Chittoor District News
-
పడిపోయిన ధరలు
పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్కు గతంలో సగటున నాలుగు టన్నుల పట్టుగూళ్లు వచ్చేవి. అయితే వేసవి కారణంగా పంటలు సరిగ్గా రాక దిగుబడి తగ్గినా సమ్మర్లో సైతం సగటున రెండు టన్నుల గూళ్లు వచ్చేవి. కానీ ఈ నెలలో రోజువారీ వస్తున్న గూళ్లు సగటున కేవలం 1,600 నుంచి 2,200 కిలోలుగానే ఉంది. గతంలో ఇదే మార్కెట్లో కిలో గూళ్ల ధర రూ.900 దాకా పలికింది. కానీ క్రమేణా తగ్గుతూ సోమ, మంగళవారాల్లో స్థానిక మార్కెట్లో గరిష్ట ధర రూ.625, కనిష్ట ధర రూ.380, సగటు ధర రూ.534గా ఉంది. ఈ ధరతో తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ నాయకుడి అరాచకం
సాక్షి, టాస్క్పోర్సు: కార్వేటినగరం మండలం, అమ్మపల్లి పంచాయతీ, పొన్నగల్లు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఓ టీడీపీ నాయకుడు కూల్చివేశాడు. సదరు నాయకుడు కాంట్రాక్టర్ అవ తారమెత్తి రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం ఆ పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకావం ఉంది. కానీ మరమ్మతు పనుల పేరుతో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా పాఠశాల భవనాన్ని కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరేవేరు ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆ నాయకుడి ఆగడాలు శ్రుతిమించడం పరిపాటిగా మారాయి. 2024–25 మధ్య కాలంలో కూడా ఇదే రీతిలో అరచాకాలు సాగించినట్టు స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో పంచాయతీ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం అవసరం లేకున్నా నిర్మాణానికి పూనుకున్నట్టు పేర్కొంటున్నారు. అక్కడ అడ్డుగా ఉన్న చింత చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికి సొమ్ము చేసుకున్నట్టు వెల్లడిస్తున్నారు. అలాగే చెరువుల్లో సొంతంగా చేపల పెంపకానికి కొంత వరకు ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పొన్నుగల్లు ప్రాథమిక పాఠశాల కూల్చివేత ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు పొన్నగల్లు ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు గురైంది. కానీ దాని పునర్నిర్మాణానికి రూ.6.8 లక్షలు ఎంపీ నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టాం. జిల్లా అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – విజయకుమార్, మండల విద్యాశాఖ అధికారి, కార్వేటినగరం -
మామిడి రైతులకు భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతు లు నష్టపోకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ భరోసా ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో మామిడి సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై పరిశ్రమల నిర్వాహకు లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మామిడి రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది మామిడి గుజ్జు పరిస్థితి గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. గత ఏడాదిలో నిల్వ ఉన్న మామిడి గుజ్జు ఇప్పటికే 80 శాతానికి పైగా విక్రయించడం శుభపరిణామమని చెప్పా రు. పాత నిల్వల సమస్య లేదని, కొత్త సీజన్ మామిడిని కొనుగోలు చేసేందుకు పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సకాలంలో ప్రాసెసింగ్ సమావేశంలో పరిశ్రమల నిర్వాహకులు సాను కూలంగా స్పందించారని కలెక్టర్ తెలిపారు. మామిడి ప్రాసెసింగ్ను నిర్ణీత సమయానికే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తమ వంతు సహకారం అందిస్తామని పరిశ్రమల నిర్వాహకులు వెల్లడించారన్నారు. పండ్ల నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఏడాది 6.5 కోట్ల మామిడి కవర్లను రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉద్యానవన శాఖ అధికారులు, పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు. 63 సమస్యల గుర్తింపు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో పరిధిలోని 40 సెక్షన్లలో విద్యుత్ అధికారులు కరెంటోళ్ల జనబాట నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 28, సర్వీసు లైన్ పరంగా ఒక సమస్య.. మొత్తం 63 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అందులో మూ డు సమస్యలను పరిష్కరించినట్టు వెల్లడించారు. నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్కు మంగళవారం బెంగళూరుకు చెందిన ప్రశాంత్ అనే దాత రూ.లక్ష నగదును విరాళంగా అందజేశారు. దాతకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
దొంగ అరెస్టు
● ఎవరూ లేని ఇళ్లే అతని టార్గెట్..! ● రాత్రుల్లో చోరీకి పాల్పడే దొంగ అరెస్టు చేసిన తిరుచానూరు పోలీసులు ● రూ.8లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలను వెల్లడించిన సీఐ సునీల్ కుమార్ చంద్రగిరి: తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సునీల్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి జీవకోన, నవజీవన కాలనీలో ఉంటున్న వరదరాజుల మణి జల్సాలకు అలవాటు పడి ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీన మంగళం తుడా క్వార్టర్స్లోని ప్లాట్ నంబర్ 51లో కాపురమున్న వెంకటేష్ బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన వరదరాజుల మణి 29వ తేదీన పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి బీరులోని ఉంచి 57 గ్రాముల బంగారు ఆభరణాలు, 512 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల కదలికల గురించి విచారణ చేపట్టడంతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళం సమీపంలోని ఆశ కల్యాణ మండపం సమీపంలో వరదరాజుల మణిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించడంతో సుమారు 3 ఇళ్లలో చోరికి పాల్పడినట్లుగా తేలింది. గత ఏడాది నవంబర్లో జైలు నుంచి బెయిల్పై వచ్చిన మణి తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అలిపిరి, తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో 3 ఇళ్లలో చోరీలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై తిరుచానూరు, అలిపిరి, సీసీఎస్, తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్లలో 19 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామన్నారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్లు, క్రైం సిబ్బంది ప్రభాకర్, ప్రసాద్, షఫీలను ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు. -
నీట్పై నిప్పులు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్షకు 1,060 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,020 మంది మే 3న జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రవేశ పరీక్ష పత్రం లీకేజీ కావడంపై క్షేత్ర స్థాయిలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యను అభ్యసించాలని కలలుగన్న విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. లీకేజీ మాఫియా పంజా వైద్యుడు కావాలనే లక్ష్యంతో రెండేళ్ల పాటు కోచింగ్ సెంటర్లలో గడిపారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని లక్షల రూపాయల ఫీజుల రూపంలో కోచింగ్ సెంటర్లకు చెల్లించారు. తీరా పరీక్ష పూర్తయ్యాక పేపర్ లీక్ అయ్యిందని.. పరీక్షను రద్దు చేశారు. తాము చదివింది పరీక్ష రాయడానికా, అక్రమాలకు బలి కావడానికా అని విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమిలిపోతున్న తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు అవుతారని ఆశపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. అప్పు చేసి చదివించిన చదువు లీకేజీల పుణ్యమా అని బూడిదలో పోసిన పన్నీరు కావడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. నైతిక బాధ్యత ఎవరిది? లక్షలాది మంది విద్యార్థులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించి, వ్యయప్రయాసాలకోర్చి పరీక్ష రాస్తే.. దాన్ని రద్దు చేయడం అంటే వారి ఆశలపై నీళ్లు చల్లడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒత్తిడిలో విద్యార్థులు నీట్ రద్దు నిర్ణయం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాలంటే ఆ పాత ఉత్సాహం, ఏకాగ్రత కుదరదని విద్యార్థులు వాపోతున్నారు. కేంద్ర విద్యాశాఖ, ఏజెన్సీ చేసిన తప్పిదానికి తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు (ఫైల్)ఎన్టీఏ తీరుపై విమర్శలు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లీకేజీ ఏజెన్సీగా మారిందా..? అంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తున్నాయి. అక్రమార్కుల లాభం కోసం మెరిట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నీట్ ప్రవేశ పరీక్ష రద్దుపై జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు రగిలిపోతున్నారు. రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి.. కష్టాన్ని ఆయుధంగా మలచిన తమకు నిరాశే ఎదురైందని కుమిలిపోతున్నారు. అక్రమార్కుల లీకేజీతో ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఏ తీరునూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కూడా దుయ్యబడుతున్నారు. విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిన నీట్ -
విద్యార్థుల జీవితాలతో ఆటలా?
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి చిత్తూరు కలెక్టరేట్ : నీట్ నిర్వహణలో విఫలమైన కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తూ నీట్ పరీక్షా పత్రాలను లీక్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. మే 4న జరిగిన నీట్ ప్రవేశ పరీక్షకు దేశ వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. రెండేళ్ల పాటు కష్టపడి చదివి, డాక్టర్లు కావాలన్న ఆశతో పరీక్ష రాసిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలపై లీకేజీ ఉదంతం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. వ్యాపారంగా మారిన పరీక్షలు గత ఏడాది కూడా ఇలాగే హర్యానా, బీహార్ రాష్ట్రా ల్లో నీట్ పేపర్ను రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముకున్న ఉదంతాలు చోటు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ ఏడా ది కూడా అదే తరహాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వరుసగా రెండేళ్లపాటు పేపర్లు లీక్ కావడం ఈ ఏజెన్సీ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఎన్ టీఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
వర్గపోరులో మునగంగ! కుప్పం గంగ జాతర నిర్వహణలో వర్గ విభేదాలు
● ఆలయ చైర్మన్, పాలకవర్గం మధ్య కుదరని సఖ్యత ● కొనసాగుతున్న బలవంతపు వసూళ్లు కుప్పం: పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. ప్రస్తుత పాలకవర్గ సభ్యులు, అధికా పార్టీ నేతలు, చైర్మన్ మధ్య సమన్వయం కుదరక రెండు వర్గాలుగా విడిపోయాయి. దీనికి తోడు పూజార్ల బృందం మరో వర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో దేవాలయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయింది. పారని పొదుపు మంత్రం గత ఏడాది అమ్మవారి దేవాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి దేవాలయానికి కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి కోసం ఇద్దరు ప్రయివేట్ వ్యక్తల దుకాణాలు కోనుగోలు చేసి దారి ఏర్పాటు చేశారు. దీనికి ఇంకా రూ.23 లక్షలు దాకా చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ స్థలం పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని కూడా చైర్మన్ ఆలయం కోసం కొనుగోలు చేశాడు. వీరందరికీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. దీనికి చైర్మన్ పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు. జాతర సింపుల్గా చేసి మిగిలిన డబ్బును ఆ స్థలాలకు చెల్లించాలని కోరారు. దీనికి అధికార పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతర సింపుల్గా చేసేది లేదని తేల్చేశారు. దీనికితోడు పాలకవర్గ సభ్యులు, చైర్మన్ మధ్య సమన్వయం కుదరడం లేదు. కమిటీ సభ్యులు పేరుకే గానీ తమకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని చైర్మన్, ఆయన కుటుంబ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా వసూళ్లు జాతర నిర్వహణకు అధికార పార్టీ పట్టణంలో బలవంతపు వసూళ్లకు పాల్పడు తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణం చుట్టూ ఉన్న వివిధ ఫ్యాక్టరీల వద్దకెళ్లి ఒక్కో ఫ్యాక్టరీ నుంచి రూ.50 వేలు రాసి చందా రసీదు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పలు వ్యాపార వేత్తల నుంచీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారి జాతరకు భక్తిశ్రద్ధలతో విరాళాలు సేకరించాలి గానీ..ఇలా బలవంతపు వసూళ్లు తగదని స్థానికులు పేర్కొంటున్నారు. -
15నుంచి ఎస్వీయూ కళాశాలలకు సెలవులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు ఈనెల 15 నుంచి జూన్ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్డీ కోర్సుల చదువుతున్న విద్యార్థులకు జూన్ 29వ తేదీన యథాతధంగా తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రశాంతంగా ఈఏపీసెట్ తిరుపతి సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, అన్నమయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, పుత్తూరు శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్కు జరిగిన తొలిరోజు పరీక్షకు 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్లో 616 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 592 మంది పరీక్ష రాశారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 1,331 మందికి గాను 1,287 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రెండో రోజు బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల్లో మరో 1,450 మంది వరకు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు. -
భరోసా ఏది?
పిల్లలను చాలా కష్టపడి చదివిస్తున్నాం. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు వల్ల విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ము ఖ్యంగా అమ్మాయిలు పదేపదే బయటకు పంపించి పరీక్షలు రాయించాలంటే భయంగా ఉంటుంది. కేంద్రం విద్యార్థుల భద్రత కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన దుస్థితి వస్తుంది. ఈరోజు పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేస్తే, లక్షలు కట్టి చదివించిన తల్లిదండ్రుల అప్పులు ఎవరు తీరుస్తారు? ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలి. – రమాదేవి, విద్యార్థి తల్లి -
ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి ఐసర్ సందర్శన
ఏర్పేడు: ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి వినీల్కృష్ణ మంగళవారం తిరుపతి ఐసర్ను సందర్శించారు. ఆయనకు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతాను భట్టాచార్య, ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ జ్ఞాపిక అందజేసి, ఘనంగా సత్కరించారు. ఆయన పర్యటన సందర్భంగా ఐసర్ విద్యాసంస్థల్లో క్రీడలు, యువత సాధికారత, సంపూర్ణ అభివృద్ధి ప్రాముఖ్యతపై చర్చించారు. విద్యార్థుల్లో విద్య, పరిశోధన, ఫిట్నెస్, క్రీడా సంస్కృతిలో శ్రేష్టతను ప్రోత్సహించాలనే ఉమ్మడి దృక్పథాన్ని ఆయన పర్యటన ప్రతిబింబించిందని స్పష్టం చేశారు. -
వాళ్లకే సీట్లా?
రెండేళ్ల పాటు నేను సెల్ ఫోన్ చూడలే దు. స్నేహితులతో బయటకు వెళ్లలే దు. రోజుకు 14 గంటలు పుస్తకాలతోనే గడిపాను. పరీక్ష బాగా రాశాను. కచ్చితంగా సీటు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా ను. కానీ పేపర్ లీకేజీ వార్త వినగానే నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపో యింది. లక్షలు పోసి పేపర్లు కొన్నవాళ్లకి ర్యాంకులు వస్తుంటే, మాలాంటి మధ్యతరగతి విద్యార్థుల కష్టానికి విలువే లేదా? మళ్లీ పరీక్ష రాయాలన్నా ఆ పాత ఉత్సా హం రావడం లేదు. – వివేక్, నీట్ విద్యార్థి, చిత్తూరు -
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
బంగారుపాళెం: హత్యాయత్నం కేసుకు సంబంధించి మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన కిరణ్ కు, అదే గ్రామానికి చెందిన నాగేంద్రపై అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కిరణ్ అతని బావమరిది దామోదరంతో కలసి నాగేంద్రపై చాకుతో కడుపు, భుజంపై పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించి కిరణ్, దామోదరంను సీఐ పర్యవేక్షణలో ఎస్ఐ, సిబ్బంది బలిజపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. ఆపై ముద్దాయిలను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. నూతన వసతులతో ఆదర్శ పాఠశాల నిర్మాణం రొంపిచెర్ల: రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల తరగతి గదులను నూతన వసతులతో నిర్మించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మంగళవారం ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12వ తేదీనాటికి విద్యార్థులకు సౌకర్యంగా మొదటి అంతస్తు తరగతి గదులను పూర్తి చేయాలన్నారు. తరగతి గదుల కొరత వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని ఎంఈవో శ్రీనివాసులును ఆదేశించారు. ప్రిన్పిపల్ రెడ్డిప్రదీప్, తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంఈవో శ్రీనివాసులు, డీఈ సాయి, ఏఈ వేణుగోపాల్, కాంట్రాక్టర్ బహ్మనందరెడ్డి పాల్గొన్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి పలమనేరు: పలమనేరు–కుప్పం రహదారిలోని కొలమాసనపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలం, ధర్మపురి అగ్రహారానికి చెందిన మణి(32) మృతి చెందాడు. స్వగ్రామం నుంచి బైక్పై పలమనేరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కారు కొలమాసనపల్లి వద్ద అతన్ని ఢీకొందని స్థానికులు తెలిపారు. కాగా మృతునికి వివాహమై, మూడేళ్ల కుమార్తె ఉండగా ప్రస్తుతం ఇతని భార్య గర్భవతి. గత కొన్నాళ్లుగా పలమనేరు నుంచి బైరెడ్డిపల్లి మార్గంలో ఐదుగురు ఇలాంటి ప్రమాదాలతో నే మృతి చెందారు. బాగున్న తారు రోడ్డుపై కాంట్రాక్టర్ల లాభం కోసం ప్యాచ్వర్క్ చేయడంతోనే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిచారు. కేసు విచారణలో ఉంది. గోడ దూకి గోవా వెళ్లాడు! చంద్రగిరి: పరీక్షలు సరిగ్గా రాయలేదనే కారణంగా భయపడి ఎవరికీ చెప్పకుండా గోడ దూకి పారిపోయిన విద్యార్థి ఆచూకీని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గోవాలోని వాస్కోలో బాలుడిని పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గీతం జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువున్న జస్వంత్ రెడ్డి మార్చి 12వ తేదీన ఎవరికీ చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయమై తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల గాలింపు, సాంకేతిక ఆధారాలతో జస్వంత్ రెడ్డి గోవాలోని వాస్కో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం మంగళవారం వాస్కోకు చేరుకుని, అక్కడి పోలీసుల సహకారంతో బాలుడిని సురిక్షతంగా అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా ఇంటర్ ఫైనల్ పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాలుడిని పోలీసులు తిరుచానూరుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
వైభవంగా!
గంగరంగ చిత్తూరులో గంగజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నడివీధితో పాటు పలు ప్రాంతాల్లో గంగమ్మను కొలువుదీర్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని నడివీధిలో కొలువుదీరిన గంగమ్మ తల్లికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొందరు వినూత్న వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా, మరికొందరు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి తదితర ప్రాంతాల్లో గంగమ్మ జాతర ఉత్సాహంగా సాగింది. విద్యుద్దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంగమ్మను దర్శించుకున్న ఎస్పీ చిత్తూరు నడివీధిలో కొలువుదీరిన గంగమ్మ తల్లిని ఎస్పీ తుషార్డూడీ దర్శించుకున్నారు. వారికి జాతర నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి పసుపు, కుంకుమ అందించారు. ముందుగా జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, నిఘా తదితర విషయాలను జాతర మండపం వద్ద ఎస్పీ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తిశ్రద్ధలతో చిత్తూరు గంగ జాతర నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చిత్తూరులో రెండో రోజు గంగమ్మ తల్లి నిమజ్జనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నడివీధి గంగమ్మ నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
అమ్మో..దొంగ!
వేసవిలో దొంగల హల్చల్ జాగ్రత్తలు పాటిద్దాం పలమనేరు: వేసవిలో ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఊర్లకు వెళుతున్నారు. ఇదే అదునుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఆపై తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఆపై అదును చూసి తాళాలు పగులగొట్టి చోరీలకు తెగబడుతున్నారు. ఎక్కడికై నా బయటళి వెళ్లేవారు సంబంధిత స్టేషన్ పరిధిలో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం రాకుండా.. పాత ఇనుము కొంటామని, స్టౌలు రిపేరు చేస్తామని, మంచాలు రెడీ చేస్తామంటూ రకరకాల వ్యాపారాల పేరిట కొందరు వీధుల్లో పగటిపూట సంచరిస్తారు. రెండుమూడు రోజులు తాళం ఉన్న ఇళ్లను పక్కాగా స్కెచ్ వేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. కొందరు మహిళలు పగటిపూట యాచిస్తూ కూడా ఏయే ఇళ్లకు తాళాలున్నాయో చూసుకెళ్లి మగవారికి చెప్పడం.. ఆపై రాత్రుల్లో చోరీలు జరగడం సర్వసాధారణమైపోతోంది. ఇటీవల జరిగిన చోరీలు.. పట్టణ సమీపంలోని సాయినగర్ వద్ద ఓ ఉద్యోగి తన కుటుంబంతోపాటు కాకినాడకు వెళ్లాడు. ఇంటికి లాక్ ఉందని ముందుగా తెలుసుకున్న దొంగలు అర్ధరాత్రి పూట ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారు. ఈ చోరీలో పెద్ద మొత్తమే పోయినట్టు తెలిసింది. ఆపై సీసీ కెమరాల్లో సైతం ముసుగు కప్పుకున్న దొంగల పుటేజీ కనిపించింది. తాజాగా మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలోనూ డోర్లాక్ చేసిన ఇంట్లో చోరీ జరిగింది. పక్కపక్కనే మూడు ఇళ్ల వారు ఊర్లకు వెళ్లారు. ఆ మూడు ఇళ్ల లాక్లు ముందుగా పసిగట్టిన దొంగలు ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా వీధికుక్కల గుంపు అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. -
అవగాహన కల్పిస్తున్నాం
వేసవిలో జరిగే చోరీలపై ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. ఎల్హెచ్ఎంఎస్(లాక్డ్ హౌస్ మాని టరింగ్ సిస్టమ్) అమలులో ఉంది. దీన్ని స్మార్ట్ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో అడిగిన వివరాలివ్వాలి. ఆపై ఎప్పుడు ఊరెళుతున్నారు, ఎన్నా ళ్లు రారు తగిన వివరాలను అందులో ఎంట్రీ చేయాలి. పోలీసులు ఆ ఇంటి వద్ద సీసీకెమరా అమర్చి దాన్ని పోలీసు మానిటిరింగ్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తారు. చోరీ చేసిన వాళ్లను పట్టుకునే అవకాశం ఉంటుంది. – డేగల ప్రభాకర్, డీఎస్పీ, పలమనేరు -
సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రం
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వ హించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీదారులు క్యూ కట్టారు. ఆలకించి దయచూపండయ్యా అంటూ పలువురు తమ గోడును కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్లకు విన్నవించుకున్నారు. అందిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని కలె క్టర్, జేసీ పలు శాఖల అధికారులను ఆదేశించారు. అవినీతిపై మహిళల ధ్వజం పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, గుండుగల్లు గ్రామానికి చెందిన అనిత, ప్రేమ, పుష్పవతి తదితర మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలోని 45 మహిళా ఎస్హెచ్జీ సంఘాలకు గత ఏడాదిగా శాశ్వత సంఘమిత్ర లేరని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న సంఘమిత్ర అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నివేదిక ఇవ్వాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. -
నవోదయలో విశ్వం ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: జాతీయ స్థాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదల చేసిన 11వ తరగతి ప్రవేశ పరీక్షలో విశ్వం విద్యార్థులు శ్రావ్య, రిచిత, ప్రవీణ్, గగన్ హర్ష, గణేశ్, హర్ష, హర్షిత, తనుష, కావ్య, అస్మా, లిఖిత, వరుణ్ సందేశ్, చరితార్థ, ప్రీతం, తేజస్వి, శ్రీదేవి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను తిరుపతిలోని తమ విద్యాసంస్థలో సోమవారం విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, సాయిగణేష్ స్కూల్ కరస్పాండెంట్ చెంచురెడ్డి అభినందించారు. అలాగే 6వ, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో కే. గీతిక, సి.కార్తీక్, శ్రీహాన్రెడ్డి, పి.నిశాంత్, సి.హేమతేజ, హెచ్ అనన్య, ఎం.భావదీష్, ఆర్.నికోలస్ ఫ్రాంక్లిన్, కే.సిద్ధార్థ, బి.సాయి అభిరామ్, బి.హనీశ్రీ, ఎస్.ఎం.ఇలియాస్, కే. సాయికృష్ణ, లిఖిత, జోషిక తదితరులతో పాటు మొత్తం 56 మంది విశ్వం విద్యార్థులు నవోదయ విద్యాలయాలకు ఎంపికై నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తెలిపారు. గత 36 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్ స్కూల్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ పోటీ పరీక్షలకు విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నవోదయ, సైనిక్, ఇతర రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల శిక్షణ వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
సరెండర్
చిత్తూరు కార్పొరేషన్: మార్కెట్ వాల్యూ ఆడిట్ (ఎంవీఅండ్ఏ) రిజిస్ట్రార్ కార్యాలయంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ను రాష్ట్ర ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. చిత్తూరులోని రిజిస్ట్రేషన్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్, మార్కెట్ వాల్యూ ఆడిట్ రిజిస్ట్రార్ కార్యాలయం, డీఐజీ కార్యాలయాలున్నాయి. అక్కడ సదరు సీనియర్ అసిస్టెంట్ ఒకే కేంద్రంలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణలో వాస్తవమని తేలడంతో ఎంవీఅండ్ఏ జిల్లా రిజిస్ట్రార్.. సదరు సీనియర్ అసిస్టెంట్ కార్యాలయానికి సరెండర్ చేశారు. గణనాథుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్రాయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఓం శక్తి ఆలయంలో చోరీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం 5.వెంకటాపురం గ్రామంలోని ఓం శక్తి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి తాళిబొ ట్టు, హుండీని అపహరించుకెళ్లారు. సోమవా రం ఉదయం ఆలయ తాళాలు పగులగొట్టిన విషయాన్ని గ్రామస్తులు గమనించి.. పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఓం శక్తి ఆలయంలో జరిగిన చోరీపై ఆరా తీశారు. టీచర్లకు ఈఎల్స్ తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : సెలవుల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఈఎల్స్ మంజూరు చేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విధులు, ఇతర విద్యాకార్యక్రమాల్లో పాల్గొంటున్న టీచర్లకు సంపాదిత సెలవులు (ఈఎల్)లు తప్పనిసరిగా మంజూరు చేయాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించే టీచర్లు, హెచ్ఎంలు, అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనే వారందరికీ తగిన ప్రయోజనాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలన్నారు. సోలార్ పనులు వేగం పెంచాలి చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ పనులు వేగం పెంచాలని ట్రాన్స్కో సీఎండీ శివశంకర్ ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్ఈ, ఈఈలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 19 వేల సర్వీసుల ఏర్పాటును ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఇప్పటి వరకు 1,100 ప్యానల్స్ బిగించారన్నారు. రోజూ 150 ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్బాబు, ఈఈ మునిచంద్ర, సురేష్ పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదు బంగారుపాళెం: ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వివాహేతర సంబంధం కలిగివున్నాడనే నెపంతో మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన సంపత్ కుమారుడు కిషోర్, అతని బావమర్థి, అదే గ్రామానికి చెందిన నాగేంద్రబాబుపై ఆదివారం రాత్రి కత్తితో దాడి చేశారు. ఈదాడిలో నాగేంద్రబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నాగేంద్రబాబును చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు కిషోర్, దామోదరంపై హత్యయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సంస్థలో కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, మూడో పార్టీ విధానాన్ని రద్దు చేయాలని ఏఈసీఈఎ జీ–3045 సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం వద్ద సోమవారం సోషల్మీడియా ఉద్యమం నిరసనలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర నాయకులు రూప్కుమార్, హేమకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఉద్యమం ప్రారంభమైందన్నారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారాలోకేష్కు తమ సమస్యలను పంపించామని చెప్పారు. రెండు దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు నిరంజన్కుమార్, జిల్లా అధ్యక్షులు మనిష్కుమార్, డివిజన్ కార్యదర్శులు బాలాజీ, రవి, చిరంజీవి, మధుసూదన్, వినయ్కుమార్, పాండు, రవీంద్రబాబు, గిరిబాబు పాల్గొన్నారు. -
టెక్స్టైల్స్ కార్మికులకు అన్యాయం
నగిరి మండలం పార్కిన్స్ టెక్స్టైల్స్ మాజీ కార్మికులు తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2006లో మూతబడిన కంపెనీ సెటిల్మెంట్ విషయంలో 272 మంది కార్మికులకు మొండిచేయి చూపిందన్నారు. 272 మంది కార్మికులకు కంపెనీ సెటిల్మెంట్ చేసిందన్నారు. మిగిలిన 26 మంది కార్మికులను ఇబ్బంది పెడుతోందన్నారు. కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో సర్వే నెంబర్ 242/1లో 1.98 ఎకరాలు ఫ్యాక్టరీ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. కోర్టులో కేసు ఉండగానే జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. -
భూగర్భ నీటి మట్టం పెంపే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి చెరువుకూ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో భూగర్భ నీటి మట్టాన్ని పెంచడమే లక్ష్యంగా జలధార నీటి భద్రతలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,106 చెరువులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మండలం పరిధిలో ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాటికి నీటిని అందించే ఫీడర్ కాలువ లు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ అయ్యాయా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆందోళన కలిగిస్తున్న భూగర్భ జలాలు గత ఆరు నెలల్లో జిల్లాలో భూగర్భ జలాలు సుమారు 6 మీటర్ల మేర తగ్గిపోవడం పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార, జలహారతి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఫీడర్ కాలువల పున రుద్ధరణ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికుల ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. శ్రామికు లు పని చేయలేని క్లిష్ట ప్రాంతాల్లో ప్రత్యేక టీఆర్–27 నిధులతో యంత్రాల సహాయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దపంజాణి, పల మనేరు, వి.కోట, బైరెడ్డిపల్లి, గంగవరం మండలా ల్లోని చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు, గ్రౌండ్ వాటర్ డీడీ గోవర్దన్ పాల్గొన్నారు. ప్రతి చెరువుకూ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి -
పోలీసు గ్రీవెన్స్కు 39 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 39 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. -
నిలకడ లేని టమాట!
పలమనేరు: టమాట ధరలు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో అర్థంగాని పరిస్థితి ఏర్పడింది. ఈ వేసవిలోనైనా ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఇక్కడి రైతులు ఆశించారు. ఆ మేరకు పలమనేఏరు టమాట మార్కెట్లో వారం క్రితం బాక్సు (14 కిలోలు) రూ.500కు చేరింది. మళ్లీ రోజు రోజుకూ ధర తగ్గుతూ వచ్చి సోమవారం నాటికి బాక్సు ధర టాప్ రేట్ రూ.200 కాగా సగటు ధర రూ.150 పడిపోయింది. పంట కోసం పెట్టిన ఖర్చు సైతం రైతులకు దక్కేలా లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ఎగుమతులు బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా తమిళనాడు వ్యాపారులు ఇక్కడి మార్కెట్కు వస్తేనే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, వెస్ట్బెంగాళ్ రాష్ట్రాల్లోనూ సరుకు ఉన్నట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ తగ్గడం, ఆయా రాష్ట్రాల్లోనే కావాల్సినంత సరుకు అందుబాటులో ఉంది. మరోవైపు లోకల్ సరుకు ఎక్కువగా మార్కెట్కు చేరుతోంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది. గత వేసవిలో టమాటాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్కు ఎక్కువగా ఎగుమతులు జరిగేవి. ఈదఫా తగ్గినట్టు తెలుస్తోంది. టమాట సాగు వివరాలు వేసవిలో టమాట సాధారణ సాగు 4 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 3వేల హెక్టార్లు పలమనేరు మార్కెట్కు వస్తున్న లోకల్ సరుకు రోజుకి ఎనిమిది లోడ్లు -
పింఛన్కు ఎన్నేళ్లు?
