కాల్చివేశారు. అయితే పోలీసులకు, ఇతర నిఘా వ్యవస్థకు చిక్కకుండా ఎల్లలు దాటుతున్న గంజాయి ఏ మేరకు అక్రమ రవాణా జరుగుతుందో ఊహాతీతం. పుణ్యక్షేత్ర జిల్లాగా పేరుగాంచిన తిరుపతి జిల్లాను దాటాకే దక్షిణాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా అయ్యేది. గంజాయి మత్తులో పెరుగుతున్న అకృత్యాలు, దాడులు గంజాయి మత్తుకు అలవాటుపడిన ఆకతాయిల అకృత్యాలు జిల్లాలో నిత్యకృతమయ్యాయి. ఇటీవల రేణిగుంటలో ఓ యువకుడు గంజాయి మత్తులో మటన్ కత్తితో పట్టపగలు నడిబజార్లో తన గొంతు తానే కోసుకుంటూ భయాందోళన రేకెత్తించాడు. రేణిగుంట పట్టణంలో స్థానిక యువకులు కూడా కొందరు గంజాయి మత్తుకు బానిసై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం గంజాయి అక్రమ రవాణా చేసే ప్రధాన ముఠాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చటం కష్టసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జికి పచ్చజెండా డీఎల్డీవో ఆకస్మిక తనిఖీ పెద్దపంజాణి: పలమనేరు డివిజినల్ పంచాయతీ అధికారి రామచంద్రయ్య శుక్రవారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా లింగాపురం, రాజుపల్లి పంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. చెత్త సేకరణ, ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి గ్రామస్తులకు వివరించారు. లింగాపురం సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తదుపరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జన గణనలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా స్వీయ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్ రామ్మూర్తి, ఎంపీడీవో బాలాజీ, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి, ఏఎస్వో ఆయేషా, ఫీల్డ్ ట్రైనర్స్ గురుప్రసాద్, బాలాజి, పీఎస్ రిజ్వానా, వీఆర్వో కృష్ణంరాజు పాల్గొన్నారు. 21 విద్యుత్ సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 59, సర్వీసు లైన్ 3 కలిపి మొత్తం 96 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అందులో 21 సమస్యలను పరిష్కారించామని, మిగిలిన వాటి పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు వెల్లడించారు. కొను గోల్మాల్! సాధారణంగా ఏదైనా ప్రభుత్వశాఖలో ఫర్నిచర్ కొనుగోలు ప్రక్రియలో రూ.5 లక్షలు దాటితే కచ్చితంగా టెండర్ ప్రక్రియ నిర్వహించాలి. జిల్లాలోని 39 పాల్ ల్యాబ్స్కు ఫర్నిచర్ కొనుగోలుకు రూ.20 లక్షల బడ్జెట్ కేటాయించారు. జిల్లా సమగ్రశిక్షశాఖ అధికారులు కలెక్టర్కు ఫైల్ పంపి అనుమతి తీసుకోవాలన్న కనీస నిబంధన కూడా తుంగలో తొక్కారు. నిబంధనలను బ్రేక్ చేసి నేరుగా కాంట్రాక్టర్ ఖాతాలోకి ఫర్నిచర్ రాకముందే నిధులు జమచేసేశారు. ప్రజల కోసం రోజమ్మ పోరాటంతిరుపతి కేంద్రంగా గంజాయి సరఫరా అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాగవుతున్న గంజాయిని రైళ్లు, బస్సులు, లారీలు, వస్తు రవాణా మార్గాల మీదుగా తిరుపతికి నిత్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాల్లోని కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఓ పక్క నిఘా వ్యవస్థను పెంచి, గంజాయి అక్రమ రవాణా ఆనవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రైళ్లలో గంజాయి రేణిగుంటకు సరఫరా అవుతోంది. ఇక్కడ నుంచి చైన్నె, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. పుత్తూరులో ప్రతిపాదిత పనుల్లో చేర్చిన రైల్వే శాఖ -
వద్దే వద్దు!
చిత్తూరా.. చిత్తూరు కార్పొరేషన్: ‘చిత్తూరా.. వద్దే వద్దు’ అంటూ ట్రాన్స్కో ఉద్యోగులు మొండికేస్తున్నారు. 25 మంది ఉద్యోగులు ఇక్కడ సర్దుబాటుకు ఆమోదం తెలిపినా అందులో 16 మంది ఇంతవరకు చిత్తూరు ముఖం చూడడానికే ఇష్టపడడం లేదు. పోస్టు చిత్తూరుకు మంజూరైనా పని మాత్రం తిరుపతిలోనే చేస్తూ జీతం తీసుకుంటున్నారు. దీంత ఎస్ఈ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. జిల్లాల విభజన నేపథ్యంలో తిరిగి జిల్లా ట్రాన్స్కో స్వరూపం మారనుంది. గతంలో తిరు పతి కేంద్రంగా ఉమ్మడి జిల్లా పాలన జరిగేది. నవంబర్ 2024లో ట్రాన్స్కో జిల్లా పాలనను వేరుచేసి చిత్తూరులో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి పాలన సాగిస్తున్నారు. డివిజన్లు, సబ్డివిజన్లు, సెక్షన్లలో మార్పు చేపట్టారు. అందులో భాగంగా ఇక ఉద్యోగుల బదిలీలు సాగనున్నాయి. మొదట ఎస్ఈ కార్యాలయం, తదుపరి ఈఈ కార్యాలయాల పరిధిలోని ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ఈ నెలఖారులోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు బదిలీల ఆప్షన్ కోరారు. ఇందులో సీనియార్టీ ప్రతిపాదికన బదిలీలు నిబంధనల ప్రకారం నిష్పత్తి విధానంలో చేయనున్నారు. స్టోర్స్ కంట్రోల్ మారేనా? ఉమ్మడి జిల్లాకు చిత్తూరులోని స్టోర్స్ నుంచే విద్యుత్ పరికరాలు వెళ్తున్నాయి. ఒక సబ్డివిజన్కు పరికరాలు కావాలంటే ఆరోజు కోసం తిరిగి వేచి చూడాల్సిన పరిస్థితి. అలా కాకుండా అత్యవసరమైతే అనుమతితో సబ్డివిజన్లకు పరికరాలు ఇచ్చే విధంగా సరళతరం చేయాలి. స్టోర్స్ కంట్రోల్ తిరుపతి జిల్లా టెక్నికల్ ఈఈ పరిధిలో ఉంది. పరికరాలు పంపిణీ చేయాలంటే ఈఈ వచ్చి పరిశీలించి ఆమోదం తెలిపితే తదుపరి అందజేస్తున్నారు. ప్రతిసారీ అధికారి రావాలంటే ఆలస్యమవుతోంది. స్టోర్స్ ఎదురుగానే చిత్తూరు ఎస్ఈ కార్యాలయం ఉంది. ఇక్కడ ఉన్న టెక్నికల్ ఈఈకి పరిశీలన పవర్స్ ఇస్తే పంపిణీ వేగవంతమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రాన్స్కో ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్ గందరగోళం ప్రస్తుతం ట్రాన్స్కో జిల్లా స్వరూపం మారునుంది. అస్తవ్యస్తంగా జిల్లాను మార్పు చేశారు. గతంలో 40 సెక్షన్లు, 10 సబ్ డివిజన్లు, 3 డివిజన్లు ఉండేవి. ఇప్పుడు 34 సెక్షన్లు, 8 సబ్డివిజన్లు, 2 డివిజన్లుగా విభజించారు. చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలు వస్తాయి. ఇప్పుడు అధనంగా కల్లూరు, రొంపిచెర్లను చేర్చారు. అదేవిధంగా చిత్తూరు రూరల్ పరిధిలో జీడీనెల్లూరు నియోజకవర్గం, నగరి ఉండేవి. ప్రస్తుతం పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు చేరనున్నాయి. పుంగనూరు అన్నమయ్య జిల్లాకు వెళనుంది. ప్రస్తుతం చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పుంగనూరు డివిజన్లు జిల్లా పరిధిలో ఉన్నాయి. కొత్తగా చేసిన మార్పు వల్ల వినియోగదారులు అవస్థలు పడనున్నారు. -
మామిడి తోటలో దౌర్జన్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తవణంపల్లి మండలంలో భూ వివాదం దౌర్జన్యానికి దారితీసింది. సర్వే నంబర్ల సాక్షిగా ఉన్న అస్తులను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా కూల్చివేశారు. ఈ సమస్యను బాధితుడు కృష్ణమూర్తినాయుడు శుక్రవారం ఆర్డీవో శ్రీనివాసులుకు విన్నవించుకుని కన్నీరు మున్నీరయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి తహసీల్దార్ అండదండలతోనే అక్రమాలు జరిగాయన్నారు. తనకు తవణంపల్లి మండలం ఎం.కృష్ణాపురం గ్రామంలో సర్వే నం.78/2,77/2,60/2లో మామిడి తోపు ఉందన్నారు. ఈ తోపు చుట్టూ రక్షణగా రాతి కూసాలతో కంచెను, ప్రధాన గేటును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తోటలోనే ఒక ఇల్లు, కసువు పందిరి ఉందన్నారు. సతీష్నాయుడు, మధుసూదన్నాయుడు అనే వ్యక్తులు మరికొందరితో కలిసి కంచె, ఇళ్లును దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. సెటిల్మెంట్ స్థలంలో ఉన్న తమ ఆస్తులను కూల్చే హక్కు ఎవరికీ లేదన్నారు. కంచెతో పాటు ఏళ్లనాటి చింతమానులను సైతం నేలమట్టం చేశారన్నారు. దీని వెనుక తవణంపల్లి తహసీల్దార్ ప్రోద్భలం ఉందన్నారు. దౌర్జాన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
పలమనేరులో బుల్లెట్ ట్రైన్ ఆగాల్సిందే!
పలమనేరు: పలమనేరు పట్టణంలో బుల్లెట్ ట్రైన్ ఆగేదాకా ఉద్యమం ఆపబోమని స్థానిక పలమనేరు పరిరక్షణ సమితి(పీపీఎస్) నిర్వాహకులు హెచ్చరించారు. వారు శుక్రవారం పలమనేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీపీఎస్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ పలమనేరు ప్రాంతానికి చెందిన వేలాదిమంది బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు ప్రతిరోజూ వివిధ వాహనాల్లో వ్యయప్రయాసలు పడుతూ బెంగళూరు వెళుతున్నారని తెలిపారు. పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పెడితే ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, చైన్నె–మైసూరు బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పలమనేరులో పెట్టాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు, ప్రజాసంఘాలు, కులసంఘాల ప్రతినిధులు, ఏపీ ఎన్జీవోలు పాల్గొన్నారు. -
అక్కడ పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం
– ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’తో పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు చిత్తూరు అర్బన్: జిల్లాలో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా స్థానిక పోలీసులు, ఈగల్, ఎస్బీ సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 612 కేసులు నమోదు చేసి రూ.69,500 జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. గత ఏడాది 1901 కేసులు నమోదు చేసి రూ.2.77 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ముఖ్యంగా విద్యార్థులు అలవాటు పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోట్పా చట్టం–2003 ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పొగాకు విక్రయాలను నిలిపివేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ – పలమనేరు ఇరిగేషన్శాఖలో రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం పలమనేరు: పట్టణంలోని ఇరిగేషన్శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని పనులకు సంబంధించి మామూళ్లు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ను తిరుపతి ఏసీబీ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కార్యాలయంలో సిబ్బంది మొదలు డీఈ దాకా ఇరిగేషన్ సంబంధిత పనులను అక్రమంగా నిర్వహిస్తూ దోపిడీ చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు బాధితుడు డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కాగా సీనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. నాణ్యత పాటించాలి చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. శుక్రవారం ఆయన వసతి గృహ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో పురోగతి చూపాలన్నారు. నాణ్యతలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్ణీత గడువు లోపు పనులను పూర్తి చేయాలన్నారు. గదుల్లో వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా ఉండడంతో పాటు ఇతర మౌలిక వసతులు సమృద్ధిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
మహిళా పక్షపాతి జగనన్న
చిత్తూరు కార్పొరేషన్: మహిళా పక్షపాతి జగనన్న అని స్థానిక వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి సతీమణి ఇందుమతి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. రాష్ట్రంలో మహిళను తొలిసారిగా ఉపముఖ్యమంత్రి, హోంమంత్రిని చేసిన ఘనత వైఎస్ జగనన్నదేనన్నారు. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ముద్రించారన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిణిరెడ్డి, లీనారెడ్డి, అంజలిరెడ్డి, సరళమేరీ, భాగ్యలక్ష్మి, రేఖ, ప్రతిమ, కౌసర్, సల్మా, బింధు, పూంగొడి, పద్మరెడ్డి, ముబీనా పాల్గొన్నారు. -
పది నిమిషాల సమయం.. పదేళ్ల అభివృద్ధి
చిత్తూరు కలెక్టరేట్ : స్వీయ జనగణన ప్రక్రియలో పది నిమిషాల సమయం కేటాయిస్తే పదేళ్ల అభివృద్ధికి సహకరించినట్లేనని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టినట్టు వెల్లడించారు. పాత పద్ధతులకు భిన్నంగా సాంకేతికతను జోడించి పౌరులే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభించారన్నారు. స్వీయ జగనణన కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా చేపట్టేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాను మొత్తం 3,036 బ్లాకులుగా విభిజించామన్నారు. ప్రతి బ్లాక్లో 150 నుంచి 200 గృహాలు ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు 28,885 మంది ఎన్యుమరేటర్లు, 493 మంది సూపర్వైజర్లు విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని 27 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 1 నగరపాలక సంస్థ పరిధిలో 31 మంది అధికారులు నిరంతరం ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. ఈ నెల 30లోపు ఆన్లైన్ పోర్టల్లో ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మే 1 నుంచి 30 వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి స్వీయ జనగణను ధృవీకరించడంతో పాటు, నమోదు చేసుకోని వారి వివరాలు సేకరిస్తారన్నారు. వచ్చే ఏదాది రెండవ దశ జనాభా లెక్కల సేకరణ పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేసిన జీఎస్టీ
పుత్తూరు: జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేసిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎస్వీయూ ఆచార్య జి.సవరయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ సామాజిక శాస్త్రాల పరిశోధన సంస్థ (ఐసీఎస్ఎస్ఆర్) విభాగం వారి ఆర్థి క సహాయంతో గ్రామ, పట్టణ ప్రజల జీవితాలపై జీఎస్టీ సంస్కరణల ప్రభావం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఎకనామిక్స్ విభాగం వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సుకు తొలిరోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య సవరయ్య మాట్లాడుతూ జీఎస్టీ 2.0లో చాలా వస్తువుల ధరలు తగ్గడం ద్వారా ప్రజల కొనుగోలు పెరిగిందన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగం అడిషనల్ కమిషనర్ జే.వీ.ఎం.శర్మ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పన్ను చెల్లింపులు సులభతరమయ్యాయన్నారు. అనంతపురం సెంట్రల్ యూని వర్సీటీ అర్థశాస్త్ర విభాగం ఆచార్యులు డాక్రట్ ఎండీ బావయ్య మాట్లాడారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పన్ను శాతం తగ్గించడంతో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఎరువుల ధరులు తగ్గా యని తెలిపారు. అనంతరం జాతీయ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి సమర్పించిన 110 పరిశోధన పత్రా లు కలిగిన సంచికను అతిథులు ఆవిష్కరించారు. సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జీ.కోటేశ్వరయ్య, కన్వీనర్ టీ.నరసింహులు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల యూ నివర్సిటీలు, డిగ్రీ కళాశాలల పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
దళితులపై దాడులు అరికట్టండి చిత్తూరు : జీడీ నెల్లూరు నియోజకవర్గంలో తిష్టవేసి న సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యా యం చే యాలంటూ మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఎస్పీ తుషార్డూడీకి విన్నవించారు. ఈ మేరకు ఆయ న గురువారం ఎస్పీ కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభు త్వం వచ్చిన నాటి నుంచి దళితులపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని వాపోయా రు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడూ జీడీ నెల్లూరు నియోజకవర్గ చరిత్రలో జరగలేదని ఎస్పీకి వివరించారు. బాబు మృతిపై విచారణ జరిపించండి మండలంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు రామానాయుడుపల్లి బాబు కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో భూ వివాదంపై పొన్నస్వామికి గ్రామస్తులకు మధ్య వివాదం ఉండగా.. టీడీ పీ సానుభూతిపరుడైన పొన్నుస్వామికి అప్పటి తహసీల్దార్ పట్టా ఇవ్వడంతో వివా దం పెరిగిందన్నారు. పలుమార్లు బ్యానర్ చించివేత కేసులో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బాబు మృతి చెందాడన్నారు. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పై విచారం వ్యక్తం చేశారు. కార్వేటి నగరంలోని సమస్యలు కార్వేటినగరం మండలం, ముక్కరవారిపల్లి పంచాయతీలో వైఎస్సీర్సీపీ నాయకులు మురళీకృష్ణారెడ్డిపై టీడీపీకి చెందిన తిరుమలరెడ్డి భూ వివాదంలో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులను పిలిపించి దాడి చేసినట్టు నారాయణస్వామి గుర్తుచేశారు. రాతి కుసా లు విరిచి వేయగా కార్వేటినగర పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్టు చెప్పారు. అయితే దీనిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపా రు. గోపిశెట్టిపల్లి పంచాయతీలో భూ తగాదా విషయంలో వైఎస్సార్సీపీ సాను భూతిపరులపై దాడి చేయగా ఇరువర్గాలు ఇచ్చిన కేసులో టీడీపీ సానుభూతిపరులకు సానుకూలంగా కేసు నమోదు చేసి కౌంటర్ కేసు నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వ్యక్తిగత విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తానని మాజీ డెప్యూటీకి హామీ ఇచ్చారు. -
హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు పగడ్బందీగా లెక్కించా రు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1.41కోట్ల ఆదా యం వచ్చింది. బంగారం 32 గ్రాములు, వెండి1.420 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.8,449, నిత్యాన్న దా నం హుండీ ద్వారా రూ.1,45,499లు వచ్చింది. యూఎస్ఏవి 169 డాలర్లు, కెనడా 5 డాల ర్లు, ఇంగ్లాడ్ 110 పౌండ్స్, ఆస్ట్రేలియావి 75 డాలర్స్, సౌదీ 1,110 రియాల్స్ వచ్చాయి. చైర్మన్ మణినాయుడు, డీఈవో సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గణనాథుని సేవలో కరణం మల్లేశ్వరి
కాణిపాకం: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆమెకు అందజేశారు. దేవస్థానం ఈవో పెంచలకిషోర్, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ బాలాజీనాయుడు పాల్గొన్నారు. మేమింతే..మారం అంతే! -
ప్రశ్నించే గొంతుకను నిర్బంధించలేరు
కార్వేటినగరం: కూట మి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను గాలి కి వదిలేసి వైఫల్యాలను ఎత్తి చూపే ప్రజాగొంతుకను నిర్బంధించలేర ని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి ముందస్తు సమాచారం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి అమరావతిలో అరెస్టు చేయడాన్ని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసి అరాచకాలు సృష్టించి వైఎస్సార్సీపీ నాయకులను అణగదొక్కాలని యత్నిస్తున్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులను పావుగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పోలీసులు అత్యుత్సాహంతో శ్రీహరిని అరె స్టు చేశారని, అయితే కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఇది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. ఎప్పటికై నా ధర్మం, న్యాయం గెలుస్తుందని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వానికి గుణపాఠం అన్నారు. జనగణన శిక్షణ పరిశీలన చిత్తూరు అర్బన్: జనగణన –2027లో భాగంగా చిత్తూరు సంతపేట పీఎన్సీ.మునిసిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ సుమిత్కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇదే సమయంలో పోర్ట ల్లో అందుబాటులో ఉన్న ‘స్వీయ గణన’ పైన అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ అధికారి డా.లోకేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు నాగేంద్ర, సుభప్రభ, మాస్టర్ ట్రైనర్ సౌందర్రాజన్, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లా లోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
– రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాయనిచెరువు వెళ్లే మార్గంలో దిగవూరు క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిసిన వివరాల మేరకుం.. చిత్తూరు మండలంలోని తుమ్మింద గ్రామానికి చెందిన రవి తేజ(19), అదే గ్రామానికి చెందిన ఆకాష్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై నాయనిచెరువు గ్రామంలో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆటో అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న రవితేజ గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా తాకి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం నడుపుతున్న ఆకాష్ కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గుర్తించిన స్థానికులు ఇద్దరినీ గుడిపాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవితేజ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆకాష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగండన్గా గుర్తించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఈత కొడుతూ..!
– బావిలో మునిగి యువకుడి మృతి గంగవరం: ఈత కొడుతూ బావిలో మునిగిపోయి యువకుడు మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన హైకాంత్ కుటుంబంతో సహా మండలంలోని కీలపల్లి సమీపంలోని ఓ డెయిరీలో పని చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. కీలపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కోసం తండ్రి హైకాంత్ తన కుమారుడు దేవ్ త్యాగి(22)ని వెంటపెట్టుకుని వెళ్లాడు. బావిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు దేవ్త్యాగి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
పదవుల రాజకీయం
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంఅండ్ హెచ్వో నాగశశిభూషణ్రెడ్డి హెచ్చరించారు. భలే మంచి వడ్డీ బేరమూ! పలమనేరు టమాటా మార్కెట్లో కొంతమంది రోజువారి వడ్డీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు.. ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికి ఒట్టి చేతులు చూపారని పచ్చనేతలు మండిపడుతున్నారు. తమను కరివేపాకు చందంగా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పదవుల పందేరంలో చంద్రబాబు కుటిల రాజకీయం ప్రదర్శించారని వాపోతున్నారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన వారికి వైఎస్సార్ సీపీలో పలు విభాగాల్లో పదవులు దక్కాయి. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడిగా జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన పురంధర్, జిల్లా కార్యదర్శులుగా జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన యుగంధర్రెడ్డి, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నరసింహరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సాయి అవినాష్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రమేష్, శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ థౌహీడ్, జిల్లా బీసీ కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సుబ్బరాజు, సురేష్, గంగిరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మల్లికార్జుననాయుడు, మునికృష్ణమనాయుడు, జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యశోద, జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పూతలపట్టు నియోజవర్గానికి చెందిన రమేష్, జిల్లా యువత విభాగం కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వినోద్రెడ్డి, లోకవినాయకరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రవీన్కుమార్ నియమితులయ్యారు. పుంగనూరు నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్సన్షర్ల విభాగం అధ్యక్షుడిగా వరదారెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శిగా యువరాజ్, జీడీనెల్లూరు మండల ఐటీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కిరణ్కుమార్ను నియమించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధిష్టానం ప్రకటించిన పదవుల పందేరంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర దుమారం రేగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసిన వారికి కాకుండా నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సుమారు రెండేళ్ల తర్వాత టీడీపీ అధిష్టానం బుధవారం పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించింది. ఈ జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్.విజయకుమార్ (తిరుపతి), ఎన్.అమర్నాథ్రెడ్డి (పలమనేరు), జి.నరసింహయాదవ్ (తిరుపతి), చిట్టిబాబు (జీడీ నెల్లూరు), రవినాయుడు (తిరుపతి), అన్నా అనిత (తిరుపతి), పురిమిట్ల కుమారి (తిరుపతి), జి.దశరథాచారి (శ్రీకాళహస్తి), ఎం.సుబ్బయ్య (శ్రీకాళహస్తి), పి.చందన స్రవంతి (సత్యవేడు), లక్ష్మీప్రసన్న (నగరి), ఆర్.మీరా నేతాజీ (నగరి), కర్జాల అరుణ (జీడీ నెల్లూరు) పదవులు లభించాయి. ఇందులో నలుగురు, ఐదుగురు మాత్రమే సీనియర్ నాయకులు ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారు. దీంతో మొదటి నుంచి జెండా మోసిన సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదవులు ఉన్న వారికి ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి అనేక మందిలో నెలకొంది. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తింపు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్నత పదవులు లభించని అనేక మంది నాయకులను అధిష్టానం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకుని వదిలేస్తుందనే ప్రచారం ఉంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ప్రస్తుతం పదవుల పందేరంలో తమకు చోటు దక్కకపోవడంతో తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్య నేతలు వచ్చి భుజాన చేయివేసి క్షేమ సమాచారాలు అడగడంతో గాల్లో తేలిపోయి పనిచేశామని చర్చించుకుంటున్నారు. ఓట్ల రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని సీనియర్ నాయకులు కొందరు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉపాధి హామీ పనులు వేగవంతం పూడి శ్రీహరి అరెస్టు అక్రమం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో డ్వామా, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు ఫీల్డ్ అసిస్టెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పురోగతిపై సమీక్షలు చేయాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించినా, విధులకు గైర్హాజరైనా ఫీల్డ్ అసిస్టెంట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూలీల సమీకరణ కార్యక్రమంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న కార్మికులను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు, వేతన హక్కులపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన పనులను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో డ్వామా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు అక్రమమని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మఫ్టీలో వచ్చిన పోలీసులు నోటీసు కూడా ఇవ్వకుండా తాడేపల్లిలోని తన నివాసానికి సమీపంలో శ్రీహరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వెళ్లారని తెలిపారు. ఇంటికి వెళ్లి వస్తానని శ్రీహరి కోరినా పట్టించుకోకపోవడం చట్ట విరుద్ధమన్నారు. మాజీ సీఎం జగనన్నను కలిసి వస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న ఫోన్, ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు పలుమార్లు తప్పు పట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఓట్ల కోసమే.. పదవుల కోసం కాదు అందరికీ అన్యాయమే.. తిరుపతి బీసీ సామాజిక వర్గంలో యాదవులకు తప్ప మరొకరికి పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. అది కూడా ఒకరిద్దరికి మాత్రమే పదవులు ఇచ్చారని, మిగిలిన మెజారిటీ సబ్ క్యాస్ట్లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రమణ్యం కమిటీల్లో పదవులు కోల్పోయారు. వీరంతా సీనియర్లు. అలాగే రాష్ట్ర పదవులు వస్తాయని ఆశించిన దంపూరి భాస్కర్ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, పులుగోరు మురళి, పుష్పలతను కరివేపాకులా వాడుకుంటున్నారని వారి అనుచరులు మండిపడుతున్నారు. సూళ్లూరుపేటకు చెందిన తిరుమూరు సుధాకర్రెడ్డి, వేనాటి సతీష్రెడ్డి, శంకరయ్యయాదవ్ సీనియర్లు అయినా పార్టీలో గుర్తింపు లభించలేదు. చంద్రగిరి పరిధిలో సీఎం చంద్రబాబు పేరు పెట్టి పిలిచే నాయకులు అనేక మంది ఉన్నా.. ఒక్కరికి కూడా చోటు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో కూడా సీనియర్ నాయకులున్నా వారెవరికీ చోటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, దొరబాబు, చంద్రప్రకాష్, సుభాష్ చంద్రబోస్, చిట్టిబాబు నాయుడు, విజయబాబు, జయప్రకాష్ నాయుడు, గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పానికి చెందిన ఆంజనేయరెడ్డి, దేయరాజులు నాయుడు జెండా మోయడానికే పరిమితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. -
ముగిసిన టెన్త్ మూల్యాంకనం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఈ నెల 6న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ బుధవారం ముగిసింది. ఈ ప్రక్రియను అబ్జర్వర్ మువ్వా రామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్ పకడ్బందీగా పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆయా సబ్జెక్టులకు సంబంధించి 1,73,984 జవాబుపత్రాలను టీచర్లు దిద్ది మార్కులను నమోదు చేశారు. ఈ విధుల్లో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 749 మంది వివిధ కేడర్ టీచర్లు పాల్గొన్నారు. మార్కుల నమోదుకోసం కేటాయించిన పాత ట్యాబ్లు మొరాయించడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వర్ నెమ్మదించడం, ట్యాబ్లు తరచూ అప్లోడింగ్లో హ్యాంగ్ కావడం, మార్కుల అప్లోడింగ్లో జాప్యం తదితర సమస్యల వల్ల విధుల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ టీచర్లు అదనపు సమయం కేటాయించి ప్రక్రియను పూర్తి చేశారు. ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. జవాబుపత్రాల స్కానింగ్, మార్కుల క్రోడీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా డేటా ఎంట్రీని డబుల్ చెక్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
భలే మంచి వడ్డీ బేరమూ!
వడ్డీ వ్యాపారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. కొంతమంది నగదును నెలవారీ వడ్డీకి ఇస్తుండగా, మరికొందరు సంవత్సరం వడ్డీకి ఇస్తున్నారు. ఇంకొందరు రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా దినసరి మార్కెట్లు, టమాటా మార్కెట్లు, మండీల్లో రోజువారి వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారులు ఉదయాన్ని నగదు ఇచ్చి సాయంత్రం వడ్డీతో కలిపి అసలు వసూలు చేసుకుంటారు. పలమనేరు టమాటా మార్కెట్లో స్థానికులతోపాటు చైన్నెకి చెందిన వారు వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.పలమనేరు : పలమనేరు టమాటా మార్కెట్లో 50 వరకు మండీలు ఉన్నాయి. ఇక్కడికి ప్రతి రోజూ 70 లోడ్ల వరకు టమాటాలు వస్తుంటాయి. పలమనేరు నియోజకవర్గంలోనూ టమాటా సాగు ఎక్కువగానే ఉంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి అప్పుడప్పుడూ సరుకు భారీగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలో మండీ వ్యాపారులు సొంతంగా పెట్టుబడి పెట్టుకోలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రోజుకు రూ.2 కోట్ల వరకు రోజువారీ ఫైనాన్స్గా తీసుకుంటున్నారు. ఇక మీటర్ ఫైనాన్స్గా మరో రూ.2 లక్షలు పొందుతున్నారు. మీటర్ ఫైనాన్స్ అంటే ఉదయం 11 గంటలకు రూ.10 లక్షలు ఇస్తే సాయంత్రానికి రూ.10 వేలు కలిపి కట్టాలి. నిత్యం 30 మంది ఫైనాన్స్దారులు ఇక్కడ రూ.కోట్ల అప్పులు ఇస్తున్నారు. కొందరు చైన్నె నుంచి ఇక్కడికి వచ్చి డైలీ ఫైనాన్స్ ఇస్తున్నారు. ఇలా అధిక వడ్డీలతో ఫైనాన్స్ పొంది వ్యాపారులకు సరుకును అప్పుగా వేసి రైతులకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కటింగ్ క్రేట్లతోనే అసలు సమస్య పొరుగు మార్కెట్లలో పుల్ క్రేట్లతో టమాటాలను విక్రయిస్తున్నారు. అంటే బాక్సుకు 18 కేజీలు కాయలు ఉంటాయి. ఇక్కడ మాత్రం బాక్సుకు 14 కేజీలు ఉంటాయి. చైన్నె మార్కెట్లో అమ్మేది కటింగ్ క్రేట్లే. బయటి వ్యాపారులు వంద పుల్ క్రేట్లను కొంటే వారికి కటింగ్ క్రేట్లు 120గా చేస్తారు. అదే పలమనేరులో వంద కటింగ్ క్రేట్లను కొంటే 95 క్రేట్లే వస్తాయి. దీంతో ఇక్కడికి వ్యాపారులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పుల్ క్రేట్ల ధర భాక్సుకు రూ.20 ఎక్కువగా ఉన్నా సరుకు సర్దుబాటు అవుతుందని వ్యాపారులు అక్కడికే వెళుతున్నారు. ఇక్కడ కూడా పుల్క్రేట్లు పెడదామంటే కటింగ్ క్రేట్లను వేలల్లో కొనుగోలు చేశామని, వాటిని ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదని మండీ యజమానులు చెబుతున్నారు. వ్యాపారుల తప్పిదానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరలపైనా ప్రభావం వ్యాపారులు క్రేట్ల సమస్యతో ఇక్కడికి రావడం లేదు. అంతేగాక అన్ని మార్కెట్ల వేలం పాట నిర్వహించిన తర్వాతే పలమనేరులో వేలం పాటలు నిర్వహించి ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల స్థానికంగా టమాటా ధరలు తరచూ తక్కువగా పలుకుతున్నాయి. చాలా మంది రైతులు మండీ యజమానుల వద్ద ముందుగానే అప్పు తీసుకోవడం వల్ల ధరల గురించి ప్రశ్నించలేకపోతున్నారు. వారు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పక్కనే ఉన్న వడ్డిపల్లెలో బాక్సు రూ.330గా ఉంటే ఇక్కడ మాత్రం రూ.230గానే ఉంది. నష్టపోకుండా జాగ్రత్త పడుతున్న మండీల వారు కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లి, మదనపల్లెలో టమాటాలకు వేలం పాట ఉదయం 8 గంటలకు జరుగుతుంది. ఆపై వడ్డిపల్లెలో 10 గంటలకు, పుంగనూరులో 11 గంటలకు పాటలు నిర్వహిస్తారు. వీటి ధరలను అనుసరించి ఇక్కడి వ్యాపారులు వేలం పాట మొదలు పెడతారు. తద్వారా తమకు నష్టం రాకుండా మండీ యజమానులకు జాగ్రత్త పడుతున్నారు. వ్యాపారులకు మండీ యజమానుల షేర్ ఇక్కడ టమాటాలను కొనుగోలు చేసేందుకు బయటి వ్యాపారులను మండీ యజమానులు బతిమలాడి పిలిపించుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు తమకొచ్చే కమీషన్లో కొంత వాటా కూడా ఇస్తున్నారు. వారికి సరుకు అప్పుగా ఇవ్వకపోతే కొనేవారే ఉండరు. రైతుల నుంచి మండీ వ్యాపారులు పది శాతం కమీషన్ తీసుకుంటే అందులో కొంత వ్యాపారులకు ఇవ్వాల్సి వస్తోంది. ఇక క్రేట్ల మిస్సింగ్కు 1 శాతం, కూలీల ఖర్చులు, ఫైనాన్స్కు వడ్డీ ఇలా 2 శాతం, నగదు లావాదేవీల్లో నష్టాలకు ఒక శాతం కలిపి మొత్తం 8 శాతం ఆదాయం ఖర్చు అవుతోందని మండీ యజమానులు చెబుతున్నారు. -
మూడేళ్ల ఫలితాలు ఇలా..
