breaking news
Chittoor District News
-
ఆర్ఎస్కేల్లో యూరియా పంపిణీ
పలమనేరు: జిల్లాలోని రైతు సేవాకేంద్రాల ద్వారా యూరియాను పంపిణీ చేయనున్నట్టు డీఏఓ మురళీకృష్ణ తెలిపారు. ఆ మేరకు నియోజకవర్గంలోని పలు ఆర్ఎస్కేలో సాగుతున్న డీబీటీ(డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్) విధానాన్ని పరిశీలించారు. ఆపై పలమనేరులోని మనగ్రామోర్ దుకాణంలో రికార్డులను పరిశీలించారు. ఆర్ఎస్కేలో బయోమెట్రిక్ చేసుకున్న రైతులకు పండుగ తర్వాత యూరియా ను అందిస్తామన్నారు. ఒక్కో ఆర్ఎస్కేకు సగటున 150 బ్యాగులను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆయ న వెంట పుంగనూరు ఏడీ శివకుమార్ ఉన్నారు. -
వరసిద్ధునికి విరాళం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన ట్రస్టుకు మంగళవారం బెంగుళూరుకు చెందిన బాబు రూ.లక్ష, అలాగే కై కలూరుకు చెందిన మాధవి గోసంరక్షణ ట్రస్టుకు రూ. 3లక్షలు విరాళం అందజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వామి దర్శనం కల్పించారు. మండపాలకు ఉచిత విద్యుత్ చిత్తూరు కార్పొరేషన్: వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లాలోని వీధుల్లో ప్రతిష్టించే ప్రతిమల మండపాలకు తాత్కాలిక విద్యుత్ అనుమతికి ఎవరూ పైకం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా దసరా పండుగకు ఏర్పాటు చేసే అమ్మవారి మండపాలకు సైతం ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వివరించారు. -
ఫేక్ సర్టిఫికెట్లపై డేగ కన్ను
చిత్తూరు కలెక్టరేట్: ఫేక్ సర్టిఫికెట్లపై అధికారులు డేగ కన్ను వేశారు. మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థుల్లో చాలా వరకు ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్టు విద్యాశాఖ అధికారులకు ముందస్తు సమాచారం వెళ్లింది. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ఈనెల 28న చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న అపోలో యూనివర్సిటీ, ఆర్వీఎస్ నగర్లో ఉన్న ఎస్వీ సెట్లో సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంపికై న అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లకు ఈనెల 26 నుంచి కాల్లెటర్లను పంపారు. నకిలీ అయితే క్రిమినల్ కేసే అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తే సంబంధిత అభ్యర్థిపై క్రిమినల్ కేస్ నమోదు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండవన్నారు. ఒరిజనల్ సర్టిఫికెట్లు లేకపోయినా...అభ్యర్థులు పరిశీలనకు గైర్హాజరైనా ఉద్యోగం లేనట్టేనని స్పష్టం చేస్తున్నారు. దివ్యాంగులు, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో పరిశీలన చేయనున్నారు. సర్టిఫికెట్ కేంద్రాల్లో అభ్యర్థులకు తప్ప మిగిలిన వ్యక్తులకు, మీడియాకు అనుమతి లేదని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు ఇవే అభ్యర్థులకు పంపిన కాల్లెటర్ కాపీ సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తించినచో). అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం (వర్తించినచో). కాల్లెటర్లో సూచించిన ఇతర సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు -
● నేటి నుంచి కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవాలు ● శోభాయమానంగా ఆలయం ముస్తాబు ● ఆకట్టుకుంటున్న విద్యుత్, పుష్పాలంకరణలు
కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బుధవారంతో చవితి ప్రారంభమై సెప్టెంబర్ 16తో ఈ ఉత్సవం ముగియనుంది. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సా గాయి. ఆలయ క్షేత్రాన్ని శోభయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల వసతికి లోటూ లేకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పకడ్బందీగా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. క్యూలను విస్తరించారు. ఉచిత, శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనాల క్యూలను పెంచారు. మరింత మందికి అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేపట్టారు. ముందస్తు రద్దీ దృష్ట్యా ప్రసాద విక్రయ కేంద్రం వద్ద కూడా క్యూలైన్లు పెట్టారు. మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఆలయానికి రంగులు అద్ది.. కొత్త కళను తీసుకొచ్చారు. రథం, వాహనాలకు సైతం రంగులు వేశారు. అలాగే రంగువల్లులు వేసి వాటికి పెయింటింగ్ వేసి ఆకట్టుకునేలా చేశారు. ఇటూ చిత్తూరు నుంచి..అటు తిరుపతి మార్గం నుంచి స్వాగతం పలుకుతూ రోడ్డుకు ఇరువైపులా స్వాగత కటౌట్లను కట్టారు. మరమ్మతులకు గురైన పట్నంరోడ్డును బాగుచేయించారు. హోమపూజలు, పార్కింగ్ ఆలయ ఆవరణలో హోమ, యజ్ఞ పూజలు సైతం నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ను ముందస్తుగానే గుర్తించి.. మూడు చోట్ల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. గణేష్ సేవాసదన్ భవనానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో బస్సులు, పెద్దపెద్ద వాహనాలు నిలిచేందుకు అనువుగా స్థలాన్ని కేటాయించారు. బస్టాండు ఆనుకుని ఉన్న స్థంలో ఆటోలు, కార్లు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేపట్టారు. ఈవో నివాస భవనం వెనుక భాగంలో కూడా పార్కింగ్కు సిద్ధం చేశారు. అంతరాలయ దర్శనం రద్దు చవితిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో బుధవారం అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకు స్వామి దర్శనం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం కాణిపాకం: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు అధికారులు ఆదేశించారు. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్డీఓ, డీఎస్పీ, ఆలయ ఈవో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఓ పెంచలకిషోర్, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎంఅండ్హెచ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల ఘాట్లో తప్పిన ప్రమాదం
తిరుమల : ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం బేరింగ్ రాడ్డు విరిగిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపడంతో భక్తులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు తిరుమల నుంచి తిరుపతికి ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. బస్సు 57 మలుపు వద్దకు చేరుకోగా ఆకస్మాత్తుగా బస్సు ముందరి టైరు బేరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుకు రాసుకుంటూ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. బస్సు వేగం తక్కువగా ఉండడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపివేయడంతో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును పక్కకు తొలగించారు. బస్సులోని ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులో తిరుపతికి తరలించారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు తమిళనాడు చైన్నెకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం కారులో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం కారులో మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా 34 మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. అయితే కారులోని ఎయిర్ బెలూన్న్స్ ఓపెన్ కావడం, కారువేగం తక్కువగా ఉండడంతో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
సైనికుల్లా పనిచేయండి
కార్వేటినగరం: క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు యువత నడుం బిగించి సైనికుల్లా పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాడెపల్లిలోని ఆయన నివాసంలో మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి, కార్వేటినగరం మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్తో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి యువత ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. అంధికారం బలంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న రాక్షస పాలనకు స్వస్థిపలకాలని చెప్పారు. వారివెంట జిల్లా సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి కార్తీక్రెడ్డి, సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ఐటీ విభాగం మండల ప్రధాన కార్యదర్శి చరణ్ ఉన్నారు. -
ప్రయివేటు లే అవుట్కు గ్రావెల్
విజయపురం : మండలంలోని మహారాజపురం తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ ప్రయివేటు లేఅవుట్కు కూటమి నాయకులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. సుమారు 20 ఎకరాలు కలిగిన ఈ లేఅవుట్కు మట్టి తరలింపు కోసం కూటమి నాయకులు రూ.2 కోట్ల మేర ఒప్పదం కుదుర్చుకున్నట్టు సమాచారం. మంగళవారం మహారాజపురం గుట్ట నుంచి టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా గ్రావెల్ తరలించారు. ఒక టిప్పర్ గ్రావెల్ రూ.10 వేల చొప్పున 2000 ట్రిప్పుల గ్రావెల్ తరలించేందుకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. స్థానికులు సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియజేసినా వారు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. -
నిఘా కట్టుదిట్టం
కాణిపాకం: బ్రహోత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్కడక్కడ సీసీ కెమెరాలు బిగించారు. ఆలయం చుట్టూ మూడో కన్ను తెరిచారు. దీనికితోడు ఈసారి డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడానికి వివిధ శాఖల అధికారులకు అక్కడ విధులు నిర్వహించేలా కలెక్టర్, ఎస్పీ చర్యలు చేపట్టారు. ఆలయ అధికారులు సైతం ఉత్సవ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాగా ఈ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, ఈవో పెంచలకిషోర్ పరిశీలించారు. భక్తిశ్రద్ధలతో పూజిద్దాం పుంగనూరు: వినాయక చవితిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆది దేవుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించి కష్టాలు తొలగిపోయేలా ప్రార్థించాలని సూచించారు. -
వడమాలపేటలో నెమళ్లు ప్రత్యక్షం
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట సద్గురు సన్నిధి వద్ద మంగళవారం రెండు నెమళ్లు ప్రత్యక్షమయ్యాయి. విషయం తెలుసుకున్న పాదిరేడు గొల్లపల్లి బీట్ ఆఫీసర్ మునినాయక్ సద్గురు సన్నిధి వద్దకు చేరుకుని పరిశీలించారు. అవి పగటి పూట ఇక్కడకు వచ్చినా రాత్రి వేళకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతాయని సద్గురు సన్నిధి నిర్వాహకులు తెలిపారు. ఎరువుల దుకాణం తనిఖీ నగరి : నగరి మున్సిపల్ పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాన్ని మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి నిరంజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎరువులు అధిక ధరకు విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయాధికారి రామాంజనేయులు, ఏడీఏ కవిత, నగరి ఏవో రాఘవేంద్ర యాదవ్ ఉన్నారు -
వివాహానికి వెళ్లి వస్తూ!
బంగారుపాళెం: వివాహానికి వెళ్లి వస్తూ మొగిలి ఘాట్ దొరచెరువు వద్ద బెంగళూరు–చైన్నె జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. సీఐ శ్రీనివాసులు కథనం.. తమిళనాడులోని వేలూరుకు చెందిన సుల్తాన్బాషా కుటుంబ సభ్యులు కారు(టవేరా వాహనం, టీఎన్02వై2975)లో బెంగళూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి మంగళవారం వేకుమజామున 2.30 గంటలకు వేలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బంగారుపాళెం మొగిలి ఘాట్ దొరచెరువు స్పీడ్బ్రేకర్ల వద్ద ఉదయం 5.30 గంటల సమయంలో ముందువెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వేలూరు జిల్లా, సోలవరం తాలూకా, పాళెంపాకంకు చెందిన ఫొటోగ్రాఫర్ వినోద్కుమార్(45) మృతి చెందాడు. సుల్తాన్బాషా, అతని భార్య షబానాభాను, డ్రైవర్ బాలమురళీకృష్ణతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని హైవే మొబైల్ వాహనంలో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురిని వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు అతివేగంగా వెళ్లి ముందువెళ్తున్న ఐచర్ను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ!
కాణిపాకం: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. అష్టకష్టాలు పడి ఫ్యాక్టరీలకు తోలిన మామిడికి ఇంకా ప్రోత్సాహక నిధి రాకపోగా.. పరిశీలన పేరుతో అధికారులు కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లలో మామిడి సాగు చేయగా.. తోతాపురి రకం 39,895 హెక్టార్లల్లో సాగవుతోంది. తద్వారా 4,9,274 మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అయినట్టు అంచనా. ఈ పంటను విక్రయించడానికి రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. ఫాక్టరీల వద్ద పడిగాపులు కాశారు. కూటమి ప్రభుత్వం తోతాపురి కిలోకు రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా రూ.4 నిర్ణయించింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహక నిధిని దోచుకోవడానికి కూటమి నేతలు అడ్డదారులు తొక్కడం కనిపించింది. ఫ్యాక్టరీ లెక్కల్లో డబుల్ ఎంట్రీలు జిల్లాలో 43 మ్యాంగో ఫ్యాక్టరీలున్నాయి. వీటిల్లో 31 ఫ్యాక్టరీలు తోతాపురి కాయల కొనుగోలుకు ముందుకొచ్చాయి. గత జూలై మూడో వారం వరకు కాయలు కొనుగోలు చేశాయి. అప్పటి వరకు 49,530 మంది రైతులు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను తరలించారు. ఈ లెక్కలు తారుమారు కావడంతో పాటు బోగస్లున్నాయని కూటమికి చెందిన ఎమ్మెల్యేలే సభలు, సమావేశాల్లో ప్రస్తావించారు. దీనికితోడు సాక్షి దినపత్రికలో సైతం తమిళనాడు కాయలను తీసుకొచ్చి ప్రోత్సాహక నిధి కోసం ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారని కథనాలొచ్చాయి. దీనిపై అధికారులు సైతం స్పందించారు. ఆ జాబితాను పరిశీలనకు పెట్టారు. గత రెండు నెలలుగా ఈ పరిశీలన సాగుతోంది. రెండు రోజుల క్రితమే ఫ్యాక్టరీలకు కాయలు తరలించిన రైతుల వివరాలను వెల్లడించారు. ఇందులో డబుల్ ఎంట్రీలు ఉన్నట్టు గుర్తించారు. పంట లేకుండా కాయలు విక్రయించిన రైతు వివరాలను కూడా గుర్తించినట్లు సమాచారం. ర్యాంపు జాబితా పూర్తయినా వెంటనే అధికారులు ఈ గోల్మాల్ను బయటపెట్టనున్నారు. ర్యాంపు జాబితా గందరగోళం జూలై నెలాఖరు వరకు ర్యాంపుల ద్వారా తోతాపురి కొనుగోలు సాగింది. 30,600 మంది రైతులు 1.44 లక్ష మెట్రిక్ టన్నుల కాయలను ర్యాంపులకు విక్రయించారు. ఈ కొనుగోలు లెక్కలు గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది కూటమి నేతలు తోతాపురి కాయలను ర్యాంపులకు తీసుకెళ్లి వేబిల్లు వేసుకుని కాయలు దింపకుండా.. సిబ్బంది చేతికి వేబిల్లు, ఆధార్, పాసు పుస్తకం మాత్రమే ఇచ్చారు. మళ్లీ మరో ర్యాంపుకెళ్లి ఇదేమాదిరిగానే కాయలు తోలినట్లు పత్రాలు ఇవ్వడం.. తప్పుడు లెక్కల్లోకి ఎక్కించారు. ఇదంతా పలమనేరు, వీ.కోట, బంగారుపాళ్యం వంటి ప్రాంతాల్లో అధికంగా చోటుచేసుకుంది. అలాగే నీలం రకాన్ని కూడా తోతాపురి లెక్కల్లోకి కలిపేశారు. రెండు రోజుల నుంచి ఈ జాబితా లెక్కలను పరిశీలిస్తున్నారు. రూ.8 మాట ఏమైంది? మామిడిలోని తోతాపురి రకానికి ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సూచించింది. ఇవ్వని ఫ్యాక్టరీలను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీచేసింది. అయితే ఇప్పుడు ఫ్యాక్టరీలు తోతాపురికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు.మద్దతు ధర ఇవ్వాలి ఫ్యాక్టరీకి 40 టన్నుల తోతాపురి కాయలు తరలించాను. దీనికి ఫ్యాక్టరీ 38 టన్నులకు కిలో రూ.4.9 పైసలు చొప్పున నగదును బ్యాంగు ఖాతాలో జయచేసింది. 12 టన్నుల కాయలకు బిల్లు రావాల్సి ఉంది. వచ్చే ఏడాదికి పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేదు. – కుప్పారెడ్డి, మామిడి రైతు, కార్వేటినగరం మండలం కిలో రూ.5నా? మామిడి సీజన్ ఆరంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోతాపురి కేజీకి రూ.12 చొప్పున మద్దతు ధర ప్రకటించారు. ఇందులో ఫ్యాక్టరీలు కిలోకు రూ.8, ప్రభుత్వం ప్రోత్సాహక నిధికింద రూ.4 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పలు ఫ్యాక్టరీలు రూ.5 మాత్రమే ఇస్తున్నాయి. –హరిబాబునాయుడు, జిల్లా మామిడి రైతు నాయకుడు, చిత్తూరు మండలం -
కుప్పంలో కస్సు.. బస్సు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కుప్పంలో మహిళలకు ఉచిత బస్సు పథకం తూతూమంత్రంగా సాగుతోంది. ఉచితానికి అర్హత ఉన్న 27 బస్సులను అంతర్రాష్ట్ర సర్వీసులుగా తిప్పుతున్నారు. ఇక పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులను సైతం తమిళనాడు చుట్టూ తిరిగొస్తున్నాయి. దీంతో ఉచిత ప్రయాణం రోజువారీగా 31శాతం దాటడం లేదని అధికారులు గణాంకాలు కట్టారు. ఈ అరకొర సేవలపై మహిళలు మండిపడుతున్నారు. దీనికితోడు బెంగళూరుకు జీరో సర్వీసులంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి ఈ అరకొర సేవలపై స్పందించాలని మహిళలు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం ఐదు డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం అద్దె బస్సులతో కలిపి 461 సర్వీసులు నడుస్తున్నాయి. అయితే చిత్తూరు–2డిపో తర్వాత కుప్పం డిపోకే అధిక సర్వీసులున్నాయి. ఆ డిపోలోనే అత్యధికంగా ఉచిత బస్సులకు కోతలు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సీ్త్రశక్తి పథకానికి 339 బస్సులు అర్హత ఉంటే .. వీటిల్లో 75 వరకు అంతర్రాష్ట్ర సర్వీసులుగా తిరుగుతున్నాయి. కోతలు ఇలా! కుప్పం డిపో పరిధిలో మొత్తం 100 సర్వీసులున్నాయి. ఇందులో పల్లెవెలుగు 59, ఎక్స్ప్రెస్16, సప్తగిరి 17, సూపర్లగ్జరీ 8 సర్వీసులున్నాయి. ఇందులో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 75 దాకా ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలకు అర్హత ఉన్నా... 27 సర్వీసులను అంతరాష్ట్ర సర్వీసులంటూ తిప్పుతున్నారు. ఇందుల్లో పల్లెవెలుగు సర్వీసులు 25, ఎక్స్ప్రెస్ 2వరకు ఉన్నాయి. వీటిని కేజీఎఫ్, క్రిష్టగిరి, తిరపత్తూరు, వాణియంబడి, వేలూరుకు నడిపిస్తున్నారు. ఈ కారణంగా 100 బస్సుల్లో ఉచితానికి 48 బస్సులు మాత్రమే మిగిలాయి. దీనికితోడు తిరుపతి, చిత్తూరు మీదుగా కుప్పంకు 39 సర్వీసులుటే ఇందులో కేవలం 14 సర్వీసులు మాత్రమే ఉచితమంటున్నారు. ఇక చిత్తూరు–2డిపో పరిధిలో 79 బస్సులకు అర్హత ఉంటే 27 సర్వీసులు అంతర్రాష్ట్ర సర్వీసులంటూ చేతులెత్తేశారు. కుప్పం– బెంగళూరుకు బస్సు ఏదీ? కుప్పం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో బెంగళూరుకు వలస వెళుతుంటారు. అక్కడ ఉపాధి చేస్తూ...కుప్పంలో జీవనం గడుపుతున్నారు. ఇలాంటి వారికి ఆర్టీసీ ప్రయాణం ఆమాడదూరంలో ఉంది. కేజీఎఫ్ వరకు మాత్రమే రెండు సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక కుప్పం వాసులు నరకం అనుభవిస్తున్నారు. డిపో అర్హత ఉన్న అంతర్రాష్ట్రల సర్వీసులు సర్వీసులు (పల్లెవెలుగు,ఎక్స్ప్రెస్) (పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్) చిత్తూరు 165 17 చిత్తూరు 279 27 పలమనేరు 57 5 పుంగనూరు 63 5 కుప్పం 75 27 -
దోపిడీ దొంగ అరెస్టు
చిత్తూరు కార్పొరేషన్: రైల్లో దోపిడీ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న దొంగను సోమవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.5.76 లక్షల విలువ చేసే 64 గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్లో రైల్వే రేణిగుంట సీఐ యతీంద్ర వివరాలను తెలియజేశారు. ఈనెల 6న తిరుపతి–మదనపల్లికి వెళ్తున్న వేసవి ప్రత్యేక రైలులో తిరుపతికి చెందిన కవిత ప్రయాణిస్తోందని తెలిపారు. పాకాల సమీపంలో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని దొంగులు ఆమైపె కత్తితో దాడి చేసి మెడలోని బంగారు మంగళ సూత్రం, గొలుసు, ఇతర ఆభరణాలను దోచుకెళ్లారన్నారు. దర్యాప్తులో దొంగను గుర్తించి ఆరెస్టు చేసినట్టు వెల్లడించారు. -
రండి బాబూ రండి.. నేడే ఆఖరు!
చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం బార్ల నిర్వహణ కోసం లైసెన్సులు జారీ చేయడానికి అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్పై వ్యాపారుల్లో స్పందన కరువైంది. గతవారం నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. మంగళవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. ఈ క్రమంలో బార్ల నోటిఫికేషన్ గడువును పొడిగించడం తప్ప.. ప్రభుత్వం వద్ద మరో మార్గం లేదని వ్యాపారాలు చెబుతున్నారు. ఇషారాజ్యమే కారణమా? జిల్లాలో 2025–28 సంవత్సరానికి మొత్తం మూడేళ్ల పాటు మద్యం బార్లను నిర్వహించడానికి ప్రభుత్వం గత వారం నోటిఫికేషన్ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో 10 మద్యం బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి మించిన పాలసీ ఎప్పుడూ చూడలేదని, ఇదే ఉత్తమ పాలసీ అంటూ ఎకై ్సజ్ అధికారులు ఊదరగొట్టారు. మరి ఇంతటి ఉత్తమ పాలసీకి ఆఖరు తేదీ వస్తున్నా, ఎందుకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ప్రశ్నిస్తే.. మౌనమే సమాధానం. మద్యం దుకాణంతో పోలిస్తే బార్కు లైసెన్సు ఫీజు తక్కువే. లాభాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఇదే సమయంలో బార్ నిర్వహణ, రెస్టారెంట్, పనిచేసే వాళ్ల సంఖ్య, ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే బార్లు నిర్వహిస్తున్న వాళ్లు చెబుతున్నారు. ఇది కాకుండా ప్రతీ బార్ కోసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామని షరతు పెట్టడం, ఒక్కో దరఖాస్తుకు నాన్–రీఫండబుల్ ఫీజు రూపంలో రూ.5.1 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉండడం లాంటివి బార్ పాలసీని నీరుగారుస్తున్నాయి. ఇక మద్యం బార్ పెట్టే ప్రతీచోటా స్థానిక ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు 4 శాతం ఇవ్వాలని ఇప్పటికే పచ్చ నేతలు తీర్మానం చేశారు. ఇంత మొత్తం ఖర్చుపెట్టుకుని, పెట్టుబడి కూడా రాకుంటే వ్యాపారం చేయడం కష్టమని చాలా మంది బార్ పాలసీపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. స్పందన లేదాయె! చిత్తూరు నగరంలో ఏడు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీల్లో ఒక్కో బార్కు దరఖాస్తులు పిలిచినా అధికారులకు ఆశాభంగం తప్పలేదు. 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 28న లాటరీ పద్ధతిలో లైసెన్సు దారుడిని ఎంపికచేస్తామని చెప్పారు. కానీ గడువు దగ్గరకు వచ్చేస్తున్నా ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తుకు ముందు ఆసక్తి ఉన్న వాళ్లు పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకుంటారు. జిల్లాలో కేవలం 11 మంది మాత్రమే పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బార్కు నాలుగు దరఖాస్తులు వస్తేనే, లైసెన్సు ప్రిక్రయ కోసం లాటరీ పద్ధతి నిర్వహిస్తారు. లేకుంటే మొత్తం ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంది. గడువు పెంచుతారా? బార్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును పెంచుతారని ప్రాథమికంగా తెలుస్తోంది. కల్లుగీత సామాజికవర్గానికి చిత్తూరు నగరంలో ఒక బారు రిజర్వు చేయడం, దానికి 50 శాతం లైసెన్సు ఫీజు రాయితీతో 28 తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. 30న లాటరీ నిర్వహిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. 28వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు పెంచి, 30న లాటరీ నిర్వహించడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
కాణిపాక ఆలయ అర్చకుడి కన్నుమూత
ఐరాల: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి అనుసంధానమైన ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న హరీష్(50) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మృతుడు మండల కేంద్రంలోని వీఎస్ అగ్రహారంలో నివాసముంటున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయం ఈఓ పెంచల కిషోర్ గ్రామానికి చేరుకుని హరీష మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చిత్తూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ప్రభుత్వాస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దాదాపు 80 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందతూ ఆదివారం కన్నుమూశాడు. ఇతని కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో వైద్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలిస్తే ఫోన్–9491074517, 9440796706 నంబర్లకు సంప్రదించాలని టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కోరారు. ఏపీసీకి ఉద్యోగోన్నతి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్షాశాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణకు తన మాతృశాఖలో ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మాతృశాఖ అయిన కో–ఆపరేటివ్ శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్లో ఉన్న ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీగా డెప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన మాతృశాఖలో తాజాగా ఆయనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్ నుంచి డివిజనల్ లెవల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఉద్యోగోన్నతి కల్పించడంతో పాటు ఆయనకు చిత్తూరు డివిజన్ లెవల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆయన ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీగా రిలీవ్ కానున్నారు. -
పకడ్బందీగా స్వామిత్వ కుటుంబ సర్వే
ఐరాల: స్వామిత్వ కుటంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, డీపీఓ సుధాకర్నాయుడు ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శలతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఆయా గ్రామాల పరిధిలోని ప్రతి ఇంటినీ సర్వే చేయాలని సూచించారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రతి కుటుంబానికీ స్వామిత్వ కార్డును అందజేయాలని ఆదేశించారు. డీపీఓ మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వే, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎంపీడీఓ ధనలక్ష్మి, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
అధ్యక్ష పదవికి.. సంకులసమరం!
చిత్తూరు అర్బన్: ‘పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు కార్యాలయానికి రావడానికి కూడా చాలామంది మొహం చాటేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పదవుల కోసం పాకులాడుతున్నారు. ఉదయం పచ్చ కండువా.. చీకటి పడితే ప్రత్యర్థులతో లాలూచీ.. అలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకండి. ఆ కోవర్టుల వల్ల పార్టీ నాశనం అవుతుంది..’ అంటూ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తన గళాన్ని గట్టిగానే వినిపించారు. చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవితో పాటు అనుబంధ కమిటీల కూర్పు కోసం రాష్ట్ర పార్టీ నాయకత్వం అభిప్రాయ సేకరణకు దూతలను పంపింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖా మంత్రి బిసి.జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావుతో కూడిన త్రిసభ్య కమిటీ సోమవారం చిత్తూరులోని ఓ హోటల్లో భేటీ నిర్వహించింది. చిత్తూరు ఎంపీ ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్యేలు జగన్మోహన్, థామస్, నాని, భానుప్రకాష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. దందాలు చేసుకోవడానికా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తులు, ఇప్పుడు జిల్లా అధ్యక్ష అందలం ఎక్కి వ్యాపారాలు, దందాలు చేసుకోవడానికి తప్ప.. పార్టీ బలోపేతానికి కాదని పలువురు సీనియర్లు వారి అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ ఎదుట కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ సామాజికవర్గానికి ఇవ్వాలని, తెలుగు యువతను బీసీకు ఇవ్వాలని పలువురు పట్టుబట్టినట్లు తెలిసింది. అయితే వచ్చిన దరఖాస్తులను, ఎమ్మెల్యేలు, ఎంపీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనున్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఏదిఏమైనా టీడీపీలో నూతన కమిటీ కూర్పు తేనెతుట్టెను కదిపినట్లేనని.. లాబీయింగ్కు పదవులు దక్కుతాయో..? కష్టపడేవాళ్లను గుర్తిస్తారో..! చూడాలని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. తమకే కావాలి! ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సిఆర్.రాజన్కు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఆయన్ను దానికే పరిమితం చేసేలా ఓ వర్గం ప్రణాళిక రూపొందించింది. రాజన్ స్థానంలో జిల్లా అధ్యక్ష పదవిని కమ్మ సామాజికవర్గానికే కేటాయించాలని పలువురు త్రిసభ్య కమిటీ ఎదుట అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇద్దరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే నిర్ణయాన్ని వెల్లిబుచ్చి.. రాజన్ నాయకత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. కమ్మ సామాజికవర్గం నుంచి బంగారుపాళ్యంకు చెందిన ఎన్పి.జయప్రకాష్నాయుడు, చిత్తూరుకు చెందిన చెరుకూరి వసంత్కుమార్ నాయుడు, పాలసముద్రం భీమినేని చిట్టిబాబు నాయుడు, పుత్తూరుకు చెందిన పోతుగుంట విజయబాబు, చంద్రగిరికి చెందిన హేమాంబరరావు తదితరులు 15 మంది వరకు ప్రతిపాదనలను త్రిసభ్య కమిటీకి అందజేశారు. ఇక కుప్పంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కూడా తన దరఖాస్తును అందజేశారు. -
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
చిత్తూరు అర్బన్/నగరి : చిత్తూరు జిల్లాలో సోమవారం గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం.. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులోని రోసీనగర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న గణేష్, లోకేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ బంగారుపాళ్యంకు చెందిన వ్యక్తులని.. మరోవ్యక్తి పారిపోయాడని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ రమేష్బాబు పాల్గొన్నారు. నగరి మండలంలో.. నగరి మండలం, తడుకుపేట గ్రామం తిరుపతి–చైన్నె హైవేకి ఆనుకుని ఉన్న మిక్సింగ్ ప్లాంట్ వద్ద ఎస్ఐ విజయ్నాయక్, ట్రైనీ ఎస్ఐ తేజస్విని పోలీసులు, డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం, చైన్నె ఆవడికి చెందిన వెంకటేష్ (23), డి.కమలేష్ (18) తమకు ముందస్తు పరిచయం ఉన్న నగరి తడుకుపేట ఎస్టీ కాలనీకి చెందిన ఉదయ్ కిరణ్ (23), దేవేంద్ర(24) వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తుండగా వారిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసేవారిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరచిన సిబ్బంది సత్య, గజేంద్ర, కదిరివేలు, గోపి, లోకనాథం, రవి, సురేష్, రమేష్ను అభినందించారు. -
ఇదేంది‘గురూ’?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేస్తున్న ప్రచార ఆర్భాటం అంతాఇంత కాదు. ఏడాది తర్వాత మెగా డీఎస్సీని నిర్వహించారు. తీరా పరీక్షలు పూర్తి అయ్యాక మెరిట్ జాబితా విడుదల చేశాక స్పష్టమైన ఎంపిక అభ్యర్థుల జాబితాలు ఇవ్వకుండా దోబూచులాడుతున్నారు. ఈనెల 25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఆపై ఏమైందో ఏమో వెంటనే 26వ తేదీ అంటూ మరో మారు ప్రకటించి గందరగోళం సృష్టించారు. సోమవారం సాయంత్రం జిల్లావిద్యాశాఖ అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 28వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆంతర్యమేమిటో మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలను వాయిదా వేయడం పట్ల ఆంతర్యమేమిటో అర్థం కాలేదని పలువురు పెదవి విరుస్తున్నారు. రోజుకొక జాబితాను విడుదల చేస్తున్న విద్యాశాఖ అధికారుల తీరు పట్ల అభ్యర్థులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమకు అనుకూలమైన అభ్యర్థుల కోసం పాకులాడుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. రాత్రుల్లో సందేశం..ఉదయాన్నే పరిశీలన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియలో రాత్రుల్లో సందేశం పంపి హడావుడి చేసి ఉదయాన్నే పరిశీలనకు హాజరుకావాలనే విధంగా ప్రవర్తిస్తోంది. ఆకస్మిక నిర్ణయాలతో అభ్యర్థుల్లో వివిధ ప్రాంతాల్లో, వివిధ సమస్యలతో ఉంటే ఎలా పరిశీలనకు విచ్చేస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎంపికై న అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఎస్పీ మణికంఠ ప్రారంభించారు. ఇటీవల వెలువడ్డ కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాల్లో 310 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే వెరిఫికేషన్కు 296 మంది హాజరయ్యారు. వీళ్లందరి సర్టిఫికెట్లను పరిశీలించారు. త్వరలోనే శిక్షణకు సంబంధించిన కాల్లెటర్లు అందుతాయని అధికారులు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడతూ పోలీసు ఉద్యోగమంటే నిజాయితీ, నిబద్ధతతో కూడకున్నదని, సమాజ భద్రతో కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజశేఖర్రాజు, శివానంద కిషోర్, డీఎస్పీ చిన్నికృష్ణ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,119 మంది స్వామిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. -
శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఆహ్వాన కటౌట్ ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. ఆలయానికి బ్రహ్మోత్సవ శోభను తీసుకొస్తున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లను పెంచారు. మంగళవారం సాయంత్రం నాటికి ఈ ఏర్పాట్లను పూర్తిచేయనున్నారు. అలాగే 28న జరిగే ధ్వజారోహణాన్ని పురస్కరించుకుని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి పచ్చని పందిరి కొయ్యను నాటారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, ఈఈ వెంకట నారాయణ, సిబ్బంది బాలాజీ నాయుడు పాల్గొన్నారు. – కాణిపాకం -
‘సిద్ధి’ వినాయకా..‘బుద్ధి’ ప్రదాయకా
కాణిపాకం : సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెబితే సింహ స్వప్నంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రం బాసిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ సిద్ధి, బుద్ధిని దర్శిస్తే.. విఘ్నాలు హరించి..సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానం 1000 ఏళ్ల చర్రిత ఉంది. ఏటా ఈ క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈనెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాణిపాక ఆలయంపై ప్రత్యేక కథనం.ఆలయ ప్రాశస్త్యం ఇదీ..పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ..వ్యవసాయే జీవనాధారంగా బతికేవారు. ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి. గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు. బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఆ ముగ్గురు సోదరులకు అంగ వైకల్యం మటు మాయమైంది. ఈ విషయం ఆ నోట..ఈనోట పడి..ఊరంతా తెలిసింది. ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించింది. బావిలోని గణనాథుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాణి భూమి (కాణి అంటే ఎకరం పొలం అని అర్థం)లోకి పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాణిపారకమ్ కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామి వారు స్వయంభుగా వెలసి.. కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీర్ణోద్ధరణ పనులుకాణిపాకం ఆలయం సుమారు 1000 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.. చోళుల కాలంలో ఆలయం నిర్మితమైనట్లు పూర్వీకు లు చెబుతున్నారు. 11వ శతాబ్ధం..కుళతుంగ చోళ రాజు పరిపాలనలో ఆలయ నిర్మాణం జరిగినట్లు ఆధారాలున్నాయి. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో (2011) ఆలయ జీర్ణోధరణకు నోచుకుంది.తప్పుడు ప్రమాణాలు చేస్తే.. శిక్ష ఖాయంసత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వెలుగొందుతోంది. తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే..ఆదిదేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే..వాటికి దూరంగా ఉంటారని భక్తుల నమ్మకం. సవాల్..ప్రతి సవాల్ల్లో కూడా సత్య ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని ప్రతి ఒక్కరూ తలచుకుంటారు. దీంతో పాటు గణపతి హోమం, సంకటహర గణపతి వ్రతాలకు భక్తుల విశేషంగా కొలుస్తారు.27 నుంచి బ్రహ్మోత్సవాలుకాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రోజు స్వామి వారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్ పనులను పూర్తి చేశారు. పుష్పాలంకరణ, అన్నదానం, ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల వసతులు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతి రోజు అభిషేకం, స్వామి దర్శనం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనుంది.సేవలు ఇలా..తేదీ పగలు సేవలు రాత్రి సేవలు27 వినాయకచవితి గ్రామోత్సవం28 ధ్వజారోహణం హంసవాహనం29 నెమలివాహనం బంగారు నెమలివాహనం30 – మూషిక వాహనం31 బంగారు బంగారుచిన్నశేషవాహనం పెద్దశేషవాహనం1–09 చిలుక వాహనం వృషభవాహనం02 – గజవాహనం03 రథోత్సవం –04 బిక్షాండి తిరుకల్యాణం,అశ్వవాహనం05 ధ్వజారోహణం ఏకాంత సేవ,వడాయత్తు ఉత్సవంప్రత్యేక ఉత్సవాలుతేది వాహనసేవ06–09–2025 అధికార నంది వాహనం07 రావణ బ్రహ్మవాహనం08 యాళి వాహనం09 సూర్యప్రభ వాహనం10 చంద్రప్రభ వాహనం11 కల్పవృక్ష వాహనం12 విమానోత్సవం13 పుష్పపల్లకీ14 కామధేను వాహనం15 పూలంగిసేవ16 తెప్పోత్సవం -
ఆశచూపి దోచేశారు!