పింఛనో రామచంద్రా! ఇతను చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండ లం, ఎంకేపేటకు చెందిన శంకర్. కంటిచూపు లేదు. ఏ పనీ చేయలేడు. సదరం పరీక్షల్లో డాక్టర్లే స్వయంగా 100 శాతం వికలత్వం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఏం లాభం ?.. గత రెండేళ్లుగా కొత్త పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా ఫలితం లేదు. దివ్యాంగుల వేదన కొత్త పింఛన్ల కోసం దివ్యాంగుల బాధలు అన్నీఇన్నీకావు. శారీరక వైకల్యం వల్ల కదల్లేని స్థితిలో ఉన్న వారు సైతం అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక అధికారి దగ్గరకు వెళ్తే మరొకరి దగ్గరకు సాగనంపడమే తప్ప, ఏ ఒక్కరూ బాధ్యతగా దరఖాస్తులను పరిష్కరించకపోవడం వారిపాలిట శాపంగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. తాజాగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని మరో డ్రామాకు తెరలేపింది. అర్హులకు సామాజిక భద్రత కల్పిస్తామని గొప్పలు చెబుతున్నా, కొత్త దరఖాస్తుల స్వీకరణకు సచివాలయాల్లో ఇప్పటికీ ఆప్షన్లు ఇవ్వకపోవడం అభాగ్యుల పాలిట శాపంగా మారింది. కొత్త పింఛన్ల డ్రామా పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లపై సరికొత్త డ్రామాలకు తెరలేపుతోంది. పింఛన్ల కోసం అర్హులు కళ్లు కాయలు కాచేలా ఎదు రు చూస్తున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తోంది. వేలాది మంది అర్జీలు అందజేస్తున్నా వాటిని బుట్టదాఖలు చేస్తూ అభాగ్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా.. వృద్ధాప్యం మీద పడి, కళ్లు సరిగ్గా కనిపించక, చేతులు వణుకుతున్నా.. ఏదో ఒక రోజు పింఛన్ రాకపోతుందా అనే ఆశతో జిల్లాలో వేల మంది వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక దానిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బడ్జెట్ సాకులు, సాంకేతిక కారణాలు చూపిస్తూ వాయిదాల పర్వాన్ని నడుపుతున్నారు. జూన్ 12 నుంచి అంట! చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాజాగా మరో కొత్త డ్రామాకు తెరలేపింది. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ బుకాయిస్తోంది. దీనిపై దివ్యాంగులు రగిలిపోతున్నారు. నాడు పండుగలా పింఛన్ల పంపిణీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేవారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన తర్వాత అర్హులైన వారు పింఛన్లకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఏటా జనవరి, జూలై నెలల్లో ప్రత్యేకంగా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసేవారు. వలంటీర్ లబ్ధిదారుల ముంగిటకే పింఛన్లను చేరవేసేవారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలు కుప్పం 1,215 పలమనేరు 989 నగరి 864 చిత్తూరు 1,245 గంగాధరనెల్లూరు 948 పూతలపట్టు 1,142 -
జనగణనపై అపోహలొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియలో ప్రజలు పారదర్శకంగా సమాచారం అందించాలన్నారు. ఇళ్ల గణన ఈనెల 30 వరకు సాగుతుందన్నారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంటుందన్నారు. జాతరకు అంతరాయం లేని విద్యుత్ చిత్తూరు కార్పొరేషన్: గంగమ్మ జాతర సందర్భంగా డివిజన్ పరిధిలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. లైన్ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూని యర్ లైన్మెన్లు కలిపి మొత్తం 30 మంది సిబ్బంది అమ్మవారిని ప్రతిష్టించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు 24 గంటల పాటు రెండు రోజులు అందుబాటులో ఉంటారన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకుంటామని పేర్కొన్నారు. బడి బస్సుల తనిఖీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని విద్యాసంస్థల బస్సులపై సోమవారం జిల్లా రవాణాశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న 928 పాఠశాలలు, కాలేజీ బస్సుల్లో ఇప్పటివరకు 520 బస్సులను మోటారు వాహన పరిశీలకులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 98 బస్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీటీసీ నిరంజన్రెడ్డి తెలిపారు. తనిఖీల సందర్భంగా విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విద్యాసంస్థల యజమాన్యాలకు సూచించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు చెల్లుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్ వంటి భద్రతా పరికరాలు ఉండాలన్నారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెనన్స్, బ్యాడ్జి కలిగి ఉండాలని చెప్పారు. డయల్ యువర్ ఎస్ఈకి ఆరు సమస్యలు చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో పలమనేరులోని గంటావూరు, వినాయకనగర్ ప్రాంతాల్లో ఓల్టేజీ సమస్య ఉందని వినియోగదారుడు భూపతినాయుడు, వెంకటరావ్ ఫిర్యాదు చేశారు. అలాగే గంగవరం మండం, కీల్లపట్ల పంచాయతీలో అనధికారికంగా సర్వీసును లైన్మన్ ఇచ్చారని సుబ్రమణ్యం తెలిపారు. దొంగతనం జరిగిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరొకటి ఇవ్వడం లేదని విజయపురం నుంచి శ్రీరాములరాజు తెలిపారు. దెబ్బతిన్న కరెంటు స్తంభాన్ని మార్పు చేయాలని కొత్తపల్లెమిట్టకు చెందిన స్వర్ణలత ఫిర్యాదు చేయగా, బంగారుపాళ్యంలో అనధికారికంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టారని వాటి పై చర్యలు తీసుకోవాలని ప్రభాకర్రెడ్డి తెలిపారు. వెకేషన్ కోర్టు షెడ్యూల్ విడుదల తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకోవడానికి ఏర్పాటైన వెకేషన్ కోర్టు ఏ ఏ ప్రాంతా ల్లో, ఏ ఏ తేదీల్లో విధులు నిర్వహిస్తుందన్న షెడ్యూలను వెకేషన్ కోర్టు జడ్జి, మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ సూర్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేశారు. ఈనెల 13, 20 తేదీల్లో చిత్తూరులోనూ, ఈనెల 14, 25వ తేదీల్లో తిరుపతిలో, ఈనెల 12, 15, 19, 21, 26 తేదీలు మదనపల్లిలోను, ఈనెల 18వ తేదీ పీలేరులోనూ, ఈనెల 22వ తేదీ శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జడ్జి సూర్యనారాయణ మూర్తి వెకేషన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. -
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చలపతిరావు
కార్వేటినగరం: ఏపీటీఎఫ్ చిత్తూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆ సంఘ రాష్ట్ర ఎన్ని కల పరిశీలకులు ఎస్కే బాబు వేణుగోపాల్ తెలి పారు. చిత్తూరు మున్సిపల్ హైస్కూల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర అదనపు కార్యదర్శి చెంగల్రాయమందడి ఆధ్వర్వంలో ఎన్నికలు నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడి గా చలపతిరావు, కార్యదర్శిగా గిరి, గౌరవ అధ్యక్షులుగా కిరణ్, అసోసియేట్ అధ్యక్షులుగా ద్వారకనాథ్రెడ్డి, ఉపాధ్యాక్షుడుగా రుద్రమూర్తి, గోవర్దన్శెట్టి, సురేంద్ర, కృష్ణమూర్తి, కార్యదర్శులుగా లక్ష్మీపతి, దినకరన్, లత, సురేష్, వరదరాజు, రెడ్డివాణి, యుగంధి ఎన్నికై నట్టు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు తెలిపారు. గతంలో పనిచేసిన జిల్లా నాయకులు కిరణ్, చిట్టిబాబు సేవలను పలువురు వక్తలు కొనియాడారు. సీనియర్ నాయకులు గుర్రప్ప, మునికృష్ణయ్య, రాజేంద్రనాయుడు, త్యాగ రాజునాయుడు, పురుషోత్తం, శ్రీనివాసులు, బాబు, గుర్రప్ప పాల్గొన్నారు. చిత్తూరు జాతరకు పటిష్ట బందోబస్తు చిత్తూరు అర్బన్: చిత్తూరులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గంగజాతరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. సోమవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. నగరంలో దాదాపు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులతో మాట్లాడి అన్ని వసతులు పరిశీలించామన్నారు. వివాదాలకు తావులేకుండా పండుగను సవ్యంగా జరుపుకోవడానికి అందరూ సహకరించాలని కోరారు. వీఆర్కు కుప్పం సీఐ చిత్తూరు అర్బన్: కుప్పం టౌన్ సీఐ శంకరయ్యను వీఆర్ (వేకెంట్ రిజర్వు)కు తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జ్గా రూరల్ సీఐ మల్లేష్యాదవ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా శంకరయ్యపై స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఆక్రమణదారులు
నగరి : వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు వినియోగిస్తున్న గ్రావెల్ రోడ్డును ఆక్రమిస్తున్నారంటూ స్థానిక రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని కాకవేడు మిట్టిండ్లు నుంచి ఒంటిండ్లుకు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మిట్టిండ్లుకు చెందిన టీడీపీ నేతలు వాసునాయుడు, భాస్కర్ జేసీబీతో రోడ్డును చెక్కించి మట్టిని తమ భూముల్లో కలుపుకుంటున్నారని ఆరోపించారు. రైతులు, గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ మాజీ వైస్చైర్మన్వెంకటరత్నం రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిట్టిండ్లు–ఒంటిండ్ల మధ్యనున్న ఈ గ్రావెల్ రహదారి ద్వారా స్థానిక రైతులు తమ వ్యవసాయ భూములకు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో మామిడి తోటలు అధికంగా ఉండడంతో ట్రాక్టర్లు, కాయలు తరలించే లారీలు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నాయని వివరించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న మామిడి తోటల యజమానులైన టీడీపీ నేతలు రహదారిని ఆక్రమించుకోవడమే కాకుండా, కొండనీరు పారే కాలువకు సంబంధించిన నీటి పైపులను కూడా ముందుకు జరిపి మరింత స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం’ అంటూ సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని స్థానిక రైతులు, వైఎస్సార్సీపీ నేతలు అధికారులకు సూచించారు. -
నారాయణ పాఠశాలను సీజ్ చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని మురుగానపల్లి వద్ద అనుమతులు లేని నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీ ణ్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు సోమ వారం డీవైఈవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మురుగానపల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తు న్న నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాదిగా అనుమతులు లేకుండా నారాయణ పాఠశాల నడుస్తున్నా విద్యాశాఖ అధి కారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వసతులు లేవు.. ఫీజులు మాత్రం వేలల్లో! జిల్లా కేంద్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. కనీసం ప్లే గ్రౌండ్, సరైన క్లాస్ రూమ్స్ ఇతర మౌలిక వసతులు లేకపోయినా అనుమతులు ఎలా ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులను ఏఐఎస్ఎఫ్ నాయకులు నిలదీశారు. విద్యార్థులను మోసం చేస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మురుగానపల్లి నారాయణ పాఠశాలతో పాటు, నగరంలో అనుమతులు లేని అన్ని కార్పొరేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోజ్, లిఖిత్, లోహిత్ పాల్గొన్నారు. -
మూడు ఎకరాల చెరుకుతోట దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం ● న్యాయం చేయాలని రైతు గురుమూర్తి వేడుకోలు నగరి : మండలంలోని దామరపాకం పంచాయతీ టీవీకండ్రిగ గ్రామంలో ఆదివారం రైతు గురుమూర్తికి చెందిన మూడు ఎకరాల చెరుకుతోట అగ్నికి ఆహుతైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాలిపోవడంతో సుమారు రూ.4.5 లక్షల వరకు నష్టం సంభవించినట్టు రైతు ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకుతోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తోట మొత్తం వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే మూడు ఎకరాల్లోని చెరుకు పూర్తిగా దగ్ధమైంది. రైతు గురుమూర్తి మాట్లాడుతూ అప్పు చేసి చెరుకు పంట సాగు చేశానని తెలిపారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందన్నారు. ఎకరాకు సుమారు 15 టన్నుల చొప్పున మొత్తం 45 టన్నుల చెరుకు కాలిపోయిందని, రూ.4.5 లక్షల వరకు నష్టం సంభవించిందన్నారు. అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఆకతాయిలు బీడీ, సిగరెట్ కాల్చి పడేయడం వల్ల మంటలు వ్యాపించాయా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా అన్న విషయం తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు బియ్యం స్వాధీనం పెనుమూరు(కార్వేటినగరం): తమిళనాడు నుంచి తరలిస్తున్న రూ.2.20 లక్షల విలువ జేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మండల పరిధిలోని మఠంపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. మూడు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయన్నారు. వాటిని ఆపి తనిఖీ చేయగా అందులో రూ.2.20 లక్షల విలువ జేసే 12.25 టన్నుల తమిళనాడు బియ్యం బయట పడ్డాయన్నారు. బియ్యంతో పాటు పట్టుబడిన ఎన్.రామచంద్ర, ఎ.చలపతి, కె.రెడ్డెప్ప, సి.భానుమూర్తి తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పేదల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రం కోలార్లోని రైస్ మిల్లులకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా ఈ అక్రమ రవాణాలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా నిందితులపై జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో అక్రమ బియ్యం రవాణా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులు అక్రమ రవాణాకు వాడిన టాటా హెక్సా కారు, టాటా 407 వాహనం, ఐషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,512 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,988 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా భక్తులకు కేటాయించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలపై ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని వివరించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. విజయ్ అభిమానుల సంబరాలు నగరి: తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీనటుడు, తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయ డంతో నగరిలోని ఆయన అభిమానులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు. సత్రవాడ, కేవీపీఆర్పేట, ఏకాంబరకుప్పం, పుదుపేట ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారాన్ని టీవీలో వీక్షిస్తూ టపాకాయలు పేల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. టీవీకే పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే శేఖర్ మాట్లాడుతూ తమిళనాడులో విజయ్ సర్కార్ ప్రారంభమైందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా విజయ్ ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అభిమానుల ఉత్సాహం నగరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర యువత అధ్యక్షుడు మొహమ్మద్ సఖీ, అభిమాన సంఘం నేతలు సెల్వన్, రాజ, సంజీవి, ఏలుమలై, షణ్ముగం, కార్తి, వేణు, హరోన్, చని, వేను, శరవణ, శేఖర్, ధనరాజ్, హరి, కీర్తి, విజయ్ పాల్గొన్నారు. -
అన్షుమాలికకు అత్యున్నత డిగ్రీ
నగరి: అమెరికాలోని బ్లూమింగ్టన్ ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మాజీ మంత్రి ఆర్కేరోజా కుమార్తె అన్షుమాలికకు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విత్ హైఎస్ట్ డిస్టింక్షన్ పట్టా అందజేసింది. అన్షుమాలిక అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ‘‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డు సీనియర్’’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఘనత సాధించడం, యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఈమె పేరు లిఖించిన బంగారు ఫలకం పొందుపరచడం విధితమే. అక్కడ కంప్యూటర్స్ సైన్స్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ప్రతిభగల వారికి అందించే గ్రాడ్యుయేట్ విత్ హైఎస్ట్ డిస్టింక్షన్ పట్టాను యూనివర్సిటీ ఆమెకు అందజేసింది. దీంతో ఆమె ఘనత మరో అడుగు ముందుకు వేసింది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
మూడు ఎకరాల చెరుకుతోట దగ్ధం
నగరి మండలం టీవీకండ్రిగలో మూడు ఎకరా ల్లో చెరుకుతోట దగ్ధమైంది. రూ.4.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది.ఒక్కసారిగా పడిపోయిన మామిడి ధరలు సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఆశనిరాశల నడుమ మామిడి రైతులు ఊగిసలాడుతున్నారు. ఒక ఏడాది దిగుబడి బాగుంటే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మరో ఏడాది రేటు అధికంగా ఉంటే సక్రమంగా పంట చేతికందక దెబ్బతింటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తోటలు కళకళలాడుతున్నప్పటికీ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు మండీ యజమానుల మాయాజాలమే కారణంగా ఆరోపిస్తున్నారు. సిండికేట్గా మారి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో మార్కెటింగ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దామలచెరువు, తిరుపతి, చిత్తూరు, బంగారుపాళెం, పాకాల, పుత్తూరు చందూర నిలువు దోపిడీపై ఆగ్రహం ఏడాది పాటు మామిడి చెట్లను సంరక్షించుకుంటూ, వివిధ రకాల వాతావరణ సమస్యలను ఎదుర్కొని, చీడపీడలకు రూ.లక్షలు ఖర్చుచేసి పండించిన పంటకు యజమానులైన తాము ధరను నిర్ణయించే స్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ యార్డ్ వ్యాపారులు నిలువునా దోచుకొంటున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్రోశిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లు దండుకుని తమను రోడ్డుపాలు చేస్తున్నారని వాపోతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కనీసం జ్యూస్ ఫ్యాక్టరీలను త్వరగా తెరిపిస్తే నేరుగా సరుకును అమ్ముకొనే అవకాశం కలుగుతుందని కోరతున్నారు. ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ చేస్తున్న కూలీలుపుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు 2.65 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 70శాతం నుంచి 75 శాతం వరకు పంట దిగుబడి రావడంతో రైతులు కొంత ధైర్యంగా కోతలకు ఉపక్రమించారు. అయితే 10 రోజుల వ్యవధిలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్ యార్డుల నుంచి వివిధ రకాల మామిడిని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాజ్, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీంతో మామిడి సీజన్ ప్రారంభంలో ధర ఆశాజనకంగా ఉంటుంది. అందులో భాగంగానే సీజన్ ప్రారంభంలో బేనీషా టన్ను ధర రూ.70 వేలు పలకగా, ప్రస్తుతం రూ.25 వేలకి పడిపోయింది. జిల్లా మొత్తం మీద మామిడి దిగుబడిలో 75 శాతంతో అగ్రభాగాన నిలిచే తోతాపూరి తొలుత టన్ను ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికింది. అయితే ప్రస్తుతం రూ.9 వేలకు తగ్గిపోవడంతో రైతులు నివ్వెరపోతున్నారు. అలాగే చందూర రూ.30 వేల నుంచి రూ.14 వేలకి పడిపోయింది. దీనిపై ప్రశ్నించిన రైతులకు నెల్లూరు, విజయవాడ మార్కెట్లలో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు కుంటి సాకులు చెబుతున్నారు. సాధారణంగా పల్ప్ ఫ్యాక్టరీలు తెరవక ముందు తోతాపూరి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. ఫ్యాక్టరీలు తెరిచాక అన్ని ప్రాంతాల నుంచి సరుకు ఎక్కువగా రావడం వల్ల కాస్త ధర తగ్గడానికి అవకాశముంటుంది. ఓ పక్క ఫ్యాక్టరీలు తెరవక ముందే తోతాపూరితో పాటు అన్ని రకాలకు ధరలను సగానికి సగం తగ్గించేశారు. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కోడెగిత్తల జోరు
బంగారుపాళెం మండలంలోని గుంతూరు దళితవాడలో ఆదివారం పశువుల పరుగు పందేలు హోరెత్తాయి. ఇక్కడికి పరిసర ప్రాంతాల నుంచి యజమానులు తమ పశువులను టెంపోల ద్వారా తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరుగు పందేలు నిర్వహించారు. పరుగులు తీస్తున్న కోడె గిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పలువురు యువకులు స్వల్ప గాయాలయ్యాయి. పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. పశువుల పరుగు పందేలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గుంతూరు దళితవాడ జనసంద్రంగా మారింది. – బంగారుపాళెం -
స్వచ్ఛతలో నిలబడతారా..?
మన ఊరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ్. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 4,432 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్యం మెరుగుపై స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికై న ఉత్తమ మునిసిపాలిటీలకు కేంద్రం నిధులను కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ పోటీల్లో నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు అర్బన్ : జిల్లాలోని ఇతర మునిసిపాలిటీలతో పోలిస్తే పారిశుద్ధ్య నిర్వహణ చిత్తూరు నగరంలో కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది. ఇదే సమయంలో మురికివాడల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు చోద్యంచూస్తున్నారు. నగరాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం)గా అమలు అంతంత మాత్రంగానే ఉంది. పీసీఆర్ కళాశాల, కట్టమంచి చెరువు తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో ఓడీఎఫ్ సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇక నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో రంగులు అద్దడం, మొక్కలు ఏర్పాటు చేయడం, చిన్నపాటి ఉద్యానవనాలు నిర్మిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు. పడిలేస్తూ.. గతేడాది జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశంలో చిత్తూరుకు 273వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. గతం నేర్పిన పాఠాలతో ఈసారి చిత్తూరును ఉత్తమ స్థానంలో నిలిపేందుకు అధికారులు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటి, ఎలా చేస్తున్నారు, నగరం సుందరంగా ఉండాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికితోడు వాణిజ్య భవనాలు, కల్యాణ మండపాలు, కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, ఇతర సూపర్ బజార్ల వద్ద తడి–పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందజేసేలా చైతన్యం కల్గిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్కు ప్రత్యేకాధికారిగా కలెక్టర్ సుమిత్కుమార్ వ్యవహరిస్తుండడంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో సలహాలు ఇస్తూ అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నగరాన్ని టాప్–10లో నిలబెడుతుందని ఆశతో చూస్తున్నారు. వచ్చేనెల ఫలితాలు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు ముగింపుదశలో ఉన్నాయి. అధికారులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలకు ఏ మేరకు చేరువయ్యాయో..? తెలుసుకోవడానికి రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వచ్చేవారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు సైతం నగరంలో పర్యటించి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు.స్వచ్ఛ సర్వేక్షణ్లో చిత్తూరు స్థానం ఇలా.. సంవత్సరం జాతీయ ర్యాంకు 2020–21 81 2021–22 137 2022–23 153 2023–24 143 2024–25 273మా ప్రయత్నం చేస్తున్నాం ఈ పోటీల్లో చిత్తూరును ఉత్తమ స్థానంలో నిలపడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. మొబైల్ టాయ్లెట్లు పెట్టాం. పచ్చటి మొక్కలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నాం. ఎందుకూ పనికిరాని టైర్లు, ఇతర వస్తువులతో కళాఖండాలు, ఆకృతులు తయారుచేసి ప్రజల సందర్శన కోసం పెడుతున్నాం. మాకై తే మెరుగైన స్థానం వస్తుందని ఆశిస్తున్నాం. ఫలితం ఎలా ఉన్నా చిత్తూరును వన్ ఆఫ్ ది బెస్ట్ మునిసిపాలిటీగా చేస్తాం. – పి.నరసింహప్రసాద్, కమిషనర్, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ -
దామిని ఉండగా దిగులెందుకు
చిత్తూరు కలెక్టరేట్: వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కడో ఒకచోట పిడుగులు పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగుపాటు వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలుంటాయి. ఎక్కువగా పశువుల కాపరులు, పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికులు, రైతులు ప్రాణాలు కోల్పోతుంటారు. మూగజీవాలు సైతం మృత్యువాత పడుతుంటాయి. సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిడుగుల ముందస్తు సమాచారం తెలుసుకునే యాప్లపై అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిడుగులు పడే సమాచారాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీయోరాలజీ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘దామిని, వజ్రపాత్’ యాప్లతో తెలుసుకోవచ్చు. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉండే ఆప్షన్లను అనుసరించి ఏ ప్రాంతంలో పిడుగు పడుతోంది, మనం ఎంత వరకు సురక్షితం అనే వివరాలు తెలుసుకోవచ్చు. చాలా మందికి అవగాహన లేక వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో ఉండరాదు. వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్య తల ఉంచి, రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా కూర్చోవాలి. పశు సంపదను సురక్షిత ప్రాంతాల్లో కట్టేయాలి. ఆరు బయట ప్రదేశాలు, రేకుల షెడ్లు, వరండాలో ఉండొద్దు. ఇళ్లలో ఉన్నవారు తలుపులు, కిటికీలు మూసేసి, విద్యుత్తు సరఫరాను ఆపేయాలి. పరిహారం పొందడం ఎలా? పిడుగుపాటుతో మృతి చెందినా, లేదాగా యపడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నష్టపరిహారం అందిస్తున్నాయి. మృతుడి వివరాలు, పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ తదితర వివరాలతో తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. వాటిని అధికారులు విచారించి అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదించి మృతుడి వయసు ఆధారంగా నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తారని రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు. కుప్పం, పలమనేరు పరిసర ప్రాంతాల్లో గతంలో వర్షం కురుస్తున్న సమయంలో పిడుగులు పడి రైతులు మృతిచెందారు. అలాగే నగరి, గంగాధరనెల్లూరు పరిసరాల్లో గుట్టలపై మేత మేస్తున్న గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. ఇంకా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగుపాటుతో పలువురు గాయపడ్డారు. పలు చెట్లు కాలిపోయాయి. ఇలా వర్షాకాలంలో కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట పిడుగులు పడడం సర్వసాధారణం. ఈ క్రమంలో పిడుగు పడే ప్రాంతాల గురించి తెలియజేసే దామిని, వజ్రపాత్ యాప్లను ప్రభుత్వం తీసుకువచ్చింది. వీటిపై అవగాహన కలిగి ఉంటే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
పత్తాలేని పల్లె పాలన
సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వలేదు. దీంతో పల్లె పాలన స్తంభించింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. చెక్ పవర్ లేకపోవడంతో నిధుల విడుదలకు అవకాశం లేకుండా పోతోందని ప్రత్యేక అధికారులు వాపోతున్నారు. దీనికితోడు ఒక్కో అధికారికి 4 నుంచి 5 పంచాయతీలను అప్పగించడంతో విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. – కార్వేటినగరం మండలం చింతతోపు ఎస్టీ కాలనీలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు మోటారు మరమ్మతులకు గురికావడంతోనే సమస్య నెలకొందని స్థానికులు చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ బావులు, బోర్లు, చేతిపంపుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. – తవణంపల్లె మండలంలో పారిశుద్ధ్యం లోపించింది. పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతుండడంతో ముక్కులు మూసుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఆలయాల ముందు వ్యర్థపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, ఆ నీటిలోనే నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేదని వాపోతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో 622 పంచాయతీలు ఉన్నాయి. వాటికి 145 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఒక అధికారికి 4 నుంచి 5 పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గించడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నచిన్న పనులకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో కనీస వసతులు కరువై ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం కూడా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, ఈవోపీఆర్డీ, వ్యవసాయ, హార్టికల్చర్, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఏఈ, డీఈ, వెటర్నరీ అసిస్టెంట్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. చెక్పవర్ లేక అవస్థలు పల్లెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కనుసన్నల్లోనే ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. తాము చెప్పిన పనులనే చేయాలని, సూచించిన సమస్యలను మాత్రమే పరిష్కరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులకు ప్రత్యేక అధికారాలు కేటాయించిన ప్రభుత్వం వారికి పవర్ లేకుండా చేసింది. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు అవుతున్నా నేటికి నిధులు డ్రా చేసేందుకు అధికారం ఇవ్వలేదు. సాంకేతికంగా వీరి ఆధార్, మొబైల్ నంబరు అప్డేషన్ ఉండడంతో వారికి ఇంకా డ్రాయింగ్ పవర్ రాలేదు. దీంతో పరిపాలన, అభివృద్ధి పనులు, ఇతర పాలనా పరమైన నిర్వహణను గాలికొదిలేశారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలి. పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఒక్కొక్క అధికారికి 4 నుంచి 5 పంచాయతీలు కేటాయించారు. దీంతో వీరు సొంత శాఖ బాధ్యతలు చూడడంతో పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చూడాల్సి ఉంది. అదనపు భారం కారణంగా అవన్నీ వారు చూడలేకపోతుండడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రజల గగ్గోలు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, వి.కోట, పులిచెర్లలో తాగునీటి తీవ్రంగా సమస్య ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అవే కాకుండ పారిశుద్ధ్య లోపం, వీధి దీపాల నిర్వహణ, కనీసం బోర్ మోటార్ మరమ్మతులు తదితరాల గురించి పట్టించుకునే నాథుడే లేడు. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి రొటీన్ కార్యక్రమాలే సరిపోతున్నాయి. క్వారేటినగరం ఎస్టీ కాలనీలో చేతిపంపు వద్ద నీటి కోసం తిప్పలు తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు, లోపించిన పారిశుద్ధ్యం -
గంగమ్మ ఆభరణాల ప్రదర్శన
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని గీతామందిరంలో ఆదివారం నడివీధి గంగమ్మ అలంకరణ ఆభరణాలను జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీ.కే.బాబు ప్రదర్శించారు. సీకే బాబు దంపతులు రూ.3.60 లక్షలు విలువ చేసే బంగారు బొట్టు గుండ్లను తయారీ చేయించారు. అలాగే సీఆర్సీ రవి రూ.50 వేలు విలువ చేసే ఫ్యాన్సీ జ్యువెలరీ, చంద్రశేఖర్నాయుడు, సతీష్ రూ.1.20 లక్షలతో మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చీర, ప్రముఖ వ్యాపారవేత్త వేమారెడ్డి కుటుంబ సభ్యులు రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు గుండ్లు బహూకరించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో ప్రజలు ఉత్సహంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు సీకే లావణ్య, వెంకటేష్, గుణ పాల్గొన్నారు. -
వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు
మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి వ్యాపారులతో పాటు అధికారులు కుమ్మక్కు కావడమే ప్రధాన కారణం. ధరలను ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న వ్యాపారులపై మార్కెటింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా తనిఖీలు చేయడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – టి.కేశవులు, అధ్యక్షుడు, మామిడి రైతు సొసైటీ, పుత్తూరు కఠిన చర్యలు తప్పవు జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను నియంత్రిస్తే కఠిన చర్యలు తప్పవు. మార్కెట్ యార్డుల్లోని సెక్రటరీలు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ధరలను నియంత్రించే వ్యాపారులను యార్డు నుంచి తొలగిస్తాం. వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తాం. – టి.సురేంద్రబాబు, ఏడీ, మార్కెటింగ్, తిరుపతి -
బైరెడ్డిపల్లెలో రెండిళ్లలో చోరీ
బైరెడ్డిపల్లె : మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలో శనివారం రాత్రి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ చందన ప్రియ కథనం మేరకు.. బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో అద్దెకు ఉంటున్న కరీంసాబ్ కుమారుడు సాధిక్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం వెళ్లాడు. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.3.20 లక్షల నగదు, 35 గ్రాముల బంగారు, 100 గ్రాముల వరకు వెండి నగలు చోరీ చేశారు. బాధితుడు సాధిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే బీసీ కాలనీలో ఉన్న మణి ఇంట్లో రూ.50 వేల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇంట్లో లేనిప్పుడు పోలీసులకు లేదా సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధురాలి నుంచి గొలుసు అపహరణ బంగారుపాళెం : మండల కేంద్రమైన బంగారుపాళెం ఎన్పీఎస్ కాలనీలో ఆదివారం దుండగుడు వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. కాలనీలో నివాసముంటున్న చెంగయ్య భార్య వెంకటమ్మ(91) ఇంటి బయట కూర్చుని ఉంది. గుర్తుతెలియని వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకుని ఎఫ్జెడ్ మోటర్ సైకిల్పై వచ్చాడు. ఇక్కడ జగదీష్ ఇంటి అడ్రస్ చెప్పాలని వెంకటమ్మను అడిగాడు. ఇంతలోనే ఉన్నఫళంగా ఆమె మెడలో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. ఆమె తేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. గొలుసు విలువ రూ.3 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి కుమారుడు పార్థసారథి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం తిరుమల: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు. 31 వరకు పోలీస్ యాక్ట్ రేణిగుంట: రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమ ల్లో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివా రం రాత్రి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. పోలీస్ సబ్డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. -
హ్యాండ్బాల్ విజేతలుగా చిత్తూరు, పశ్చిమగోదావరి
కదిరి అర్బన్: పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ జూనియర్ బాలికలు, బాలుర చాంపియన్షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, బాలుర విభాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జట్లు సాధించాయి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు. గంగజాతరకు పటిష్ట భద్రత తిరుపతి క్రైం : తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు తెలిపారు. జాతర ప్రాంగణంలో జేబుదొంగలు, గొలుసు దొంగలు సంచరించే అవకాశాలు ఉన్నందున భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు అధికంగా ధరించి రావద్దని, విలువైన వస్తువులను ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు చెక్
చిత్తూరు అర్బన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు చెక్ పెడుతున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆయన శనివా రం విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం రి యల్ టైం గవర్నెన్స్లో భాగంగా ప్రవేశపెట్టిన సీసీటీవీ 360 ఏపీ వ్యవస్థ చోరీల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. చోరీకి గురైన వాహనాలను సీసీటీవీ 360 ఏపీ ద్వారా వేగంగా గుర్తించే అవకాశం కలిగిందన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల మిస్సింగ్ కేసుల్లోనూ సీసీ టీవీ సేవలు ఉపయోగకరంగా మారాయని చెప్పారు. వాహనం చోరీకి గురైన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదా జిల్లా పోలీసుల వాట్సాప్ నంబర్ 9440900005కు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, చివరిసారిగా ఎక్కడ కనిపించిందో తెలపాలన్నా రు. ప్రజలు వాహన భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, స్టీరింగ్ లాక్, వీల్ లాక్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
విత్తనమేదీ..!
జిల్లాలో రెండేళ్లగా రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వం నుంచి సాయం లేదు.. వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా లేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కిదున్ని పొలాల ను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ధర నిర్ణయం కాకపోవడంతోనే విత్తనాలు పంపిణీ చేయలేదని అధికారులు సాకు లు చెబుతున్నారు. పంపిణీ ఆలస్యమైతే సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతుందని, పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాణిపాకం: జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 70 వేల హెక్టార్లు. అందులో వేరుశనగ సాగు విస్తీర్ణం 33 వేల హెక్టార్లు. సుమారు 80 వేల మంది రైతులు ఈ పంటను సాగుచేస్తారు. గతేడాది ఖరీఫ్లో వేరుశనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయలేదు. పెట్టుబడి సాయం కూడా అందలేదు. దీంతో 7 వేల హెక్టార్లల్లో మాత్రమే సాగు చేపట్టారు. ధర నిర్ణయించలేదని సాకులు విత్తనాల కేటాయింపు జరిగి నెల రోజులు కావస్తున్నా ధర నిర్ణయంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీని కారణంగా ఈ ఖరీఫ్కు కూడా విత్తనాల పంపిణీ ఆలస్యం కానుంది. అలాగే ఇతర కారణాల వల్ల విత్తనాలను జూన్ మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో పంపిణీ చేస్తే రైతులు కాయలు వలుచుకుని విత్తనాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. ముందస్తు ప్రణాళికలేవీ..? ఈ సారి కూడా అధికారులు ఖరీఫ్ సాగుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయలేదు. ఈ ఏడాది వర్షాలు లేవని.. వేరుశనగ విత్తన పంపిణీ ఉండకపోవచ్చునని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రెండు నెలల ముందే వెల్లడించారు. దీనిపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించింది. జిల్లాకు 38 క్వింటాళ్లకు పైగా విత్తనాలు అవసరమని రైతులు అంటున్నారు. అప్పుడే రైతుకు ఒక్కో బ్యాగు చొప్పున కాయలు అందుతాయని చెబుతున్నారు. లేనిపక్షంలో కాయ ల కోసం కుస్తీ పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం -
జనసేన గుడిపాల అధ్యక్షుడిపై కేసు నమోదు
సాక్షి, టాస్క్ఫోర్స్ : గుడిపాల మండలం నుంచి తమిళనాడుకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు తేలడంతో జనసేన మండల అధ్యక్షుడు రూప్కుమార్పై కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసులు ఇసుక అక్రమాలపై నిఘా పెట్టారు. నారగల్లు పంచాయతీ సమీపంలో ఉన్న మంచినీళ్లగుంట వద్ద ఇసుక డంపింగ్ను గుర్తించారు. వీఆర్వో రాజారాం ద్వారా విచారణ చేయించారు. ఈ క్రమంలో గుడిపాల మండలానికి చెందిన జనసేన అధ్యక్షుడు రూప్కుమార్ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు తేలింది. దీంతో తహసీల్దార్ ఇసుకను సీజ్ చేసి గుడిపాల ఎస్ఐ రామ్మోహన్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
అప్పుడే కూటమి నేతల ఆర్డర్లు
ప్రభుత్వం ఈ సారి జిల్లాకు 27 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించింది. దీంతో రైతులకు ఒక్కో బ్యాగు కూడా అందని పరిస్థితి ఉంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా కూటమి నేతలు కాయల కోసం కాపు కాస్తున్నారు. ముందుగానే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో రైతులకు కాయలు అందే పరిస్థితి కనిపించడంలేదు. ఫలితంగా సాగు విస్తీర్ణం ఘణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. గతేడాది కూటమి నేతలు ఇష్టానుసారంగా కాయలు పట్టుకెళ్లారు. వాటికి పలు మండలాల్లో డబ్బులు కూడా చెల్లించలేదు. బకాయిలు పేరుకుపోవడంతో కొన్నిచోట్ల వ్యవసాయశాఖ సిబ్బంది అప్పులు చేసి కొంతమేర చెల్లించారు. మరికొన్నిచోట్ల సిబ్బంది సొంత అవసరాలకు వాడేశారు. ఈ సారైనా కూటమి నేతల జోక్యం లేకుండా కాయలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే 2024లో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2 వేల హెక్టార్లకే పరిమితమవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వేరుశనగ విత్తనాలు(ఫైల్) -
లోన్ యాప్స్!
వేధిస్తున్నఇటీవల లోన్యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగదు అవసరమున్న వారిని గుర్తించి ఆధార్ కార్డును అప్లోడ్ చేస్తే చాలు లోన్లు ఇస్తున్నాయి. వాటిలో వారం, నెల, ఏడాది రుణాలున్నాయి. తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సకాలంలో ఇన్స్టాల్మెంట్లు చెల్లించని వారిని నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్కు పంపుతున్నారు. అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా ఆధార్ కార్డు ఆధారంగా రూ.లక్షల్లో అధిక వడ్డీలకు రుణాలిస్తున్నాయి. అధిక వడ్డీలతో కంతులు కట్టలేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. పలమనేరు: ఆర్థికంగా ఇబ్బందులున్న వారు తమ స్మార్ట్ఫోన్లో ఓ లోన్కు సంబందించిన వివరాలను టచ్ చేస్తే చాలు ఆపై ఏఐ ఆధారంగా వారి మొబైల్కు రకరకాల లోన్ యాప్ల ద్వారా రుణాలిస్తామనే మెసేజ్లు, లింకులు వస్తూనే ఉంటాయి. వీటిని చూసి కాస్త టెంప్ట్ అయి రుణం తీసుకుంటే మన తల వారి చేతికి ఇచ్చినట్టే. అధిక వడ్డీలు వేసి ఇబ్బందులు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలను వాట్సాప్కు పంపుతున్నారు. అంతేగాక వారి బంధువులు, స్నేహితుల మొబైళ్లకు సైతం పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో పేదలు వారు అడిగినంత డబ్బు చెల్లించలేక నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు వీరు ఎలా రుణాలిస్తారంటే.. రకరకాల లోన్ యాప్స్ ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్షల వరకు రుణం పొందవచ్చు. నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్న వారి ఆధార్, కుటుంబ సభ్యుల ఆధార్, వారి ఫోన్ నంబర్లు తీసుకుంటారు. ఆపై ప్రొసెసింగ్ ఫీజు, జీఎస్టీ తదితరాలు పట్టుకుని మన ఖాతాలోకి నగదు జమచేస్తారు. రూ.5 వడ్డీతో అసలు కలిపి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి ఉంటుంది. అప్పు తీసుకునే వారి స్థోమత, సిబిల్ రేటింగ్స్ను బట్టి రూ.1000 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఎంతకట్టినా అప్పు తీరదు అధికవడ్డీతో ఇన్స్టాల్మెంట్లు చెల్లించాల్సి రావడం, ఓ కంతు కట్టకుంటే దానికి జరిమానా కలిపి భారీగా పెరగడం తదితరాలతో అప్పు తీరడం కష్టంగా మారుతుంది. మొదట్లో ఇదంతా చాలా సులభంగా ఉంటుందని నిర్వాహకులు నమ్మించి ఆపై అసలు కథను నడిపిస్తున్నారు. తీసుకున్న లోన్కు అసలు, వడ్డీ కలిపి కట్టినా ఇంకా ఉందంటూ బెదిరింపులు తప్పడం లేదు. కట్టకుంటే మీ కుటుంబ సభ్యుల న్యూడ్ పొటోలను వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బ్లాక్మెయిల్ చేసి మరీ వసూళ్లు కంతులు సకాలంలో కట్టకుంటే డబ్బు తీసుకున్న వారి వాట్సాప్, కుటుంబ సభ్యుల వాట్సాప్కు వారి ఆధార్ ఆధారంగా ఉన్న ఫొటోలను మార్పింగ్ చేసి నగ్న ఫొటోలను సెండ్ చేస్తున్నారు. అప్పటికీ నగదు కట్టకుండా ఉంటే వారి వాట్సాప్ను హ్యాక్ చేసి అందులో ఉన్న నంబర్లకు సైతం న్యూడ్ ఫొటోలను పంపుతున్నా రు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురికి ఈ విధమైన పరిస్థితి ఎదురైంది. వారు అప్పు చేసి మరీ మొత్తం అప్పు కట్టేశారు. ఈ మొత్తం వ్యవహారం యాప్ ద్వారానే సాగుతున్నందున ఎవరిపై ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కుమిలిపోతున్నారు. ఇలాంటి లోన్యాప్ల జోలికి వెళ్లరాదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నా జనం మాత్రం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీలతో జనాన్ని లూటీ చేస్తున్న వైనం -
ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి దుర్మరణం
కలప లోడుతో వెళుతూ ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గిరిబాబుయాదవ్ చిత్తూరు కలెక్టరేట్: ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాదమరి మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన మెరుగు గిరిబాబుయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరులోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిబాబు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు పలువురు టీచర్లు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు బాబు, సంఘ నేత లు దేవానంద్, నాథముని, త్యాగరాజు, గుర్రప్ప, లత, రెడ్డివాణి, శివరంజని పాల్గొన్నారు. -
పలమనేరు మాజీ సీఐ నరసింహరాజుకు తీవ్రగాయాలు
పలమనేరు: కడపలోని అల్మాస్పేట సర్కిల్లో శనివారం ఇరువర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఇందులో గతంలో పలమనేరులో సీఐగా పనిచేసి బదిలీపై కడప తాలూకా స్టేషన్కు వెళ్లిన నరసింహరాజుకు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఘనంగా కియా సిరోస్ 2026 ఆవిష్కరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): కియా ఇండియా సంస్థకు చెందిన నూతన కియా సిరోస్ 2026 కారును శనివారం చిత్తూరు నగరం ఇరువారంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా షోరూంలో ఘనంగా ఆవిష్కరించారు. షో రూం మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథ రెడ్డి మాట్లాడుతూ కియా నుంచి విడుదలైన సిరోస్ 2026 మోడల్ కారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలతో రూపొందించబడిందన్నారు. వినియోగదారుల సౌకర్యా న్ని దృష్టిలో పెట్టుకుని పలు నూతన ఫీచర్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చెరకు నిరంజన్, సి.భారతి, సి.హోషిమారెడ్డి, సి.ఆశిష్ రెడ్డి పాల్గొన్నారు. -
‘కూటములను మట్టికరిపించిన విజయ్’
కార్వేటినగరం: తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే కూటములను మట్టి కరిపించిన ఘనత టీవీకే పార్టీ అధినేత విజయ్కే దక్కిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు చెల్లించకుండా ప్రజల మన్ననలతో విజయ్ 108 సీట్లు కైవసం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ మోదీ రాజ్యాంగాన్ని అమలు చేయా లని చూడడం దారుణమన్నారు. బేజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తక్కువ ఉన్నా వారికి సమయం ఇచ్చారని, తమళినాడులో 108 సీట్లు సాధించిన విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతించక పోవడం తగదన్నారు. ఇతర పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినా గవర్నర్ కుంటి సాకులతో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క సీటు సాధించిన బీజేపీకి చెందిన వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ఽసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ప్రచారం చేసి, ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ చేస్తానని విజయ్ హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ప్రజలు విజయ్కి బ్రహ్మరథం పట్టారని వివరించారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ పవన్ కళ్యాణ్ తన పార్టీ అంజెడాను పక్కన పెట్టి 15 ఏళ్లుగా చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. సినీరంగం నుంచి వచ్చిన విజయ్ కి, పవన్ కళ్యాణ్కు పోలీకే లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ సభ్యత, సంస్కారం కలిగిన వ్యక్తి విజ య్ అని తెలిపారు. చెప్పు చూపించడం, కొడుకులని సంబోందించడం, కులాలను చూపించి ఓట్లు అడగడం పవన్కళ్యాణ్ నైజమన్నారు. ఆయ నకు విజయ్తో పోలికేంటని చురకలు అంటించారు. టీవీకే చీఫ్ విజయ్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. -
ఫ్రీ డయాలసిస్ సెంటర్ రానట్టే!