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నాశనం అవుతోంది. పాలకులు, అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మరీ అధ్వానంగా పరిస్థితి తయారైంది. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రాష్ట్రంలో 22, 24 స్థానాలకు పడిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుండడంతో విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో సరైన వసతులు కల్పించకపోవడం, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతోనే ఉత్తీర్ణత శాతం పడిపోతోందని వాపోతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఫలితాలువిద్యా మొదటి ఏడాది మొదటి ఏడాది రెండో ఏడాది రెండో ఏడాది సంవత్సరం స్థానం శాతం స్థానం శాతం 2023–24 25 50 26 63 2024–25 26 54 24 74 2025–26 22 69 24 71సంవత్సరం హాజరైన ఉత్తీర్ణులైన విద్యార్థులు వారు మొదటి 12,567 8,691 రెండవ 11,651 8,280చిత్తూరు కలెక్టరేట్ : సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇంటర్మీడియట్ ఫలితాలు ఘోరంగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది. చిత్తూరు జిల్లా అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉండగా, ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 22, ద్వితీయ సంవత్సరంలో 24వ స్థానానికి పడిపోయి లాస్ట్బెంచ్ ముద్ర వేయించుకుంది. పాతాళానికి ఫలితాల గ్రాఫ్ గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. విద్యాశాఖ పర్యవేక్షణ లోపమో లేక ప్రణాళికా రాహిత్యమో గాని ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. గత ఏడాది మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో ఉండగా, ఈ సారి 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో గత ఏడాది 74 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఆ ఉత్సాహం నీరుగారింది. ప్రస్తుతం రెండో సంవత్సరంలో 71 శాతం ఉత్తీర్ణత సాధించి 24వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మెరిసిన బాలికలు ఇంటర్ ఫలితాల్లో బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రతి ఏటా ఇంటర్లో ప్రవేశాలు పొందడంతో పాటు ఉత్తీర్ణులు కావడంలోనూ, అత్యధిక మార్కులు సాధించడంలోనూ వారు ముందంజలో నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల నుంచి మొదటి సంవత్సరం ఇంటర్లో బాలురు 5,861 మంది హాజరుకాగా 3671 మంది ఉత్తీర్ణులయ్యారు. 62.63 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6,706 మందికి గాను 5,020 మంది ఉత్తీర్ణులై 85.65 శాతం సాధించారు. రెండో సంవత్సరంలో బాలురు 5,546 మందికి గాను 3521 మంది ఉత్తీర్ణులై 63.48 శాతం సాధించగా, బాలికలు 6,105 మందికి గాను 4,759 మంది ఉత్తీర్ణులై 77.95 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా కళ్లు తెరుస్తారా? ఫలితాల విడుదల అనంతరం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లోతీవ్ర నిరాశ నెలకొంది. గత ఏడాదికంటే ఫలితాలు మెరుగుపడతాయని ఆశించినప్పటికీ ఫలితాలు మరింత దిగజారాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల తర్వాత కంటితుడుపు చర్యగా సమీక్షలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దాలని సూచిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే అక్షర క్రమంలో మాత్రమే కాదు, అధమ ఫలితాల్లోనూ జిల్లా నంబర్ వన్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. వైఫల్యానికి కారణాలు ఇవేనా? పర్యవేక్షణ శూన్యం : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కళాశాలలను సందర్శించి, బోధనా నాణ్యతను తనిఖీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అధ్యాపకుల కొరత : జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కీలకమైన సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ మాఫియా : కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల వేటలో పడి సగటు విద్యార్థిని నిర్లక్ష్యం చేయడం, వారిపై మానసిక ఒత్తిడి పెంచడం వల్ల ఫలితాలు తారుమారయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీక్షల ప్రహసనం : విద్యాసంవత్సరం ప్రారంభంలో అధికారులు నిర్వహించే సమీక్షలు ఫోటోలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన దాఖలాలు లేవు. విద్యార్థులు ఆందోళన చెందొద్దు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఆందోళన చెందొద్దు. మరింత మెరుగ్గా చదివి అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి. తల్లిదండ్రులు సైతం సంయమనంతో వ్యవహరించాలి. ఫెయిల్ అయితే ఇంతటితో అంతా ముగిసిపోయినట్టు కాదని పిల్లలకు ధైర్ఘ్యం చెప్పాలి. ఆందోళన, భయం చెందాల్సిన అవసరం లేదు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. – రఘుపతి, ఇంటర్మీడియట్ డీఐఈవోసీఎం జిల్లాలో ఈ దుస్థితి ఎందుకో..? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఫలితాలు ఇంత నిరాశాజనకంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు కుప్పం నుంచి చిత్తూరు వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా అధికారుల సమీక్షలు, పర్యవేక్షణ కాగితాలకే పరిమితమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. -
ఘొల్లుమంటున్న పల్లెలు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. సమస్యలు పేరుకుపోయాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కూటమి నేతలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. ప్రకృతి వనరులను స్వాహా చేస్తున్నారు. రాజకీయ దాడులు పెరిగాయి. విచ్ఛలవిడిగా బెల్టుషాపుల నిర్వహణలో మద్యం ఏరులై పారుతోంది. ఇన్ని తెలిసినా పాలకులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్వేటినగరం: ఐదేళ్ల కిందట పల్లెల్లో విప్లవం మొదలైంది. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందాయి. ఊరు అంటే గుడి, బడి, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ అన్న నానుడి వచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందాయి. ముఖ్యంగా కరోనా కాలంలో వలంటీర్లు చేసిన సేవలు ఘనమైనవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు. రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పి గ్రామ వలంటీర్లను నిలువునా మోసం చేశారు. ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పడుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పాఠఽశాలల్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. పింఛన్లు తప్ప మరే లబ్ధి లేకుండా జనం అవస్థలు పడుతున్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించాల్సి ఉండగా తమ అనుచరులకు మాత్రమే అందుతున్నాయి. గత ఐదేళ్లలో కనిపించని బెల్టు షాపులు ఊరు ఉసురు తీస్తున్నాయి. రాజకీయ కుట్రలు పేట్రేగిపోయి హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెలు నువురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. ఈ రెండేళ్లలో 90 శాతం దాడులు, దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అనంతరం వివిధ కారణాలతో వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల సభ్యులపై భౌతిక దాడులు చేశారు. కళ తప్పిన సచివాలయాలు రూరల్ గవర్నెన్స్ ద్వారా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలనే ధ్యేయంతో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం పంచాయతీలు 697 ఉండగా 822 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 612 గ్రామ, వార్డు సచివాలయలను ఏర్పాటు చేశారు. 4477 మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. సుమారు 516 సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిచివాలయాలు కళ తప్పాయి. వైఎస్ జగన్పై ఉన్న కక్షతో సచివాలయాల్లో ఉచిత సేవలకు మంగళం పాడారు. ప్రజలు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరిట బయటకు పంపేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలదీ అదే పరిస్థితి. రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు అందడంలేదు. ఇక వైద్యం సంగతి సరేసరి. -
కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట చెవిరెడ్డి మోహిత్రెడ్డి నిరసన
సాక్షి, టాస్క్ఫోర్స్: సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి బుధవారం రాత్రి అక్కడకు వెళ్లి శ్రీహరిని చూపించాలని పోలీసులను అడిగారు. వారు వీలు లేదని, కోర్టులో చూపిస్తామని చెప్పడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు చూపించరని డీఎస్పీ పార్థసారథిని నిలదీశారు. ఇలాగే పోలీసులు అక్రమ కేసులు, అడ్డగోలుగా వ్యవహరిస్తే కోర్టులోనే తేల్చుకుంటామని, రెండు రోజుల క్రితం తిరుచానూరు ఘటనలో తిరుపతి కోర్టులో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఎస్ఐని సస్పెండ్ చేయాలని, సీఐకి మెమో జారీ చేయాలని ఆదేశాలు ఇస్తామని చెప్పడాన్ని గుర్తు చేశారు. కోర్టుల్లో పోలీసులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు శ్రీహరిని సోషల్ మీడియా కేసులో అక్రమంగా అరెస్టు చేసి, రహస్యంగా దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఆయన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఉండేదికాదని, తప్పుడు కేసులు పెట్టినట్టు వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారని పేర్కొన్నారు. పోలీసుల్లో నిజాయితీ కనిపించడం లేదని, కుప్పం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మానవ హక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు కుప్పం పోలీసులకు ఆ హక్కుల గురించి ఎందుకు నేర్పలేదో ప్రజల ముందు చెప్పాలన్నారు. పోలీసులు అక్రమంగా ఎంత మందిని అరెస్టులు చేసినా జైలుకు వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరు జగనన్నకు సైనికులుగా మారుతారే తప్ప పారిపోయే పరిస్థితి లేదన్నారు. -
లారీని ఢీకొన్న కారు
● వ్యక్తి దుర్మరణం ● నుజ్జునుజ్జు అయిన కారు తవణంపల్లె: మండలంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహరాదిలో ఉన్న పట్నం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కారును నడుపుతున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏఎస్ఐ మురళి కథనం మేరకు... చిత్తూరు నగరం గిరింపేట గొడుగుమూరుకు చెందిన పి.శ్రీనివాసులు కుమారుడు పి.వెంకటసాయి బుధవారం మారుతి సుజికి కారులో బెంగళూరు వైపు వెళుతున్నాడు. పట్నం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న లారీని వెనుక వైపున ఢీకొని ఎడమ వైపు ఉన్న డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. వెంకటసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనంతరం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. భార్య టి.నందినిప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఎర్రావారిపాళెం మండలం కే తిప్పిరెడ్డి గారిపల్లికి చెందిన వి.హరినాథరెడ్డికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, ఎర్రావారిపాళెం సీఐ లోకేష్, కోర్టు కానిస్టేబుల్ శివ కథనం మేరకు.. 2016 సెప్టెంబర్ 30వ తేదీన ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎర్రావారిపాళెం పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఎర్రావారిపాళెం మండలం, మర్రిపాటివారిపల్లి, గానుగచింత రోడ్డు, గాజులేరు వద్ద తనిఖీలు చేపట్టారు. నిందితుడు హరినాథరెడ్డితోపాటు మరో ఇద్దరు కలిసి వాహనంలో 63 కిలోల బరువున్న 5 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. హరినాథరెడ్డిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి అటవీ ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడు తున్న వారిపై పలమనేరు పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఆ మేరకు ఐదుగురిని పట్టుకోగా వారి నుంచి రూ.50 వేలు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ లోకే ష్రెడ్డి తెలిపారు. ఇందులో మొత్తం ఎనిమిది మంది ఉండగా ఐదుగురు దొరికారని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెరలిపారు. టీటీడీకి రూ.27 లక్షల విరాళం తిరుమల: కర్ణాటక రాష్ట్రం బెళగావికి చెందిన ప్రవీణ్ సోన్వాల్కర్ మంగళవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా సుభాష్ సోన్వాల్కర్ అనే భక్తుడు కూడా శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. గ్రామ సమస్యలకు ప్రాధాన్యత చిత్తూరు కార్పొరేషన్: గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ప్రత్యేకాధికారులు తెలిపారు. జిల్లాలోని పంచాయతీల్లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా గ్రామసభలను నిర్వహించారు. మొత్తం 621 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. బుధవారం జిల్లాలో పంచాయతీలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాను పంచాయతీ అధికారులు ప్రకటించనున్నారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వివరాలను నోటీసుబోర్డులో పెట్టనున్నట్లు డీపీఓ సుధాకర్రావు వివరించారు. సీఐ ఆకస్మిక దాడులు పూతలపట్టు(యాదమరి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పూతలపట్టు సీఐ గోపి దాడులకు ఉపక్రమించారు. ప్రజల శాంతి భద్రతలే తన ప్రథమ కర్తవ్యమని మరోసారి నిరూపించారు. మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో సీఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ నిషాతో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారందరికీ బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారి వివరాలు నమోదు చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ను ఢీకొన్న కారు నాగలాపురం: ద్విచక్ర వాహనాన్ని, కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన మండలంలోని అక్షర జూనియర్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాగలాపురం మండలం రజానగరం గ్రామానికి చెందిన జయరత్నం(58), శరవణ(45) అనే ఇదరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో సొంత పనుల నిమిత్తం ఊత్తుకోటై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అక్షర జూనియర్ కళాశాల సమీపంలో తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో ప్రథమ చికిత్స నిమిత్తం నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓటేరు గ్రామ పంచాయతీ వద్ద దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటేరు చెరువుకు పడమర వైపున ఉన్న ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం బయటపడింది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ వారం నుంచి పది రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటకు కనిపించే స్థితిలో ఉండడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. స్థానిక వీఆర్ఓ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమితోనే దళితులపై దాడులు
గంగాధర నెల్లూరు : రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం వస్తేనే దళితులపై దాడులు, కేసులు పెరిగిపోతాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక జీడీ నెల్లూరు మండలం, రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బాబు పురుగుల మందు తాగి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ మేర కు ఆయన మంగళవారం గ్రామానికి చేరుకు ని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి నివాళి మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామానికి చేరుకుని బాబు మృతదేహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. కు టుంబ సభ్యులను ఓదార్చారు. నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి కూడా స్పందించారు. మృతుడు బాబు కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. బాబు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూట మి ప్రభుత్వ వేధింపుల వల్లే బాబు మరణించాడని మృతుని బంధువులు బోరున విలపించారు. చిచ్చురేపిన రెవెన్యూ నారాయణస్వామి మాట్లాడుతూ గ్రామంలో భూ తగాదా వల్ల బాబు నలిగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రామంలోని కూటమి నాయకుడు పొన్నుస్వామికి అనుకూలంగా గత తహసీల్దార్ చంద్రశేఖర్ గ్రామ కంట భూమిలో పట్టా ఇచ్చాడని పేర్కొన్నారు. దీంతో అలజడి రేగిందన్నా రు. పొన్నుస్వామి అధికార అండతో బాబు, గ్రామస్తులపై పలు కేసులు నమోదు చేయించాడని తెలిపారు. పోలీసులు బైండోవర్ పేరుతో వేధించడం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపించారు. బాబు మృతికి కూట మి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా జీడీ నెల్లూరు సీఐ తాము ఎప్పుడు బైండోవర్ పేరుతో బాబు, గ్రామస్తులను పిలిపించలేదని వీడియో రిలీ జ్ చేయడం దారుణమన్నారు. బాబు మరణానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయ న వెంట మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సీనియర్ నేత గుణశేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఏకాంబరం, యువనేత కిషోర్రెడ్డి, పెద్దిరెడ్డి, మదన్, నాయకులు పాల్గొన్నారు. -
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
గంగవరం: రైస్ పుల్లింగ్ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతా నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్ కాయిన్స్ తదితర వాటితో రైస్ పుల్లింగ్ చేస్తూ ప్రజలను మోసగించే ఘరానా ముఠాను గంగవరం సర్కిల్ స్టేషన్లో పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు ఆధ్వర్యంలో మంగళవారం అరెస్ట్ చూపించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఇద్దురు పరారీలో ఉండగా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. వికోట మండలం, కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్ ఇలియాజ్, కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన మునీష్, చౌడేపల్లి మండలం, మేకలచిన్నేపల్లికి చెందిన విజయ్కుమార్, రాజులూరు గ్రామానికి చెందిన శంకర్, పెద్దపంజాణి మండలం, గౌనివారిపల్లికి చెందిన నాగరాజు మొత్తం ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తూ వస్తున్నారు. వారి వద్ద రైస్ పుల్లింగ్కు అవసరమైన పాత వస్తువులు, నాణేలు, బ్యాటరీలు తదితర వస్తువులను ఉన్నట్టు వెల్లడించారు. గుట్టు ఎలా రట్టయ్యిందంటే! తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు సూరంకుటై గ్రామానికి చెందిన శేఖర్తో రైస్ పుల్లింగ్ ముఠా సంప్రదింపులు జరిపింది. రాయలపేట దగ్గర ఆంజనేయస్వామి గుడి వద్దకు వస్తే తమ దగ్గర ఉన్న మహిమ గల చెంబు ఇస్తామని నమ్మబలికారు. చెంబు దక్కితే కోటీశ్వరుడవుతావని, లేకపోయినా బాగా డబ్బులు సంపాదిస్తావని చెప్పారు. దీంతో శేఖర్ తమిళనాడు నుంచి రాయలపేట వద్దకు రాగా.. రైస్పులింగ్ ముఠా మహిమ గల చెంబు పేరుతో రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కేటుగాళ్ల మాయమాటలను నమ్మిన బాధితుడు ముందుగా రూ.లక్ష చెల్లించి చెంబు దక్కించుకున్నాడు. ఆ తర్వాత చెంబుని పరిశీలించగా అది పనికిరాని చెంబని తెలుసుకుని బోరుమన్నాడు. తనకు డబ్బు ఇచ్చేయాలని గట్టిగా ఆ ముఠాని నిలదీయడంతో అందురూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై బాధితుడు పెద్దపంజాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారెప్ప, పోలీసులు గాలించగా ఆఖరుకి పంజాణి మండలం, కోగిలేరు క్రాస్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పట్టుబడ్డ నలుగురిలో క్రిష్ణప్ప, విజయ్కుమార్, మునీష్, ఇలియాజ్ ఉన్నారు. శంకర్, నాగరాజు పరార్లో ఉన్నారు. మాయమాటలు నమ్మకండి మోసపూరిత మాటలు ఎవరూ కూడా నమ్మవద్దని సీఐ తెలిపారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లోగానీ లేదా డయల్ 112కి సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అప్రమత్తతే రక్షణ కవచం
చిత్తూరు కలెక్టరేట్ : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తతే రక్షణ కవచం అని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అగ్నిప్రమాదాల పట్ల చేపట్టాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు నివారించడానికి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు. గృహాలలో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని సూచించారు. నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటనలు పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశముంటుందన్నారు. ప్రజాచైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అజాగ్రత్తతోనే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కరుణాకర్ మా ట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ పరికరాల స్టాల్ను జిల్లా జడ్జి పరిశీలించారు. వారోత్సవాల కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏసుపాదం, నరేష్, విజయ్, రాజు, జయ, సతీష్, గిరిబాబు పాల్గొన్నారు. -
ఘనంగా తమిళ సంవత్సరాది వేడుకలు
నిండ్ర (నగరి): మండలకేంద్రమైన నిండ్ర ఓంశక్తి ఆలయంలో మంగళవారం తమిళ ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నేడు ప్రదోషకాల పూజలు వెదురుకుప్పం: డీఆర్ఎన్కండ్రిగ సమీపంలో ఉన్న అరుణగిరిపై కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రదోష కాల పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు రమేష్ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఏకకాలంలో నందీశ్వరునికి, శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమ వారం అర్ధరాత్రి వరకు 72,724 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,786 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నేటి నుంచి సముద్రంలో వేటకు విరామం తిరుపతి అర్బన్ : సముద్రంలో చేపల వేటకు బుధవారం నుంచి విరామం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గంగపుత్రులు రెండు నెలలుపాటు తమ వలలకు విశ్రాంతి ఇవ్వనున్నారు. చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ క్రమంలో చేపల వేట సాగించే మత్స్యకారులు ఇంటికే పరిమితం కానున్నారు. ఈ సమయంలో దెబ్బతిన్న వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకునే పనుల్లో నిమగ్నం కానున్నారు. -
గర్భం..గండం!
గర్భవతులు (ఫైల్) గర్భవతులకు చికిత్స అందిస్తున్న వైద్యులు (ఫైల్) ఇటీవల చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాణిపాకం: జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు -
అంబేడ్కర్ ఆశయసాధనే లక్ష్యం
చిత్తూరు కలె క్టరేట్ : అంబేడ్కర్ ఆశయసాధనే యువతకు మార్గదర్శకమని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దర్గా సర్కిల్ నుంచి అంబేడ్కర్ భవనం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యతో ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ప్రతి విద్యార్థి అంబేడ్కర్ రచించిన పుస్తకాలను చదివి ప్రేరణ పొందాలని సూచించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేడ్కర్కే దక్కుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ కోసం పోరాడిన అంబేడ్కర్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం డీఆర్డీఏ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను 47 స్వయం సహాయక సంఘాలకు రూ.47 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సంజయ్గాంధీనగర్లోని ఏపీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీవీఎంసీ సభ్యులు రాజ్కుమార్, ధనశేఖర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేడ్కర్కు ఎస్పీ ఘన నివాళి చిత్తూరు అర్బన్: రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ చిత్రపటం వద్ద చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఘన నివాళులర్పించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో.. చిత్రపటానికి నివాళులర్పించారు. భారతదేశ స్థితి–గతిని మార్చిన దార్శినికుడు అండ్కేర్ అని గుర్తుచేశారు. ఎస్పీ వెంట ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, డీఎస్పీ మహబూబ్ బాషా, ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఆర్ఐలు సుధాకర్, చంద్రశేఖర్ ఉన్నారు. అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలె క్టర్ సుమిత్ కుమార్ గాంధీ -
గురుకుల పాఠశాల దత్తత హర్షణీయం
కుప్పం: రామకుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజినీరింగ్ ఆన్ ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థ దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా రామకుప్పం గురుకుల పాఠశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాల అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్ సంస్థ ముందుకు రావడం హర్షణీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం మెగా సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీవీకే.భాను మాట్లాడారు. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, వారి ఆలోచనల దృక్ఫదాన్ని మార్చి క్రమశిక్షణతో కూడిన విద్యనందించడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ సంస్థ పనిచేస్తుందన్నారు. విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దుర్గమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, కడా పీడీ వికాస్ మర్మత్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం
చిత్తూరు కలెక్టరేట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయమని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పలు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మురళి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, డీఈవో కార్యాలయ సిబ్బంది రవిశేఖర్, స్వర్ణ, సాయి, గోపాల్, చైతన్య, శంకరప్ప, బాలాజీ, షణ్ముగం పాల్గొన్నారు. 100 మంది ఉద్యోగులకు సత్కారం అంబేడ్కర్ ఆశయ సాధనలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినాయకం అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సులోచన, జిల్లా ఆర్థిక కార్యదర్శి షణ్ముగం, నాయకులు శేషాద్రి, రెడ్డెప్ప, కృష్ణయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ కార్యాలయంలో.. జిల్లా కేంద్రంలో ఎస్టీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోఅంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు పురుషోత్తం, దేవరాజులురెడ్డి, బాలచంద్రారెడ్డి, గుణశేఖరన్, చంద్రన్, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కొండచుట్టుకు రక్షణ కవచం!
నగరి : నగరి నియోజకవర్గంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండచుట్టు మండపం రక్షణకు మరో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారి 716 విస్తరణ పనుల్లో భాగంగా ఏళ్ల నాటి ప్రాచీన మండపం కూల్చివేతకు గురికాకుండా చూడా లని మాజీ మంత్రి ఆర్కే రోజా ముందు కు వచ్చి పోరాటం సాగిస్తున్న విషయం విధితమే. ఇదివరకు ఆమె కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీలు గురుమూర్తి, మిథున్రెడ్డితో వెళ్లి వినతి పత్రం సమర్పించగా, ఆ అంశంపై స్పందన లభించింది. 10 నుంచి 16వ శతాబ్ద కాలంలో నిర్మించిన కొండచుట్టు మండపం వద్ద రోడ్డు రీ–అలైన్మెంట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామని గడ్కరీ నుంచి ఎంపీకి లేఖ రావడం గమనార్హం. దీంతో మండపం రక్షణపై ఆశలు మరింత బలపడ్డాయి. ఈ పరిణామం నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజ ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నాయకులు, స్థానికులు ఆమె కృషిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొండచుట్టు మండపం నగరి ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అక్కడ 21 మంది దేవతలు కొలువుదీరిన పవిత్ర స్థలమని, అందుకే ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడాలని తాను పోరాటం చేస్తున్నానన్నారు. దేవదేవతల ఆశీస్సులతో ఈ ప్రయత్నం విజయవంతమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తంగా, కొండచుట్టు మండపం పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమం మరో దశకు చేరుకోగా, రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎక్టోిపిక్ ప్రెగ్నెన్సీ అంటే!
గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోిపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. -
చీకటి సంత
పుత్తూరు మార్కెట్ యార్డులో గత మంగళవారం ప్రారంభించిన వారపు సంత ఎందుకు వచ్చిన తంటా అన్న చందాన తయారైంది. ఇటు రైతులు, అటు కొనుగోలుదారులు తంటాలు పడ్డారు. ముగ్గుపిండితో గీతలు గీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే మీ అంగళ్లకు హద్దులు అంటూ రైతులకు చూపి చేతులు దులుపేసుకున్నారు. సంత ప్రాంగణంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం లైట్లు వేసుకొనే మౌలిక వసతి కల్పించకపోవడంతో రైతులతో పాటు వినియోగదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎండలు మండుతున్న వేళ కేవలం సాయంత్రం వేళ వ్యాపారులు అమ్మకాలకు ఉపక్రమిస్తుండగా సంత ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో టార్చిలైట్ల వెలుతురులో వ్యాపారాలు సాగించారు. ఇకనైనా సంతలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని రైతులతోపాటు వినియోగదారులు కోరుతున్నారు. – పుత్తూరు -
యువతకు ఉపాధి కార్యాలయ రిజిస్ట్రేషన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యాలయ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారని జిల్లా ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్లైన్ పోర్టల్లో నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కొత్తగా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఎంప్లాయ్మెంట్.ఏపీ.జీవోవీ.ఇన్ (www.-employment.ap.gov.in)సందర్శించాలన్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు నిర్ణీత గడువు లోపు సీనియారిటీని పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగులు తమ విద్యార్హతలలో వచ్చిన మార్పులను, అదనపు అర్హతలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఇతర వివరాలకు 9440044346 నెంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. మేమున్నామని.. మీకేం కాదని! – ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను రక్షించిన పోలీసులు కార్వేటినగరం: ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను పోలీసులు రక్షించిన ఘటన మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కార్వేటినగరం మండలానికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్డూడి నాయకత్వంతో పనిచేస్తున్న సోషల్ మీడియా సిబ్బంది ఆ పోస్టును గమనించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప తమ సిబ్బందితో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలిక ఆచూకీని గుర్తించారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే బాలిక వద్దకు చేరుకుని సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కౌనెల్సింగ్ ఇచ్చి.. భవిష్యత్లో చదువుపై దృష్టి పెట్టాలని, చదువు లేదా ఉపాధి విషయంలో అవసరమైన సహాయం పోలీసుల ద్వారా అందిస్తామని భరోసా కల్పించారు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. టమాట బాక్స్ రూ.400 పలమనేరు: పలమనేరు మార్కెట్లో సోమవారం టమాట బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. గత నాలుగు రోజుల క్రితం బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున పెరుగుతూ సోమవారం నాటికి టాప్రేట్కు చేరింది. దీంతో రైతులు ఆనందంతో చిందులేస్తున్నారు. టమాట సాగయ్యే రాష్ట్రాల్లో సరుకు తగ్గడం, అనంతపూర్ జిల్లాలో ఎండల కారణంగా దిగుబడి తగ్గడంతో సరుకు ఇక్కడి మార్కెట్లకు రావడం లేదు. అందుకే బయటి వ్యాపారులు సైతం స్థానిక మార్కెట్లకు వస్తున్నారు. వచ్చే నెలలో ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పోలీసు గ్రీవెన్స్కు 44 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. వీటిలో కుటుంబ తగాదా లు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూతగా దాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నట్టు వెల్లడించారు. ప్రతీ ఫిర్యాదును నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్హౌస్ అధికారులతో మాట్లాడారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ఫిర్యాదులను తీసుకున్నారు. -
సౌత్జోన్ క్రీడల్లో ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో ప్రతిభ చాటారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ తరఫున సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో 8 మంది పీవీకేఎన్ విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. సాఫ్ట్బాల్లో 4, ఖోఖోలో 3, హాకీలో ఒక విద్యార్థి ప్రతిభ చాటారు. ఈ క్రీడా పోటీలు మహారాష్ట్రలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో, కర్ణాటకలోని దావణగెరే విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి అభినందించారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, విద్యార్థుల భవిష్యత్కు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జి రమేష్, అధ్యాపకులు భానుప్రకాష్, శరవణ, తదితరులు పాల్గొన్నారు. పర్యాటకులపై చెక్పోస్టు సిబ్బంది దాడి పుత్తూరు: నేసనూరు పంచాయతీ పరిధిలోని మూలకోన సందర్శనార్థం వచ్చిన పర్యాటకులపై అటవీశాఖ చెక్సోస్టు సిబ్బంది దాడి చేసిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణం, ఎంబీ రోడ్డుకు చెందిన వి.మునిలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆటోలో మూలకోనకు వెళ్లారు. చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ మరో వ్యక్తి ఆటో రుసుం రూ.100, ఒక్కో వ్యక్తికి రూ.10 వంతున చెల్లించాలని కోరగా వారు నగదు చెల్లించారు. ఆటోను చెక్చేసి మాంసం ఆలయం వద్దకు అనుమతి లేదని శ్రీకాంత్ తేల్చి చెప్పాడు. తాము ఆలయం వద్దకు తీసుకెళ్లమని, దూరంగా వెళ్లి తీసుకొంటామని పర్యాటకులు తెలిపారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోనలోకి వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణ సమయంలో చెక్పోస్టు సిబ్బంది అప్పటికే పక్క గ్రామం నుంచి పిలిపించుకొన్న నలుగురు వ్యక్తులతో కలసి మునిలక్ష్మి(49), రమ్య (27), సుమతి(32), శాంతి(46), జానకీరామ్(28), రాకేష్(22)పై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు జరుగుతోంది. -
ఇంత వరకు నగదు చెల్లించలేదు
గత సీజన్లో మామిడి సరఫరా చేసిన తమకు ఇంతవరకు పరిశ్రమ నిర్వాహకులు నగదు చెల్లించలేదని బాధిత రైతులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో రైతులు నిరసన చేపట్టారు. రైతు నాయకులు హరిబాబుచౌదరి మాట్లాడుతూ చిత్తూరు, తవణంపల్లి మండలాల్లోని నలిశెట్టిపల్లి, నారసింహనపల్లి, కె.గొల్లపల్లి, కరణంవాండ్లఊరు, ఏనుగుండ్లపల్లె పరిసర గ్రామాల రైతులు చిత్తూరు రూరల్ మండలంలోని పరిశ్రమకు మామిడి సరఫరా చేశారన్నారు. కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నగదు చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
క్వారీతో ప్రాణాలు పోతున్నాయి!
వెదురుకుప్పం: ‘క్వారీ పేలుళ్లతో మా ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ప్రాణాలు పోతాయేమోనని భయమేస్తోంది’ అంటూ బందార్లపల్లె వాసులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. పేదలకు సీజేఎఫ్ఎస్ భూము ల్లో పట్టాలి ఇప్పించాలంటూ దేవరగుడిపల్లె దళితులు.. మురుగుతో మగ్గిపోతున్నామంటూ దాసరి కాలనీకి చెందిన యువకులు.. గ్రామానికి శ్మశాన వాటిక లేక మృతదేహాలను తీసుకెళ్లడానికి అవస్థలు పడుతున్నామంటూ మాంబేడు గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వందల సంఖ్యలో వివిధ సమస్యలతో వచ్చి జిల్లా కలెక్టర్ సుమీత్కుమార్ వద్ద తమ కన్నీటి పర్యంతమయ్యారు. సోమ వారం వెదురుకుప్పంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే థామస్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వెదురుకుప్పం మండలం నుంచే కాకుండా పెనుమూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల వెల్లువ పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 158 అర్జీలు రాగా ఇందులో రెవె న్యూ సమస్యలే అధికంగా వచ్చాయి. రెవెన్యూ శాఖ కు సంబంధించి 35, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్రికార్డ్స్ 77, పంచాయతీ రాజ్ 9, విద్యుత్శాఖ 7, పింఛన్ 6, ఏపీఎస్ఆర్టీసీ 3, పశుసంవర్థక శాఖ 3, గృహనిర్మాణశాఖ 3, వాటర్ రిసోర్సు 2, రూరల్ వాటర్ సఫ్లై ఇంజినీరింగ్ 2, పోలీస్ శాఖ 2, విభిన్న ప్రతిభావంతులు, విద్యాశాఖ, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, అటవీశాఖ, షెడ్యూల్డ్ ట్రైబల్ కో–ఆపరేటీవ్ కార్పొరేషన్, మున్సిపల్ అడ్మిన్స్ట్రేషన్ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. నివాసముండలేకపోతున్నాం ‘మా గ్రామానికి పక్కనే పొలాల వద్ద ఉన్న బండపై క్వారీ నిర్వహణకు అధికారులు అనుమతులిచ్చారు. ఈ క్వారీలోంచి పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతున్నారు. అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’ అంటూ కొమరగుంట పంచాయతీ, బందార్లపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. బండపై బోరు డ్రిల్లింగ్ వేసి బ్లాస్టింగ్ చేయడంతో ఇళ్లు బీటలు వారుతున్నాయన్నారు. స్లాబ్ పెచ్చులూడి పోతోందని విచారం వ్యక్తం చేశారు. క్వారీలోంచి వచ్చే దుమ్ముధూళి, వ్యర్థాల వల్ల పశుపోషణ భారంగా మారుతోందన్నారు. తాగునీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవస్థలను గుర్తించి క్వారీని అపకుంటే గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ● ‘మాంబేడు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నం.31,37, 43, 45లోని కాలువ (ప్రభుత్వ) భూమిని కొందరు అగ్రకులస్తులు కబ్జాచేశారు. కాలువ గుండా రాకపోకలు లేకుండా అడ్డుకుంటు న్నారు. ఈ ఆక్రమణలను తొలగిస్తే వంద మంది రైతులకు సంబంధించి సుమారు 350 ఎకరాల మేరకు సులభంగా దారి వేసుకోవచ్చు. గ్రామానికి శ్మశాన వాటిక లేనందున మృత దేహాలను తీసెకెళ్లేందుకు దారి లేక నానాఅవస్థలు పడుతున్నాం’ అంటూ మాంబేడు గ్రామానికి చెందిన పేదలు ఫిర్యాదు చేశారు. పేదలకు పట్టాలు ఇవ్వాలి మండలంలోని దేవరగుడిపల్లె సమీపంలో ఉన్న సీజేఎఫ్ఎస్ భూములను పేదలకు ఇవ్వాలని దళితులు అర్జీలు ఇచ్చారు. గతంలో కొంత మందికి పట్టాలిచ్చినా మరికొంతమంది పేదలకు ఇవ్వకపోవడంతో గుర్తించి అందరికీ పట్టాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన మహేష్, రాజాజి తదితరులు వినతి పత్రం ఇచ్చారు. సమస్యలన్నీ పరిష్కరించండి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి పక్షపాత ధోరణి వహించడకూడదని కలెక్టర్ సుమీత్ కుమార్గాంధీ స్పష్టం చేశారు. తహసీల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కిరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ మోహన్మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న బందార్లపల్లె గ్రామస్తులు తమ సమస్యలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటున్న అర్జీదారులుపింఛన్ కోసం పడిగాపులు కాస్తున్న రవిబాబు -
అలసత్వం వొద్దు
ప్రజలను ఏమార్చలేరు! నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపకశాఖాధికారి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని కట్టమంచి, తేనెబండ, గిరింపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ముందస్తుగా దీని సమాచారంతో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో వన్ టౌన్ టూ టౌన్ పరిధిలోని ఐదుగురు బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్ ఆన్లైన్లో తనిఖీ చేయగా దాదాపు రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రూ.50 వేల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి వెనుక ఉన్న పలువురిపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూతలపట్టులో విజిలెన్సె దాడులు – నాలుగు సిలిండర్లు స్వాధీనం పూతలపట్టు(యాదమరి): పూతలపట్టులోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు సోమ వారం మెరుపు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న వారిపై నిఘా ఉంచి నాలుగు సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ నిఘా అధికారి కరిముల్లా ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎస్ఐ వెంకటరమణ, పౌరసరఫరాల డీటీ మోహన్రాజు సమక్షంలో మండల కేంద్రంలోని పలు దుకాణాలను తని ఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వినియోగిస్తున్న నాలుగు సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్ఐ మాట్లాడుతూ.. వాణిజ్య అవసరాల నిమిత్తం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించినా లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఈ దాడుల్లో వీఆర్వో నాగేంద్ర పాల్గొన్నారు. ముగ్గురికి జైలు తిరుపతి లీగల్: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి రెండేళ్లు వంతున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2011 ఏప్రిల్ 22వ తేదీ బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఓ టిప్పర్లో 78 ఎరచ్రందనం దుంగలు తరలిస్తుండగా గుర్తించారు. పిచ్చాటూరు మండలం, కీలపూడికి చెందిన బి వెంకటాచలం, అదే మండలం రామగిరికి చెందిన గోపాల్ రెడ్డి శంకర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలం, ఖాజానగర్కు చెందిన షేక్ షాకీర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్, సంగం సెక్షన్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ సిబ్బంది ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముగ్గురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆశపడ్డాం మాది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడదు. నేను పండ్ల వ్యాపారం చేస్తుంటాను. ఇద్దరు పిల్లల్ని కష్టపడి చదువించుకుంటున్నా. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆర్థిక పరిస్థితి సరి లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆడబిడ్డ నిధి రూ.1,500 వస్తుందని ఆశపడ్డాం. కానీ ఏం లాభం.. ఇంతవరకు ఆ ఊసే లేదు. – లత. ఆముదాల దళితవాడ, పాలసముద్రం మండలం ఇంటి జాగా, పెన్షన్ లేదు మాకు సొంత ఇల్లు కూడా లేదు. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేశాను. రాలేదు. కనీసం ఇంటి స్థలమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 వస్తే మాకు ఒకింత వెసులుబాటు ఉంటుంది. – బుజ్జమ్మ, బలిజకండ్రిగ దాసరి కాలనీ, పాలసముద్రం మండలం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది. పాలనలో సవాలక్ష మార్పులు చేసింది. ఇందులో భాగంగా రేషన్ సరుకులు వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ నామరూపాలు లేకుండా చేస్తోంది. బియ్యం బండి వాహనానికి రంగులు మార్చి స్వచ్ఛరథం అంటూ రోడ్లపై తిప్పుతోంది. వీటిని చూసిన జనాలు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – పాలసముద్రం మే1 నుంచి వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి అన్నమయ్యసర్కిల్: నాగలాపురంలోని వేదవల్లీ సమేత వేదనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈనెల 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. మే ఒకటో తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం, 2న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహన సేవలు జరుగుతాయి. అలాగే 3వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 4న ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం, 5న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 6న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహన సేవలు నిర్వహించనున్నారు. మే నెల 7వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 8న ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు రథోత్సవం, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి అశ్వవాహనసేవలు జరగనున్నాయి. మే 9వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం వాహన సేవలు ఉంటాయి. మే 8వ తేదీన సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన దలిచిన గృహస్తులు (ఇద్దరు) రూ.750 చెల్లించి పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేత –ఇక్కట్లు పడుతున్న వాహనదారులు రేణిగుంట: పట్టణంలోని శ్రీనివాస కాలేజీ సమీపంలో ఉన్న బ్రిడ్జిని మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం మూసివేశారు. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జి మూసివేయడంతో వాహనచోదలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కేటాయించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్న సంత వద్ద రైల్వేగేట్ తరచూ మూసివేస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. రైల్వేగేట్ మూసివేసినప్పుడల్లా రెండు వైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గేటుకు రెండు వైపులా వాహనాలు నిలవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే వారు ఈ ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలోని పోలీసులు రైల్వేగేట్కు రెండు వైపులా ఉండి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. అయినా రద్దీ తగ్గడం లేదు. ఈనెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ మరమ్మతుల కారణంగా బ్రిడ్జి మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 08 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,743 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,376 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం చూపొద్దని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 100 శాతం సంతృప్తి కలిగించేలా అధికారులు పనిచేయాలన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్నారని చెప్పారు. ఆ సమయంలో క్షేత్రస్థాయి అధికారులతో సీఎం ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రజల సంతృప్తి ఏ స్థాయిలో ఉందనే అంశాలపై ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా సమీక్ష ఉంటుందన్నారు. ఎండలతో జాగ్రత్త జిల్లాలో రాబోయే 5 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల్లోపే పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కమిషనర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదన్నారు. జెడ్పీ నిధుల నుంచి మంజూరు చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు అందించాలన్నారు. ప్రతి పీహెచ్సీకి ఇంటర్నెట్ సౌకర్యం జిల్లాలోని ప్రతి పీహెచ్సీకి రూ.25 వేలతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు కలెక్టర్ నిధుల నుంచి ఒక్కో కేంద్రానికి రూ.25,000 కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ సౌకర్యం వల్ల అబా ఐడీల క్రియేషన్, రోగుల రిజిస్ట్రేషన్, రిపోర్టుల అప్డేట్ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. ఓపీకి వచ్చే ప్రతి రోగి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్లు అందరూ 100 శాతం డిజిటల్ డేటా ఎంట్రీ చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మోహన్కుమార్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ నాగశశిభూషన్రెడ్డి, డీఎస్వో గిరి తదితరులు పాల్గొన్నారు.న్యాయం చేయండి సారూ! చిత్తూరు కలెక్టరేట్ : ‘న్యాయం చేయండి సారూ..’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు అయినప్పటికీ పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. అధికారులు లేకపోయేసరికి చేసేదేమీలేక వెనుదిరిగారు. -
ఇంతన్నాడంతన్నాడే..!