●చౌడేపల్లె: కష్టపడి సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత దాచుకోవాలని ఆశపడ్డారు. దాచుకొన్న డబ్బును వృద్ధాప్యంలో అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందన్న ఆశతో అవని కోఆపరేటివ్ సొసైటీ సంస్థలో దాచుకున్నారు. అయితే ఆ సంస్థ వారి డబ్బును దోచేసింది. ఈ విషయం గుర్తించిన బాధితులు ఏళ్ల తరబడి న్యాయం కోసం అధికారులు, పోలీసులకు విన్నవించినా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, బి.కొత్తకోట, గుర్రం కొండ, పలమనేరు, బంగారుపాళెం, పాకాల, పీలేరు తదితర ప్రాంతాల్లో 2014లో ఏజీఎస్ పరివార్ మ్యాచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరుతో చిన్న ప్రైవేటు బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో భవనాలను అద్దెకు తీసుకుని బ్యాంకు శాఖల ఏర్పాటుతోపాటు సిబ్బందిని నియమించి గ్రామాల్లో పరిచయం ఉన్న వారితో ఖాతాలను తెరిపించారు. వారికి ఆశ చూపి తమ బ్రాంచిలో అనేక లబ్ధి పొందే పథకాలున్నాయని, చదువులేని, పేదలకు ఆశచూపారు. తమ వద్ద పెన్షన్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్, రోజువారీ ఖాతా, నెలవారీ ఖాతా , సేవింగ్స్ ఖాతా, ఆర్డీ తదితర సేవలున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులను పరిచయం చేసుకుని, ఏజెంట్ల ద్వారా భారీగా నగదు వసూలు చేశారు. 20 వేల మందికి పైగా ఖాతాదారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సంస్థలో సుమారు 20 వేల మందికి పైగా ప్రజలు ఖాతాలు ప్రారంభించారు. వారి నుంచి డిపాజిట్లను సేకరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, చిన్నపాటి వ్యాపారుల నుంచి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా రోజుకు రూ.100 నుంచి రూ.1500 వరకు ఏజెంట్లతో నగదు వసూలు చేయించారు. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు గడువు విధించారు. గడువు తీరిన ఖాతాదారులకు అదనంగా 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి సొమ్ము చెల్లించేలా నింబంధనలు పెట్టి టోకరా వేశారు. రూ.50 కోట్లకు పైగా దోచేశారు ఖాతాదారుల నుంచి డిపాజిట్లు రూపంలో సుమారు రూ.50 కోట్లకు పైగా దోచేశారని బాధితులు తెలిపారు. కష్టపడి సంపాదించిన నగదు డిపాజిట్ల రూపంలో పరుల పాలైందని గుర్తించిన లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో లబోదిబో మంటూ బోరున విలపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.సంస్థకు నగదు చెల్లించిన పాసు పుస్తకాలు, ఖాతాదారులకు సంస్థ ఇచ్చిన బాండ్లు చెక్ ఇచ్చారు..డబ్బులు ఎగ్గొట్టారు రోజంతా కష్టపడితే రూ.200 కూలీ ఇస్తారు. నెలకు రూ.వెయ్యి చొప్పున సంస్థకు చెల్లించాను. వృద్ధాప్యంలో అవసరాలకు వాడుకోవచ్చని ఆశపడి కట్టారు. గడువు తీరిందని తెలిపితే నాకు ఒక చెక్కు ఇచ్చారు. బ్యాంకుకెళ్లితే డబ్బులు ఇవ్వలేదు. సంస్థ కార్యాలయం వద్దకు వెళ్లితే సమాధానం చెప్పేవారు కూడా లేరు. – సాకమ్మ, పెద్దకొండామర్రి ఏమిచేయాలో దిక్కుతోచడంలేదు వృద్ధాప్యంలో ప్రభుత్వం నాకు ఇచ్చే పింఛన్ డబ్బును అవని కోఆపరేటివ్ సొసైటీలో కట్టాను. నేను కట్టిన డబ్బును మోసం చేసి కాజేశారని తెలిసి కుమిలిపోతున్నాను. నా లాంటి పేదలను ఇలా మోసం చేయడం తగదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. మీరైనా న్యాయం చేయండి. – లక్ష్మమ్మ, పెద్దకొండామర్రి -
అర్చకుల పేరుతో ఘరానా మోసం
శాంతిపురం : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయ పూజారుల పేరుతో వచ్చి ప్రజల భక్తిని సొమ్ము చేసుకునే ముఠా సులువుగా లక్షలు దోచుకుంటోంది. ఆలయాల పవిత్రత, భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా ఓ ముఠా దందా సాగిస్తోంది. మీ ఇంట్లోకి రావచ్చా... అకస్మాత్తుగా ఇంటి ముందుకు ఓ ఐదుగురు పురోహితులు వచ్చి ‘మీ ఇంట్లోకి రావచ్చా’ అని అడుగుతారు. స్వాములు వచ్చారని లోనికి రమ్మనగానే అందరూ ఒక్కసారిగా ఏవో మంత్రాలు చెబుతూ ఇంట్లోకి వస్తారు. మంత్రాలను కొనసాగిస్తూ పూజ తట్ట తీసుకురమ్మని అందులోకి విభూది, కుంకుమ, నాలుగు పూలు వేసి ఇంట్లో వాళ్ల చేతిలో పెడతారు. తమలో ముగ్గురు కాణిపాకం ఆలయ అర్చకులమని, మరో ఇద్దరు తిరుత్తణి ఆలయ అర్చకులమని పరిచయం చేసుకుంటారు. భగవంతుడి నిర్దేశం మేరకు ఆ ఇంటికి వచ్చామని, ఇకపై అన్నీ శుభాలే కలుగుతాయని చెబుతారు. వినాయకచవితి సందర్భంగా కాణిపాకంలో పెద్ద ఎత్తున అన్నదానం చేసేందుకు మీ కుటుంబం తరపున రూ 5,116కు తక్కువ కాకుండా నగదు రూపంలో విరాళం ఇవ్వాలని కోరతారు. తమకు సమయం లేదని వెంటనే నగదు ఇస్తే త్వరగా వెళ్లాలని హడావుడి చేస్తారు. ఆ ఇంట్లో వారు డబ్బు ఇవ్వగానే వీడ్కోలు పలికి క్షణాల్లో మరో ఇంటికి, మరో గ్రామానికి వెళ్లిపోతారు. పురోహితుల వేషధారణలోని వారు కారులో గ్రామంలోకి రాగానే అక్కడ స్థితిమంతులు, దైవ కార్యాలకు ఖర్చు చేసే పుణ్యాత్ములు ఎవరని స్థానికులను ఆరా తీసి ఆ ఇంటిని ఎంచుకొంటున్నారు. రూ.లక్ష బురిడీ నల్లరాళ్లపల్లి, చౌడంపల్లి, ఎం.శాంతంపల్లి, గంగతిమ్మనపల్లి, దండికుప్పం తదితర గ్రామాల్లో ఆదివారం ఉదయం వీరు జనాన్ని బురిడీ కొట్టించారు. ఉదయమే ఈ ప్రాంతంలో దాదాపుగా లక్ష రూపాయలకు పైగా వసూళ్లకు పాల్పడ్డారు. ఈ స్వాముల వ్యవహారాన్ని సందేహించిన ఓ బాధితుడు వీరిని ఫొటో తీసి కాణిపాకం , తిరుత్తణి మురుగన్ ఆలయ అధికారులను ఆరా తీయడంతో వారు నకిలీలుగా తేలింది. దీంతో దండికుప్పంలో ఉన్న వారిని గుర్తించి పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేయడంతో కాళ్లావేళ్లా పడి సొమ్మును వెనక్కి ఇచ్చిన అక్కడి నుంచి బయటపడ్డారు. కాగా గత ఏడాది దసరా సమయంలో కూడా ఇదే ముఠా ఆలయ నిర్మాణం పేరుతో వచ్చి వసూళ్లు చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ సిబ్బందితో పాటు రామకుప్పం పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు. అయితే పురోహితుల పేరిట వచ్చిన వారు అప్పటికే ఉడాయించారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆలస్యం చేయకుండా అనుమానితుల సమాచారం పోలీసులకు తెలపాలని ఎస్ఐ కోరారు. -
పట్టపగలు ఇంట్లో చోరీ
శ్రీరంగరాజపురం : పట్ట పగలే దొంగతనం జరిగిన సంఘటన మండలంలోని గంగమ్మగుడి వడ్డిఇండ్లు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వడ్డిఇండ్లు గ్రామానికి చెందిన చిట్టబాబునాయుడు కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం కావడి ఎత్తుకొని తిరుత్తణికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని దొంగలు ఇంటిలోకి చొరబడి 40 గ్రాముల బంగారం, కేజీ వెండి, 30 వేల రూపాయల నగదు చోరీ చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. గ్రామాల్లో ఎవరైన అనుమానితులుగా కనబడితే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్ఐ సుమన్ తెలిపారు. -
కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆదివారం కావడంతో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అఽధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకొన్నారు. -
గ్లోబల్ హెల్త్కేర్ క్యాపిటల్గా భారత్
– అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి చిత్తూరు రూరల్ (కాణిపాకం): భవిష్యత్తులో భారత్ ప్రపంచ హెల్త్కేర్ క్యాపిటల్గా అవతరిస్తుందని, ఇందు కోసం అపోలో యూనివర్సిటీ గొప్ప విజన్తో ముందడుగు వేస్తోందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్, అపోలో యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం చిత్తూరులోని అపోలో నాలెడ్జ్ సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా భారత వైద్యుల ఆధిపత్యాన్ని గుర్తుచేస్తూ.. అమెరికాలో దాదాపు 10 శాతం, యుకేలో 25–30 శాతం వరకు హెల్త్కేర్ రంగంలో భారత వైద్యులే కీలక స్థానాలు దక్కించుకున్నారని పేర్కొన్నారు. -
తుమ్మలగుంటలో తుంబుర గణపతి
తిరుపతి రూరల్ : వినాయకచవితి పర్వదినం వస్తోందంటే చాలు.. అందరి కళ్లు తుమ్మలగుంట వైపు చూస్తుంటాయి. గత పాతికేళ్లుగా చెవిరెడ్డి కుటుంబీకులు విభిన్న ఆకృతులతో గణపతి ప్రతిమను తయారు చేయించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే 10 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో తుంబుర వినాయకుడి ప్రతిమను సిద్ధం చేయిస్తున్నారు. పరమేశ్వరుని ఒడిలో కూర్చుని తుంబుర చేతబట్టుకుని ధ్యానం చేస్తున్నట్టుగా గణేశుడి విగ్రహం కొలువుదీరనుంది. పర్యావరణ హితంగా చిట్టి, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 10 మంది కార్మికులు నాలుగు రోజులుగా శ్రమించి ప్రతిమను తీర్చిదిద్దారు. చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీ ఉదయం కల్యాణ వెంకన్న ఆలయంలోని కల్యాణ మండపంలో గణపతిని కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
యాదమరి : ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోమని చెబుతూనే వివిధ రకాల బాధ్యతలను అప్పగిస్తూ క్షోభకు గురిచేస్తోందని యూటీఎఫ్ జిల్లా నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మండల పరిధిలోని ఓ కళ్యాణ మండపంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ , ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. కాని ఇంత వరకు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే పీఆర్సీ అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి పట్టించుకోకపోవడం దారుమణన్నారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని జిల్లా అధ్యక్షుడు సోమశేఖర నాయుడు కోరారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా యూటీఎఫ్ నాయకులు, వక్తలు పాల్గొన్నారు. -
తెలుగు వెలుగుకు చర్యలు ..
మహా సంకల్ప దీక్షతోనే తెలుగుకు ప్రాభవం సాధ్యమని తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ ఓ కుట్ర చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బ తీసేందుకు దేశ వ్యాప్త కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అనేది నరేంద్ర మోదీ చేస్తున్న పెద్ద కుట్ర అన్నారు. ఈ కుట్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వాములన్నారు. మాల సామాజిక వర్గంపై బాబు పగబట్టి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి పనిలో బీజేపీ ఉందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీల్లో చిచ్చు పెట్టేందుకే వర్గీకరణను తెర పైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు దేవా, ఉదయ్ కుమార్, సంతోష్ కుమార్, మహాసముద్రం కృష్ణ, బుల్లెట్ బాబు, ఏసు పాల్గొన్నారు. -
‘జాను అనే నేను.. నా స్నేహితురాళ్లు’
వెదురుకుప్పం : ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న వివక్షపై తిరుగుబాటు చేస్తూ ఓ యువ రచయిత రాసిన నవలను సీ్త్ర ప్రపంచానికి అంకితం చేశారు. జాను అనే నేను నా స్నేహితురాళ్లు అనే నవల ద్వారా ఆడపిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న చిన్నచూపుపై తన కలం ద్వారా వెలుగెత్తి చాటాడు. వెదురుకుప్పం మండలానికి చెందిన పేట యుగంధర్ రెడ్డి సమాజంలో మగ పిల్లలపై ఉన్న ప్రేమ వాత్సల్యాన్ని ఆడపిల్లలపై చూపడం లేదనే అంశంపై జాను అనే నేను నా స్నేహితురాళ్లు అనే నవలను రాశారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ నవలను ఆవిష్కరించారు. ఎస్వీయూ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సదాశివమూర్తి నవలను ఆవిష్కరించారు. ఈ నవలతో పాటు తిరుపతికి చెందిన రచయిత కృష్ణస్వామి రాజు రాసిన మునికష్టడి మాణిక్యం అనే నవలను కూడా ఆవిష్కరించారు. అదే విధంగా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ డైరెక్టర్ ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు పేట యుగంధర్ రాసిన జాను అనే నేను నా స్నేహితురాళ్లు పుస్తకానికి సమీక్ష చేశారు. మగ పిల్లలకు ఇచ్చినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు ఇవ్వడం లేదని పల్లెల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. గంగిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ.. నవలలో జాను చూపిన తెగువ ప్రతి ఆడపిల్లలో ఉండాలన్నారు. కార్యక్రమంలో రచయితలు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, ఆకుల మల్లేశ్వరరావు, మేఘనాఽథ్రెడ్డి, పల్లిపట్టునాగరాజు, డాక్టర్ లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి కల్గించమ్మా
– ఎంపీ విడుదల కావాలని పూజలు, అభిషేకాలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మా.. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్గించమ్మా .. అంటూ మండలంలోని కాటిపేరి పంచాయతీ వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అభిషేకాలు చేయించారు. అక్రమ కేసు నుంచి ఎంపీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆకాక్షించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ అంజిబాబు ,పార్టీ మండల ఉపాఽఽధ్యక్షుడు వెంకటరమణ, సింగిల్ విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్భరత్, సర్పంచ్ సరిత, నాయకులు శ్రీనివాసులు, రంగనాథ్, గంగిరెడ్డి, రాజారెడ్డి, చంద్రారెడ్డి, రాజప్ప, శ్రీకాంత్ ,షంషీర్, చెంగారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నరేష్, గణేష్, సాధిక్ తదితరులు ఉన్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలనలో గందరగోళం
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ కసరత్తులో సరైన పారదర్శకత లేకపోవడంతో ఈ ప్రక్రియలో తప్పిదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పలుచోట్ల అభ్యర్థులు తమ కు అన్యాయం జరిగిందంటూ లబోదిబోమంటున్నా రు. కనీసం వారి సమస్యను విద్యాశాఖ అధికారులు ప ట్టించుకోని దుస్థితి ఏర్పడుతోంది. పగలంతా సమ యం లేనట్టు ఈనెల 22వ తేదీన అర్ధరాత్రి వెబ్సైట్లో మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను అప్లోడ్ చేశారు. ఈ ప్రక్రియ అయిన తర్వాత పలువురు అభ్యర్థుల ఫలితాలు తారుమారు అయ్యాయి. మొదట్లో స్కోర్ బోర్డ్ ఫలితాలు ఇచ్చినప్పుడేమో అర్హత సాధించిన అభ్యర్థులు....మెరిట్ జాబితాలు ఇచ్చిన సమయంలో అనర్హులయ్యారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పలుచోట్ల జరిగాయి. మెరిట్ జాబితాలు ఇచ్చిన అధికారులు కట్ ఆఫ్ తెలియజేయకపోవడం ఎంపికై న అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం డీఎస్సీని ప్రచార డీఎస్సీగా మార్చుకుంటోంది తప్ప నిరుద్యోగులకు న్యాయం చేసేలా లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. సమయం ఇవ్వకుండా పరిశీలన ఎలా..? కూటమి ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల సమయంలో దరఖాస్తులు స్వీకరించేటప్పుడు అనేక నిబంధనలు విధించి మోసం చేసింది. ఆ తర్వాత పరీక్షల సమయంలో అనేక లోటుపాట్లతో అభ్యర్థులకు ఇబ్బందులు సృష్టించారు. తీరా ఫలితాలు వచ్చాక సర్టిఫికెట్ల పరిశీలనప్పుడు మళ్లీ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులతో ఆడుకుంటోంది. ఈ నెల 24వ తేదీ రాత్రి వరకు ఎలాంటి కాల్ లెటర్లు ఇవ్వకుండా 25 వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆకస్మికంగా వెల్లడిస్తే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు కాదు 1478 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఈ పరిశీలన అనేది చాలా కీలక ఘట్టం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత నిర్ణయాలపై ఆకస్మికంగా పరిశీలన ఉంటుందని తెలిపితే చాలా మంది అభ్యర్థులు సరైన సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితి. దూరాభారం నుంచి చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి. సమయం ఇవ్వకుండా...ఏ సర్టిఫికెట్లు తీసుకురావాలో చెప్పకుండా సర్టిఫికెట్ల పరిశీలన ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రెండు కేంద్రాల్లో పరిశీలన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పరీక్షలు రాసి ఎంపికై న అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మురకంబట్టు వద్ద ఉన్న అపోలో యూనివర్శిటీ, తిరుపతి రోడ్డులోని ఆర్వీఎస్ నగర్ వద్ద ఉన్న ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఏ సర్టిఫికెట్లను పరిశీలనకు తీసుకురావాలి, ఎంత సమయానికి హాజరవ్వాలి అనే విషయం ఈనెల 24వ తేదీ రాత్రి వరకు వెల్లడించని దుస్థితి. దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వింత ధోరణి పై డీఎస్సీ అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. అధికారులకు ఓరియెంటేషన్ సర్టిఫికెట్ల పరిశీలన విషయం పై విద్యాశాఖ ఏడీ వెంకటేశ్వరరావును వివరణ కోరగా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక వసతులు, పరిశీలన చేసే బృందాల్లోని అధికారులకు ముందస్తుగా ఓరియెంటేషన్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర అధికారుల నుంచి వచ్చే ఉత్తర్వుల మేరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామని సమాధానమిచ్చారు. ఎప్పుడు రావాలో తెలియని దుస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1478 పోస్టులను మెగా డీఎస్సీ ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికై న విద్యార్థులకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఎంపికై న అభ్యర్థులకు కాల్ లెటర్స్ వ్యక్తిగత లాగిన్లకు పంపుతామని ప్రకటించారు. అయితే ఈనెల 24వ తేదీ రాత్రి వరకు కాల్లెటర్లు అభ్యర్థులకు దరిచేరని దుస్థితి. ఒక వైపేమో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈనెల 25వ తేదీన డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, సిద్ధంగా ఉండాలని మౌఖికంగా వెల్లడిస్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఆదివారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్టిఫికెట్ల పరిశీలన ఎప్పుడుంటుందో తెలియని దుస్థితిలో అభ్యర్థులు అయోమయానికి లోనవుతున్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం కట్టమంచి చెరువులో మాత్రమే చేయాలన్నారు. చెరువు వద్ద సరిపడే బారికేడ్లు, ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద క్రేన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీఎస్పీ సాయినాథ్ మాట్లాడుతూ గత సంవత్సరం వినాయకుని ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయన్నారు. అలాగే ఈసారి చిన్న సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నిమజ్జనం మార్గంలో కరెంట్ వైర్లు, కేబుల్ వైర్లు అడ్డు రాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేసే మూడు, ఐదు, తొమ్మిది, పదకొండో రోజుల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రామభద్ర, హరి, జయచంద్ర, వెంకటేష్, సీఐలు మహేశ్వర్, నెట్టికంఠయ్య, అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కరుణాకరన్, అడిషనల్ డీఎంహెచ్ఓ వెంకటప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్య
పుంగనూరు: భర్త మందలించాడని భార్య పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వనమలదిన్నెలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని వనమలదిన్నెకి చెందిన భాస్కర్ భార్య దుర్గ(34) తన పిల్లలను మందలిస్తుండగా భర్త ఆమెను మందలించాడనే కోపంతో ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆత్మహత్య పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటక వాసి మృతి