పలమనేరు: పలమనేరులోని కిడ్నీవ్యాధిగ్రస్తులు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అనేక ఏళ్లుగా కోరుతున్నారు. అధికారులు ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి పంపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని 12 పట్టణాల్లో పీఎంఎన్డీపీ (ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం) కింద కొత్తగా ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరుకు మాత్రం మంజూరైనట్టు తెలిపారు. దీనికి రూ.85 లక్షలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ సెంటర్లు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నడుస్తాయని వెల్లడించారు. పలమనేరు పేరు లేకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. ఫలితంగా డయాలసిస్ రోగులు బంగారుపాళెం లేదా అన్నమయ్య జిల్లా మదనపల్లె, తిరుపతి, కుప్పం పీఈఎస్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే పలమనేరు నియోజకవర్గంలో కిడ్నీ డయాలసిస్ రోగులు 256 మంది వరకు ఉన్నారు. వీరిలో డబ్బులున్న వారు తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రలు, వేలూరు సీఎంసీ, కుప్పం పీఈఎస్, బెంగళూరులోని ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. పేదలు మాత్రం ఇక్కడికి 24 కిలోమీటర్ల దూరంలోని బంగారుపాళెం వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ఏడు డయాలసిస్ యంత్రాలు ఉన్నాయి. వందల సంఖ్యలో రోగులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో అప్పోసప్పో చేసి ప్రైవేటు సెంటర్లకు వెళ్లాల్సివస్తోంది. ఇప్పటికై నా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పందించి పలమనేరుకు డయాలసిస్ సెంటర్ వచ్చేలా చొరవచూపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. -
హస్తకళాకారుల ఆర్థిక ఎదుగుదలకు కృషి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): హస్త కళాకారులకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఆమె శుక్రవారం చిత్తూరు మండలంలోని తుమ్మిందలో వినాయకుడి బొమ్మల తయారీని పరిశీలించారు. బొమ్మల తయారీ, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీపై ఆసక్తి ఉన్న కళాకారులకు యూనిట్ పెట్టించేలా చర్య లు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎంలు సుబ్బారెడ్డి, విజయభాస్కర్, సీసీ నిత్యానంద పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సాంకేతిక సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఆయన శుక్రవారం ఆ సంఘ నాయకులతో కలిసి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ (డీజీఈ), ఐటీ అడిషనల్ డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ టీచర్లు క్షేత్రస్థాయి లో సాంకేతికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. లీప్ యాప్ నిర్వహణలో ఇబ్బందులున్నట్లు తెలిపారు. టీచర్ల సర్వీసెస్ సెక్షన్లో ప్లే స్లిప్పుల మాదిరిగానే డిజిటల్ ఐడీ కార్డులను నేరుగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాలన్నారు. మార్కులు, ఇతర వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత, వాటినే రిజిస్టర్లుగా ప్రింట్ తీసుకునేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని కోరారు. మార్కుల ఎంట్రీలో తప్పు లు దొర్లితే సవరించుకునేందుకు, ప్రింట్ తీసుకునేందుకు నిరంతర అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం హాజరు వేసే సమయంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, అనవసర నోటిఫికేషన్లు రాకుండా చూడాలన్నారు. యాప్లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇద్దరు పిల్లలపై పిచ్చికుక్క దాడి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం ఇద్దరు పిల్లలపై పిచ్చికుక్క దాడి చేసింది. నగరంలోని సంతపేట సాయినగర్ కాలనీలో రెండు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి. అటువైపు వెళుతున్న వాళ్లను కరవడానికి ప్నయత్నిస్తుండగా స్థానికులు మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పట్టించుకోలేదు. శుక్రవారం రాత్రి వీధిలో సైకిల్పై వెళుతున్న ఇద్దరు పిల్లలను పిచ్చి కుక్క వెంటాడి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పిల్లలను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు వాపోతున్నారు. -
టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
– మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక తిరుపతి తుడా: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్ప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు మితిమీరుతున్నాయని మండిపడ్డారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, భవిష్యత్లో వారికి ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. -
వైభవం.. స్వర్ణ రథోత్సవం
శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వెంకన్న స్వర్ణరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిండు ప్రాణం బలి కార్వేటినగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దేవకి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శివరాత్రి సందర్భంగా తలకోనకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తురకమిట్ట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందించేందుకు 108 వాహనానికి సమాచారం ఇచ్చాం. గంట అయినా 108 వాహనం రాలేదు. తీవ్రంగా గాయపడిన దేవకి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి విషయాలను అధికారులు గుర్తించాలి. – బండి రాము, లక్ష్మీపురం, కార్వేటినగరం మండలం గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం మూడు నెలల క్రితం గర్భిణి నొప్పులతో బాధపడుతుండగా 108కు కాల్ చేశాను. వారు నిండ్ర హాస్పిటల్ నుంచి పది నిమిషాల్లో చేరుకుంటామన్నారు. గంట సమయం దాటినా రాలేదు. నొప్పులు ఎక్కువగా ఉండడంతో ఆటోలో నగిరి ఏరియా ఆస్పత్రికి బయలుదేరాం. నగరి మండలం వేలావడి వద్ద వెళుతుండగా 108 వారు కాల్ చేసి పన్నూరు సబ్స్టేషన్ వద్దకు వచ్చామన్నారు. మేము ఆస్పత్రి సమీపంలో వెళుతున్నామని చెబితే టైం పాస్ కోసం 108కు ఫోన్ చేశారా అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైందని వచ్చేశామంటే గొడవకు దిగారు. నాతో ఉన్న వారు ఎందుకు అలా అంటున్నారంటే ఎవరికైనా కంప్లయింట్ చేసుకోండి మాకేమీ భయం లేదు అని మాట్లాడారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. – జికె శివ, అత్తూరు, నిండ్ర మండలం -
కునుకు తీస్తున్న కుంకీలు!
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో ని కౌండిన్య అభయారణ్యం 250 కిలోమీటర్లకు విస్తరించి ఉంది. ఈ అడవితోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవుల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. మొత్తం 105 ఏనుగులు ఉన్నాయి. కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోనే 56 వరకు ఏనుగులు గుంపులుగా ఉన్నాయి. ఇవేగాక పక్కరాష్ట్రాల నుంచి ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి. ఈ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. అడవి నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. అలాగే కందకాలు తవ్వారు. అయినా ప్రయోజనం లేదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగులను కట్టడి చేయడానికి పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టును చేపట్టింది. అయినా ఏనుగుల సమస్య ఏమాత్రం అదుపులోకి రాలేదు. పంట నష్టం, ప్రాణ నష్టం తప్పడం లేదు. కుంకీల సంరక్షణకు సైతం నిధుల సమస్య కీలకంగా మారింది. జనం ప్రాణాలు పోతున్నా.. ఏనుగుల దాడుల్లో 2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 34 మంది ప్రాణాలను కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగుల బారిన పడి 64 పశువులు మృతిచెందాయి. ఈ దాడులను ఎక్కువగా చేసింది మదపుటేనుగులేనని అధికారులు గుర్తించారు. ఇక ఏనుగుల కారణంగా 9 వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. అడవిని దాటి బయటకొచ్చే సమయంలో విద్యుత్ షాక్తోపాటు పలు కారణాలతో ఇప్పటి వరకు 24 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. నెరవేరని కుంకీల లక్ష్యం ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా కుంకీ ఆపరేషన్లు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, రామకుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించింది. వాటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి తర్వాత అడవిలోని ఏనుగులను కట్టడి చేయాలని నిర్ణయించారు. ముందుగా మదపుటేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకురావాల్సి రావాలి. వాటిని ఎలిఫెంట్ క్రాల్స్లో బంధించి ఆరునెలలపాటు శిక్షణ ఇస్తే కుంకీలుగా మారి డాడులు చేయకుండా మాట వింటాయి. ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇలా ఉండగా ననియాల ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన వినాయక, జయంత్ అనే రెండు ఏనుగులను మళ్లీ అక్కడికే పంపించారు. ప్రస్తుతం ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, దేవా, రంజన్ అనే నాలుగు ఏనుగులు మాత్రమే ఉన్నాయి. భారంగా మారిన కుంకీల సంరక్షణ ఏనుగుల సమస్య అదుపులోకి రాలేదని రైతుల ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. కుంకీలకు మేత, ఆహారం కోసం అటవీశాఖకు మరింత భారంగానే మారింది. ఇక్కడి క్యాంపు నిర్వహణకు నెలకు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంతేగాక ఇక్కడి అటవీ రేంజిలో పనిచేస్తున్న సిబ్బంది అడవులకు సంబందించిన పనులను పక్కనబెట్టి కుంకీ ఏనుగుల పనుల్లోనే బిజీగా మారిపోయారు. కుంకీలతో శిక్షణ, ట్రయల్స్కే పరిమితం బయటి రాష్ట్రాల్లో క్యాప్చరింగ్ ఇలా.. మదపుటేనుగులు ప్రమాదకరమైనవి. ఇవే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వీటిలో కొన్ని ఒంటరిగా సంచరిస్తుండగా మరికొన్ని గుంపుల్లో ఉన్నాయి. కుంకీలు నాలుగు దిశల్లోకి వెళ్లి గుంపులోని మదపుటేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తుసూది ఇచ్చి వాటిని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. తర్వాత క్రాల్స్లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చిన తర్వాత అవి కుంకీలుగా మారుతాయి. ఈ ప్రక్రియ కర్ణాటక, తమిళనాడులో సాగుతోంది. అదేవిధంగా ఇక్కడి మదపుటేనుగులను కట్టడి చేయాలంటే ఇంకా మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏనుగుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒరిగిందేమీ లేదు అటవీశాఖ అధికారులు గతంలో టేకుమంద ఫారెస్ట్లో కుంకీ ఏనుగుల ట్రయల్ రన్ చేపట్టి విజయవంతమైందని చెప్పారు. కుంకీలు అడవిలోని ఆడ ఏనుగులను మళ్లించడం సులవే. మదపుటేనులను మళ్లించడం అంతసులువైన పనికాదు. వాటి కారణంగానే పంట, ప్రాణ నష్టం జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వీటిని అదుపు చేయడమే కుంకీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం అత్యంత కీలకమైన ప్రక్రియ క్యాప్చరింగ్ మాత్రమే. మదపుటేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న కుంకీలకు మనిషి చెప్పినట్టు వినే కమాండింగ్స్ ఇచ్చి వాటి ద్వారా రకరకాల సర్కస్ ఫీట్లను చేయిస్తున్నారు. వీటిని చూసేందుకు ఎక్కువగా ప్రజలు ఎలిఫెంట్ క్యాంపుకు వెళుతున్నారు. -
వైభవం.. స్వర్ణ రథోత్సవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు స్వర్ణరథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్లు రమేష్ బాబు, రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
టీచర్ల సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని ఆపస్ నాయకులు కోరారు. వారు డీజీఈకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో పలుచోట్ల పిలిస్తే పలకని 108 శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026ఆపదలో ఉన్నవారికి 108 అంటే భరోసా. ప్రమాదం జరిగినా.. ఎవరికై నా గుండెపోటు వచ్చినా.. ఏదైనా అత్యవసర పరిస్థితి కలిగినా.. గర్భిణికి పురిటినొప్పులు వచ్చినా.. ఒక్క ఫోన్ చేస్తే కుయ్కుయ్మంటూ నిమిషాల్లో 108 అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో పలుచోట్ల 108 వాహన సేవలు కుంటుపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. చివరకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారుతున్నాయి.ప్రశ్నిస్తే సిబ్బంది దురుసు ప్రవర్తన అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వారితో కొంతమంది 108 సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సి ఉండగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. పేదలంటేనే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించారు. 11 కేవీ ఫీడర్ల పరంగా 33 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 17, సర్వీసు లైన్ 6 కలిపి మొత్తం 56 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. వాటిలో 8 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలిన వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో రూ.1.58 కోట్ల ఆదాయం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉన్న హుండీల ద్వారా రూ.1,58,76,947ల ఆదాయం వచ్చినట్టు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించినట్టు తెలిపారు. ఈ క్రమంలో రూ.1,58,76,947 నగదు, బంగారం 31 గ్రాములు, వెండి 1.20 గ్రాములు వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణలోని హుండీల ద్వారా రూ.19,180, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,43,720 వచ్చిందని తెలి పారు. యూఎస్ఏ డాలర్లు 364, సింగపూర్ డాలర్లు 52, మలేషియా రింగిట్ ఒకటి, యూఏఈ దిర్హామ్స్ 70, ఆస్ట్రేలియావి డాలర్లు 500, కెనాడా డాలర్లు 20, ఇంగ్లాడ్ పౌండ్స్ 10 వచ్చాయన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మణి నాయుడు, డీఈవో సాగర్బాబు, ఏఈవోలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఈసెట్లో మెరిసిన విద్యార్థులు – రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన కుసుమ చిత్తూరు కలెక్టరేట్ : డిప్లొమా కోర్సు పూర్తి చేసి నేరుగా బీఈ, బీటె క్, బీఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్(లేటరల్ ఎంట్రీ)లో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందు లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 422 మంది పరీక్షలకు రాయ గా 392 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 224 మంది, బాలికలు 168 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు ముందంజలో నిలిచారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 92.89 శాతం నమోదు కాగా బాలురు 91.80, బాలికలు 94.66 శాతం ఉత్తీర్ణత పొందారు. గంగాధరనెల్లూరు మండలం ఎగువకాలువ గ్రామానికి చెందిన పి.కుసుమ ఫార్మసీ విభాగంలో 146 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఆమెను పలువురు అభినందించారు. ఆపదొస్తే అవస్థే..!కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు 31 దాకా ఉన్నాయి. ఇవి రోజువారీగా సుమారు 5 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, 90 నుంచి 100 కేసులను ఆస్పత్రులకు చేరుస్తున్నట్టు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. వీటిలో పలు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని తరచూ రిపేర్ అవుతున్నాయి. వాటికి తక్షణం మరమ్మతులు చేయించడం లేదు. మూడు వాహనాలు మరమ్మతులకు గురై చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూలనపడ్డాయి. కొన్ని మండలాల్లో టైర్లు పాడవడం, ఇంజిన్్ సమస్యలు, బ్యాటరీ లోపాలు, ఇతర సాంకేతిక కారణాలతో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు 108 వాహన సేవలు అందడం లేదు. ఇప్పుడే ఎందుకిలా..? కరోనా సమయంలో 108 సేవలు ప్రజలకు ప్రాణాధారంగా నిలిచాయి. రాత్రింబవళ్లు పనిచేసి కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. అప్పట్లో 108 సిబ్బందిని ప్రజలు దేవుళ్లలా భావించారు. గత ఐదేళ్ల పాలనలో 108కు ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నారు. మహానేత తీసుకొచ్చిన ఈ 108 సేవలను.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింతంగా తీర్చిదిద్దారు. అలాంటి సేవలు ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాయనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పిలిస్తే పలికిన 108 ఇప్పుడు కాల్ చేసినా కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయని నివేదికలు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే.. సిబ్బంది దురుసు ప్రవర్తన అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వారితో కొంతమంది 108 సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సి ఉండగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. పేదలంటేనే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తక్షణం స్పందిస్తున్నాం జిల్లాలో 31 వాహనాలున్నాయి. బ్యాక్ ఆప్గా 4 వాహనాలున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఉన్నవి కూడా ఆవాహనలే. తక్షణం మరమ్మతులు చేయిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. చర్యలు తీసుకుంటాం. – మోహన్బాబు, 108 మేనేజర్, చిత్తూరు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశం ఏటీఎం కేంద్రాల్లో భద్రత బ్యాంకులదే! చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాలకు కసరత్తు చేస్తున్నట్టు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడు తూ విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవే ట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం రెండవ విడత లాటరీ ఫలితాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. చిత్తూరులో 35, కుప్పంలో 33, బంగారుపాళ్యంలో 20, జీడీ నెల్లూరులో 17, పలమనేరులో 12, నగరిలో 11, తవణంపల్లిలో 11, గంగవరంలో 9, వి.కోటలో 7, యాదమరిలో 6, బైరెడ్డిపల్లిలో 4, గుడిపాలలో 4, ఎస్ఆర్పురంలో 4, వెదురు కుప్పంలో 4, రామకుప్పంలో 3, ఐరాలలో 2, కార్వేటినగరంలో 2, నిండ్రలో 2, పెద్దపంజాణిలో 2, పూత లపట్టులో 1, శాంతిపురంలో 1, విజయపురంలో 1 విద్యార్థులు ఎంపికై నట్టు తెలిపారు. ఎంపికై న విద్యా ర్థుల అడ్మిషన్ల ధ్రవీకరణ ఈ నెల 16వ తేదీ వరకు పాఠశాలలో చేయించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఈ నెల 17న తుది నిర్ధారణ చేస్తామన్నారు. వివరాలకు ఎంఈవోలను సంప్రదించాలని కోరారు. చిత్తూరు అర్బన్ : ఏటీఎం కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులపై ఉందని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో బ్యాంకు మేనేజర్లతో సేఫ్టీ–సెక్యూరిటీ ఆడిట్ పేరిట సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల ఏటీఎం కేంద్రాల్లో చోరీలు జరుగుతున్నాయని తెలిపారు. దొంగలు భారీ మొత్తంలో నగదు చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాల గురించి పట్టించుకోవడంలేదని తెలిపా రు. అక్కడ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలేదన్నారు. తీరా చోరీ జరిగిన తర్వాత బాధపడుతున్నారని పేర్కొన్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు బ్యాంకర్లు పోలీసులకు సహకరించాలన్నారు. జనావాసంలేని ప్రాంతాలు, నగదు లావాదేవీలు తక్కువగా జరిగేచోట్ల ఉన్న ఏటీఎంలను మరో చోటికి తరలించాలన్నారు. ప్రతి ఏటీఎం కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ, డీఎస్పీ సెల్ నంబర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బీట్ పాయింట్ పుస్తకం పెట్టాలన్నారు. తద్వారా పోలీసులు తనిఖీ చేసే సమయంలో ఇక్కడ రికార్డు చేస్తారని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, కనీసం 90 రోజుల వీడియోను భద్రపరచాలన్నారు. నగదు నింపే సిబ్బంది వివరాలను ధృవీకరించాలన్నారు. ఫైనాన్స్ సంస్థలు బంగారు ఆభరణాల లాకర్లకు పటిష్టమైన భద్రతా గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ అశోక్కుమార్, పలు వురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,085 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్య చిత్తూరు కలెక్టరేట్ : పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు తాలీం ఏ హునర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మైనారిటీ, వక్ఫ్బోర్డ్ అధికారులు వెల్లడించారు. దీనికి అర్హులైన ముస్లిం విద్యార్థులు apwaqfboard. el91.com వెబ్సైట్లో ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో 450 మార్కులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో 75 శాతం మార్కులు వచ్చిన మైనారిటీ విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 17వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని, అందులో ఎంపికై న వారికి కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్యతో పాటు జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. – పూతలపట్టులో మూడు రోజుల క్రితం కొందరు యువకులు వ్యక్తిగత కారణాలతో ఘర్షణ పడ్డారు. ఒక యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్సుకు కాల్ చేశారు. ఆ వాహనం సమయానికి రాలేదు. పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తమ వాహనంలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. – తవణంపల్లి మండలం సత్తారుబావి గ్రామంలో 20 రోజుల క్రితం ఆటో బోల్తా పడింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. గంటల తరబడి చూసినా 108 వాహనం రాలేదు. దీంతో స్థానికులు ఆటోలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండలంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగాయి. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరిగాయి. గంటల తరబడి ఎదురు చూపులే.. పలు ప్రాంతాల్లో 108 సేవలు గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేస్తే తక్షణ స్పందన కనిపించడం లేదు. కొన్నిసార్లు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ‘‘వాహనం వస్తోంది.. ఇంకో కేసు దగ్గర ఉంది.. కొంతసేపట్లో అక్కడికి చేరుతుంది.. అంటూ సమాధానాలు వస్తున్నా.. అంబులెన్స్ మాత్రం రావడం లేదు. గంటల తరబడి చూసినా వాహనం రాకపోవడంతో చివరకు స్థానికులు కార్లు, ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులు రక్తపు మడుగులో బాధతో గంటల తరబడి అంబులెన్స్ కోసం ఎదురు చూసిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు గర్భిణులకు పురిటినొప్పులు వస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు పలమనేరు ఏరియా ఆస్పత్రికి వచ్చే కేసులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం రెఫర్ చేయాలంటే 108 పలకడం కష్టంగా ఉంది. 108కు కాల్ చేస్తే సమయానికి రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. తవణంపల్లి, పూతలపట్టు, కార్వేటినగరం, ఎస్ఆర్పురం, నగరి తదితర మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బుడిబడి నడకలేవీ..?
అద్భుతమైన పథకం.. మహాద్భుతమైన నిబంధనలు.. ఇంకేం పేద విద్యార్థులకు ఇబ్బందే ఉండదు. అక్షరాలు కదం తొక్కుతాయి. పేద పిల్లలందరూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల తలుపులు తడతారు. పేదలందరికీ కార్పొరేట్ విద్య అందుతుంది. పేదింట అక్షరాల పూదోటలు విలసిల్లుతాయనుకున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి.. ప్రభుత్వం మారింది.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పేద విద్యార్థులు కార్పొరేట్ గడప తొక్కలేక మగ్గిపోతున్నారు. ఇదీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యా పథకం పరిస్థితి. సరైన అవగాహన కల్పించడంలో విఫలం విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ ప్రాంతంలోనే ఉండే మంచి స్కూలును ఎంపిక చేసుకుంటే, ఉచిత విద్య పథకంలో అవకాశం కల్పిస్తామనే అవగాహన కల్పించలేదని విమర్శలున్నాయి. అలాగే కార్పొరేట్ పాఠశాలతోపాటు గుర్తింపు ఉన్న స్కూళ్లను ముందే సంప్రదించి...నామ్ అకడమిక్ పేరుతో రూ.30వేలు చెల్లించడం కుదరదని చెప్పడంలోను విద్యాశాఖ వెనుకబడి ఉందని చర్చసాగుతోంది. దీంతోనే అడ్మిషన్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. తిరుపతి అర్బన్: పేద విద్యార్థులకు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థి తమ నివాసానికి సమీపంలోని ప్రైవేటు స్కూల్లో చేర్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ప్రతి కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25శాతం అడ్మిషన్లు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఆ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అమలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లుపొడుస్తుందనే విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఏ గ్రేడ్లోనే కార్పొరేట్ స్కూళ్లలోనే కాకుండా బీ,సీ గ్రేడ్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలను విద్యాశాఖాధికారులు చేర్పిస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో నాన్ అకడమిక్ ఫీజు రూ.30వేలు డిమాండ్ ఉచిత విద్య పథకానికి సంబంధించి కార్పొరేట్ స్కూళ్లను ఏ గ్రేడ్గా విభజించారు. అలాంటి స్కూళ్లలో పిల్లలను చేర్చుకుంటే విద్యాశాఖ ఒక విద్యా ర్థికి రూ.13 వేలు చొప్పన స్కూల్కు చెల్లించాలి (తల్లికి వందనంకు ఇచ్చే డబ్బులు), అలాగే మధ్యతరగతి ప్రైవేటు స్కూళ్లను బీ గ్రేడ్గా విభజన చేశారు. అలాంటి స్కూల్కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.11,500 చెల్లించాలి. మిగిలిన 1500 విద్యార్థి తల్లిఖాతాలో జమ చేస్తారు(తల్లికి వందనం రూ.13 వేలు నగదు విభజన), చిన్న ప్రైవేటు స్కూళ్లను సీ గ్రేడ్గా విభజన చేశారు. అలాంటి స్కూల్కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు చెల్లిస్తారు. మిగిలిన రూ.3 వేలు నగదు విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు (ఏ గ్రేడ్)ఉచిత విద్య స్కీమ్ ద్వారా పిల్లలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. నాన్ అకడమిక్ పేరుతో అదనంగా రూ.30 వేలు ఒక్కో విద్యార్థి చెల్లించాలని మెలిక పెట్టేస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. ఇక బీ గ్రేడ్లో భాగంగా మీడియం స్కూళ్ల విషయానికి వస్తే ఒకటో తరగతిలో అడ్మిషన్లు తక్కువ శాతం ఉన్నవారు మాత్రమే పేద పిల్లలను చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సీ గ్రేడ్లో భాగంగా చిన్న ప్రైవేటు స్కూళ్లు, ప్రధానంగా మండల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో కొత్తగా పెడుతున్న చిన్న పాఠశాలల వారు మాత్రమే తమకు సరైన అడ్మిషన్లు లేకపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ సైతం అదే దారిలో అడుగులు వేస్తుంది. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా అడ్మిషన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనే ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుతున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు తగ్గుతున్న ఆదరణ నాలుగు విడతల్లో 25 శాతం విద్యార్థుల భర్తీ ఉచిత విద్య పథకంలో భాగంగా జూన్ 12 లోపు నాలుగు విడతల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను విద్యాశాఖ వారు ప్రైవేటు స్కూళ్లలో చేర్చించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో 523 మంది పేద విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే అందులో 106 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్ తమకు నచ్చకపోవడంతో అడ్మిషన్లు తీసుకోలేదు. రెండో విడతలో 261 మందిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 లోపు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆడ్మిషన్లు తీసుకోలేదు. మూడో విడత ప్రక్రియ ఈ నెల 17 నుంచి 31వ తేదీ లోపు, నాలుగో విడత జూన్ 1 నుంచి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. -
చిత్తూరు జాతరొస్తోంది...!
చిత్తూరు నగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో గంగ జాతర జరగనుంది. ఈ క్రమంలో నగరమంతా సందడి మొదలైంది. పెద్దలు, యువకులు, భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏటా అంగరంగ వైభవంగా జరిగే గంగ జాతరను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో మండపాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు గంగ జాతరకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జాతరకు ముహూర్తం ఖరారుకావడంతో చిత్తూరు నగరంలోని నడివీధి, గిరింపేట, సంతపేట, కట్టమంచి, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, మంగసముద్రం తదితర ప్రాంతాల్లోని వీధులు కళకళలాడుతున్నాయి. వారం రోజులుగా మండపాల నిర్మాణం, చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణల పనులు కొనసాగుతున్నాయి. ఈసారి జాతరలో తమ ప్రాంత మండపమే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు భారీగా ఖర్చు చేస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో మండపాలను అలంకరిస్తూ, భారీ విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో దారిపొడవునా చలువ పందిళ్లు వేస్తున్నారు. క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, విశ్రాంతి ఏర్పాట్లపైనా దృష్టి సారిస్తున్నారు. వర్షం పడినా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మండపాలను పటిష్టంగా నిర్మిస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లకు ఆర్డర్లు ఇచ్చారు. సౌండ్ సిస్టంలు, డప్పు వాయిద్యాలు, విద్యుత్ లైటింగ్, పుష్పాలంకరణలు, వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర రోజుల్లో రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థానిక కళాకారులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు, మహిళలు, యువత కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. కొంగారెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన మండపం నడివీధిలో మండపం ఏర్పాట్లు నిఘా నీడలో జాతర గంగజాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే గుర్తించి నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు, శాంతిభద్రతల అంశాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అన్ని మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర జరిగే ప్రాంతాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గంగమ్మ కొలువుదీరే ప్రాంతాలన్నీ ప్రస్తుతం నిఘా నీడలోనే ఉన్నాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు. -
అపోలోలో ఘనంగా ఫిజియోక్వెస్ట్–2026
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని అపోలో నాలెడ్జ్ సిటీలో గురువారం ‘ఫిజియోక్వెస్ట్–2026’ దక్షిణ భారత స్థాయి ఇంటర్–స్టేట్ ఫిజియా లజీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో ఫిజియాలజీ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దక్షిణాది నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు పాల్గొని కేస్–బేస్డ్ లెర్నింగ్కు సంబంధించిన వినూత్న ప్రాజెక్టులు, ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.వినోద్ భట్ మాట్లాడుతూ, ఫిజియాలజీ, బేసిక్ సైన్సెస్ వైద్య విద్యకు బలమైన పునాదులు, వైద్య విద్యలో బేసిక్ సైన్సెస్పై స్పష్టమైన అవగాహన ఎంతో అవసరమన్నారు. తాము విద్యార్థి దశలో బేసిక్ సైన్సెస్ అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించేవారమని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏఐఎంఎస్ఆర్డీన్డాక్టర్ అల్ఫ్రెడ్ జె.అగస్టీన్, ఫిజియాలజీ విభాగాధిపతి, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ రమ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.విజేత, న్యాయనిర్ణేతలు డాక్టర్ శరణ్ బి.సింగ్, డాక్టర్ పి.శశికళ, అంతర్గత న్యాయనిర్ణేతలు, అధ్యాపకులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. -
నిరీక్షణ
జిల్లాలో పల్లెపండుగ 2.0 నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు వరకు మాత్రమే నిధులు విడుదల చేసింది. అప్పటి నుంచి ఒక్క పైసా విడుదల చేయలేదు. ఇప్పటికే చాలా చోట్ల పనులు చేసి.. నిధుల కోసం కాంట్రాక్టర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. అప్పు చేసి.. వడ్డీలు కట్టలేక.. బిల్లులు రాక ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆగస్టు వరకు చేసిన పనులకే బిల్లులు చిత్తూరు కార్పొరేషన్: కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వ హామీలు నమ్మారు. వడ్డీలకు అప్పు చేసి పల్లెల్లో రోడ్ల పనులు పూర్తి చేశారు. అధికారులకు క్యాడర్ వారీగా ఇవ్వాల్సిన మామూళ్లూ ఇచ్చేశారు. తీరా బిల్లులు రాక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో జరిగిన పల్లెపండు 2.0 పనులకు సంబంధించి గత ఏడాది ఆగస్టు వరకు మాత్రమే బిల్లులు చెల్లింపులకు ఉత్తర్వులు వచ్చాయి. మిగిలిన ఎనిమిది నెలల బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. జిల్లాలో జరిగిన పనులు జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం సీసీ రోడ్లు, అప్రోచ్రోడ్లు, బీటీరోడ్డు, కాంపౌండ్వాల్స్, బీటీరోడ్డు పనులన్నీ కలిపి మొత్తం 1,763 పనులు మంజూరయ్యాయి. వీటికి రూ.184.93 కోట్ల మేర మంజూరు చేశారు. ఇందులో 479 పనులు పూర్తవ్వగా వాటి కోసం రూ.50.02 కోట్లు ఖర్చు చేశారు. వివిధ దశ ల్లో 138 పనులు ఉన్నాయి. వాటి కోసం రూ.14.48 కోట్లు ఖర్చు చేశారు. ఆ లెక్కన మొత్తం రూ.64.50 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఆగస్టు వరకు జరిగిన పనులు రూ.10 కోట్లు వరకు ఉన్నాయి. మంజూరైన మొత్తంలో ఆమోదం తెలిపినవి రూ.36.29 కోట్లు పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు 24.40 కి.మీకి 1,462 పనులు మంజూరు అవ్వగా రూ.9.85 కోట్లు మంజూరు చేశారు. అలాగే సీసీ అప్రోచ్రోడ్లు 55.19 కి.మీ గాను 115 పనులకు రూ.28.73 కోట్లు, బీటీరోడ్లు 106.27 కి.మీ 148 పనులకు రూ.68.43 కోట్లు, కాంపౌండ్ వాల్స్ 3 కి.మీ 32 పనులకు రూ.2.72 కోట్లు, బీటీరోడ్లు(ఆర్అండ్బీ) 4.75 కి.మీ 6 పనులకు రూ.2.16 కోట్లు మంజూరు చేశారు. ఈ లెక్కన 184.93 కోట్లు పనులకు మంజూరు కాగా అందులో రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.14.48 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.36.29 కోట్లు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఉపాధి సాఫ్ట్వేర్తో ఇబ్బందులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రాంజీగా మార్పు చేశారు. సాఫ్ట్వేర్ను కూడా అందుకు అనుగుణంగా మారుస్తున్నారు. దీనివల్ల ఉపాధి పనులకు సంబంధించి పాత బిల్లులకు ఇబ్బంది కలగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఈఎస్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తోంది. అలాగే లేబర్ కాంపోనెంట్ వందశాతాన్ని కేంద్రమే భరిస్తోంది. ప్రస్తుతం పేరు, సాఫ్ట్వేర్ మారుస్తున్న నేపథ్యంలో మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ 60 శాతం కేంద్రం, రాష్ట్రం 40 శాతాన్ని భరించాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభ్తుత్వం తన వాటాను నిర్ణీత సమయంలోగా విడుదల చేయకపోతే, పాత బిల్లులు వీబీజీ రాంజీ సాఫ్ట్వేర్లో మెర్జ్ అయితే మెటీరియల్ కాంపోనెంట్ శాతం తగ్గే ప్రమా దం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెపండుగ 2.0 నిధుల విడుదలలో జాప్యం డబ్బులు రావాల్సి ఉంది ఎన్ఆర్జీఎస్ ద్వారా జరిగిన పనులకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు వరకు జరిగిన పనులకు బిల్లులు ఆప్లోడ్ చేయాలని ఆదేశాలొచ్చాయి. దీనికి తోడు ఉపాధి సాఫ్ట్వేర్ మారడం వల్ల కొంత ఆలస్యం అవుతోంది. బిల్లులు విడతల వారీగా నిధులు వచ్చిన వెంటనే విడుదల అవుతాయి. – చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఈ , పీఆర్ 2025 ఆగస్టు వరకు చేసిన పనులకే బిల్లుల అప్లోడ్ చేయాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే అంతవరకు దాదాపు రూ.10 కోట్లు వరకు మాత్రమే పనులు చేశారు. మొత్తం రూ.64.50 కోట్ల పనులు జరిగితే పది కోట్ల పనులకు మాత్రమే బిల్లులను ఆప్లోడ్ చేయాలని ఆదేశాలు రావడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఆగస్టు తర్వాతనే పనులు ఎక్కువగా జరిగాయి. ఆ పనులకు బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
పోలీసుల అదుపులోకి విలేకరి హంతకులు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన విలేకరి జగన్మోహన్రెడ్డి హత్య కేసులో నిందితులను వీకోట పోలీసులు కర్ణాటకలోని ఎలక్ట్రానిక్సిటీ పీఎస్ నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చి స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడి జడ్జి నిందితులకు 15 రోజుల రిమాండ్ విధిస్తూ మదనపల్లి సబ్జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. నేడు దీనిపై మరో పిటిషన్ వేసి స్థానిక పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కర్ణాటకలో అంత త్వరగా ఇవ్వని పీటీ వారెంట్ గత నెల 29న వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలం రేపింది. ఇందులో నిందితులుగా భావిస్తున్న అదే వీకోటకు చెందిన తమీమ్, అతని మేనత్త కొడుకు సుభాన్ తెలివిగా పాత కేసుల్లో కర్ణాటకలోని ఎలక్ట్రానిక్సిటీ పోలీసులకు హత్య జరిగిన రెండో రోజే సరెండర్ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి పీటీ వారెంట్ దాఖలు చేయగా వారు తిరష్కరించారు. దీంతో మళ్లీ ఇక్కడి పోలీసులు కోర్టు ఆర్డర్ ద్వారా పీటీ వారెంట్ తీసుకున్నారు. పలమనేరు కోర్టుకు తరలింపు నిందితులను కర్ణాటక నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య వీకోట సీఐ సోమశేఖర్రెడ్డి, ఎస్ఐ షేక్షావలి వారి సిబ్బందితో కలిసి గురువారం పలమనేరు కోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి వీరికి 15 రోజుల రిమాండ్ విధిస్తూ పలమనేరులో జైలు లేనందున మదనపల్లికి తరలించాల్సిందిగా ఆదేశించారు. నేడు పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ ఫైల చేసి నిందితులను కస్టడీకి కోరనున్నట్టు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. తేలనున్న వాస్తవాలు స్థానిక పోలీసులు పది రోజుల కస్టడీకీ కోర్టును కోరే అవకాశం ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు ఎన్ని రోజులనే విషయం నేడు తేలనుంది. ఆపై నిందితులను సమగ్రంగా విచారించాకే విలేకరిపై హత్యకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. -
ఉద్యోగోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ జూని యర్ కళాశాలల నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని నాన్ టీచింగ్ అసోసియేషన్ కందాటి విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న నాన్–టీచింగ్ సిబ్బంది ఉద్యోగోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. ఇటీవల రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతులు కల్పించడం హర్షణీయమన్నారు. ఇదే విధంగా మిగిలిన కేడర్ల ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంబులెన్సుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ పూతలపట్టు(యాదమరి): మండల పరిధిలోని రంగంపేట క్రాస్ వద్ద క్షతగాత్రులతో ప్రయాణిస్తున్న అంబులెన్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. స్థానికుల కథనం మేరకు.. గురువారం మధ్యాహ్నం చితూరు నుంచి తిరుపతి వైపు అంబులెన్సు వాహనం ప్రయాణిస్తోంది. అదే సమయంలో పాలకూరు వైపుగా వస్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్ వద్ద మలుపు తిరుగుతుండగా అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సు బోల్తా పడి దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న సిబ్బందితో పాటు రోగులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, వాహనదారులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
వేతనాల వెం‘బడి’!