బాబు ఆర్భాటపు హామీలు బాబు మాటల గారడీకి మహిళలు పడిపోయారు. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఆడ బిడ్డ నిధి అంటూ ఊదరగొట్టేసరికి మురిసిపోయారు. త్రీబెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పేసరికి సంతోషసాగరంలో మునిగిపోయారు. తీరా గెలిచాక బాబు విశ్వరూపాన్ని చూసి గాబరాపడుతున్నారు. ఆడ బిడ్డ నిధి ఎక్కడ బాబూ అంటూ నిలదీస్తున్నారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలో మహిళల ఆవేదన.. ఆక్రోశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట చంద్రబాబుది అంతా డైవర్షన్ రాజకీయం. తిరుపతి లడ్డూ నుంచి అన్ని అంశాలలో అతనిది అదే పంథా. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట. గత ప్రభుత్వ వైఫల్యమని నిందలు వేస్తూ, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. హామీల బాబు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కార్వేటినగరం: గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఆ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేస్తామన్నది ప్రధానమైంది. ఆ హామీ తో మహిళలు కొంత మేర టీడీపీ వైపు మొగ్గు చూపారు. తీరా ఓట్లు దండుకుని గెలిచాక ఆ హామీని పక్కనబెట్టేశారు. దీనిపై మహిళలు మండిపడుతున్నారు. ఇంటి జాగా లేదు గానీ! చమద్రబాబు సర్కార్ వచ్చి రెండేళ్లు పూర్తికావస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. ఇప్పుడు పెద్ద కుటుంబానికి త్రీ బెడ్రూమ్ ప్లాట్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. అభివృద్ధిని గాలికి వదలేసి సమస్యలకు సంబంధించి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి మాయ మాట లు చెప్పడం బాబుకు అలవాటయ్యిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇదేనా బాబు విజనరీ అని ఎద్దేవా చేస్తున్నారు. -
మావిగన్పై విమర్శలు సరికాదు
కార్వేటినగరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్పై జయప్రకాష్ నారాయణ విమర్శలు సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూ రు నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆది వారం పుత్తూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా లేని చోట చంద్రబాబు తమ సామాజికవర్గం అభివృద్ధి కోసం రూ.లక్షల కోట్లు వెచ్చించి రాజధాని నిర్మాణం చేస్తున్నాడని విమర్శించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ (మావిగన్)ను రాజధానిగా చేస్తే అంత ఖర్చు అవసరం లేదని తెలిపారు. వేల సంఖ్యలో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. తద్వారా లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఓర్వలేని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మేధా వుల ముసుగులో అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. వారికి పేదల ప్రజల గురించి పట్టదన్నారు. ప్రజలకు మంచి జరిగే ఏ విషయమైనా వారికి కంటగింపుగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే జగనన్న తీసుకువచ్చిన మావిగన్ ప్రతిపాదనపై జయప్రకాష్ నారాయణ ప్రేలాపణలు ఉన్నా యని తెలిపారు. అందులో భాగంగానే జగనన్నను పిచ్చితుగ్లక్ అని సంభోదించాడన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పిచ్చితుగ్లక్ కాదని, కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం తపించే మానవతావాది అని వివరించారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కులపిచ్చితో రగిలిపోతున్నారని తెలిపారు. వారు ఈ రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టమన్నారు. జగనన్న అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించిన మావిగన్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పరిశ్రమలు రావడంతో లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని అనేది ఒక్క చంద్రబాబు సామాజిక వర్గం వారి కల మాత్రమేనన్నారు. ఇది రాష్ట్ర ప్రజల కల కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబును ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. -
మాట వింటేనే అందలం!
ప్రజాసేవ ప్రామాణికం కాదు.. నిజాయితీ ప్రాతిపదిక కాదు.. విధి నిర్వహణలో చిత్తశుద్ధి అవసరం లేదు.. సమస్యల పరిష్కారంలో సమర్థతను ఖాతరు చేయడం లేదు. తమ మాట వింటే చాలు.. చెప్పిన పని చేస్తే చాలు.. కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేస్తారు. అర్హత లేకపోయినా అదనపు బాధ్యతలు అప్పగించేస్తారు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా డిప్యుటేషన్ కింద కాసులు మూటగట్టుకునే అవకాశం కల్పించేస్తారు. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నేతలు.. ప్రజాప్రతినిధుల వ్యవహారం. పరిపాలనలో కీలకమైన రెవెన్యూశాఖను తమ జేబులో పెట్టేసుకుంటున్నారు. ప్రధానంగా తహసీల్దార్ల నియామకాల్లో చక్రం తిప్పుతున్నారు. అనుకూలంగా లేని గ్రూప్–2 అధికారులను ప్రాధాన్యత లేని చోటుకు బదిలీ చేయించేస్తున్నారు. అడుగులకు మడుగులొత్తే వారిని అందలం ఎక్కిస్తున్నారు.అంతులేని అక్రమాలు తిరుపతి జిల్లాలో విలువైన ప్రభుత్వ, పోరంబోకు, మఠం భూములు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు అధికారుల సహకారంతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, తిరుపతి అర్బన్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, నాయుడుపేట, వెంకటగిరి, బాలాయపల్లె మండలాల పరిధిలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయి. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు రికార్డులను తారుమారు చేసి నిజమైన భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. రెవెన్యూ అధికారుల నిర్వాకం కారణంగా అనేక మంది బాధితులు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కి వచ్చే ఫిర్యాదు దారుల్లో ఎక్కువ మంది భూ సమస్యల పరిష్కారం కోసం తిరిగేవారు ఉండడమే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలకమైన రెవెన్యూని అధికార పార్టీ నేతలు తమ జేబు శాఖగా మార్చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పింది చేసేవారు, చెప్పింది వినేవారిని మాత్రమే కీలకమైన తహసీల్దార్లుగా నియమించుకుంటున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎక్కువ మండలాల్లో గ్రూప్– 2 కేడర్ అధికారులు కాకుండా డీటీలు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు తహసీల్దార్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా జిల్లాలో తహసీల్దార్ల నియామకాల్లో ఎక్కువ మంది డీటీలకే బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లాలో శనివారం 13 మండలాల తహసీల్దార్ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఆ 13 మందిలో గ్రూప్ 2 అర్హత ఉన్న వారిని స్థానిక ప్రజా ప్రతినిధులు తమ మాట వినడం లేదని కలెక్టరేట్కి బదిలీ చేయించారు. 13 మందిలో ఐదుగురు మాత్రమే గ్రూప్–2 కేడర్ అధికారులు. మిగిలిన వారంతా డీటీ, సీఎస్డీటీ, కారుణ్య నియమకాల ద్వారా వచ్చిన వారే. వారందరిని ఎఫ్ఏసీగా నియమించారు. ఇలా జిల్లాలో 36 మండలాల ఉంటే.. ఏడు మండలాల్లో మాత్రమే గ్రూప్ 2 అధికారులు తహసీల్దార్లుగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారంతా డీటీ, సీనియర్ అసిస్టెంట్లను తహసీల్దార్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులు నియమించుకున్నట్లు రెవెన్యూలో ప్రచారం జరుగుతోంది. ఇక పోతే కలెక్టరేట్లో ఏ నుంచి హెచ్ సెక్షన్లో పనిచేస్తున్న తహసీల్దార్లలో గ్రూప్ 2 వారు 10 మంది ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. 28 మండలాలు ఉన్నాయి. ఈ 28 మండలాల్లో గ్రూప్ 2 వారు 10 మంది ఉన్నారు. ఇందులో ఒకరు కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మిగిలిన మండలాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెచ్డీటీలు, 11 మంది ఉద్యోగోన్నతిపై తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే నచ్చదు గ్రూప్ 2 ఆఫీసర్లు నిబంధనల మేరకు నడుచుకుంటారు. ఒకటీ అరా అతిక్రమించినా.. భవిష్యత్తులో ఎవ్వరికీ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ శాతం మంది అక్రమాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారిని కొందరు ప్రజా ప్రతినిధులు పక్కన ఉంచుకోరనే ప్రచారం జరుగుతోంది. అక్రమ లే అవుట్లు, కాలువ, చెరువు పోరంబోకు భూములను రెగ్యులరైజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీటీ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు డిప్యుటేషన్పై తహసీల్దార్లు (ఎఫ్ఏసీ) అయిన కొందరు నిబంధనలన్నీ పక్కన పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకం ద్వారా తహసీల్దార్ అయిన ఒకరు, డీటీగా పనిచేస్తూ తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించిన మరొకరు జిల్లాలో అనేక కాలువ, చెరువు, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. మరి కొందరు ఏసీబీ అధికారులకు పట్టుబడి మళ్లీ అడ్డదారిలో పోస్టింగ్ తెచ్చుకున్న వారు లేకపోలేదు. ధనార్జనే ధ్యేయంగా.. ప్రజా ప్రతినిధి చెప్పింది కళ్లుమూసుకుని గుడ్డిగా పనిచేసిన కొందరు తహసీల్దార్ల కారణంగా అనేక మంది రైతులు, భూ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూశాఖపై ఎమ్మెల్యేల పెత్తనం -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: హెయిర్ కటింగ్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ రిజిస్ట్రేషన్లు స్వీకరించు తేదీలు: ఈనెల 8 నుంచి 13 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫీజు : రూ.2,500 వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈనెల 14 నుంచి వచ్చే నెల 12 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు -
అలంకారప్రాయం
అధికారుల నిర్లక్ష్యం? ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పీహెచ్సీలతోపాటు ఉపాధి హామీ పనుల వద్ద ప్రాథమిక వసతులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనిపిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఎండల ప్రభావంతో బాధపడే పేదల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 50 పీహెచ్సీలు ఉన్నా యి. ప్రతి పీహెచ్సీలోనూ రోజుకు 100 నుంచి 150 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఓపీల సంఖ్య పెరిగింది. వడదెబ్బ, జ్వరం కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. 12 రోజుల్లో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆస్పత్రికి వచ్చిన కేసులు 1191 ఉంటే క్షేత్రస్థాయిలో 6181 కేసులను గుర్తించారు. పీహెచ్సీల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రైవేటు డాక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎండను తట్టుకునేందుకు ఓఆర్ఎస్ కార్నర్స్ను ఏర్పాటు చేసింది. బాటిళ్లలో ఓఆర్ఎస్ ద్రావణం జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్లు పూర్తిగా కనిపించకపోవడం గమనార్హం. మరికొన్ని చోట్ల పేరుకు ఏర్పాటుచేశారు. అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. కొన్ని కేంద్రాల్లో వాటర్ బాటిళ్లలో ఓఆర్ఎస్ ద్రావణం ఉంచి కార్నర్గా చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడక్కడా ఏర్పాటు చేసిన కార్నర్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు ఓఆర్ఎస్ కార్నర్ల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇవి ఉపయోగంలోకి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదుపాయం లక్ష్యానికి విరుద్ధంగా మరుగునపడుతోంది. కూలీలకు తప్పని అవస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. 40 డిగ్రీల ఎండలో పనిచేస్తున్న కూలీలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ పని చేసే ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో లేవు. దీంతో కూలీలు ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తాగునీరు కూడా దూరంగా ఉండడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు, పూతలపట్టులో.. చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్పేట పీహెచ్సీలో ఓఆర్ఎస్ కార్నర్ అలంకారప్రాయంగా ఉంది. గుడిపాలలోని పీహెచ్సీ, బొమ్మసముద్రంలోని పీహెచ్సీలో కూడా కార్నర్స్ ఏర్పాటు చేసి గాలికొదిలేశారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కొరవడుతోంది. బంగారుపాళ్యం మండలంలో ఓఆర్ఎస్ కార్నర్ను పక్కన పడేశారు. యాదమరి, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి మండలాల్లో షో చూపిస్తున్నారు. ఈ కార్నర్స్ రోగులు ఏమాత్రం ఉపయోగం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. తూతూమంత్రంగా.. కుప్పం: ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఓఆర్ఎస్ కార్నర్లు అలంకారప్రాయంగా మారాయి. కుప్పం నియోజకవర్గంలోని 12 పీహెచ్సీల్లో ఒక మూలన అట్ట బాక్సుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎండల తీవ్రత వల్ల కలిగే ఇబ్బందులను వివరించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం లేదు. ఎండదెబ్బకు గురైన వారికి మాత్రమే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక మూలన ఏర్పాటు పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు ఏరియా ఆస్పత్రితోపాటు కొలమాసనపల్లి, గంగవరం మండలంలోని గంగవరం, పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి, తీర్థం, వి.కోట మండలంలో వి.కోట, ఓగు, పెద్దపంజాణి మండలంలో రాయలపేట, పెద్దపంజాణిలోని ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ కార్నర్లను ఒక మూలన ఏర్పాటుచేశారు. పీహెచ్సీల్లో రెడీమేడ్గా ఓఆర్ఎస్ బాటిళ్లు ఉంచారు. ఎండదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చిన వారితో ఆ నీటిని తాగిస్తున్నారు. వైద్యశాఖ మార్గదర్శకాలు పాటించని సిబ్బంది వైద్యశాఖ మార్గదర్శకాల ప్రకారం ఎండల తీవ్రత పెరిగే కాలంలో ప్రతి పీహెచ్సీలోనూ తప్పనిసరిగా ఓఆర్ఎస్ కార్నర్ ఉండాలి. అంతేగాక తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచి ప్రజలకు తక్షణ సేవలు అందించాలి. జిల్లాలో అనేక పీహెచ్సీల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. చాలా వాటిల్లో కార్నర్లు ఉన్నా వినియోగంలో లేవు. కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి మూలనపడి పోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల ఆ ఊసే లేదు. శ్రీరంగరాజుపురం పీహెచ్సీ, అదే మండలంలోని అరిమాకులపల్లి పీహెచ్సీ, కార్వేటినగరంలోని కత్తెరపల్లి పీహెచ్సీ, బంగారుపాళ్యం పీహెచ్సీ, పెనుమూరు మండలాల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ కనుమరుగయ్యాయి. అలాగే చిత్తూరు, నగరి, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పలు పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. -
బొప్పాయి.. వింతేనోయి!
బంగారుపాళెం మండలంలోని వంకరవారిపల్లెకు చెందిన రైతు, మాజీ రైతు సంఘ నాయకుడు సుధాకర్రెడ్డి తన పొలంలో పండిన బొప్పాయిని ఇంటికి తీసుకొచ్చాడు. కాయను తినేందుకు కోయగా అందులో గింజలకు బదులుగా మరో తెల్లని బొప్పాయి దర్శనం ఇచ్చింది. అందులోని బొప్పాయిని కోయగా మరో బొప్పాయి ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. బొప్పాయి పండులో నల్లని గింజలు ఉండడం సాధారణం. అలాంటిది ఒకే బొప్పాయిలో మరో రెండు బొప్పాయిలు ఉండడం వింతగా అనిపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆ బొప్పాయిని చూసి ఆశ్యర్యానికి లోనయ్యారు. ఇది జన్యుపరమైన ప్రక్రియ అని వ్యవసా యాధికారులు అంటున్నారు. – బంగారుపాళెం బొప్పాయి లోపల తెల్లటి బొప్పాయి రెండో బొప్పాయిలో మరో బొప్పాయి -
అమ్మవారి సన్నిధిలో.. పోలీసుల అకృత్యం!
సాక్షి, టాస్క్ఫోర్స్: అమ్మవారి సన్నిధిలో.. పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ ఆదేశించారు.. తిరుచానూరు పోలీసు లు ఆచరించారు. నడి రోడ్డుపై ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన చిన్నపాటి గొడవకు రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్ సీపీకి చెందిన మాజీ సర్పంచ్ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి బలవంతంగా అరెస్టు చేశారు. వేలంపాట కోసమే ఇదంతా.. తిరుచానూరు పంచాయతీకి చెందిన ప్రైవేటు టూరిస్టు బస్టాండుకు పంచాయతీ అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించనున్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సీఐ సునీల్కుమార్ తిరుచానూరు తాజా మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డితో పాటు అతని సోదరుడు ఎంపీటీసీ నరేష్రెడ్డికి ముందుగానే టెండరు ప్రక్రియలో పాల్గొనరాదని హుకుం జారీ చేసినట్టు సమాచారం. అందుకు వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి అనుకోకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో వీరందరినీ ఇరికించే పనులను చకచకా పూర్తి చేసేశారు. అక్రమంగా కేసులు పెట్టడమే కాక వారిని పోలీస్ స్టేషన్లో నిర్భందించి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే తిరుచానూరు పోలీసులు లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది కూడా ఇదే తంతు గత ఏడాది మార్చి 24వ తేదీన పంచాయతీ టూరిస్టు బస్టాండు వేలం ప్రక్రియ జరిగింది. అప్పుడు కూడా పోలీసులు, టీడీపీ నాయకులతో చేతులు కలిపి ఇలాగే ప్రత్యర్థులను లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తిరుచానూరు పంచాయతీతో సంబంధం లేని టీడీపీ నేతలంతా అక్కడకు చేరుకుని అప్పటి సర్పంచ్ రామచంద్రారెడ్డి వర్గీయులు ఎవ్వరినీ లోపలకు వెళ్లకుండా టెండరు ఫారాలను చించివేసి నానా హంగామా చేస్తున్నా పోలీసులు చూస్తుండి పోయారు. అప్పుడు సర్పంచ్గా పదవిలో వున్న రామచంద్రారెడ్డి తన వర్గీయులను వేలం ప్రక్రియలో పాల్గొనేలా చేశారు. దీంతో అంతకుముందు కంటే రూ.61.94 లక్షలు అధికంగా పాడి పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్న వారందరినీ అక్రమ కేసులో ఇరికించి తమ ఆధీనంలోకి తీసుకోవడం అమానుషం. -
పోలీసుల తీరు ప్రమాదకరం
కార్వేటినగరం: చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ప్రమాదకరంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన ఆదివారం జిల్లా పార్టీ కన్వీనర్ భూమన కరుణాకరరెడ్డితో కలసి పుత్తూరులోని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ఇంటికి వచ్చారు. వారికి గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని పోలీసులు మఫ్టీలో వచ్చి మనుషులను ఎత్తుకెళ్లిపోతున్నారని ఆరోపించారు. తన విషయంలోనూ అక్రమంగా 18 రోజుల పాటు రిమాండ్లో పెట్టించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంపేస్తా అన్న పెమ్మసాని మాటకి కౌంటర్గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తమ్మిరెడ్డి అనే వ్యక్తిపై లాలాపేటలో కేసు నమోదు చేశారన్నారు. ఆపై పోలీసులు మఫ్టీలో 30వ తేదీ అతన్ని తీసుకెళ్లి 2వ తేదీ కోర్టులో హాజరుపరిచారన్నారు. ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎంతదారుణంగా వ్యవహరిస్తున్నాయంటే చెప్పలేక పోతున్నామన్నారు. ఏబీఎన్ వీకెన్డ్లో మహిళలను దుర్భాషలాడితే దాన్ని ఖండించాల్సింది పోయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం దాన్ని సమర్ధించేలా మాట్లాడడం తనను బాధించిందన్నారు. చంద్రబాబును జనసేన నాయకులు నిలదీయాలి పవన్కళ్యాణ్ అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపు కులాన్ని సైతం మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా కాపు కార్పొరేషన్కు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. కాపులకు ఒక్క లోను ఇచ్చారా..? అని ప్రశ్నించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. -
ప్రజాభిమానమే మన బలం
పెనగలూరు : ప్రజాభిమానమే వైఎస్సార్సీపీ బలమని, ఇదే స్ఫూర్తితో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అజయ్రెడ్డితో కలిసి పెనగలూరు మండలం ఎన్ఆర్పురం, పల్లంపాడు గ్రామాల్లో పర్యటించారు. ఆయనకు వందల సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మిథున్రెడ్డి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకంటే అధికంగా అమలు చేసిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందని కొనియాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం.. అభివృద్ధిని సమపాళ్లలో అందించామని వెల్లడించారు. చంద్రబాబు సర్కారు కేవలం మాటలకే పరిమితమవుతోందని, ఊకదంపుడు ఉపన్యాసాలతో నెట్టుకొస్తోందని విమర్శించారు. ఇకపై ప్రజలు చంద్రబాబు మాయమాటలను నమ్మే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్సీపీకే పట్టం కడతారని స్పష్టం చేశారు. అనంతరం పల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
అమరావతి కాదు..చంద్రావతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అమరావతి కాదు..చంద్రావతి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని అంబేడ్కర్ భవనంలో మాలల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ మాల, మాదిగలు కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2029 నాటికి దళితులు దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారని తెలిపారు. ఓబీసీలు కూడా దళితులతో కలిస్తేనే అధికారంలోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో పేదలు ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అక్కడున్నది చంద్ర బాబు అనుయాయులకు చెందిన భూములేన ని పేర్కొన్నారు. తాను తిరుపతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో నాయకులు పరదేశి తదితరులు పాల్గొన్నారు. పొట్టకూటి కోసం వచ్చి కానరాని లోకాలకు.. బైరెడ్డిపల్లె : పొట్టకూటికోసం వచ్చిన యువకు డు కానరాని లోకాలకు చేరుకున్నాడు. ఎండ వేడిమిని తాళలేక ఈత కు వెళ్లిన యువకుడు బురదలో కూరుకుపోయి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం బైరెడ్డిపల్లె పెద్దచెరువులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం రాణీపేటకు చెందిన శ్రీనివాసులు కుమారుడు ఢిల్లీదొరై (25) గంగినాయనపల్లెలో వినాయకస్వామి ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఎండవేడిమిని భరించలేక స్నేహితులతో కలిసి గంగినాయనపల్లె సమీపంలో ఉన్న బైరెడ్డిపల్లె పెద్దచెరువులో ఈతకు వెళ్లాడు. చెరువులో ఉన్న గుంతలోని బురదలో కూరుకుపోయాడు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పలమనేరు అగ్నిమాఫక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాఫక సిబ్బంది యోగానాథ్, శివరాజు, పాండు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశా రు. మృతుడి తండ్రి మూడునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ పోషణ భారం డిగ్రీ చదువుతున్న ఢిల్లీదొరై పడింది. కూలి పనుల కోసం వచ్చి మృత్యువాత పడడంతో తల్లి కన్నీరుమున్నీరైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఈఈ సెట్కు దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ విద్య తో గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే విద్యార్థులు డీఈఈ సెట్కు దరఖాస్తులు చేసు కోవాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ డీఈఈ సెట్ ఉపాఽ ద్యాయ వృత్తికి బంగారుబాట అని తెలిపారు. డీఎడ్ కోర్సు చదివేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు డీఈఈ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. 17 ఏళ్లు నిండి ఉండాలని, గరిష్ట వయోపరిమితి లేదన్నా రు. పరీక్ష విధానం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం లేదన్నా రు. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాల న్నారు. డీఈఈ సెట్లో అర్హత సాధించి డీఎడ్ పూర్తి చేసిన వారు టెట్, డీఎస్సీ పరీక్షలు రాసి ప్రభుత్వ టీచర్గా స్థిరపడవచ్చని వివరించారు. మే 12న తిరుపతి గంగ జాతర తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను మే 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం గంగమ్మ ఆలయంలో జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మే 5వ తేదీ రాత్రి చేపట్టే చాటింపుతో అమ్మవారి జాతర ప్రారంభమవుతుందన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూపంతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
విజ్ఞాన దీపం
బ్రష్ విత్ పేస్ట్ ప్రాజెక్టుతో తిరుపతి విద్యార్థులు రోసీ అరోమా ప్రాజెక్టుతో పుత్తూరు విద్యార్థులు కార్పొరేట్ సంస్థల సహకారం రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యే ఉత్తమ ప్రాజెక్టుల విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు నగదు చెల్లించి లైసెన్స్ తీసుకొనే అవకాశం ఉంది. తద్వారా సదరు కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకొంటుంది. ఈక్రమంలో కంపెనీ విద్యార్థులు కలసి ప్రాజెక్టును మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి పేటెంట్ హక్కులను దక్కించుకొని వ్యాపారవృద్ధికి దోహదపడుతాయి. ఒక్కోసారి విద్యార్థికి పెద్ద మొత్తంలో నగదు చెల్లించి పేటెంట్ హక్కును కంపెనీ పొందే అవకాశం సైతం ఉంటుంది. తద్వారా విద్యార్థికి గుర్తింపు, కెరీర్ అవకాశాలు మెరుగవుతాయి. పుత్తూరు: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, ఉద్యోగాలను సృష్టించే నాయకులుగా ఎదగాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిందే వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం. విద్యార్థి దశ నుంచే వ్యాపార ఆలోచనలను పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలతో పదిమందికి మార్గదర్శకంగా నిలపాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఈఎండీపీ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఓ వేదికగా తీర్చిదిద్దారు. విద్యార్థులను పరీక్షలకే పరిమితం కాకుండా నైపుణ్యంతో కూడిన తొలి అడుగుగా ఈఎండీపీ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఈఎండీపీ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ కొత్త ఆవిష్కరణలను సమాజం ముందుంచుతున్నారు. రాష్ట్ర స్థాయి ఎక్స్పో ఈ నెల 9వ తేదీన జరిగిన జిల్లా స్థాయి వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈఎండీపీ)లో మొత్తం 10 పాఠశాలల విద్యార్థులు తమ సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇందులో తిరుపతి ఎస్పీజేఎన్ఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జె.నవదీపిక, ఎ.తేజశ్రీ, కె.హేమశ్రీ ప్రదర్శించిన టూత్ ట్విన్ డ్యూ ప్రాజెక్టు ప్రథమ స్థానం కై వసం చేసుకొంది. పుత్తూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు పి.ధిల్లీరాణి, బి.శ్రీలక్ష్మీల రోసీ అరోమా ప్రాజెక్టు ద్వితీయ స్థానం కై వసం చేసుకొంది. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఈఎండీపీ ఎక్స్పోలో పాల్గొంటారు. విద్యార్థులు విజ్ఞాన దీపాలుగా వెలుగొందాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన నుంచి ఆవిష్కరించబడిన వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం(ఈఎండీపీ) నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తొలిసారిగా 2021 జూలై 20న 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టి, సమర్థవంతంగా అమలైంది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త ఆలోచనా విధానం.. అందుకు తగ్గ మార్గదర్శకత్వం వెరసి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వ్యాపార దృక్పథం ఈ మూడింటి మేళవింపుతో రూపొందించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. నా ఆలోచనలకు ఆచరణ రూపం కృత్రిమ పరిమళ ద్రవ్యాల స్థానంలో సహజ పదార్థాలతో మంచి పరిమళాన్ని తయారు చేయాలన్న నా ఆలోచనకు ఈఎండీపీ వేదికై ంది. మేం తయారు చేసిన రోస్ సెన్ట్ అనే ప్రకృతి పరిమళం ద్వారా కృత్రిమ పరిమళాలతో చర్మానికి కలిగే హానిని తప్పించవచ్చు. మా ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. – పి.డిల్లీరాణి, 9వ తరగతి విద్యార్థి, పుత్తూరు కొత్త విషయాలపై ఆసక్తి పెరిగింది ఈఎండీపీ కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరిగింది. ప్రకృతి పరిమళాన్ని తయారు చేయడం ద్వారా ప్రకృతి పదార్థాల ప్రాముఖ్యతను తెలుసుకొన్నాను. మా ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. – బి.శ్రీలక్ష్మీ, 9వ తరగతి విద్యార్థి, పుత్తూరు -
కొత్త ఆవిష్కరణలే లక్ష్యం
విద్యార్థులు కొత్తకొత్త ఆవిష్కణలే లక్ష్యంగా వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించబడుతోంది. 2026 ఏడాదిలో ఫేజ్–6లో భాగంగా తిరుపతిలో జిల్లా స్థాయి ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించాం. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి రాష్ట్ర ఎక్స్పోకు అర్హత సాధించిన తిరుపతి, పుత్తూరు విద్యార్థులకు అభినందనలు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు రూపొందించాలి. – సి.అనిత, ఈఎండీపీ జిల్లా కో–ఆర్డినేటర్, తిరుపతి మా పాఠశాలకు గర్వకారణం మా విద్యార్థులు కను గొన్న ప్రకృతి రోస్ పరిమళం రాష్ట్ర ప్రాజె క్టుగా ఎంపిక కావడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణం. ఇలాంటి సృజనాత్మక పరిశోధనల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఈఎండీపీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. మా ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి ఎంపికతో మా బాధ్యత మరింత పెరిగింది. ఆ దిశగా మరింత కృషి చేస్తాం. – కె.వి.శ్యామలత, మార్గ దర్శకురాలు, బాలికోన్నత పాఠశాల, పుత్తూరు పాఠ్య ప్రణాళికలో భాగం కావాలి విద్యార్థులను మరింతగా ప్రోత్సహించడానికి ఈఎండీపీని పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. వ్యవసాయం, మత్స్య, ఆహార శుద్ధి రంగాల్లో కొత్త ఆవిష్కరణల వైపుగా విద్యార్థులను మార్గదర్శకులు ప్రోత్సహించాలి. ఈఎండీపీ తరగతుల సమయాన్ని పెంచాలి. – వి.వెంకటరమణ, ఈఎండీపీ జిల్లా రీసోర్స్పర్సన్, తిరుపతి -
మళ్లీ రైస్ పుల్లింగ్!
కొంతమంది సులభంగా డబ్బు సంపాదించడానికి పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో పలమనేరు ప్రాంతంలో రైస్ పుల్లింగ్ ముఠాలు ఎక్కువగా ఉండేవి. పలువురిని మోసం చేసి రూ.లక్షలు స్వాహా చేశారు. పోలీసుల దాడులతో సైలెంట్గా ఉన్న వారు మళ్లీ విజృంభిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకుని సామాన్యులను ఈ ఉచ్చులోకి దించుతున్నారు. తాజాగా పెద్దపంజాణి మండలం కమ్మపాళెం గ్రామంలో రైస్ పుల్లింగ్ తరహా మోసం జరిగినట్టు తెలిసింది. పోలీసులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పడమర ప్రాంతాల్లో కొన్నాళ్లుగా రైస్ పుల్లింగ్ ముఠాల కదలికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న పలమనేరు ప్రాంతంలో ముఠా సభ్యులు మళ్లీ తమ కార్యకలాపాలను చేపట్టినట్టు తెలిసింది. కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకున్నట్టు సమాచారం. వారి మాటలు నమ్మి సులభంగా రూ.లక్షలు సంపాదించవచ్చనే ఆశతో చాలామంది ఈ వృత్తిలోకి దిగారు. గతంలో ఈ ముఠాలతో మోసపోయన బాధితులు సైతం తిరిగి ఇదే రొచ్చులోకి దిగి పలువురుని మోసం చేస్తున్నట్టు తెలిసింది. రైస్ పుల్లింగ్ అంటే.. పురాతన కాలం నాటి అక్షయ పాత్ర, రాగి పాత్రలు బియ్యాన్ని ఆకర్షించే శక్తి ఉండడాన్నే రైస్ పుల్లింగ్ అంటారు. వాస్తవానికి ఇది ఒక భ్రమ. కొందరు కొన్ని రకాల రసాయాలను ఉపయోగించి రాగి పాత్ర బియ్యాన్ని లాగేలా చేస్తారు. సైన్స్ పరంగా ఆలోచిస్తే రాగిలో ప్యారామ్యాగ్నటిజమ్ ఉంటుంది. ఇది హైడ్రోజన్ను స్వీకరించే గుణం కలిగి ఉంటుంది. వడ్ల పొట్టును తీసిన తాజా బియ్యపు గింజల్లో హైడ్రో కార్బన్లు ఉంటాయి కాబట్టి చర్య ప్రతిచర్య జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా ఇలాంటి బియ్యాన్ని ఆకర్షించే రాగి పాత్రలకు బయటి దేశాల్లో రూ.కోట్ల గిరాకీ ఉందని ఈ ముఠా సభ్యులు నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా పాతకాలం నాటి రాగి పాత్రల్లో ఎంతో విలువైన యురేనియం ఉంటుందంటూ చెబుతున్నారు. ఇందులో ఆర్పీ అంటే రైస్ పుల్లింగ్ అని, సీఆర్పీ కాపర్ రైస్ పుల్లర్ అని, సీఐపీ అంటే కాపర్ ఇరిడియమ్ రైస్ పుల్లర్ అని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు గుప్తనిధుల వేట కొన్ని ముఠాలు గుప్తనిధుల కోసం పలమనేరు మండలంలోని బాపలనత్తం పాండవగుహలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇక ఈ ప్రాంతంలోని పాడుబడిన పురాతన ఆలయాల కింద గుప్తనిధులు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడ్డాయి. ఆ ముఠా సభ్యుల మాటలు నమ్మిన కొందరు స్థానికులు దురాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవడంతోపాటు పోలీసులకు చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. అదృశ్యమవుతున్న వ్యక్తులు రైస్ పుల్లింగ్ ద్వారా సులభంగా లక్షాధికారులు కావచ్చనే ఆశతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొందరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. పదేళ్లలో దాదాపు పది మందికి పైగా అదృశ్యమైనట్లు సమాచారం. అలాగే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులు రూ.లక్షల్లో మోసపోయారు. రైస్ పుల్లింగ్ అంటూ ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ చెబుతున్నారు. రెచ్చిపోతున్న ముఠాలు -
ఉపాధి ఏదీ..?