బైరెడ్డిపల్లె: మండలంలోని బేలుపల్లె సమీపం వద్ద శనివారం వ్యవసాయబావిలో కర్ణాటక వాసి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..కర్ణాటక రాష్ట్రం పెద్దగుట్టపల్లె గ్రామానికి చెందిన అశ్వత్త (40) మండలంలోని పిచ్చిగుండ్లపల్లెలో అక్కను చూడటానికి రెండు రోజుల క్రితం వచ్చాడు. గ్రామ సమీపంలో ఉన్న పొలాల వద్దకు వెళ్లిన అశ్వత్త ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. బావిలో మృతదేహం గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పలమనేరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కడప విశ్రాంత తహసీల్దార్పై దాడి
పుంగనూరు: మదనపల్లె నుంచి పుంగనూరుకు బస్సులో ప్రయాణిస్తున్న కడప విశ్రాంత తహసీల్దార్ అంజాద్హుస్సేన్(70)పై పక్క సీట్లో కుర్చున్న వ్యక్తి ఘర్షణ పడి దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు.. కడప విశ్రాంత తహసీల్దార్ అంజాద్హుస్సేన్ పుంగనూరు తహసీల్దార్ రామును కలిసేందుకు బస్సులో పుంగనూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో పక్క సీట్లో కుర్చున్న షేర్ఖాన్ సెల్ఫోన్లో ఇతరులను దుర్భాషలాడుతూ పెద్దశబ్దం చేస్తూ మాట్లాడుతుండడంతో అలా మాట్లాడకండి అని అంజాద్హుస్సేన్ చెప్పాడు. దీంతో మీరెవరు నాకు చెప్పడానికి అంటూ విశ్రాంత తహసీల్దార్పై దాడి చేసి కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం తవణంపల్లె: అప్పుల భారం అధికం కావడంతో భార్యతో గొడవపడి ఇంట్లో పురుగులు మందు తాగి ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడని తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని అరగొండకు చెందిన డి.సుఽధీర్కుమార్(31) తిరుపతిలో డ్రైవింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తిరుపతిలో అప్పుల బాధ తట్టుకోలేక భార్యపిల్లలతో వచ్చి అరగొండలో నివాసం ఉంటున్నారు. అప్పులు కట్టకుండా పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండడంతో భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి డి.కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. 17 మందికి జరిమానా చిత్తూరు అర్బన్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 17 మందికి రూ.44 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 17 మందిని గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించగా.. జరిమానా విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.30 వేలు జరిమానా విధించినట్లు సీఐ నెట్టికంటయ్య తెలిపారు. -
యువకుడి మృతిపై లేబర్ అధికారుల విచారణ
బంగారుపాళెం: మండలంలోని జయంతి గ్రామం వద్ద ఎక్స్ప్రెస్ హైవే పనులు చేస్తూ మరణించిన మైనర్ యువకుడి మృతిపై శనివారం చిత్తూరు లేబర్ అధికారులు విచారణ చేపట్టారు. ఈనెల 21వ తేదీ బిహార్ రాష్ట్రం చంబా జిల్లా జహీరా గ్రామానికి చెందిన సురేంద్రరాయ్ కుమారుడు బబ్లుకుమార్(19) ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేసేందుకు ఐరన్ రాడ్ పైకి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని విద్యుత్ తీగకు తగలడంతో షాక్కు గురై బ్రిడ్జిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు అసిస్టెంట్ లేబర్ అధికారి ఆనంద్బాబు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్తో కలసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. లేబర్ యాక్టు నిబంధనల ప్రకారం మైనర్ బాలుడిని పనుల్లో పెట్టుకున్న సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
జగమంత పండుగ
వరసిద్ధుడి వేడుక.. కాణిపాకం: స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారికి ఈ నెల 27వ తేదీన వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలకు ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయానికి పెయింటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. భక్తులు ఉండేందుకు తాత్కాలిక షెడ్లు, విద్యుత్ కటౌట్లు, రంగువల్లులతో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజులకు ముందే అన్ని ఏర్పాట్లను వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ పనులను ఈఓ పెంచల కిషోర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
బాలల సంరక్షణ అందరి బాధ్యత
చిత్తూరు లీగల్ : బాలల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కోర్టు సెషన్స్ న్యాయమూర్తి రమేష్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, రక్షణ (జువైనల్) చట్టంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి రమేష్ మాట్లాడుతూ చిన్న పిల్లలు తెలిసో తెలియకో చేసిన నేరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారిలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసు, చైల్డ్వెల్ఫేర్ అధికారులు, చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యులపై ఉంటుందన్నారు. బాలల న్యాయ సంరక్షణ, రక్షణ చట్టం 2015పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలిసో తెలియకో చట్టానికి విరుద్ధంగా నేరాలు చేసిన పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు 24 గంటల్లోగా హాజరుపరచాలన్నారు. నేరాలు చేసిన పిల్లలను కొట్టడం, మీడియా ముందుకు తీసుకురావడం వంటి చేయకూడదన్నారు. పిల్లలు ఏ కారణం చేత నేరాలు చేశారనే వివరాలను స్నేహపూర్వకంగా సైకాలజిస్ట్తో తెలుసుకోవాలన్నారు. వారి వివరాలను తెలుసుకుని మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎనిమిది, తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు దేశ భవిష్యత్కు ముఖ్యమైన మూలధనం అన్నారు. వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. దివంగత ఏపీజే అబ్దుల్ కలామ్ సైతం అనాథ పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు అనాథ పిల్లల భవిష్యత్పై దృష్టి సారించాలన్నారు. మూడో అదనపు మేజిస్ట్రేట్, జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్ విషయంలో బాధ్యత కలిగి ఉండాలన్నారు. నేరం ఆరోపించబడిన పిల్లలు నేరస్తులు కారన్నారు. పిల్లల మానసిక స్థితిగతులను అర్థం చేసుకుని మెలగాలని తెలిపారు. ఈ వర్క్షాప్లో తిరుపతి జిల్లా ప్రభుత్వ బాలుర అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ శరత్బాబు, అపోలో మెడికల్ కాలేజ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ దినేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆభరణాల చోరీ
చిత్తూరు అర్బన్: నగరంలోని కట్టమంచి లాయర్స్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో శనివారం తెల్లవారుజామున ఆభరణాల చోరీ జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రామచంద్ర లాయర్స్ కాలనీలో కాపురముంటున్నారు. శుక్రవారం కలకడలోని తన బంధువుల ఇంటికి వెళ్లి, శనివారం ఉద యం ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా.. వస్తువులు చిందరవందరగా పడున్నాయి. తీరా లోపలికి వెళ్లి చూడగా కిటీకీ తొలగించి, ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించాడు. 15 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గంగాధర నెల్లూరు: ద్విచక్ర వాహనంలో అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన ఉన్న షాపును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. వేల్కూరు సమీపంలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అశోక్ కుమార్ (28) పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అగరమంగళం నుంచి వేల్కూరుకు ద్విచక్ర వాహనంలో తన తోటి కార్మికుడు కృష్ణకుమార్తో కలిసి బయలుదేరాడు. జీడీ నెల్లూరులో ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి ఓ షాపును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అశోక్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చుని ఉన్న కృష్ణకుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో రూ.2.10 లక్షల జరిమానా చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 21 మందికి రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువు రు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఆంధ్రకేసరికి నివాళి చిత్తూరు అర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు చిత్తూరు పోలీసుశాఖ ఆధ్వరంలో పోలీసులు నివాళులర్పించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని శనివారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద ఎస్పీ మణికంఠ, అధికారులు నివాళులర్పించారు. స్వతంత్ర పోరాట యోధుడిగా, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చూపిన ధైర్యసాహసాలు, తీసుకొచ్చిన సంస్కరణలు నేటితరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్రాజు, ఏఆర్ డీఎస్పీ మహబూబ్బాషా, కార్యాలయ ఏఓ నాగభూషణమ్మ, ఎంటీఓ చంద్రశేఖర్, డీసీఆర్బీ ఎస్ఐ పద్మ తదితరులు పాల్గొన్నారు. బార్కు లాటరీ నిర్వహించకపోతే ఫీజు వాపసు చిత్తూరు అర్బన్: ఏదైనా మద్యం బార్ లైసెనన్స్ కోసం కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోయినా, లాటరీ నిర్వహించలేకపోయినా దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లిస్తామని చిత్తూరు ఎకై ్స జ్ సూపరింటెండ్ శ్రీనివాస్ తెలిపారు. -
రాష్ట్రంలో అరాచకపాలన
చౌడేపల్లె: శివయ్యా..రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి మంచి బుద్ధి ప్రసాదించయ్యా అంటూ పుదిపట్ల పంచాయతీకి చెందిన వైఎస్సార్ సీపీ నేతల ఆధ్వర్యంలో పంచలింగేశ్వరస్వామివారికి శనివారం అభిషేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.దామోదరరాజు, పార్టీ మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసుల నుంచి రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబం పేరిట పంచ లింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం గద్దె ఎక్కినప్పటి నుంచి ప్రజలకిచ్చిన హామీలు విస్మరించి వైఎస్సార్సీపీ నేతలను వేధించడం, పోలీసులను అడ్డంపెట్టుకుని కేసులు పెట్టడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. పేదల హామీల సంగతి విస్మరించి పరిశీలన పేరుతో దివ్యాంగులు పింఛన్ల కోత విధిస్తుందని, చిరుఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి కడుపుకొడుతుందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎల్లో మీడియా ద్వారా దుష్పచారం చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయకొండ పాలకమండలి మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ, సర్పంచుల సంఘ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రామనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచులు హారతి, ఓబుల్రెడ్డి, షంషీర్, నాయకులు రెడ్డెప్పరెడ్డి, భరత్రెడ్డి, మోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, నాగభూషణరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చెంగారెడ్డి, నరేష్, శ్రీరాములు, గిరినాథ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజారెడ్డి, యశోద, అనుప్రియ తదితరులు పాల్గొన్నాన్నారు. -
మొదట్లో అర్హత...ఇప్పుడేమో అనర్హత
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎంతో ఆర్భాటం చేస్తోంది. అయితే ఈ కసరత్తులో పలుసార్లు తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన డీఎస్సీ తుది మెరిట్ జాబితాలో పలువురు అభ్యర్థుల ఫలితాల్లో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మొదట్లో విడుదల చేసిన ఫలితాల్లో కొంత మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పుడేమో తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో అనర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలను చూసిన అభ్యర్థులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. మొదట్లో అర్హత రావడం....ఇప్పుడు అనర్హత రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వెబ్సైట్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. అయితే ఆ హెల్ప్డెస్క్ నంబర్లు పనిచేయడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. తుది ఫలితాలు విడుదలైన సమయంలో హెల్ప్డెస్క్ నంబర్లు పనిచేయకపోవడంపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. -
సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మెగా డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్లెటర్లు అందగానే సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఇందుకు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. పరిశీలనకు హాజరయ్యే బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సూచనలు జారీ చేశారు. ఈ ప్రక్రియకు చిత్తూరు జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉండే అపోలో యూనివర్సిటీ, ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలను పరిశీలన కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన 1,478 అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఆయా అభ్యర్థులకు కాల్లెటర్లో సూచించే తేదీలు, సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. -
29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన
కుప్పం: సీఎం చంద్రబాబు ఈ నెల 29, 30వ తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. శనివారం కుప్పం కడా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కావడంతో కృష్ణా జలాలు కుప్పానికి వస్తున్నాయని, ఈ కార్యక్రమంలో భాగంగా జలహారతి కోసం సీఎం కుప్పంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29వ తేదీన సాయంత్రం కుప్పం పట్టణానికి చేరుకుని, 30వ తేదీ ఉద యం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా పరమసముద్రం చెరువును నీటితో నింపి అనంతరం దశల వారీగా నియోజకవర్గంలోని 435 చెరువులను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ సురేష్బాబు, కడా అభివృద్ధి కమిటీ సభ్యులు రాజ్కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుశాఖలో స్వచ్ఛత దివాస్ చిత్తూరు అర్బన్: స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛత దివాస్ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమా న్ని నిర్వహించారు. చిత్తూరులోని పోలీసు శిక్షణ కేంద్రం(డీటీసీ)లో మొక్కలు నాటారు. శనివారం ఏఎస్పీ రాజశేఖర్ రాజు, అధికారు లు కలిసి డీటీసీలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛ దివాస్పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. వెరిఫికేషన్కు ధ్రువీకరణ తప్పనిసరి చిత్తూరు అర్బన్: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు తప్సనిసరిగా ఓ ఫారంను డౌన్లోడ్ చేసుకుని ధ్రువీకరణ చేసుకుని వెరిఫికేషన్కు రావాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం చిత్తూరులోని ప్రశాంత్ నగర్లో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో 9 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. దీనికి అభ్యర్థులు ఆన్లైన్లో అనెగ్జర్–1 డౌన్లోడ్ చేసుకుని గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకుని రావాలని ఎస్పీ కోరారు. సర్వే చేసి అనర్హురాలిగా ముద్రవేశారు! పలమనేరు: మండలంలోని టి. వ డ్డూరు గ్రామానికి చెందిన పాపులమ్మ (69) పక్షవాతం కా రణంగా కాళ్లు చచ్చుబడిపోవడంతో సరిగ్గా నడవలేదు. సదరం సర్టిఫికెట్లో 40 శాతం కంటే ఎ క్కువగా వికలత్వం ఉందని ఆమెకు మొన్నటి దాకా వికలాంగ పింఛన్ ఇచ్చేవారు. ఇటీవల జరిగిన పించన్ల పునఃపరిశీలనలో వికలత్వ శాతం 40 కంటే తక్కువగా ఉందని పింఛను తీసేశారు. ప్రస్తుతం ఈమె మధుమేహం, రక్తపోటుతో అనారోగ్యంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె భర్త చిన్నపాటి చిల్లర దుకాణం ద్వారా భార్యను చూసుకుంటున్నాడు. అతనికి అనారోగ్య సమస్యలున్నాయి. వీరి ఇద్దరు పిల్లలకు వివాహమై వారి కుటుంబాలను వారు చూసుకుంటున్నారు. దీంతో వారికి ఆసరాగా ఉన్న పింఛను పోవడంతో ఎలా బతికేదో దేవుడా? అని బాధపడుతున్నారు. 28 లోపు పేర్లు నమోదు చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఆర్బీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు 28వ తేదీ లోపు 9849313676, 9000475799 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకుని క్రీడాకారుల కు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. -
సర్వం సన్నద్ధం
సాక్షి ముఖాముఖిలో ఈఓ పెంచల కిషోర్ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆలయాధికారులు సన్నద్ధమయ్యారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే ఏర్పాట్లపై ఆలయ ఈఓ పెంచల కిషోర్ సాక్షి ముఖాముఖిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆయన మాటాల్లోనే.. – కాణిపాకం ఈ నెల 27 నుంచి సెప్టంబర్ 16వ తేదీ వరకు వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు, నిర్వహణ పనులు జరుగుతున్నాయి. వినాయక చవితి, రథోత్సవం, కల్పవృక్ష వా హనం, తెప్పోత్సవం, పుష్పవల్లకి రోజుల్లో సుమారు 70 వేల నుంచి 80 వేల మంది భక్తు లు, మిగిలిన రోజుల్లో 40 వేల మంది భక్తులు వస్తారని అంచనా. ఉత్సవాల సందర్భంగా అర్జిత సేవలు రద్దు చేశాం. దర్శన సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నాం. వాహనాల పార్కింగ్కు కాణిపాకం బస్టాండ్ పక్కన ఉన్న ప్రాంతం, కొబ్బరితోట, ఈఓ కాంప్లెక్స్ పక్కన స్థలాలను కేటాయించాం. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ప్రధానంగా నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేయనుంది. ప్రత్యేక రోజుల్లో 200 మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది. సాధారణ రోజుల్లో 100 మంది వరకు పోలీసులుంటారు. ఈ సారి సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టేలా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ బృందం 500 మందితోపాటు మరో 50 మంది సిబ్బందిని అదనంగా తీసుకుంటున్నాం. అన్నదానానికి 20 మంది అవసరమవుతోంది. సేవకులుగా పనిచేసేందుకు 500 మంది రిజి స్ట్రేషన్ చేసుకున్నారు. అవసరం ఆధారంగా వారిలో 100 మంది వరకు తీసుకుంటాం. ఆలయ పరిసర ప్రాంతంలో మెడికల్ క్యాంపు జరుగుతుంది. మూడు షిప్టులలో వైద్యులు పనిచేయనున్నారు. ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లతోపాటు ఆరుగురు స్పెషలిస్టు డాక్టర్లు ఉండేలా ఆదేశాలున్నాయి. దీంతో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది క్యాంపులో ఉంటారు. అర్అండ్ బీ అధికారులు పట్నం నుంచి కాణిపాకం వరకు వచ్చే రోడ్డును అభివృద్ధి చేశారు. తిరువన్నంపల్లి రోడ్డును కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. పంచాయతీ శాఖ అధికారులు పారిశుద్ధ్య పనులు, తాగునీటి వసతి కల్పిస్తారు. పారిశుద్ధ్య సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ శాఖ ఏడీ, ఏఈలు అందుబాటులో ఉండనున్నారు. పవర్ కట్ సమయంలో పవర్ జనరేటర్ను వాడుకుంటాం. విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతోపాటు ఉభయదారులు, కాణిపాకవాసులు సహకరించాలని ఆయన కోరారు. -
నిలిచారు మేటిగా..