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పనిలేని చోట జీతాలు.. పిల్లలు లేని చోట టీచర్లు అన్నట్టు తయారయ్యాయి. లోపాలను గుర్తించినా, నివేదికలు సిద్ధంగా ఉన్నా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖాళీ బెంచీలకు పాఠాలు విద్యార్థులే లోని చోట సైతం టీచర్లు యథేచ్ఛగా కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులకంటే టీచర్లే ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల కనీసం విద్యార్థి, టీచర్ల నిష్పత్తి లేకపోయినప్పటికీ అదనంగా మరికొందరు టీచర్లు తిష్టవేసి ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారు. ఇది కేవలం బాధ్యతా రాహిత్యమే కాదు, అక్షరాలా ప్రజాధనాన్ని దోచిపెట్టడమేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. లోపాల నివేదికలు బుట్టదాఖలు ఎయిడెడ్ పాఠశాలల్లోని లోపాల నివేదికలను విద్యాశాఖ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నా రు. అక్రమాలను అరికట్టే బాధ్యతను ఆర్జేడీ, ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగించినా క్షేత్ర స్థాయిలో మార్పు మాత్రం శూన్యమే. ప్రక్షాళన ఎప్పుడో? ఎయిడెడ్ పాఠశాలల్లో నిధులు వృథా అవుతున్నా యి. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొర త వేధిస్తుంటే, మరోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థ ల్లో పని లేకుండానే వేతనాలు చెల్లించడం ఎంత వరకు సమంజసం అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేని పిల్లలను ఉన్నట్టు చూపించి..! కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు లేని విద్యార్థుల ను ఉన్నట్లు చూపించి పోస్టులను కొనసాగిస్తూ చాన్నాళ్లుగా లబ్ధిపొందుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం యూడైస్ లెక్కలను పక్కా గా నిర్వహిస్తోంది. ఆధార్ నంబర్ ప్రకారం విద్యార్థి పేరు ఒక పాఠశాలలోనే ఉండాలి. జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులున్నప్పటి కీ తప్పుడు నివేదికలు అమలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఆ యాజమాన్యాలతో లోపాయికారీ అవగాహన చేసుకుని.. కోర్టుపరమైన సాకులను బూచీగా చూపుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 71,029 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,184 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ప్రకృతి పచ్చ సంపద
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి బంగారమైంది. ఇవి అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అనధికారికి అనుమతులతో రేయింబవళ్లు యథేచ్ఛగా పొరుగునే ఉన్న తమిళనాడుకు తరలించేస్తున్నారు. అయినా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఈ నెలవారీ మామూళ్లలో ఓ పచ్చ మంత్రికీ వాటాలు వెళుతున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడడంతోపాటు ప్రకృతి విధ్వంసం అవుతోంది. సాక్షి టాస్క్ఫోర్స్: ప్రకృతి సంపదను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికార బృందం అనుమతులు ఇచ్చింది. అధికారుల అండతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో మైనింగ్ దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించే సొమ్ము నుంచి నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మంత్రికి కూడా అక్రమ సంపాదనలో నెలనెలా డబ్బుల పంపుతున్నట్టు కూటమికి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజక వర్గం నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ సంపాదనలో మామూళ్లు తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని చెప్పడం విశేషం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, చంద్రగిరి, నగరి, గంగాధనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాల పరిధిలో గత రెండేళ్లుగా విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాల విషయం ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక, మీడియాలో ప్రసారం అవుతున్నా.. రెండు రోజులు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడానికి కారణం ఏమిటని కూటమి నేతలను ఆరా తీస్తే.. ‘మాదేం లేదు. నెలనెలా ఆ మంత్రికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది, ఈ నెల రాలేదు’ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు అడ్డుకోవడం మర్చిపోయారు ప్రకృతి సంపదను అక్రమంగా తవ్వి, తరలించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపేవారు. కేసులు పెట్టడం, అపరాధ రుసుములు వసూలు చేయడం చేసేవారు. అందుకే అక్రమార్కులు ఆ పనులకు వెళ్లాలంటే భయపడేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ప్రయత్నాలే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణా గురించి అధికారులకు సమాచారం ఉన్నా.. స్థానికులు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. అక్రమాలకు అధికారే అనధికారిక అనుమతులు ఇవ్వడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగలాపురం మండలంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలుగుడిపాల మండలం మంచినీళ్ల కుంట వద్ద డంప్చేసిన ఇసుక అనుమతులు ఇలా.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో భారీగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి, తరలించాలంటే ముందుగా జిల్లా అధికారి ఒకరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించాలి. ఆ తరువాత స్థానికంగా ఉన్న నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో పంపకాలు ఇలా ఉంటే.. మంత్రి గారికి ప్రతి వాహనానికి రూ.వెయ్యి ఇచ్చేయాలి. అలా రోజుకు ఎన్ని వాహనాల ద్వారా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే అన్ని రూ.వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సత్యవేడు నియోజక వర్గంలోనే 41 క్వారీలు ఉంటే.. రోజుకి 50 వాహనాలు, నెలకు 25 వేలు ట్రిప్పులు తరలిస్తున్నాయి. ఈ లెక్కన ఒక సత్యవేడు నియోజక వర్గం నుంచే నెలకు సుమారు రూ.3 కోట్లు మామూళ్లు వెళుతున్నట్లు అంచనా. ఒక్క సత్యవేడు నియోజక వర్గం నుంచే ఇలా ఉంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఏడు నియోజక వర్గాల నుంచి నెలకు ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నియోజక వర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు అధికారిక అనుమతులు రేయింబవళ్లు తరలింపు.. అక్రమ సంపాదన కోసం స్థానిక టీడీపీ నేతలు రేయింబవళ్లు ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాల ద్వారా తవ్వి పక్కనే ఉన్న తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్ల ద్వారా తరలించి తమిళనాడులో అధిక ధరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల వద్దకు గుర్తు తెలియన వ్యక్తులకు అనుమతులు ఉండవు. క్వారీల సరిహద్దుల్లోనే అనుచరులను కాపాలా ఉంచుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి క్వారీలోకి ప్రవేశిస్తుంటే.. వెంటనే అక్రమార్కులకు సమాచారం ఇస్తారు. కొత్త వ్యక్తిని ఫాలో అవుతారు. క్వారీ వివరాల కోసమే వెళ్లి ఉంటే వారిపై దాడులకు తెగబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విలేకరులు ఎవరైనా వెళితే.. వారిపైనా దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసింది. -
కిశోరి వికాసానికి నిధుల్లేవ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కిశోరి వికాసం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి స్పష్టం చేశారు. ఈ నెల 6న సాక్షి దినపత్రికలో ‘కిశోరి వికాసం ఎక్కడ?’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై ఐసీడీఎస్ పీడీ స్పందించారు. సమ్మర్ క్యాలెండర్, కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో బాలికలకు కిశోరి వికాసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యకమం నిర్వహణలో ఎవరైన అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు. జనగణనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సాగుతున్న జనగణన ప్రక్రి యలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని డీఆర్వో మోహన్కుమార్ హెచ్చరించారు. గురువారం క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతు న్న జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో, సమర్థవంతంగా నిర్వహించాలన్నా రు. జనగణన అత్యంత కీలకమైన కార్యక్రమమని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ సమాచారం కీలకమని తెలిపారు. జనగణనకు కేటాయించిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ విధుల్లోనే నిమగ్నం కావాలని స్పష్టం చేశారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంకా సందేహాలు వ్యక్తం చేయడం, క్షేత్ర స్థాయిలో తప్పుడు సమాచారం సేకరించడం వంటి చర్యలకు పాల్పడితే వారిని తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 2,712 మంది ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు. శాంతిపురం వంటి మండలాల్లో పనులు మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేనున్నానమ్మా!
కలెక్టర్ సుమిత్కుమార్ అధికార దర్పాన్ని పక్కనబెట్టారు. తనలో ఉన్న దయార్థహృదయాన్ని బయటకు తీశారు. ఉలుకూపలుకు లేకుండా ఓ చింత చెట్టు వద్ద పడి ఉన్న వృద్ధురాలిని అక్కున చేర్చుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటిచెప్పారు. వివరాలు.. చిత్తూరు నగరంలోని గంగనపల్లె కూడలిలో ఉన్న చింతచెట్టు వద్ద ఓ అవ్వ దీనస్థితిలో పడి ఉండడాన్ని కొందరు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. స్పందించిన కలెక్టర్ సుమిత్కుమార్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని గురువారం అధికారులను ఆదేశించారు. అవ్వ బాగోగులు చూసుకోవాలని మెప్మా అధికారులను ఆదేశించారు. దీంతో వృద్ధురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య సేవలందిస్తున్నారు. – చిత్తూరు అర్బన్ -
ఒక నెల.. ఒక గ్రామం.. తూతూమంత్రం!
మొదటి రోజు కనిపించిన లోపాలు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారం చూపాల ని తలపెట్టిన ఒక నెల..ఒక గ్రామం.. కార్యక్రమం మొదటి రోజే తూతూమంత్రంగా సాగింది. అధికారులు గ్రామాలకు వస్తున్నారా లేదా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారా అన్న సందేహం వ్యక్త మైంది. గురువారం జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఏదో మేలు చేసేలా తలపెట్టిన ఈ కార్యక్రమం అంతా షోయింగ్ కోసమేనని తేలిపోయింది. తహసీల్దార్లు ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి నెమ్మదిగా జారుకున్నారు. గంట కూడా గడపలేదు! ప్రతి గురువారం ఎంపిక చేసిన గ్రామంలో తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి రెవెన్యూ, ఇతర సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే, క్షేత్ర స్థాయిలో మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమంలోనే పరి స్థితి ఇందుకు భిన్నంగా కనిపించింది. కొన్ని చోట్ల సిబ్బంది కనీసం రికార్డులను కూడా తీసుకురాలేదు. మరికొన్ని గ్రామాల్లో అధికారులు గంట సేపు కూడా గడపకుండానే తిరుగుముఖం పట్టారు. అంతా తూచ్! ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం భూ సమస్యలు పరిష్కరించడం. అయితే మొదటి రోజు ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయో వెల్లడించడానికి కలెక్టరేట్ అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. గణాంకాలను గోప్యంగా ఉంచడం చూస్తుంటే, క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో పని జరగలేదని స్పష్టమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్ల క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ప్రజా ధనం వృథాయేనా? కార్యక్రమాల నిర్వహణ పేరిట హడావుడి చేస్తున్నారే తప్ప, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని క్షేత్ర స్థా యి పరిశీలనలో తేలుతోంది. అధికారులు కేవలం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకే పరిమితమవుతున్నారని, పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రెవెన్యూ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : రానున్న విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎలాంటి అలసత్వం వహించకూడదని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోడౌన్ను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నా రు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాల సరఫరా ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గోడౌన్ నుంచి మండల కేంద్రాలకు పుస్తకాల తరలింపు సాగుతోందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు ప్రా రంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలుండాలన్నారు. ఎంఈవోలు తమ పరిధి లోని పాఠశాలల అవసరాలకు అనుగుణంగా పుస్తకాల ఇండెంట్ పెట్టుకోవాలన్నారు. అనంతరం గోడౌన్లో స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. పాఠ్యపుస్తకాల గోడౌన్ మేనేజర్ సురేష్, సిబ్బంది వనజ, పాల్గొన్నారు. వేగం పెంచండి చిత్తూరు కార్పొరేషన్: ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానల్స్ వేగం పెంచాలని ట్రాన్స్కో చిత్తూరు జిల్లా నోడల్ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ సీజీఎం శోభా వాలంటీనా ఆదేశించారు. గురువారం ఎస్ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్ డివిజన్ అధి కారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడా రు. జిల్లాలో దాదాపు 19వేల సర్వీసుల ఏర్పాటు ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఇప్పటి వరకు 1000 ప్యానల్స్ బిగించారన్నారు. ప్రతిరోజు 150 ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నా రు. వర్క్ఆర్డర్లను నెలలోపు పూర్తి చేయాలని లేనిపక్షంలో ఏఈ పర్సనల్ అకౌంట్ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. డయల్ యువర్ సీఎండీలో జిల్లా పరంగా వస్తున్న ఫిర్యాదులను నమోదు చేసుకొని పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్బాబు, ఈఈలు మునిచంద్ర, సురేష్, మోహనమ్మ, డీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు పాల్గొన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధి లో శుక్రవారం కరెంటోళ్ల జనబాట నిర్వహించనున్నారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నారు. అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకం చిత్తూరు కలెక్టరేట్ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని డీఆర్వో మోహన్ కుమార్ కొని యాడారు. గురువారం కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మహోజ్వల శక్తి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర అల్లూరిదన్నారు. ఆయన పోరాట పటిమ ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నరేంద్రకుమార్, సీపీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ పాల్గొన్నారు. శిక్షణకు కలెక్టర్ చిత్తూరు కలెక్టరేట్ : ముస్సోరీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ముస్సోరీలోని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ పేరుతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి జూన్ 5వ తేదీ వరకు (మొత్తం 25 రోజుల) పాటు శిక్షణ నిర్వహించనున్నారు. ఈ నెల 10న ముస్సోరిలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఈ శిక్షణకు దేశ వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లను ఎంపిక చేయగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. కలెక్టర్ శిక్షణ ముగించుకుని జూన్ 6న తిరిగి జిల్లాకు విచ్చేయనున్నారు. అప్పటి వరకు జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ కలెక్టర్గా వ్యవహరించనున్నారు. -
నాణ్యత గాలికి
తమ్ముళ్లు బిల్లులు కోసం నాసిరకంగా పనులు చేసి వదిలేశారు. అనేక చోట్ల సీసీ రోడ్లు ఇప్పటికే పగళ్లు వచ్చాయి. వీటిపై పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల పనులను ఇంకా చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తయిన పనులకు వంద శాతం బిల్లుల చెల్లింపు జరగద ని, మొత్తం బిల్లుల్లో 15 శాతాన్ని డిపాజిట్గా ఉంచుకొని, క్వాలిటీ చెక్ చేసిన అనంతరం మొత్తాన్ని విడుదల చేస్తామని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
‘నారాయణ’ఆగడాలు అరికట్టాలి
– కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు, అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న నారాయణ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా రంగాన్ని వ్యాపారంగా మార్చేసి, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం నారాయణ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారిక షెడ్యూల్ రాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. నారాయణ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో విద్యార్థులను వేధించడం ఆపాలని, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్, లోహిత్, లిఖిత్, మనోజ్, గౌరవ్, గురు, నాని, లలిత్ పాల్గొన్నారు. రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే తవణంపల్లె: రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే జరగాలని జిల్లా సర్వే శాఖ డీడీ జయరాజ్ మండల సర్వేయర్లను ఆదేశించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న భూ రీసర్వేను ఆయన తనిఖీ చేశారు. గోనెపల్లెలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ భూముల రీసర్వేని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వేకు ముందు సర్వే సిబ్బంది నోటీసులు ఇస్తున్నారా.. లేదా సర్వే సక్రమంగా చేస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈకేవైసీ యాప్ ద్వారా తప్పనిసరిగా సర్వే చేయలని గ్రామ సర్వేయర్లను ఆదేశించారు. భూ రీసర్వేలో వీఆర్ఓలు, వీఆర్ఏలు గైర్హాజరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డీడీ రైతులతో మాట్లాడారు. భూముల గట్ల హద్దులను కచ్చితంగా చూపి గట్లు మేరకు రోవర్ సహాయంతో కో ఆర్డినేట్స్ చేసుకొని రీ సర్వే పారదర్శకంగా చేయాలని తెలిపారు. పైమాఘం, పుణ్యసముద్రం గ్రామాల్లో జరిగిన రీసర్వే వెక్టరైజేషన్ను తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేశారు. గత నెలలో హద్దు తగాదా ఫైల్ను తనిఖీ చేసి ఫోన్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడారు. కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎం. కృష్ణమూర్తి, మండల ప్లాంట్ సర్వేయర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
టమాట బాక్సు ధర రూ.350
పలమనేరు: పలమనేరు టమాటా మార్కెట్లో గురువారం 15 కిలోల బాక్సు రూ.350 దాకా పలకింది. భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పవేమోనని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇలాగే కొనసాగితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. బాక్సు రూ.400 విక్రయిస్తే కొంత మేర గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ.3లక్షలు ప్రస్తుతం ఈ ప్రాంతంలో హైబ్రిడ్ రకాలైన పవర్అప్, సాహో, జయహో, ప్రభాకర్ సీడ్స్, సింజెంటా కంపెనీలకు చెందిన రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఎకరంలో టమాట సాగుకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి అవుతున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. రైతుకు తప్ప అందరికీ లాభమే పంట కోసం వచ్చే కూలీలకు రోజుకు రూ.400, ర వాణా చేసే వారికి, మండీలోని కూలీలు, వ్యాపారు ల కమీషన్ ఇలా అందరికీ గ్యారెంటీ లాభాలుండగా కేవలం రైతుకు మాత్రమే నష్టాలు తప్పడం లేదు. 1000 బాక్సులైతే పంట దిగుబడి బాగా వచ్చి 1000 బాక్సులు కోస్తే ఇప్పుడున్న ధర రూ.350తో రూ.3.5 లక్షలు, బాక్సు ధర రూ.200 అయితే రూ.2 లక్షలు, సగటున రూ.250 అయితే రూ.2.5 లక్షలు మాత్రమే గిట్టు బాటు అవుతుంది. బాక్సు ధర రూ.400గా ఉంటేనే గిట్టుబాటు గా ఉంటోంది. కష్టంగా మారింది ప్రస్తుతం రోజుకు 50 బాక్సుల టమాటా మార్కెట్కు వేస్తున్నా. ఎకరా పొలంలో పంటసాగుకు రూ.2.7 లక్షలు ఖర్చుపెట్టా. ఇప్పు డున్న ధరలుంటే పెట్టుబడి దక్కుతుంది. ధరలు తగ్గుముఖం పడితే మా పరిస్థితి గోవిందా. అందుకే ప్రభుత్వం మద్దతు ధరను పెట్టాలి. – కృష్ణారెడ్డి, టమాట రైతు, పెద్దవెలగటూరు, పెద్దపంజాణి మండలం -
నేడు ఎడ్సెట్
తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఎడ్సెట్–2026 శుక్రవారం జరగనుంది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తిరుపతి జాపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 800 మంది, పుత్తూరు వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 160 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉండదని సూచించారు. బస్సుల్లో చోరీలు.. కుప్పం దొంగ అరెస్టు కృష్ణరాజపురం (బెంగళూరు): బస్సుల్లో వెళ్తూ ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు నగలను దొంగిలించడంలో పేరుగాంచిన, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బెంగళూరు రూరల్లోని హొసకోట పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపిల్లలు వాంతులు చేసుకుంటున్నారని చెప్పి మహిళల నగలను కొట్టేశారు. ఇదే మాదిరిగా ఓ వృద్ధురాలి మెడలో ఉన్న 74 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు హొసకోట పోలీసులు దర్యాప్తు నిర్వహించి, ముఠాలో ప్రధాన నిందితుడైన దివాకర్ను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు మోనిషా, గాయత్రి, ఇంద్ర కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దివాకర్ నుంచి రూ.12 లక్షల విలువైన బంగారం, రూ.3.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మామిడి పరిశ్రమలపై ప్రత్యేక నిఘా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి పరిశ్రమలపై ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉండాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో ఉద్యానవన శాఖ అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సీఎం నేరుగా సమీక్ష నిర్వహిస్తారన్నారు. ఆలోపు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.మామిడి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు రైతులకు సుమారు రూ.6.70 కోట్ల ప్రొటెక్షన్ కవర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బంగారుపాళ్యం, పూతలపట్టు, కుప్పం ప్రాంతాల్లోని పల్ప్ యూనిట్ల ప్రస్తుత పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రామాంజనేయులు, మురళి, కోటేశ్వరరావు, పరమేశ్వరన్ పాల్గొన్నారు. -
ఎస్వీ జూపార్క్ క్యూరేటర్గా అనురాగ్ మీనా
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 2020 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అనురాగ్ మీనా బుధవారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్) క్యూరేటర్గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ సంరక్షకుడిగా పదోన్నతి పొంది కర్నూలు సర్కిల్కు బదిలీ అయిన సెల్వం స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్కు చెందిన అనురాగ్ మీనా వన్యప్రాణుల నిర్వహణలో తనకున్న అపారమైన అనుభవంతో కొత్తగా బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు రైల్వే కోడూరులో సబ్–డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సబ్–డీఎఫ్ఓ)గా, ఆ తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నంద్యాలలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన అనురాగ్ మీనాకు ఎస్వీ జంతు ప్రదర్శనశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. -
జూదరుల అరెస్ట్
యాదమరి: అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్న జూదరులపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఆయన కథనం మేరకు...బుధవారం మండల పరిధి గొందివాండ్లవూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందేలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో దాడులు చేశామన్నారు. గొందివాండ్లవూరుకు చెందిన గోవిందరాజులు, తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన దామోదరంను అరెస్టు చేసి వారి నుంచి రూ.2,400 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మరి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. తెగి పడిన విద్యుత్ తీగలు తవణంపల్లె: మండలంలోని వెంగంపల్లెలో బుధవారం కరెంట్ తీగలు తెగిపడి మామిడి చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు ఎం.రెడ్డెప్ప తెలిపారు. వెంగంపల్లె సమీపంలో తన పొలంలో విద్యుత్ లేన్లు వెళుతున్నాయని చెప్పారు. రెండు రోజుల క్రితం కరెంటు తీగలు తెగిపడడంతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగినట్టు వెల్లడించారు. ఈ మేరకు తవణంపల్లె తహసీల్దార్, వీఆర్ఓకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 30 చెట్లు అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. ట్రాక్టర్ను ఢీకొన్న కంటైనర్ చంద్రగిరి: ముందు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్లోని ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన ముంగళిపట్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాకాల మండలం దామలచెరువు నుంచి తిరుపతికి ఓ ట్రాక్టర్లో కూలీలు మామిడికాయల ఖాళీ బాక్సులు వేసుకుని బయలుదేరారు. ట్రాక్టర్ ముంగళిపట్టు సమీపంలో వస్తుండగా బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న కంటైనర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న దామలచెరువుకు చెందిన కూలీలు గిరి, శోభ, గోపి, మంజు, డ్రైవర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ తీగలు పడి వ్యక్తి మృతి తిరుపతి రూరల్: విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం కై లాసపురానికి చెందిన ఓబుల్ నాయుడు, ప్రభావతి దంపతులు పదేళ్ల క్రితం తిరుపతిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీకి వచ్చి నివాసముంటున్నారు. హమాలీగా పనిచేసే ఓబుల్ నాయుడు బుధవారం పనులు ముగించుకుని వర్షం ఆగిన తరువాత నడిచి వెళ్తుండగా తన ఇంటికి సమీపంలోని ఓ విద్యుత్ తీగ తెగి అతనిపై పడింది. షాక్కు గురైన ఓబుల్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. పాలసముద్రం : మండలంలోని ఆముదాల పంచాయతీ, గొల్లకండ్రిగ బీసీ కాలనీలో గుక్కెడు నీటి కోసం స్థానికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పలువురు ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. నెల రోజుల క్రితం గ్రామంలోని తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు గురైంది. దీన్ని ఇంతవరకు రిపేరు చేయకపోవడంతో నీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. అధికారులు స్పందించి బోరు మోటారు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేయించాలని కోరారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఐచర్
గంగవరం: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో బుధువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పెద్దపంజాణి మండలం, దాసనంపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు నవీన్ అలియాస్ నరేష్(27) ఓ కోళ్ల హ్యాచరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పలమనేరు నుంచి పల్సర్ బైక్లో స్వగ్రామం దాసనంపల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని కోగిలేరు చెక్పోస్టుకు సమీపంలో వెళ్తుండగా పలమనేరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం బైక్ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువకుడి తల భాగంలో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి రైతులను ఆదుకోవాలి
బంగారుపాళెం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని మొగిలివెంకటగిరి గ్రామంలో మాజీ సమితి అధ్యక్షుడు తులసీరామకృష్ణారెడ్డి నివాసంలో స్థానిక నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండు రోజులుగా అకాలవర్షం, పెనుగాలల ధాటికి మామిడితోటల్లో కాయలు నేలపాలయ్యాయన్నారు. గాలీవానకు తోటల్లో టన్నుల కొద్దీ మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాలిన మామిడి కాయలను రైతులు మార్కెట్కు తీసుకు వెళ్తే వ్యాపారులు కిలో రెండు రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు వాపోయారు. గత సంవత్సరం పంట చేతికి అందినా గిట్టుబాటు ధర లేక నష్టాలపాలయ్యారన్నారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, మాజీ సర్పంచులు ప్రకాష్రెడ్డి, థామస్, రాజా, వడ్డెర కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మొగిలీశ్వర్, సోషియల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్కుమార్రెడ్డి, మాజీ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు మహేంద్ర, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, మాజీ మండల యూత్ అధ్యక్షుడు గజదీష్, ఉప సర్పంచులు రఘు, కుమార్స్వామి, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ఖాదర్బాషా, బాలాజీ, తగ్గువారిపల్లె జగదీష్, చిట్టి, త్రిలోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పవర్’లేని అధికారులు?
చిత్తూరు కార్పొరేషన్: పల్లె పాలనకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఏదో ఒక సాకుతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం లేదు. సర్పంచుల పదవీ కాలం ముగయడంతో జిల్లాలోని 622 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. కానీ వారికి వేతనాల చెల్లింపులు, ఇతర పనులకు అనుమతి ఇవ్వలేదు. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు లేకుండా అల్లాడుతున్నారు. అదే ఉద్యోగులకు నెలరోజులు జీతం ఇవ్వకపోతే ఉరుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదీ దుస్థితి పాలనా పగ్గాలు చేపట్టిన ప్రత్యేకాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. అధికారాలు కాగితాలపైనే తప్ప కార్యాచరణలో కనిపించడం లేదు. బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడుస్తున్నా వారికి ఏ మాత్రం అధికారాలు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ రెండో తేదీతో జిల్లాలోని 622 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. ఆయా స్థానాల్లో వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా కలెక్టర్ నియమించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 13 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల్లో వీధిలైట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చేతిపంపుల మరమ్మతులు, చిన్న చిన్న తాగునీటి ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా మండల పరిషత్ అధికారులు చేయిస్తున్నారు. వారు ఎంత పర్యవేక్షించినా వేతనాల విషయం వచ్చేటప్పటికి వారికి చేతి చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. కారణం ఆయా అధికారులకు చెక్ పవర్ లేకపోవడమే.రెండు నెలలుగా పెండింగ్ చర్యలు తీసుకుంటున్నాం ప్రత్యేకాధికారుల నుంచి ఆధార్ నెంబర్తో లింక్అయిన మొబైల్ నంబర్ ఇతర వివరాలను ఆప్డేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు చేయాలని తెలియజేశాం. పల్లెల్లో బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక అధికారుల థంబ్ ఆప్డేట్కు చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లిస్తాం. – సుధాకర్రావు, డీపీఓప్రత్యేకాధికారులకు డ్రాయింగ్ పవర్ తప్పనిసరి. బిల్లులపై సంతకాలతో పాటు స్టాంప్ తదితర ధ్రువీకరణలు నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో థంబ్ ఇంప్రషన్ వేస్తేనే బిల్లు పాసయ్యేది. కానీ నాలుగు రోజుల క్రితమే ఆయా ప్రత్యేకాధికారుల నుంచి తంబ్ ఇంప్రెషన్ అథారిటీ అనుమతుల కోసం మండల పరిషత్ అధికారులు ఆధార్ నెంబర్తో పాటుగా దాంతో లింక్ అయిన మొబైల్ నెంబర్ వంటి వివరాలను సేకరించారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు 622 పంచాయతీలు 5,914 వార్డులు ఉండగా వెయ్యి మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరికి నెలకు రూ.6 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల గ్రామాల్లో చేసిన పనులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కానీ, జనరల్ ఫండ్ నుంచి కానీ బిల్లుల చెల్లింపులు జరగడం లేదని గ్రామ పంచాయతీల అధికారులు వాపోతున్నారు. కనీసం పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇవ్వాలన్నా ప్రత్యేకాధికారి అనుమతితోనే ఇవ్వాల్సిన పరిస్థితి. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి వారికి వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. -
అరీష్.. అదుర్స్!