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ పేదలకు వరంలా ఉన్న ఉపాధి హామీ పథకం ఇప్పుడు నీరసిస్తోంది. పథకం అమలులో క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా అందుతున్న గణాంకాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు అధికారుల పనితీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జిల్లాలో 2.46 లక్షల ఉపాధి జాబ్ కార్డులు ఉండగా, తక్కువ సంఖ్యలో కూలీలకు ఉపాధి దొరుకుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మందికి మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారనేది ఆందోళన కలిగించే విషయం. లక్షలాది మంది కూలీలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయి పని దొరకపోవడం పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఫలితంగా కుప్పం, పలమనేరు, గంగవరం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం ప్రాంతాల నుంచి పేద ప్రజలు కూలి పనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్తున్నారు. అలాగే చిత్తూరు, యాదమరి, నగరి, విజయపురం, కార్వేటినగరం, పాలసముద్రం ప్రాంతాల నుంచి తమిళనాడుకు వలస వెళ్తున్నారు. నెలల తరబడి అందని వేతనాలు గతంలో వారం తిరగకముందే కూలీల బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేవి. చంద్రబాబు ప్రభుత్వంలో నెలలు నిరీక్షించినా కూలీలకు వేతనాలు అందడం లేదు. జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడిన చిన్న రైతులు సైతం ఈ వేతనాల కోసమే ఎదురుచూస్తున్నారు. దీంతో నిత్యావసరాలు, పశుగ్రాసం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అప్పుల పాలవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం వెరసి అట్టడుగు వర్గాలకు అందాల్సిన ఫలాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతలు యంత్రాలతో పనులు చేసి కూలీలతో చేయించినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చేసుకుంటున్నారు. దీనిపై గతంలో కలెక్టర్కు ఫిర్యాదు అందగా ఆయన విచారణకు ఆదేశించారు. ప్రధాన సమస్యలు ఇవే.. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు ఉపాధి కరువైంది. అండగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం అధికారులు, కూటమి నేతల పుణ్యమా అని నిర్వీర్యమైంది. చట్టం ప్రకారం కూలీలకు వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉన్నా పరిస్థితి భిన్నంగా ఉంది. సరైన సమయంలో పనులను గుర్తించి అమలు చేయడం లేదు. చేసిన అరకొర పనులకు సైతం నెలల తరబడి బిల్లులు ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతలు యంత్రాలతో పనులు చేస్తున్నారు. వాటిని కూలీలతో చేయించినట్టు ఫొటోలు అప్లోడ్ చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. దీంతో పనులు లేక కూలీలు పట్టణాలకు వలస బాట పడుతున్నారు. జిల్లా సమాచారం జాబ్కార్డులు 2.46 లక్షలు నమోదైన కుటుంబాలు 2,46,472 నమోదైన కూలీలు 4,22,624 ఉపాధి పొందుతున్న కుటుంబాలు 1,03,386 ఉపాధి పొందుతున్న కూలీలు 1,54,316 కూలీల ఆశలు ఆవిరి జిల్లాలోని పడమటి మండలాలు ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులే పేదలకు ఆసరా. నేడు ఆ ఆశలు ఆవిరవుతున్నాయి. అడిగిన వారందరికీ పనికల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కూలీలకు పనులు దొరకడమే గగనమైంది. జిల్లాలో 2.46 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా వాటిలో కొద్ది మందికి మాత్రమే వంద రోజుల పని దక్కింది. 80 శాతం మంది కూలీలకు పనులు కల్పించలేదని అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. -
పూసల రవికి పూలే సేవా అవార్డు
పలమనేరు: రాష్ట్రంలోని సంచారజాతులకు చేసిన సేవలకు గాను పలమనేరు పట్టణానికి చెందిన సంచారజాతుల సంఘం నేత పూసల రవికి పూలే సేవా అవార్డు దక్కింది. పూలే జయంతి సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. పూసల రవి మాట్లాడుతూ తాను భవిష్యత్తులోనూ సంచారజాతుల హక్కులపై పోరాటాలు చేస్తానని తెలిపారు. ఆయనను స్థానిక బీసీ నాయకులు అభినందించారు. మామిడితోట దగ్ధం బైరెడ్డిపల్లె : మండలంలోని దొంతిరాళ్లపల్లె వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకు న్న అగ్నిప్రమాదంలో 3 ఎకరాల్లో ఉన్న మామిడి తోట కాలిపోయింది. దీంతో రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు విజయ్భాస్కర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మాట్లాడుతూ తాను 3 ఎకరాల్లో మామిడి తోట పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం కాయదశలో ఉన్న చెట్లకు గుర్తు తెలి యని వ్యక్తులు నిప్పు పెట్టారని వాపోయారు. దీంతో చెట్లు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపా రు. కక్ష సాధింపుల్లో భాగంగా మామిడి చెట్లకు నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శని వారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముందస్తుగా నేరాలను నియంత్రించడంలో భాగంగా ఈ తనిఖీలు (కార్డెన్ సెర్చ్) నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా కార్వేటినగరం మండలంలో నాటుసారా తయారీ కోసం నిల్వ చేసిన 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తు ల గురించి ఆరా తీశారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడానికే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చిత్తూరు కార్పొరేషన్ : గ్రామాల అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు తయారు చేసి అమలుచేయాలని పీఆర్ మంత్రిత్వశాఖ డీడీ, ఎన్ఐఆర్డీపీఆర్ బృందం సభ్యుడు సంతోషకుమార్ సిన్హా తెలిపారు. జాతీయ పంచాయతీ అవా ర్డుల కింద ప్రత్యేక కేటగిరి అవార్డులకు ఎంపిక కోసం పీఆర్ మంత్రిత్వశాఖ, ఎన్ఐఆర్డీపీఆర్ బృందం సభ్యులు క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం మాజీ సర్పంచులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్, అత్మనిర్భర్ స్పెషల్ పంచాయతీ అవార్డుల ఎంపికకు సంబంధించి జాబితా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆయా పంచాయతీల్లో పర్యటించి పలు అంశాలను పరిశీలించినట్టు వివరించారు. అనంతరం జెడ్పీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కేటగిరి అవార్డులు–2026 కింద క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా వివిధ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనుల ఫొటో గ్యాలరీని పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీపీఆర్ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ అంజన్ కుమార్ భంజా, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, రాష్ట్ర, జిల్లా విషయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
దూడపై కుక్కల దాడి
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు నగరంలో కుక్కల బెదడ ఎక్కువైంది. పలు ప్రాంతాల్లోని వీధుల్లో వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న వారి పై దాడిచేసి కరవడానికి ప్రయత్నిస్తున్నాయి. పిల్లలు ఒంటరిగా వెళ్లేటప్పుడు వారిపై దాడు లు చేస్తున్నా యి. మూగజీవాలపైనా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే టెలిఫోన్ కాలనీలో శనివారం దూడపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇటీవల నలుగురిని కుక్క కారవడంతో ఆస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్స్ వేసుకున్నారు. చీకటి వేళ్లలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు. -
సత్యమ్మ భూమినే స్వాహా చేస్తారా..?
● అధికార పార్టీ అండతో తప్పుడు పత్రాల సృష్టి ● ఉద్యోగాలు ఊడగొట్టేలా ఉద్యమిస్తాం ● హిందూ చైతన్య వేదిక సభ్యుల హెచ్చరిక చిత్తూరు రూరల్ (కాణిపాకం): అధికార పార్టీ అండ ఉందని ఇద్దరు వ్యక్తులు సత్యమ్మ సొత్తునే కాజేశారని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి ఆరోపించారు. వారి ఉద్యోగాలు ఊడగొట్టేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం చిత్తూరులోని ఆ సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జీడీనెల్లూరు మండలం పాతవెంకటాపురం గ్రామంలో 2.39 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయని తెలిపారు. అందులో సత్యమ్మ ఆలయాన్ని నిర్మించాలని స్థానికులు నిర్ణయించారని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుని భూ ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. వారు అక్రమంగా పట్టా పొంది ఆ భూమిలో సత్యమ్మ అమ్మవారి ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యం చేయడం దారుణమని వాపోయారు. అధికార పార్టీ అండతో తప్పుడు పత్రాలు సృష్టించిన ఉద్యోగుల ఉద్యోగాలు ఊడేలా ఉద్యమిస్తామన్నారు. ఈ విషయాన్ని సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో గ్రామస్తులు సుబ్రమణ్యం, నటరాజన్, కన్నయ్య, కృష్ణయ్య, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు
చిత్తురు కలెక్టరేట్ : జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయల్లో (కేజీబీవీ) 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల పర్వం కొనసాగుతోంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కేజీబీవీలో 40 సీట్ల చొప్పున 280 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు చొప్పున 280 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి 6వ తరగతికి 693 దరఖాస్తులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 670 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచడంతో మరో 2 వేల వరకు దర ఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన దరఖాస్తుల ఆధారంగా 6వ తరగతి, ఇంటర్లో ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున విద్యార్థులు పోటీ పడుతున్నారు. రామకుప్పం మండలంలోని విజలాపురం కేజీబీవీ పాఠశాల ప్రత్యేక తరగతుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఎంపిక ప్రక్రియ, పర్యవేక్షణ ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించానలే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉచిత వసతి, పోషక విలువలతో కూడిన భోజనం, సురక్షితమైన వాతావరణం తదితర వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని ఏడు కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఖాళీ సీట్ల కోసం బాలికలు అధికంగా పోటీ పడుతున్నారు. ప్రతి బాలికకూ విద్య అందాలన్నదే లక్ష్యం జిల్లాలోని కేజీబీవీల్లో అడ్మిషన్లకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఎస్పీడీ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచారు. కేజీబీవీల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. అర్హులైన బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా సమస్యలుంటే జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. – మద్దిపట్ల వెంకటరమణ, ఏపీసీ, సమగ్రశిక్ష శాఖ -
సామాజిక విప్లవ జ్యోతి పూలే
చిత్తూరు కలెక్టరేట్ : భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిరావు పూలే అని జాయింట్ కలెక్టరేట్ ఆదర్శ్ రాజేంద్రన్ కొనియాడారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో శనివారం పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పీసీఆర్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే సమాజంలోని అంటరాని తనం, కుల వివక్ష, మూఢ నమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. 1848లోనే తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. తద్వారా మహిళా విద్యకు పునాదులు వేశారని తెలిపారు. ఆయన చేసిన కృషి వల్లే నేడు వెనుకబడిన వర్గాల జీవితాల్లో విద్యా విప్లవం సాధ్యమైందన్నారు. పూలేను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాష, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టమాట ధరకు రెక్కలు
పలమనేరు: టమాట ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు నెలలుగా రైతులకు కన్నీళ్లు తెప్పించిన టమాట ధరలు శుక్రవారానికి కొంత ఊరటనిచ్చాయి. ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 15 కిలోల బాక్స్ రూ.250 దాకా పలకడంతో సంబరపడ్డారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని వడ్డిపల్లి మార్కెట్లో టాప్ సరుకు రూ.300దాకా పెరిగింది. టమాట పండే పలు రాష్ట్రాల్లో కావాల్సిన సరుకు అందుబాటులో ఉండడంతో ధరలు పలకని విషయం తెలిసిందే. ప్రస్తుతం వేసవి కారణంగా పలు చోట్ల తోటలు దెబ్బతినడం, ఎండ కారణంగా కాయల నాణ్యత తగ్గడంతో లోకల్ సరుకు ధరలు పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఆశాజనకంగా ధరలు ఇలా ఉండగా మేనెల నాలుగో వారంలో కోతకొచ్చే తోటలకు ధరలు ఆశాజనంగా ఉంటాయని ఇక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా ఉన్న తోటలు ఈనెల ఆఖరు కల్లా వడిగిపోతాయి. ఆపై కొత్త తోటలు కోతకు రావడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు. -
రక్తదానం సామాజిక బాధ్యత
చిత్తూరు కలెక్టరేట్ : సరిహద్దుల కొలతలే కాదు, ప్రాణాలను కాపాడ ఛిజలోనూ తాము ముందుంటామని గ్రామ సచివాలయ సర్వేయర్లు చాటిచెప్పారు. జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా రెవెన్యూ భవనంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రక్తదానం చేసిన సర్వేయర్లను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్త నిల్వల కొరత ఉందన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి శిబిరాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. జాతీయ సర్వే దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మంచి ఆశయం కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. ఈ శిబిరంలో సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ పుల్లయ్య, సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సోమకుమార్రెడ్డి, నాయకులు నరేష్ బాబు, వినోద్ కుమార్, షణ్ముగం, ప్రతాప్ రెడ్డి, దీపిక, దేవేంద్రనాయక్, పరిమళ, నరసింహులు, భవ్య, యుగంధర్, ప్రకాష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్ల నాటి రికార్డులు భద్రం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని మిట్టూరులో ఉన్న పాత ప్రసూతి ఆరోగ్య కేంద్రం మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. అక్కడ భద్రపరిచిన ఏళ్ల నాటి జనన–మరణ రికార్డులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ప్రారంభమైన కమ్యూనిటీ క్లినిక్లో ఈ పురాతన రికార్డులను ప్రదర్శనకు ఉంచారు. 1917 నుంచి 1936 వరకు రికార్డులు ఇప్పటికీ చెదరకుండా ఉండడం విశేషం. ఆ కాలంలో ఏడాదికి 300కు పైగా శిశు మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ రికార్డులు కేవలం పాత డేటా మాత్రమే కాకుండా, వైద్య రంగంలో జరిగిన మార్పులకు ప్రతీకగా నిలుస్తున్నాయి. -
ఆల్రౌండర్ దొంగలు అరెస్ట్
నలుగురు అంతర్రాష్ట దొంగలను పలమనేరు పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచరే కారణమా? మొన్నటి వరకు తిరుపతి జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చిన ఆ ఇద్దరు తహసీల్దార్లు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆక్రమణలు చోటుచేసుకున్న విషయాన్ని ప్రశ్నించడమే వారి పాలిట శాపంగా మారింది. ఆ ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న చోటామోటా నాయకుడు 25 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. అందులో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆ చోటా నాయకుడికి తెలియజేయడంతో పాటు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమచారం. దీన్ని జీర్ణించుకోలేని ఆ చోటామోటా నేత సదరు ప్రజాప్రతినిధి చెవిన వేశారు. వెంటనే వారికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉన్నతాధికారి వద్దకు వచ్చి కూర్చొని ఆ ఇద్దరినీ బదిలీ చేయమని ఒత్తిడి చేయడం జరిగినట్లు తెలిసింది. చేసేది లేక ఉన్నతాధికారి వారికి విషయం తెలియజేశారు. అయితే రాత పూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. దీంతో రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్ కార్యా లయాలు మూడు రోజులుగా వెలవెల బోతున్నాయి. వివిధ రెవెన్యూ సమస్యలపై వచ్చేవారు, సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు తహసీల్దార్లు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. -
కల్యాణ మండపానికి భూవిరాళం
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లికి చెందిన రత్నాబయోటెక్ అధినేత రత్నారెడ్డి, గంగిరెడ్డిందంపతులు యోగివేమారెడ్డి చారిటబుల్ ట్రస్టుకు అదే గ్రామంలో రూ.4 కోట్ల విలువైన ఎకరా 95 సెంట్ల భూమిని దానం చేశారు. దీంతో ట్రస్టు అధ్యక్షులు చెంగారెడ్డి సంఘ సభ్యులతో కలసి వారి స్వగ్రామం కొలమాసనపల్లిలో శుక్రవారం దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, జయప్రకాష్రెడ్డి, నక్కపల్లి భాస్కర్రెడ్డి, బాలాజీరెడ్డి, రమేష్రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, మనోజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువకుడిపై దాడి శ్రీరంగరాజపురం : కాపు కాచి యువకుడిపై దాడి చేసిన ఘటన మండలంలోని పెద్దతయ్యూరు గ్రామం కొత్తరోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం చిన్న కుమారుడు మధుబాబు చిత్తూరులోని అమరరాజ ప్యాక్టరీలో గురువారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామం పెద్దతయ్యూరు గ్రామానికి నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో 49 కొత్తపల్లిమిట్ట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కాపు కాసి మధుబాబుపై దాడిచేసి గాయపరిచారు. గాయపడిన మధుబాబుకు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఐవీఆర్ఎస్పై అవగాహన కల్పించండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఐవీఆర్ఎస్పై అవగాహన పెంచి..సేవలను మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ కాల్పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏ పరిస్థితుల్లోనూ పీహెచ్సీలు కనిష్ట స్థాయికి పడిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. పీహెచ్సీల పరిసరాల పరిశుభ్రత కోసం హెచ్డీఎస్ నిధులను వినియోగించుకోవచ్చన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఐవీఆర్ఎస్పై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తే, వారు ఐవీఆర్ఎస్లో అనుకూల స్పందన ఇస్తారని పేర్కొన్నారు. మరణాల విశ్లేషణ (డెత్ అనాలసిస్) నివేదికలను రెండు రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి నెలా పీహెచ్సీలకు కేటాయిస్తున్న నిధులను సమర్థంగా వినియోగించాలన్నారు. అలాగే, డాక్టర్లు పీహెచ్సీలలో అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతర సేవలు అందించాలని, నైట్ డ్యూటీ నిర్వహించే సిబ్బంది శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులే ఉండాలన్నారు. అత్యవసర రోగుల కోసం వీల్చైర్లు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ పెనుమూరు(కార్వేటినగరం): పెనుమూరు మండలంలోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుఖాణాలపై శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి, క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రీకాంత్రెడ్డి ఆకస్మికంగా దారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ నకిలీ మందులు, విత్తనాలు విక్రయి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆపే దమ్ముందా?
నిఘా ఏదీ? డీజిల్ స్మగ్లింగ్లో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాణిజ్య పన్నులు, పోలీసు శాఖలపై ఈ స్మగ్లింగ్ అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడో మూడు నెలలకోసారి రెండు లారీల డీజిల్ను సీజ్ చేసి అపరాధ రుసుము కట్టించే వాణిజ్య పన్నులశాఖలోని నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇక పోలీసుశాఖలో నెలవారి మామూళ్లు తీసుకునే ఒకరిద్దరు అధికారులు అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరులో అధికారులు సీజ్ చేసిన కర్ణాటక డీజిల్ చిత్తూరు అర్బన్: జిల్లాలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలు, అంతర్రాష్ట్ర జాతీయ రహదారుల పనులు ఓవైపు.. గ్రానైట్ పరిశ్రమలు, ఇతర మధ్య–భారీ పరిశ్రమల్లో పనులు ఇంకో వైపు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం రోజూ వందల సంఖ్యలో భారీ వాహనాలు తిరుగుతున్నాయి. ఇసుక నుంచి కంకర వరకు, గ్రానైట్ నుంచి ముడిసరుకు రవాణాకు భారీ వాహనాలు తప్పనిసరి. వాహనాలతో పాటు ఫ్యాక్టరీలకు కావాల్సిన ఇంధనం అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి జిల్లాలోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో గండిపడుతోంది. – ఈనెల 6న కర్ణాటక నుంచి చిత్తూరుకు ఓ మినీ వ్యాను వస్తోంది. నంగిలి వద్ద విధుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.1.8 లక్షల విలువైన 1,800 లీటర్ల డీజిల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. .. ఇది ఒక్క ఆరో తేదీనే కాదు. నిత్యం జిల్లాలోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి దొంగచాటుగా డీజిల్ తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. అధికార పలుకబడి ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు తమకెందుకులే అన్న ధోరణితో నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు. ధరలో వ్యత్యాసం చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్ అన్ని పన్నులు కలుపుకుని రూ.98.16 ఉండగా.. కర్ణాటకలోని కోలార్లో రూ.91.21 ఉంది. రాష్ట్రాల్లో ఎకై ్సజ్ సుంకం కారణంగా ఈ వ్యత్యాసం ఉంది. అంటే లీటరుకు రూ.7 వరకు కర్ణాటకలో తక్కువ. దీన్ని ఏపీలోకి తీసుకొస్తే సుంకం చెల్లించాలి. అపుడు అది కూడా రూ.వంద దాటుతుంది. కానీ కొందరు స్మగ్లర్లు నకిలీ బిల్లులు సృష్టించి రోజుకు డ్రమ్ముల్లో, లారీల కొద్దీ డీజిల్ను సరిహద్దులు దాటించి జిల్లాలోకి తీసుకొస్తున్నారు. ఒక్కో లారీలో 10 వేల లీటర్ల చొప్పున రోజుకు 50 వరకు లారీలు అధికారుల కళ్లుగప్పి జిల్లాలోకి వస్తున్నాయి. దీనికితోడు డీజిల్లో ఇతర నూనెలను మిక్స్ చేసి కల్తీ చేస్తున్నారు. ఫలితంగా వీటిని వాహనాలకు పోయడం ద్వారా వాయు కాలుష్యం శాతం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అధికారుల తనిఖీల్లో ఇవి పట్టుబడితే రెట్టింపు మొత్తం అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల లీటర్లు తెచ్చినందుకు ఒక్కో లారీ రూ.2 లక్షల వరకు అపరాధ రుసుము చెల్లించాలి. మరోవైపు తమిళనాడు నుంచి కూడా కొద్ది మొత్తంలో డీజిల్ జిల్లాలోకి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ డీజిల్ కారణంగా నెలకు రూ.కోట్లల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. చిత్తూరు–పలమనేరు కేంద్రంగా కర్ణాటక నుంచి వచ్చే డీజిల్ కోలార్ మీదుగా నంగిలి చెక్పోస్టు దాటుకుని జిల్లాలోకి వస్తోంది. ఇందులో పెద్ద మొత్తంలో డీజిల్ చిత్తూరుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు నగర శివారుల్లోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు అక్రమంగా డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఇక పశ్చిమ మండలాల్లోని ఫ్యాక్టరీలకు పలమనేరును డీజిల్ డంపింగ్ కేంద్రంగా మార్చుకుంటున్నారు. రోజుకు దాదాపు 20 వేల లీటర్ల వరకు డీజిల్ అక్రమ మార్గాల్లో జిల్లాలోకి చేరుతున్నట్లు సమాచారం. కొందరు బడా వ్యక్తులు వారికున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కొన్ని టిప్పర్లకు కర్ణాటక నుంచి డీజిల్ తెప్పించి వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ప్రధానంగా కోలార్–పలమనేరు, నంగిలి–చిత్తూరు, చిత్తూరు–గుడియాత్తం, చిత్తూరు–పొన్నై, చిత్తూరు–కాట్పాడి మార్గాల నుంచి డీజిల్ను తీసుకొచ్చి జిల్లాలోకి డంప్ చేస్తున్నారు. కర్ణాటక నుంచి జిల్లాలోకి భారీగా డీజిల్ దిగుమతి -
మావిగన్తోనే రాష్ట్రాభివృద్ధి
పాలసముద్రం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ ద్వారానే రాష్ట్ర భవిష్యత్కు మంచి మార్గం ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం అమరావతి రాజధాని పేరిట దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరుగుతోందని విమర్శలు ఎక్కుపెట్టారు. శుక్రవారం పాలసముద్రంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు అమరావతి పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. కడపలో ఉక్క కార్మాగారం, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక ప్రతిపత్తి వంటి హామీల గురించి ఎప్పడైన ప్రశ్నించారా..? అని నిలదీశారు. ఆమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల ప్రజలకు పెద్దగా లాభం కలగలేదన్నారు. నాగులు గ్రామాల పరిధిలో లక్ష ఎకరాల భూసేకరణకు ప్రయత్నించడం సమంజనం కాదన్నారు. దాని అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఇది సాధ్యమయ్యే అంశమా..? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల ప్రజలపై భారీ అప్పులు మోపి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ ప్రతిపాదిస్తున్న మావిగన్ మోడల్నే రాష్ట్ర భవిష్యత్కు అనుకూలమని వివరించారు. ఏబీఎస్ రాధాక్రిష్ణ మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని, ఇలాంటి నీచ, నికృష్ట భాష వాడిన బూతుల కిట్టుకి మహిళలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జెడ్పీటీసీ సభ్యుడు అన్బ్లగన్, మాజీ మండల కన్వీనర్ సుందరరాజు, షణ్ముగరెడ్డి, నరసింహనాయుడు, మదివానన్, వేణు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆల్రౌండర్ దొంగలు అరెస్ట్
వెండి స్వాధీనం పలమనేరు: నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను క్రైమ్పార్టీ పోలీసులు, వీకోట పోలీసులు అత్యంత చాకచక్యంగా వీకోట మండలంలోని తమిళనాడు సరిహద్దు నాయకనేరి వద్ద శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.12 లక్షల విలువజేసే బంగారు, వెండి, దేవతా విగ్రహాలు, పొట్టేళ్లు, ద్విచక్ర వాహనాలు, ఓ కారును రికవరీ చేశారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం విలేకరులకు వివరించారు. వీకోట మండలంలో వరుస చోరీలు నియోజకవర్గంలోని వీకోట మండలంలో ఇటీవల తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు, పొట్టేళ్లు, బైక్ల వరసు దొంగతనాలు జరిగాయి. దీనిపై జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో డీఎస్పీ ఉత్తర్వు మేరకు వీకోట సీఐ సోమశేఖర్, క్రైమ్ సిబ్బందితో కలిసి రెండు టీమ్లు ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో వీకోట సమీపంలోని నాయకనేరి చెక్పోస్టు వద్ద దొంగలను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక రాష్ట్రం, బంగారుపేట తాలూకా, చిన్నకోటేకు చెందిన ఆర్.రాజేంద్ర అలియాస్ రాజన్న(57), వీకోట మండలం చిన్నాగేపల్లికి చెందిన మురుగ అలియాస్ కాశి(34), కర్ణాటకలోని కేజీఎఫ్కు సమీపంలోని గిడ్డేగౌడనహళ్లికి చెందిన కన్నన్(51), రామకుప్పం మండలం, బందార్లపల్లికి చెందిన రాజశేఖర్(29)లున్నారు. అందరూ స్పెషలిస్ట్ దొంగలే రాజేంద్రపై కర్ణాటకలోని విద్యారణ్యపుర, కొడిగేహళ్లి, బసవేశ్వరనగర, మడివాల, ముళబాగిళ్లలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీ చేసేవాడు. పొట్టేళ్లుకూడా పట్టుకెళ్లేవాడు. ఇలా ఇతనిపై 50 పాత కేసులున్నాయి. తాజాగా వీకోట మండలంలో ఐదు కేసులు, పలమనేరు మండలం నక్కపల్లిలో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీలో ప్రమేయం ఉంది. ఇక మురుగపై సెల్ఫోన్ల చోరీలు, బైక్చోరీలు, ఆలయాల్లో విగ్రహాల చోరీల్లో స్పెషలిస్ట్గా ఉంటూ ఇతనిపై నాలుగు కేసులున్నాయి. కన్నన్ పొటేళ్ల దొంగగా ఇతనిపై నాలుగు కేసులున్నాయి. రాజశేఖర్ ఇళ్లలో, గుళ్లలో దొంగతానాలు చేస్తుంటాడు. ఇతనిపై వీకోట మండలంలో రెండు కేసులున్నాయి. అందరూ కలిసికట్టుగా.. వీరందరూ కలిసి అన్నిరకాల చోరీలను ఓ పద్ధతిలో చేయడం వీరి ప్రత్యేకత. వేలిముద్రలు దొరక్కుండా చేతులకు తొడుగులు, ఫోన్లు వాడకుండా, సెల్ టవర్ లోకేషన్లు లేనిచోటే చోరీలకు పాల్పడుతుంటారు. పక్కాగా రెక్కీ చేసి తమ వద్దనున్న కారులో స్పాట్కు వెళ్లి దర్జాగా చోరీలు చేయడం వీరి ప్రత్యేకత. ఈ కేసును త్వరిత గతిన ఛేదించిన వీకోట సీఐ, క్రైమ్ పార్టీని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్తు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలమనేరు సీఐ మోహన్రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు రికవరీ చేసుకున్న ఆభరణాలు మాట్లాడుతున్న డీఎస్పీ డేగల ప్రభాకర్ -
డ్వామా పీడీ ఫైర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉపాధి పనులు కల్పించడంలో చిత్తూరు మండలం అధ్వాన్నంగా ఉందంటూ డ్వామా పీడీ రవికుమార్ ఉపాధి హామీ సిబ్బందిపై మండిపడ్డారు. చిత్తూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ బహిరంగ సభ నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలో మొత్తం ఉపాధి హామీ కింద 583 పనులు, పంచాయతీరాజ్ కింద 71 పనులు.. ఇలా మండలంలో 654 పనులు చేపట్టి రూ.5.7 కోట్లు వ్యయం చేశారు. వీటిపై వారం రోజులుగా మండలంలో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు చేపట్టింది. జరిగిన అవినీతిని కాసింత బయటకు చూపింది. కొండంత దాచిపెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ సభలో నిబంధనలు ఉల్లంఘించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.14,165, క్వాలిటీ కంట్రోల్ కింద రూ.19,803 జరిమానా విధించారు. నిబంధనలు పాటించని రైతులకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పీడీ ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యంపై మండిపడ్డారు. లక్ష్యం మేరకు పనులు కల్పించకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. విద్యుత్ షాక్తో రైతు మృతి బైరెడ్డిపల్లె: వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో మండలంలోని తీర్థం గడ్డూరు గ్రామానికి చెందిన కిట్టప్ప (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల కథనం.. కిట్టప్ప వ్యవసాయ పొలం వద్ద బోరు మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశా త్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రైతులు గమనించి విషయం కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. కిట్టప్ప భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తొట్టంబేడులో ముగ్గురు బదిలీ
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ముగ్గురు రెవెన్యూ అధికారులను శుక్రవారం బదిలీ చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు చెప్పిన పనులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ చోటామోటా నాయకుడు జిల్లా లోని ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. వెంటనే రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫోన్ చేసి ఆ ముగ్గురిని బదిలీ చేయమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక ఆ ముగ్గురిని కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటు సస్పెండ్కి గురైన ఓ రెవెన్యూ అధికారి టీడీపీ నాయకులకు ముడుపులు సమర్పించుకుని పోస్టింగ్ తెచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మెరిసిన ‘లాఠీ’
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసుశాఖకు అరుదైన గౌరవం దక్కింది. పోలీసుశాఖ పనితీరులో రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసుశాఖకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు పెంపొందించడం, రికవరీల్లో పనితీరు ఉత్తమంగా ఉండడంతో ఈ ర్యాంకు దక్కినట్టు ఎస్పీ తుషార్డూడి తెలిపారు. పోలీసుశాఖ పనితీరు ఆధారంగా ర్యాంకులు వస్తుంటాయని, ఈ నెంబర్లు అనేవి శాశ్వతం కాదని తెలిపారు. కానీ ప్రజలు పోలీసుశాఖను ఏ మేరకు విశ్వసిస్తున్నారు..? ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ఇంకా ఏం చేయాలి..? తమ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలి..? అనే ప్రశ్నలు నిత్యం ఎదురవుతాయన్నారు. చిత్తూరులో డ్రోన్ కెమెరాల ద్వారా మందుబాబులను గుర్తిస్తున్న పోలీసులు (ఫైల్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చిత్తూరులో రూ.34 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం(ఫైల్) -
కాదు..కూడదంటే..
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సీనియారిటీ జాబితా విడుదల చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎస్జీటీ కేడర్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన టీచర్ల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను ఠీఠీఠీ.ఛిజిజీ్ౌట్ౌటటఛీ్ఛౌ.ఛిౌఝ వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. ఈ జాబితాను ఆయా మండలాల ఎంఈవో, డీవైఈవో మెయిల్స్కు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే ఈ నెల 11 నుంచి 16వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో సరైన ఆధారాలతో అందజేయాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించేది లేదని డీఈఓ స్పష్టం చేశారు. మసీదులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మసీదులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని మసీదుల నిర్వహణ కమిటీలు, గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్, మౌజన్ లు తమ మసీదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమీద్ పోర్టల్లో మసీదుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మసీదు మేనేజింగ్ కమిటీలు తమ మసీదుకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్లతో కలెక్టరేట్లోని జిల్లా వక్ఫ్బోర్డ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా ఉమీద్ పోర్టల్లో రిజి స్ట్రేషన్ పూర్తి చేయని మసీదులకు సంబంధించిన ఇమామ్లు, మౌజన్లకు ప్రస్తుతం అందుతున్న గౌరవ వేతనాన్ని రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 13న ఐటీఐలో అప్రెంటీస్ మేళా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13న అప్రెంటీస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 9 నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనేందుకు అర్హులన్నారు. హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఒరిజనల్ విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వారు సంబంధిత వివరాలతో, నమోదు చేసుకోని వారు తమ సర్టిఫికెట్లతో నేరుగా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నిబంధనలతో మీకు పనిలేదు. మేం చెప్పింది చెయ్యి.. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ కూటమి నేతలు అధికారులను ఉసిగొల్పుతున్నారు. తమకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. మాట వినని వారిపై ని ఘా పెడుతున్నారు. పైఅధికారులపై ఒత్తిడి తెచ్చి వారి విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. కాదు.. కూడదంటే ఉద్యోగమే లేకుండా చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తమ పలుకబడి ఉపయోగించి సంబంధిత అధికారుల నుంచి ఒత్తిడి చేయిస్తున్నారు. ఆపై ఉద్యోగమే లేకుండా.. ఎక్కడా పోస్టింగే ఇవ్వకుండా పక్కన బెట్టేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. తాము చెప్పిన పనులు చేయడం లేదని తిరుపతి జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లను పక్కనబెట్టేశారు. మూడు రోజులవుతున్నా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించకుండా చోద్యం చూస్తున్నారు. అదే నియోజకవర్గంలో మండల నాయకుడి మాట వినడం లేదని తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు రెవెన్యూ అధికారులను కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పలమనేరులోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది. మూడు రోజులైనా..? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మూడు రోజులుగా రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లు కార్యాలయానికి రావడం లేదు. వారిని బదిలీ చేశారా? లేదా? కూడా తెలియడం లేదు. పోనీ ఆ స్థానంలోకి వేరొక అధికారి వచ్చారా? అంటే అదీ లేదు. జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యమైన మండలాల్లో రేణిగుంట, ఏర్పేడు ప్రధానమైనవి. రెవెన్యూతో పాటు.. ప్రొటోకాల్ వ్యవహరాలు అధికంగా ఉంటాయి. అటువంటి మండలాల్లో మూడు రోజులుగా తహసీల్దార్లు లేరు. ఉన్న ఇద్దరు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఆగ్రహానికి లోనైనట్టు సమాచారం. ఆ ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేయమని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్టు వినకపోతే ఎక్కడ అమరావతి నుంచి ‘ముఖ్య’ నేతల నుంచి తిట్టిస్తారోనని భయపడి ఉన్నతాధికారి ఆ ఇద్దరు తహసీల్దార్లకు సమచారం ఇచ్చారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ అధి కారులు హడలిపోతున్నారు. కూటమి నే తల బెదిరింపులు, వేధింపులతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా అవినీతి మరక అంటని వారు తెలిసితెలి సి తప్పులు చేయలేక.. అధికార పార్టీ నేత ల బూతు పురాణం వినలేక.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక కుమిలిపోతున్నారు. తీరా కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు పోగా.. ఉద్యో గమూ లేకుండా పక్కన బెట్టేయడం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. ఇంతబతుకు బతికీ.. తీరా ఇలా చేస్తారని అనుకోలేదని తమ సన్నిహితుల వద్ద చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారు. ఇంతకీ ఏమిటా కథా.. ఎందుకంత ఆవేదన.. మీరే చదవండి! తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతల కర్ర పెత్తనం ఇన్చార్జ్ కనుసన్నల్లోనే అధికారులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకోకపోతే ఏ అధికారి ఉద్యోగం చేయలేని దుస్థితి. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలాని కి ఒకరు టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆ ఇన్చార్జ్కి తెలియకుండా ఏ ఒక్క ఫైలు కదలడానికి వీల్లేదు. రెవెన్యూ అప్పీళ్లపైనా ఆ ఇన్చార్జ్ చెప్పినట్లు అధికారులు నడుచుకోవాలి. లేదంటే, ఆ అధికారి అక్కడ పనిచేయలేరు. నెల క్రితం తవణంపల్లె తహసీల్దార్ను నిర్ధాక్షి ణ్యంగా బదిలీ చేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. -
నిప్పుల వాన
03–04–2026 38 04–04–2026 39 05–04–2026 38 06–04–2026 40 07–04–2026 40 08–04–2026 39 09–04–2026 39 10–04–2026 39కాణిపాకం: మార్చి ప్రారంభం నుంచి క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో ఉగ్రరూపం దాల్చాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 11 నుంచి 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండప్రచండమై! చిత్తూరు జిల్లాలో కర్ణాటక సరిహద్దు మండలాలైన కుప్పం, రామకుప్పం, శాంతిపురం, వి.కోట, పలమనేరు, బైరెడ్డిపల్లి, గంగవరం ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొంత తగ్గింది. బంగారుపాళ్యం, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి ప్రాంతాల్లో పరిస్థితి పర్వాలేదనిపిస్తోంది. అయితే తమిళనాడు సరిహద్దు మండలాలైన గుడిపాల, జీడీనెల్లూరు, కార్వేటినగరం, పాలసముద్రం, నగరి ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. తమిళనాడు నుంచి వచ్చే వేడి గాలులతో ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తిరుపతి జిల్లా వైపు ఉన్న మండలాల్లో కూడా ఎండలు భగభగమంటున్నాయి. రోడ్లపై శీతలపానీయాల సందడి ఎండ ధాటికి ప్రజలు శీతలపానీయాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రధాన రహదారుల వెంట జ్యూస్ దుకాణాలు, కొబ్బరి బొండాలు, నిమ్మరసం, చెరుకు రసం బండ్లు పెరిగాయి. మహిళలు చీర కొంగులు, టవళ్లు, స్కార్ఫ్లు కట్టుకుని ఎండను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు అధిక ధరలకు నాణ్యత లేని పానీయాలు విక్రయిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాల పంజా ఎండల తీవ్రతతో పాటు జిల్లాలో జ్వర పీడిత కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దగ్గు, జలుబుతో పాటు జ్వరం వారం రోజుల పాటు తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. చిన్నపిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. గత 12 రోజుల్లో 7,372 జ్వర పీడిత కేసులు నమోదయ్యాయి. వచ్చే వారం ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్త సుమా! ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తునానరు. జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావాలంటే జంకుతున్నారు. ముఖ్య కూడళ్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. వేడి గాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్కపోత, వేడికి తట్టుకోలేక జనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు పరిమితమవుతున్నారు. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదవుతుండగా, వచ్చే వారం 43 డిగ్రీల వరకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు జ్వర పీడితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రత వివరాలు జిల్లాలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత చల్లటి పానీయాల జోలికెళ్లొద్దు ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో అక్కడక్కడ కనిపించే చల్లనీ పానియాల జోలికెళుతున్నారు. ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లగా ఓ జ్యూస్ ఇవ్వమని అడుగుతున్నారు. ఐస్ ముక్కలు ఎక్కువగా వాడే జ్యూస్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు ఐస్ ముక్కల వాడకం తగ్గించుకుని జ్యూస్ తాగడం మంచింది. మండే ఎండల పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేషస్కరం. – అశోక్కుమార్, వైద్యనిపుణులు, చిత్తూరు తలదాచుకోవడం మేలు ప్రస్తుత ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే వారం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశాం. వడదెబ్బతో వచ్చే వారిని గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశాలిచ్చాం. పనివేళల్లో డాక్టర్లు కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించాం. ప్రజలు కూడా మండే ఎండల దృష్ట్యా తలదాచుకోవడం మేలు. ఈ ఎండల్లో అతిగా తిరగొద్దు. – నాగశశిభూషణ్రెడ్డి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు -
ఎంత పని చేశావే కోడి?