పట్టుదలే తోడుగా.. చిత్తూరు కలెక్టరేట్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు తుది ఫలితాలు శుక్రవారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. సంవత్సరాల తరబడి ఆచార్య కొలువునకు శిక్షణ పొంది, సన్నద్ధం అయిన అభ్యర్థుల కలలు నెరవేరాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ప్రతిభ చాటిన వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు దక్కాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు డీఎస్సీ అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను సబ్జెక్టుల వారీగా విడుదల చేశారు. సంబంధిత జాబితాలను రాష్ట్ర విద్యాశాఖ డీఎస్సీ వెబ్సైట్తో పాటు, డీఈఓ వెబ్సైట్లో నమోదు చేశారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాసిన డీఎస్సీ అభ్యర్థులు తమ మెరిట్ జాబితాలను పరిశీలించుకునే వెసులుబాటు కల్పించారు. ర్యాంకుల వారీగా అభ్యర్థులు సాధించిన ఫలితాలను మెరిట్ జాబితాల్లో పేర్కొన్నారు. ఆ మెరిట్ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,478 పోస్టుల భర్తీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,478 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల తుది ఫలితాలను ర్యాంకుల వారీగా పేర్కొన్నారు. జూన్ 5వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం విడుదల చేసిన తుది మెరిట్ జాబితా ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అర్హత సాధించిన అభ్యర్థుల డీఎస్సీ వ్యక్తిగత లాగిన్లో కాల్లెటర్లను పంపనున్నారు. ఆ కాల్లెటర్ల ఆధారంగా అభ్యర్థులు నిర్దేశించిన కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. పట్టుదలకు శ్రమ తోడైతే విజయం సొంతమవుతుందని నిరూపించారు. మెగా డీఎస్సీ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థులను అధిగమించి ముందంజలో నిలిచారు. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అహర్నిశలు శ్రమించారు. ప్రభుత్వ కొలువులు దక్కడమే గగనమైనే నేటి పరిస్థితుల్లో ఆచార్య కొలువులకు ఎంపికై తమ సత్తా చాటారు. శుక్రవారం అర్ధరాత్రి విడుదలైన ఫలితాలు చూసుకుని సంబరాలు చేసుకున్నారు. -
జనసేన మండల అధ్యక్షుడిపై కేసు నమోదు
గుడిపాల: ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనకు సంబంధించి జనసేన గుడిపాల మండలం అధ్యక్షుడు రూప్కుమార్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్పేట ఇసుక రీచ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఎస్ఐ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ టీఎన్05 ఆర్0839 నంబర్ టిప్పర్ తమిళనాడులోని పొన్నై వైపు వెళుతుండగా పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ శరవణని అరెస్టు చేశామని ఎస్ఐ చెప్పారు. డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం టిప్పర్ యజమాని శేఖర్తోపాటు ఇసుకను డంప్ చేసి అక్రమంగా టిప్పర్ ద్వారా తమిళనాడుకు ఇసుకను పంపిస్తున్న జనసేన గుడిపాల మండల పార్టీ అధ్యక్షుడు రూప్కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వర్షం.. అపార నష్టం
గుడిపాల: మండలంలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరి పంట కోతకు వస్తున్న దశలో గాలివాన కురవడంతో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. మండలంలో ప్రస్తుతం 115 హెక్టార్లలో వరి పంట పొట్ట, కోత దశలో ఉంది. కోత దశలో ఉన్న 20 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. రైతులు అప్పు చేసి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతినడంతో వారు లబోదిబోమంటున్నారు. మండలంలోని చింతగుంటూరు, బొమ్మసముద్రం, 197రామాపురం, కోటూరు, తిమ్మయ్యపల్లెలో వర్షానికి దెబ్బతిన్న వరిపంటను వ్యవసాయాధికారి సంగీత పరిశీలించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు ఆమె తెలిపారు. కొన్ని గ్రామాల్లో అరటి పంట కూడా దెబ్బతింది. మరకాలకుప్పం గ్రామంలో వేరుశనగ పంట నీట మునిగింది. అలాగే మామిడి, నిమ్మతోటల్లో నీరు నిలిచిపోయింది. -
ఎంపీ మిథున్రెడ్డి విడుదలవ్వాలని పూజలు
వి.కోట: ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలని ఆయన అభిమాని అన్నవరం శ్రీ రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మేజర్ పంచాయతీ 5వ వార్డు మెంబరు కుమార్రాజా ఈ నెల 19వ తేదీన స్థానిక శ్రీవీరాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన బైక్పై దాదాపు 980 కి.మీ ప్రయాణించి అన్నవరానికి చేరుకున్నారు. అక్కడ ఎంపీ మిథున్రెడ్డి త్వరగా విడుదలవ్వాలని ప్రత్యేక పూజలు చేశారు. కుమార్రాజా గతంలోనూ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. తర్వాత జగనన్నను కలిసి తిరుమలకు వెళ్లి మొక్కు చెల్లించారు. కుమార్రాజా మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించినట్టు ఆరోపించారు. అన్నవరంలో మిథున్రెడ్డి ఫొటోతో కుమార్రాజా, గత సోమవారం అన్నవరానికి బయల్దేరుతూ.. -
డ్రైవర్లకు స్వల్ప గాయాలు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనిఫుడ్ ఫ్యాక్టర్ సమీపంలో గల మొగిలి కూడలి వద్ద టాటా ఏస్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం దెబ్బతింది. హైవే మొబైల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి వ్యక్తి మృతి గంగవరం: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడిన ఘటన శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పలమనేరు పట్టణం, పట్రమునస్వామి వీధికి చెందిన శ్రీనివాస్(49) గంగవరం మండలం, ఎద్దుల చెరువుకట్ట ఆనుకుని ఉన్న పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ అక్కడే ఉండేవాడు. అయితే పొలానికి ఆనుకుని పాడుబడ్డ బావిలో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి నేతల బారి నుంచి రక్షించండి
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి సానుభూతిపరుల దౌర్జన్యం పెచ్చుమీరుతోందని, వారి బారి నుంచి తమను రక్షించాలని యాదమరి మండలం, లగడపాటూరు గ్రామానికి చెందిన చిన్నబ్బ ఆవేదన వ్యక్తం చేసారు. భాదితుని కథనం.. తమ గ్రామంలో సర్వే నం.29–8బీలో పూర్వీకుల నుంచి వ్యవసాయం చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయితే అదే గ్రామానికి చెందిన కూటమి సానుభూతిపరుడు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం కుమారులు తమ పొలంలోకి వెళ్లనివ్వకుండా అడ్డగిస్తున్నారు. శుక్రవారం ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలించి పొలం మధ్యలో దారి ఏర్పాటుకు యత్నించారు. దీనిపై ప్రశ్నిస్తే మాజీ సర్పంచ్ కుమారులు రుద్రయ్య, శివకుమార్ తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై డయల్ 100 కాల్ చేయగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఆపై కొద్దిసేపటికే జేసీబీ యంత్రాలతో పనులు మొదలు పెట్టారని చెప్పారు. దీనిపై తహసీల్దార్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
యువకుడికి తీవ్ర గాయాలు
గంగవరం: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దపంజాణి మండలం, పట్టగాణిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు మంజు(17) ద్విచక్ర వాహనంలో కల్లుపల్లి గ్రామానికి వచ్చాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా పుంగునూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న స్కార్పియో కారు కల్లుపల్లి చెక్పోస్టుకు సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. ప్రమాదంలో కారు ముందు భాగం, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారుని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జయంతి వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సంస్థల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదనం తెలిపారు. ఆయన శుక్రవారం ఆ సంఘ నాయకులతో కలిసి డీఐఈవో రఘుపతి, డీఈవో వరలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్లో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కర్తవ్యమే దైవం (తెలుగు మీడియం), డ్యూటీ ఈస్ గాడ్ (ఇంగ్లిష్ మీడియం), జూనియర్ కళాశాల విద్యార్థులకు రేపటి భవిష్యత్ నేడు మన చేతిలోనే ఉంది (తెలుగు మీడియం), ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వ్యూ డు అట్ ప్రెసెంట్ (ఇంగ్లిష్ మీడియం)లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ప్రపంచంలో పరివర్తన మార్పు రావాలంటే, ముందు నీలో మార్పు రావాలి (తెలుగు మీడియం), టాన్స్ఫార్మ్స్ యువర్ సెల్ఫ్ టూ టాన్స్ఫార్మ్ ది వరల్డ్ (ఇంగ్లిష్ మీడియం) వ్యాసరచన పోటీలుంటాయన్నారు. ఈ పోటీల నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు 9440690137లో సంప్రదించాలని ఆయన కోరారు. సభ్యులు శంకర్, గజేంద్రరెడ్డి, శేషనారాయణ, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే పట్టుకోండి?
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉంది. మండలం మీదుగా రాకపోకలు సులభతరంగా ఉంటాయి. బంగారెడ్డిపల్లి గ్రామం వద్ద ఎంట్రీ ఇస్తే.. బీఎన్ఆర్పేట మీదుగా జిల్లా సరిహద్దును 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో దాటేయొచ్చు. తమిళనాడు సరిహద్దులోకి చేరుకుంటే పొన్నై, సోలింగరం, తిరుత్తణి మీదుగా చైన్నైకి దూసుకెళ్లవచ్చు. మళ్లీ చిత్తూరు మండలం నుంచి గుడిపాల మండలం మీదుగా తమిళనాడుకు చేరుకోవచ్చు. లేకుంటే కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అలాగే జీడీనెల్లూరు మండలం మీదుగా వస్తే..తూగుండ్రం నుంచి పొన్నైకు చేరుకుని బండిని చైన్నెకి తిప్పొచ్చు. దీనికి తోడు దొడ్డిదారులను అక్రమార్కులు ఎంచుకుని సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడి నుంచే గూడూరు కేంద్రంగా ఇసుక వ్యాపారం జోరందుకుంటోంది. నెల్లూరు జిల్లాలోని పెన్నానదిలో తవ్వకాలు చేసి గూడూరులో డంప్ చేసుకుంటున్నారు. అలాగే గూడూరు పరిధిలోని స్వర్ణముఖి నదిలో కూడా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడ లారీలో ఇసుక నింపి.. పుష్పారేంజ్లో ఇసుకను తమిళనాడుకు చేర్చే ప్ర యత్నం చేస్తున్నారు. వరిపొట్టు, వరి, కూరగాయలు, బియ్యం, నిత్యావసర సరుకులు తదితర పేర్లతో వేబిల్లులు వేసుకుని చిత్తూరు మండలం, జీడీనెల్లూరు, గుడిపాల మీదుగా తమిళనాడు చేరుస్తున్నారు. తమిళనాడు వ్యక్తులతోనే వ్యాపారం గూడూరులో జరిగే ఇసుక తవ్వకాల్లో తమిళనాడుకు చెందిన వ్యక్తులే కీలకంగా పనిచేస్తున్నారు. లారీకి ఇసుక నింపడం నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఇసుక దింపే వరకు ఆ రాష్ట్ర వాసులే దగ్గరుండి పనిచేస్తున్నారు. కూటమి నేతలు తమిళనాడు కూలీలను నమ్మకంగా పెట్టుకుంటున్నారు. వీళ్లు తమిళనాడులోని ఇసుక దందాదారులతో చేతులు కలిపి అమ్మకాలు చేస్తున్నారు. లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ నెల్లూరులోని ఓ కూటమి నేత బాస్గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. నిఘా ఏదీ? చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు మండలాల మీదుగా జరుగుతున్న ఈ ఇసుక దందాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. క్షేత్ర స్థాయిలోని గ్రామస్తులు పట్టిస్తే తప్ప అధికారులు కదలడం లేదు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘా లేదు. దీనికారణంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఒక వేళ పట్టుకున్నా కేసులు.. జరిమానాలతో సర్దేస్తున్నారు. ఇక ఇసుక పట్టుకుంటే బడా కూటమి నేతల నుంచి అధికారులకు ఫోన్లు వస్తున్నాయి. కొందరైతే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలో అధికారులు ఇసుక లారీలను వదిలిపెట్టాల్సి వస్తోంది...జిల్లాలో ఇలాంటివి నిత్యకృత్యంగా మారా యి. అధికార మదంతో కూటమి నేతలు అందినకాడికి ఇసుక తరలించేస్తున్నారు. సరిహద్దులు దాటించి జేబులు నింపుకుంటున్నారు. పోలీసులు కేసులు, జరిమానాలతో చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఎవరిపైనా చర్యలకు ఉపక్రమించే ధైర్యం చేయలేకపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పుష్ప రేంజ్లో కూటమి నేతల ఇసుక వ్యాపారం రెండు జిల్లాల అధికారుల సహకారంతోనేనా..? ఈ అక్రమ ఇసుక వ్యాపారానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల అధికారులు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ అక్రమ వ్యాపారం గూడూరు నుంచి తమిళనాడుకు విస్తరించింది. ఇసుకాసురులుగా అవతామెత్తిన కూటమి నేతలకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్తోనే ఈ అక్రమ వ్యాపారాన్ని జోరుగా నడిపిస్తున్నారు. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
చిత్తూరు కలెక్టరేట్ : తన భూ సమస్యకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని జిల్లాలోని ఐరాల మండలం, పందికొట్టూరు గ్రామానికి చెందిన భూ బాధితుడు నాగభూషణం నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన భూ సమస్య పరిష్కారం కోసం ఆయన శుక్రవారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు ఫొటోతో కూడిన బ్యానర్ను చేతబట్టి గంటల తరబడి మండుటెండలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐరాల మండలం, పందికొట్టూరు గ్రామంలో సర్వే నం.1527/1 లో 4.02 ఎకరాల భూమి ఉందన్నారు. ఆ భూమిలో తనకు రెండు ఎకరాలు చెందుతుందన్నారు. ఆ రెండు ఎకరాల భూమి తన పూర్వీకుల నుంచి తమ అనుభవంలో ఉన్నట్లు తెలిపారు. అయితే మొత్తం భూమిని తమ బంధువులు ఆక్రమించారని చెప్పారు. న్యాయం కోసం పలుమార్లు అధికారుల వద్దకు తిరుగుతున్నప్పటికీ ఎలాంటి స్పందనా లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు సైతం అర్జీ ఇచ్చానని తెలిపారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోలేదన్నారు. కలెక్టర్ ఆదేశించినప్పటికీ చిత్తూరు ఆర్డీవో కార్యాలయం సర్వే అధికారులు న్యాయం చేయలేదన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. న్యాయం చేయకపోతే సీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుని వద్దకు వచ్చి ధర్నా విరమింపజేశారు. అనంతరం సర్వే అధికారుల వద్దకు తీసుకెళ్లి ఆయన సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన అంశాలను చర్చించారు. దీంతో భూ బాధితుడు తాత్కాలికంగా ధర్నా విరమించారు. -
విలపింఛన్
మాపై ఎందుకింత కక్ష? రూ.6 వేలకు తగ్గించేశారు దివ్యాంగులపై కూటమి కక్ష కూటమి ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతోంది. పింఛన్ సొమ్ముతో బతుకులీడుస్తున్న దివ్యాంగులను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. రీవెరిఫికేషన్ పేరుతో చుక్కలు చూపిస్తోంది. పింఛన్లు తొలగించి వారి పొట్టగొట్టేందుకు పన్నాగం పన్నింది. ఇక తాము ఎలా బతికేది దేవుడా..! అంటూ పలువురు నిట్టూర్పులు వెళ్లగక్కాల్సి వస్తోంది. కుటుంబానికి భారం కాకుండా ఇన్నాళ్లూ బతికామని, ఇక తమకు చావే శరణ్యమని దివ్యాంగులు గగ్గోలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. నడవలేని స్థితిలో ఉన్నా కలెక్టరేట్, మండల కేంద్రాలకెళ్లి గళమెత్తాల్సి వస్తోంది. అయినా కూటమిలో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. – చిత్తూరు కలెక్టరేట్/ నగరి -
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల వరకు అర్చనలు, అభిషేక పూజలు చేశారు. శ్రావణమాసపు చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. బోయకొండలో ప్రత్యేక పూజలందుకున్న అమ్మవారు, ఆలయంలో భక్తుల రద్దీ -
గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!
చౌడేపల్లె: గంగమ్మ తల్లీ... కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించమ్మా..! అంటూ కొండామర్రి గ్రామంలో వెలసిన గ్రామదేవత నడివీధి గంగమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఎంపీటీసీ షాహీనల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి రాజంపేట ఎంపీ పీవీ.మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేక పూజలు చేశారు. నాగభూషణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి కూటమి వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు షంషీర్, హస్సేన్, శ్రీరాములు, టి.నాగరాజ, జీఆర్ఎస్ రమణ, సాధిక్, గిరిబాబు, మునికృష్ణమనాయుడు, చెంగారెడ్డి, రంగనాథ్, మోహన్రెడ్డి, బాబు, భరత్రెడ్డి తదితరు పాల్గొన్నారు. -
పాలక మండలి పదవులకు 57 దరఖాస్తులు
చౌడేపల్లె: జిల్లాలో రెండవ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలక మండలి పదవుల నియామకానికి మొత్తం 57 మంది దరఖాస్తులు చేశారని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. గురువారం పుంగనూరు మండలం ఇటికినెల్లూరుకు చెందిన ఎస్కె. రమణారెడ్డి, ఆయన సతీమణి రతీదేవి, కుమారుడు రాజశేఖర్రెడ్డితోపాటు మరో 33 మంది సభ్యులు దరఖాస్తులను కూటమి నేతలతో కలిసి ఈఓకు అందజేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్కె రమణారెడ్డి, రతీదేవి గతంలో బోయకొండ ఆలయ పాలక మండలి చైర్మన్లుగా పనిచేశారు. మరోసారి చైర్మన్ బరిలో దిగారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్, సోమల సురేష్, యధుశేఖర్ నాయుడు, ఆసూరి బాలాజీ, కృష్ణంనాయుడు, కృష్ణానాయక్, బల్లాపురం నరేష్, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
రైల్వేస్టేషన్ అభివృద్ధి పను లు నెలల తరబడి చేస్తున్నారు. అంత మొత్తం నిధులు వచ్చినప్పుడు ఎంత వేగంగా పనులు చేయాలి..?. కానీ ఎప్పుడూ సాకు లు చెబుతూ..ఆలస్యం చేస్తున్నారు. ప్రయాణికులు, వారి కుటుంబీకులకు అసౌకర్యంగా ఉంది. – అశోక్కుమార్, మాజీ బ్యాంకు అధికారి, చిత్తూరు అన్ని రైళ్ల్లూ ఆగేలా చూడాలి పలు రైళ్లు ఆపకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్మీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వీటి పై ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఇటువైపు వచ్చే అన్ని రైళ్లు ఇక్కడ తప్పకుండా ఆగాలి. అప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. – సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చిత్తూరు స్మార్ట్సిటీ డెవలప్మెంట్ సొసైటీ -
డ్రోన్తో పేకాటరాయుళ్ల వేట!