చిత్తూరు కలెక్టరేట్: అతను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో.. పెరిగింది వ్యవసాయ కుటుంబంలో.. చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. కానీ, లక్ష్యం మాత్రం ఆకాశమంత. పట్టుదలే పెట్టిబడిగా, కృషినే ఆయుధంగా మలచుకుని ప్రస్తుతం అమెరికాలోని కనెక్టికట్ దేశంలో వైద్య రంగంలో సర్జికల్ రోబోటిక్స్ విభాగంలో తనదైన ముద్ర వేస్తున్నారు చిత్తూరు జిల్లా యువ ఇంజినీర్ అరీష్ దండు. గంగాధరనెల్లూరు మండలం, లక్ష్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాలయ్య, శాంతి దంపతుల కుమారుడు అరీష్ దండు. తండ్రి సామాన్య రైతు. అరీష్ గ్రామీణ వాతావరణంలో పెరిగినా, ఆయన కళ్లు మాత్రం ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో ఉండే లక్ష్యాల వైపు చూసేవి. చిన్నప్పటి నుంచి వినూత్న ఆలోచనలతో ఉండేవారు. ఇంజినీరింగ్ విద్యపై మక్కువతో అంచలంచెలుగా ఎదుగుతూ అమెరికా చేరుకున్నారు. అక్కడ పదేళ్లకు పైగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హెల్త్కేర్ రంగాల్లో విశేష అనుభవం గడించారు. సాధారణ ఇంజినీరింగ్గా కెరీర్ను ప్రారంభించి, నేడు అత్యంత క్లిష్టమైన సర్జికల్ ఇన్నోవేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. భావితరాలకు మార్గదర్శి అరీష్ దండు ఈ ఏడాది ఏప్రిల్లో జాన్ ఎస్.మార్టినెజ్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో 150 మందికి పైగా విద్యార్థులకు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్మెటిక్స్) రంగాల ప్రాముఖ్యతను వివరించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన మెకానికల్ ఇంజినీరింగ్ సదస్సులో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. పల్లె బడిలో పడిన పునాది అరీష్ జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం నెల్లేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయన ఉన్నత చదువుల అనంతరం ప్రతిభకు గుర్తింపుగా అమెరికాలో అవకాశాలు వరించాయి. ప్రస్తుతం న్యూయార్క్ సమీపంలోని కనెక్టికట్లో ఉన్న మెడికల్ డివైజ్ కంపెనీలో 15 సంవత్సరాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అరీష్ దండు తన సాంకేతిక నైపుణ్యంతో రెండు అమెరికా పేటెంట్లను (యూఎస్ 11,585,042 బీ2) (యూఎస్ 11,993,890 బీ2) సాధించి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. సర్జికల్ జైన్లలో ఆయన చేసిన మార్పులు వైద్య పరికరాల రంగంలో మైలురాళ్లుగా నిలిచాయి. కేవలం వృత్తికే పరిమితం కాకుండా ఏఎస్ఎంఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రివ్యూయర్గా ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా వచ్చే ఇంజినీరింగ్ ఆవిష్కరణలను సమీక్షించడం, వాటికి దిశానిర్దేశం చేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సర్జికల్ రోబోటిక్స్లో సరికొత్త విప్లవం అరిష్ దండు రోబోటిక్ సర్జరీ విభాగంలో తన ముద్ర వేశారు. రోబోటిక్ ఆర్మ్, సర్జికల్ ఆర్మ్ వ్యవస్థల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. శస్త్ర చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో, తక్కువ రిస్క్తో జరిగేలా ఆయన డిజైన్ చేసిన పరికరాలు తోడ్పడుతున్నాయి. వైద్య సేవలు ఖరీదైనవిగా మారుతున్న తరుణంలో, నాణ్యత తగ్గకుండా ఉత్పత్తుల తయారీ ఖర్చును ఎలా తగ్గించవచ్చో ఆయన నిరూపిస్తున్నారు. -
కొత్త గృహాల ఊసేలేదు
గత ప్రభుత్వంకంటే ఇంకా భారీగా ఇంటి నిర్మాణాలు చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఊదరగొట్టింది. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఓ ఇంటి పునాదికూడా పడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పంచాయతీలవారీగా కూటమి నేతల ద్వారా పక్కా ఇళ్లకు అర్జీలను తీసుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు కాకుండా కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్ అధికారులకు వాటిని పంపారు. వీరి లెక్కమేరకు జిల్లాలో సుమారు 30 వేల మంది లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్లు మంజూరు కాకపోవడం కొసమెరుపు. -
పోరాటం ఉధృతం చేయాలి
చంద్రబాబు పుట్టిన ఊరినే కాదు..రాయలసీమను కరువుసీమగా మార్చి, రైతులను కన్నీళ్లు పెట్టించి పైశాచిక ఆనందాన్ని పొందే చంద్రబాబు ద్రోహాన్ని సీమ జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని చెప్పాలి. ఇది కేవలం నీటి సమస్యగా మాత్రమే చూడవద్దు. ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభం కావాలి.. లేదంటే పోరాటం ఉదృతం చేయాలి. –చెవిరెడ్డి మోహిత్రెడ్డి, వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రూరల్: ‘జగనన్న పాలనలో 90 శాతానికి పైగా పనులు పూర్తి అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసింది చంద్రబాబే అన్న నిజాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.. స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి ప్రజా ఉద్యమానికి ఊపిరిపోయాలి.’ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. భాకరాపేట సమీపంలోని లేక్వ్యూ రిసార్ట్స్లో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం – చంద్రబాబు మోసం’ అన్న అంశంపై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థి విభాగం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మోసాలు బట్టబయలయ్యాయని అన్నారు. కరువుసీమగా మార్చేందుకే బాబు కుట్ర -
జిల్లాలో స్తంభించిన కాలనీ ఇళ్ల నిర్మాణం
● ఆపసోపాలు పడుతున్న లబ్ధిదారులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం జిల్లాలో ఇళ్ల నిర్మాణం కొండెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాడి సొంతింటి కల నెరవేరకుండా పోయింది. రెండేళ్లుగా కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లూ మంజూరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకూ నిధులు మంజూరు చేయకుండా మొండికేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ ఇళ్లు అక్కడే ఆగిపోయాయి. వెక్కిరిస్తున్న మొండిగోడలను చూసి లబ్ధిదారులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో కాలనీ ఇళ్ల నిర్మాణాలపై సాక్షి ప్రత్యేక కథనం. పలమనేరు మున్సిపాలిటీలోని బొమ్మిదొడ్డి లేఅవుట్లో ఆగిన ఇళ్ల నిర్మాణాలు మొత్తం లేఅవుట్లు 609పలమనేరు: జిల్లాలో కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనేలేదు. గత ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో ఆగిన ఇంటి నిర్మాణ పనులకు సక్రమంగా బిల్లులందక అవి కొండెక్కాయి. ఇంతవరకు నిర్మాణాలు చేపట్టని మూడు వేల ఇళ్లను గతంలో రద్దు చేస్తూ ఆన్లైన్లో వారి వివరాలను డిలీట్ చేసింది. దీంతో ఇప్పటిదాకా ఇళ్లను కట్టుకోలేని నిరుపేదలకు ఇక కేటాయించిన స్థలాలు పోయినట్టే. మరోవైపు పీఎం ఆవాజ్ యోజనలో నిర్మించిన ఇళ్లను కూటమి ప్రభుత్వం చేసినట్టు బిల్డప్ ఇచ్చారే గానీ ఇప్పటిదాకా ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టలేదు. గత ప్రభుత్వంలో పేదల కల సాకారం సొంతిల్లు కట్టుకోవాలన్నదే ప్రతి పేదవాని కల. ఆ కలను నిజం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. జిల్లాలో 77,365 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 609 జగనన్న లేఅవుట్లున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా 2,389 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,330 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగిపోయింది. ఇందులో ఇప్పటికీ నాట్ స్టాటెడ్గా ఉన్న 3వేల ఇళ్లను ఆన్లైన్లో తొలగించింది. ఈ నెలఖరులో రావచ్చు కొత్త గృహాల విషయమై హౌసింగ్ అధికారులను వివరణ కోరగా.. ఇప్పటికీ అర్జీలు స్వీకరించి వాటిని ఆన్లైన్ చేశామన్నారు. ఈ నెలాఖరులో లబ్ధిదారులకు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా సమాచారం పూర్తయిన ఇళ్లు 46,163ఖర్చుచేసిన మొత్తం రూ.1000.687 కోట్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లు 31,203 -
దివికేగిన పోరాట యోధుడు
చిత్తూరు అర్బన్: పోరాట యోధుడు ఇక లేరు. ఈదల వెంకటాచల నాయుడు (72) బుధవారం అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తుదిశ్వాశ విడిచారు. పెనుమూరు మండలంలోని సాతంబాకం పక్కనున్న పెరుమాళ్లకండ్రిగలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఐదో తరగతి వరకు చదువుకున్న ఈ పాడిరైతుకు పెద్దగా ఆస్తుల్లేవు. ఆరెకరాల భూమి, నాలుగు ఆవులే ప్రపంచం. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప మరోలోకం తెలియని వ్యక్తి. పాలను డెయిరీకి పోసి నెలవారీ బిల్లులు తీసుకుని జీవనం సాగించేవారు. కానీ గత 25 ఏళ్లుగా జిల్లాలో ఏ మారుమూల గ్రామంలోనైనా సరే అన్నదాతకు కష్టమొస్తే ముందుంటాడు. ఆపదలో ఉన్న రైతుకు అండగా ఉండేవాడు. తన నిరసన గళాన్ని పాలకులకు వినిపించేలా సమస్యలపై పోరాటం చేసేవారు. ఆ నిరసన ఎలా ఉంటుందంటే రాజధానిలో ఏసీ గదుల్లో కూర్చున్న నేతలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది. చొక్కా వేసుకోకుండానే..! 2003లో చిత్తూరు నుంచి సాతంబాకం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన నాయుడు.. రూ.5 ఇచ్చి టికెట్టు ఇవ్వమన్నాడు. కండక్టర్ రూ.7 అడిగాడు. ఎందుకని అడిగితే చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి నాలుగు స్టేజీలు ఉండేవి. ఇప్పుడు ఐదో స్టేజీ పెరిగింది. అందుకే రూ.2 అదనంగా చెల్లించారని కండక్టర్ చెప్పడంతో ఆ ఏడాది జూన్లో నిసరన చేపట్టారు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 16 రోజుల పాటు వెంకటాచలంనాయుడు ఉద్యమం సాగింది. ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008లో 13 రోజుల పాటు దీక్షలు చేశాడు. ఇక దక్షిణాసియాలోనే ఒక వెలుగు వెలిగిన చిత్తూరు విజయా డెయిరీకి 2002లో అప్పటి చంద్రబాబు నాయుడు హయంలో పాలకవర్గం డెయిరీని మూసేయడంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. నాయుడు లోలోపల మదనపడిపోయారు. 2004లో చిత్తూరుకు ఓ పనిపై వచ్చిన వెంకటాచల నాయుడు విజయా డెయిరీ వైపు వెళ్లాడు. డెయిరీని, అక్కడ ఉన్న యంత్రపరికరాలు చూసి చలించిపోయారు. అప్పటి నుంచి విజయా డెయిరీని తెరిపించాలని నిరహారదీక్షలు, నిరవధిక దీక్షలు చేస్తూనే ఉండేవారు. డెయిరీని పునఃప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని 2007 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు దీక్షబూనాడు. పెనుమూరులోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని శుభ్రం చేయించాలని 2008లో 18 రోజలు దీక్ష చేశాడు. డెయిరీ తెరిపించాలని 2015లో హైదరాబాద్ వెళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటల పాటు నిరసన దీక్షబూనారు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను తొలగించడమేగాకుండా, క్రషింగ్ ఆపేయడంపై ఫ్యాక్టరీ వద్ద ఉద్యమం చేశారు. ఆ మొండి పట్టుదల ఆయన మరణం వరకు చొక్కా వేసుకోకుండా, కాళ్లకు చెప్పులు తొడగకుండానే కన్నుమూశారు.చేయిచాచని ఆత్మాభిమానం వెంకటాచలం నాయుడుది ఓ మధ్యతరగతి సాధారణ రైతు కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. పాలడబ్బులు, పొలంలో వచ్చే ఆదాయంతోనే పిల్లల బాధ్యతలు తీర్చారు. ఉద్యమాల బాట పట్టడంతో ఇల్లు గడవడానికి, ఊర్లు తిరగడానికి ఆరెకరాల పొలంలో ఓ ఎకరం అమ్మేశాడు. అయినా సరే ఉద్యమాలకు ఎవరినీ ఆర్థిక సాయం అడగని నైజం నాయుడిది. ఎవరైనా ఉద్యమాలకు డబ్బులిచ్చినా ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని, తనకు ఎలాంటి ఆర్థిక సాయం వద్దని వెంకటాచలం నాయుడు మొహంపైనే చెప్పేసేవారు.2018లో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపట్టిన వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంకటాచల నాయుడు గురించి తెలుసుకున్నారు. పూతలపట్టు సమీపంలో జరిగిన బహిరంగ సభలో వెంకటాచల నాయుడును స్టేజీపైకి పిలిపించి ఆయన పోరాట పటిమను మెచ్చుకుని అభినందించారు. తాము అధికారంలోకి వస్తే చిత్తూరు సహాకార పాల డెయిరీని పునఃప్రారంభిస్తామని వాగ్ధానం చేశారు. ఆపై వైఎస్.జగన్ సీఎం అవడం, విజయా డెయిరీని పునఃప్రారంభించడం తెలిసిందే. -
25 నుంచి పది సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల తేదీలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. లైఫ్ సర్టిఫికెట్ కష్టాలకు చెల్లు చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి ఏడాదీ ప్రారంభంలో పెన్షన్దారులు అందించే లైఫ్ సర్టిఫికెట్ల విషయంలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు పలు మార్పులు తీసుకొచ్చారు. సెల్ఫోన్ నుంచే నేరుగా నిధి అనే యాప్లో లైఫ్ సర్టిఫికెట్ అందించేలా అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే బ్యాంక్ లేదా, మీసేవ, పోస్టాఫీస్లో అందించాల్సి వచ్చేది. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోయేది. ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి వచ్చేది. జిల్లాకు సంబంధించి దాదాపు 17 వేల మంది పెన్షన్దారులు ఉన్నారు. మంచాన పడ్డ పెన్షన్దారుల వద్దకు నేరుగా ట్రెజరీ అధికారులే వెళ్లి పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. యాప్ అందుబాటులోకి వస్తే ఫోన్ నుంచే నేరుగా నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. పది గ్రామాల్లో నీటి సమస్య చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పది గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్ఈ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడుపల్లెలో–4 ట్యాంక్లు, శాంతిపురంలో–2, రామకుప్పం–1 చొప్పున రోజూ 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను 17 ట్రిప్ప్ల వరకు తిప్పుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే పలమనేరు, వి.కోట, పులిచెర్లలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో వ్యవసాయ బోరుతో అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గ్రామాల్లో నీటి సమస్య ఉంటే 08572–233098 నంబరులో సంప్రదించాలన్నారు. జూన్ చివరి నాటికి నీటి సరఫరాకు రూ.23 లక్షలు అవసరముంటుందని ప్రభుత్వానికి నివేదిక పెట్టినట్టు వెల్లడించారు. బకాయిలు రూ.64 కోట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నగరి నియోజకవర్గం నిండ్ర చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి రైతుల అధికారిక బకాయిలను ఖరారు చేసినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ బకాయిలకు ఎదురుచూస్తున్న 1,650 మంది రైతులకు ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆ రైతులందరికీ అసలు, మొత్తం, వడ్డితో కలిపి రూ.64 కోట్లను అధికారిక బకాయిలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సమస్యలో రైతులకు న్యాయం చేసేందుకు రూ.34 కోట్ల అసలుతో పాటు రూ.30 కోట్లు వడ్డీని క్లెయిమ్లో చేర్పించినట్టు వెల్లడించారు. ట్రిబ్యునల్ నియమించిన రిసొల్యూషన్ ప్రొఫెషనల్ రూ.64 కోట్లను చెల్లించాల్సిన బకాయిలుగా అంగీకరిస్తూ అధికారికంగా ధృవీకరించారన్నారు. రైతులకు అందాల్సిన నగదును అందజేసేలా న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జూలైలో ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ ఓల్డ్ బ్యాచ్) పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండు, మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రేపు ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: స్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 1,800కు పైగా పలు రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమో అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు–పుంగనూరు మార్గంలోని లింగాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలి యని సుమారు 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మారెప్ప కథనం.. గుర్తు తెలియని వాహ నం ఢీకొని ఓ వృద్ధుడు లింగాపురం బస్టాప్ వద్ద మృతి చెందాడనే స్థానికుల సమాచారంతో ఎస్ఐ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తెల్లరంగు షర్టు, నీలం రంగు లైన్లుకలిగిన లుంగీ, వంకాయ కలర్ టవల్తో ఉన్నాడని, అతని వివరాలు తెలిసిన వారు పెద్దపంజాణి పోలీసులకు తెలియజేయాలని కోరారు. బొలేరోను ఢీ కొన్న ద్విచక్ర వాహనం – ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని చీలంపల్లె వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కమ్మనపల్లె పంచాయ తీ పరిధిలోని ఎర్రకదిరేపల్లె గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు నాగార్జున (27), కృష్ణప్ప కుమారుడు నాగార్జున, కొండప్ప కుమారుడు గణేష్ ద్విచక్ర వాహనంపై బైరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. చీలంపల్లె వద్ద పలమనేరు వైపు వెళ్తున్న బొలేరోను వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో శంకరప్ప కుమారుడు నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నాగార్జున, గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైరెడ్డిపల్లె ఎస్ఐ చందనప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెత్త వేశారని మహిళపై దాడి చిత్తూరు అర్బన్: ఇంట్లోని చెత్త పక్కింటి వద్ద వేశారంటు ఓ మహిళపై దాడి చేసిన ఘటన చిత్తూరులోని పెద్ద దళితవాడలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. నగరంలోని పెద్ద దళితవాడకు చెందిన నాగమ్మ ఉదయం తన ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తను బయట వేశారు. ఈ విషయమై పక్క ఇంట్లో ఉన్న పవన్ తదితరులు నాగమ్మతో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరగడంతో నాగమ్మపై దాడి చేశారు. గాయపడ్డ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు లోక్ అదాలత్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి ముందస్తు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 40 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆ కోర్టు ఆదేశాల మేరకు ‘సమాధాన్–సమరోహ –2026’ కార్యక్రమంలో భాగంగా కక్షిదారులకు జిల్లా న్యాయసేవాసదన్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తామన్నారు. కక్షిదారులతో ముందస్తు లోక్ అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం విధానంలో కేసులు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముందస్తు లోక్ అదాలత్లో ఇరుపక్షాల దస్త్రాలను సుప్రీంకోర్టుకు నివేదించి.. అక్కడ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగే ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. -
ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీసిటీ సంయుక్తంగా మే 10 నుంచి వికలాంగ యువత కోసం ప్రత్యేక వెల్డింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు 6 మీటర్ల మేర తగ్గినట్లు కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘జలధార, నీటి భద్రత’ కింద చేపట్టిన మైనర్ ఇరిగేషన్ పనులు, ఫీడర్ కాలువల పునరుద్ధరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 313 రెమెడియల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ తరగతులకు విద్యార్థులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఈవో రాజేంద్రప్రసాద్, డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు. -
పునాది లేని చదువులు
ఫలితాల వివరాలు పరీక్షలకు హాజరైన బాలురు 10,711 మంది హాజరైన బాలికలు 10,194 మంది ఉత్తీర్ణులైన బాలురు 7,630 మంది ఉత్తీర్నులైన బాలికలు 8,403 మంది ఫెయిల్ అయిన బాలురు 3,081 మంది ఫెయిల్ అయిన బాలికలు 1,791 మందిచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 4,872 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. అంటే దాదాపు ఐదు వేల మంది భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకబడ్డారు? పాఠశాలల్లో పర్యవేక్షణ లోపమా? బోధనా పద్ధతుల్లో లోపమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విద్యార్థులు సైన్స్, సోషల్, గణితం, తెలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. బట్టీపట్టే పద్ధతికి అలవాటు పడడం వల్ల విద్యార్థులు అప్లికేషన్ మెథడ్ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయినట్లు తెలుస్తోంది. అమ్మభాషలోనూ అపజయమే జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అమ్మభాషలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగులో అక్షర దోషాలు లేకుండా రాయలేకపోవడం, వాక్య నిర్మాణం సరిగ్గా చేయలేకపోవడం వల్ల భాషా సబ్జెక్టుల్లో మార్కులు తగ్గుతున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ తెలుగులో ఫెయిల్ కావడం విద్యావ్యవస్థకు సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో అధ్వాన్నం గ్రామీణ ప్రాంతాలకంటే మెరుగైన సౌకర్యాలు, ట్యూషన్ సెంటర్లు ఉండే పట్టణ ప్రాంతాల్లోనే విద్యాప్రమాణాలు అధ్వాన్నంగా ఉండడం గమనార్హం. స్మార్ట్ఫోన్లు, సామా జిక మాధ్యమాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. మేల్కోకుంటే ముప్పే ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారులకు ఒక హెచ్చరిక. 4,872 మంది విద్యార్థులు ఒక జిల్లాలో ఫెయిల్ అయ్యారంటే, అది వ్యవస్థ వైఫల్యం. ఇప్పటికై నా అధికారులు, టీచర్లు పునరాలోచన చేయాలి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో విద్యాప్రమాణాలు పెంచే దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేకుంటే విద్యారంగానికి పెద్ద ముప్పు పొంచి ఉందనడంలో సందేహం లేదు. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాలు జిల్లాలో విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్రత్యేక తరగతులు, వంద రోజుల ప్రణాళిక అంటూ హడావుడి చేసినా ఎక్కువ మంది పిల్లలు మ్యాథ్స్, సైన్స్లో ఫెయిల్ అయ్యారు. అమ్మ భాష తెలుగులోనూ తక్కువ మార్కులు రావడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చదవలేని, రాయలేని స్థితిలో చాలా మంది విద్యార్థులు ఉన్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే విద్యా ప్రమాణాలు పతనమవుతున్నట్లు స్పష్టమవుతోంది. పదో తరగతి పరీక్షల ఫలితాలపై విశ్లేషణాత్మక కథనం. హిందీ213 మందితెలుగు2010 మందిసోషల్ 2549 మందిఇంగ్లీష్ 658 మందిసైన్స్3196 మందిగణితం2298 మందిసబ్జెక్టుల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థులు -
లెర్న్ టు లెర్న్ ముఖ్యం
పదో తరగతి తర్వాత విద్యార్థులు గ్రూప్ను మాత్రమే కాదు, లెర్నింగ్ ఎకోసిస్టమ్ను ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనిస్తే రాబోయే పదేళ్లలో అనేక కొత్త రకాల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులు ప్రస్తుత ట్రెండ్ను చూసి కోర్సు ఎంచుకోకూడదు. లెర్న్ టు లెర్న్ (ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం) అనే సూత్రాన్ని అలవర్చుకోవాలి. సైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా విశ్లేషణాత్మక ఆలోచన ఉన్న వారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చదువు సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలి. – పాండురంగస్వామి, రిటైర్డ్ డీఈవో, విద్యావేత్త పక్కవారితో పోల్చకూడదు పదో తరగతి దాటిన విద్యార్థులు మానసికంగా పెద్ద మార్పులకు లోనవుతుంటారు. ఈ సమయంలో వారిపై ర్యాంకుల ఒత్తిడి పెంచడం వల్ల వారిలో ఉండే సహజమైన నేర్చుకునే గుణం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్ని పక్కవారితో పోల్చకూడదు. ప్రతి బిడ్డలోనూ ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, అది జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. – రాజేంద్రప్రసాద్, డీఈవో, చిత్తూరు జిల్లా పునాది బలంగా ఉండాలి 10వ తరగతి ఫలితాలు రాగానే విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. ఈ దశలో వారికి సరైన కెరీర్ కౌన్సెలింగ్ అవసరం. విద్యార్థులు తమ బలాలను గుర్తించి, థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రేపటి పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సర్టిఫికెట్లు సరిపోవు. నైపుణ్యం కూడా ఉండాలి. ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కెరీర్. ఇప్పుడు డేటా సైన్స్, డిజైన్, లా, హ్యుమానిటీస్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అభిరుచి అనే పునాదిపై పడాలి. – రఘుపతి, ఇంటర్మీడియెట్ డీఐఈవో. చిత్తూరు జిల్లా -
● కెరీర్ టర్నింగ్ పాయింట్ మొదలు ● మంచి భవిష్యత్కు ఏ కోర్సు మంచిది ● లక్ష్యం స్పష్టంగా ఉంటేనే విజయం ● సరైన సమయంలో, సరైన కోర్సు, సరైన లక్ష్యం
ఎంఈసీతో విస్తృత అవకాశాలు ఎంఈసీలో మ్యాథ్మెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ గ్రూప్లో ఇంటర్ పూర్తి చేస్తే ఇటు మ్యాథమెటిక్స్ అర్హతగా బీఎస్సీతో పాటు కామర్స్ అర్హతగా బీకాం రెండు మార్గాలు ఉంటా యి. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించవచ్చు. కంప్యుటేషనల్, కాలిక్యులేషనల్ స్కిల్స్ ఉన్న వారికి వివిధ కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి. చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి టర్నింగ్ పాయింట్కు చేరుకున్న విద్యార్థులు పదిలమైన అడుగులు వేయాలి. పాఠశాల విద్యాభ్యాసం ఒక ఎత్తు అయితే.. ఇకమీదట వేసే అడుగులు మరో ఎత్తు. టెన్త్ తర్వాత ఎంచుకునే కోర్సులు భవితకు దారి చూపిస్తాయి. పిల్లలు తమకు ఇష్టమైన రంగం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా తమ ఇష్టాలకు అనుగుణంగా కాకుండా పిల్లల ఆసక్తిని గుర్తించి అటువైపు ప్రోత్సహించాలి. బైపీసీతో మెడిసిన్, ఇతర కోర్సులు మెడిసిన్ చేయాలనుకునే వారు బైపీసీలో చేరాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ పరీక్షలో ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, తదితర మెడిసిన్, అనుబంధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీ ఎంసెట్ ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, బి.ఫార్మసి వంటి విభాగాల్లోనూ బ్యాచిలర్ డిగ్రీ, ఆ తర్వాత పీజీ, పీహెచ్డీ చేసే అవకాశం ఉంది. అగ్రికల్చర్ డిప్లొ మా, వెటర్నరీ డిప్లొమా కూడా చేయొచ్చు. సీఈసీతో అకౌంట్స్.. సీఈసీలో ప్రధానంగా కామర్స్, ఎకనామిక్స్, సివి క్స్ సబ్జెక్ట్లు ఉంటాయి. సీఈసీ విద్యార్థులకు ఉన్న త విద్యాపరంగా బీకామ్ ముఖ్య మార్గంగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో ఎంకామ్, ఐసెట్ ద్వారా ఎంబీఏలో చేరవచ్చు. హెచ్ఈసీతో పోటీ పరీక్షల్లో ముందంజ సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో ముందంజ లో నిలిపే గ్రూప్ హెచ్ఈసీ. ఇందులో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. వీటిపై పట్టు సాధించడం వల్ల పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో సుల భంగా విజయం సాధించవచ్చు. హెచ్ఈసీ అర్హత గా ప్రవేశం లభించే బీఏలోనూ జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోవచ్చు. జిల్లా సమాచారం ఇంటర్ తర్వాత వెంటనే ఉపాధి పొందడానికి ఒకేషనల్ కోర్సులు ఉపయోగపడతాయి. ఇందులో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్తో పాటు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో నైపుణ్యాలు అందించే కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హోం సైన్స్, హ్యుమానిటీస్, పారా మెడికల్ విభాగాల్లో మొత్తం 27 ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఎంపీసీతో ఇంజినీరింగ్.. ఎంపీసీలో ప్రధాన సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, ఫిజి క్స్, కెమెస్ట్రీ ఉంటాయి. ఈ గ్రూప్ అర్హత ఆధారంగా ఎంసెట్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్సుడు తదితర ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాఽధించి ఇంజినీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంపీసీ విద్యార్థులు ఇంటర్ తర్వాత ఎన్డీఏ, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వంటి పరీక్షలతో డిఫెన్స్ రంగంలోనూ ఉద్యోగాలు పొందవచ్చు. డిగ్రీ మ్యాథ్స్, సైన్స్ కోర్సులతో పాటు ఆర్ట్స్, హ్యూ మానిటీస్, లా సంబంధిత కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది. ఐటీఐతో అవకాశాలు వృతి విద్య శిక్షణ, స్వయం ఉపాధికి ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్, ఎయి ర్ కండీషనింగ్ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్లు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. -
రేపటి వరకు గడువు
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు సంబంధించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులు ఈనెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. రీ కౌంటింగ్కు ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని ఆయా పాఠశాలల వెబ్సైట్లో హెచ్ఎం లాగిన్లో మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఫీజు ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలని డీఈవో వెల్లడించారు. ఆధునిక వైద్యంపై దృష్టి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల వినియోగాన్ని మరింత మెరుగుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ నుంచి మంగళవారం నిర్వహించిన ఇన్న్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ హెచ్ఎంఐఎస్ పోర్టల్ పై వర్చువల్ కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓతో పాటు డీసీహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్, ఎస్ఓతో పాటు జిల్లా ఆస్పత్రి సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఆధునిక పరికరాల వినియోగం, క్వాలిఫైడ్ రిసోర్స్ పర్సన్స్ మెయింటెనెన్స్, అలాగే అన్ని రకాల ఆరోగ్య డేటా సేకరణ విధానాలపై విస్తృతంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్య సేవల తీరును అధికారులు విశదీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగశశిభూషణ్రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ, ఎస్ఓ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. ‘కిశోర వికాసం’ ఎక్కడ? చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోరి వికాసం శిబిరాలు గాడితప్పుతున్నాయి. బాల, బాలికల సమగ్రాభివృద్ధికి కిశోర వికాసం వేసవి శిబిరాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 1 నుంచి జూన్ 9వ తేదీ వరకు ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జిల్లా ఐసీడీఎస్ అధికారుల అలసత్వం వల్ల ఈ శిబిరాలు గాడితప్పుతున్నాయి. శిబిరాల నిర్వహణపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు కనీస అవగాహన లేకుండా పోయింది. పకడ్బందీగా అమలు చేయాల్సిన ఐసీడీఎస్ అధికారులు క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేయకుండా కార్యాలయాలకు పరిమితమవుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో కిశోర వికాసం వేసవి శిబిరాల ఆశయం నెరవేరడం లేదు. శిబిరాల నిర్వహణకు మంజూరయ్యే నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. -
చరిత్ర సృష్టించిన విజయ్
కార్వేటినగరం: తమిళనాడు యువతకు హీరో.. పేదల ప్రజల ఆరాధ్య దైవం విజయ్ విజయం వెనుక విశేష కృషి ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక హీరోగా యువత గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని తెలిపారు. జగనన్న ఫొటోతో ఎన్నికల బరిలో దిగి తమిళ ప్రజల ఓట్లను గెలుచుకున్నాడన్నారు. జగనన్న బాటలో నడిచి ఇచ్చిన హామీలను తూచాతప్పకుండా అమలు చేయాలని సూచించారు. మొదటి నుంచి కూడా విజయ్ జగనన్నకు సన్నిహితుడిగా ఉంటూ వచ్చారని, ఒక హీరో స్థాయిలో ఉంటున్న విజయ్ ఎక్కడా గర్వపడకుండా జగన్మోహన్రెడ్డి ఫొటో పెట్టుకుని ఓట్లు అడగడం ఆయన హుందాతనానికి నిదర్శనమన్నారు. -
పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు
– వందశాతం అర్హత సాధించిన విశ్వం విద్యార్థులు తిరుపతి అర్బన్: తమ సంస్థల్లో శిక్షణ పొందిన విద్యా ర్థులు పాలిసెట్–2026లో ఉత్తమ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథ్ రెడి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు శిక్షణ పొందిన విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజియన్లోనూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే జీ. భరణి 120కి 118 మార్కులు, మునిశంకర్, బి. హర్షిత్, కే. హర్షవర్ధన్, ఎన్. హాసిని, కే. పవ్యశ్రీ తదితరులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. అలాగే 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్ స్కూల్ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ తులసి విశ్వనాథ్ రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి–బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శ న భాగ్యం కల్పించారు. తరువాత ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఆస్థాన మండపానికి తీసుకెళ్లి కొలువుదీర్చారు. ఉదయం 9 నుంచి 10, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని జరిపించారు. అనంత రం స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. -
తిప్పించుకుంటున్నారు!
బడా నాయకులు, వ్యాపార వేత్తలకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతుల విషయంలో పలు కొర్రీలు పెడుతున్నాయి. వారి సొత్తు తాకట్టు పెట్టుకుని రుణం ఇవ్వడానికి కూడా సవాలక్ష షరతులు పెడుతున్నాయి. కొందరు బ్యాంకర్లు రుణం ఇవ్వడం లేదని చెప్పలేక రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగడం వల్ల రైతులు దినసరి ఆదాయాన్ని కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. కాణిపాకం: జిల్లాలో 220 వరకు బ్యాంకులు ఉన్నాయి. ఇందులో కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్లపై కొత్తగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. గ్రాముకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు మాత్రమే రుణం ఇస్తామని చెబుతున్నాయి. మార్కెట్లో బంగారం విలువ పెరిగినా, బ్యాంకులు మాత్రం తక్కువ మొత్తానికే పరిమితం కావడం రైతుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పలు బ్యాంకులు అదనపు పత్రాలు, హామీలు కోరుతూ రుణాల ప్రక్రియను క్లిష్టతరం చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకుల అధికారులు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. గట్టిగా అడిగితే సాకులు చెబుతూ రేపు, మాపు అంటున్నారు. ఒకప్పుడు సులభంగా లభించిన రుణాలు ఇప్పుడు రైతులకు అందకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. మామిడి రైతుల ఆవేదన జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ సీజన్లో మామిడి రైతులకు నగదు అవసరం అధికంగా ఉంటుంది. తోటల నిర్వహణ, కోత, రవాణా ఖర్చులు పెరగడంతో రుణాలపై ఆధార పడాల్సి వస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు డబ్బు అవసరం ఎక్కువగానే ఉంటోంది. ఇలాంటి కీలక సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యాపార వర్గాలు, ఇతర రంగాల వారికి రుణాలు సులభంగా మంజూరు చేస్తున్న బ్యాంకులు, రైతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రుణం కోసం పనులు మానేసి రోజులు, వారాల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుండడంతో రైతుల దినసరి ఆదాయం దెబ్బతింటోంది. రుణాల కోసం బ్యాంకర్లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే తాము మరింత ఆర్థిక సంక్షోభంలోకి జారిపోవడం ఖాయమని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బాబు (పేరు మార్చాం) అనే రైతు మూడేళ్ల క్రితం చిత్తూరు నగరం హైరోడ్డులోని ఒక బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. రెండేళ్లు రెన్యువల్ చేయించాడు. గత ఏడాది పూర్తిగా డబ్బులు కడితేనే రెన్యువల్ చేస్తామని అధికారులు షరతు పెట్టారు. దీంతో అతను పాత అప్పు చెల్లించి, కొత్త రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రెన్యువల్ చేసి కొత్త రుణం ఇవ్వాలని అడిగాడు. బ్యాంకర్లు శనివారం రమ్మన్నారు. శనివారం వెళితే.. సోమవారమన్నారు. ఇలా తిప్పించుకుంటుండడంతో చేసేది లేక మరో బ్యాంకును ఆశ్రయించాల్సి వచ్చింది. రెన్యూవల్కు బ్రేకులు.. కొత్త రుణాలకు తాళం పాత రుణాలను కష్టపడి చెల్లించిన రైతులకు కూడా కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రెన్యువల్ ప్రక్రియలో జాప్యం చేస్తూ బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరికి చిన్న చిన్న కారణాలు చూపుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. పాత రుణాలను తీర్చేందుకు రైతులు ప్రైవేట్ అప్పులు చేసి చెల్లించినా, కొత్త రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ అప్పుల ఒత్తిడి, మరోవైపు బ్యాంకు రుణాలు అందకపోవడం రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. -
గాలి వాన బీభత్సం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ట్రాన్స్కో చిత్తూరు అర్బన్, రూరల్ డివిజన్ల పరిధిలో ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాలలోని వివిధ చోట్ల కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్, లైన్లు నేలవాలాయి. పలు ప్రాంతాల్లో మొక్కలు, చెట్లు లైన్ పై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివానతో మొత్తం దాదాపుగా రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు ఈఈలు మునిచంద్ర, సురేష్ తెలిపారు. ఈమేరకు 8 మీటర్ల కరెంటు స్తంభాలు 52, 9.1 మీటర్ల స్తంభాలు 36, ట్రాన్స్ఫార్మర్లు 27 మరమ్మ తుగు గురైనట్టు వెల్లడించారు. -
దాడులు చేస్తే వడ్డీతోసహా చెల్లిస్తాం
– ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల తిరుపతి తుడా: ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై రోజురోజుకూ అధికార పార్టీ కార్యకర్తలు, నేతల దాడులు అధికమయ్యాయి. దశరథరామిరెడ్డికి రెండు కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తలపై తీవ్రంగా గాయపరిచా రు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మాత్రం దుండగులపై కేసులు పెట్టకుండా దశరథరామిరెడ్డిపైనే కేసు నమోదు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాయకుండా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలి’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసు లు హెచ్చరించారు. మంత్రి మండిపల్లె రామ్ప్రసాద్ రెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఎవరైతే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
హీరో అంటే విజయ్ లాగా ఉండాలి!
నగరి : హీరో అంటే విజయ్లాగా ఉండాలని మాజీ మంత్రి ఆర్కేరోజా కొనియాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అత్యధిక సీట్టు సాధించడంపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సింగిల్గా పోటీచేసి తన స్టార్ ఇమేజ్ని విజయ్ నిరూపించుకున్నారన్నారు. తన సత్తా చాటుకున్నాడని చెప్పారు. ఆయనను నమ్ముకున్న అభిమానులకు, కేడర్కు నేడు భరోసా లభించిందన్నారు. మన రాష్ట్రంలోనూ పవర్ స్టార్ ఉన్నారని, ఆయన సింగిల్గా పోటీచేసే దమ్ములేక పాలేరులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్ట్ శిక్షణ చిత్తూరు రూరల్ (కాణిపాకం ): అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే నైపుణ్యాల పెంపు లక్ష్యంగా చిత్తూరు నగరంలోని అపోలో ఇన్న్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్ఆర్)లో రెండు రోజుల బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్), అడ్వాన్డ్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ (ఏసీఎల్ఎస్) శిక్షణ కార్యక్రమం సోమవా రం ప్రారంభమైంది. ఏఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జెన్ అగస్టీన్, అకడమిక్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 13 మంది అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్టర్లు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. వి‘జయహో’! చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ విజయం సాధించింది. చిత్తూరు నగరంలో సోమవారం విజయ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గాంధీ విగ్రహం కూడలి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమ అభిమాన హీరో విజయ్ ముఖ్యమంత్రి కానుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతరకు పటిష్ట భద్రత చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించే గంగ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తామని డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. సోమవా రం చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న గంగ జాతరపై నిర్వాహకులతో పోలీసు అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. -
అవినీతి ‘వినోద’ం!