– రెండు నాటు తుపాకీలు లభ్యం గుడిపాల: కోడి తెచ్చిన తంట.. ఓ నాటు తుపాకీ లభ్యమయ్యేట్టు చేసింది. వివరాలు.. మండలంలోని చింతగుంటూరు గ్రామంలో రాజేంద్రన్, రమేష్ కుటుంబాలకు చెందిన ఒక నాటుకోడి కనిపించకుండా పోయింది. దీంతో వారు చుట్టుపక్కల వెదికారు. తీరా ఆదే గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే అతను నాటుకోడిని దొంగలించి తినేశాడని తెలుసుకున్నారు. దీంతో చిట్టిబాబును వారు నిలదీశారు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన రాజేంద్రన్, రమేష్ కత్తి తీసుకొని వీధిలోకి వచ్చారు. చిట్టిబాబు తన ఇంట్లో ఉన్న నాటు తుపాకీని బయటికి తెచ్చి వారికి చూపించడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై గుడిపాల పోలీసులకు రమేష్, రాజేంద్రన్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ గ్రామంలో చిట్టిబాబును విచారించగా మరో నాటు తుపాకీ కూడా లభ్యమైంది. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మాజీ సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యం చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి ప్రా ధాన్యతనిస్తున్నట్లు కమాండర్ నిఖిల్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు తెలిపారు. శుక్రవారం జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన మాజీ నావికాదళ సైనికులు, కుటుంబ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మాజీ సైనికుల పెన్షన్ సాంకేతిక సమస్యలను పరిష్కరించారన్నారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల నావికాదళం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య, సభ్యులు రాజన్, రఘుపతి, వెంకట్ పాల్గొన్నారు. -
పరిపూర్ణం.. వసంతోత్సవం
కార్వేటినగరం: కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక వసంతోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వేద పండితులు వేకువ జామున సుప్రభాత సేవతో స్వామివార్లను మేల్కొల్పి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, చందనం, పసుపు, తేనె, నారికేళం వంటి సుగంధ జలాలతో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారు.. ఆదే విధంగా సీతాసమేత కోదండరాముడు తిరుచ్చి వాహనలపై కొలువు దీర్చారు. మంగళ వాయి ద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ సూపరింటెండెంట్ మునిశేఖర్ఽ, ఆలయ అధికారి చెంగల్రాయులు, అర్చకులు శభరి, గోపాలాచారి పాల్గొన్నారు . -
● లేకుంటే ఎమ్మెల్యేకి చెప్పి బదిలీ చేస్తాం ● తహసీల్దార్ కార్యాలయంలో రెచ్చిపోతున్న ఎమ్మెల్యే అనుచరులు
మేం చెప్పిందే చేయాలి! పాలసముద్రం : ‘మేం చెప్పిందే చేయాలి. లేకుంటే మీరు బదిలీ కావడం ఖాయం. ఎమ్మెల్యే మా వాడే. ఆయనకు చెప్పి మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేస్తాం..’ అంటూ స్థాని క ఎమ్మెల్యే థామస్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నా రు. తరచూ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులను వేధిస్తున్నారు.ఎర్రమట్టి, గ్రావెల్, డీకేటీ భూమి, ఖాళీ స్థలాలు, క్వారీలు వంటి వాటిని ఫైల్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో భూ రీసర్వే సైతం తమ కనుసన్నల్లోనే చేయాలని వేధి స్తున్నారు. శ్రీకావేరిరాజుపురం పంచాయతీకి చెందిన ఒక చోటా టీడీపీ నాయకు డు మండలంలోని 13 పంచాయతీల్లో ఏ ఒక్కటి చేయాలన్నా.. తనను అడిగి చేయాల్సిందేనని, లేకుంటే ఎమ్మెల్యేకు మీపై లేనిపోనివి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లగొడతానని భయపెడుతున్నట్టు తెలుస్తోంది. వనదుర్గాపురం పంచాయతీకి చెందిన మరో చోటా నేత తాను చెప్పిందే చేయాలి.. లేకుంటే ఎమ్మెకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నట్టు సమాచారం. చోటా నేతల ఒత్తిడి తట్టుకోలేక.. పై అధికారుల నుంచి ఛీవాట్లు తినలేక రెవెన్యూ అధికారులతోపాటు మరిన్ని శాఖల వారు తల్లడిల్లిపోతున్నారు. ఆ నియామకాలపై చర్యలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల నుంచి అందిన ఫిర్యా దుల మేరకు రాష్ట్ర లోకాయుక్త సంస్థ విచారణ చేపట్టగా, కొంతమంది తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లపై జిల్లా పరిపాలన అధికారులు రద్దు చేశారు. వారి సేవా కాలంలో పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయనున్నారు. సదరు వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో ఉద్యోగి విషయంలో సర్టిఫికెట్ల నిజానిజాలు నిర్ధారించలేకపోవడంతో అతనిపై ఎలాంటి చర్య అవసరం లేదని తేలింది. యమ కంకరుడు! సాక్షి టాస్క్ఫోర్స్: హైవే నిర్మాణం పేరుతో కంకర దోపిడీ జరుగుతున్న ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బంగారుపాళ్యం మండలం నుంచి తిరుపతి వైపు భారీగా కంకర అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో మైనింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు.. హైవే పనుల కోసం అనుమతులు పొందిన కాంట్రాక్టర్, ఆ అనుమతుల ముసుగులో కంకరను ప్రైవేటుగా విక్ర యిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. బంగారుపాళ్యం ప్రాంతం నుంచి రోజూ టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో కంకరను తరలిస్తూ కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అనుమతి తీసుకుని ఇతర జిల్లాల్లో విక్రయించడంపై స్థానికు లు, మైనింగ్ శాఖ అధికారులు భగ్గుమన్నారు. అంతేకాకుండా ఓ ప్రజాప్రతినిధి పేరును ఉపయోగిస్తూ ఈ అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమంగా కంకర తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని, లోడును అక్కడికక్కడే ఖాళీ చేయించారు. ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వమని తేల్చిచెప్పారు. నిబంధన లు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. హైవే ముసుగులో కంకర దందా -
అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ
శాంతిపురం: అభివృద్ధి పేరుతో వేధిస్తున్న అమాయక రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ చెప్పారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కుప్పం ప్రాంతం అభివృద్ధి చెందితే సంతోషించే వారిలో తాము ముందుంటామన్నారు. కానీ రైతులను ఒప్పించకుండా వారిపై దౌర్జ న్యం చేయడం, అధికారులను అడ్డం పెట్టుకుని వేధించడం తగదన్నారు. భూములు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పే రైతులను పోలీసులతో వేధించడం సమంజసం కాదన్నారు. సివిల్ మ్యాటర్లను పోలీస్స్టేషన్లలో ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత రైతులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. దండికుప్పం, కర్ల గట్ట, 121 పెద్దూరుల వద్ద రైతుల నుంచి గతంలో ప్రభుత్వం తీసుకున్న భూములను వృథాగా వదిలేసి మళ్లీ వేల ఎకరా ల పంట భూములపై పడడం దారుణమన్నారు. రైతుల అంగీకారం లేకుండా వారి భూములను లాక్కోవద్దని కడ పీడీ, కుప్పం టీడీపీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. గత్యంతరంలేని స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీ కార్యాలయానికి ఆంక్షలా ? ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా వారి సౌలభ్యం కోసం పార్టీ కార్యాల యం పెట్టుకునే హక్కు ఉందని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. కానీ 30 యాక్టును అడ్డం పెట్టుకుని శాంతిపురంలో తమ పార్టీ కార్యాలయ ప్రారంభాన్ని పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ వారి దయాదాక్షణ్యాలు, పోలీసు ల సహకారంతో పార్టీ కార్యాలయాన్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి చేయలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోదండరెడ్డి, బుల్లెట్ దండపాణి, కృష్ణమూర్తి, పెద్దన్న, హేమంత్రెడ్డి, నాగభూషణం, విజయకుమార్, ప్రభాకర్రెడ్డి, పూలకుంట భాస్కర్, రమేష్రెడ్డి, అశ్వత్బాబు, మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
– కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు జారీ తిరుపతి అర్బన్: సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రై డల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్లతోపాటు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే నెల 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అదనంగా బ్యూటీ స్టూడియో, ఇన్స్టిట్యూషన్, బైరాగిపట్టెడ ఆర్చ్ రోడ్డు, కెనరా బ్యాంక్ పైన, తిరుపతి. శిక్షణ కూడా ఇక్కడే ఉంటుంది. ఇతర వివరాలకు 95534 54335, 96666 97219, నంబర్లను సంప్రదించగలరు. మూల్యాంకన కేంద్రం వద్ద ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి సర్కారు బాధ్యతగా వ్యవహరించాలని ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్ అన్నారు. ఆ సంఘ నాయకులు గురువారం పీసీఆర్ పాఠశాల మూల్యాంకన కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సర్యం చేస్తోందని మండిపడ్డారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ 12వ వేతన సవరణ వెంటనే అమలు చేయాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ మునీర్, రాష్ట్ర నాయకులు నరోత్తమరెడ్డి, మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళా యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు
తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్ఓ) గుర్తింపును సాధించి, మరో కీలక మైలురాయిని చేరుకుంది. నాణ్యమైన విద్య, సమర్థవంతమైన పరిపాలన, నిరంతర అభివృద్ధిపై వర్సిటీ కట్టుబాటుకు ఈ సర్టిఫికేషన్ నిదర్శనంగా నిలిచిందని వీసీ ఆచార్య ఉమ అనందం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్. ఉష మాట్లాడుతూ విద్య, పరిపాలనా వ్యవస్థల్లో నాణ్యత, పారదర్శకతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య రెండు రోజులుగా యూనివర్సిటీని సందర్శించారు. ఈ ప్రక్రియలో బోధన పద్ధతులు, పరి శోధన, పరిపాలన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు వంటి అన్ని విభాగాలను సమగ్రంగా పరిశీలించి ఆ తరువాత ఽధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చివరగా ఐక్వాక్ డైరెక్టర్ ఆచార్య టి.త్రిపురసుందరి మాట్లాడుతూ వర్సిటీ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు కోసం కష్టపడిన అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు గత 20 ఏళ్లుగా ఇండియన్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (ఐఏబీ) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. కంటి చూపు లేని ఎందరికో చేయూతను అందించడంలో సహకరిస్తున్న వ్యవసాయ కళాశాల ఉద్యోగులు, విద్యార్థుల సేవా గుణాన్ని గుర్తించి ఐఏబీ బ్లైండ్ ఎంపవర్మెంట్ చాంపియన్స్ –2025 గోల్డ్ జోన్ అవార్డును సంస్థ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అవార్డును కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డి శేఖర్కు అందజేశారు. ఈ గుర్తింపు దక్కడానికి సహకరించిన వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డిశేఖర్ అభినందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్న కళాశాల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, జాతీయ సేవా పథకం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2024లోనూ శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు ఐఏబీ బ్లైండ్ ఎంపవర్మెంట్ చాంపియన్స్ గోల్డ్ జోన్ అవార్డును దక్కిందని వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ ఎం రెడ్డి శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు మధుసూదన్ రెడ్డి, జ్యోత్స్న, ప్రదీప్ కుమార్, రాజేష్, సబిత తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ భాషను మరువొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు ఎంత ఎదిగినా అమ్మ భాషను, సంప్రదాయాలను ఎప్పటికీ మరువకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్పీ, సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 44వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ కళాశాలలో నూతనంగా రూ.కోటితో నిర్మించిన బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా వంతురాలైన మహిళ ఒక కుటుంబానికే కాకుండా దేశ భవిష్యత్తుకే వెలుగురేఖ అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదని చెప్పా రు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీతాను 13 నెలల వయస్సులో ఉన్నప్పుడు అమ్మను కోల్పోయినట్లు చెప్పారు. తన అమ్మమ్మ, తాతయ్యలు చెప్పిన విలువలు, వారు నేర్పిన క్రమశిక్షణే తనను దేశంలో రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థాయికి చేర్చాయన్నారు. ఆరోగ్యం – జీవనశైలి ముఖ్యం ప్రస్తుత సమాజంలో 45 ఏళ్లకే అనేక వ్యాధులు రావడంపై ఆయన ఆందోళన కలిగిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. శ్రీయోగాను జీవితంలో భాగం చేసుకోవాలి, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలిశ్రీ అని విద్యార్థులకు సూచించారు. రాజకీయాల్లో మహిళలకు త్వరలోనే 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని చెప్పారు. యుద్ధాలు వద్దు ప్రపంచ దేశాల పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదని, శాంతిని కోరుకునే దేశమని కొనియాడారు. శ్రీప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదని చెప్పారు. కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే, సీడీపీసీ సెక్రటరీ వెంకటేశ్వర చౌదరి, విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి, అకడమిక్ డైరెక్టర్, పూర్వ విద్యార్థిని శైలజా, ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాని పాల్గొన్నారు. -
నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్సీపీలో పదవులు కల్పిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశా లు జారీచేశారు. రాష్ట్ర అనుబంధ విభాగాలలో వారికి చోటు కల్పించారు. ఈ మేరకు గురు వారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన వై.వెంకటస్వామి, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శిగా జీడీనెల్లూరుకు చెందిన ఎ.విజయకుమార్, రాష్ట్ర ఆర్టీఐ విభాగ కార్యదర్శిగా జీడీనెల్లూరుకు చెందిన ఎం.గోపినంథన్ను నియమించారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటి ని దశలవారీగా పరిష్కారించనున్నట్లు వివరించారు. సమష్టిగా రోడ్డు ప్రమాదాల నివారణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో, సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జాతీయ రహదారుల్లోని బ్లాక్ స్పాట్స్ వద్ద అందుబాటులో ఉన్న ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, వైద్యుల ఫోన్ నంబర్ల తదితర వాటిని సిద్ధం చేయాలన్నారు. ఈ వివరాలు పోలీసు, రెవెన్యూ అధికారుల వద్ద ఉంటే ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 22 ప్రధాన బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. చిత్తూరు–తమిళనాడు సరిహద్దు మార్గంలో బ్లింకర్లు, సైన్బోర్డులు, రోడ్డు మార్కింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మొగిలి ఘాట్లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ వినియోగించాలన్నారు. విద్యాసంస్థల్లో హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీటీసీ నిరంజన్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్బాబు పాల్గొన్నారు. రూ.15 కోట్ల మంజూరు చిత్తూరు కార్పొరేషన్: కుప్పంలో ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణ పనులకు రూ.15 కోట్లు మంజూ రు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు జారీచేశారు. వైభవంగా స్నపన తిరుమంజనం కార్వేటినగరం: శ్రీవేణుగోపాలస్వామి ఆలయ వార్షిక వసంతోత్సవంలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. వంసతోత్సవం సందర్భంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామివారు వసంతమండపం వద్దకు వేంచేశారు. అనంతరం అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఆస్థానం చేపట్టారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువు దీర్చి మేళతాళాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి చంగల్రాయులు, అర్చకులు శభరి, గోపాలాచారి పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు వసంతోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారితో పాటు, ఆలయ ఆవరణంలో వెలసి ఉన్న శ్రీసీతాకోదండరాములవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం వాహన సేవలు జరగనున్నాయి. -
గ్యాసో బాసో!
సాక్షి, టాస్క్ఫోర్స్: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 వరకు ఉన్నాయి. రోజువారీగా వేలల్లో గ్యాస్ బండలు అమ్ముడవుతున్నాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సరఫరాకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా హోటళ్లకు గ్యాస్ దొరకడం కష్టతరంగా మారుతోంది. అందరి చూపు వంట గ్యాస్పై పడింది. బ్లాక్లో విక్రయాలు పెరిగాయి. సిలిండర్ రూ.5 వేలు? గ్యాస్ కొరత కారణంగా బండ వ్యాపారం బహిరంగంగా జరుగుతోంది. బ్లాక్లో గ్యాస్ విక్రయాలు జోరందుకున్నాయి. రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హోటళ్ల నిర్వహణ కోసం నిర్వాహకులు బ్లాక్లో రూ.5 వేల వరకు వెచ్చిస్తున్నట్ట సమాచారం. పలు చోట్ల దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకుంటే ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్లపై నెట్టేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. బుకింగ్ కావడం లేదు భయ్యా? నెల రోజులుగా చాలా మంది వంటగ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కావడం లేదని కార్యాలయాలను చుట్టుముడుతున్నారు. అక్కడికి వెళ్లిన వారికి చిత్తు పేపర్లో ఫోన్ నంబర్లు రాసి ఇచ్చి పంపిస్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో కొందరు పొయ్యితోనే కుస్తీపడుతున్నారు. మరి కొంతమందికి బుకింగ్ చేసినా ఓటీపీ రావడం లేదు. దీంతో వారు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈకేవైసీ బూచీ! ఓటీపీ, బుకింగ్ సమస్యలతో పాటు తాజాగా ఈకేవైసీ సమస్య కూడా తోడైంది. జిల్లాలో 1.30 లక్షల మంది ఈకేవైసీ చేయించుకోలేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒకవైపు బుకింగ్ సమస్య, మరోవైపు ఈకేవైసీ సమస్యతో ఏజెన్సీలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏజెన్సీల వద్ద క్యూకడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట అంటూ ఇన్నాళ్లు లేని ఈకేవైసీని ఇప్పుడు బూచీగా చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటీపీ లేకుండా జరిగిన గ్యాస్ బుకింగ్ను కప్పిపుచ్చేందుకే ఈకేవైసీని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు తయారైంది జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి. అమెరికా–ఇరాన్ యుద్ధం పేరుతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఓటీపీలు లేకుండానే డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్లో అమ్మేస్తున్నారు. గ్యాస్ బుక్ చేద్దామన్నా వీలుకాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడిచ్చే టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసినా గ్యాస్ బుక్గాక ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏజెన్సీ నిర్వాహకులు ఈకేవైసీనీ తెరపైకి తెచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు కట్టెల పొయ్యిపైనే కుస్తీ పడుతూ కాలం నెట్టుకొస్తున్నారు. ఓటీపీ దొంగలతో కుమ్మక్కు గుడిపాలలో వెలుగుచూసిన ఓటీపీ దోపిడీపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటీపీ లేకుండా ఒక ఏజెన్సీ నిర్వాహకుడు మార్చి 23న 270 గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అమ్మినట్లు సమాచారం. ఈ సిలిండర్లను గుడిపాల, బంగారుపాళ్యం మండలాల్లో విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీసాక్షిశ్రీ కథనాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను రాతపూర్వకంగా నమోదు చేసి జిల్లా యంత్రాంగానికి నివేదికగా సమర్పించారు. అనంతరం ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. అయితే తర్వాత ఆ దందాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరినట్టు సమాచారం. ఆ శాఖ అధికారులకు కూడా మామూళ్లు అందాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో గందరగోళంగా గ్యాస్ సరఫరా -
పలమనేరులో ఖాళీ సిలిండర్ల సీజ్
పలమనేరు: నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని పాత పోస్టాపీసు వద్ద ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్లను డిస్ట్రిక్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ శంకర్ తమ సిబ్బందితో కలసి గురువారం దాడులు చేసి సీజ్ చేశారు. పట్టణానికి చెందిన కృష్ణమూర్తి అనే యువకుడు డొమస్టిక్ సిలిండర్లను పోగుచేసి వాటిని కమర్షియల్గా వివిధ రూపాల్లో మార్చుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీనిపై వచ్చిన సమాచారంతో అధికారులు దాడులు చేసి గోడౌన్లో నిల్వ ఉన్న వందకుపైగా సిలిండర్లను సీజ్ చేశారు. నిర్వాహకుడిపై 6ఏ కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు కేసును రెఫర్ చేశారు. అసలే గ్యాస్ దొరక్క వినియోగదారులు ఇక్కట్లు పడుతుంటే ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. అసలు ఇన్ని సిలిండర్లు ఎలా వచ్చాయని నిర్వాహకున్ని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న సీఎస్డీటీల ప్రమేయం ఉండడంతోనే ఈ అక్రమాలు సాగుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్వో హెచ్చరించారు. నిర్వాహకునికి సహకరిస్తున్న గ్యాస్ ఏజెన్సీ వారిపై కూడా చర్యలుంటాయన్నారు. ఈ దాడుల్లో జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయ అధికారి శ్యామ్ప్రసాద్రెడ్డి, స్థానిక తహసీల్దార్ ఇన్బునాథన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనంపేరుతో మోసం కేసులో ఒకరి అరెస్టు తిరుమల: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూరు జిల్లాకు చెందిన సి.సెంథిల్ కుమార్ (47)ను తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. టీటీడీ లోగోను దుర్వినియోగం చేస్తూ ‘‘త్వరితగతిన దర్శనం’’, ‘‘అత్యంత సమీపంలో దర్శనం’’, ‘‘వీఐపీ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి’’ అంటూ తప్పుడు ప్రచారం చేసి, భక్తులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్, తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం తమిళనాడులో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో నిందితుడు ఒక్కో టికెట్కు సుమారు రూ.16,500 చొప్పున వసూలు చేసి, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్న్పే ద్వారా డబ్బులు స్వీకరించినట్లు తేలింది. ఇతడి వద్ద నుంచి డెల్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పంటలపై ఆగని గజ దాడులు
పెద్దపంజాణి: పంటలకు ఏనుగుల నుంచి రక్షణ లేకుండా పోతోంది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాపల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్, ఆకులవారిపల్లి, బేరుపల్లి, కమ్మపాళ్యం, గంకొండ, కోగిలేరు తదితర గ్రామాలు ఆటవీ సరిహద్దులు కలిగి ఉన్నాయి. తరచూ ఏదో ఒక గ్రామంలోని రైతుల పంటలను ఏనుగులు నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇక్కడి ఏనుగుల కట్టడికి పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకొచ్చింది. అయినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. తాజాగా బుధవారం వేకువజామున పలమనేరు రేంజ్ కీలపట్ల ఫారెస్టు బీటు నుంచి వచ్చిన ఏనుగులు పెద్దకాప్పల్లి గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి మామిడి తోటలపై విరుచుకుపడ్డాయి. పది మామిడి చెట్లను విరిచేశాయి. కాయలు సైతం నేలరాల్చాయి. అదే విధంగా పెనుగొలకల గ్రామానికి చెందిన నారాయణప్ప వరి పంటను తొక్కి నాశనం చేశాయి. మరో రైతుకు చెందిన రాగి పంటను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు యాభైవేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ఏనుగుల విధ్వంసాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల నిద్ర మత్తు ఒక వైపు ఏనుగులు దాడులు చేస్తూ పంటలకు నష్టం వాటిల్లితున్నా పలమనేరు రేంజ్ లోని అటవీ శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదు. గత కొంత కాలంగా ఏనుగులు పలమనేరు రేంజ్ కీలపట్ల బీటులో మకాం వేసి ఉన్నాయి. వాటిని పొలాలపైకి రాకుండా అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపట్టలేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనుగుల దాడి నుంచి పంట పొలాలను రక్షించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలి తం కనిపించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులైనా స్పందించి ఏనుగులను అడవిలోకి మళ్లించే చ ర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
పాదయాత్రే సంక్షేమ పథకాలకు నాంది
కార్వేటినగరం: ‘రాష్ట్రం ప్రజల కోసం సుపరి పాలన అందించి చరిత్ర సృష్టించారు. ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాని నిలుపుకున్న మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్తు ప్రపంచ దేఽశాల్లో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. పలు రాష్ట్రాలు ఆయన పాలనను కొనియాడతూ అదే పథకాలను ఆయా రాష్ట్రాలలో అమలు చేశారని గుర్తుచేశారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రను ప్రారంభించి నేటికి 23 ఏళ్లు అవుతోందని చెప్పారు. చరిత్రలో నిలిచిన సంక్షేమ పథకాలు ఇల్లు లేని పేదలను ఆదుకోవడా నికి ఇందరమ్మ ఇళ్లు, అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతన్నలకు రైతు రుణ మాఫీ, ఉచిత విద్యుత్ అమలు చేశారన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కు ఫీజు రీయింబర్స్మెంట్, పేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు తీసుకొచ్చారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా నిలి చారని కొనియాడారు. జగనన్న పాలనలో ... వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి కన్నా రెండడుగులు ముందుకేసి మరిన్ని సంక్షేమ పథకాలు అందించారని నారాయణస్వామి తెలిపారు. ఇందులో నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. పేదలందరికీ ఇళ్లు, ఇంటిి వద్దకే పాలన అంటూ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేశారన్నా రు. రైతులకు రైతు భరోసా, మత్స్యకార భరోసా, ఆసరా, డ్వాక్రా రుణ మాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సి డీ అందించారని తెలిపారు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు, విద్యాదీవెన, వసతిదీవెన, విదేశీ విద్యాదీవెన వంటివి రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలో నిలిచిపోయే పథకాల సృష్టికర్తగా ప్రజల గుండెల్లో నిలిచారని చెప్పారు. బాబు బాదుడే బాదుడు ఆధికారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీని మరచి, బాదుడే బాదుడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు మునిగితేలుతున్నారని మాజీ డెప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. మందు బాబులకు నాణ్యమైన మద్యం అతి తక్కువ ధరకు ఇస్తానన్న మాట ఏమైందని నిలదీశారు. గ్రామాల్లో బెల్టుషాపులు, యువతకు అందుబాటులో గంజాయి అందిస్తున్నారని దుయ్యబట్టారు. కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. -
ఇరగదీశారు భయ్యా!
పుంజుకున్న రిజిస్ట్రేషన్ రాబడి చిత్తూరు కార్పొరేషన్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి సాధించింది. 2025–2026 ఆర్థిక సంవత్సరం పరంగా జిల్లాలోని మొత్తం 8 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటికి రూ.186.17 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. అందులో రూ.179.66 కోట్ల ఆదాయంతో 96.51 శాతం వసూళ్లు రాబట్టారు. సెప్టెంబర్ నుంచి పెరిగిన ఆదాయం స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం సెప్టెంబర్ నుంచి పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 30న ఒకరోజే జిల్లాలో రూ.3.25 కోట్ల ఆదాయం రాగా 1,458 డ్యాకుమెంటేషన్లు జరిగాయి. సెప్టెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. ఆదాయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రూ.221.89 కోట్ల లక్ష్యం ఇవ్వగా అందులో రూ.149.90 కోట్లు వసూళ్లతో 67.56 శాతం రాబడి వచ్చింది. 59,354 డాక్యుమెంటేషన్లు జిల్లాలో మొత్తం 59,354 డాక్యుమెంటేషన్లు జరిగాయి. వీటి ద్వారా రూ.179.66 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పరంగా కుప్పం 161 శాతం, చిత్తూరు రూరల్ 120, నగరి 119, పలమనేరు 108 శాతంతో లక్ష్యాన్ని అధిగమించాయి. చివరిగా చిత్తూరు అర్బన్ 70 శాతం, కార్వేటినగరం 74, పుంగనూరు 88, బంగారుపాళ్యం 93 శాతం రాబడి వచ్చింది. డాక్యుమెంటేషన్లపరంగా చూస్తే కుప్పంలో 13,634, చిత్తూరు అర్బన్ 10,497, పలమనేరు 9,740, పుంగనూరు 8,630, చిత్తూరు రూరల్ 5,745, కార్వేటినగరం 4,162, నగరి 3,476, బంగారుపాళ్యం 3,461 జరిగాయి. సబ్రిజిస్ట్రార్ లక్ష్యం రాబడి శాతం డాక్యుమెంటేషన్స్ కార్యాలయం రూ.కోట్లు రూ.కోట్లు చిత్తూరు అర్బన్ రూ.66.38 రూ.46.63 70 10,497 కుప్పం రూ.19.08 రూ.30.89 161 13,634 చిత్తూరు రూరల్ రూ.13.29 రూ.15.98 120 5,754 నగరి రూ.12.29 రూ.14.73 119 3,476 పలమనేరు రూ.29.80 రూ.32.20 108 9,740 బంగారుపాళ్యం రూ.9.77 రూ.9.16 93 3,461 పుంగనూరు రూ.26.28 రూ.23.15 88 8,630 కార్వేటినగరం రూ.9.29 రూ.6.92 74 4.162 మొత్తం రూ.186.17 రూ.179.66 59,354 ఆదాయం పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం పెరిగింది. జిల్లాకు రూ.186.17 కోట్లు లక్ష్యం ఇవ్వగా అందులో 96.51 శాతంతో రూ.179.66 కోట్లు వచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ల తాకిడి పెరగగా మార్చి 30న ఒకరోజే రూ.3.25 కోట్లతో రికార్డ్ స్థాయిలో రాబడి వచ్చింది. నిర్ధేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు అధిగమించాయి. – రమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్ -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కార్పొరేషన్: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విసృత్త స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్షధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సదరం రీవెరిఫికేషన్ పేరుతో 1.17 లక్షల మంది పింఛనుకు అర్హత లేదని నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. వీటిపై పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలపడంతో వెనక్కితగ్గి పింఛన్లు ఇస్తోందని తెలిపారు. అప్పిలు చేసుకున్న వారికి సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. అన్ని బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని, బస్సులో రెండు సీట్లను ఐదుకు పెంచాలని కోరారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం అమలు కావడం లేదన్నారు. జోన్–4 వర్కింగ్ ప్రెసెడెంట్ నాగేంద్ర, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో 8 వేల మంది పింఛనుకు అనర్హులని నోటీసులు ఇచ్చారని తెలిపారు. గతంలో కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతినెలా పింఛన్లు ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా పింఛను కోసం పడిగాపులు కాస్తున్నట్టు వివరించారు. గతంలో 90 శాతం వైకల్యం ఉన్నవారికి ప్రస్తుతం 50 శాతం మాత్రమే ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నట్టు తెలిపారు. 70 శాతం, అంత కంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే మూడు చక్రాల వాహనాలు ఇస్తున్నారని వాపోయారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. పాలసముద్రం మండలంలో ఇటీవల ఇంటి పన్ను కట్టలేదని వికలాంగుడు గురుస్వామికి పింఛను ఆపేస్తామని బెదిరింపులకు దిగారని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ఈ కూటమి ప్రభత్వుంలో నిర్వీర్యం అవుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులకు అండగా ఉంటానన్న పవన్కల్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, తిరుపతి, సత్యవేడు, నియోజకవర్గాల అధ్యక్షులు పాండు, రమేష్, చిరంజీవి, రెడ్డిసుబ్బయ్య, బాలకృష్ణయాదవ్, దేవదాసురెడ్డి, నాయకులు సుమతి, అరుణ, ప్రశాంతి, మున్నెష్, మురళీగౌడ్, హేమంత్, రఫీ పాల్గొన్నారు. -
అట్రాసిటీ ఫ్రీ జోన్గా జిల్లా
చిత్తూరు కలెక్టరేట్ : దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసమే బాధితుల చెంతకే కమిషన్ వచ్చిందని చైర్మన్ కేఎస్.జవహర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు, ఆక్రమణలపైనే అత్యధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. ‘ఆది ఆంధ్ర‘, ‘ఆది ఆంధ్ర క్రిస్టియన్‘ వర్గీకరణల వల్ల ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీతోపాటు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, కుల వివక్ష అంశాలపై రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వీటిపై డీఎస్పీ స్థాయి అధికారి సమగ్ర విచారణ చేసి నివేదికలను పంపాలన్నారు. చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చైర్మన్ ప్రకటించారు. జిల్లాను కుల వివక్ష లేని ప్రాంతంగా, ‘అట్రాసిటీ ఫ్రీ జోన్‘గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్పొరేషన్ రుణాలు, ప్రభుత్వ ప్రయోజనాలను కులం పేరుతో అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. -
ఏరులై పారుతున్న మద్యం
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి నిత్యాసవసర వస్తువు ల్లా సులభంగా దొరుకుతోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయస్వామి ఆరోపించారు. మద్యం బారిన పడి పేద కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆయన బుధవారం శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లెమిట్టలో ఉన్న దీపికా కల్యాణ మండపంలో జరిగిన మాజీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మద్యం, గంజాయి బారిన పడి యువకులు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. అధికారులు గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరుస్తున్నా సీఎం చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. బాధితులపైనే కేసులు కూటమి నేతలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. రేపు మా ప్రభుత్వం వస్తే అవినీతి అధికారులపై విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. గంగాధరనెల్లూరులో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోందని ఆరోపించారు. తమిళనాడు తరహాలో కోర్టులు తీర్పులు ఇవ్వాలి కరోనా సమయంలో తమిళనాడులో జరిగిన ఓ కేసుకు సంబంధించి 8 మంది పోలీసు అధికారులకు కోర్టు ఉరిశిక్ష విధించిందని తెలిపారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా కోర్టులు తీర్పులు ఇవ్వాలని, తద్వారా కోర్టులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని నారాయణస్వామి తెలిపారు. తప్పుచేస్తే కఠిన శిక్ష పడుతుందన్న భయం అధికారుల్లో రావాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారులు తప్పుడు మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. మీ బిడ్డగా ఆదరించండి గంగాధరనెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్న కే.కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆదరించి వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. పేదల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పారు. అప్పుల ఊబిలో రాష్ట్రం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, అమరావతి రాజధాని పేరుతో పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు. ఏమీ లేని ప్రాంతంలో రూ.లక్షల కోట్లు వెచ్చించడం కంటే మావిగన్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని తక్కువ ఖర్చుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఈ నగ్న సత్యాన్ని చంద్రబాబు మనుషులు దాచిపెట్టి నీతిమాలిన రాజకీయాలు చేయ డం సిగ్గుచేట్టన్నారు. జగనన్న విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం పేదలకు ఉన్నత విద్యను దూరం చేసినట్లు గుర్తు చేశారు. వైద్యరంగాన్ని నిర్వీర్యం చేశారని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు పేదలకు వైద్యాన్ని అందించడం లేదని విమర్శించారు. -
కడా పీడీ ఆకస్మిక తనిఖీలు
కుప్పం: కడా పీడీ వికాస్ మర్మత్ బుధవారం కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. కార్యాలయ ప్రాంగణంలో కిక్కిరిసిన జనంపై ఆయన ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికంటే దళారులే అధికంగా ఉన్నారని తెలుసుకుని విస్తుపోయారు. రెగులర్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు ఎందరు, దినసరి వేతనం ద్వారా పనిచేసేవారు ఎందరు ఉన్నారని ఆరా తీశారు. నలుగురు ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నారని, మిగిలిన ఆరుగురు దినసరి వేతనం ద్వారా పని చేస్తున్నట్లు బయట పడింది. ఆఫీస్లో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటే, మిగిలిన వారు 50 మందికి పైగా ఉండడమేంటని కడా పీడీ ప్రశ్నించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారులు అధికంగా ఉన్నట్లు తేలింది. బుధవారం నుంచి దళారులు కార్యాలయ ప్రాంగణంలో కనిపిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దళారులు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.నాడే చెప్పిన సాక్షి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారీ వ్యవస్థపై సాక్షి రెండు నెలల క్రితమే కథనాలు ప్రచురించింది. దళారులకు, పనిచేసే సిబ్బందికి తేడా లేదని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కుర్చీల్లో కూర్చుని కార్యాలయంలో కంప్యూటర్లు లాగిన్ చేసుకుని దళారులే డాక్యుమెంటేషన్ చేసుకోవడంపై కథనాలు ప్రచురించినా అధికారులు స్పందించలేదు. బుధవారం కడా పీడీ తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమైంది. కనీసం ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే! -
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఉద్యోగుల ఆందోళన
● నల్ల బ్యాడ్జీలతో నిరసన చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైద్య విద్య–ఆరోగ్య శాఖల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఈఎస్ఐ ఆస్పత్రుల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. యూనియన్ నాయకులు సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ నిరసన తెలపాలని, 11వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆస్పత్రుల గేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్లో 80 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 300మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరందరూ ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఏళ్ల తరబడి పోరాటం వైద్య రంగంలో ఉద్యోగుల హక్కుల కోసం గత 73 ఏళ్లుగా పోరాడుతున్నామని యూనియన్ నేతలు తెలిపారు. 1999లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడం, కారుణ్య నియామకాలు సాధించడం, పెన్షన్, సేవా విషయాల్లో అనేక సమస్యలు పరిష్కరించడం తమ యూనియన్ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. వివిధ విభాగాధిపతులతో జరిగిన సంయుక్త సమావేశాల ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పలు కీలక సమస్యలు పేరుకుపోయాయని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, వేతనాల్లో కోతలు విధించడం దారుణమన్నారు. వైద్యసేవలపై నిరసనల ప్రభావం పలు సాంకేతిక, పరిపాలనా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం తక్షణం స్పందించి చర్చలకు రావాలని యూనియన్ హెచ్చరించింది. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేసింది. ఈ నిరసనల ప్రభావంవైద్య సేవలపై పడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.ప్రధాన డిమాండ్లు ఇవే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 36 శాతం ఐఆర్ మంజూరు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి అమలు పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ జీతాల చెల్లింపు నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి రిస్క్, నైట్ డ్యూటీ అలవెన్సులు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాల పెంపు ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు ఎన్హెచ్ఎమ్ సిబ్బందికి సమయానికి జీతాలు, సెలవులు -
రైలు కింద పడి యువకుడి మృతి
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం, తడుకు రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నం.2 రైల్వే ట్రాక్పై మంగళవారం సాయంత్రం సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు రేణిగుంట రైల్వే ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ షర్ట్, వంగపూత కలర్ తెలుపు గీతల ఫుల్షర్ట్ ధరించాడని, కుడి ఎదురొమ్ముపై నల్లని పుట్టుమచ్చ, అప్ప అను ఇంగ్లిషు అక్షరాలు, కుడిచేతిపై అంబేడ్కర్ బొమ్మ ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రేణిగుంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నష్టపరిహారం చెల్లింపు
గుడిపాల: ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసినట్లు ఎమ్మెల్యే జగన్మోహన్, డీఎఫ్ఓ సుబ్బరాజ్ తెలిపారు. మంగళవారం గుడిపాలలో గత రెండు నెలలుగా పలు గ్రామాల పరిధిలో పంట పొలాలను ఏనుగులు ధ్వసం చేశాయి. పంట నష్టపోయిన 30 మంది రైతయులకు రూ.2.76 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ పట్టాభి, ఎంపీపీ హరిప్రసాద్, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్నకేశవులునాయుడు, తహసీల్దార్ శ్రీనివాసులు, సింగిల్విండో చైర్మన్ ప్రతాప్నాయుడు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్ష న్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమ స్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లపరంగా 40 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 83, కలిపి మొత్తం 123 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి రాక రేపు చిత్తూరు కలెక్టరేట్ : మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 09న జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. ఆయన ఈనెల 09న ఉదయం 10.30 గంటలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్పీ సావిత్ర మ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఆ కళాశాలలో నిర్వహించే స్నాతకోత్సవం, భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గడువు పెంచండి చిత్తూరు కలెక్టరేట్: ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల మార్కుల నమోదుకు గడువు ఈనెల 25 వరకు పెంచాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈనెల 15, ఉన్నత పాఠశాలల్లో 20వ తేదీ లోపు నమోదు చేయాలని విద్యాశాఖ వింత నిర్ణయాలతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. పదో తరగతి మూల్యాంకన విధులకు 80 శాతం ఉపాధ్యాయులను నియమించారని, ఉన్న కొద్ది మంది పరీక్షల నిర్వహణకే ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి నమోదుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. -
అవగాహన ర్యాలీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిత్తూ రు నగరంలోని ప్రశాంత్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో మంగళవారం అవగాహన ర్యాలీ, సమా వేశం నిర్వహించారు. జిల్లా ఇన్న్చార్జ్ వైద్యఆరోగ్యశాఖ అధికారి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఆరో గ్యంపై అవగాహన కల్పించారు. 2026 సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన థీమ్ ‘ఆరోగ్యం కోసం కలిసి.. విజ్ఞానంతో అడుగులు’ అని తెలి పా రు. అపోహలు, మూఢనమ్మకాలను విడిచిపెట్టి శాసీ్త్రయ వైద్య విధానాలను అనుసరించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రజల ఆరోగ్యం వారి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, కలుషిత ఆహారం, పర్యావరణం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. రసాయనాలతో మాగబెట్టిన పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమమన్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి, ఇన్చార్జ్ డెమో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
లబోట్యాబో!