– రూ.13,890 నగదు, సెల్ఫోన్లు, 2 బైక్లు సీజ్ రొంపిచెర్ల: పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రోన్ కెమెరాతో దాడి చేసి జూదరులను పట్టుకున్న సంఘటన కల్లూరు సర్కిల్ పరిధిలోని రొంపిచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ సీఐ సూర్యనారాయణ కథనం..గానుగచింత గ్రామ పంచాయతీలోని జగడంవారిపల్లె అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని స్థానిక పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ రంగంలోకి దిగారు. చిత్తూరు నుంచి పోలీసు సిబ్బంది పక్కా వ్యూహంతో వచ్చారు. అయితే అటవీప్రాంతం కావడంతో జూదరులను పట్టుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. దీంతో డ్రోన్ కెమెరా సాయంతో మామిడి తోటలో జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. దాడి చేసి గానుగచింత నగిరికి చెందిన ఎస్.మురళి(44), జి.రెడ్డి ప్రసాద్ (34) (జగడంవారిపల్లె), ఏ.విశ్వనాథ (45), (చంద్రగిరి), ఎన్.షౌకత్అలీ (44) (పెద్దమల్లెల కస్పా), ఏ.ఆనంద్(31) (కేవీపల్లె), కె.రమణారెడ్డి (63) (కాకులారంపల్లె), ముప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన కె.రెడ్డెప్ప (45)ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ13,890 నగదు, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. -
సబ్సిడీ వివరాలు సరిచూసుకోండి
గుడిపాల: మామిడి సబ్సిడీకి సంబంధించి రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణా తెలిపారు. గురువారం బసవాపల్లెలో మామిడి సబ్సిడీకి సంబంధించి రైతులతో గ్రామసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫ్యా క్టరీలకు మామిడి కాయలు తోలిన రైతులు మరొకసారి వారి బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోవాలన్నారు. రైతుల సమక్షంలో వారి వివరాలను సచివాలయం వద్ద అతికించారు. అనంతరం పొలం పిలుస్తుందిలో భాగంగా చెరుకు, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వ్యవసాయాధికారి సంగీత, అగ్రికల్చర్ అసిస్టెంట్ యోగప్రియ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
మామిడి బకాయిలు చెల్లించండి
పుత్తూరు: మామిడి రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని మామిడి రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి హేమలత డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మామిడి ఫ్యాక్టరీ యాజమాన్యాలు కేజీకి రూ.8, ప్రభుత్వం రూ.4తో కలిపి మొత్తం రూ.12 వంతున చెల్లించాలన్నారు. రోజులు గడిచిపోతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యాలుగానీ, ప్రభుత్వం గానీ నగదు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఐక్యంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు హరిబాబు, ఆనందనాయుడు, యువరాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి పుత్తూరు: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి నగరం రోడ్డు కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారం చేపట్టారు. యూనియన్ నాయకురాలు మునికుమారి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. -
హే..కృష్ణా!
అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి, ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా చెరువులు చాలావరకు ధ్వంసమయ్యాయి. వర్షాలు పడినా చెరువుల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ మీదుగా కుప్పం ఉప కాలువకు వస్తున్న కృష్ణా జలాలను పలమనేరు, కుప్పం ప్రాంతాల్లోని చెరువులుకు నింపాల్సి ఉంది. లేనిపక్షంలో జిల్లాలోని పడమటి మండలాలు ఎడారిగా మారే అవకాశం ఉంది.. ఈ క్రమంలో కూటమి నేతలు ఎలా స్పందిస్తారోనని రైతులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పలమనేరు: పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పలు చెరువులను కూటమి నేతలు చెరబట్టారు. చాలా చెరువుల్లో మట్టి, ఇసుక తవ్వేయడంతో గుంతలమయమయ్యాయి. వర్షాలొచ్చినా నీరు చేరక చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో భూగర్భజలాలు అడుగంటాయి. డివిజన్ పరిధిలో 80 వేల వ్యవసాయ బోర్లుండగా ఇప్పటికే 20 వేల బోర్లలో నీరు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు పడుతున్న వర్షాలతో వర్షపు నీరు చెరువుల్లోని గుంతలు కూడా నిండడం లేదు. నాలుగు రోజుల్లో కృష్ణా జలాలు కృష్ణా జలాలు చెర్లోపల్లి రిజర్వాయర్కు ఇప్పటికే చేరాయి. అక్కడి నుంచి పుంగనూరు, కుప్పం ఉపకాలువ మీదుగా మరో నాలుగైదు రోజుల్లో పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి(224.5కిమీ)కి చేరుకునే అవకాశం ఉంది. ఆపై ఇవి బైరెడ్డిపల్లి, వీకోట మీదుగా కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రంలోకి చేరుకోనున్నాయి. కూటమి నేతల దెబ్బకు ధ్వంసమైన చెరువులు ఇక్కడి చెరువుల అనుసంధానమే లక్ష్యం హంద్రీ–నీవా– సుజల స్రవంతి పథకంలో భాగంగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన(కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు) ల్లోని 6,025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగు నీటిని అందించడమే దీని లక్ష్యం. ఇందుకోసం కృష్ణా నది నుంచి 120 టీఎంసీల నీటిని ఇక్కడికి తరలిస్తున్నారు. పుంగనూరు ఉపకాలువ నుంచి 143.9 కి.మీ మేర ప్రయాణించి కుప్పం ఉపకాలువ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాలకు 4.02 లక్షల మందికి తాగునీరు, 110 చెరువులకు సాగునీటిని మళ్లించనున్నారు. ఇక్కడి చెరువుల పరిధిలోని 6,300 ఎకరాల భూములకు సాగునీటిని అందించాలన్నది దీని లక్ష్యంగా నిర్ధేశించారు. దీంతో కృష్ణా జలాలను ఇక్కడి ఎంఐ(మేజర్ ఇరిగేషన్ ట్యాంకులు) చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు. -
యూరియా..లేదయ!
జిల్లాలో యూరియా నోస్టాక్ పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మొన్నటి దాకా కాంప్లెక్స్ కొంటేనే యూరియాను అమ్మిన ఫర్టిలైజర్స్ యజమానులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్కా అందే జిల్లాలోని గ్రోమోర్ అవుట్లెట్లు, రైతు సమాఖ్య దుకాణాల్లో మాత్రం అప్పుడప్పుడు అందే లోడ్డు యూరియా కోసం వందలాది మంది రైతులు ఎగబడేవారు. వారిని నియంత్రించేందకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. చాలీ చాలకుండా వచ్చే స్టాకు గంటల వ్యవధిలోనే ఖాళీ అయ్యేది. పలమనేరులో ఓ రైతు సమాఖ్య వారు గురువారం ఓ లోడ్డు యూరియాను తెప్పించారు. రైతులు అక్కడికి వందలాది మంది చేరుకుని క్యూ కట్టారు. కర్ణాటకలోనూ నోస్టాక్ జిల్లాలో యూరియా లేక ఇప్పటిదాకా రైతులు పొరుగునే ఉన్న కర్ణాటక వెళ్లి యూరియాను తెచ్చుకొనేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. అమాంతం పెరిగిన ధరలు స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకకు చెందిన కొందరు వ్యాపారులు యూరియాను ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్థానికంగా యూరియా బస్తా ధర రూ.270 కాగా అది రూ.300 దాటింది. అంత ధర ఇస్తామన్నా యూరియా దొరడం లేదు. బస్తా రూ.400 నుంచి రూ.500 దాకా పెట్టి అమ్మకాలు చేస్తున్నా యూరియా నిమిషాల్లోనే అయిపోతోంది. క్యూకట్టిన రైతులు పలమనేరు ప్రాంతంలో ఇటీవల వర్షాలకు వరి నాట్లు వేశారు. ఇప్పుడు యూరియా వరికి చాలా అవసరం. దీంతోపాటు పశుగ్రాసానికి కూడా అవరసం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో స్థానికంగా యూరియా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతు సమాఖ్య వారు గురువారం ఓ లోడ్డు యూరియాను తెచ్చారు. దీనికోసం వందలాది మంది షాపు తెరవకముందే క్యూ కట్టారు. వీరిని అదుపు చేయలేక స్థానిక పోలీసులు బందోబస్తుకు రావాల్సి వచ్చింది. జిల్లా సమాచారం ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం – 1.70 లక్షల హెక్టార్లు ఇప్పటిదాకా సాగైన విస్తీర్ణం – 60వేల హెక్టార్లు ఈ దఫా వరిసాగు విస్తీర్ణం – 27వేల హెక్టార్లు ప్రస్తుతానికి కావాల్సిన యూరియా – 20వేల బస్తాలు అందుబాటులో ఉన్న యూరియా – 2వేల బస్తాలు గతంలో గ్రామాల్లోనే యూరియా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కూటమి పాలనలో యూరియా కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. బస్తా యూరియా కోసం పనీపాట వదలుకొని అవస్థలు పడాల్సి వస్తోంది. వాస్తవంగా బస్తా యూరియా రూ.270. ఇక్కడ లేకపోవడంతో కర్ణాటక నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఖర్చుతో కలిపి మొత్తం బస్తా రూ.350 దాకా ఖర్చుచేయాల్సి వస్తోంది. – నరసింహారెడ్డి, ఎగువ మారుమూరు, పలమనేరు మండలం వారంగా తిరుగుతున్నా ఈ మధ్య కురిసిన వానలతో కొంత పొలంలో వరి సాగుచేశా. ఆ పంట పసుపు రంగులోకి మారింది. ఓ బస్తా యూరియా చల్లాలని వారం రోజులుగా పలమనేరులోని దుకాణాల వద్దకు తిరుగుతున్నా. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అంటున్నా యూరియా దొరకడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల స్కోర్ జాబితాలను ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన విషయం విధితమే. ఈ జాబితాల్లో పలువురు అభ్యర్థుల టెట్ ఫలితాలు తప్పుగా నమోదు కావడంతో సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రోస్టర్, మెరిట్ ఆధారంగా తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో ప్రచురించనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల కసరత్తు నిర్వహించనున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర స్థాయిలో శిక్షణ సైతం పూర్తి చేశారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. రెండు ఇంజినీరింగ్ కేంద్రాలు ఎంపిక చిత్తూరు జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉండే అపోలో యూనివర్సిటీ, ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలను సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో అర్హత సాధించే 1,473 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. పరిశీలను 30 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. -
వారి కడుపుకొట్టి ఏం సాధిస్తారు బాబూ?
చిత్తూరు కార్పొరేషన్: అడ్డగోలు నిబంధనలతో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని చిత్తూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ బాబు సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కుల మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పింఛన్ మంజూరైందన్నారు. తాము అధికారంలోకి వస్తే వారికి అదిక పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నమ్మి ఓట్లేసిన దివ్యాంగులకు ఇప్పుడు నోటీసులు జారీ చేసి పింఛన్ ఎత్తివేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లకు కోత పెడుతుండడంతో బాధితులకు దిక్కుతోచడం లేదన్నారు. ప్రస్తుతం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లు కోత విధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో దాదాపు 5వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు. వీరిని అనర్హులుగా తేలుస్తూ వచ్చే నెల నుంచి పింఛన్లు నిలిపివేయనున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రతినెలా ఆహారం, మందులు ఇతర ఖర్చులకు పింఛనే ఆధారమన్నారు. ఇప్పుడు పింఛన్ తొలగిస్తే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. అంతర్ జిల్లా బదిలీలకు కసరత్తు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారులు అంతర్ జిల్లా బదిలీలకు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి కసరత్తు చేపడుతున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ అంతర్ జిల్లా బదిలీలకు అర్హులైన టీచర్లు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ మహిళా జట్ల ఎంపిక రేపు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ మహిళల జట్ల ఎంపిక ఈ నెల 23న ఉంటుందని ఆ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి మహిళా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ ఎంపికయ్యే క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో పల్నాడు జిల్లా దూబిపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర సమాచారానికి 9581887409, 7013989059 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
కొత్త పంథా..ఇసుక దందా
సాక్షి టాస్క్ ఫోర్స్: గూడూరు వయా చిత్తూరు మండ లం మీదుగా తమిళనాడుకు పుష్ప రేంజ్లో ఇసుక దందా నడుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూట మి నేతలు రెచ్చిపోతున్నారు. ఈ ఆక్రమ వ్యవహారా న్ని స్థానికులు బట్టబయలు చేశారు. అయితే పోలీసు లు కేసు నమోదు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. సరిగ్గా మరో 5 నిమి షాల్లో జిల్లా సరిహద్దు దాటి తమిళనాడుకు వెళ్లిపోయే సమయంలో చిత్తూరు మండలం, అనంతాపురం గ్రా మం వద్ద గురువారం ఓ లారీ టైరు పేలి నిలిచిపోయింది. తీరా ఆ లారీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న బండేనని స్థానికులు నిర్థారణకు వచ్చి.. అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు స్పందించకపోవడంతో లారీ పైన కట్టిన పట్టను విప్పి చూడగా.. ఇసుకపై వరి పొట్టు బ్యాగులను నింపి ఉండడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్క డకు చేరుకున్న బీఎన్ఆర్ పేట ఎస్ఐ నాగసౌజన్య లా రీని అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనిపై పోలీసు లు కేసు నమోదు చేయలేదు. ఈ అక్రమ వ్యవహారం మొత్తం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా కూటమి నేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాన్ని వదిలిపెట్టేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఎస్ఐ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. స్థానికులు కూడా దీనిపై సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని ఆమె పేర్కొన్నారు. -
ఇదీ చెరువుల దుస్థితి
పలమనేరు ఇరిగేషన్ పరిధిలో మొత్తం 787 చెరువులున్నాయి. వీటిల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం గలవి) 57 దాకా ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 దాకా ఆక్రమణలకు గురై కనిపించకుండా పోయాయి. మిగిలిన వంద దాకా చెరువులు 10 నుంచి 30 శాతం ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పటికే కూటమి నేతల దెబ్బకు చెరువులు గుంతలమయయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వర్షపు నీరు ఈ గుంతల్లోకి సైతం రాని పరిస్థితి. ఎటూ వానలోచ్చినా చెరువుల్లోకి నీరురాదు కాబట్టి కృష్ణా జలాలతో వీటిని నింపడం మినహా మరో మార్గం లేదు. -
అది నెరవేరితే చాలు సామీ
హంద్రీ–నీవా జలాలు వస్తున్నాయంటున్నారు. వాటిని ఇక్కడి చెరువులకు నింపాలి. భూగర్భజలాలు పెరగాలి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పాలి. 6,300 ఎకరాల్లో చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణకు 0.5 టీఎంసీల సాగునీరు, 4.02 లక్షల మందికి 0.6టీఎంసీల తాగునీరు అందుతుందని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. – రామరాజ్, రామాపురం, రైతు, బైరెడ్డిపల్లి మండలం భూగర్భ జలాలు పెరుగుతాయి నాకు మూడెకరాల పొలం ఉంది. మా పొలం మధ్యలోనే హంద్రీ–నీవా కాలువ వచ్చింది. పొలం పోగొట్టుకున్నప్పుడు బాధ కలిగింది. గత ప్రభుత్వంలో కాలువలో నీరు వదిలినప్పుడు భూగర్భజలాలు పెరిగాయి. అందుకే ఈ ప్రాంతంలోని చెరువుల్లోకి కృష్ణా నీటిని నింపాలి. అప్పుడు ఇక్కడున్న బోర్లలో నీరు బాగా వస్తే దిగులుండదు. – శ్రీనివాసులు, గుండుగల్లు, గంగవరం మండలం చెరువులు నిండితే చాలు నాకు రెండెకరాల పొలం ఉంది. అందులో మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. ఎందుకంటే చెరువుల్లో నీరు లేదు. హంద్రీ–నీవా కాలువ ద్వారా వచ్చే నీటితో ఇక్కడి చెరువులను నింపాలి. అప్పుడే బీడు భూములుగా మారిన పొలాలు మళ్లీ పచ్చగా మారతాయి. – వెంకట్రమణ, బొమ్మరాజుపల్లె, గంగవరం మండలం -
● ఆచార్య మోతోభవ!