చిత్తూరు కలెక్టరేట్ : సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్ అక్రమాలపై నిరసనలు మిన్నంటాయి. దాదాపు కోటి రూపాయల వరకు ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించిన ఏడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) సోమ వారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టింది. ఏడీ అవినీతి వ్యవహారంపై కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పందించారు. దీనిపై సమగ్రంగా విచారించేందుకు ఓ ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. ఏడీ అక్రమాలకు సంబంధించి జేఏసీ సంఘం ఆధారాలతో సహా కలెక్టర్కు అందజేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు ఉమా పతి పిళ్లై, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, సుమతి, లీలాపతినాయుడు పాల్గొన్నారు. పథకాల పేరుతో దోపిడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నషాముక్త్ భారత్ అభియాన్ పథకంలో మత్తు పదార్థాల నివారణపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉండగా, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే రూ.8.94 లక్షల వరకు ఏడీ స్వాహా చేసినట్లు జేఏసీ నాయకులు ఆరోపించారు. ఇతర జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు నివేదికలను సృష్టించి నిధులు డ్రా చేసినట్టు పేర్కొన్నారు. వయోవృద్ధుల చట్టాల ప్రచారానికి కేటాయించిన రూ.16 లక్షలను క్షేత్ర స్థాయిలో ఖర్చు చేయకుండానే తన అనుకూల వ్యక్తుల పేరుతో మళ్లించారని నాయకులు వెల్లడించారు. నిధుల మళ్లింపులో ‘వినోద’ మార్కు తొమ్మిది నెలల్లోనే రూ.కోటి దాకా..! ఏడీ వినోద్ గత 30 ఏళ్లుగా ఇదే జిల్లాలో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్గా పనిచేస్తూ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఉద్యోగోన్నతి పొందిన కేవలం 9 నెలల్లోనే దాదాపు కోటి రూపాయాలు ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీ అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. దివ్యాంగుల నిధులు దిగమింగిన ఏడీ -
చిత్తూరుకు నీళ్లు!
ఇంకెన్నాళ్లు.. చిత్తూరు నగర వాసుల డ్రీమ్ ప్రాజెక్టు అడవిపల్లె నుంచి మంచినీటిని తీసుకురావడం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటుతున్నా ఈ పనులు నత్తలతో పోటీపడుతున్నాయి. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారీ మరో ఆర్నెళ్లల్లో చిత్తూరుకు తెలుగుగంగ నీటిని అందిస్తామని వాగ్ధానం చేసి వెళ్లిపోతుంటారు. కానీ క్షేత్రస్థాయి పనులను పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. చిత్తూరు–పెనుమూరు క్రాస్ వద్ద మట్టికొట్టుకుపోయిన పైపులైన్లు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరానికి తొలుత ఒక టీఎంసీ తెలుగుగంగ నీటిని ఇవ్వడానికి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రతిపాదన 2018లో మొదలైంది. అన్నమయ్య జిల్లాలో ఉన్న కెవి.పల్లె మండలంలో అడవిపల్లె రిజర్వాయర్ ఉంది. ఇక్కడ 18 టీఎంసీ నీళ్లను ఒడిసి పట్టొచ్చు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నిర్మాణాలు పూర్తయితేనే అడవిపల్లెకు తెలుగుగంగ నుంచి నీళ్లు వచ్చి చేరుతాయి. ఈ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరు నగరానికి నీళ్లు తీసుకురావాలనే లక్ష్యంలో రూ.250 కోట్లతో ఉన్న అంచనాలు ప్రస్తుతం రూ.279 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తంలో కేంద్రం వాటా రూ.62.29 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.24.51 కోట్లు, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ వాటాగా రూ.184 కోట్లు ఉంది. ఇందులో కేంద్రం అమృత్ 1.0 కింద రూ.46 కోట్లు విడుదల చేయగా, 2.0 కింద రూ.30 కోట్లు విడుదలయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్ర వాటాగా రూ.18 కోట్లు విడుదల చేశారు. ఇది కాకుండా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.104.22 కోట్లు అప్పు చేయగా, రూ.62 కోట్లు 14వ ఆర్థిక సంఘ నిధుల నుంచి భరించింది. అయినాసరే అడవిపల్లె రిజర్వాయర్ పనులు పూర్తికాలేదు. మోయలేని భారం అడవిపల్లె ప్రాజెక్టు పనులను జూన్లోపు పూర్తిచేస్తామని ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతేడాది సైతం ఇలాగే చెప్పారు. కానీ పనులు మాత్రం పూర్తికాలేదు. ఎప్పుడవుతుందో కూడా స్పష్టతలేదు. ఇక ప్రతీనెలా బ్యాంకుకు రూ.1.15 కోట్ల మేర నెలవారీ వాయిదాలు చెల్లించడానికి చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పడుతున్న ఇబ్బందులు గుదిబండగా మారాయి. కలెక్టర్ కల్పించుకుని పబ్లిక్హెల్త్, జాతీయ రహదారులు, మునిసిపల్ కార్పొరేషన్ శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి.. వెంటపడితే తప్ప ఈ పనుల్లో పురోగతి కనిపించే అవకాశంలేదు. -
కదలని పనులు
92 కి.మీ దూరం పనులు చేయాల్సిన ఈ ప్రాజె క్టు ప్రస్తుతం 75 కి.మీ వరకు పూర్తయ్యాయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా 60 శాతం మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. పైపులైను పను లు ప్రస్తుతం చిత్తూరు సమీపంలోని పెనుమూరు క్రాస్ వద్ద ఆగిపోయింది. పూతలపట్టు సమీపంలోని రంగంపేట కూడలి, పీలేరు ప్రాంతాల్లో జాతీయ రహదారిపై రోడ్డును కట్ చేసి అందులో పైపులు పెట్టాల్సిన పనులు కదల్లేదు. దామలచెరువు సమీ పంలోని పుదిపట్లబైలు సమీపంలో 37 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రిజర్వాయ్లోపల ఇన్టేక్ వెల్ (బావి) పనులు పూర్తికాలేదు. చిత్తూరు నగరంలోని కై లాశపురం వద్ద 16 లక్షల లీటర్ల నిల్వ చేసే ట్యాంకు నిర్మించాల్సి ఉంది. నగరంలో 60 కి.మీ వరకు పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులు అసలు ప్రారంభించనేలేదు. -
నియామకాలు.. పదోన్నతులు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాపరిషత్ పరిధిలో సోమవారం నియమాకాలు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. సోమవారం జెడ్పీలోని చైర్మన్ చాంబర్లో ఈ కార్యక్రమంలో కారుణ్య నియమాకం కింద సుమేష్, చందుసాయి, జాహ్నవిని నియమించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అదేవిధంగా అటెండర్లుగా పనిచేస్తున్న 12 మంది ఉద్యోగులు మోహన్రాజు, కుమారస్వామి, లక్ష్మి, సురేంద్రబాబు, రాధరాణి, గిరిషా, శారద, సుజాత, లక్ష్మణ, ఇందిరమ్మ, లోకేష్బాబు, పద్మావతికి రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చారు. రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులు ముజీబర్రెహ్మన్, గీత, యువరాజ్, ప్రమీల, స్వప్న, కృష్ణామూర్తి, ఢిల్లీప్కుమార్, రామానూజుల, సుధాకర్లకు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
హుండీలో చోరీ
గుడిపాల: మండలంలోని 189 కొత్తపల్లె పంచాయతీ మిట్టయిండ్లు గ్రామంలోని వినాయకస్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రెండు హుండీలను పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.10 వేల నగదును చోరీ చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. అలాగే గుడి తలుపు లను పగులగొట్టి చిందరవందర చేశారని పేర్కొన్నారు. గుడి పక్కన ఉన్న ఒక సైకిల్ను కూడా అపహరించారని తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఇద్దరు దొంగల అరెస్టు – ద్విచక్ర వాహనం, 100 సెల్ఫోన్లు స్వాధీనం బంగారుపాళెం : ఇద్దరు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 100 సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. వారు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని నలగాంపల్లె ఫ్లైఓవర్ వద్ద ఆదివారం సాయంత్రం సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. విచారణలో అతను పాత నేరస్తుడు దాసరి రాముగా తేలిందన్నారు. అతను పెద్దపంజాణి మండలం రాయల్పేట గ్రామం తాయారమ్మ కాలనీకి చెందిన వాడని, ప్రస్తుతం బంగారుపాళెం ఎస్సీ హాస్టల్ సమీపంలోని పాత అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద అద్దె గదిలో ఉంటున్నట్టు గుర్తించామన్నారు. అతను చోరీలకు పాల్పడుతున్నట్టు తేలిందన్నారు. అతని నుంచి రూ.90 వేల విలువైన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో వ్యక్తి తగ్గువారిపల్లె కసాయి వీధికి చెందిన సుబ్రమణ్యంను అరెస్టు చేసి అతని నుంచి బిల్లులు లేని 98 సెల్పోన్లు, మరో రెండు సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.5.26 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. 8న ఉపనయన మహోత్సవం తిరుపతి కల్చరల్: రేణిగుంటలోని రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో ఈనెల 8వ తేదీ ఉదయం 7 నుంచి 8.20 గంటల వరకు సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించనున్నట్టు పీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరసింహాచార్య, రేణిగుంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. ఎన్జీఓ కాలనీలోని జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యాలయంలో ఆదివారం ఉపనయన మహోత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కుటుంబీకులు తమ పేర్లను ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఇందుకోసం ఎలాంటి ఫీజు లేదని, ఉచితంగానే పూజా సామగ్రిని సైతం అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం సైతం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9849120030, 9440855423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రెడ్డి ప్రకాష్, బాలాజీ శర్మ, శివకుమార్, కల్యాణకుమార్, డాక్టర్ చక్రపాణి పాల్గొన్నారు. -
రెండు దుకాణాల్లో చోరీ
శాంతిపురం: మండల కేంద్రమైన శాంతిపురంలోని కుప్పం–పలమనేరు జాతీయ రహ దారి పక్కన ఉన్న మద్యం, పెయింట్స్ దుకాణాల్లో శనివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కుప్పం – పలమనేరు జాతీయ రహదా రి సమీపంలో చికెన్ దుకాణాలు ఉన్నాయి. వాటి వెనుక ఒక మద్యం దుకాణం ఉంది. దొంగలు శనివారం రాత్రి దుకాణం వద్దనున్న కెమెరాలను కర్రతో పక్కకు తిప్పి తాళాలు పగులగొట్టి షట్టర్ను తెరిచారు. గల్లాపెట్టెలో ఉన్న రూ.లక్షకు పైగా నగదు, మద్యం బాటిళ్లను చోరీ చేశారు. అదేవిధంగా మఠం సమీపంలోని జూనియర్ కాలేజీ పక్కన ఉన్న పెయింట్స్, హార్డ్వేర్ షాపులో చోరీకి పాల్పడ్డారు. దుండగులు ముందుగా దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం దుకాణంలోకి చొరబడి నగదు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను పట్టుకుపోయారు. బాధితులు రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరాచక సంస్కృతి
గాయపడిన భార్గవ్ ఆధ్యాత్మిక నేలపై.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు చంద్రగిరి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే దాడులు, దౌర్జన్యాలు, ధ్వంసాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎప్పకప్పుడు అరికట్టాలని సూచిస్తున్నారు. చంద్రగిరిలో రెచ్చిపోతున్న ముసుగు దళాలు సాక్షి, టాస్క్ఫోర్స్: ఆధ్యాత్మికతతో అలరారే చంద్రగిరి గడ్డ ఇప్పుడు హాహాకారాలతో దద్దరిల్లుతోంది. గోవింద నామస్మరణతో మార్మోగే ప్రదేశం రక్తపు మరకలతో తడిసి ముద్దవుతోంది. గ్రామాల్లో బందిపోట్లను తలపించేలా ముసుగు దళాలు సంచరిస్తుండడం.. ప్రశ్నించే వారిపై దాడి చేయడం.. దాడి చేసే సమయంలో ‘మా నానీ అన్నను ప్రశ్నిస్తే ఇలాగే కొడతాం’ అని హెచ్చరికలు చేయడం.. వంటి చర్యలతో ఆ ముసుగు వెనుక దాగి ఉన్నది చంద్రగిరి ఎమ్మెల్యే నానీనేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు, తమిళనాడు నుంచి ముసుగు దళాలను పిలిపించి దాడులు చేయిస్తున్నట్టు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా నానీ వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిని కొట్టించడం, అడ్డొచ్చిన వారి ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కార్లు, బైక్లు దగ్ధం చేయడం వంటి దురాగ తాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్తనాదాలు ఆధ్యాత్మికత, ప్రశాంతత, గోవిందనామస్మరణతో మార్మోగే గడ్డ ఇప్పుడు ఆర్తనాదాలతో హోరెత్తుతోంది. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ముసుగు దళా లు అరాచకం చేస్తుండడం సంచలనంగా మారింది. రౌడీ రాజకీయాలను సహించరు తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల వాసులు రౌడీ రాజకీయాలను ఎన్నడూ సహించరు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతానికి చిత్తూరు నుంచి వచ్చిన పులివర్తి నానీ రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి గత రెండేళ్లుగా ప్రశ్నించే వారు, ముడుపులు ఇవ్వని వ్యాపారులు, సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టే వారిని టార్గెట్గా చేసుకుని ముసుగు దళాలతో దాడులు చేయిస్తూ ప్రజల్లో భయానక వాతావరణం కల్పిస్తున్నారన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుశ్చర్యలను చంద్రగిరి ప్రజలు హర్షించరని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మిత్రపక్షంపైనా దాడులు ఒక పార్టీ.. ఒక మండలం.. ఒక పంచాయతీ.. ఒక ఊరని కాదు.. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం ముసుగు దళాలు వరుస దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. ముసుగు దాడులు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, మిత్రపక్షమైన జనసేన, బీజేపీ వారితో పాటు వ్యాపారస్తులు, రైతులపైనా ఉండడం దారుణమంటున్నారు. పోలీసులు ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల చంద్రగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భయపడిపోతున్నారు దేశ నలుమూలల నుంచి ఎందరో ఉద్యోగులు, మరెందరో ఆధ్యాత్మిక గురువులు, మేధావులు, శాస్త్రవేత్తలు, సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి, చంద్రగిరిలో స్థిరపడాలని భావిస్తుంటారు. అంతేకాదు శ్రీవారిని దర్శించేందుకు నిత్యం 90 వేల మంది దాకా భక్తులు వచ్చి వెళ్తుంటారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విదంగా తిరుపతి ఒక్కచోటే ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఇటు ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ముసుగు దొంగలు చేస్తున్న అరాచకం వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. గోవిందనామాలు పలికే చోట ఆర్తనాదాలు, హాహాకారాలు మార్మోగుతున్నాయి. ముసుగు దళాల దాడిలో తీవ్రంగా గాయపడిన పాకాలకు చెందిన కపిలేశ్వర రెడ్డి (ఫైల్)చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో నానీ సమక్షంలోనే ఓ ఇంటికి నిప్పుపెట్టి దగ్ధం చేసిన అరాచకవాదులు (ఫైల్) అరాచకవాదుల దాష్టీకానికి చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామంలో దగ్ధమైన కారు (ఫైల్)తీవ్రంగా గాయపడిన సి.రామాపురానికి చెందిన కోదండం (ఫైల్)అరాచకం..హాహాకారంచంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎమ్మెల్యే నానీ ముసుగు దళాలచేత అరాచకం సృష్టించారని ఆయా మండలాల్లోని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వర కు 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పాకాల నుంచి 18 మంది, చంద్రగిరి నుంచి 16, తిరుపతి రూరల్ 12, రామచంద్రాపురం 11, చిన్నగొట్టిగల్లులో 7, ఎర్రావారిపాళెంలో 8 మంది రక్త గాయాలకు గురయ్యారు. వీరంతా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇక దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని వాళ్లు వందల మంది ఉన్నారు. ఫ్యామిలీ డాబా లు, బిర్యానీ సెంటర్లు, చికెన్ పకోడా, పూల దుకాణాలు, మెడికల్ షాపు, బట్టల షాపులను జేసీబీలతో ధ్వంసంచేసి నేల మట్టం చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పంటలను ధ్వంసం చేయించారని, దారులకు అడ్డుగా కందకాలు తవ్వించారని, మామిడి తోటలు నరికించారని ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టించారని మండిపడుతున్నారు. -
ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టే!
గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీన ముగిసింది. ప్రభుత్వం వాటికి ఎన్నికలు నిర్వహించుకుండా ఏవేవో కుంటి సాకులు చెప్పి ప్రత్యేక అధికారులను నియమించింది. తాజాగా బీసీ జనగణన పూర్తయి ఆపై ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లు నిర్ణయిస్తే గాని ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సర్పంచు, ఎంపీటీసీ పదవులకు పోటీ చేయాలని ఆశించిన ఆశావహులు నిరాశకు గురయ్యారు. పల్లెల్లో రాజకీయ వేడి చల్లబడినట్టే. పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2021లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 1,411 పంచాయతీలు, 13,574 వార్డులు ఉండగా కోర్టు కేసులు, పంచాయతీ విలీనాలు పోగా మిగిలిన 1,368 పంచాయతీలకు నాలుగు దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 358 స్థానాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అప్పట్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగాయి. జిల్లాల విభజన తర్వాత చిత్తూరు జిల్లాలో మొత్తం పంచాయతీలు 622, మొత్తం వార్డులు 5,914, మండలాలు 27 ఉన్నాయి. వీటిలో మొత్తం ఓటర్లు 10.26 లక్షల మంది ఉన్నారు. 2021లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. 2026 ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. గత జనవరిలోనే ముందస్తుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏవేవో కుంటి సాకులు చెప్పి నిర్వహించలేదు. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. ఇప్పుడు బీసీ జనగణన, కొత్త రిజర్వేషన్లు, జనాభా లెక్కల సేకరణ సాకుతో మళ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అన్న మాట రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. బెడిసికొట్టిన కూటమి నేతల రిజర్వేషన్ ప్లాను ఏ పంచాయతీలో ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుందో అన్న కోణంలో స్థానిక కూటమి నేతలు ప్లాన్లు చేసుకున్నారు. ఆ మేరకు పంచాయతీల వారిగా గెలిచే సామర్థ్యం ఉన్న వారికి అక్కడ రిజర్వేషన్లలో స్థానం దక్కేలా పావులు కదిపారు. కొందరు సర్పంచులుగా గెలిచినట్టేనని డాంభికాలు కూడా ప్రదర్శించారు. ఈ విషయమై ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ముందుగానే జాబితా సిద్ధం చేసుకుని కావాల్సిన వారికి తగినట్టుగా రిజర్వేషన్లను అధికారుల ద్వారా చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు బీసీ జనగణనతో రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో ఆశావాహుల నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది. పలమనేరు మండలంలోని కల్లాడు గ్రామ సచివాలయంచిత్తూరు జిల్లాలో పంచాయతీలు మొత్తం పంచాయతీలు 622 మొత్తం వార్డులు 5914 మండలాలు 27 మొత్తం ఓటర్లు 10.26 లక్షలు -
‘పట్టాభూమిలో రోడ్డు వేస్తున్నారు’
పెనుమూరు(కార్వేటినగరం): పచ్చనేతలు తమ పట్టా భూమి లో రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించిందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ, మనియాణంపల్లికి చెందిన రేణుక ఆరోపించారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తాము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమని తెలిపారు. టీడీపీ నేతలు తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నారని వాపోయారు. గ్రామ సమీపంలో ఉన్న కూటమి నాయకుడి క్యారీకి దారి కోసం తమకు చెందిన సర్వే నంబర్ 1007/1లో ఉన్న 1.41 ఎకరాల పట్టా భూమిలో రోడ్డు వేస్తున్నారని ఆరో పించారు. రాత్రికి రాత్రే మామిడి చెట్లను నరికేశారని, పెన్సింగ్ ను ధ్వంసం చేశారని తెలిపారు. దీన్ని ప్రశ్నించినందుకు తమ కుటుంబాన్ని గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా వెలివేశారని వాపోయారు. న్యాయం కోసం మాట్లాడితే చంపుతామని బెదిరిస్తున్నారని, అనుక్షణం ప్రాణభయంతో జీవిస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పైగా టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడబోమన్నారు. పరిశీలించి న్యాయం చేస్తాం దీనిపై తహసీల్దార్ వివరణ ఇస్తూ రేణుక సెటిల్మెంట్ భూమిలో దౌర్జన్యంగా పెన్సింగ్ తొలగించి, మామిడి చెట్లను నరికేసి అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు. పెన్సింగ్కు వేసిన రాతి కూశాలను తొలగించిన దృఽశ్యం టీడీపీ నాయకులు నరికి వేసిన మామిడి చెట్లు -
జిల్లాలో అధ్వాన్నంగా ప్రభుత్వ వైద్యం
‘పట్టాభూమిలో రోడ్డు వేస్తున్నారు’ పచ్చనేతలుతన పట్టా భూమిలో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రేణుక వాపోయారు.సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026పేదలు తాము కష్టపడి సంపాదించిన ఆదాయంలో సగం వైద్యానికే ఖర్చు పెడుతుంటారు. వారికి మెరుగైన వైద్యం ఉచితంగా అందిస్తే జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగుపడతాయి. చిత్తూరు జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైద్య వ్యవస్థ దారుణంగా మారింది. పేదల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు వారినే వెక్కిరిస్తున్నాయి. ఉచిత వైద్యం అందించాల్సిన చోట నిర్లక్ష్యం తాండవం చేస్తోంది. సిబ్బంది కొరత, మందుల లేమి రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు కరువయ్యాయి. ప్రసవాలు, సర్జరీలను రెఫర్తో సరిపెడుతున్నారు. దీంతో పేదల ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఖాళీగా దర్శనమిస్తున్న డాక్టర్ కుర్చీ వైద్యం.. దైన్యంకాణిపాకం: జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్సీలు ఉన్నా యి. వీటిలో ప్రతిరోజూ 10 వేల వరకు ఓపీలు నమోదవుతున్నాయి. ఇక్కడికి వచ్చే పేదలకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మందులు కూడా లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో చాలా మంది ఇక్కడే వైద్యం చేయించుకుని మందులు బయట కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుంటున్నారు. కీలక మందులు, సామగ్రి లేవు గర్భిణులకు స్కానింగ్ అగచాట్లు స్కానింగ్ విభాగంలో టోకెన్ విధానం అమలు చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే స్కానింగ్ చేయడం, ఆ తర్వాత వచ్చిన వారిని తిరస్కరిస్తున్నారు. స్కానింగ్ కోసం రోజుల తరబడి తిప్పించుకుంటుండడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసవాలకు నగదు వసూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ఉచితంగా చేయాల్సి ఉండగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో డెలివరీకి రూ.1000 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. సుఖ ప్రసవాల కంటే సిజేరియన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. కష్టతరమైన కేసులను వెంటనే ఇతర ఆస్పత్రులకు పంపించడం వల్ల గర్భిణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యుల కొరతతో అనేక సర్జరీలు జరగడం లేదు. చిన్న సమస్యలకే పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. నామమాత్రంగా అత్యవసర సేవలు ప్రాణాపాయ స్థితిలో వచ్చే రోగులకు చికిత్స అందించాల్సిన అత్యవసర విభాగం నామమాత్రంగానే పనిచేస్తోంది. చికిత్స అందించకుండా తిరుపతి, వేలూరు ఆస్పత్రులకు రిఫర్ చేయడం సాధారణంగా మారింది. దీంతో పేదలు ఆర్థికంగా కుంగిపోతున్నారు. ఇక అక్కడ సివిల్ సర్జన్లు ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందాల్సిన మందులు దొరకడం కష్టమైంది. డాక్టర్లు రాసిన ఐదు మందుల్లో ఒకటి లేదా రెండు మాత్రలే ఉంటున్నాయి. మిగిలినవి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. పోస్టుల భర్తీ ఎప్పుడో? కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ప త్రి అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియా మకాలు జరగకపోవడంతో సేవలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగంలో 10 మంది వైద్యులు అవసరం ఉండగా ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 డాక్టర్ పోస్టులు, 50 ఫార్మసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్ఎన్వో, ఏంఎన్వో సిబ్బంది దాదాపు 37 మంది అవసరం ఉంది. స్టాఫ్ నర్సులు ఆరుగురు తక్కువగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ల్యాబ్, స్కానింగ్ తదితర విభాగాల్లో కూడా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కనిపించని మౌలిక సదుపాలు ఆస్పత్రిలో కనీసం తాగునీరు కూడా అందుబాటు లో లేదు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నా యి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్లు లేకపోవడం, ఉన్న సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. పూతలపట్టు సీహెచ్సీలోని ఆరు విభాగాలకు నలుగురు వైద్యులు ఉండటం గమనార్హం. చిన్నపిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్ లేరు. ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడంతో వెంటిలేటర్లు మూలనపడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నేడు కురబల పెద్ద దేవర
కుప్పం రూరల్ : మండలంలోని సలార్లపల్లి సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కురబ కులస్తులు 14 ఏళ్లకు ఒకసారి చేపట్టే పెద్ద దేవర (కోడేళ్ల రాయస్వామి) జాతరను సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతర మూడు రోజులు జరుగుతుంది. ఇందులో భాగంగా సోమవారం గురుపూజ, హరికథా కాలక్షేపం, పండరి భజన, ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. అలాగే కురబలు పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు. తర్వాత భక్తులు తమ తలపై టెంకాయలు కొట్టించుకుంటారు. మంగళవారం మేలు దీపం, వసంతోత్సవంతో జాతర ముగుస్తుంది. సోమవారం జరిగే ప్రత్యేక కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలిరానుండడంతో సలార్లపల్లి పరిసరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బండపై బాదేశారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అందరూ ఊహించినట్టే జరిగింది. అమెరికా–ఇరాన్ యుద్ధం తొలిదెబ్బ వాణిజ్య సిలిండర్పై పడి పరోక్షంగా వినియోగదారులపై పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం తొలి పంజా విసిరింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.990.50 పెంచింది. దీంతో రూ.2,275.50 ఉన్న 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.3,266లకు చేరింది. ఈ హఠాత్ పరిణామంతో చిరు వ్యాపారుల నుంచి హోటల్ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలతో తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసే వారు వాపోతున్నారు. సహజంగానే తమ వంటకాలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఈ సమయంలో రూ.వెయ్యి పెంచితే ఇక లాభాలేం వస్తాయని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సిలిండర్ ధరల పెంపుతో ఇటు చిరు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ తయారు చేసే అల్పాహారం, బిర్యానీ, భోజనాల ధరలు పెరిగాయి. ఈ భారం పరోక్షంగా వినియోగదారులపై పడింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల వారు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో గృహ అవసరాల గ్యాస్ ధర రూ.50 పెంచిన విషయం తెలిసిందే. వీటి ధరలు సైతం మరోసారి పెరుగుతాయనే ప్రచారంతో సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతోంది. కొనసాగుతున్న కొరత అమెరికా–ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి వాణిజ్య ఆవసరాల గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. దీనికి తీవ్ర కొరత నెలకొంది. ఆ మధ్య వా రం రోజుల పాటు గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడిన తరువాత పరిస్థితి సద్దు మునిగింది. కానీ వాణిజ్య అవసరాల గ్యాస్ దొరకడం లేదు. ఇప్పటికే దీనిని బ్లాక్లో విక్రయిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు వాణిజ్య అవసరాల గ్యాస్ ధర రూ.2,275.50 ఉండగా బ్లాక్లో రూ.3 వేలకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తాజా పెంపుతో గ్యాస్ ఏజెన్సీల వద్దే సిలిండర్ ధర రూ.3,266లకు చేరింది. ధర పెరిగినా తగిన సరఫరా లేకపోవడంతో బ్లాక్లో కొనుగోలు చేయాల్సి రావడంతో మరింత భారం పడుతుందని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వాపోతున్నారు. నల్ల బజారుకు మరింతగా.. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 4 వేల కనెక్షన్లు ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా జిల్లాలో తోపుడు బండ్లు, చిన్నచిన్న హోటళ్ల నుంచి అతిపెద్ద రెస్టారెంట్ల వరకు 15 వేలకు పైగా ఉన్నట్టు అంచనా. వాణిజ్య సిలిండర్లు మాత్రం అందులో పదో వంతు కూడా లేకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వినియోగించడమే. ఇప్పుడు గృహ అవసరాల సిలిండర్కు, వాణిజ్య సిలిండర్కు మధ్య ధర వ్యత్యాసం రూ.2 వేల వరకు ఉంది. ఈ క్రమంలో గృహ అవసరాల గ్యాస్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించనున్నారు. ఈ కారణంగా వాణిజ్య సిలిండర్లను కాదని గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ను నేరుగా వినియోగించనున్నారు. లేదా గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య సిలిండర్లలో నింపి వినియోగించనున్నారు. -
అక్షరానికి ఆర్థిక భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : చదువుకు పేదరికం అడ్డుకాకుడదు. ఆర్థిక ఇబ్బందులు ఆశయాలను తుంచేయకూడదు. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడి బిడ్డ సైతం నేడు ప్రపంచ స్థాయి విద్యను అందుకునేలా కేంద్రం ప్రభుత్వం చేయూత ఇస్తోంది. ఇంటర్ తర్వాత బంగారు భవిష్యత్కు బాటలు వేసే కోర్సుల్లో చేరేందుకు ఆర్థిక భరోసా ఇస్తూ పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తోంది. ఎలాంటి పూచీకత్తు, హామీదారులు లేకుండా ఈ పథకం కింద బ్యాంకుల్లో రుణ సహాయం ఇప్పిస్తోంది. విదేశాల్లో ఉన్నత చదువులకూ దీన్ని వర్తింపజేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూ పొందించింది. రుణ మొత్తంలో ట్యూషన్ ఫీజు మాత్ర మే కాకుండా విద్యార్థికి అవసరమైన వసతి, రవాణా తదితర విద్యా సంబంధిత ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపే రుణం మంజూరుపై బ్యాంకర్లు స్పష్టత ఇస్తారు. రుణం వివరాలు ఇలా.. రూ.4 లక్షలలోపు, రూ.4 లక్షల నుంచి రూ.7.50 లక్షలు, రూ.7.50 లక్షలు కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన రుణాలు మూడు విభాగాల్లో మంజూరవుతాయి. కోర్సుల ఫీజుకు అనుగుణంగా రుణాలను ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు కు గడువు తేదీ లేదు. ఒక విద్యార్థి ఒక్కసారే దర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నమోదు ఇలా.. పీఎం విద్యాలక్ష్మి వెబ్సైట్లోకి వెళ్లి పేరు, సెల్ నంబ రు, ఈమెయిల్ ఐడీ, చిరునామా తదితర వివరా లు నమోదు చేయాలి. మార్కుల జాబితా, చదివిన కోర్సుకు సంబంధించిన పత్రాలు, చదవాలనుకుంటున్న కోర్సులకు చెందిన ప్రవేశ పత్రం జత చేయాలి. అర్హులు వీరే.. ఇంజినీరింగ్, వైద్య విద్య,, వృత్తి విద్యా కోర్సులు, ఆర్కిటెక్చర్, చార్టర్డ్ అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఎంఎస్, ఐఐటీ, విమానయాన వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు డిగ్రీ చదివే విద్యార్థులు రుణం పొందేందుకు అర్హులు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -
నేడే నీట్ పరీక్ష
– పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు చిత్తూరు కలెక్టరేట్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం నిర్వ హించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీవీకేఎన్ పరీక్ష కేంద్రంలో 456 మంది, లిటిల్ ఫ్లవర్లో 384 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220 మంది పరీక్షలు రాయనున్న ట్లు సిటీ కో ఆర్డినేటర్ జీవనజ్యోతి తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నా రు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకా రం అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని వెల్లడించారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు చిత్తూరు కలెక్టరేట్: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా అన్నారు. శనివారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సాఫ్ట్బాల్ వేసవి శిబిరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ముఖ్యమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు రిజర్వేషన్ను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు శిబిరంలో ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జూన్ 10, 11, 12 తేదీల్లో విశాఖపట్నం (భీమిలి)లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు షణ్ముగం, పీడీ దేవా, రమేష్, లోకేష్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
● నేల రాలిన మామిడి, ● కూలిన రేకుల షెడ్లు కార్వేటినగరం: జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన గాలివానతో కూడిన అకాల వర్షాని అపార నష్టం కలిగింది. కలికిరిండ్లు గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి 10 ఎకరాల మామిడి తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాకయలు నేలరాలాయి. అదే విధంగా అర్కేవీబీపేట పంచాయతీ ఇందిరా కాలనీకి చెందిన సుబ్రమణ్యం పాల డెయిరీ కోసం ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ఆవులు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కూలీలు అప్రమత్తమై 15 పాడి పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కార్వేటినగరం ఈదురు గాలులకు కొబ్బరి చెట్లు, వెదురు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బాలుడిపై హత్యాయత్నం గంగవరం: మండలంలోని కలగటూరులో శుక్రవారం రాత్రి ఒక మహిళ బాలుడిపై హత్యాయత్నానికి పాల్పడింది. బాలుడి తండ్రి జయచంద్రారెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. కలగటూరుకు చెందిన జయచంద్రారెడ్డి కుమారుడు వర్శిత్(15) శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో జయచంద్రారెడ్డి ఇంటి వద్ద లేడు. ఈ విషయాన్ని గ్రహించిన ఇదే గ్రామానికి చెందిన కస్తూరి అనే మహిళ ఇంట్లోకి చొరబడింది. బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయ త్నించింది. చుట్టుపక్కల వారి సమాచారంతో బాలుడి తండ్రి ఇంటికి వెళ్లి చూడగా కుమారుడు చేయి విరిగి కింద పడిపోయి ఉన్నాడు. వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి ప్రైవేట్ ఆర్థో క్లినిక్కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాడు. శనివారం పొలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిపై హత్యాయత్నం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరాడు. -
యాప్లపై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మాతా–శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా యాప్ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్వో నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం పీహెచ్సీల డాక్టర్లు, సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆర్సీహెచ్, డీఐఎన్సీ, సంజీవిని, కేసీడీ యాప్ల వినియోగంపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ గర్భిణుల రిజిస్ట్రేషన్ నుంచి అన్ని ఆరోగ్య సేవలను యాప్లలో సమయానుకూలంగా నమోదు చేయాలన్నారు. తద్వారా మాతాశిశు మరణాలను నివారించవచ్చన్నారు. డాక్టర్లు ప్రతిరోజూ యాప్ను పరిశీలించి ఏఎన్ఎంల పనితీరును పర్యవేక్షించాలని, లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. సంజీవిని కార్యక్రమం కింద ప్రతి వ్యక్తికీ మొబైల్ నంబర్తో అభ ఐడీల సృష్టి అవసరమన్నారు. దీనివల్ల భవిష్యత్తులో చికిత్స సులభతరం అవుతుందని చెప్పారు. ఓపీకి వచ్చిన రోగుల్లో ఎక్కువ మందికి అభ ఐడీలు సృష్టించడంతో పాటు మిగిలిన వారి డేటాను ఇతర సిబ్బంది ద్వారా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పీహెచ్సీ, గ్రామ ఆరోగ్య కేంద్రం ఐదు రోజుల్లో క్వాలిటీ చెక్లిస్ట్, ఎస్వోపీ ప్రకారం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని శిక్షణలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ను 80 శాతానికి పైగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ప్రతి నెలా డెలివరీలు నిర్వహించడం, 3000 ల్యాబ్ పరీక్షలు చేయడం, ఐయూసీడీ సేవలను నెలకు ఆరుగురికి అందించడం ద్వారా పీహెచ్సీ గ్రేడింగ్ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అనీల్ కుమార్, ప్రవీణ, అనూష, ఎస్వో జార్జ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహారంపై బండ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలోని ఓ ప్రధాన హోటల్లో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్లో నేడు భోజనం రూ.160. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అనేక మంది భక్తులు వెళ్లే మరో హోటల్లో నేడు భోజనం రూ.180కి పెంచారు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో స్పెషల్ భోజనం రూ.180 నుంచి రూ.220 చేశారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్లో భోజనం రూ.120 నుంచి రూ.180కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 20శాతం పెంచేశారు. తమిళనాడు వాసులు ఎక్కువశాతం వెళ్లే హోటల్లో భోజనం ధరలతో పాటు జ్యూస్ ధరలు కూడా అమాంతం పెంచేశారు. మొన్నటి వరకు ఒక జ్యూస్ ధర రూ.90 ఉంటే.. నేడు అదే జ్యూస్ ధర రూ.146కి పెంచేశారు. ఈ ధరలు మొన్నటి వరకు. నిన్నటి నుంచి వాణిజ్య గ్యాస్ ధరలు పెంచడంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పని జీఎస్టీ చపాతి, పూరీకి జీఎస్టీ లేదని కేంద్రం ప్రకటించినా.. నగరంలోని పలు హోటళ్లలో జీఎస్టీతో కలిపి బిల్లు వేస్తున్నారు. తినుబండారాల ధరలు కూడా పెరిగాయి. వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలు పర్యాటక, ఆధ్యాతిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాగే తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, చంద్రగిరి, కాణిపాకం ప్రాంతాలకు భక్తులతో పాటు పర్యాటకులు కూడా అధికంగా వచ్చి వెళుతుంటారు. పర్యాటకులు, భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో పలు మెస్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు నడుపుతున్నారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్ కొరత కారణంగా తిరుపతి, చిత్తూరులో పలు హోటళ్లలో భోజనం ఆపేశారు. మరి కొన్ని హోటళ్లను పూర్తిగా మూసివేశారు. ప్రధానంగా తిరుపతిలో రెండు మూడు హోటళ్లలో మాత్రమే భోజనం లభ్యమవుతోంది. గ్యాస్ కొరత, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ హోటళ్ల నిర్వాకులు భోజనం, టిపిన్స్, చపాతీ, పరోటా ధరలను అమాంతం పెంచేశారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో నేటి నుంచి కొత్త ధరలు అమలు చేయనున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. మెస్ల్లోనూ.. సామాన్యులు తినే మెస్ల్లో భోజనం రూ.80 నుంచి రూ.120 ఉండేది. పదిహేను రోజులుగా అవే హోటళ్లలో భోజనం రూ.160కి పెంచేశారు. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే ప్లేట్ ఇడ్లీ మొన్నటి వరకు రూ.20 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ రూ.35 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. దోశ, పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు. వెజ్ రైస్, గోబీ, దొండకాయ రైస్ వంటివి ప్రస్తుతం రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇవే పదిహేను రోజుల క్రితం వరకు రూ.50 నుంచి రూ.80 మాత్రమే. ఇకపోతే మెస్ల్లో సంగటి, మటన్, చికెన్తో కలిపి భోజనం మొన్నటి వరకు రూ.120 విక్రయించేవారు. ప్రస్తుతం రూ.190 నుంచి రూ.240కి పెంచేశారు. వామ్మో.. హోటల్ తిండా? రెట్టింపు కానున్న ఆహార పదార్థాల ధరలు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో హోటళ్లతో పాటు కర్రీ పాయింట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అన్నం వండుకుని కూరల కోసం కర్రీ పాయింట్లను ఆశ్రయిస్తుంటారు. వారికి ధరల భారం తప్పదు. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే అనేక కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. ఉన్న కర్రీ పాయింట్లు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచడంతో కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా ఆహార పదార్థాల ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే స్వీట్లు, సేవరీస్ వంటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ యుద్ధం పుణ్యమా అని సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారింది. సంపాదన అంతంత మాత్రమే ఉన్నా.. ఖర్చులు అంతకంతకు పెరిగిపోతుండడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. -
ఆదివారం
సత్యమేవ జయతే3-5-2026శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,008 మంది స్వామిని దర్శించుకున్నారు. 36,144 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. ‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’www.sakshi.com -
జాగ్రత్తలు అవసరం
గత ఏడాది కంటే ఈ సంవత్సరం 20 శాతం అధికంగా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గంటకొకసారి నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, అంబలి, నిమ్మ రసం తదితర సహజ సిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలి. సన్ స్క్రీన్ లోషన్లు, కూలింగ్ గ్లాసు, గొడు గు, ఒక లీటరు నీరు వెంట తీసుకువెళ్లాలి. మాంసం, మసాలా, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ధూమపానం, మద్యం సేవించరాదు. – డాక్టర్ జ్యోతి కుమార్, ఆయుర్వేద వైద్య నిపుణులు, వీజే హాస్పిటల్, తిరుపతి -
జాతీయ స్థాయి పోటీలకు బాలాజీ కవితా సంపుటి ఎంపిక
పలమనేరు: జాతీయ స్థాయిలో నిర్వహించిన వేటూరి వెంకయ్యనాయుడు శకుంతల స్మార క సాహిత్య పురస్కారా ల్లో భాగంగా ఉత్తమ వచనా కవితా సంపుటాల పోటీల్లో పలమనేరు బాలాజీ రచించిన ‘లోపలేదో కదులుతున్నట్టు’ కవితా సంపుటి ఎంపికై ంది. ఈ మేరకు నిర్వాహకులు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసగౌడ్ నుంచి శనివారం సమాచారం అందింది. ఇతర పురస్కారాల్లో భాగంగా జూలకంటి జగన్నాథం రచించిన ఇక కప్పు ఛాయ్... నాలుగు మేసేజులు, సుధామురళి రచించిన తడి ఆరని వాక్యాలు, నారాయణరావు రచించిన బతుకొక ఉత్సవం, ప్రత్యేక క్యాటగిరీల్లో మరికొన్ని ఎంపికైనట్టు తెలిపారు. ఇందులో భాగంగా పలమనేరు బాలాజీకి రూ.10 వేల నగదుతోపాటు పురస్కారాన్ని త్వరలో అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హనీట్రాప్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి చిత్తూరు అర్బన్: సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ఆయన శని వారం విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది నకిలీ ప్రొఫైల్స్తో స్నేహం చేసి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని తెలిపా రు. తర్వాత ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అపరిచితులతో ఆన్లైన్లో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూ చించారు. హనీట్రాప్కు గురైతే భయపడకుండా 1930 నంబర్కు లేదా సమీప పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేయాలన్నారు. సకాలంలో ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చిత్తూరు కార్పొరేషన్ : సకాలంలో ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. శనివారం ఎస్ఈ కార్యాలయంలో ఆయన ఎంఆర్టీ, నిర్మాణ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని త్వరతగతిన ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేయించాలన్నారు. సంబంధిత ఎస్పీఎంల నందు రోలింగ్ స్టాక్ను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ లోపు మొత్తం పనులు పూర్తి చేసే విధంగా అధికారులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. వీటి ద్వారా గ్రామాలకు త్రీఫేజ్ విద్యు త్ సరఫరా వస్తుందన్నారు. ఈఈలు బాబు, భాస్కర్నాయుడు పాల్గొన్నారు. ఆరుగురు నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రమోషన్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తు న్న ఆరుగురు నాన్ టీచింగ్ సిబ్బందికి ఉద్యోగోన్నతి లభించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రికార్డ్ అసిస్టెంట్ హోదా నుంచి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ హోదా పొందా రు. వారిలో చరణ్కుమార్ (బీఎస్.కణ్ణన్), ప్రసాద్ (పాపానాయుడుపేట), శ్రీరంజని (పుత్తూరు), శంకరయ్య (కలకడ), రెడ్డెప్ప (నిమ్మనపల్లి), మదన్మోహన్రెడ్డి (నందవనం) ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందిన నాన్ టీ చింగ్ ఉద్యోగులు త్వరతగతిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు. ఇసుక టిప్పర్లు స్వాధీనం గుడిపాల: తమిళనాడుకు అక్రమంగా వెళ్తున్న రెండు ఇసుక టిప్పర్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గుడిపాల మండలం నుంచి తమిళనాడుకు రెండు టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. వీటిని మైన్స్శాఖ వారికి అప్పజెప్పినట్లు తెలిసింది. -
పదిలో బీవీకే విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి సిటీ: తిరుపతి బైరాగిపట్టెడలోని బీవీకే విద్యా సంస్థల విద్యార్థులు గురువారం విడుదలైన పదో తరగతి పలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా సీఈఓ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ బీవీకే విద్యార్థులు పది ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు సాధించి, ప్రబంజనం సృష్టించారని తెలిపారు. విద్యార్థులు కే వినతి 597, జాహ్నవి 595, జోష్యంత్ 592, మాన్యసాయి 591 సాధించారని చెప్పారు. 570 మార్కులకు పైగా 102 మంది విద్యార్థులకు రావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ పాఠశాల లక్ష్యమని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను మెరిట్ స్టూడెంట్స్గా తీర్చిదితున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు. కౌంటింగ్ పరిశీలకులుగా డీఆర్వో చిత్తూరు కలెక్టరేట్: కేరళ రాష్ట్రంలోని అలెప్పి జిల్లా హరిపాడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులుగా డీఆర్వో మోహన్కుమార్ నియమితులయ్యారు. ఆయన ఈ నెల 3, 4, 5 తేదీల్లో అక్కడ విధులు నిర్వహించనున్నారు. -
మళ్లీ టమాట ధరలు పతనం
– పలమనేరులో బాక్సు రూ.330 పలమనేరు: కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన టమాట ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. పలమనేరులోని టమాట మార్కెట్లో శుక్రవారం టాప్రేట్ రూ.330, సగటు ధర రూ.200లు పలికాయి. ఉన్నట్టుండి ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సరుకు ఎక్కువగా రావడంతోనే ధరలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని ఎక్కువ మంది రైతులు రూ.లక్షలు పెట్టుబడి పెట్టి టమాటా పంట సాగు చేశారు. మరో పది రోజుల్లో కాయలను కోయాల్సి వుంది. ఈ క్రమంలో ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాక్సు ధర రూ.500 దాటితేగాని తమకు గిట్టుబాటుకాదని చెబుతున్నారు. 25న రెడ్క్రాస్ ఎన్నికలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఈ నెల 25న కలెక్టరేట్ సమావేశ మందిరం 2వ అంతస్తులో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్క్రాస్ జిల్లా శాఖలో సభ్యత్వం కలిగిన పాట్రాన్, వైస్ పాట్రాన్, జీవిత సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. రెడ్క్రాస్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. వివరాల కోసం 9493859160, 9885947361 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈగా విజయ్కుమార్ చిత్తూరు కార్పొరేషన్: ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇన్చార్జి ఎస్ఈగా చిత్తూరు ఈఈ విజయ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. లక్కీడిప్ డ్రా చిత్తూరు అర్బన్ : రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘‘హెల్మెట్ పెట్టు – బహుమతి పట్టు’’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ వారం శుక్రవారం లక్కీ డిప్ డ్రా నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ విజేతలను ప్రకటించారు. హెల్మెట్ ధరించిన వాహనదారుల్లో 7 కేటగిరీల్లో విజేతలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. హెల్మెట్ వినియోగం ప్రాణరక్షణకు కీలకమని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. -
వి.కోట హత్య కేసులో ఎన్నో ట్విస్ట్లు!