పదో తరగతి మూల్యాంక ణంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పాత ట్యాబ్లు పనిచేయక అవస్థలు పడుతున్నారు.ఎత్తిపోతలకు బ్రేక్తో నీటి సమస్యతిరుపతి రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య పొంచి ఉంది. కల్యాణిడ్యామ్, రామాపురం రిజర్వాయర్ కండలేరు నీటిపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ వేయడంతో భవిష్యత్తో తిరుపతి నగరానికి తాగునీటి సమస్యలు తప్పవు. తిరుపతి తాగునీటితోపాటు జిల్లాలో సాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల కోసం పాదయాత్రతోపాటు పోరాటాలు చేయాల్సి ఉంది. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త పథకం దూరం మన ప్రాంతానికి నదులు లేవు. కాలువలు, చెరువులు ఆధారంగానే రైతులు సే ద్యం చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో అడవిపల్లి రిజర్వాయర్ పనులు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. శిష్యుడి రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం మేరకు సీమ ప్రజలకు ఎత్తిపోతల పథకాన్ని దూరం చేస్తున్నారు. –విజయానందరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త పోరాటాలకు ముందుంటా..ఎవరైనా తాను పుట్టిన ప్రాంతానికి మంచి చేద్దామని ఆలోచిస్తారు. అయితే చంద్రబాబు మా త్రం అందుకు భిన్నంగా అలోచన చేస్తున్నారు. ఆ యన జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో క లసి ఆపివేశారు. రైతుల పోరాటాలకు నేను ముందుంటాను. – చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త కర్షక ద్రోహి బాబు వ్యవసాయం దండగ అని గతంలో మాట్లాడిన చంద్రబాబు రైతులకు ఎప్పుడు సానుకూలంగా లేరు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎత్తిపోతల పథకానికి ఢోకాలేదు. అయితే నిధులు లే వని చెప్పడం విడ్డూరం. రూ.2 లక్షల కోట్లతో అమరావతిని ప్రపంచంలోనే ఉన్నత రాజధాని చేసా మనడం సిగ్గుచేటు. – నూకతోటి రాజేష్, పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: హెయిర్ కటింగ్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ -
అభివృద్ధి అంటే ఏంటో చూపించాం
నగరి : ‘అభివృద్ధి అంటే ఏంటో ఐదేళ్లలో చూపించాం.. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేక ఓడిపోయాం’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం నగరి పట్టణంలోని ఆమె నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గంలో పదవీ కాలం పూర్తిచేసుకున్న సర్పంచ్లను ఆమె సన్మానించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు ప్రజాసమస్యలు పరిష్కరించడంలో జగనన్న సహకారంతో సఫలీకృతం అయ్యారన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం జగనన్న అందరికీ నేర్పించారన్నారు. పుత్తూరులో గతంలో ఎంపీపీగా ఉన్న వ్యక్తి తన స్వగ్రామం గొల్లపల్లిలో చేయలేని అభివృద్ధి అక్కడ గెలిచిన వైఎస్సార్సీపీ సర్పంచ్ చేయగలిగారన్నారు. నిండ్ర హెడ్ క్వార్టర్స్లో బస్టాండు, నీళ్లు, రోడ్లు లేకపోయినా గతంలో మంత్రులు, జెడ్పీటీసీలుగా ఉన్న వారు వాటిని పరిష్కరించలేకపోయారన్నారు. ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆ పనులు చేయగలిగారన్నారు. నగరి మండలం, బుగ్గ అగ్రహారంలో తాగునీటి సమస్యను అక్కడి వైఎస్సార్సీపీ సర్పంచ్ పరిష్కరించగలిగారన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ప్రతి సర్పంచ్ నేడు కాలర్ ఎత్తుకుని తిరిగే పరిస్థితిని జగనన్న సహకారంతో తాను కల్పించారన్నారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లే అర్హత మనకు మాత్రమే ఉందని, మళ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తాను నిరూపించుకుందామన్నారు. కొండలు, కొండచుట్టు మండపం ఆయనకు ఒక్కటే నగరి ఎమ్మెల్యేకు కొండలు, కొండచుట్టు మండపం ఒక్కటేనని, దేన్ని కొట్టేసినా ఆయన పట్టించుకోరన్నారు. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన కొండచుట్టు మండపాన్ని కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకే ఎక్కువగా ఉంటుందని, కూటమి పార్టీ కేంద్రంలో ఉందని, ఎందుకు ఆయన చొరవ తీసుకొని దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. తాను ఎంపీల సహకారంతో ఢిల్లీకి వెళ్లి కొండచుట్టు మండపం కొట్టకుండా ఆపగలిగానన్నారు. జాతీయ రహదారి కాంట్రాక్టుదారులు డబ్బులు ఇస్తే పనులు జరిగేలా చూడడం, లేకుంటే ఆపేయడం ఆయన చేస్తున్న పని అంటూ ఆరోపించారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే కేటగిరీలు ఇలాగే ఉంటాయన్నారు. అభివృద్ధి చేయరా? ప్రస్తుత ప్రభుత్వంలో కొత్త అభివృద్ధి పనులు ఏవీ చేయడం లేదని గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు చేరువకాకుండా అడ్డుకోవడమే కర్తవ్యంగా కాలం వెళ్లదీస్తున్నారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. పుత్తూరులో తాజ్మహల్లా షాదీమహల్ కట్టిస్తే దాన్ని వినియోగంలోకి తేవడం లేదన్నారు. నిండ్రలో పిచ్చిమొక్కలు పేరుకుపోయి శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మిస్తే దానికి కుంభాభిషేకం కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తప్పక వారికి బుద్ధిచెబుతారన్నారు. ఐఈ కార్యక్రమంలో ఐదు మండలాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
దోపిడీ వైద్యం!
కాణిపాకం : జబ్బు తగ్గాలంటే డబ్బు ఖర్చు చేయాలి అనే మాటను అక్షరాలా నిజం చేస్తున్న పరిస్థితులు చిత్తూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పేరుతో జరుగుతున్న భారీ వసూళ్లు సామాన్య ప్రజలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. చిన్న జ్వరం, దగ్గు, సాధారణ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రికి వెళ్లిన రోగి, బయటకు వచ్చే సమయానికి వేలల్లో బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓపీక లేదయ్యా! ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే మొదలయ్యే ది ‘ఓపీ ఫీజు’. సాధారణంగా రూ.200, రూ.300 మధ్య ఉండాల్సిన ఫీజు కొన్ని ఆస్పత్రుల్లో రూ.500 నుంచి రూ.800, రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రముఖ డాక్టర్ల పేరుతో అయితే ఈ ఫీజు ఇంకా ఎక్కువ. జిల్లాలో వెయ్యికి పైగా ప్రయివేట్ ఆస్పత్రులుంటే.. ఇందులో పలు ఆస్పత్రుల్లో పీజు దోపిడీ చేస్తున్నట్టు పలువురు కంటతడి పెడుతున్నారు. టెక్నాలజీ దందా టెక్నాలజీ పేరుతో కొత్తగా మొదలైన మరో దందా ఫోన్ కన్సల్టేషన్. రోగి ఆస్పత్రికి రాకుండా ఫోన్లో మాట్లాడినా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఐదు నిమిషాలు మాట్లాడితే ఐదు వేల రూపాయల బిల్లు చెల్లించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసర పరీక్షలు.. వేలల్లో ఫీజులు డాక్టర్ దగ్గరకు వెళ్లిన వెంటనే రోగికి వరుసగా పరీక్షల జాబితా అందజేయడం సాధారణమైపోయింది. రక్త పరీక్షలు, స్కానింగ్లు, ఎక్స్రేలు, ఇతర డయాగ్నస్టిక్ టెస్టులు అవసరం ఉన్నా లేకపోయినా సూచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ కేసుకే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. పేదలే టార్గెట్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అమాయకులు, వైద్యంపై అవగాహన లేని వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ చెప్పిందే కరెక్ట్ అని నమ్మే పరిస్థితిని ఆస్పత్రులు లాభాలుగా మలుచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది రోగులు అప్పు చేసి చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పర్యవేక్షణ గాలికి జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశాఖ తరచూ తనిఖీలు చేయకపోవడం, ఫీజులపై స్పష్టమైన నియంత్రణ లేకపోవడం వల్ల ఆస్పత్రులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. కొత్త డీఎంహెచ్వోపై ఆశలు జిల్లాకు కొత్తగా రానున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా ప్రయివేటు ఆస్పత్రులు వసూల్ రాజాలు రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధికంగా డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రులను ప్రజలు ‘వసూల్ రాజాలు’గా అభివర్ణిస్తున్నారు. చికిత్సకంటే డబ్బులే ముఖ్యమయ్యా యని విమర్శిస్తున్నారు. అధిక ఫీజు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కేసులు నమోదు చేయాలి. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలి. ఫీజుపై ప్రభుత్వ నియంత్రణ విధించాలి. ప్రతి బిల్లును పారదర్శకంగా చూపించే విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రజాసంఘాలు, బాధితులు కలిసి అధికారులకు వినతిపత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కు కొందరు సిబ్బంది కొమ్ముకాస్తూ వసూల్ రాజా అవతారం ఎత్తారని వారు మండిపడుతున్నారు. ఆస్పత్రుల్లోనే మందుల మాఫియా బయట తక్కువ ధరకు లభించే మందులను ఆస్పత్రుల్లోనే కొనాలని రోగులను బలవంతం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ‘డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బయట చూపించొదు’్ద అంటూ చెప్పడం, ఆస్పత్రిలోని ఫార్మసీలోనే మందులు కొనాలని ఒత్తిడి చేయడం సాధారణమైపోయింది. ఈ విధంగా ఒక్కో కేసులో రూ.1000–3000 అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. -
లబోట్యాబో!
వేధిస్తున్న సిబ్బంది కొరత ఒక వైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు తీవ్రమైన సిబ్బంది కొరత మూ ల్యాంకన ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చింది. ట్యాబ్లు మొరాయించడంతో సమయం వృథా అవుతుంటే, ఉన్న తక్కువ మంది సిబ్బందిపైనే పనిభారం పడుతోంది. దీంతో టీచర్లు అసహనానికి గురవుతున్నారు. విధులకు నియమించిన సిబ్బంది హాజరుకాకపోవడం మూ ల్యాంకన ప్రక్రియలో అధికారులకు పెనుసవాలుగా మారింది. డ్యూటీలు వేసినప్పటికీ చాలా మంది టీచర్లు వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు చూపుతూ గైర్హాజరు కావడంతో జవాబుపత్రాల మూల్యాంకనం మందకొడిగా సాగుతోంది. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ గందరగోళంగా మారింది. విద్యాశాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానం ఉపాధ్యాయుల పాలిట శాపంగా పరిణమించింది. డిజిటల్ మూల్యాంకనంలో భాగంగా మార్కులను ట్యాబ్లలో నమోదు చే యాలన్న నిబంధన అమలులో విఫలం కావడంతో, ఉపాఽ ద్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి 10 గంటల వరకు కేంద్రాల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొరాయించిన ట్యాబ్లు ప్రభుత్వం సరఫరా చేసిన పాత ట్యాబ్లు మూల్యాంకన కేంద్రాల్లో అడుగడుగునా ఆటంకం కలిగించాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పని సులభతరం అవుతుందని భావించినా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది. సాఫ్ట్వేర్ లోపాలు, నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్, తరచూ హ్యాంగ్ అవుతున్న పరికరాలతో ఉపాధ్యాయులు కుస్తీ పట్టాల్సి వస్తోంది. గంటల తరబడి ప్రయత్నించినా మార్కుల నమోదు కాకపోవడంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ‘కొత్త విధానం పేరుతో తమపై పనిభారం పెంచడమే తప్ప, సౌకర్యమేమీ లేదు’ అని పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరకయాతన ఈ జాప్యం వల్ల మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘మార్కులు నమోదు చేశాకే ఇంటికి వెళ్లాలి’ అన్న అధికారుల మొండి వైఖరితో మహిళా ఉపాధ్యాయులు పడరానిపాట్లు పడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోంది. దూరాభారం నుంచి వచ్చిన వారు, చిన్న పిల్ల తల్లులు నరకయాతన అనుభవించారు. రవాణా సౌకర్యాలు లేని సమయంలో చీకటి పడ్డాక ఇళ్లకు వెళ్లడం భద్రతపరంగా ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ట్యాబ్ల సమస్యను పరిష్కరించాలని, మహిళా ఉపాధ్యాయుల పనివేళల విషయంలో వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన ప్రక్రియ, సోమవారం రాత్రి 10 గంటలైనా పూర్తి కాలేదు. ‘చిన్న పిల్లలను ఇంట్లో వదిలి వచ్చాం. ఇక్కడ ట్యాబ్లు పని చేయవు.. ఇంటికి వెళ్దామంటే అనుమతి ఇవ్వరు. ఈ కొత్త విధానం మాకు శాపంగా మారింది’.. అని ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంపముంచిన కొత్త విధానం గతంలో మాన్యువల్ పద్ధతిలో వేగంగా సాగే మూల్యాంకనం, ఇప్పుడు డిజిటల్ మాయలో పడింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కొత్త విధానం కొంప ముంచిందని, సరైన శిక్షణ, సాంకేతిక సన్నద్ధత లేకుండా దీనిని అమలు చేయడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. రంగంలోకి అబ్జర్వర్ పరిస్థితి తీవ్రతను గమనించిన స్టేట్ అబ్జర్వర్ మువ్వా రామలింగం మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఆయన ట్యాబ్ల పనితీరును, నెట్వర్క్ సమస్యలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక బృందంతో చర్చించి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పది మూల్యాంకనంలో మొరాయించిన ట్యాబ్లు -
పదింతలు
ఆంక్షలు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సవాలక్ష ఆంక్షలు విధించారు. రాష్ట్ర విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాలు, అధికారుల మొండి వైఖరి వెరసి ముల్యాంకన కేంద్రాల్లో టీచర్ల పడరానిపాట్లు పడ్డారు. ఒక వైపు భానుడి భగభగలు, మరోవైపు అధికారుల ఆంక్షల మధ్య టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మొదటి రోజు మూల్యాంకన ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకుగానీ ప్రారంభం కాలేదు. పాత ట్యాబ్లు ఇవ్వడంతో మార్కుల నమోదు తలనొప్పిగా మారింది. టెక్నాలజీ తిప్పలు డిజిటల్ విధానంలో మార్కులు నమోదు చేయాల ని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. టీచర్లకు తుప్పుపట్టిన పాత ట్యాబ్లను అప్పగించింది. వీటిలో కొన్ని ఆన్ కాకపోవడం, బ్యాటరీ సమస్యలు, సాఫ్ట్వేర్ మొరాయించడంతో మార్కుల నమోదు కష్టతరంగా మారింది. చాలా సేపు ట్యాబ్లతో కుస్తీ పడుతు న్నా ఫలితం లేకపోవడంతో టీచర్లు అసహనం వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పది మూల్యాంకన ప్రక్రియ మొదటి రోజే గందరగోళంగా మారింది. వివిధ జిల్లాల నుంచి 1,63,560 జవాబు పత్రా లు వచ్చాయి. వీటి మూల్యాంకన ప్రక్రియకు 72 బ్యాచ్లను కేటాయించారు. అలాగే సీఈలు 72, ఏఈలు 416, స్పెషల్ అసిస్టెంట్లు 210, మొత్తం 698 మందిని నియమించారు. వీరందరికీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులే లీప్ యాప్ రూపంలో నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను ఇష్టానుసారంగా జారీ చేయడంతో మొదటి రోజు మూల్యాంకనంలో గందరగోళం చోటుచేసుకుంది. అధునాతనంగా ప్రారంభించిన ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు తలనొప్పిగా మారింది. వసతులెక్కడ మూల్యాంకన కేంద్రంలో కనీస వసతులు లేవు. ఎండలు మండిపోతున్నా పలు తరగతి గదుల్లో ఫ్యాన్ లు పనిచేయకపోవడం, వెలుతురు సరిగా లేకపోవడం, తాగునీటి సౌకర్యం పెద్దగా లేకపోవడంతో టీచర్లు ఉక్కపోతతో అల్లాడిపోయారు. మూల్యాంకన కేంద్రం వద్ద విధుల్లో ఉండాల్సిన పోలీసులు లేకపోవడంతో బయట వ్యక్తులు యథేచ్ఛగా లోనికి ప్రవేశించారు. సమ్మేటివ్ పరీక్షలపై తీవ్ర ప్రభావం సోమవారం మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కావడంతో క్షేత్ర స్థాయిలో పాఠశాలల్లో ప్రారంభమైన సమ్మేటివ్ 2 పరీక్షలు గాడితప్పాయి. ఒక వైపు మూల్యాంకనం విధులు, మరోవైపు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు... ఈ రెండూ ఒకేసారి రావడంతో క్షేత్ర స్థాయిలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మా రింది. పదో తరగతి పేపర్లు దిద్దేందుకు సీనియర్ టీచర్లతో పాటు ప్రాథమిక పాఠశాలల టీచర్లకు విధులు కేటాయించారు. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో సగానికి పైగా టీచర్లు స్పాట్ విధులకు వెళ్లా రు. ఫలితంగా, పాఠశాలల్లో ఉన్న కొద్ది మంది టీచ ర్లే అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఒకే గదిలో రెండు, మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్న దృశ్యాలు పలు చోట్ల కనిపించాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణం.మార్కుల నమోదుకు పాత ట్యాబ్లుపది మూల్యాంకనంలో వింత పోకడలు బంధీలుగా అయ్యోర్లు టీచర్ల పట్ల అధికారులు కనికరం లేకుండా వ్యవహ రిస్తున్నారు. ట్యాబ్లలో మార్కు ల నమోదు పూర్త య్యే వరకు ఎవ్వరూ ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదు. సాంకేతిక లోపాలు విద్యాశాఖవైతే, ఇందుకు టీచర్లను రాత్రి వరకు కేంద్రాల్లోనే బంధీలుగా పెట్టడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. విధు లు నిర్వహించలేక అనేక మంది టీచర్లు తమ డ్యూటీలను రద్దు చేయించుకునేందుకు అధికారుల వద్ద పడిగాపులు కాశారు. -
అయ్యో..ఘోరం!
అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ చూసుకుని తిరిగి తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలోని గంగవరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఇద్దురూ తిరుపతి కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. గంగవరం: ఒక పక్క నిద్రమత్తు.. మరోపక్క అతి వేగం ఈ రెండింటి కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గంగవరం మండలం, గంగవరం బైపాస్ రహదారిలోని వైఎస్సార్ జంక్షన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ రాంభూపాల్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి థర్డ్ ఏడీజే కోర్టులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్(47), హరీష్(35)తోపాటు మరో నలుగురు రజని, గురుమూర్తి, కిరణ్కుమార్, డ్రైవర్ జగదీష్ మొత్తం ఆరుగురు కలిసి స్కార్పియో కారులో తిరుపతి నుంచి బెంగుళూరులో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. మ్యాచ్ పూర్తయ్యాక బెంగళూరు నుంచి తిరుపతికి తిరుగు పయాణమ య్యారు. మార్గమధ్యంలోని గంగవరం బైపాస్ రహదారి వైఎస్సార్ జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ వద్ద ఒక్కసారిగా బ్రేక్ వేసింది. అదే సందర్భంలో కారు వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో కొట్టాల గ్రామం, చంద్రగిరికి చెందిన యుగంధర్, ఉపాధ్యాయనగర్, తిరుపతికి చెందిన హరీష్ ఇద్దురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అర్ధరాత్రి భారీ శబ్దం అర్ధరాత్రి వేళ హైవేలో భారీ శబ్దం.. గాఢ నిద్రలో ఉన్న స్థానికులంతా ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారిగా హైవే వైపు పరుగులు తీశారు.. జాతీయ రహదారిలో లారీని కారు ఢీకొట్టినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ సీఐ రాంభూపాల్, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వల్ప గాయాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబీకులకు అప్పగించారు. సమాచారం తెలుసుకుని తిరుపతి, పుంగునూరు తదితర ప్రాంతాల నుంచి జడ్జిలు, న్యాయవాదులు, ఇతర ఉద్యోగులు పలమనేరు ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వరుస ప్రమాదాలతో హడల్ ఇదిలా ఉండగా ఈ మధ్య ఇదే జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో తిరుమలకు వెళ్తూ జరిగిన ఘోర ప్రమాదంలో అందురూ మృత్యువాత పడ్డా రు. ఆ తరువాత మరో కారు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తు తం జరిగిన ప్రమాదంలో ఇద్దురు దుర్మర ణం పాలయ్యారు. ఈ విధంగా వరుస ప్రమాదాల కారణంగా పలువురు ప్రాణా లు కోల్పోవడంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. హైవేలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గంగవరం బైపాస్లో ఘోర ప్రమాదం -
అమరావతి కాదు.. ‘కమ్మ’రావతి
కార్వేటినగరం: ‘పెట్టరా అమరావతి... పిలవరా కమ్మరావతి’ అంటూ అమరావతి కాదు.. కమ్మరావతి అని పిలవాలని సాక్షాత్తు రాజ్యసభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అనడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు తన సామాజికవర్గ అభివృద్ధి కోసం సొంత నిర్ణయాలతో కట్టు కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. కనీసం 10 వేల మంది జనాభా లేని ప్రాంతంలో అమరావతి పేరుతో రాజధాని చేయడంపై ప్రజలు విమర్శిస్తున్న తెలిపారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు చేస్తున్న అవీనితిపై ప్రధాని మోదీ సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామి కూడా కమ్మ సామాజిక వర్గం అని సినీ నటుడు మురళీమోహన్ చెప్పడం హాస్యాస్పదమ న్నారు. వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణం చేస్తే వరదలు వచ్చినప్పుడు నీట మునుగుతుందని గుర్తించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతంలో రాజధాని చేస్తే పరిశ్రమలు వచ్చి పెద్ద నగరంగా అభివృద్ధి చెందే అవకావముందన్నారు. దానికోసమే మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ తీసుకొచ్చారని చెప్పారు. మూడు నగరాలను కలిపితే..! నగరాలను కలుపుకుని కారిడార్ కింద అభివృద్ధి చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద రాజధానిగా విలసిల్లుతుందని నారాయణ స్వామి చెప్పారు. రాజాధాని ముసుగులో జరుగుతున్న అతి పెద్ద కుంభకోణాన్ని కేంద్రం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎంపీలు మిథున్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు వివరించినా ప్రధాని మోదీ మౌనంగా ఉండడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. రాజధాని పేరుతో భూములు లాక్కున్న రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. -
కూ..చికుబుకు!
నగరి : ఎంతో ప్రతిష్టాత్మకంగా 2006లో రైల్వేశాఖ ప్రకటించిన దిండివనం –నగరి రైల్వేలైన్ ప్రాజెక్టు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు. టెండర్లు పూర్తవడంతో నగరి నుంచి రైల్వేలైన్ పనులు ప్రారంభమయ్యాయి. తమిళనాడు, విల్లుపురం, తిరువణ్ణామలై, వెల్లూరు నుంచి తిరువళ్లూరు జిల్లాకు రైలు మార్గాన్ని అనుసంధానం చేసేందుకు 2006లో రైల్వేశాఖ దిండివనం–నగరి రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందులో భాగంగా విల్లుపురం జిల్లాల్లోని దిండివనం నుంచి రేణిగుంట – అరక్కోణం సెక్షన్లోని నగరి వరకు 184.5 కి.మీ మేర కొత్త రైల్వేలైన్ నిర్మించేందుకు 2008లో రూ.582.83 కోట్ల వ్యయంగా నిర్ణయించారు. 2020లోపు పూర్తిచేసేందుకు రూ.20 కోట్ల నిధులు ఆ ఏడాదే విడుదల చేశారు. ఆ నిధులతో 6 కి.మీ మేర పనులు జరిగినా ఆపై భూసేకరణలో సమస్యలు ఎదురయ్యాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2020 నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టింది. వాలాజా రోడ్డు నుంచి రాణిపేట వరకు ఎలక్ట్రిఫికేషన్తో పాటు పట్టాల ఏర్పాటు పనులు వేగంగా జరిగాయి. ఆపై భూసేకరణతో పాటు నిధుల సమస్య వెంటాడి పనులు మందగించాయి. 2024 నాటికి ప్రాజక్టు వ్యయం రూ.3,361 కోట్లకు చేరగా మార్చి 31, 2027 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ నిర్ణయించారు. ఇప్పటి వరకు 81 శాతం భూసేకరణ పూర్తయింది. ప్రస్తుతం రూ.592.93 కోట్లు మంజూరు కావడంతో 2028కి పూర్తిచేసేలా టార్గెట్ విధించారు. 33 కి.మీ రైల్వేలైన్ నిర్మించేలా.. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్కు సంబంధిత టెండర్లు పూర్తవడంతో 33 కి.మీ మేర రైల్వేలైన్ నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. నగరి నుంచి పొదటూరుపేట వరకు 13 కి.మీ, వాలాజా రోడ్డు నుంచి షోళింగర్ వరకు 20 కి.మీ మేర రైల్వేలైన్ నిర్మించనున్నారు. వీటికి సంబంధిత పనులు నగరిలో ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది దక్షిణ రైల్వేలో మరో ముఖ్యమైన అనుసంధాన రైల్వే లైన్ అవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు విల్లుపురం నుంచి అరక్కోణం లేదా చైన్నెకి రావలసిన అవసరం ఉండదు. వాలాజా రోడ్ నుంచి నగరి మీదుగా రేణిగుంట మార్గంలో వెళతాయి. ముంబై, ఢిల్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. వాణిజ్య కార్యకలాపాలు కూడా వృద్ధి చెందుతాయి. దిండివనం, రాణిపేట, శోళింగర్ నుంచి నగరి వరకు ప్రయాణించే ప్రజలకు ప్రయాణం సులభతరమవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
15 లోపు వివరాలు నమోదు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల నమోదుకు సంబంధించి ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు విద్యాంజలి పోర్టల్లో మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల వివరాలను గడువులోపు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ప్రతి హెచ్ఎం విద్యాంజలి లాగిన్లో పాఠశాలకు అవసరమైన జాబితాను పోర్టల్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. తరువాత దాత లు, నేరుగా పోర్టల్ ద్వా రా ఆయా పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించవచ్చన్నారు. ఈ ప్రక్రియ అత్యంతపారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. విద్యాంజలి పోర్టల్ ద్వారా నగదు రూపంలో విరాళాలు స్వీకరించనున్నట్టు తెలిపారు. పోలీసు గ్రీవెన్స్కు 41 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 41 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గదువు లోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు పిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, ఈస్ట్ సీఐ రామచంద్ర సైతం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను పరిష్కారిస్తామని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సోమవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో మాట్లాడారు. నిండ్రలో పాడైన కరెంటు స్తంభాన్ని మార్పు చేసి లైన్ను మార్చా లని వినియోగదారులు వెంకటాసుబ్బారెడ్డి తెలిపారు. బంగారుపాళ్యంలో కరెంటు స్తంభం ఏర్పాటు చేయాలని నేతాజీ వినతి చేశారు. మొగిలి, చీలాపల్లెలో అంతరాయం లేని విద్యు త్ ఇవ్వాలని నాగేశ్వరరావు, ఢిల్లీప్, బైరెడ్డిపల్లెలో వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలని జీవశ్రీ తెలియజేశారు. వెదురుకుప్పంలో అదనపు సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని హరినాథరరెడ్డి కోరారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారించాలని ఎస్ఈ అధికారులను ఆదేశించారు. -
అడ్డగోలు మేత..!