మాతృదేవోభవ..పితృదేవోభవ.. అమ్మానాన్నలు దేవుళ్లతో సమానం.. ఆ తరువాతి స్థానం ఆచార్యుడిదే. అందుకే ఆచార్యదేవోభవ అని గురువులను వేనోళ్ల కీర్తిస్తారు. ఇదీ మన భారతీయ సంప్రదాయంలో గురువుకున్న విలువ. అలాంటి స్థానంలో నిలిచిన గురువులను కూటమి సర్కారు కూలీల కింద లెక్క కట్టింది. పుస్తకాలు మోత భారం ఉపాధ్యాయులపై మోపింది. విధిలేక.. ఉద్యోగం వదులుకోలేక.. కొందరు ఉపాధ్యాయులు పుస్తకాలను నెత్తిపై పెట్టుకుని మోశారు. తమది కానీ ధర్మం నెరవేర్చారు. ఈ చిత్రం చూస్తే కూటమి ప్రభుత్వం గురువులకు ఏ పాటి స్థానం ఇస్తుందన్న విషయం తేట తెల్లమవుతోంది. గత ఎన్నికల్లో టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. గౌరవ ప్రధమైన వృత్తిలో ఉండే ఉపాధ్యాయులు చంద్రబాబు జమానాలో దినసరి కూలీల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. టీచర్లపై ఈ సర్కారు ఎలాంటి ఒత్తిడి మోపుతుందనడానికి ఓ ఉపాధ్యాయుడు నెత్తిపై పుస్తకాల కట్ట, భుజం మీద, చేతిలో మరో పుస్తకాల కట్టలను మోస్తున్న చిత్రమే నిదర్శనం. ఈ చిత్రం సోషల్మీడియాలో వైరల్గా మారింది. – చిత్తూరు కలెక్టరేట్ -
వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు
పలమనేరు: కొన్నేళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. వీరికి బలవంతపు బదిలీలు, డిప్యూటేషన్లు తప్పడం లేదు. గత ఆరేళ్లలో నాలుగు దఫాలు వీరు బదిలీకే పరిమితమవుతున్నారు. పోనీ బదిలీతో ఆపుతారనుకుంటే అదీ లేదు. వీరిని డిప్యూటేషన్లపై వేరే బడికి పంపడం రివాజుగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న 164 మంది భాషోపాధ్యాయులు వలసపక్షుల్లాగా మారిపోయారు. కోర్టుమెట్లెక్కి అనుమతి తీసుకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పలువురు భాషోపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 2019లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులకు (తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, సంస్కృతం) జీవో నంబర్ 91 మేరకు ఉన్నతీకరణ జరిగింది. ఆ జీవో అమలు కాకుండా కొందరు కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిని పక్కనబెట్టి ఉన్నతీకరణలో ఎస్జీటీలకు చోటు కల్పించేలా ఆదేశాలను తెచ్చారు. దీంతో విద్యాశాఖ జీవో నంబర్77 ద్వారా ఎస్జీటీలకు మేలు కలిగేలా చేశారు. ఎల్పీ(ల్యాంగేజ్ పండిట్స్) కేడర్ లేకుండా చేశారు. ఈ క్రమంలో వీరికి ఎల్పీ వ్యవస్థా లేకుండా .. ఉన్నతీకరణ లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలు బేఖాతర్ తమకు జరిగిన అన్యాయంపై భాషోపాధ్యాయులు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టీస్ మన్మధరావు సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2019 నుంచి వీరికి అన్ని సదుపాయాలను కల్పించి, మూడు నెలల్లో ప్రమోషన్ అర్హతలున్నవారికి అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయాలని భాషోపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖను కోరింది. దీంతో వారు వేకన్సీలు లేవని సెలవుల్లో ఈ ప్రక్రియ ఉంటుందని దాట వేసింది. ఇది జరిగితే తమకు ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఎస్జీటీలు దీనిపై హైకోర్టులో స్టేటస్కో ఉత్తర్వులను పొందారు. ఫలితంగా వీరి సమస్య మరింత జఠిలంగా మారింది. అప్పట్లో విద్యాశాఖ చేసిన అలసత్వం వీరికి శాపంలా మారింది. బలవంతపు బదిలీలు తమపైనే కోర్టుకెళ్లారనే అక్కసుతో విద్యాశాఖ సైతం వీరితో చెలగాటమాడుతోంది. ఆ మేరకు గత ఆరేళ్ల లో వీరిని నాలుగు దఫాలు బదిలీలను చేసింది. బదిలీ చేసిన చోటా ఉంచకుండా వర్క్ అడ్జెస్ట్మెంట్ సాకుతో మూడు నెలలు, ఆరు నెలలు ఓ బడిలో పనిచేశాలా డిప్యూటేషన్లు వేస్తోంది. మళ్లీ అధికారికంగా బదిలీ అయిన బడికి ఆ విద్యాసంవత్సరంలో చివరి రోజు పంపుతోంది. చేతులెత్తేసిన డిప్యూటీ సీఎం తమ సమస్యను మీరైనా పరిష్కరించాలంటూ గత యేడు తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా పలువురు భాషోపాధ్యాయులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు మీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కానీ రెండేళ్లవుతున్నా దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.క్యాడర్ లేకుండా ఆరేళ్లుగా పనిచేస్తున్నా నేను ఆరేళ్లుగా క్యాడర్ లేకుండా పనిచేస్తున్నా. కనీసం మాకు జాబ్కార్డు కూడా లేదు. ప్రమోషన్లూ లేకుండా చేశారు. కోర్టు తీర్పునిచ్చినా విద్యాశాఖ వాటిని అమలు చేయడం లేదు. ఇంత దారుణం ఎక్కడా లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో..? – బెంగళూరు స్వామినాథుడు, తెలుగు పండిట్, గుడిపల్లి మండలంఆడుకుంటున్నారు మేమేం పాపంచేశామోగానీ విద్యాశాఖ మాకు ఎలాంటి క్యాడర్ లేకుండా, ప్రమోషన్లు లేకుండా చేసింది. దీంతోపాటు ఉన్నత పాఠశాలలో భోదించే మమ్మల్ని ప్రైమరీ బడులకు పంపుతోంది. అదీ ఓ చోట కాదు ఎక్కడిబడితే అక్కడికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మహిళలమైన మాకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. – భాగ్యలక్ష్మి, తెలుగు పండిట్, రామసముద్రంఇంత వివక్ష ఎందుకు? తెలుగు భాషోపాధ్యాయులపై విద్యాశాఖ ఎందుకింత వివక్ష చూపుతోందో అర్థం కావడం లేదు. మేము ఉన్నత పాఠశాలలో తెలుగును బోధించాలి. కానీ మమ్మల్ని ప్రైమరీ బడుల్లో టీచర్లు సెలవు పెట్టిన చోటుకు పంపుతున్నారు. జాబ్చార్ట్లేకుండా చేసి ఎక్కడిపడితే అక్కడికి పంపుతున్నారు. – హిమబిందు, జెడ్పీహెచ్ఎస్, కే.గొల్లపల్లి, యాదమరి మండలం -
వరసిద్ధుడికి రూ.1.67 కోట్ల ఆదాయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీ ద్వారా రూ.1,67,32,780 ఆదా యం ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధ వారం లెక్కించారు. ఈఓ పెంచల కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో బంగారం 50 గ్రాములు, వెండి 1.617 కిలోలు వచ్చిందని ఈఓ పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,236, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.41,450 వచ్చిందన్నారు. యూఎస్ఏ డాలర్లు 397, సింగపూర్ డాలర్లు 5, మలేషియా రింగిట్స్ 1, యూఏఈ దిర్హామ్స్ 230, కెనడా డాలర్లు 105, ఆస్ట్రేలియాడాలర్లు 70, యూరో దేశానికి చెందిన 325 యూరోలు, ఇంగ్లాడ్ 10 పౌండ్స్ వచ్చాయ న్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్బాబు, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, సుబ్రమణ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. డీవార్మింగ్ 99.81 శాతం పూర్తి చిత్తూరు అర్బన్(కాణిపాకం): నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ (డీవార్మింగ్ కార్యక్రమం) 99.81 శాతం పూర్తి చేసినట్లు ఇన్చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి మా త్రల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామన్నారు. జిల్లాలో 3,61,848 పిల్లలుంటే ఇప్పటి వరకు 3,61,848 మంది పిల్లలకు మాత్రలు అందజేశామని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్లు పరిమితికి మించితే చర్యలు తప్పవు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుంటే చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ డీఐఈఓ రఘుపతి హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కచ్చితంగా ఇంటర్మీడియ ట్ బోర్డు నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కళాశాలల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, ఎంసెట్ మెటీరియల్ను పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 31 ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం 3,970 అడ్మిషన్లు, 98 ప్రైవేట్ కళాశాలల్లో 11,042 మొత్తం 15,012 అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం కంటే అడ్మిషన్లు మెరుగుపడ్డాయన్నారు. ఈ నెల 31 వ తేదీ వరకు ఆన్టీసీ అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 వరకు మూతపడిన కళాశాలలున్నట్లు తెలిపారు. ఆ కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఐఈఓ వెల్లడించారు. -
గుడిని కూల్చి.. ఆక్రమణకు యత్నం
● నకిలీ పత్రాలతో కూటమి నేతల కుట్ర ● ఆలయ భూమి కాపాడాలని కమిటీ సభ్యుల డిమాండ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): మురంకబట్టులోని శ్రీసుందర వెంకటేశ్వరస్వామి గుడిని కూటమి నేతలు కూల్చేసి స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆలయ కమిటీసభ్యులు కార్తీకేయన్, సహదేవన్, ఎల్ఐసీ గోపి ఆరోపించారు. బుధవారం చిత్తూరు నగరంలోని మురకంబట్టులో ఈ మేరకు నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయాన్ని ఆనుకుని 90 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆన్లైన్లో డ్రై ల్యాండ్గా చూపుతున్న ఈ భూమి ఆక్రమణకు గురువుతోందని తెలిపారు. ప్రజాపరిష్కారవేదికలో ఫిర్యాదు చేస్తే డ్రై ల్యాండ్ చూపిస్తూ అధికారులు బోర్డు పెట్టారన్నారు. ఇటీవల కూటమికి చెందిన పుండరీకాక్షయ్య, ఆనందయ్య, చిన్ని, రాజు తదితరులు జేసీబీలతో ఆలయాన్ని కూల్చేశారని మండిపడ్డారు. నకిలీ పత్రాలు చూపిస్తూ ఈప్రభుత్వ భూమి తమదేనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల నుంచి ఆలయ భూమిని విడిపించాలని కోరారు. కార్యక్రమంలో లోకేష్, గౌతమ్, శివ, విజయ్, ఇమాయరాజు, ప్రకాష్, హరి, అశోక్, కోటి, మురాజ్, శంకర్, కుప్పుస్వామి పాల్గొన్నారు. -
దోమల నియంత్రణతో వ్యాధుల కట్టడి
చిత్తూరు అర్బన్: దోమలను నియంత్రణతోపాటు అవి కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో వ్యాధులను కట్టడి చేయవచ్చని జిల్లా ఇన్చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్తూరు నగరంలోని వెంగళరావు కాలనీలో కార్పొరేషన్ అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ, దోమల నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర విష జ్వరాలు చాలా వరకు దోమ కాటుతోనే వస్తాయన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూడడంతో దోమలను నియంత్రించవచ్చన్నారు. దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ వెంకటరామిరెడ్డి చెప్పారు. ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో దోమల నియంత్రణకు ఫాగింగ్, మొలాథియన్ పిచికారీ, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం మేజర్ కాలువలో ఆయిల్ బాల్స్ వేసి, మందు పిచికారీ చేయించారు. దోమల నియంత్రణపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి కథల పోటీల్లో చిత్తూరు విద్యార్థిని ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి కథల పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని సాయిరెడ్డి ఉదితి ప్రతిభ చూపి, బహుమతి సాధించినట్లు దేవీబాలామందిర్ పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వురిమళ్ల ఫౌండేషన్ (ఖమ్మం) ఆధ్వర్యంలో జాతీయస్థాయి కథలు, కవితల పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఉదితి రాసిన మన భరతమాత (దేశభక్తి) కథ జాతీయ స్థాయిలో ఎంపికై ందన్నారు. ఈ కథను సంకలనంగా ముద్రిస్తారని వురిమళ్ల ఫౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం ఆ విద్యార్థినిని హెచ్ఎం సుజాత, టీచర్లు అభినందించారు. -
వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి
చిత్తూరు కార్పొరేషన్ : తపాలా ఉద్యోగుల వేతన సవరణకు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని తపాలా శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో నాయకులు భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవక్లు, పెన్షనర్లందరికీ వేతన సవరణతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో వేతన సవరణలో పెన్షనర్లకు సవరణ చేయబోమని ప్రకటించడం దారుణమన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ ధర్నాలో నాయకులు రామమూర్తి, అరుణ, మహదేవన్, దామోదర, హరిప్రసాద్, సురేంద్ర, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీళ్లు తెప్పింఛన్
దివ్యాంగులకు ఆసరా అందించే పింఛన్కు కూటమి సర్కారు గండి కొట్టింది. రీ వెరిఫికేషన్ పేరుతో అర్హులైన పలువురికి పింఛన్ రద్దు చేయగా, మరెందరికో కోత విధించింది. ఫలితంగా దివ్యాంగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. సదరమ్ సర్టిఫికెట్లు, రీవెరిఫికేషన్ కోసం ఆస్పత్రులకు నడవలేక.. అధికారులు చుట్టు తిరగలేక ఇక్కట్లు పడుతున్నారు. వారికి పింఛన్ కన్నీళ్లు తెప్పిస్తోంది. బంగారుపాళెం: కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లలో కోత పెడుతోంది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వైకల్యం కలిగి ఉన్నప్పటికీ తమకు పింఛన్లను తొలగించారంటూ బుధవారం పలువురు దివ్యాంగులు బంగారుపాళెం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఇటీవల వికలాంగ పింఛన్ల రీ వెరిఫికేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మండలంలో 159 మంది అనర్హులుగా తేల్చి నోటీసులు అందజేశారు. తాము పుట్టుకతోనే వికలాంగులుగా ఉన్నామని, 90 శాతం వైకల్యం ఉందని డాక్టర్లు పరిశీలించి సర్టిఫికెట్లు సైతం జారీ చేశారన్నారు. రీ వెరిఫికేషన్లో తమకు 40 శాతం కంటే తక్కువ ఉందని పింఛన్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకల్యంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుపైనే ఆధారపడి కాలాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో పింఛన్ తొలగించడంతో దిక్కుతోచడంలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అందుతున్న పింఛన్లను అకారణంగా ఎందుకు తొలగించారో అర్థం కాక, ఏమి చేయాలో దిక్కు తోచక తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామన్నారు.రూ.6 వేలకు తగ్గించారు నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. 90 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది. వైకల్యం శాతం తగ్గించి రూ.15 వేలు వస్తున్న పింఛన్ను తగ్గించి రూ.6 వేలకు మార్చారు. ఇలా 48 మందికి పింఛన్లను తగ్గించారు. – ప్రభాకర్రెడ్డి, దివ్యాంగుడు, తగ్గువారిపల్లెనాకు పింఛన్ కట్ చేశారు నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. నాకు 95 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది. గతంలో రూ 15 వేలు పింఛన్ వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం వికలాంగుల పింఛన్ రీ వెరిఫికేషన్ చేసింది. తనకు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందంటూ నోటీసు ఇచ్చి పింఛన్ కట్ చేశారు. నడవలేని స్థితిలో ఉన్న మాలాంటి దివ్యాంగులకు పింఛన్లో కోత విధించడం ఎంతవరకు సమంజసం. తమకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. –గోపి, దివ్యాంగుడు, తంబుగానిపల్లె -
చిత్తూరులో గీత సామాజిక వర్గానికి మద్యం బార్
చిత్తూరు అర్బన్: కార్పొరేషన్ పరిధిలో ఓ మద్యం బారును కల్లు గీత సామాజిక వర్గానికి కేటాయిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.5.10 లక్షల ఆన్ రీఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించి మద్యం బారు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీసీ ఈడిగ సామాజిక వర్గం కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని.. లైసెన్స్ ఫీజును 50 శాతం రాయితీతో రూ.27.50 లక్షలుగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణం కేటాయిస్తామని పేర్కొన్నారు. పింఛన్ల తొలగింపు దుర్మార్గం ఐరాల : దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ రద్దు నోటీసు అందుకున్న 50 మంది బాధితులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ ధనలక్ష్మికి నోటీసులు చూపించి తామ ఏం పాపం చేశామని వాపోయారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే సదరం సర్టిఫికెట్ జారీ చేశారని వెల్లడించారు. దాదాపు 15 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న తమకు ఇప్పుడు తొలగిస్తూ నోటీసు జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. పింఛన్ల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంపీడీఓ స్పందిస్తూ.. పింఛన్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. -
ప్రొటోకాల్ పాటించరూ!
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో ప్రొట్కాల్ ఉల్లఘించారని కాణిపాక వాసులు మండిపడుతున్నారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏటా ప్రొటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలు ముద్రించేవారు. ఈ ముద్రణ పార్టీలకతీతంగా ఉండేది. గత ఐదేళ్లలో కూడా ప్రొటోకాల్కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దొరబాబు ఫొటోతో సహా ముద్రిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రూల్స్ మారాయని కాణిపాకం వాసులు మండిపడుతున్నారు. కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ఫొటోలు మాత్రమే పత్రికలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, భరత్, చంద్రశేఖర్రెడ్డి ఫొటోలు లేకుండా పేర్లు మాత్రమే ముద్రించారని, ఇంతకీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటీకి ప్రొటోకాల్ ఉల్లంఘనే అంటూ ఉభయదారులు, కాణిపాక వాసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. కాగా 2024లో వారి ఫొటోలతో సహా ముద్రించడం గమనార్హం. -
కలెక్టర్ సారూ.. కరుణచూపరా..!