పలమనేరు:జిల్లాలో సంచలనం సృష్టించిన వి.కోటలో జర్నలిస్ట్ జగన్మోహన్రెడ్డి హత్య కేసులో పలు ట్విస్ట్ లు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు తమీం, అతని బంధువు సుభాన్ బెంగళూరు వెళ్లి లాయర్ను సంప్ర దించి అక్కడి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. గతం నుంచి తనకు సాయం చేస్తున్న వి.కోటకు చెందిన శ్రీనివాసులు డైరెక్షన్లోనే ఈ తంతు సాగిందన్న అనుమానంతో అతన్ని కూడా విచారించినట్టు తెలుస్తోంది. జగన్మోహన్రెడ్డితో ఇటీవల మాట్లాడిన వ్యక్తులు, వారి కదలికలపై ఫోన్ డేటా ఆధారంగా కేసును విచారిస్తున్నట్టు సమాచారం. తొలినుంచే జగన్పై కక్ష పెంచుకున్న శ్రీనివాసులు వి.కోటలోని టీచర్స్కాలనీలో ఓ స్థలాన్ని శ్రీనివాసులు ఇతరులకు విక్రయించాడు. ఆస్థలం దొంగా పట్టా అని జగన్మోహన్రెడ్డి తహసీల్దార్ ద్వారా నిరూపించడంతో శ్రీనివాసులు కక్ష పెంచుకున్నాడన్న మాట వినిపిస్తోంది. అలాగే శ్రీనివాసులు ఒక మహిళతో సన్నిహి తంగా ఉన్న వ్యవహారంలో జగన్మోహన్ తలదూర్చి వారి కుటుంబంలో చిచ్చురేపడం మరింత ఆగ్రహం తెప్పించింది. తొలి నుంచి తమీమ్కు అండగా నిలిచిన శ్రీనివాసులు బెంగళూరులో 2021లో గంజాయి కేసులో వి.కోటకు చెందిన ఆరీఫ్పై తమీమ్ సమాచారం ఇచ్చాడు. అది కావాలనే ఇచ్చినట్టు తేలడంతో తమీమ్ను పోలీసులు జైలుకు పంపారు. ఇందులో జగన్మోహన్రెడ్డి తన స్నేహితుడైన ఆరీఫ్కు సాయం చేశాడు. జైలులో ఉన్న తమీమ్ను శ్రీనివాసులు బెయిల్పై విడిపించాడు. 2024లో వి.కోటలో జరిగిన మత ఘర్షణల కేసులో అరెస్ట్ అయిన తమీమ్కు మళ్లీ శ్రీనివాసులే జామీను ఇచ్చాడు. ఆపై తమీమ్పై రౌడీ షీటర్, ఊరి బహిష్కరణ వేటు పడింది. దీనికి జగన్మోహన్రెడ్డి కారణమ ని తమీమ్ పగ పెంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. పక్కా పథకం మేరకే హత్య గత నెల 24న పలమనేరు కోర్టు వద్దకు జగన్మోహన్రెడ్డి మత కలహాల కేసుకు సంబంధించి పలువురితో కలిసి వచ్చాడు. తమీమ్, సుభాన్ మరో కేసులో అదే కోర్టుకు వచ్చారు. ఆ రోజు నుంచి శ్రీనివాసులు వాట్సాప్ కాల్స్లోనే మాట్లాడాడు. ఇలా జగన్మోహన్రెడ్డికి శ్రీనివాసులు, తమీమ్ శత్రువులని పోలీసులు అనుమానించారు. శ్రీనివాసులును అదుపులోకి తీసు కుని విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోనే సరెండర్ ఎందుకంటే... హంతకున్ని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ వచ్చింది. నిందితులు తమ న్యాయవాదుల సలహాతో కర్ణాటకలో లొంగిపోయినట్టు తెలుస్తోంది. అప్పుడు ఇక్కడి పోలీసులు పీటీ వారెంట్తో విచారణకు తీసుకురావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా త్వరలోనే ఈ కేసును ఛేదించి అనేక విషయాలను బయటపెడతామని డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. శ్రీనివాసులు (ఫైల్)నిందితుడు తమీమ్(ఫైల్) -
తోడులా సాక్షి.. నీడలా విజయం
ప్రజలకు సమాచారాన్ని అందించడంతోపాటు సామాజిక సేవల్లోనూ సాక్షి దినపత్రిక ముందు ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తన వంతు కృషి చేస్తోంది. గత ఏడాది జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. వాటిని చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. తమకు సాక్షి మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందని, పరీక్షలపై భయంపోయి టాపర్లుగా నిలిచామని చెబుతున్నారు. తమను ప్రోత్సహించిన సాక్షికి కృతజ్ఞతలు చెబుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా గణితం, సైన్స్ సబ్జెక్టులపై నిపుణుల ఆధ్వ ర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ను సాక్షి యాజమాన్యం ఉచితంగా అందజేసింది. అంతే కాకుండా సాక్షి దినపత్రికలోనూ ప్రతి రోజూ అన్ని సబ్జెక్టుల నిపుణుల సూచనలతో మెటీరియల్ ప్రచురించింది. టీచర్ల బోధనకు తోడు వీటి ఆధా రంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాక అవగాహన కోసం పరీక్షలు నిర్వహించారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులపై పట్టు పెరిగి, పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి టాపర్లుగా నిలిచారు. ఇందులో పలువురు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించడం విశేషం. నాణ్యమైన కంటెంట్, సులభమైన వివరణలతో పరీక్షలపై భయం పోయి తాము టాపర్లుగా నిలవడానికి సాక్షి అందించిన ఉచిత మెటీరియలే కారణమని విద్యార్థులు వెల్లడిస్తూ యాజమాన్యానికి కృతజ్ణతలు తెలిపారు. సమయ పాలన తెలిసింది సిలబస్ మొత్తం చదివినా, మూడు గంటల్లో పేపర్ ఎలా పూర్తి చేయాలనేది సవాలుగా ఉండేది. సాక్షి మెటీరియల్లో నిపుణులు ఇచ్చిన టైం మేనేజ్మెంట్ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో తెలుసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలిగాను. – నవ్యశ్రీ, 581, ఉన్నత పాఠశాల, పాలసముద్రం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నాను సాంఘిక శాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్, ముఖ్యమైన సంవత్సరాలను గుర్తించుకోవడం నాకు సవాలుగా ఉండేది. సాక్షి మెటీరియల్లో ఇచ్చిన చార్ట్స్, మ్యాప్స్లో ఆ విషయాలను నేను సులభంగా గుర్తించుకోగలిగాను. ఇది నా స్కోర్ను పెంచడంలో ఎంతో సహాయపడింది. – శశిర, 580 మార్కులు, జెడ్పీ హైస్కూల్, కత్తెరపల్లి, కార్వేటినగరంప్రశ్నల సరళిపై అవగాహన పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో అని ఆందోళన ఉండేది. సాక్షి అందించిన మోడల్ పేపర్స్లో ప్రశ్నల విశ్లేషణ పరీక్ష సరళిపై పూర్తి అవగాహన కల్పించాయి. అన్ని సబ్జెక్టుల్లో పట్టు పొందేందుకు అవకాశం కలిగింది. మెటీరియల్ వల్లే ఉత్తమ మార్కులు సాధించగలిగాను. – జైకిషోర్, 591 మార్కులు, జెడ్పీ పి.కొత్తకోట, పూతలపట్టు మండలం సులభంగా సైన్స్ డయాగ్రమ్స్ బయోలాజికల్ సైన్స్లో చిత్రపటాలు గీయడం నాకు చాలా కష్టంగా ఉండేది. సాక్షి మెటీరియల్లో డయాగ్రమ్స్ను సులభంగా ఎలా గీయవచ్చో స్టెప్ బై స్టెప్ వివరించారు. ముఖ్యమైన పాయింట్లను బుల్లెట్ రూపంలో ఇవ్వడం వల్ల రివిజన్ చేసుకోవడం సులభమైంది. చాలా సంతోషంగా ఉంది. – వర్షిత, 584 మార్కులు, ప్రభుత్వ హైస్కూల్, మిట్టఇండ్లు గణితంపై పట్టు వచ్చింది నాకు మొదట్లో లెక్కలంటే చాలా భయం ఉండేది. సాక్షి మెటీరియల్లో క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభమైన పద్ధతుల్లో వివరించారు. ముఖ్యంగా థీరమ్స్, గ్రాఫ్స్ విషయంలో మెటీరియల్ నాకు ఎంతో దైర్యాన్ని ఇచ్చింది. దానివల్లే నేను గణితంలో మంచి మార్కులు సాధించగలిగాను. – అగస్టిన్, 531 మార్కులు, జెడ్పీ అత్తూరు, నిండ్ర మండలం -
భాషా నైపుణ్యాలు నేర్చుకున్నా
భాషా సబ్జెక్టుల్లో వ్యాకరణం, లేఖ రచన వంటి అంశాల్లో తప్పులు లేకుండా ఎలా రాయాలో సాక్షి మెటీరియల్ లో వివరించారు. అలాగే పదజాలాన్ని ఎలా పెంచుకోవాలో తెలియజేశారు. దీని వల్ల నేను లాంగ్వేజెస్లో సైతం మంచి మార్కులు సాధించాను. – లాహిద్, 590 మార్కులు, వరదప్పనాయుడు మున్సిపల్ స్కూల్, చిత్తూరు సమగ్ర రివిజన్ పరీక్షలకు వారం ముందు భారీ పాఠ్యపుస్త కాలు చదవడం కష్టమవుతుంది. అప్పుడు సాక్షి మెటీరియల్ క్విక్ రివిజన్ గైడ్లా పనిచేసింది. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలను కుదించి ఇవ్వడం వల్ల తక్కువ సమయంలోనే మొత్తం సిలబస్ రివిజన్ చేయగలిగాను. నేను ఈ రోజు టాపర్గా నిలిచాను. – జనని, 591 మార్కులు, కుప్పం బాలికల జెడ్పీ హైస్కూల్ -
అంగరక్షకుల తిరస్కరణ..!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో పనిచేస్తున్న దళిత రిసోర్స్పర్సన్ (ఆర్పీ) కవితపై టీడీపీకి చెందిన ఒక మూక దాడికి పాల్పడింది. మౌలి, జగన్, శ్రీనివాసులు, యమున, రేఖతో పాటు 30 మంది వరకు కవితపై భౌతికంగా దాడి చేశారు. ఆమె దళితురాలు అని తెలిసినా కూడా.. రేఖ అనే మహిళ కాళ్లు పట్టుకోవాలని అందరి ఎదుట అవమానించింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్ కార్యాలయంలో ఘటన జరగడంతో ఇక్కడి ప్రత్యేకాధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ సీరియస్ అయ్యారు. కేసు నమోదుకు రెఫర్ చేయాలని కమిషనర్ను ఆదేశించారు. అదే సమయంలో ఈ విషయం చిత్తూరు ఎంపీ, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు చెవిలో పడింది. జరిగిన ఘటనకు కాస్త మసాలా అంటించిన ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం.. ఎంపీ వద్ద దీన్ని మరోలా చెప్పినట్లు తెలిసింది. ఎట్టకేలకు గురువారం రాత్రి వన్టౌన్ పోలీసులు ఎమ్మెల్యే అనుచరులపై ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇతర సెక్షన్లు పెడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోయారు. తన దృష్టిలో లేకుండా జరిగిన ఘటనను, బాధితురాలికి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోమని చెబుతుంటే.. సామాజిక మాధ్యమాల్లో ఏకంగా ఎంపీ పేరిట ప్రకటన వెలువడడంపై మరోవర్గం ఎమ్మెల్యే–ఎంపీ మధ్య నిప్పును రాజేసింది. బాధితురాలికి న్యాయం చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కమిషనర్ను ఆదేశించినట్లు ఎంపీ పేరిట ప్రకటన వెలువడడాన్ని ఎమ్మెల్యే అంగీకరించలేకపోయారు. దీంతో శుక్రవారం ఉదయం తనవద్ద ఉన్న ఇద్దరు గన్మెన్లను విధులు దిగి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తనకు ఎలాంటి కోపం లేదని గన్మెన్లను పోలీసు శాఖకు సరెండర్ చేశారు. ఇద్దరు గన్మెన్లు చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్) ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసి, జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఎస్పీ ఆదేశాలతో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, ఇదే సమయంలో తనకు ప్రాణహాని కూడా లేనందున గన్మెన్లు అవసరం లేదని గురజాల తేల్చిచెప్పడంతో డీఎస్పీ వెనుదిరిగారు. విషయం సామాజిక మాధ్యమాల్లోకి పాకడం, జిల్లా అధికారుల దృష్టికి, తర్వాత పార్టీ హైకమాండ్కు వెళ్లడంతో మరో రెండు రోజుల్లో ఎంపీ–ఎమ్మెల్యే ఇద్దరు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియా ముందుకు రావడం.. ఎమ్మెల్యే గన్మెన్లను నియమించుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు తమను గుర్తించడం లేదని, తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తూ వచ్చిన చిత్తూరు టీడీపీలోని ఓ వర్గం.. తాజా ఘటనలను ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకుని పూర్వవైభవం సాధించామంటూ సంబరాలు చేసుకుంటుండడం కొసమెరుపు. ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న చిత్తూరు నియోజకవర్గ ఎంపీ–ఎమ్మెల్యే మధ్య వైరం ఇపుడు బహిర్గమతమైంది. దీనికి ఒక దళిత మహిళపై ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన దాడి ఘటనే కేంద్ర బిందువుగా మారింది. బాధితురాలి పక్షాన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నిలబడడం.. తెలియకచేసిన తప్పుకు తన అనుచరులపైనే అట్రాసిటీ కేసు పెట్టిస్తారా..? అంటూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అన్నింటినీ దిగమింగుతుంటే తనను చేతగానివాడిగా చూపించేందుకు సొంత పార్టీలోని సీనియర్లు కుట్ర పన్నుతున్నారని గ్రహించి.. బ్రహ్మాస్త్రంగా తన అంగరక్షకులను సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
ట్రాన్స్కో స్టోర్స్ పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో ఉమ్మడి జిల్లా స్టోర్స్ను శుక్రవారం పీఅండ్ఎంఎం సీజీఎం రమణ పరిశీలించారు. స్టోర్స్లో ఉన్న పరికరాలు, అవసరమైన పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పరికరాల వివరాలు నివేదిక పంపించాలని, వాటి కోసం టెండర్లు ఆహ్వానించి సరఫరా చేస్తామ ని తెలిపారు. అంతకు ముందు ఆయన చిత్తూరు అర్బన్ ఈఈ కార్యాలయంలో జరుగుతున్న ఈఆర్వో కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్బాబు, డీఈలు వసంతనాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీ పూతలపట్టు(యాదమరి): మండల కేంద్రమైన పూతలపట్టులోని పీహెచ్సీని శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. సంజీవిని ప్రాజెక్టు సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్సలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, సీహెచ్వో లక్ష్మీనారాయణ, పీసీ వినీష్, ఫార్మసిస్ట్ కాంచన పాల్గొన్నారు. -
● స్వర్ణరథం.. తరించే ఆబాలగోపాలం
కదిలింది స్వర్ణరథం.. మెదిలింది అమ్మరూపం.. భక్తజనుల పెదవులు అర్చించాయి.. మనసు సిరుల తల్లిని కీర్తించింది.. కరాలు వందనం అర్పించాయి.. కర్ణాలు శ్రీవారి దేవేరి నామస్మరణలతో నిండిపోయాయి.. తనువు తల్లిలో లీనమైంది.. అణువణువునా.. తనువు తనువునా అమ్మరూపమే కొలువైంది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. –చంద్రగిరి -
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కొనసాగుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ లైన్లు నిండిపోయి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. త్వరితగతిన సంజీవిని డేటా సేకరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంజీవిని డేటాను త్వరితగతిన సేకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డేటా అప్డేషన్పై కేసీడీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ ప్రోగ్రాం అధికారులు, డీఐ ఎన్సీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవిని కార్యక్రమానికి సంబంధించిన డేటాను పూర్తి చేయడంపై చర్చించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో త్వరితగతిన డేటా సేకరణ ఎలా చేపట్టాలి, ప్రతి ఒక్కరికీ మొబైల్ నంబర్తో పాటు ఏబీ ఐడీల సృష్టి ఎలా సాధ్యమవుతుందనే అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఈ డేటా సేకరణ పూర్తయితే సమాజంలోని ప్రజలందరికీ వైద్య సేవలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. డెప్యుటేషన్పై విజయవాడకు ఆర్ఐ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ శ్రీనివాసరావ్ను డెప్యుటేషన్పై విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులొచ్చాయి. ఈయన త్వరలో అక్కడ బాధ్యతలు చేపట్టనున్నారు. మరో వారం రోజుల్లో ఈ స్థా నాన్ని భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పకడ్బందీగా నీట్ పరీక్ష విధులు చిత్తూరు కలెక్టరేట్ : నీట్ పరీక్ష విధులను పకడ్బందీగా నిర్వహించాలని నీట్ పరీక్షల సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ జీవనజ్యోతి తెలిపారు. స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వైద్య విద్య కోర్సు లో ప్రవేశాలకు ఈ నెల 3వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలు పీవీకేఎన్లో 456 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220 మంది, లిటిల్ ఫ్లవర్ ఎయిడెడ్ పాఠశాలలో 384 మంది మొత్తం 1,060 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష నిర్వహణలో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సావిత్రమ్మ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రిన్సిపాల్ జెసిత, అబ్జర్వర్లు ప్రొఫెసర్ జానకిరామయ్య, అధ్యాపకులు నాగేంద్ర, శరవణ తదితరులు పాల్గొన్నారు. -
ఫాలో+లైక్ = ఫైట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేడు సామాజిక మాధ్యమాల కాలం నడుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్ట్రాగామ్లో చిట్చాట్ వారి చేతిల్లో బిజీవుతోంది. ఫాలో.. చాట్.. లైకులతో మొదలైన వారి ప్రయాణం లవ్ స్టోరీల వరకు చేరి చివరకు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ఫ్యాషన్గా మారిపోయింది. తీరా ఏడు అడుగుల్లోనే బంధాలు బలహీనమై ఏడిపిస్తున్నాయి. యుక్త వయస్సులోనే విడాకులంటూ.. తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలాంటి బలహీన బంధాలపై పోలీసులు, విద్యావేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. చాట్ నుంచి పెళ్లి పీటల వరకు ఇన్స్ట్రాగామ్లో ఫాలో లైక్.. చాట్ ఇలా మొదలయ్యే పరిచయాలు రోజురోజుకు దగ్గరవుతూ ప్రేమగా మారుతున్నాయి. అరచేతిలోనే రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి ప్రేమగా ముడిపడిపోతున్నాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా సాగుతున్న ఈ సంబంధాలు, చివరకు పెద్దల అనుమతి లేకుండానే పెళ్లి పీటలు ఎక్కే స్థాయికి చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాల్య వివాహాల మాదిరిగా చిన్న వయసులో నే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక చాలా మంది యువతీయువకులు ప్రేమ, పెళ్లి మోజులో పడి మోసపోతున్నారు. రూ.లక్షల్లో నగదు దారబోసుకుంటున్నారు. ఫ్యాషన్గా మారిన ప్రేమ పెళ్లిళ్లు సినిమాలు, రీల్స్, వెబ్ సిరీస్ల ప్రభావంతో ప్రేమ పెళ్లిళ్లు ఒక ట్రెండ్గా మారుతున్నాయి. ఇదే క్రేజ్గా భావించి జీవితాంతం బాధ్యతలను మరిచిపోతున్నా రు. తొందరపాటు నిర్ణయాలతో ఏర్పడిన ఈ బంధా లు చిన్నచిన్న విభేదాలతో ముగిసి పోతున్నాయి. పెళ్లి తర్వాత వాస్తవ జీవనంలో వచ్చే సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఒత్తిడులను తట్టుకోలేక యువ జంటలు విడాకుల దిశగా వెళ్లిపోతున్నాయి. ఫోన్ ఉంటేనే ముద్ద దిగేది ప్రస్తుతం పుట్టిన బిడ్డ కూడా ఫోన్ పట్టుకుంటోంది. చేతిలో ఫోన్ లేకుండా పిల్లలకు నోట్లో ముద్ద దిగనంటోంది. అలా పెరిగే కొద్ది పిల్లలకు ఫోనే ప్రపంచంగా మారిపోయింది. ఆపై సామాజిక మాధ్యమానికి అతుక్కుపోతోంది. చిట్చాట్లతో పాటు రీల్స్ పిచ్చికి పిచ్చెక్కిపోతోంది. డిజిటల్ యుగంలో ప్రతి క్షణం మొబైల్తో మమేకమవుతున్న యువత, సోషల్ మీడి యా వలలో చిక్కుకుంటోంది. ముఖ్యంగా ఇన్స్ట్రాగామ్ వంటి వేదికలు పరిచయాలకు, ఆ పరిచయా లు ప్రేమలకు, ఆపై పెళ్లిళ్లకు దారితీస్తున్నాయి. ఈ వేగం ఎంత త్వరగా మొదలవుతుందో అంతే వేగంగా ముగుస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. నేడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్చాట్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువైంది. వీటిలో అనేక మంది యువతీయువతులు గంటల తరబడి కాలం వెల్లదీస్తున్నారు. ఇలా ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడుతున్నాయి. చివరికి అవి ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుతున్నారు. చిన్నవయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత ఎదురయ్యే ఆటుపోట్లను భరించలేక గొడవలు పడుతూ ఏడు అడుగుల్లోనే తమ బంధాలను ముగించుకుంటున్నారు. కొంతమంది జీవితంపై విరక్తి చెంది జీవితాలను చాలిస్తుండగా.. మరికొందరు మళ్లీ కొత్త వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నారు. కుటుంబాల్లో కంటతడి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న పెళ్లిళ్లు కుటుంబాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పిల్లల నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. వారి ఆశలు ఒక్కసారిగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఇక చిన్న వయసులో తీసుకునే ఈ నిర్ణయాలు వారి చదువు, కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చదువును మధ్యలోనే వదిలేసే పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు, విద్యావేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈ వ్యసనం నుంచి వారు దూరమయ్యేలా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. హద్దులు దాటకూడదు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితుల్లో ఉంచాలి. అనుమానాస్పద పరిచయాలపై జాగ్రత్త వహించాలి. ఇటీవల ప్రేమ పెళ్లి పేరుతో మోసాలు కూడా అధికమయ్యాయి. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి. భావోద్వేగ నిర్ణయాలకు లోనుకాకుండా అవగాహన కల్పించాలి. సోషల్ మీడియా పూర్తిగా చెడు కాదు. సరైన మార్గంలో ఉపయోగిస్తే అది అవకాశాల ప్రపంచం. అదుపు లేకుండా వాడితే మాత్రం జీవితాలను దారి తప్పించే ప్రమాదం ఉంది. – అశోక్కుమార్, తాలూకా ఎస్ఐ, చిత్తూరు -
సీఎం సొంత జిల్లాలో పల్టీ కొట్టిన పది ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్ : విద్యాశాఖ అధికారుల ఏడాది మొత్తం చేసిన హడావుడి అంతా వట్టిమాటలేనని తేలిపోయింది. పది ఫలితాల్లో జిల్లా ఘోరంగా చతికిలపడింది. రాష్ట్ర స్థాయి 24వ స్థానానికి పడిపోయింది. గత విద్యాసంవత్సరంలో సైతం 24వ స్థానం, ప్రస్తుతం అదే స్థానంతో పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది. పొరుగు జిల్లాలైన అన్నమయ్య, తిరుపతి జిల్లాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రం మాత్రం వెనుకుబడిపోవడం గమనార్హం. వైఫల్యంపై నిలదీత సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి విద్యాశాఖ అధికారుల వరకు అందరూ ఉన్నా, వెనుకబడిన విద్యార్థులను గుర్తించడంలో విఫలమయ్యారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలుతున్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనమని విద్యావేత్తలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 76.69 శాతం ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 20,905 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 10,711, బాలికలు 10,194 మంది ఉన్నారు. బాలురు 7,630 మంది, బాలికలు 8,403 మంది ఉత్తీర్ణత చెందారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16,033 మంది ఉత్తీర్ణత కాగా 76.69 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికల హవా ఫలితాల విశ్లేషణలో బాలురు బాలికలంటే వెనుకబడ్డారు. జిల్లాలో బాలురు 71.24 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నారు. బాలికలు మాత్రం 82.43 శాతంతో రాణించి జిల్లా పరువును కొంత మేర నిలబెట్టారు. ముందంజలో రెసిడెన్షియల్ పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా నమోదైన ఫలితాల్లో అన్ని యాజమాన్యాలలో రెసిడెన్షియల్ పాఠశాలలు 94.10 శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలలు 91.53, బీసీ వెల్ఫేర్ 86.52, కేజీబీవీ 82.96, సోషల్ వెల్ఫేర్ 81.73, ఏపీ మోడల్ స్కూల్స్ 80.08, జిల్లా పరిషత్ 71.79, ట్రైబల్ వెల్ఫేర్ 71.25, ఎయిడెడ్ 70.11, ప్రభుత్వ యాజమాన్యం 62.53, మున్సిపల్ 59.54 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 45 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు జిల్లా వ్యాప్తంగా 100కి 100 శాతం ఉత్తీర్ణత 45 పాఠశాలలు సాధించాయి. ప్రైవేట్ యాజమాన్యాల్లో 27, సోషల్ వెల్ఫేర్లో 1, జిల్లా పరిషత్లో 17 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా జిల్లాలో రెండు ప్రైవేట్ పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని వి.కోట మండలం ఇండస్ వ్యాలీ పాఠశాలలో 1 విద్యార్థి పరీక్ష రాయగా ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. అలాగే నగరిలోని శ్రీరామ్ విద్యామందిర్లో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయగా ఆ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. మొదట పాలసముద్రం, చివర్లో సదుం జిల్లాలో పాలసముద్రం మండలం 95.51 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సదుం మండలం 62.04 శాతంతో వెనుకబడింది. పూతలపట్టు 93.63, విజయపురం 89.81, ఐరాల 89.63, జీడీ నెల్లూరు 88.07, చౌడేపల్లి 84.47, గంగవరం 82.87, నగరి 82.06, నిండ్ర 80.93, పలమనేరు 80.43, ఎస్ఆర్ పురం 79.40, పుంగనూరు 79.35, చిత్తూరు 78.71, సోమల 77.72, పెద్దపంజాణి 77.66, బంగారుపాళ్యం 76.96, గుడిపాల 76.14, గుడుపల్లి 74.21, పులిచెర్ల 73.70, శాంతిపురం 73.63, వెదురుకుప్పం 73.49, బైరెడ్డిపల్లి 72.21, తవణంపల్లి 71.90, పెనుమూరు 71.77, కార్వేటినగరం 68.61, కుప్పం 66.10, వి.కోట 65.92, రొంపిచెర్ల 65.63 యాదమరి 64.59, రామకుప్పం 64.35, సదుం 62.04 శాతం ఫలితాలను సాధించాయి. -
మానవత్వమే పరమార్థం
చిత్తూరు కలెక్టరేట్ : పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ చారిట బుల్ సొసైటీ, జాయినింగ్ దిడాట్స్ ఫౌండేషన్లు 1.5 కోట్ల విలువైన కృత్రిమ అవయవాలను అందించారు. 2018 నుంచి రాష్ట్రంలో జిల్లా స్థానం సంవత్సరం ఉత్తీర్ణత శాతం జిల్లా స్థానం 2018 96.36 5 2019 97.41 3 2020 100 (కరోనా) 6 2021 100 (కరోనా) 7 2022 74.22 4 2023 69.53 17 2024 91.28 6 2025 67.06 24 2026 76.69 24 -
అద్వితీయం!