తిరుపతి సిటీ: యూనివర్సిటీల్లో పరిశోధనల సామర్థం పెంపు, విద్యార్థుల్లో సాంకేతికత మెరుగు, డిజిటల్ ప్రాజెక్టులు, అధునాతన సాంకేతక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన వర్సిటీలను ఎంపిక చేసి, పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా ఎస్వీయూకు రెండు విడతలుగా రూ.21 కోట్లు, రూ.100 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థుల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి వర్సిటీలో ఏకంగా రూసా ఇన్నోవేషన్ హబ్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నిధులు పక్కదారి పడుతున్నాయని, కొందరు అధికారులు తమ స్వార్థం కోసం అవినీతికి పాల్పడుతూ దుర్వినియోగం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూసా నిధులపై తక్షణం వర్సిటీ అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని, వర్సిటీ అభివృద్ధికి, నూతన పరిశోధనల కోసం వెచ్చించిన నిధులకు లెక్క చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్వీయూలో రూసా పథకం.. అవినీతి, అక్రమాలకు అడ్డా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులు నొక్కేయడానికి కొందరికి ఈ పథకం కల్పతరువుగా మారింది.. విద్యార్థులు, వర్సిటీ అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులు అక్రమార్కుల అవతారమెత్తిన సిబ్బంది జేబుల్లోకి వెళ్లింది.. అధికారులు మగత నిద్ర.. కొరవడిన పర్యవేక్షణ.. నిర్లక్ష్యం కారణంగానే నిధులు దుర్వినియోగం జరిగింది.. అద్యాపకుల అడ్డగోలు మేతతో విద్యార్థుల్లో నైపుణ్యాలు.. వర్సిటీ అభివృద్ధి కుంటుపడింది. రూసా స్వాహా! -
ముగిసిన ఇంటర్ మూల్యాంకనం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెల రోజులుగా సాగుతున్న ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా డీఐఈవో రఘుపతి పకడ్బందీ చర్యలు చేపట్టారు. మార్చి 2 నుంచి కొన్ని సబ్జెక్టుల జవాబుపత్రాలు, మార్చి 22 నుంచి ఎక్కువ శాతం జవాబుపత్రాల మూ ల్యాంకనం చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లా ల నుంచి జిల్లాకు విచ్చేసిన 1.71 లక్షల జవా బు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో 650 మంది సిబ్బంది పాల్గొన్నారు. తప్పులు చేస్తే చర్యలు తప్పవు చిత్తూరు కలెక్టరేట్ : మూల్యాంకనంలో తప్పు లు చేస్తే చర్యలు తప్పవని అబ్జర్వర్ మువ్వారామలింగం హెచ్చరించారు. ఆయన సోమవా రం పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియను పర్యవేక్షించా రు. ఏసీవోలతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలిచ్చారు. అబ్జర్వర్ మాట్లాడుతూ మూ ల్యాంకన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవ్వ రూ ఫోన్ వినియోగించకూడదన్నారు. తప్పిదా లు జరగకముందే జాగ్రత్తలు పాటించాలన్నా రు. ప్రతి రోజు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుందన్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విధులు నిర్వహించే టీచర్లు విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. డీవైఈవో ఇందిరా, అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు పాల్గొన్నారు. -
పట్టణాల్లో ప్రతి ఇంటికీ కొళాయి
● చిత్తూరులో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లు ● మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చిత్తూరు అర్బన్: పట్టణాల్లో ప్రతీ ఇంటికి నీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చి, నీటిని సరఫరా చేస్తామని.. ఇందుకోసం రూ.14 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. సోమవారం చిత్తూరు నగరంలోని పూనేపల్లెలో టిడ్కో గృహాలను పరిశీలించి, నగరంలోని పలు కూడళ్లను సందర్శించారు. కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే జగన్మోహన్నాయుడు, డీఎంఏ సంపత్కుమార్, ఈఎన్సీ ప్రభాకర్రావుతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చిత్తూరులో కాలువల నిర్మాణానికి రూ.84 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కోసం రూ.39.21 కోట్లు మంజూరు చేశామన్నారు. కమిషనర్ నరసింహ ప్రసాద్, చుడా చైర్పర్సన్ హేమలత, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
విచారణ జరిపించాలి
ఎస్వీయూలో రూసా నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక అధికారులను నియమించి విచారణ చేపట్టాలి. ఉన్నత లక్ష్యం కోసం మంజూరైన రూ.కోట్ల నిధులను సక్రమంగా వినియోగంచడంలో అధికారులు విఫలమయ్యారు. వర్సిటీలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు అధికారులు రూసా నిధులను వినియోగించాలి. – చిన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు,తిరుపతి శ్వేత పత్రం విడుదల చేయాలి ఉన్నత లక్ష్యంతో విడదులైన రూసా నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. వర్సిటీలోని కొందరు అధికారులు నిధులపై కన్నేశారు. వారి స్వార్థం కోసం నిబంధనలను తుంగలో తొక్కి దుర్వినియోగం చేశారు. అవినీతి ఆరోపణలను అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. నిధుల వినియోగంపై అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు, ఎస్వీయూ అవినీతి రాజ్యమేలింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రుసా నిధుల్లో అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చుపెట్టేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని వీసీకి ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోలేదు. ఖర్చుపెట్టిన ప్రతి పైసాపై లెక్క చెప్పాల్సిందే. కొందరు అనవసర సెమినార్లు, సదస్సుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎస్వీయూ నిజానిజాలు తేల్చాలి వర్సిటీలో రూసా నిధుల దుర్వినియోగంపై వస్తున ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలి. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే వర్సిటీ అభివృద్ధికోసం రూసా నిధులను వెచ్చించాల్సిన అధికారులు తమ స్వార్థం కోసం వినియోగించడం దారుణం. రూసా 2.0 ద్వారా నిర్వహించిన సదస్సులు, సెమినార్లకు అవసరం కంటే అధిక మొత్తం వెచ్చించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. – శివ బాలాజీ, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం స్వలాభం కోసం అధికారులు రూసా నిధులతో తమ అనుచురుల కు వర్సిటీ ఉద్యోగాలు కల్పించడం దారుణం. ఇష్టా నుసారంగా నిధులను దుర్వినియోగం చేస్తూ తమకు అడ్డులేద ని విర్వవీగుతూ వర్సిటీ అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం. తక్షణం నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అవినీతికి పా ల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలు నమోదు చేసు కోనున్నట్టు వెల్లడించారు. కిరాతకంగా చంపింది మైనర్లే – చంద్రమ్మ హత్య కేసులో బిగ్ ట్విస్ట్! పలమనేరు: పెద్దపంజాణి మండలం, పెద్దముద్దేపల్లికి చెందిన టైలర్ చంద్రమ్మ హత్య విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అదే మండలానికి చెందిన సమీ ప బంధువు సుబ్రమణ్యంను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వరుసకు పిన్నీ అయిన చంద్రమ్మ వద్ద క్రికెట్ బెట్టింగుల కోసం అప్పు చేసిన సుబ్రమణ్యం దాన్ని చెల్లించకుండా తన స్నేహితుల ద్వారా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వివారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో ఏ–2, ఏ–3లు గా ఉన్న వారు అదే మండలం జంగాలపల్లికి చెందిన ఓ బాలుడు (17), చిన్నారికుంటకు చెందిన మరో బాలుడు(17)లుగా గుర్తించారు. సోమవారం పెద్దపంజాణి పోలీసులు వారిని అరెస్ట్ చేసి తిరుపతిలోని జువైనల్ హోమ్కు తరలించారు. కాగా వీరు మైనర్లు అయినా ఇందులో ఓ వ్యక్తి లైసెన్సు లేకుండానే టాటాఏస్ను ఎలా నడుపుతున్నాడు, ఇతనిపై ఎంవీఐ చట్టం మేరకు ఎందుకు కేసు పెట్టలేదనే మాట వినిపిస్తోంది. మరో మైనర్ పెళ్లిళ్లలో క్యాటరింగ్ హెల్పర్గా ఉంటూ ఈ హత్యలో పాల్గొన్నట్టు విచారణలో వెలుగు చూసింది. హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు చిత్తూరు అర్బన్: స్నేహితుడినే మద్యం మత్తులో కొట్టి చంపిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరులోని 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితులు శరవణ (32), మణికంఠ (33)కు ఈ మేరకు శిక్ష విధిస్తూ సుంకర శ్రీదేవి తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.జ్యోతిరామ్ కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని మంగసముద్రంకు చెందిన రవికుమార్, ఢిల్లీబాబు, శరవణ, మణికంఠ స్నేహితులు. 2021 ఏప్రిల్ 13న వీళ్లంతా కలిసి ఓ నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. రవికుమార్ తనకు మద్యం కావాలని పదేపదే అడుగుతుండడంతో ఆవేశానికి గురైన శరవణ, మణికంఠ కలిసి రాళ్లతో అతనిపై దాడి చేశారు. రవికుమార్ స్ఫృహతప్పి పడిపోగా.. మిగిలిన ముగ్గురూ ద్విచక్ర వాహనంలో పారిపోయారు. కొంతదూరం వెళ్లాక ద్విచక్ర వాహనం ఆపి.. ఢిల్లీబాబు విషయం పోలీసులకు చెబుతాడని భావించి అతడిని కూడా హత్య చేయడానికి దాడిచేశారు. అతను తప్పించుకుని పారిపోయి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. జరిగిన విషయం పోలీసులకు తెలియడంతో అప్పటి చిత్తూరు తాలూక ఎస్ఐ విక్రమ్ ఘటనా స్థలానికి వెళ్లగా.. అప్పటికే రవికుమార్ చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితులు శరవణ, మణికంఠను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కేసును నాటి సీఐ బాలయ్య దర్యాప్తు చేశారు. కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ఇద్దరు నిందితులను జీవితఖైదు, ఒక్కొక్కరికీ రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
22 స్టేషన్లను కలిపే మార్గం
రైలు మార్గం దిండివనం, వెల్లిమేడుపేట, తెల్లార్, వంధవాసి, మాంబాక్కం, ఎరుమైవెట్టి, చెయ్యార్, ఇరుంగూర్, మామండూరు, ఆరణి, తామరైపాక్కం, తిమిరి, ఆర్కాట్, రాణిపేట నుంచి వాలాజా రోడ్డు జంక్షన్న్ మీదుగా కొడక్కల్, షోళింగర్, ఆర్కే పేట, అత్తిమాంజేరిపేట, పళ్లిపట్టు, పొదటూరుపేట మీదుగా నగరి వరకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నగరి వెళ్లేలా ప్లాన్న్ చేశారు. ఈ మార్గంలో 3 జంక్షన్లు, 13 క్రాసింగ్లు, 9 హాల్టులు ఉండే విధంగా పథకరచన చేశారు. 22 స్టేషన్లలో 18 కొత్తస్టేషన్లు రానున్నాయి. 26 మేజర్ వంతెనలు, 200 మైనరు వంతెనలు నిర్మించనున్నారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
– ఎమ్మెల్సీ భరత్ కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ అధైర్య పడొద్దని... వచ్చేది మన ప్రభుత్వమేనని.. అందరికీ అండగా ఉంటామని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. సోమవారం తంబిగానిపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా కుట్రలు, కుతంత్రాలకు దిగుతోందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వై ఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ భయపడొద్దని, కూటమి నాయకుల తాటాకు చప్పుళ్లకు తలొంచొద్దని ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఎవరైతే పార్టీ జెండా పట్టుకుని నిలబడతారో వారితోనే భవిష్యత్తులో రాజకీయాలు చేస్తామని చెప్పారు. ఎవరు వెళ్లాలన్నా వెళ్లిపోవచ్చని, ఉన్నవారితోనే భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాలు చేసుకోవాలని, శ్రేణులు ఎవరైనా మరణించిన, ప్రమాదం సంభవించినా ఇన్సూరెన్స్ రూపంలో రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం తంబిగానిపల్లి పార్టీ నాయకుల నూతన గృహప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మునిరాజు, హఫీజ్, మణి, మోహన్రామ్, పీఏ నారాయణరెడ్డి, మనోహర్, సీకేసిలు పాల్గొన్నారు. ‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్ మెడల్ తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఎస్.భావన ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్న్స్– డేటా సైన్స్లో 87.58శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం ఈమేరకు అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, విభాగాధిపతి డాక్టర్ స్వప్నసుధ అభినందనలు తెలిపారు. -
గడువు లోగా పరిష్కరించాల్సిందే
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ – 90 శాతం రెవెన్యూ సమస్యలే గంగాధర నెల్లూరు: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జీని గడువు లోగా పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ సుమిత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జీడీ నెల్లూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వందలాది తరలివచ్చి అర్జీలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అర్జీలు స్వీకరించారు. మొత్తం 257 వినతలు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ 117, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 50, పోలీస్ 46, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 13, రూరల్ వాటర్ సప్లై ఇంజినీరింగ్ 6, అగ్రికల్చర్ 6, పంచాయత్రాజ్ 6, విద్యుత్శాఖ 2, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 2, వాటర్ రిసోర్స్ 2, ఎండోమెంట్ 1, లీగల్ మెట్రాలజీ 1, రోడ్లు, బిల్డింగ్స్ 1, పబ్లిక్ హెల్త్ 1, అనిమల్ హస్బెండ్రీ 1, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ 1, గనులు, భూగర్భశాఖ 1 వచ్చినట్టు తెలిపా రు. ఇందులో 90 శాతం అర్జీలు రెవెన్యూకు సంబంధించినవేనని తెలిపారు. గడువులోగా అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. జీడీనెల్లూ రు ఎమ్మెల్యే థామస్, జాయింట్ కలెక్టర్ ఏ.రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్కుమార్, డిప్యూటీ కలెక్టర్ సురేష్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. పోక్సోకేసులో నిందితుడి అరెస్ట్ వెదురుకుప్పం: పోక్సో కేసులో నిందితుడ్ని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నగరి డీటీసీ డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లా, భాకరాపేట మండలంలోని రామమూర్తి కుమారుడు చందు(26)పై ఇటీవల వెదురుకుప్పం పోలీస్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కాగా సోమవారం మండలంలోని పచ్చికాపల్లంలో నిందుతుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : సమస్యలు పరిష్కరించండి సారూ..! అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దయినప్పటికీ పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీజీఆర్ఎస్ లేకపోవడంతో వెనుదిరిగారు. ఆక్రమించేందుకు కుట్ర నగరంలోని ఇరువారం గ్రామంలో తమ అనుభవంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు స్థానికులు కుట్ర చేస్తున్నారని బాధితురాలు మేరీ ఆరోపించారు. గతంలో అధికారులు విచారణ జరిపి దురాక్రమణలను తొలగించినప్పటికీ, మళ్లీ ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఎక్స్పోకు పుత్తూరు బాలికలు
పుత్తూరు: ఎంట్రప్రెన్యూర్షిప్ మైండ్సెట్ డెవలప్మెంట్ ప్రోగాం (ఈఎండీపీ) రాష్ట్ర స్థాయి ఎక్స్పోకు పుత్తూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. విద్యార్థుల్లో వ్యాపార దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో సోమవారం తిరుపతి ఎంజీఎం హైస్కూల్లో ఈఎండీపీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈఎక్స్పోలో పుత్తూరు బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు పి.ఢిల్లీరాణి, బి.శ్రీలక్ష్మీ ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నారు. సర్వశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ గౌరీశంకర్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయురాలు కె.వి.శ్యామలత మార్గదర్శకంలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులు త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఈఎండీపీ ఎక్స్పోలో పాల్గొనన్నారు. కార్యక్రమంలో ఈఎండీపీ జిల్లా కో–ఆర్డినేటర్ అనిత, జిల్లా సైన్స్ ఆఫీసర్ భానుప్రసాద్, జిల్లా రిసోర్స్ పర్సన్ వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆదర్శమూర్తి బాబూ జగ్జీవన్ రామ్
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శమూర్తి అని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు.భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్ది కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం సంకటహర గణ పతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి–బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి ఉత్సవమూర్తులను ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 9 నుంచి 10 వరకు, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్ది గణపతి వ్రతాన్ని భక్తులతో జరిపించారు. స్వర్ణ రథంపై స్వామివారు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యే క అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణరథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు పట్టా రు. కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్, ఏఈవో రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు జీడీ నెల్లూరులో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్ : జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు కచ్చితంగా హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
తవణంపల్లె : మండలంలోని దిగువ మోదలపల్లె కొత్త చెరువులో బ్లేడుతో గొంతుకోసి యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఆయన ఆదివారం తవణంపల్లె పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని దిగువ మోదలపల్లె హెచ్డబ్ల్యూకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు యువరాజ్(18) అదే గ్రామంలోని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రేవతి కుమారుడు లవకుమార్(23) ఆ అమ్మాయితో ఫొటో తీసుకుని ఇన్స్ట్రాగాం, ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీనిపై యువరాజ్ అభ్యంతరం తెలిపారు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని, ఫొటోలు తీయొద్దని లవకుమార్ను హెచ్చరించాడు. అతను వినకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తనతోపాటు కూలి పనులకు వచ్చే బాలుడి సహాయంతో పథకం ప్రకారం లవకుమార్ను దిగువ మోదలపల్లె కొత్తచెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతనితో మద్యం తాగించాడు. మత్తులో ఉన్న సమయంలో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువు నీటి గంటలో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి తల్లి రేవతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు యువరాజ్, అతనికి సహకరించిన బాలుడు ఆదివారం తెల్లగుండ్లపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉండగా అరెస్టు చేశారు. బాలుడిని జ్యువైనల్ హోమ్కు తరలించారు. హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్నాయుడు, కాణిపాకం, యాదమరి ఎస్ఐలు టి.నరసింహులు, డి.ఈశ్వరయ్యను అభినందించారు. -
ఇంటి పన్ను చెల్లించలేదని.. పింఛన్ కట్
పాలసముద్రం : ఇంటి పన్ను చెల్లించలేదని వికలాంగుడికి పింఛను మొత్తా న్ని ఇవ్వకుండా ఆపేశారు. బాధితుడు మండలంలోని క్రిష్ణజమ్మాపురం పంచా యతీ ఆదిఆంధ్రవాడకు చెందిన గురు స్వామి కథనం మేరకు.. గురు స్వామి వికలాంగుడు. అతనికి వికలాంగుల పింఛను రూ.6 వేలు వస్తోంది. అతను ఉంటున్న ఇంటికి పన్ను చెల్లించలేదు. ఈ క్రమంలో పంచాయతీ అధికారులు అతనికి ఈ నెల పింఛను మొత్తం ఇవ్వలేదు. ఇంటి పన్ను చెల్లిస్తేనే పింఛను మొత్తం ఇస్తామని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఆ ఇల్లు ఇద్దరికి భాగం ఉందని, భాగపరిష్కారమై తనకు వస్తేనే ఇంటి పన్ను చెల్లిస్తానని గురుస్వామి చెప్పినా అధికారులు వినలేదు. ప్రతిరోజూ సచివాలయానికి వెళ్లడం.. తిరిగి ఇంటికి చేరుకోవడం షరా మూమూలుగా మారిందని బాధితుడు వాపోతున్నాడు. తనకు వచ్చే పింఛను మొత్తంతోనే జీవనం సాగిస్తున్నానని, ఈ నెల నగదు ఇవ్వకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై ఎంపీడీవో సతీష్ కుమార్ వివరణ ఇస్తూ పింఛను ఇవ్వకపోవడం సరికాదన్నారు. విచారించి ఇకమీదట అలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురుస్వామి కి వచ్చే నెల రెండు నెలల పింఛను రూ.12 వేలు అందజేస్తామని పేర్కొన్నారు. -
వెలగని సోలార్
చిత్తూరులో హిమజ 2 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడంతో రూ.60 వేలు సబ్సిడీ పడింది. దీన్ని రుణానికి కట్టాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం కట్టాల్సిన అవసరం లేదు కదా అంటే అదంతా మాకు తెలియదు ముందుగానే చెల్లించాలని పట్టుపడుతున్నారు. ఎన్ని చెప్పినా ససేమిరా సబ్సిడీ కట్టాలని చెప్పడంతో ఏమి చేయాలో తెలియక ఆమె తల పట్టుకుంది. తిరుపతికి చెందిన శంకర్ తన ఇంటికి 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు గాను ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఈ విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది వారి ఇంటికి వచ్చి సబ్సిడీ మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈఎంఐలు సక్రమంగా కడితే చాలు ముందుగా ఎందుకు చెల్లించాలంటే సరైన సమాధానం చెప్పడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్యఘర్ పథకం జిల్లాలో పలు కారణాలతో నత్తనడకన సాగుతోంది. సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరులో బ్యాంకర్లు సహకరించడం లేదు. రుణాలు మంజూరు చేసిన కొంతమంది బ్యాంకర్లు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఈఎంఐలకు కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీనికి తోడు ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మన్లు మాకు ఏమీ లేదా అని వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం విద్యుత్ సర్వీసులు 7,75,963 ఉండగా గృహ సర్వీసులు 5,19,271 ఉన్నాయి. అలాగే తిరుపతి జిల్లాలో మొత్తం 8,57,428 విద్యుత్ సర్వీసులు ఉండగా వాటిలో 6,53,207 గృహ సర్వీలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత కింద వీరి ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందుకు బ్యాంకులు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇస్తామన్న రూ.20 వేల రాయితీ ఇవ్వకపోవడంతో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు వినియోగదారులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సబ్సిడీ మొత్తం కట్టాల్సిందే.. చిత్తూరు జిల్లాలో సోలార్ ఏర్పాటు కోసం 36,205 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 36,173 దరఖాస్తులు అనుమతులు పొందాయి. వెండర్లకు ఎంపికై నవి దరఖాస్తులు 6,583, సబ్సిడీ వచ్చినవి 1,090, ఏర్పాటు చేసిన మొత్తం కెపాసిటీ సామర్థ్యం 3,270 కిలోవాట్లు. తిరుపతి జిల్లాలో 30,024 దరఖాస్తులు రాగా, 29,990 అనుమతులు పొందాయి. 7,995 దరఖాస్తులను వెండర్లు ఎంపిక చేసుకున్నారు. వీటిలో 2,454 మంది వినియోగదారులకు సబ్సిడీ పడింది. వీటి ద్వారా మొత్తం తయారయ్యే విద్యుత్ 9,460 కిలోవాట్లు. నగదు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పనంతా అయిపోయింది మీటర్ కూడా బిగించేశాం.. లైన్ ఇన్స్పెక్టర్ సార్ కూడా వచ్చారు.. తమను గమనించుకోవాలని లైన్మెన్లు అడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తర్వాత చూద్దామని వినియోగదారులంటున్న ఎప్పుడు రమ్మంటారని టైమ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. చిత్తూరులో పెట్టిన ఫలకాలు పీఎం సూర్యఘర్ కరపత్రం అందని ప్రభుత్వం ప్రోత్సాహం రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ లేనిదే ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్ కొరత రాకుండా చూడాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ను విరివిగా తయారుచేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి ప్రజలకు సబ్సిడీ ఇచ్చి ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పలు కారణాలతో జిల్లాలో ఈ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. -
అంతా అయోమయం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (స్పాట్ వాల్యుయేషన్) ప్రారంభం కానుంది. విద్యాశాఖ అధికారులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. మూల్యాంకన ప్రక్రియలో లోలోపల జరుగుతున్న తప్పిదాలు చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ అంధకారమయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా టీచర్ల నియామకాల్లో ఆటోమేషన్ పేరుతో చేసిన ప్రయోగాలు విద్యావ్యవస్థను నవ్వులపాలు చేస్తున్నాయి. బోధించని వారితో దిద్దించడమేంటి నిబంధనల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను కనీసం మూడేళ్లు బోధించిన అనుభవం ఉన్న టీచర్లనే మూల్యాంకనం విధుల్లో నియ మించాలి. ఈ సారి అధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. పదో తరగతే లేని స్కూళ్ల నుంచి నియామకాలు గత ఏడాది 9వ తరగతి ప్రారంభమై, 2026–27 విద్యా సంవత్సరంలో మొదటిసారి పదో తరగతి బ్యాచ్ను సిద్ధం చేయబోతున్న అప్గ్రేడ్ హైస్కూల్ టీచర్లకు సైతం స్పాట్ ఆర్డర్లు ఇచ్చారు. వీరికి పదో తరగతి సిలబస్ పైన, ప్రశ్నల సరళిపైన కనీస అవగాహన లేకపోవడం గమనార్హం. కీ చూసి అడ్జెస్ట్ దిద్దాలంట..! తమకు 10వ తరగతి బోధించిన అనుభవం లేదని, పేపర్లు దిద్దడం కష్టమని మొరపెట్టుకుంటున్న టీచర్ల కు అధికారుల నుంచి వింత సమాధానాలు ఎదురవుతున్నాయి. ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాల్యుయేషన్ (కీ) ఇస్తాం.. దాన్ని చూసి దిద్దేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. ఒక పేపర్ను చూసి విద్యార్థి రాసిన విశ్లేషణాత్మక సమాధానాలను అంచనా వేయడం సాధ్యమేనా? ఈ ప్రక్రియలో జరిగే చిన్న పొరపాటైనా విద్యార్థి గ్రే డింగ్ను మార్చేసి వారి ఉన్నత చదువుల అవకాశాల ను దెబ్బతీస్తుంది. ఈ కనీస స్పృహ అధికారుల్లో లేక పోవడం దారుణమని విద్యావేత్తలు వాపోతున్నారు. సాంకేతికత పేరుతో అట్టహాసం ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు, నో మొబైల్ జోన్, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయడం మంచిదేనని, సబ్జెక్ట్పై పట్టు లేనివారు పేపర్లను ఎలా దిద్దుతారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీచర్లను బెదిరిస్తున్న విద్యాశాఖ అధికారులు అర్హత లేని వారితో మూల్యాంకనం చేయించి విద్యార్థులకు అన్యాయం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా రు. ఈ అస్తవ్యస్త విధానంపై ఉపాధ్యాయ సంఘా లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు వాస్తవ పరిస్థితులను గమనించి, తక్షణమే అర్హత లేని టీచర్ల నియామకాలను రద్దు చేసి, అనుభవజ్ణులైన వారితోనే మూల్యాంకనం జరిపించాలని కోరుతున్నారు. మూల్యాంకనం కోసం చేసిన ఏర్పాట్లుపదో తరగతి మూల్యాంకనం నిర్వహించే పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలహోరెత్తిన మాన్సూన్ ఛాలెంజ్ 1 చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరంలో ఆరోగ్య చైత న్యం వెల్లివిరిసింది. మిట్టూరులోని అరుణాచలం కళాశాల ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మాన్సూన్ ఛాలెంజ్–1 సైక్లింగ్ కార్యక్రమం ఆదివారం అశేష జనవాహిని మధ్య ఘనంగా ముగిసింది. ఇందులో వందలాది మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని ఫిట్నెస్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యమన్నారు. నేటి యాంత్రిక జీవనంలో సైక్లింగ్ అనేది అత్యవసరమన్నారు. దీనివల్ల శరీరంలోని కండరాలను దృఢంగా మారడమే కాకుండా మానసిక ఒత్తిడి దూరమవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భా గం చేసుకోవాలని చెప్పారు. అరుణాచలం కళాశాల చైర్మన్ జగన్నాథరెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా సైక్లింగ్ చేయడం వల్ల బరువు తగ్గి, ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదు వుతో పాటు శారీరక ధృఢత్వం ముఖ్యమన్నారు. విజయం కళాశా ల ప్రిన్సిపాల్ జయంత్, సైక్లిస్ట్ డాక్టర్ భరత్రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్, స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండాలన్నారు. అనంతరం సైక్లింగ్ ఫోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైకిలిస్ట్లు సురేంద్రరెడ్డి, ఏలు మలై, వాసు, తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికీ పదో తరగతి కీలకం. ఇందులో వచ్చే మార్కులే ఉన్నత విద్యకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఈ క్రమంలో ఎంతో జాగ్రత్తగా మూల్యాంకనాన్ని చేయించాల్సిన రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సాంకేతికత పేరుతో ఆటోమేషన్ అంటూ అట్టహాసం చేస్తూ, క్షేత్రస్థాయిలో కనీస నిబంధనలను గాలికొదిలేసింది. పదో తరగతి పాఠాలు చెప్పని వారికి, అసలు హైస్కూల్ ముఖమే చూడని టీచర్లకు స్పాట్ విధులను కేటాయించింది. సీసీ కెమెరాల నిఘా, ట్యాబ్ ఆధారిత నమోదు, నో మొబైల్ జోన్ అంటూ ఆర్భాటం చేస్తూ సబ్జెక్టుపై అవగాహన లేని వారితో పేపర్లు దిద్దించడానికి చర్యలు తీసుకుంది. దీంతో పిల్లల భవితవ్యం ఏమవుతోందనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.పాఠశాలలు ఖాళీ.. విధుల్లో గందరగోళం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు సోమవా రం నుంచి సమ్మేటివ్–2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను స్పెషల్ అసిస్టెంట్లుగా మూ ల్యాంకనం విధులకు పిలిచారు. కొన్ని పాఠశాలల్లో ఐదుగురు టీచర్లు ఉంటే నలుగురిని స్పాట్ విధులకు కేటాయించారు. ఒక్క టీచర్తో పాఠశాల ఎలా నడుస్తుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నా రు. మరికొన్ని హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు ఉన్నా, టీచర్లందరినీ నియమించడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది. గణాంకా ల కోసం, ప్రక్రియను త్వరగా ముగించడం కోసం విద్యాశాఖ అనుసరిస్తున్న ఈ అస్తవ్యస్త విధానం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమేనని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అర్హులైన వారికే ఈ కీలక బాధ్యతలు అప్పగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. టెన్త్ మూల్యాంకనంలో విద్యాశాఖ అస్తవ్యస్థ నిర్ణయాలు -
శెట్టిన్ తంగాల్లో ఇసుక తోడేళ్లు..!
తిరుపతి సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు మండలం శెట్టిన్ తంగాల్ గ్రామం వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఆదివారం ఇసుక అక్రమ తవ్వకాలు వెలుగుచూశాయి. శెట్టిన్ తంగాల్కు చెందిన ఒక టీడీపీ నేత మరో ఐదుగురితో కలిసి శెట్టిన్ తంగాల్ రోడ్డు నుంచి రీచ్కు రోడ్డు వేశాడు. ఈ రోడ్డు ఏర్పాటు శనిశారం పూర్తి కావడంతో ఆదివారం ఇసుక తవ్వకాలు ప్రారంభించాడు. జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నాడు. దీన్ని గుర్తించిన గ్రామస్తులు, టీడీపీలోని ఒక వర్గం నేతలు అప్రమత్తమయ్యా రు. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వర్గం వారు ఇసుక తవ్వకాలు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుసుకున్న అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అక్రమా ర్కులపై ఆరా తీసిన అధికారులు ఆ టీడీపీ నేతను పిలిచి మందలించినట్లు తెలిసింది. మరో సారి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.శెట్టిన్ తంగాల్ను పచ్చ తోడేళ్లు చెరబట్టాయి. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నాయి. జేసీబీలతో తవ్వి డంపు చేసి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఈ దందా ఊరంతా పాకి.. అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంతలోనే జేసీబీలు, ట్రాక్టర్లు రీచ్ నుంచి పరరాయ్యయి. అధికారులు అక్రమార్కులపై ఆరా తీసి హెచ్చరికలు జారీ చేశారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు..?
నగరి: పట్టణంలోని జంతు వధశాలకు అధికారికంగా గుత్త హక్కుల వేలంపాట నిర్వహించకుండానే కొంతమంది టీడీపీ నాయకులు జామియా మక్కా మసీదు, నగరి పురపాలక సంఘం జంతు వధశాఖ రుసుము 2026–27, కాంట్రాక్టర్ కళంధర్ అంటూ రశీదులు ముద్రించారు. దుకాణదారుల నుంచి మేక, పొట్టేలు ఒకటికి రూ.20, ఎద్దు, ఒంటె ఒకటికి రూ.50, కోడికి రూ.5 వసూలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక దుకాణానికి రూ.150 చొప్పున వసూలు చేయడం చర్చనీయాంశమైంది. వసూళ్ల రశీదులో 2024 ఏప్రిల్ నెల 5వ తేదీ అంటూ రాసి ఇవ్వడం అక్రమ దందాకు అద్దం పడుతోంది. వేలంపాట పూర్తికాకముందే డబ్బులు వసూలు చేస్తుండడంపై దుకాణదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు భయంతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు జంతువధశాల వేలాన్ని వాయిదా వేసినట్లు ఇదివరకే ప్రకటించామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రుసుము వసూళ్లకు అధికారిక ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని, అనుమతులు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. నేను టెండరు పాడితే వాయిదా వేశారు ఈ ఏడాది మార్చి 4వ తేదీన జంతువధశాలకు వే లం పాట నిర్వహించారు. నలుగురితోపాటు నేను పాల్గొన్నాను. అందరికంటే ఎక్కువగా రూ.1,00,500 పాడాను. ఏ కారణాలు లేకుండా వేలాన్ని అధికారులు వాయిదా వేశారు. మళ్లీ మా ర్చి 10వ తేదీన వేలం పాట నిర్వహిస్తామని పెట్టలేదు. ప్రస్తుతం వేలంపాట నిర్వహించకుండానే కొందరు తామే కాంట్రాక్టర్లమంటూ వసూళ్లు చేస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలి. – బషీర్, నగరి -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. తప్పులు జరిగితే వేటే చిత్తూరు కలెక్టరేట్ : మూల్యాంకన ప్రక్రియలో తప్పులు జరిగితే వేటు ఖాయమని డీఈవో రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఆయన ఆదివారం పీసీఆర్ పాఠశాలలో ఏసీవోలతో మూల్యాంకన ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఎలాంటి తేడాలు జరగకుండా మూల్యాంకన విధులు నిర్వర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్ వినియోగించకూడదన్నారు. మూల్యాంకన కేంద్రంలోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. వైట్నర్ కనబడకూడదన్నారు. విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కుల నమోదులో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయ ని తెలిపారు. సమావేశంలో డీవైఈవో ఇందిరా, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, ఎంఈవోలు రమేష్, అరుణాచలరెడ్డి, హసన్బాషా, పాండ్యన్, హెచ్ఎంలు సురేష్, అరుణ్కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి సమ్మేటివ్–2 చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అన్ని యాజమాన్యా ల పాఠశాలల విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్–2(వార్షిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లా విద్యాశా ఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ప్రకారం 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులకు 6, 7, 8, 9 తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు 6, 7, 8, 9, 10, 11, 13 తేదీల్లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షించనున్నారు. నేడు ప్రజాఫిర్యాదుల కార్యక్రమం చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజలు ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. -
104 సంచార వైద్యానికి షాక్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో 104 వాహనాలు 39 ఉన్నాయి. ఇవి జిల్లాలోని 614 విలేజ్ హెల్త్ క్లినిక్లకు నెలకు రెండుసార్లు చొప్పున వెళ్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వర కు ప్రజలకు వైద్య సేవలు అందిస్తాయి. 104 వైద్య శిబిరా లను సచివాలయం లేదా కమ్యూనిటీ హాళ్లలో నిర్వహిస్తారు. వైద్య సేవల్లో డ్రైవర్, డీఈవో, ఏఎన్ఎం, ఆశా, ఎంఎల్హెచ్పీలు, మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారు. రెండేళ్లుగా ఈ సేవలకు నిర్లక్ష్యపు జబ్బు చేసింది. రెండేళ్లుగా క్షీణించిన సేవలు రెండేళ్లలో 104 సేవలు గణనీయంగా తగ్గాయి. వైద్యులు సేవలకు డుమ్మా కొడుతున్నారు. అంతా సిబ్బంది మీదే నెట్టేస్తున్నారు. అంతా సిబ్బంది మీదే నెట్టేస్తున్నారు. దీంతో సిబ్బంది తూతూమంత్రంగా శిబిరాలు నిర్వహిస్తూ మాత్రలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తద్వారా 104 సంచార వైద్యం లక్ష్యం నీరుగారిపోతోంది. పడిపోయిన ఓపీలు డాక్టర్లు ప్రభుత్వ వైద్య సేవలపై చిన్న చూపు చూడడంతో 104లో ఓపీల సంఖ్య దారుణంగా పడిపోతోంది. వైద్యులు లేకుండా సిబ్బంది తూతూమంత్రం వైద్యం అందిస్తుండడంతో జబ్బులు నయం కావడం లేదు. దీనికితోడు 104లో మందుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఈ ప్రభావంతోనే ఓపీల సంఖ్య ఘణనీయంగా తగ్గుముఖం పడుతోంది. వృద్ధులు సైతం 104 సేవలకు ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా పేదలు అప్పులు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. వెలుగులోకి బోగస్ ఓపీల బాగోతం... ఓపీ నమోదులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్యాలను చేరుకోవడానికి 104 వాహనాల సిబ్బంది తప్పుడు వివరాలతో ఓపీలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఈ సమస్యలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఆధార్ నంబర్తో వైద్య సేవలకు చెక్ పెడుతోంది. మొబైల్ ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేసింది. ప్రస్తుతానికి ఓటీపీ ఆధారంగానే 104 సేవలు పొందాలని సిబ్బంది పల్లె జనానికి వివరిస్తున్నారు. ఈ విధానం కొత్త సమస్యలకు దారి తీస్తోంది. ఓటీపీ ఉండాల్సిందే.. ఓటీపీ లేకుండా మందులు కూడా ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, మొబైల్ ఫోన్ లేకపోవడంతో అనేక మంది పేదలు వైద్య సేవలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఫోన్ లేకపోవడం, ఓటీపీ గురించి తెలియకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రజల ఒత్తిడి మధ్య 104 సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సేవలు అందించలేక తలలు పట్టుకుంటున్నారు. 104వాహనంవైద్యసేవలు అందిస్తున్న దృశ్యం (ఫైల్) పేదలు తాము సంపాదించిన అరకొర ఆదాయంలో ఎక్కువ భాగం విద్య, వైద్యానికే ఖర్చు చేస్తారు. దీనివల్ల వారి బతుకులు ఎదుగూబొదుగూ లేకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. ఈ క్రమంలో వారికి ఆరోగ్యపరంగా ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ పేదల ఆరోగ్య భద్రత పథకం కింద 104 సంచార వైద్య సేవలను తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్ట్ (ఈహెచ్ఆర్) అమలు తర్వాత సేవలు దూరమయ్యాయి. ఓటీపీ విధానం తప్పనిసరి చేయడంతో వృద్ధులు వైద్య సేవలు పొందలేకపోతున్నారు. -
ఆదర్శమూర్తి బాబూ జగ్జీవన్ రామ్
చిత్తూరు కలెక్టరేట్ : సామాజిక విప్లవకారుడు బాబూ జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. జిల్లా కేంద్రమైని చిత్తూరులోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గంగినేనిచెరువు వద్ద ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గంగినేనిచెరువు నుంచి అంబేడ్కర్ భవనం వరకు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ ఒక నాయకుడు మాత్రమే కాదని, కోట్లాది మంది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన హయాంలో తీసుకువచ్చిన పలు చట్టాలు నేటికీ బహుజనుల రక్షణకు కవచాల్లా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. నేటి యువ త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలి సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కలెక్టర్ వాపోయారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేసి అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాలకు అందేలా చేయాలని కోరారు. చట్టాలను అక్షరాలా అమలు చేసినప్పుడే ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు చేరువలో విద్య, వైద్యం, తాగునీరు, హాస్టల్ సదుపాయాలను మెరుగుపరచడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, చుడా చైర్మన్ కఠారి హేమలత, ఆర్డీవో శ్రీనివాసులు, మాజీ మేయర్ అముద, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకయ్యే ఖర్చు
3 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు రూ.2.10 లక్షలు ఖర్చవుతోంది. దీనికి సబ్సిడీ రూ.78 వేలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకు గాను వినియోగదారుల నుంచి రూ.21 వేలు కట్టించుకుంటున్నారు. 7 ఏళ్ల గడువుతో ప్రతినెలా రూ.2 వేల చొప్పున చెల్లించేలా వినియోగదారుల నుంచి అంగీకారం తీసుకుంటున్నారు. బ్యాంకు మేనేజర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడీ మొత్తం రూ.78 వేలను ఈఎంఐలకు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకులకు కట్టాల్సిన అవసరం లేదని విద్యుత్ అధికారులు అంటున్నారు. ఇది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వీటిపై తరుచూ కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తున్నా తమకు వర్తించదని బ్యాంకర్లు దర్జాగా ఉన్నారు. -
రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందెవరు..?
కార్వేటినగరం: చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. ఆయన ఆదివారం పుత్తూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబునాయుడు ముందుగానే తమ సామాజిక వర్గానికి, టీడీపీ నాయకులకు తెలియజేశారని తెలిపారు. తమ వర్గానికి చెందిన వారు కావాల్సినన్ని భూములను కొనుగోలు చేసిన తర్వాత అసెంబ్లీలో అమరావతి రాజధాని అని ప్రకటించారని విమర్శించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూ లం కాదని శివరామకృష్ణ కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. విజయవాడ కొండపైన అమ్మవారు.. కొండకింద కమ్మవారు అని ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని అన్ని వర్గాలకు చెందినదిగా ఉండాలని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉండాలనుకోవడం దారుణమన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై స్టే తెచ్చిన ఘనత బాబుది జగనన్న ప్రభుత్వంలో అర్హులైన పేదవారికి 3 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే దానిపై కోర్టులో స్టే తెచ్చిన ఘనత చంద్రబాబునాయుడిదన్నారు. రాజధానికి 2 వేల ఎకరాల భూముల అవసరం ఉండగా అనేక వేల ఎకరాలను సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ఏర్పాటుకు దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులతో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ కారిడార్ ఏర్పాటు చేస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని వివరించారని తెలిపారు. రూ.20 వేల కోట్లతో రాజధానిని సులభంగా నిర్మించవచ్చని తెలిపారు. దాన్ని గుర్తించకుండా టీడీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని మోదీ తెలియజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అలాగే వాడుకుంటున్నాడని ప్రజలకు అర్థమైందని తెలిపారు. అమరావతిలో రాజధాని భూముల అభివృద్ధి పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా సిద్ధాంతం వైఎస్సార్ సీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్ర మే వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ సిద్ధాంతమన్నారు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మూడు ప్రాంతాలను కలుపుతూ మావిగన్గా ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. -
సమస్యలకు పరిష్కారమేదీ?