● చిత్తూరు విద్యార్థిని స్టేట్ సెకండ్ చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని మిట్టూ రులో ఉన్న ర్యాంకర్స్ పాఠశాలలో పదో తరగ తి చదివిన ఎం.అంకితరెడ్డి 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు సాధారణ వ్యవసాయ రైతులు. పొలం పనుల్లో కష్టపడుతూనే తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించాలని వారు కన్న కలలను ఆ విద్యార్థిని నిజం చేసింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆ విద్యార్థినిని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, డీఈవో రాజేంద్రప్రసాద్, డీవైఈవో ఇందిరా, ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్, పాఠశాల కరస్పాండెంట్ రమణారెడ్డి అభినందించారు. ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎండనక, వాననక పొలంలో కష్టపడి చదివించారన్నారు. భవిష్యత్లో డాక్టర్ కావడమే తన లక్ష్యమని తెలిపారు. మార్కులే ప్రామాణికం కాదు చిత్తూరు కలెక్టరేట్ : పదవ తరగతి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని డీఈవో రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలు ఎలా ఉన్నా కుంగిపోకూడదన్నారు. మార్కులు కేవలం ఒక దశ మాత్రమేనని, జీవితాన్ని నిర్ణయించవన్నారు. రీ కౌంటింగ్కు ప్రతి సబ్జెక్ట్కు రూ.500, రీ వెరిఫికేషన్కు ప్రతి సబ్జెక్ట్కు రూ.1000 చొప్పున మే 1 నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలను www. bse. ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహిస్తారని డీఈవో తెలిపారు. -
ఇంట్లో చోరీ
పాలసముద్రం : మండంలోని ఆముదాల పంచాయతీ జయలక్ష్మీపుం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఇంట్లో బుధవారం భారీ చోరీ చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్లి బీరువా, కప్బోర్డులోని లాకులను పగులకొట్టి అందులో ఉన్న బంగారుం, నగదు దోచుకెళ్లినట్టు ఎస్ఐరాజశేఖర్రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈత కొడుతూ వృద్ధుడి మృతి బైరెడ్డిపల్లె: ఎండవేడిమి తట్టుకోలేక బైరెడ్డిపల్లె పెద్ద చెరువులో ఈత కొడుతున్న వృద్ధుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని జాలారిపల్లెకు చెందిన కృష్ణప్ప (65) సయ్యద్హుసేన్లు బైరెడ్డిపల్లె పెద్ద చెరువులో ఎండ వేడిమికి తట్టుకోలేక ఈత కొట్టేందుకు వెళ్లారు. సయ్యద్ హుసేన్కు ఈత రాకపోవడంతో గట్టుపైనే నీరు ఎత్తుకొని పోసుకున్నాడు. కృష్ణప్ప ఈత కొడతానని సయ్యద్హుసేన్తో చెప్పి కొంత దూరం నీటిలోకి వెళ్లి గట్టుపైకి వస్తుండగా ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని సయ్యద్హుసేన్ సమీపంలో ఉన్న వారికి చెప్పి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు నీటిలోకి వెళ్లి కృష్ణప్ప మృతదేహాన్ని వెలికితీశారు. కృష్ణప్ప చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలు పట్టుబడ్డారు! చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలను తాలూకా పోలీసులు పట్టుకున్నట్టు విశ్వసనీయమైన సమాచారం. గత మూడు రోజుల కిందట బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి 16 తులాల బంగారం, రూ.2.5 లక్షల నగదును అపహరించుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో లోతుగా విచారణ చేపట్టి...దొంగలను చాకచక్యంగా పట్టుకున్నట్లు సమాచారం. గురువారం పట్టుబడ్డ దొంగలను అరెస్ట్ చూపించనున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పాడుబడ్డ బావిలో పడిన కారు పలమనేరు: రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను తప్పించబోయిన కారు పాడుబడ్డ బావిలోకి దూసుకుపోయిన ఘటన బుధవారం పలమనేరు మండలంలోని దుగ్గినవారిపల్లి వద్ద చోటుచేసుకుంది. శాంతిపురానికి చెందిన ముగ్గురు కారులో పలమనేరు వైపు వస్తుండగా దుగ్గినవారిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బావిలో పడ్డ కారులోని ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో రోడ్డుపై వస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మొత్తం మీద ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. తీరా చూస్తే కారులోని వాళ్లు, రోడ్డు దాటుతున్న వాళ్ల బంధువులు కావడంతో ఎలాంటి కేసులు వద్దంటూ వెళ్లారు. -
‘మొలకెత్తని’ ఆశలు
●పలమనేరు: పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో ఏటా వేసవిలో టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి నుంచి మే దాకా రైతులు టమాటను సాగు చేస్తుంటారు. ఇప్పటికే రెండువేల హెక్టార్లలో టమాట సాగై పలు దశల్లో ఉంది. గత 15 రోజుల క్రితం నాటిన నారు చేల్లో విపరీతమైన ఎండల కారణంగా మొలకెత్తకుండా ఎండుతోంది. దీంతో డిమాండ్ ఉన్న సమయంలో నారు తెచ్చినాటిన రైతులు పంటను చూసి బాధపడుతున్నారు. మరికొందరు ప్రస్తుతం 300 ఎకరాల్లో నారు నాటేందుకు సిద్ధమవుతున్నారు. నర్సరీల్లో నో టమాట సీడ్స్ అధిక ఉష్ణోగ్రతల కారణంగా నర్సరీల్లోనే హైబ్రిడ్ రకాల టమాట నారు దొరకడం లేదు. టమాటకు ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఎలాగైనా టమాట నాటాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో టమాటా నారుకు విపరీతంగా డిమాండ్ వచ్చిపడింది. 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాట నారు మొలకెత్తేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పట్లో వర్షాలు పడి వాతావరణం చల్లబడితేగానీ నార్లు పోయమని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు.అప్పటిదాకా టమాట సాగు వద్దు ప్రస్తుతం ఎండల కారణంగా మా నర్సరీలోనూ టమాట నారు పోయడం లేదు. అందుకే రైతులకు నారు ఇవ్వడం లేదు. ప్రస్తుతం టమాట నారు నాటిన చోట అధిక ఉష్ణోగ్రత కారణంగా మొక్కలు చనిపోతున్నాయి. దీంతోపాటు మల్చింగ్ షీట్లు ఎక్కువగా ఎండను తీసుకుంటున్నాయి. రెండు వైపులా అధిక వేడిమి దీనికి కారణం. అందుకే ఎండలు తగ్గాకే టమాట నాటుకోవడం మేలని రైతులకు సూచిస్తున్నాం. –కోటేశ్వరావు, సైంటిస్ట్, ఎక్స్లెన్స్సెంటర్, కుప్పం -
అయ్యా బాబు.. మాకొద్దు ఈ బాబు
చిత్తూరు కార్పొరేషన్: అయ్యా బాబు.. మా కొద్దు ఈ బాబు అంటూ వాణిజ్యపన్నుల(సీటీ)శాఖ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం వాణిజ్య పన్నులశాఖ కార్యాలయం ఎదుట కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసు అసోసియేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పూర్ణం, గిరిధర్ మాట్లాడారు. తమశాఖ కమిషనర్ బాబుఅహ్మద్ పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నరని ఆరోపించారు. దీని పై న్యాయస్థానాన్ని రాష్ట్ర నాయకులు ఆశ్రయించారన్నారు. శాఖపరమైన పదోన్నతులు ఇవ్వకుండా తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడమే అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. వెంటనే వారికి పదోన్నతులు కల్పించాలని ఆదేశాలిచ్చి 6 నెలలు అవుతన్నా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన పదోన్నతులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. మే 4లోపు తమకు పదోన్నతులు ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సీటీ అటెండర్ల సంఘం రాష్ట్ర సహధ్యక్షుడు సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
పేకాట క్లబ్బులకు ఎమ్మెల్యే నాని కవచం ?
సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే నాని సొంత మండలమైన పాకాలలో పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. బుధవారం పేకాట ఆడుతున్న నాని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని రాత్రి వరకు పోలీసులపై ఎమ్మెల్యే నాని ఒత్తిడి చేశారని సమాచారం. దీంతో ఆయన అండతోనే ఆయన అనుచరులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకాల మండలంలో పేకాట స్థావరాలను తిరుపతి ఎస్పీ కమాండ్ కంట్రోల్ నుంచి నడిచే డ్రోన్ కెమెరాలు గుర్తించడంతో స్పెషల్ బ్రాంచి పోలీసులు బుధవారం మెరుపుదాడి చేశారు. పలువురు నిందితులను పట్టుకున్నారు. వారిలో ఎమ్మెల్యే నాని ప్రధాన అనుచరులైన ప్రదీప్రెడ్డి, రాజానంద, పాలచిన్న ఉండగా, మరో ముగ్గురు అనుచరులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వారిని కూడా రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో రహస్యంగా సమాచారం సేకరించి, ప్లాన్ ప్రకారం మెరుపుదాడి చేయడంతో పేకాట సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో నగదు, పేకాట సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేకాట దందా చాలాకాలంగా నడుస్తున్నప్పటికీ, ఇంతవరకు అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. నగదు, వాహనాలు స్వాధీనం పాకాల మండలం చెన్నుగారిపల్లి పంచాయతీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు వారి నుంచి రూ.45 వేలు నగదు, 14 సెల్ఫోన్లు, ఒక ఆటో, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్పెషల్ బ్రాంచి పోలీసులు పాకాల పోలీసులకు అప్పగించారు. సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ తరుణ్ కేసు నమోదు చేశారు. మొదలైన హైడ్రామా పేకాట స్థావరంలో పట్టుబడిన వ్యక్తులను స్పెషల్ బ్రాంచి పోలీసులు స్థానిక పోలీసులకు అప్పగించగా అక్కడే అసలు హైడ్రామా మొదలైంది. పట్టుబడిన వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు పేకాట స్థావరంలో పట్టుబడిన వారిని వదిలి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
కొత్తగా తిరుపతి–అకోలా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి–అకోలా మధ్య రెగ్యులర్ బేసిస్పై వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకోలా–తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు –17430 నంబర్తో మే 3వ తేదీ నుంచి శుక్రవారాలు ఉదయం 9.15 గంటలకు అకోలాలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17429 నంబర్ రైలు మే 8వ తేదీ నుంచి ఆదివారాలు మధ్యాహ్నం 12.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు అకోలా చేరుకుంటుంది. ఇది తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్డు, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణా, బస్మత్, హింగోలి దక్కన్, వాసిం మీదుగా అకోలా చేరుకుంటుంది. -
వేగంగా అనుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పారదర్శక విధానంలో, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలకు ఆన్లైన్లో అందిన 22 క్లెయిమ్లకు రూ.67,14,637 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గండ్రాజుపల్లి పారిశ్రామిక పార్కు, జీడీ నెల్లూరు పరిధిలో విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, ఎల్డీఎం హరీష్, జిల్లా నైపుణ్యశాఖ అధికారి గుణశేఖర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష కలెక్టరేట్లో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన డిజిటల్ నెర్వ్ సెంటర్ అద్భుత ఫలితాలను ఇస్తోందన్నారు. ఈ సమీక్షలో టాటా బృందం నుంచి డాక్టర్ శ్రీకాంత్, తపస్దాస్, డీఎంహెచ్వో శశిభూషన్రెడ్డి పాల్గొన్నారు. -
● ఫెయిల్ అయితే నిరాశ చెందొద్దు ● సప్లిమెంటరీ ఉత్తీర్ణతకు అవకాశం ● ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ● నేడు పది పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : నేడు పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న వేళ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి లోకావొద్దని విద్యావేత్తలు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 129 కేంద్రాల్లో 21,062 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జీవితంలో భాగం మాత్రమే అని, అవే అంతిమం కాదని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. నిరాశ వద్దు ఫలితాలు ఏ విధంగా ఉన్నా విద్యార్థులు నిరాశ చెందొద్దని ఉపాధ్యాయులతో పాటు విద్యానిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మార్కులు వస్తే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులు కావొచ్చు. ఎంతో మంది మేథావులు పరీక్షల్లో తప్పినప్పటికీ జీవితంలో రాణించిన వారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితం ఒక మజిలీ పదవ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలు విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మజిలీ మాత్రమే. కానీ అదే ఆఖరి గమ్యం కాదు. ప్రతి విద్యార్థి పది నెలల పాటు కష్టపడి చదివి పరీక్షలు రాశారు. ఆ కష్టానికి, సమయపాలనకు, క్రమశిక్షణకు మొదట అభినందనలు తెలపాలి. తల్లిదండ్రులు ఫలితాలు చూడగానే ఎన్ని మార్కులు? అని అడగకూడదు. పరీక్ష బాగా రాశావు, కష్టపడ్డావు అని ముందు పిల్లలను దగ్గరకు తీసుకోవాలి. పక్కవారితో పిల్లలను పోల్చకూడదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఒక్క మాట వారి జీవితాన్నే మార్చేస్తుంది. – రాజేంద్రప్రసాద్, డీఈవో, చిత్తూరు -
ఈవీఎంల భద్రతలో రాజీవొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల భద్రతలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో ఈవీఎం గోడౌన్ను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామన్నారు. గోడౌన్న్లో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాల స్థితిగతులను తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 15.79 లక్షల మంది ఓటర్లు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 15,79,996 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మృతులు, బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఇందులో రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో డీఆర్వో మోహన్కుమార్, పలు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఉదయ్కుమార్రెడ్డి, సురేంద్ర, అట్లూరి శ్రీనివాసులు, గంగరాజు, పరదేశి పాల్గొన్నారు. -
‘దశ’మారేనా?
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. జిల్లా విద్యాశాఖ నెలల తరబడి చేసిన కసరత్తు, విద్యార్థుల కష్టం, టీచర్ల కృషి ఏ మేరకు ఫలించిందో గురువారం ఉదయం 11 గంటలకు తేలనుంది. గత ఏడాది సాధించిన ఫలితాల కంటే మెరుగైన స్థానానికి జిల్లా యంత్రాంగం చేరుకుంటుందా..? లేదా.. షరామామూలేనని చేతులెత్తేస్తుందా.. వేచి చూడాల్సి ఉంది. గత ఏడాది 67.06 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 24వ స్థానంలో నిలిచిన జిల్లా, ఈ సారైనా అగ్రస్థానంలో నిలుస్తుందా లేక ప్రచార ఆర్భాటలకే పరిమితమై అట్టడుగుకు పడిపోతుందా? అన్నది చర్చనీయంశంగా మారింది. మార్పు కనిపించేనా? గత ఏడాది సాధించిన 24వ స్థానం సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ప్రతిష్టకు పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఆ అవమానాన్ని తుడిచేయడానికి ఈ విద్యాసంవత్సరం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తున్నా, మౌలిక వసతులు చేపట్టకపోయినా కేవలం నైట్ స్టడీస్ పేరుతో హడావిడి చేయడం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది.గత ఫలితాలు ఇలాగురువారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను rerutr. bre.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ (9552300009) నంబర్, లీప్ మొబైల్ యాప్, డీజీ లాకర్ యాప్లో చూసుకునే వెసులుబాటు ఉంది. ఫలితాలు ఇలా చూసుకోవచ్చు -
వసంతోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి మే నెల 2వ తేదీ వరకు వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా 6 నుంచి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. వసంతోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు రూ.150 చెల్లించి ఉత్సవాల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. వసంతోత్సాల్లో మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అదే విధంగా రాత్రి 7.30 నుంచి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వేధిస్తున్న సిబ్బంది కొరత
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్షర జ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు నిరుపయోగంగా మారుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాల కొనుగోలు లేక నిర్వీర్యమవుతున్నాయి. పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడనంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు సిబ్బంది కొరత తోడవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలు మూతపడే స్థితిలోకి వెళ్లిపోయాయి. నిలువెల్లా నిర్లక్ష్యం ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాల కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 71 గ్రంథాలయాలుండగా ఇందులో 54 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 12 అద్దె లేనివి, అద్దె చెల్లించేవి 5 వరకు కొనసాగుతున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలో గ్రంథాలయాలకు వెళ్తే అప్డేట్ పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారికి అవసరమైన పుస్తకాలు కనిపించడం లేదు. దీంతోపాటు బ్యాంకు పోస్టులకు సంబంధించిన మ్యాథ్స్, రీజనింగ్, అర్థమేటిక్ పుస్తకాలు కూడా అప్డేట్ చేసినవి లేవు. కక్షగట్టి.. డిజిటల్ను పక్కనబెట్టి గత పాలనలో మంజూరైనన డిజిటల్ గ్రంథాలయాల భవన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం సగంలోనే పనులు ఆపేసింది. వీటిని అసలు పట్టించుకోవడం లేదు. వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి. దినపత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ తదితరాలను పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా చదువుకునే వెసులుబాటు కల్పించాలనేది గత ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. కానీ కూటమి వచ్చాక దీన్ని నిర్వీర్యం చేసింది. గ్రంథాలయాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా లైబ్రేరియన్, రికార్డు అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు కలిపి మొత్తం 70 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. జిల్లాలో ఉన్న 71 గ్రంథాలయాల పరిధిలో 66,303 మంది సభ్యులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. లైబ్రేరియన్ల కొరత కారణంతో కొన్ని లైబ్రేరిన్లకు ఇన్చార్జిలే దిక్కుగా మారారు. మరోవైపు ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న లైబ్రేరియన్లకు అదనపు పనిభారంతో పాటు ఆర్థిక భారం కూడా తోడవుతోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సెస్ బకాయిలు రూ.43 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో తిరుపతి కార్పొరేషన్ నుంచే రూ.22 కోట్లు, చిత్తూరు కార్పొరేషన్ రూ.5 కోట్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ రూ.3 కోట్లు, మిగిలిన మొత్తం మున్సిపాలిటీలు, పంచాయతీలు కలిపి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని కలెక్టర్లకు అధికారులు విన్నవిస్తూనే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కోనుగోలు, నిర్వహణ, పేపర్ బిల్లు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. పేరుకుపోయిన బకాయిలు -
విద్యాశాఖ ఉరుకులు.. పరుగులు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహించిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘స్పాట్ పెట్టేశారు’! కథనం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న ఈ అంశంపై సాక్షి గళమెత్తడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ కథనం పై బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్ స్పందించారు. అసలేం జరిగిందంటే... జిల్లా కేంద్రంలో జరిగిన మూల్యాంకనంలో దాదాపు 500 జవాబు పత్రాల మార్కులను ఆనన్లైన్ డేటా బేస్కు అనుసంధానించకుండానే మార్కులు శూన్యంగా చూపించడంతో అసలు విషయం బయటపడింది. ఈ తప్పిదం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వార్త ప్రచురితమైన వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎక్కడైనా డేటా సరిగ్గా సింక్ కాకపోతే, వాటిని సరిదిద్దే వ్యాలిడేషన్ ప్రోటోకాల్ రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులను రెండు సార్లు సరిచూసిన తర్వాతే తుది డేటా బేస్లోకి పంపామన్నారు. ఒక్క మార్కు కూడా తప్పుగా నమోదయ్యే అవకాశం లేదని తెలిపారు. వాల్యూయేషన్ నిర్వహణలో బాధ్యులైన సిబ్బందిపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యలకు ఆదేశించామని వివరించారు. -
నీట్కు పటిష్ట నిఘా
పేకాట క్లబ్బులకు నాని కవచం చంద్రగిరి ఎమ్మెల్యే నాని సొంత మండలమైన పాకాలలో పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో మే 3న నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణ పై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మూడు విద్యాసంస్థలను నీట్ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. మొత్తం 1,060 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో 456, లిటిల్ ప్లవర్ పాఠశాలలో 384, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష 3వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుందన్నారు. కీలక ఆదేశాలు సమావేశంలో నీట్ పరీక్ష నిర్వహణపై డీఆర్వో కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి అని చెప్పారు. నీట్ పరీక్షకు వచ్చే విద్యార్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్ డా.జీవనజ్యోతి పాల్గొన్నారు. -
సీనియర్ సివిల్ జడ్జీల బదిలీ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సీనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ.సునీతరాణి గుంటూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, మదనపల్లి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శిరీష్ను కర్నూలు జిల్లా నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా, శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణిని ప్రకాశం జిల్లా చీరాల సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా, నూజివీడు సీనియర్ సివిల్ జడ్జి షేక్ పెద్దకాసీంను పీలేరు సీనియర్ సివిల్ జడ్జిగా, కృష్ణా జిల్లా విజయవాడ మొదటి అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎమ్మెస్ కరీముల్లాను మదనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా, గుంటూరు జిల్లా రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి ఎస్పీడీ వెన్నెలను తిరుపతి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. అలాగే జడ్జి వెన్నెలను తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తిగా కూడా నియమిస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన న్యాయమూర్తులు మే నెల 11వ తేదీ లోపు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. జేఎల్ఎంలుగా గుర్తింపు చిత్తూరు కార్పొరేషన్: గత పాలనలో సచివాలయాల వ్యవస్థ ద్వారా విద్యుత్ సేవలందించడానికి ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్ఎం గ్రేడ్–2)లను నియమించారు. వీరి జీతభత్యాలు, పర్యవేక్షణ ట్రాన్స్కో ద్వారా నడుస్తోంది. అత్యవసర రంగంలో, సెలవు రోజుల్లోనూ సేవలందిస్తున్న వీరిని పలు ప్రభుత్వ సర్వేలకు వాడుకుంటున్నారు. దీంతో వారి విధి నిర్వహణకు అటంకం కలుగుతోంది. సర్వేల నుంచి మినహాయింపునివ్వాలని గతంలో జేఎల్ఎం–2లు కోరినా ఫలితం లేకుండా పోయింది. సర్వేలు చేయకుండా ఉన్నందుకు వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో సర్వేల నుంచి మినహాయింపునివ్వాలని, జేఎల్ఎంలుగా గుర్తించి పదోన్నతులు కల్పించడానికి అవకాశం కల్పించాలని న్యాయపోరాటం చేశారు. దీని పై వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇంధన ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ వారిని విద్యుత్ సేవలకు మాత్రమే వినియోగించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. అలాగే వారికి జేఎల్ఎంలుగా గుర్తింపునిచ్చారు. దీంతో ప్రస్తుతం నెలకు వస్తున్న బేసిక్ రూ.24,500 జీతం త్వరలో రూ.30,800కు చేరనుంది. వీటితో పాటు ఇతర ప్రోత్సాహకాలు కలిపి మరో రూ.10 వేల వరకూ జీతం పెరగనుంది. జిల్లాలో 285 మంది లబ్ధి పొందనున్నారు. భవిష్యత్లో శాఖా పరంగా పదోన్నతులు రానున్నాయి. విచారణ షురూ సాక్షి టాస్క్ఫోర్స్: కోవిడ్ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర అధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపడుతున్నారు. సాక్షి దినపత్రికలో ఇటీవల ‘కోవిడ్ నిధుల్లో చిలకొట్టుడు’ అనే శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విధితమే. దీనిపై జిల్లా అధికారులు పంపిన నివేదికల ఆధారంగా రాష్ట్ర స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. 14 నెలల కాలంలో జరిగిన మరిన్ని విషయాలను కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ బాగోతంలో మరో ఇద్దరిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత కోసం బ్యాంకులో సీసీ పుటేజీలను కూడా పరిశీలించనున్నారని తెలుస్తోంది. మార్పు కనిపించాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం ): వైద్య ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో మార్పు కనిపించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.నాగశశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో బుధవారం వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి ఏ సీడీ స్క్రీనింగ్లో రక్తపోటు, మధుమేహం అనుమానిత కేసుల గుర్తింపు, నమోదు, తదుపరి నిర్వహణలో కొన్ని పీహెచ్సీల పనితీరు, ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని డీఎంహెచ్వో తీవ్రంగా పరిగణించారు. జిల్లా సగటు 54 శాతం మాత్రమే నమోదవుతుండడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్సీ స్థాయిలో స్క్రీనింగ్, డయోగ్నోసిస్, ఫాలోఅప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. అలాగే చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమంపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఓపీ సెన్సస్ను తప్పనిసరిగా ఆన్న్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. -
రెండేళ్లుగా..ఏడిపింఛన్!
కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛనూ లేదు రెండేళ్లుగా మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేలు పింఛన్ మంజూరు చేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నేటికీ ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. పింఛన్ కోసం అభాగ్యులు సచివాలయాలు, మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రెండేళ్లుగా మహిళలను వేపిస్తున్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కార్వేటినగరం: ‘తమ్ముళ్లూ నేను ఒక్కటే చెబుతున్నా. మనం అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన నా అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు పింఛన్ మంజూరు చేస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఎంతమంది అర్హులుంటే అంతమందికి పింఛన్ అందిస్తా’ నంటూ చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. ఆపై అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ హామీని నిలబెట్టుకోలేక పోతున్నారు. కనీసం ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. 62 వేల మంది ఎదురు చూపు చిత్తూరు జిల్లాలో 50 ఏళ్లు వయస్సు దాటిన వారు 1,51,963 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు 94 వేల మందికి పైబడి ఉన్నారు. వీరిలో సుమారు 62 వేల మంది కొత్త పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబునాయుడు ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారని వాపోతున్నారు. గతంలో ప్రతీ ఆరు నెలలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసింది. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున అర్హులను ఎంపిక చేసి నూతన పింఛన్లు మంజూరు చేసేది. ఆ తర్వాత 2022–23లో ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్లతో ఎంపిక చేసి పింఛన్లు అందజేసేవారు. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదని పలువురు ప్రశ్ని స్తున్నారు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా నా భర్త ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీవనోపాధి కోసం నగరిలో తమలపాకుల వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. సచివాలయానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్కు దరఖాస్తును తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవుతోంది. దీన స్థితిలో ఉన్నా ప్రభుత్వానికి కనికరం లేదు. – కే.పార్వతి, వితంతువు, కొల్లాగుంట, కార్వేటినగరం ఏడాదిన్నరగా ఎదురు చూపు ఏడాదిన్నర కిందట భర్త చనిపోయాడు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతవులకు వెంటనే పింఛన్ ఇస్తామన్నారు. ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయానికి తిరుగుతున్నా కొత్త పింఛన్ మంజూరు చేయడం లేదు. ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. అసలే ఎస్టీ కులానికి చెందిన వారము. ఇంటి పెద్దను పోగొట్టుకుని కూలికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని పోషించాల్సి వస్తోంది. – వనిత, చాకలివానిగుంట, కార్వేటినగరం -
పెంచలకోనకు పట్టు వస్త్రాల సమర్పణ
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అధికారులు మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. పెంచలకోన దేవస్థానం ఈవో కోవూరు జనార్దన్రెడ్డి, పండితులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్టు డీఐఈవో రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఈ నెల 27తో ముగిసిన గడువును ఈ నెల 30 వరకు పెంచారన్నారు. ఆదాయపన్ను చట్టంలో వినూత్న మార్పులు చిత్తూరు అర్బన్: ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన ఆదాయపన్ను చట్టంలో కాలనుగుణంగా వినూత్న మార్పులు అమలు చేసినట్టు ఆదాయపన్నుశాఖ తిరుపతి రేంజ్ జాయింట్ కమిషనర్ డా.మురళీధరన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని ఓ హోటల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆదాయపన్ను చట్టంపై డీలర్లు, ప్రజలు, ఇతర రంగాల వాళ్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే ఐదుమార్లు ఈ చట్టంలో మార్పు చేశారని, 1961 తరువాత తాజాగా చేసిన మార్పులు ప్రజలకు సులభతరంగా అర్థమయ్యేలా ఉందన్నారు. ఏకంగా 283 సెక్షన్లను తొలగించినట్టు తెలిపారు. ప్రజలకు ఇందులో ఎలాటి సందేహాలు ఉన్నా చిత్తూరులోని ఆదాయపన్నుశాఖ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చన్నారు. డిప్యూటీ కమిషనర్ కెఎం.లక్ష్మణకుమార్, ఐటీవో కెవి.రమణరావు, ఇన్స్పెక్టర్ ఎం.సురేష్కుమార్ పాల్గొన్నారు. నెలరోజులు వాయిదా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వీబీజీరాంజీ చట్టాన్ని నెలరోజులు వాయిదా వేశారని డ్వామా అధికారులు వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మే నెలాఖరు వరకు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ నుంచి వీబీజీరాంజీ చట్టాన్ని అమలు చేయాలని ఇది వరకే ఉత్తర్వులు జారీచేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనిదినాలను పెంచినందు వల్ల కొత్త చట్టం అమ లును నెలరోజుల పాటు వాయిదా వేశారు. -
వైద్య సేవల్లో డిజిటల్ విప్లవం
యాదమరి: వైద్య రంగంలో తీసుకువస్తున్న డిజిటల్ సంస్కరణలు ప్రజలకు వరంగా మారనున్నాయని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన సంతగేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సౌఖర్యాలపై ఆరాతీశారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంజీవిని పథకం ఆవశ్యకతను వివరించారు. ఈ పథకంలో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతీ రోగికి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య కార్డులను అందజేస్తామని చెప్పారు. ఈ కార్డులో రోగి వైద్య చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంటుందన్నారు. తద్వా రా రోగులు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా వైద్యులు పాత రిపోర్టులు చూడాల్సిన అవసరం లేదన్నారు. దీంతో తక్షణమే మెరుగైన వైద్యం అందించవచ్చని చెప్పారు. అనంతరం ఆయన ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైధ్యాధికారులు డా.అనిల్కుమార్, జగదీష్, సీహెచ్ఓ శ్రీనివాసమూర్తి, వైద్య సహాయకులు సురేంద్రరెడ్డి, నాయకులు అమర్నాథనాయుడు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో 53 మంది బదిలీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) ఉద్యోగుల ప్రక్రియ పలు ఆరోపణల మధ్య కొనసాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కేజీబీవీల్లో దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగులను ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. సమయానికి ఉద్యోగులు వచ్చినప్పటికీ అధికారులు ఆలస్యంగా రావడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కౌన్సెలింగ్ ప్రారంభంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. బదిలీల కోసం మొదట ఆప్షన్ ఫారాలు స్వీక రించకుండా రాజకీయ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. అధికారులు చెప్పిన ప్రాంతాన్నే కోరుకోవాలని సిబ్బంది పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను నేరుగా పిలిపించి, ఖాళీల వివరాలను వెల్లడించిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమగ్రశిక్ష శాఖ అధికారులు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కేజీబీవీల్లో పనిచేస్తున్న 53 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎస్వోలు 9 మందిలో ఏడుగురు, పీజీటీల్లో 3, పీఈటీల్లో ఏడుగురిలో ఆరుగురు, సీఆర్టీలు 34 మంది పాల్గొన్నారు. ఒకే పాఠశాలలో ఎస్వో కేడర్లో ఐదేళ్లు, టీచర్ కేడర్లో ఎనిమిదేళ్లు, రెండేళ్లు పూర్తయిన వారికి అభ్యర్థన బదిలీలకు అవకాశం కల్పించారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి పూర్తి అయిన సంవత్సరాలను బట్టి బదిలీలు నిర్వహించారు. బదిలీల కౌన్సెలింగ్ లో ఆప్షన్లు కోరుకున్న ఉద్యోగులకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేస్తారని అధికారులు వెల్లడించారు. డీఈవో రాజేంద్రప్రసాద్, చిత్తూరు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, అన్నమయ్య జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ అనురాధ, కేజీబీవీ జీసీడీవో ఇంద్రాణి పాల్గొన్నారు. -
బాబు మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలి
గంగాధరనెల్లూరు: జీడీ నెల్లూరు మండలం, రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బాబు మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు బాబు మృతి చెందాడని ఆరోపించారు. పలు అక్రమ కేసులు బనాయించి, బైండోవర్ పేరుతో రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ బాబును తిప్పి తీవ్రంగా వేధించారని చెప్పారు. కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. దీనిపై నిజాయితీగా కేసుగట్టి, దోషులను శిక్షించాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మరణ వాంగ్మూల లేఖ బాబు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరణ వాంగ్మూల లేఖను నారాయణస్వామి మీడియాకు చూపారు. ఈ లేఖలో కూటమి ప్రభుత్వ వేధింపులు తళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టంగా ఉందని చెప్పారు. బాబు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడని పేర్కొన్నారు. బాబు మృతి పట్ల ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
కౌండిన్యలో ఇసుక తోడేళ్లు
పలమనేరు: కౌండిన్య నదిలో నీరు తగ్గడంతో ఇసుక స్మగ్లర్లు మళ్లీ పేట్రేగుతున్నారు. ఇప్పటికే నదిలో దాదాపుగా ఇసుకను తోడేశారు. బయటి నుంచి మట్టిని ట్రాక్టర్లతో తెచ్చి కౌండిన్య నదిలో రాత్రిపూట పోసి ఆపై జేసీబీలతో నీటిలోని మట్టిని, ఇసుకను కలియతిప్పి దాన్ని ఉడ్డలుగా పోసి ఎండబెట్టడం లాంటివి చేస్తున్నారు. మరికొందరు నదికి ఆనుకుని ఉన్న గడ్డలను సైతం జేసీబీలతో తోడి ఇసుకను రాబడుతున్నారు. స్థానిక క్యాటిల్ఫామ్ సమీపంలోని ఫారెస్ట్శాఖ నగవరనానికి ఆనుకుని అక్కడున్న ప్రహరీగోడను సైతం కూల్చేశారు. పక్కనున్న వృక్షాలను వేర్లతోపాటు పెకిళించేశారు. అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కొట్టేశారు. కౌండిన్య నదిలో పగలు, రాత్రి తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారు. కౌండిన్య నది నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో కూటమి నేతలకు ఇదో మేతలా మారింది. ఈ ప్రాంతాల్లోని నదిలో జేసీబీలతో ఇసుకను తోడే దృశ్యాలు, ట్రాక్టర్లకు ఇసుకను నింపే కూలీలు, వాహనాల కోసం నదిలో ఏర్పాటు చేసుకున్న దారులు ఎటూచూసినా కనిపిస్తుంటాయి. నది పక్కనున్న గడ్డ మట్టిని సైతం..! ఉచితంగా ఇసుకను తోడుకోమని సీఎం చంద్రబాబే చెప్పారనే మాటతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నదికి పక్కగా ఉన్న మట్టిని నదిలోని నీటిలో వేసి రాత్రుల్లో దాన్ని జేసీబీతో కలియతిప్పుతూ ఫిల్టర్ చేసి ఇసుకను తోడుతున్నారు. నదికి ఆనుకుని ఉన్న గ్రామాలకు చెందిన అక్రమార్కులకు ఇదో వృత్తిలా మారింది. ఇక్కడి ప్రతి గ్రామంలో ఇసుక తోలే ట్రాక్టర్లు, జేసీబీలు భారీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు వంద ట్రాక్టర్ల ఇసుక తరలింపు నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎంతలేదన్నా రోజుకు వంద ట్రాక్టర్ల ఇసుక వెళుతోంది. ఇసుకాసురులు అటు అధికారులు, ఇటు పోలీసులు చూసినా భయపడడం లేదు. ఇసుక తరలించే ట్రాక్టర్ను అడ్డుకునే ధైర్యం పో లీసులకు లేకుండా పోయింది. పట్టపగలే హైవేలో ఇసుకట్రాక్టర్లు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇసుక తవ్వకాల కోసం ఫారెస్ట్ శాఖ నగరవనం చెట్లను కొట్టేసిన దృశ్యంనదిలో ఎటూచూసినా ఇసుక తవ్వకాలే