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం చప్పగా సాగింది. సమావేశాలకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా జిల్లా అధికారులు రాలేదు. తమ ప్రాంతా ల సమస్యలను సభలో తెలిపి పరిష్కరించుకుందామనుకున్న ప్రజాప్రతినిధులకు మళ్లీ నిరాశే మిగి లింది. సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు పంపించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సీఈవో రవికుమార్నాయుడును ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చి న స్టాకును కూడా రాజకీయ నాయకులు చెప్పిన వారికి ఇస్తున్నారని ఆరోపించారు. వారు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. యూరియా కొరత లేకుండా చూడా లని ఆదేశించారు. వేరుశనగ విత్తనాలను సరైన సమయానికి రైతులకు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. గత ప్రభు త్వం హయాంలో హార్టికల్చర్ ద్వారా మామిడి రైతులకు ఎకరాకు 15 వేల కవర్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు 6 వేల కవర్లే ఎందుకు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా మామిడి గుజ్జు నిల్వలు నిలిచిపోయాయని జ్యూస్ ఫ్యాక్టరీల యజమానులు అంటున్నారని, ఈ ఏడాది కూడా మామి డిని కొనే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయాలని సూచించారు. వితంతు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి తీర్మానం పంపుతామన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు నగదు చెల్లించి రెండేళ్లు అవుతున్నా ఎందుకు మంజూరు చేయడం లేదని ట్రాన్స్కో అధికారులను నిలదీశారు. సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదు పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ శరవణ మాట్లాడుతూ కుప్పంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, అంటుకట్టు మొక్కలు ఇవ్వడం లేదని తెలి పారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ఓపీల సంఖ్య తగ్గిందని, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని దుయ్యబట్టారు. సగంలో అగిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలన్నారు. తిరుపతి రూరల్ ఎంపీపీ మాధవ్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరైనా విడుదల చేయడం లేదని ఆరోపించారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు రూ.19 కోట్లు ఉన్నాయని, వాటిని మంజూరు చేయాలన్నారు. జెడ్పీటీసీ సుమన్ మాట్లాడుతూ నారాయణవనంలో ఉపాధి హామీ నిధులతో శ్మశానవాటికకు రోడ్డు వేయాలని, సగంలో ఆగిపోయిన రోడ్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపాళ్యం ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ, గృహ సర్వీసులకు వేర్వేరుగా ఫీడర్లు ఏర్పాటు చేయా లని తెలిపారు. పీటీఎం జెడ్పీటీసీ శివన్న మాట్లాడుతూ వ్యవసాయ సర్వీసులు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పూతలపట్టు జెడ్పీటీసీ దేవిక మాట్లాడుతూ చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో రెండేళ్లయినా కొత్త వాటిని ఏర్పాటుచేయలేదని తెలిపారు. కార్యక్రమంలో డీఈర్వో మోహన్కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పక్కన డీఆర్వో మోహన్కుమార్, సీఈఓ రవికుమార్నాయుడు, సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు‘‘మా మండలాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. పలు అభివృద్ధి పనులు సగంలోనే ఆగిపోయాయి. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరుకావడం లేదు. యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీల్లో పేదలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ విషయాలను గత జెడ్పీ సమావేశంలో చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమావేశాలు ఎందుకు’’ అని పలువురు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చప్పగా సాగిన జెడ్పీ సమావేశం ప్రోటోకాల్ పాటించరా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఏ అధికారి ప్రోటో కాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్స వానికి సైతం తనను పిలవడం లేదని వాపోయా రు. ఎంపీడీవోలు నిబంధనలు పాటించడం లేదని, వరదయ్యపాళ్యం ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వందలాది ఎకరాలకు పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తారని అధికారులను నిలదీశారు. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులను రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బేరాలు కుదరకపోవడంతో విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించలేదని విమర్శించారు. టెండర్లు పిలవకుండానే రూ.20 లక్షల విలువైన చెరువు పనులను కాంట్రాక్టర్కు అప్పనంగా అప్పగించారని దుయ్యబట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్తో సంబంధం లేకుండా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయిన వారికి జెడ్పీ నిధుల నుంచి పరిహారం ఇవ్వాలన్నారు. -
పాపాలు చాలు తప్పుకో!
వడమాలపేట : అప్పలాయగుంటలో నిరసన తెలుపుతున్న భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా, నేతలుచిత్తూరులో నిరసన ర్యాలీ చేస్తున్న విజయానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులుకుప్పంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ భరత్, నాయకులుతిరుపతిలో నిరసన తెలుపుతున్న భూమన అభినయ్రెడ్డి, మాజీ మేయర్ తదితరులుబీఆర్ నాయుడూ చేసిన పాపాలు ఇక చాలు.. టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకో.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయొద్దు.. ఉన్నతమైన పదవిలో ఉంటూ రాసలీలలు సాగిస్తున్న నీలాంటి అపవిత్రులకు ఆ పదవిలో కొనసాగే హక్కులేదు.. నీవు పదవి చేపట్టిన నాటి నుంచి వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి.. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. అయ్యా.. ఇక తప్పుకో అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనలు చేపట్టారు. పలు ఆలయాలను శుద్ధి చేసి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. ప్లకార్డులను ప్రదర్శించారు. చైర్మన్ పదవికి బీఆర్ అనర్హుడు బీఆర్నాయుడు గలీజు మనిషి. ఆయన టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడు. ఆయన అరాచకాలన్నీ తెలిసే చంద్రబాబు టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆ మహాతల్లి ఏడాదిన్నర కిందటే చంద్రబాబు, పవన్కళ్యాణ్కు ఉత్తరాల ద్వారా బీఆర్నాయుడు నీచుడని, సీ్త్రలోలుడని, పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వద్దని కోరింది. అవేవి పట్టించుకోకుండా ఆయనకే చైర్మన్ పదవి కట్టబెట్టారు. అతను చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో మద్యం, మాసం విక్రయాలు, క్యూలైన్లలో భక్తుల మృతి తదితర దాష్టీకాలు జరిగాయి. వాటికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన వ్యక్తి నిస్సిగ్గుగా ఎదురుదాడి చేయడం దారుణం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు నిస్సిగ్గుగా చైర్మన్ పదవిలో.. రాసలీలలు సాగిస్తూ పట్టుబడినా, ప్రభుత్వం, పచ్చ మీడియా అండ ఉందన్న దీమాతో బీఆర్నాయుడు నిస్సిగ్గుగా చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. టీటీడీ పవిత్రతను కాలరాస్తున్నారు. సనాతన హిందూ ధర్మానికి ప్రతీకై న టీటీడీ చైర్మన్గా బీఆర్నాయుడిని ఇంకా కొనసాగిస్తూ చంద్రబా బు, పవన్కళ్యాణ్ అపచారం చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ పగటి వేషం వేసిన పవన్కళ్యాణ్ ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదు. బీఆర్నాయుడు అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. – ఆర్కే రోజా, మాజీ మంత్రిమీడియాపై ఆంక్షలుచిత్తూరు కార్పొరేషన్: అక్రమ సంబందాలతో కళంకితుడైన బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వారు శనివారం నాయకులు, కార్యర్తలతో కలిసి వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉండడం వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారుతోందని విమర్శించారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీకి ఒక కళంకితుడిని చైర్మన్గా కొనసాగించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనన్నారు. ప్రభుత్వం, పచ్చ మీడియా అండగా ఉందని బీఆర్ నాయుడు అసందర్భ ప్రేలాపనలతో నిస్సిగ్గుగా పదవిని అంటి పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు. గతంలో సనాత న ధర్మ పరిరక్షకులుగా పగటి వేషం వేసిన అవకాశవాదులంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. -
పీఎఫ్ బకాయిలు జమ
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధి (పీఎఫ్)కి సంబంధించి మార్చి నెలాఖరు వరకు ఉన్న బకాయిలు రూ.273 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్టు జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రుణాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి అందజేసే తుది మొత్తాల పూర్తి బకాయిలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ పరిష్కరించినట్లు చెప్పారు. పీఎఫ్కు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో చూసుకోవాలని, ఏవైనా సమ స్యలు ఉంటే కార్యాలయ పనివేళల్లో వచ్చి పరిష్కరించుకోవచ్చునని వివరించారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనం రూ.15.60 లక్షలు చెల్లించామని తెలిపారు. -
మీ సేవలు వెలకట్టలేనివి
కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ తరఫున సర్పంచులుగా గెలిచి ఐదేళ్లు ప్రజాసేవ చేశారని, మీ సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ఆయన శనివారం కుప్పం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ జగనన్న పిలుపుతో ముందుకు వచ్చి సర్పంచులుగా పోటీ చేశారని, కుప్పంలో 90 శాతం మంది సర్పంచులు గెలిచారని పేర్కొన్నారు. ఐదేళ్లు ఏ ఒక్క పొరపాటూ చేయకుండా ప్రజా సేవలో తరించారని కొనియాడారు. ఇదే స్పూర్తితో పనిచేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి కూడా నమ్మకస్తులనే సర్పంచులు గా పోటీలో పెడతామని తెలిపారు. కూట మి ప్రభుత్వం రెండేళ్లుగా చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పటికీ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికారులను అడిగితే టీడీపీ నాయకులను కలవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కోర్టులకు వెళ్లి బిల్లులను మంజూరు చేయించుకుంటామని స్పష్టం చేశారు. -
బావిలో పడి సచివాలయ ఉద్యోగి మృతి
వడమాలపేట (పుత్తూరు): మండలంలోని రామరాజుకండ్రిగ గ్రామంలో శనివారం బావిలోపడి సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి ఇందిరానగర్కు చెందిన సచివాలయ ఉద్యోగి చంద్రకుమార్(37) తన స్నేహితులు లక్ష్మీనారాయణ, అభిషేక్తో కలిసి రామరాజుకండ్రిగ గ్రామానికి వచ్చారు. ముగ్గురూ కలిసి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. అక్కడ చంద్రకుమార్ అదుపుతప్పి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతనితో వచ్చిన ఇద్దరు స్నేహితులు గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు విషయం తెలిపారు. వారు అక్కడికి వెళ్లి చంద్రకుమార్ను వెలికి తీశారు. అతను అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్వోసీ లేకుండానే క్వారీ నిర్వహణ? చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు గ్రామ పరిధిలో క్వారీ పనులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఎన్వోసీ లేకుండానే తవ్వకాలు చేపడుతున్నారని, మైనింగ్ శాఖ నుంచి కోడ్ రాక ముందే పనులు ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు. క్వారీ నిర్వహణలో బినామీల పేర్లతో పట్టాలు కట్టారని, అసలు యజమానులను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రా మస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ వాహనాల రాకపోకలతో ప్రజల భద్రతకు ముప్పు ఉందని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధి కారులకు ఫిర్యా దులు అందినట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్విమ్స్లో పలు పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు తిరుపతి తుడా: స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ఎవాల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ – స్క్రీనింగ్ ప్రోగ్రామ్ – ఆన్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అనే ఎంఆర్సీ ప్రాజెక్టులో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు ఈనెల 15వ, 16వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం, మామోగ్రాఫీ టెక్నీషియన్, కార్డియో వాస్క్యులర్ టెక్నీషియన్ గ్రేడ్–2, డేటా ఎంట్రీ ఆపరేటర్, పబ్లిక్ రిలేషన్న్స్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,445 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,383 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
టీచర్ల గోడు పట్టించుకోని విద్యాశాఖ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వ్యక్తిగత, అనారోగ్య సమస్యల దృష్ట్యా విధులను రద్దు చేయాలని కోరుతూ పలువురు టీచర్లు శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల సాకుతో డీఈవో వారి విన్నపాలను తోసిపుచ్చారు. విధులను రద్దు చేయడం సాధ్యం కాదని, మినహాయింపు కావాలంటే 10 రోజుల మెడికల్ లీవ్ పెట్టుకోవాలని సూచించడంతో టీచర్లు విస్మ యం వ్యక్తం చేశారు. సముచిత కారణాలతో వచ్చే వారికి సెలవు మార్గాన్ని చూపడమే తప్ప, సమస్యను పరిష్కరించే ఉద్దేశం అధికారులకు లేదని ఆరోపిస్తున్నారు. విధులు కేటాయించింది కమిషనర్ కార్యాలయమని, తమకు సంబంధం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొనడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపులు ఇవ్వడంలో విద్యాశాఖ మీనమేషాలు లెక్కించడం మొండివైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు. పది రోజులు జరిగే మూల్యాంకన ప్రక్రియలో టీచర్లపై ఒత్తిడి పెంచడం కాకుండా, వారి సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరుతున్నారు. -
పల్లెపోరుకు వెనకడుగు
కాణిపాకం: హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ సర్కారు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి పసులు, పథకాల అమల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఘోర పరాభవం తప్పదని భావించి, ప్రత్యేక అధికారుల పాలనను తెరపైకి తెచ్చింది. ఈనెల 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం మొగ్గుచూపింది. శుక్రవారం ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలకు అధికారుల నియామకం పూర్తయ్యింది. ప్రత్యేకాధికారులు సోమవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 44 పంచాయతీలు, పూతలపట్టు నియోజకవర్గంలో 152 పంచాయతీలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో 90 శాతానికి పైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచులు, వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఐదేళ్ల పాటు పాలనలో శభాష్ అనిపించుకున్నారు. వీరి పదవీకాలం ముగియడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల జరిగే వరకూ పంచాయతీల పాలనా వ్యవహారాలు వీరు చూడనున్నారు. కలెక్టర్ నేతృత్వంలోనే పాలన సాగనుంది. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయ, ఇతరశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కష్టాలు తప్పవా? పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రజలకు అందాల్సిన వివిధ సేవలు, అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలంటే వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. దీనికితోడు ఒక్కో అధికారికి రెండు నుంచి అధిక పంచాయతీలు అప్పగించారు. దీంతో వారిపై మరింత అదనపు భారం పడనుంది. ఈ పరిణామం ఇబ్బందిగా మారనుంది. గ్రామ పంచాయతీల్లో సమస్యలు ఎదురైతే ఇబ్బందులు తలెత్తనున్నాయి. అధికారులు వేరే ప్రాంతాల్లో ఉంటారు. వారిని సంప్రదించాలంటే ప్రజలకు వ్యవప్రయాసలు తప్పవు. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే అవకాశం తక్కువ కావడం వల్ల ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై వెనక్కి.. పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అనేక పథకాలను పక్కన పెట్టేశారు. ఇసుక, మద్యం ద్వారా జేబులు నింపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతప్తి సెగలు రేగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పరాభవం తప్పవనే భావనతో వెనక్కి తగ్గుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.నిధులు.. తప్పనితిప్పలు పంచాయతీ పాలక వర్గాలు లేకుంటే పలు నిధులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టకపోతే, కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు రావు. ప్రస్తుతం స్థానిక నంస్థలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లడంతో ఆర్థిక సంఘం నిధులు విడుదలకు ఇబ్బంది వస్తుందని అంటున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో ఇవి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మేజర్ పంచాయతీలు సాధారణ నిధులపై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాంటి ఆదాయవనరులు లేని చిన్న పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తప్పవని సర్వత్రా ఆందోళన నెలకొంది. -
మై సైన్స్ గ్యారేజ్ ప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం) ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్లో శనివారం మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే పిల్లల్లో సైన్స్పై మక్కువ, జిజ్ఞాసను పెంపొందించేందుకు 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అనువుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ తెలిపారు. పిల్లల్లో సహజంగా నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుందని, వారి ఆలోచనలను ఆచరణాత్మకం చేయించడమే గ్యారేజీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా సృజనాత్మకత పెంపొందించడం, స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా గ్యారేజ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ను నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్ను సైన్స్ సెంటర్ అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో విభిన్న కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన త్రీ వే స్లైడర్ను చిన్నారులతో ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయ పీఆర్వో కార్యాలయంలో రగడ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం చోటుచేసుకున్న ఘటన కల కలం రేపింది. ఆలయంలో దళారులేరని ప్రజాప్రతినిధులు చెబుతున్న నేపథ్యంలో, పీఆర్వో కార్యాలయంలోనే ఓ రాజకీయ దళారిపై దాడి జరగడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. చరణ్ అనే యువకుడు తన తల్లితో కలిసి శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన సందర్భంగా, శివ అనే అనధికారిక వ్యక్తి భక్తులకు మార్గనిర్దేశం చేస్తూ అటువైపు వెళ్లండి అంటూ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తాను స్థానికుడిని అంటూ చరణ్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన చరణ్పై, శివా తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆవేదనకు గురైన చరణ్, తన తల్లి సమక్షంలోనే జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆలయానికి తిరిగి వెళ్లాడు. అక్కడ పీఆర్వో కార్యాలయంలో శివా కనిపించడంతో, చరణ్ అతనిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఆలయ ఈఓ బీకే వెంకటేశులు సెలవులో ఉన్నారు. చైర్మన్ ఈ విషయమై వివరణ కోరడానికి ప్రయత్నించగా తాను బయట ఉన్నానని మల్ల ఫోన్ చేస్తానంటూ దాటవేశారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని 14 ఏళ్లు దాటిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని డీఎం అండ్ హెచ్వో శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్యకార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నెలా 1వ తేదీన హెచ్ఎంఐఎస్, సీఎస్ఎస్ఎం తదితర రిపోర్టులను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సీఎస్ఎస్ఎంలో ఈసీ డేటాను సోమవారం నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ప్రజల సానుకూల అభిప్రాయం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్) 80 శాతం కంటే తక్కువ ఉండకూడదని, ప్రతి ఇండికేటర్కు సంబంధించిన రికార్డులు నిర్వహిస్తూ 100 శాతం డేటా అప్లోడ్ చేయాలని సూచించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం నాటికి పూర్తి చేయాలని, సోమవారం రోజున ఆశా వర్కర్లు ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకువచ్చి టీకాలు వేయించేలా చూడాలన్నా రు. యువిన్ పోర్టల్లో గర్భిణులు, శిశువుల నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయా లని పేర్కొన్నారు. అలాగే ఐఈసీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అభా ఐడీ లేకుండా గర్భిణుల వివరాలను నమోదు చేయరాదని హెచ్చరించారు. ఎన్సీడీ కార్యక్రమాల్లో అనుమానిత కేసులను గుర్తించి, వైద్యాధికారులు నిర్ధారించి పాలో అప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ, అనిల్ కుమా ర్, జార్జ్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సభ్యులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ నాయకు లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, కర్షకు లు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు. రేపటి నుంచి సమ్మేటివ్ –2 పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమా న్య పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని తరగతులకు ఎస్ఈఆర్టీ ఇచ్చిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభు త్వం పంపిణీ చేసిన అసెస్మెంట్ పుస్త కాల్లో మాత్రమే జవాబులు రాయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 1 నుంచి 5 తరగతులకు క్లస్టర్ కేంద్రం నుంచి, 6 నుంచి 8వ తరగతుల కు ఎమ్మార్సీ నుంచి గంట ముందుగా ప్రశ్నాపత్రాలు అందజేస్తారు. పరీక్షల అనంతరం టీచ ర్లు జవాబు పత్రాలు/అసెస్మెంట్ బుక్లెట్స్ మూల్యాంకనం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ లోపు మార్కులు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వ్యక్తిగత, ఏకీకృత మార్కుల రిజిస్టర్లో నమో దు చేస్తారు. ఈ నెల 22వ తేదీలోపు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. పతనమైన టమాట ధరలు వి.కోట: టమాట ధరలు అమాంతంగా పతనమయ్యాయి. వి.కోట మార్కెట్లో శనివారం టమాటా 18 కిలోల బాక్సు రూ.50ల నుంచి అత్యధికంగా రూ.150 పలికింది. ధరలు తగ్గడంతో కాయలను కోసి మార్కెట్కు తరలించేందుకు అయ్యే ఖర్చులు కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కొంతమంది కాయలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు కోసిన టమాటాలను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడికి చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. అధ్యాపకుడికి ఎన్సీసీ భారత సైన్యం లెిఫ్టినెంట్ పదవి గుడిపాల: మండలంలోని సీఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న హేమంత్కుమార్ ఎన్సీసీ అధికారి శిక్షణా అకాడమీ(ఓటీఏ) కాంప్టీ నాగ్పూర్లో ప్రతిష్టాత్మక సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్ పదవిని అందుకున్నారు. ఈ శిక్షణలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక ప్రణాళిక, దేశభక్తి స్పూర్తి కనబరిచారు. ఆయనను కళాశాల యాజమాన్యం అభినందించింది. -
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి
-
గ్యాస్ మంటలు!
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడిపాల ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన గ్యాస్ దోపిడీ ఘటనతో అసలు వ్యవహారం బయటపడగా, ఇప్పుడు జిల్లాలోని మరిన్ని గ్యాస్ ఏజెన్సీలపై కూడా అదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ విధానాన్ని పక్కనబెట్టి సిలిండర్లను అక్రమంగా సరఫరా చేస్తున్న ఈ వ్యాపారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. సాధారణంగా గృహవినియోగ గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఓటీపీ విధానం తప్పనిసరి. వినియోగదారుడికి మొబైల్ ఫోన్న్కు వచ్చే ఓటీపీని చూపిన తరువాతే సిలిండర్ ఇవ్వాలి. అయితే ఈ నియమాన్ని పక్కన పెట్టి కొంతమంది ఏజెన్సీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత నెలలోనే వేల సంఖ్యలో ఓటీపీలు లేకుండా సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సుమారుగా 40 వేలకు పైగా సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22 ఏజెన్సీలుంటే.. అందులో కొన్ని ఏజెన్సీలు వేలల్లో బ్లాక్లో సిలిండర్లు పెట్టినట్టు తెలుస్తోంది. గుడిపాల ఘటనతో.. గుడిపాల ఘటన బయటపడిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ఏజెన్సీలపై తనిఖీలు ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీపీ లేకుండా సరఫరా చేసిన సిలిండర్ల జాబితాను బయటకు తీయడంలో అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని ఏజెన్సీల్లో కూడా? కొన్ని గ్యాస్ ఏజెన్సీలు పౌరసరఫరాల శాఖ అధికారులతో కుమ్మకై ్క ఈ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగానికి సరైన సమాచారం అందించకుండా తప్పుడు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణను ఉద్దేశపూర్వకంగా నెమ్మదింపజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అధికార పార్టీ మద్దతు, ధనబలంతో అధికారుల తనిఖీలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సమాచారం. దీంతో నిజాలను వెలికితీయడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఈ గ్యాస్ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాను కుదిపేస్తున్న ఓటీపీ అక్రమాలు -
ఇరువర్గాల ఘర్షణ
నగరి: స్థానిక జామి యా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల వారు ఘర్ష ణ పడ్డారు. మసీదు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు విడివిడిగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మరో వర్గంపై ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ మల్లికార్జున తెలిపిన కథనం మేరకు.. గతంలో మసీదులో చందాల వసూళ్ల విషయంలో గోడవలు రాగా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. అనంతరం ఒక వర్గం వారు వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొని కమిటీని ఏర్పాటుచేసుకున్నారు. దీనిపై మరో వర్గం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్కో ఇచ్చింది. ఈ దశలో కమిటీ ఏర్పాటు చేసుకున్న వారు చందాల వసూలుకు ప్రయత్నించగా మరో వర్గం స్టేటస్కో ఇస్తే ఇంకా కమిటీ నిర్ధారణ కానట్లే అని చందాలు వసూలు చేయకూడదంటూ అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వారు గొడవపడ్డారు. చందాలు వసూలు చేయడమే గొడవకు కారణమైందని సీఐ తెలిపారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బైండోవర్ నమోదు చేస్తామన్నారు. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్రెడ్డిని కోరారు. ఆ సంఘ నాయకులు నెల్లూరులోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిసి వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీ.రెడ్డిశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీచర్ల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు, తక్షణమే తాత్కాలిక భృతిని ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 2003 డీఎస్సీలో నియామకమైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బలోపేతం చేసి, అక్కడ ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను వెంటనే భర్తీ చేయించాలన్నారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీచర్ల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జైకాంత్, గౌరవ అధ్యక్షులు సోమచంద్రారెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు. -
ఆదుకోరేం!
కష్టాల్లో ఉన్నాం..పుట్టెడు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాం. యుద్ధం పేరుతో ధరల సెగ చెమటలు పట్టిస్తోంది. గ్యాస్ కష్టాలతో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఉచిత వైద్యం అటకెక్కింది. రోజురోజుకీ పెరుగుతున్న ఎండలతో నీటి సమస్య తరుముకొస్తోంది. నిబంధనల మేరకు బిల్లులు కట్టినా కొత్త కరెంట్ కనెక్షన్ అందని ద్రాక్షగానే మారుతోంది. కోటి ఆశలతో వేరుశనగ వేసినా గిట్టుబాటు ధర అంతంతమాత్రంగానే దక్కుతోంది. గత ప్రభుత్వంలో పలు భవనాలు నిర్మించినా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని గాలికొదిలేశారు. టీడీ బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టీపటనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ జెడ్పీ సమావేశంలోనైనా మా కష్టాలపై చర్చిస్తారో లేదోనని ఎదురుచూస్తున్నాంశ్రీ అని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు. నేడు జరిగే సమావేశంలో సమస్యల పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు.. అధికారులు అడుగులు వేయాలని కోరుతున్నారు. రైతన్నల కష్టాలు జిల్లాలో వేరుశనగ పంట 9వేల హెక్టార్లలో నష్టం జరగగా వాటికి అంచనా విలువ రూ.15.42 కోట్లు వేశారు. దీని కోసం 24,342 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 14వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. దీన్ని భర్తీ చేయాలని రైతులు కోరుకుంటున్నారు. పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉంది. పశుగ్రాసం కొరత త్రీవంగా ఉంది. పశువులకు తాగునీరు అందక అల్లాడుతున్నాయి. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బకాయిల కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఆశించిన విధంగా సాగడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు సైతం తమకెందుకులే అన్న ధోరణితో వ్యవహరించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనైనా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగిన ఆరోగ్యశ్రీ జిల్లాలో ఆరోగ్యశ్రీ కష్టతరంగా మారింది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో రూ.200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వైద్యం చేయలేం బాబోయ్ అంటూ ఆయా ఆస్పత్రులు చేతులెత్తేశాయి. టీడీ బకాయిలు రూ.10 కోట్లు జిల్లాలో గత రెండేళ్లుగా మున్సిపాలిటీలో పంచాయతీలు మండలాలకు చెల్లించాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ పెండింగ్ రూ.10 కోట్లకు పైగా ఉంది. రెండేళ్లుగా జమ కాకపోవడంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. అధ్వాన్నం జెడ్పీ కార్యాలయ పరిధిలో అవసరం లేకున్నా రూ.కోట్లలో పలు పనులను నామినేట్ పద్ధతిలో కూటమి నేతకు కట్టబెట్టారు. ఇందులో చాలా పనులు అధ్వాన్నంగా.. నాసిరకంగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జెడ్పీ కార్యాలయ భవనాలకు వేసిన పెయింటింగ్ పెచ్చులూడిపోయింది. సమావేశ మందిరంలో టాయ్లెట్స్ నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. కరెంటు కష్టాలు తీరేనా? జిల్లాలో 2 వేలకు పైగా పైకం చెల్లించిన వ్యవసాయ సర్వీసులు అలానే పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్ల కోనుగోలుకు అధిక మొత్తం చెల్లించి కాంట్రాక్టర్కు దోచిపెడుతున్నారని టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అదే కాంట్రాక్టర్కు అదే మొత్తంతోనే అదనంగా ట్రాన్స్ఫార్మర్లు కోనుగోలు చేయిస్తున్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లాలో 200 మందికి పైగా ఉన్నారు. వీరికి ఒక నెల వేతనం కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకొని మరుసటి నెల నుంచి చెల్లిస్తున్నారు. ీపీఎం కుసుం కింద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు ముందుకు సాగడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర ఫలకాల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గ్యాస్తో యుద్ధం యుద్ధం కారణంగా జిల్లాలో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ లేకుండానే ఏజెన్సీలు అమ్మకాలు జోరుగా సాగిస్తున్నాయి. ఓ వైపు గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, టీస్టాల్స్ మూతపడుతున్నాయి. కొన్ని దుకాణాలు అమాంతంగా ధరలు పెంచేశాయి. భోజనం చేయాలంటే సామాన్యుడు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి ఎద్దడి జిల్లాలో వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య రోజురోజుకూ త్రీవ రూపం దాల్చుతోంది. జిల్లాకు ప్రతిపాదించిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించ లేదు. హంద్రీ–నీవా, గాలేరు –నగరి ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జెడ్పీ కార్యాలయం ఆ భవనాలపైనే కక్ష గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు 1,381 భవనాలను మంజూరు చేసింది. ఇందులో సచివాలయానికి రూ.40 లక్షలు, ఆర్బీకేలకు రూ.21.80 లక్షలు, వెల్నెస్ సెంటర్కు రూ.20.80 లక్షలు చొప్పున మంజూరు చేశారు. జిల్లాలో సచివాలయాలు 335, ఆర్బీకేలు 340, వెల్నెస్ సెంటర్లు 159 చొప్పున మొత్తం 834 భవనాలు నిర్మించారు. వీటి కోసం రూ.241 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా పలు దశల్లో, ప్రారంభం కాని భవనాలు మొత్తం 547 వరకు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.152 కోట్లు. వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోలేదు. రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్ గత ఏడాది కాలంగా జిల్లాలో పంచాయతీరాజ్ పరిధిలో దాదాపు 90 కి.మీ వరకు సీసీ, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. ఇందుకు సంబంధించి రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో .ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సవాలక్ష సమస్యలు -
అధైర్యపడొద్దు..అండగా ఉంటాం!
కుప్పం: శ్రీకూటమి పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం..ఎవ్వరూ అధైర్యపడకండి.. అందరికీ అండగా ఉంటాం.. మరో మూడేళ్లు నిజాయితీతో కలసికట్టుగా పనిచేద్దాంశ్రీ అని కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ పిలుపునిచ్చారు. శ్రుకవారం తన క్యాంపు కార్యాలయంలో రామకుప్పం, శాంతిపురం బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పార్టీకి బూత్ కన్వీనర్లే కీలకమన్నారు. అందరూ కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. నిజాయితీతో పనిచేసేవారికి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సొంత ప్రయెజనాల కోసం పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారు మళ్లీ వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారిని పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు. దొంగలు, మోసపూరిత రాజకీయాలు చేసేవారు వంద మంది అవసరం లేదని, నిజాయితీతో పనిచేసేవారు ప్రతి పోలింగ్ బూత్కు ఐదుగురు ఉన్నా చాలన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణమని, కానీ నమ్మక ద్రోహం చేసేవారిని మాత్రం వైఎస్సార్సీపీ దరిదాపుల్లోకి రానివ్వమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిజమైన కార్యకర్తులు, జగనన్న అభిమానులు వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారని, అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలింగ్ బూత్ల్లో ఓటర్ల పర్యవేక్షణలో బూత్ కన్వీనర్లు జాగ్రత్తుగా ఉండాలని, అనుమానం వచ్చిన ఓటర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో రామకుప్పం, శాంతిపురం మండలాల నాయకులు బాబురెడ్డి, కోదండపాణి, నాయనపల్లి కృష్ణమూర్తి, సుబ్రమణి, మురుగేష్, చంద్రారెడ్డి, బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు విజయ్ కుమార్, రామకుప్పం సుగుణప్ప, గుడుపల్లె సంపంగి తదితరులు పాల్గొన్నారు. -
మూగ వేదన!
నోరులేని మూగ జీవాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతోంది. వాటికి అవసరమైన మందులు పంపిణీ చేయకుండా వేధిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో కనీసం మందులు, మాత్రలు కూడా లేకుండా చేసింది. జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తే పెంపకందారులు ప్రయివేటు మందుల దుకాణ దారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో మందులు అందక కొన్ని మృత్యువాత పడుతుండడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో పశుసంవర్థక శాఖ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాల్సిన రైతు భరోసా కేంద్రా లు మందుల లేమితో నిర్వీర్యంగా మారా యి. పశువులు వ్యాధులతో అల్లాడుతుండ గా, పశుపోషకులు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు. కనీస ఔషధాలు కూడా అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలోని పలు మండలాల్లో పశువులు జ్వరం, ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన మందులు లేక ప్రైవేట్ మెడికల్ దుకాణాల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, నొప్పి తగ్గించే ఇంజెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే యాంటీబయోటిక్స్, కమి నివారణ మందులు వంటి ప్రాథమిక ఔషధాలు దాదాపు అందుబాటులో లేవు. పశుప్రాణాలకు ముప్పు పశువులకు గాయాలు కావడం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణం. వాటికి సరైన చికిత్స అందకపోవడం ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది. గాయాలను శుభ్రపరచడానికి అవసరమైన ద్రావణాలు, డ్రెస్సింగ్కు ఉపయోగించే ఆయింట్మెంట్లు, స్ప్రేలు కేంద్రాల్లో లేవు. చిన్న గాయాలు కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నాయి. పరికరాలు ఏవీ? మందుల కొరతతో పాటు ప్రాథమిక పరికరాల లేమి కూడా పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. పశువుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడానికి థర్మామీటర్లు, ఇంజెక్షన్లు ఇవ్వడానికి సిరింజ్లు, చికిత్స సమయంలో అవసరమైన గ్లవ్స్, గాజ్ వంటి సామగ్రి కూడా అనేక కేంద్రాల్లో అందుబాటులో లేవు. దీంతో ఫీల్డ్ స్థాయిలో పశు వైద్య సేవలు దాదాపు నిలిచిపోయినట్లే. పాల ఉత్పత్తిపై దెబ్బ ఇక పాల ఉత్పత్తిపై కూడా ఈ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోంది. కాల్షియం, మినరల్ మిశ్రమాలు, విటమిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో పశువులు బలహీనంగా మారి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. జిల్లా పాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కొనసాగితే రైతుల ఆదాయంపై భారీ దెబ్బ పడే అవకాశముంది. వ్యాధులు అధికం పశువుల్లో కడుపులో పురుగుల సమస్యలు పెరుగుతున్నాయి. దీనివల్ల పశువులు ఆహారం తినకపోవడం, బరువు తగ్గడం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. జీర్ణ సమస్యలు, గ్యాస్, డయేరియా కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ వీటికి అవసరమైన టానిక్స్, ప్రోబయోటిక్స్, ఫ్లూయిడ్స్ అందుబాటులో లేవు. జిల్లా సమాచారం రైతు భరోసా కేంద్రాలు 297 ఆవులు, గేదెల సంఖ్య 4.68 గొర్రెలు 5,01,947 మేకలు 2,08,149 పందులు 386సంక్షోభంలో పశువైద్యం పట్టించుకోరా? మందుల కొరతపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పశువులే మా జీవనాధారంం అవి అనారోగ్యానికి గురైతే మేమెలా బతుకుతాం?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని అంటున్నారు. వెంటనే చర్యలు తీసుకుని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన పశువైద్య మందులు, పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని పశుపోషకులు కోరుతున్నారు. -
సౌరఫలకాల ఏర్పాటుపై సమీక్ష
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ నివాసాలకు ఉచితంగా సౌరఫలకాల ఏర్పాటుపై ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆరా తీశారు. శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ సర్వీసులు 85,974 ఉన్నాయని, అందులో ఇంటి పైకప్పు సౌలభ్యం లేని వారు.. ఇతర సమస్యలతో ఉన్న వారు వేలాది మంది ఉన్నారన్నారు. మొదటి దశలో 21,500 నివాసాలకు సౌరఫలకాల ఏర్పాటుకు టెండర్లు ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను నిలదీశారు. ప్రతి సర్వీసుకు 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనులు వేగవంతం కావాలన్నారు. సంబంధిత మెటీరియల్స్ తిరుపతిలోని గోడౌన్లో పెట్టారని, వాటిని చిత్తూరుకు తరలించాలన్నారు. ఈఈలు మునిచంద్ర, సురేష్, మోహనమ్మ, పీఓ రెడ్డెప్ప, డీఈలు ప్రసాద్, శేషాద్రి, కొండయ్య పాల్గొన్నారు. -
కొత్త రైల్వే లైను!
పుత్తూరు: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైల్వేలైను ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పుత్తూరు, తమిళనాడులోని అత్తిపట్టు మధ్య రైల్వేలైను ఏర్పాటుకు కేంద్రం రూ.517.47 కోట్లు మంజూరు చేయడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అత్తిపట్టు–పుత్తూరు మధ్య 88.30 కి.మీ మేర రైల్వేలైను రూట్ మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రూట్లో మొత్తం 8 స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో నాలుగు స్టేషన్లు ఏపీలో ఉండగా, మరో నాలుగు తమిళనాడులో ఉంటాయి. తిరుపతి జిల్లాలోని పుత్తూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే లైను నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం స్టేషన్లు ప్రతిపాదించారు. పుత్తూరు నుంచి నారాయణవనం రైల్వే స్టేషన్కు మూడు కి.మీ దూరం ఉండగా, అక్కడ నుంచి కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం స్టేషన్ల మధ్య దూరం 10 కి.మీగా ఉంటుంది. అలాగే తమిళనాడులోని ఊత్తుకోట, పాలవాక్కం, పెరియపాళెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పుత్తూరు–అత్తిపట్టు రైల్వే మార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు బోగీలతో నాలుగు ఈఎంయూలు నాలుగు ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ రైల్వే లైను ఏర్పాటు పూర్తయితే తిరువళ్లూరు, పుత్తూరు రూట్లో రద్దీ తగ్గుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. 2024 నుంచే భూసేకరణ పుత్తూరు–అత్తిపట్టు మధ్య కొత్త రైల్వే లైను కోసం 2024 డిసెంబర్ 6 నుంచే భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతించింది. 88 కి.మీ దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములును సేకరించాల్సందిగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పుత్తూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డెడ్ఎండ్ లూప్లైన్ పుత్తూరు రైల్వే స్టేషన్