బంగారుపాళ్యం/కాణిపాకం: పక్షవాతంతో ఓ దివ్యాంగుడికి కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోయాయి. బక్కచిక్కిపోయిన శరీరంతో ప్రాణం నిలబెట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు పింఛన్ సొమ్ముతో కాస్త ఆయుషు పోసుకుంటున్నాడు. అయితే రీ వెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఆ దివ్యాంగుడి పింఛన్కు ఎసురు పెట్టింది. తొలుత 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, కలెక్టర్ ఫిర్యాదుతో జీరో శాతం ఉందని మళ్లీ నోటీసులు ఇవ్వడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగారుపాళెం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతుల పెద్ద కుమారుడు హర్షద్. ఇతడు 8 నెలలకే జన్మించాడు. పుట్టుకతోనే పక్షవాతం బారిన పడ్డాడు. దీనికితోడు మెదడు సమస్య వచ్చింది. అప్పటి నుంచి హర్షద్ను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. నెలవారీ పింఛన్తో హర్షద్ ఆస్పత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ వెరిఫికేషన్లో హర్షద్ను అనర్హుడిగా తేల్చారు. 40 శాతం కంటే తక్కువగా ఉందని సచివాలయ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోడెక్కారు. సోమవారం కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ మళ్లీ వెరిఫికేషన్కు ఆదేశించారు. అయితే ఆ రిపోర్ట్ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పరిశీలన విభాగం కొట్టి పడేసింది. మళ్లీ జీరో శాతమని, హర్షద్ బాగుండాడని, ఎలాంటి సమస్యలు లేవని నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ను బుధవారం సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ నోటీసును చూసి వారు కంటతడిపెడుతున్నారు. కలెక్టర్కు విన్నమించుకున్న ఏమిటీ విచిత్రమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి చూసి...ఎలాంటి సమస్యలు లేనట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆగ్రహానికి గురవుతున్నారు. నిజంగానే అధికారులకు కళ్లుండి ఇలా చేస్తున్నారా.. లేక కక్షపూరితంగా చేస్తున్నారనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. కనికరం లేకుండా ఇలా చేయడం దారుణమని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ కల్పించుకుని న్యాయం చేస్తారా, లేదా చూడాలి మరీ. -
సంవత్సరమంతా భూమిని కప్పి ఉంచండి
పెనుమూరు(కార్వేటినగరం): ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా సంవత్సరమంతా భూమిని కప్పి ఉంచాలని ఆర్ వైఎస్ఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ వాసు సూచించారు. బుధవారం కేసీ పల్లి, తిరివిరెడ్డిపల్లి, చార్వాకానిపల్లి పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కప్పి ఉంచడంతో భూసారం పెరగడమే కాకుండా భవిష్యత్తులో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. బహుళ పంటలు సాగు చేయడంతో ఒక పంట పోయినా మరో పంట ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. వర్షాలు బాగా కురవడంతో వేరుశనగలో అంతర పంటలు సాగు చేయాలని సూచించారు. అలాగే సెప్టెంబర్లో రాష్ట్రస్థాయి అధికారులు క్షేత్ర పరిశీలన చేయనున్నారని, ఈ లోపు సిబ్బంది రైతులు ఏ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్, బహుళ పంటలు, ఆర్డీస్ పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం వరిలో అంతర పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హనుమంతు, నవీన్, హరికృష్ణారెడ్డి, వెంకటేష్, అనిల్కుమారి, గౌతమి, మణెమ్మ, హేమలత, భాస్కర్, రామానాయుడు పాల్గొన్నారు. -
వి.కోటలో చైన్ స్నాచింగ్
వి.కోట: మహిళ మెడలోని బంగారుచైన్ను గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చి లాక్కెళ్లిన సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన అమరావతి అనే మహిళ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్గా విధులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్థానిక వేణుగోపాల స్వామి వీధిలోని ప్రాథమిక పాఠశాల వద్దకు నడుచుకుని వెళుతుండగా ఆమెను బైక్పై వెంబండించిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు చైన్ను లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులలో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించి,వెనక కూర్చున్న వ్యక్తి తలకు టోపీ, కళ్లాద్దాలు ధరించి ఉన్నారని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. -
ఎంపీకి బెయిల్ రావాలంటూ శ్రీవారికి మొక్కులు
చంద్రగిరి : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడంతో ఆయనకు త్వరగా బెయిల్ రావాలంటూ ఆయన అభిమానులు తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం వారిని పోలీసులు అక్రమంగా అడ్డుకుని, స్టేషన్లో నిర్భందించారు. రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచుకుని ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం బుధవారం ఉదయం హరిప్రసాద్ రెడ్డితో పాటు అభిమానులు శ్రీవారిమెట్టుకు చేరుకున్నారు. ముందుగా అక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు పాదయాత్రను కొనసాగించారు. తిరుమలకు చేరుకున్న వారు శ్రీవారిని దర్శించుకుని, తమ అభిమాన నేత ఎంపీ మిఽథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అక్రమంగా అడ్డుకుని, నిర్భదించడం దీనికి ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
బంగారుపాళెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకురాలు, మండల ప్రత్యేక అధికారి పద్మమ్మ అన్నారు. బుధవారం బంగారుపాళెం, పాలేరు, తుంబకుప్పం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా? లేదా అని ఆరా తీశారు. అంగన్వాడీ పిల్లల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. తుంబకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీకి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారు.. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ముందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు షామీదాబేగం, కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ మూడో విడత అడ్మిషన్లకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మూడో విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించారని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. www.iti.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు చేసుకున్న అనంతరం ప్రభుత్వ ఐటీఐ అడ్మిషన్ విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7799679351, 9440738121, 9182590869 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. మామిడి చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పోషించాలి తవణంపల్లె: రైతులు మామిడి చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పోషించాలని రియల్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామారావు, సంస్థ చైర్మన్ హనీషా తెలిపారు. తవణంపల్లెలో ఉపాధి హామీ కార్యాలయంలో రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామారావు మాట్లాడుతూ మండలంలోని సరకల్లు, అరగొండ, తడకర, ఈచనేరి, వడ్డిపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, గళ్లావాళ్లవూరు, దిగువ మత్యం గ్రామాల్లోని 20 మంది రైతులకు 35 ఎకరాల్లో 2,800 అన్ని రకాల మామిడి చెట్లు అందించినట్లు పేర్కొన్నారు. రైతులు చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో రైతులకు ఉచితంగా మామిడి చెట్లు అందించినట్లు తెలిపారు. రైతులు ఆర్గానిక్ పద్ధతిలోనే మొక్కలు పెంచాలన్నారు. తవణంపల్లె క్లస్టర్ కోఆర్డినేటర్ శ్యామల, నవీన్ పాల్గొన్నారు. చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో ఎంపిక చేసిన 10 మండలాల్లో గురువారం విధిగా ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలు నిర్వహించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ వెంకట ప్రసాద్ ఆదేశించారు. బుధవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్న గ్రామాల్లో ఆరోగ్య సంరక్ష ణ సేవలు నిర్వహించాలన్నారు. సచివాలయం, విలేజ్ హెల్త్ క్లీనిక్ల వద్ద శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటలకు శిబిరాల్లో వైద్యసేవలందించాలని స్పష్టం చేశారు. చిత్తూరు, విజయపురం, పెనుమూరు, నిండ్ర, కార్వేటినగరం, యాదమరి, గంగవరం, రాయల్పేట, పెద్ద ఉప్పరపల్లె, శాంతిపురం మండలాలను ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలకు ఎంపిక చేసినట్లు వివరించారు. కుమరేషన్కు తెలుగుతేజం అవార్డు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరుకు చెందిన అధ్యాపకులు కుమరేషన్ శ్రీశ్రీకళా వేదిక తెలుగు తేజం అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 31వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగే వేదికలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఈయనతో పాటు జిల్లాలో మరో 6 మంది కవులు ఎంపికయ్యారు. -
హంద్రీనీవా కాలువ పనుల పరిశీలన
కుప్పం: నియోజక వర్గంలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో పూర్తి చేసి నీరు తీసుకువస్తామన్నారు. నియోజక వర్గంలోని 430 చెరువులను హంద్రీనీవా జలాలతో నింపుతామన్నారు. చెరువుల సామర్థ్యం, చెక్డ్యాములు బాగు చేయడం, నీటి నిలువల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఈలను ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలోనే కుప్పంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన డిజిటల్ సర్వే సెంటర్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికను వినియోగించుకోవడంతో వ్యాధులను ముందుగానే గుర్తించే చికిత్సలు తీసుకోవచ్చన్నారు. కుప్పం నియోజక వర్గంలో 13 పీ హెచ్సీలు, 92 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రాలు చూస్తాయన్నారు. డిజిటల్ సర్వే సెంటర్లను పరిశీలించి, ఎంత మంది పేషంట్లు వస్తున్నారు.. డాక్టర్లు ఏ సమయానికి వస్తున్నారు.. ఎప్పుడు వెళుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీ ర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్, హెచ్ఎన్ఎస్ ఎస్ ఎస్ఈ విఠల్ప్రసాద్, కుప్పం ఎగ్జిక్వూటివ్ ఇంజినీర్ గోవర్ధన్ పాల్గొన్నారు. -
బాబూ..దివ్యాంగులపై ఎందుకంత కక్ష?
● వైఎస్సార్సీపీ పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్ యాదమరి: ‘ కూటమి సర్కారు దివ్యాంగులపై కనీసం మానవత్వం చూపలేదు. పైగా వారు పదేళ్లుగా తీసుకుంటున్న పింఛన్లు కోత పెట్టింది. వారిపై ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పాలి.?’ అని వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దుర్భర జీవితాలు అనుభవిస్తున్న దివ్యాంగులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. కూటమి సర్కారు దివ్యాంగులను మానవతా ధృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి, వారి బతుకులతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఇప్పటికే జిల్లాలో 4,732 మంది అర్హత కలిగిన ల బ్ధి దారుల పింఛన్లను తొలగించడం దారుణమన్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన మానసిక, శారీరక వైకల్యం కలిగిన నిజమైన పింఛనుదారులకు సైతం సెప్టెంబర్ నెల నుంచి తమకు పింఛన్ రాదని అధికారులతో నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అని అన్నారు. దివ్యాంగుల శోకం రాష్ట్రాభివృద్ధికి అంత శ్రేయస్సు కాదని చంద్రబాబుకు హితవు పలికారు. సదరం ధ్రువపత్రాల కోసం నడవలేని స్థితిలో ఉన్నవారి ఆస్పత్రుల చుట్టు తిప్పడం సమంజసం కాదన్నారు. ప్రజల ముంగిటికే ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న కూటమి నేతలు..వైద్య పరీక్షలు కూడా వికలాంగుల చెంతకే వెళ్లి చేయవచ్చు కదా? సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు సృష్టించాలన్నా.. వాటి ఫలాలు ప్రజలకు అందాలన్నా.. అది కేవలం వైఎస్ జగనన్నకే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల కోతలపై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ దివ్యాంగుల తరఫున పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. -
విద్యుత్ గ్రీవెన్స్కు 4 సమస్యలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని అర్బన్ డివిజన్ ట్రాన్స్కో కార్యాలయం ఆవరణలో బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు వినతులు అందజేశారు. వాటిని సకాలంలో పరిష్కారించాలని డీఈ ప్రసాద్ ఆ దేశించారు. వ్యవసాయ సర్వీసులకు డబ్బులు కట్టి వేచి చూస్తున్నమని వెంటనే సర్వీసు ఇ వ్వాలని రెడ్డిగుంట, కొత్తపల్లె సెక్షన్ పరిధిలోని రైతులు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లెలో నీటి సరఫరా కోసం మీటరు ఇవ్వాలని వినియోగదారుడు వినతిపత్రం సమర్పించారు. భూతగాదాలో ఉన్న సర్వీసు మీటర్ మార్చవద్దని చిత్తూరు రూరల్ పరిధిలోని ఓ వినియోగదారుడు తెలియజేశారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని డీఈ వివరించారు. టెక్నికల్ ఏఈ మాధురి పాల్గొన్నారు.ఎల్ఈడీ టీవీల సమర్పణకాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి బుధవారం ఓ దాత ఎల్ఈడీటీవీలను విరాళంగా సమర్పించారు. చిత్తూరు నగరానికి చెందిన విమ్సన్ అధినేతలు రవీంద్రనాథ్, రమణ రూ.1.20 లక్షలు విలువ చేసే 55 ఇంచెస్ రెండు టీవీలను ఈఓ పెంచలకిషోర్కు అందజేశారు. అనంతరం ఆయన వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు.రైలు ఢీకొని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి మృతిపుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి రైలు ఢీకొని ఎం.శ్రావణ్కుమార్(31) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక లక్ష్మీనగ ర్ కాలనీలో నివాసమున్న శ్రావణ్కుమార్ నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో నాదస్వర విద్వాన్గా కాంట్రాక్ట్ బేసిక్పై పనిచేస్తున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలిచిత్తూరు కలెక్టరేట్ : రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు కోదండన్ డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు సకాలంలో ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వీఆర్ఏల పై ఉండే శాఖాపరమైన చర్యలు త్వరతిగితిన విచారించి పరిష్కరించాలన్నారు. ఆ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరాజ్, నాయకులు పెరుమాల్, రూపాణి, ఉదయ్, నరేష్ పాల్గొన్నారు.శాస్త్రోక్తంగా ప్రదోషకాల పూజకాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనా మణికంఠేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రదోషకాల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్, నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. స్వామివారికి విశేషాలంకరణ చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. -
విద్యాశాఖకు రెండు బహుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రస్థాయిలో ఈ నెల 19న నిర్వహించిన వికసిత్ భారత్ సెమినార్లో చిత్తూరు జిల్లా విద్యాశాఖకు రెండు బహుమతులు లభించాయి. ఈ సెమినార్కు జిల్లా తరఫున డీఈఓ వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ తరఫున టీమ్గా ఏర్పడి ఇతర అధికారుల సమన్వయంతో డీఈఓ వరలక్ష్మి ఎఫ్ఎల్ఎన్ (ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) అనే అంశంపై సెమినార్ ఇచ్చారు. అలాగే జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ స్కూలింగ్.. బిల్డింగ్ బ్లాక్స్ అనే అంశంపై టీమ్గా ఏర్పడి సెమినార్ ఇచ్చారు. ఈ సెమినార్ టీమ్లలో పలు జిల్లాలకు చెందిన డీలో, ఏపీసీలు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన సెమినార్ నిర్వహించి నిర్ధేశించిన 10 థీమ్లపై చర్చించారు. ఈ సెమినార్లో జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ పాల్గొన్న సెమినార్లో ‘బాల్యం బాగుంటే భవిష్యత్ బాగుంటుంది’ అనే చర్చలో మొదటి బహుమతి సాధించారు. అలాగే ఎఫ్ఎల్ఎన్ టీమ్కు రెండో బహుమతి లభించింది. ఈ సెమినార్లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష శాఖ ఎస్పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా డీఈఓ, ఏపీసీలు బహుమతులు స్వీకరించారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
కార్వేటినగరం: కార్వేటినగరంలోని రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు మంగళవారం వైభవంగా అంకురార్పణ చేపట్టారు. స్వామివారిని వేకువ జామున మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉభయ దేవేరులతోపాటు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమానికి ముందే పవిత్రమైన పుట్టమట్టితో ఆలయ ఆవరణలో మేదినీ దేవిని ప్రతిష్టించి అత్యంత వైభవంగా పూజలు, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం సాయంత్రం సేనాధిపతి ఉత్సవ సమర్పణ, రాత్రి మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల, వైదిక కార్యక్రమాలు చేపట్టారు. విశ్వక్సేనుని ప్రత్యేక వాహనంలో ప్రతిష్టించి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షరాబ్ బాబుసురేష్, వేద పండితులు రమేష్, శభరీష్, గోపాలస్వామి పాల్గొన్నారు. నేడు పవిత్రాల సమర్పణ బుధవారం ఉదయం కోదండరామస్వామికి ఏకాంత తిరుమంజనం, యాగశాలలో మధ్యా హ్నం వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు ఆలయ ఆధికారి సురేష్కుమార్ తెలిపారు. తర్వాత పవిత్రాల సమర్పణ ఉంటుందన్నారు. -
కలెక్టర్ ఆగ్రహం
చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ లైన్మన్(జేఎల్ఎం గ్రేడ్–2) సంఘం నాయకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జేఎల్ఎం నాయకులు వెళ్లారు. ఉన్నత కొలువులు పొందడానికి శిక్షణ కోసం రాత్రి పూట శిక్షణకు అనుమతివ్వాలని కోరారు. అక్కడే ఉన్న జేసీ విద్యాధరి గతంలో సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారికి రాత్రివేళ్ల శిక్షణకు దీర్ఘకాలిక అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పామన్నారు. కావాలంటే సెలవు పెట్టుకొని శిక్షణ తీసుకోవచ్చని సూచించినట్టు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ కల్పించుకుని సంబంఽధిత అధికారులతో విషయం మాట్లాడినా కొత్తగా తిరిగి సమస్యను తనకు తెలపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అధికారులు అనుమతివ్వడం లేదని జెఎల్ఎంగ్రేడ్–2 సంఘం నాయకులు చెప్పడం పై అసహనం వ్యక్తం చేశారు. వారిని వెంటనే బయటకు పంపాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ని పిలిచి ఇక్కడకొచ్చేందుకు జేఎల్ఎంలు అనుమతి, లేదా సెలవు తీసుకున్నరా..? అని ప్రశ్నించారు. తీసుకోలేదని ఆయన చెప్పడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నలుగురి నాయకుల పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఎస్ఈ వివరించారు. ఎన్జీఓ కార్యవర్గం ఏకగ్రీవం చిత్తూరు కార్పొరేషన్: సిటీ(వాణిజ్య పన్నులు) శాఖ చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎన్జీఓ(నాన్ గెజిటెడ్ అధికారుల) సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన ఆ సంఘ సమావేశంలో కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. రెండు జిల్లాల అధ్యక్షుడిగా ఎ.రాజేష్, అసోసియేట్ అధ్యక్షుడుగా దశరథన్, ఉపాధ్యక్షులుగా బి.సురేష్కుమార్రెడ్డి, పి.గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీధర్, కార్యాలయ కార్యదర్శిగా వి.పురుషోత్తంనాయుడు, సహాయ కార్యదర్శులుగా కె.రెడ్డిప్రసాద్, సి.జ్యోష్ణ, కోశాధికారిగా జ్ఞానవేల్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఏపీ ఎన్టీఓ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు కేవీ రాఘవు పాల్గొన్నారు. వీరి పదవీ కాలం మూడేళ్లు ఉంటుందని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు వివరించారు. -
అధ్వాన్న రోడ్లు
వర్షాలొస్తే అంతే!పుంగనూరు: వర్షాలు వస్తే పుంగనూరు–శంకర్రాయలపేట రోడ్డులో ప్రయాణం నరకప్రాయమవుతోంది. పుంగనూరు నుంచి పుంగమ్మ చెరువు కట్టమీదుగా శంకర్రాయలపేట, బెంగళూరుకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రహదారి దుస్థితికి చేరినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కుప్పం: కుప్పం ప్రాంతంలో చిరుజల్లులకే గ్రామీణ రహదారులు బురదమయమయ్యాయి. మండలంలోని ఊరినాయనిపల్లె కొత్తూరుకు వెళ్లే మార్గం గుంతలమయంగా మారింది. 40 ఏళ్లుగా గ్రామస్తులు రోడ్డు కోసం పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పొలాల్లో ఉన్న రోడ్లు వర్షాలొస్తే రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నోసార్లు అధికారులు, నాయకులను కోరినా పట్టించుకున్న పాపానపోవడం లేదని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. గంగవరం: మండలంలో ప్రధానంగా శ్రీకోనేటిరాయస్వామి ఆలయం ఉన్న కీలపట్ల రోడ్డు అధ్వాన్నంగా మారింది. హైవే ఆనుకుని కీలపట్లకు ఉన్న అనుసంధాన రోడ్డు బురదమయమైంది. ఇక గంగవరం ఫ్లైఓవర్ వద్ద హైవేపై వర్షం కారణంగా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఫ్లైఓవర్ చుట్టూ ఇదే పరిస్థితి. గుంతలు పూడ్చండి మహాప్రభో! -
షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధం
పూతలపట్టు(యాదమరి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఫొటో స్టూడియోలోని ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భాదితుని కథనం.. మండల కేంద్రంలోని పంచాయతీ దుకాణ సముదాయంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం స్టూడియో యజమాని తన సిబ్బందితో కలిసి కాణిపాకంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లారు. పనులు ముగించుకుని స్టూడియోకి వచ్చిన సిబ్బందికి లోపల నుంచి పొగ రావడంతో వెంటనే యజమానికి సమాచారం అందించారు. అప్పటికే పలు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై చిత్తూరు ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ విచారం వ్యక్థం చేసింది. అక్రమ స్కానింగ్ పై విచారణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): అక్రమ స్కానింగ్ బాగోతంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా విచారణకు దిగారు. ఈ నెల 10న సాక్షి దినపత్రికలో అక్రమ స్కానింగ్ అంతేనా? శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. తిరుపతి, చిత్తూరులో అక్రమ స్కానింగ్ చేస్తూ పట్టుబడ్డ వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ రెండు కేసులలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉందా..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అలాగే పట్టుబడ్డ స్కానింగ్ మిషన్లు... వాటిని అక్రమార్కులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాల కోసం పట్టుబడుతున్నారు. ఈ విచారణ పూర్తయినా తర్వాత డీఎంఅండ్హెచ్ఓకు నివేదికలు సమర్పించనున్నారు. ఈ మేరకు అక్రమ స్కానింగ్కు సహకరించిన అధికారులు, సిబ్బందిపై వేటు పడే అవకాశాలున్నాయి. కాగా అక్రమ బాగోత కేసు వివరాలపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా వివరాలు కోరనున్నామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 35 మందికి జరిమానా చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 35 మందికి రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 35 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారని వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అవుతోందన్నారు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగ, పెన్షనర్, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల విషయం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఏరువాక కేంద్ర కో–ఆర్డినేటర్ రామకృష్ణారావ్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా ఏరువాక కార్యక్రమంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ దృష్ట్యా జిల్లాలో మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమా న్ని నిర్వహిస్తామన్నారు. అలాగే తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి లీగల్ ఎయిడ్ క్లినిక్
చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భారతి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాలతో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించినట్లు తెలిపారు. దేశం కోసం పోరాడి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికుల సంక్షేమానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలోని మాజీ సైనికులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయ సలహాలు కావాలన్నా ఇక్కడ సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో పారా మిలిటరీ లీగల్ ఎయిడ్ అడ్వైజర్ నాగరాజరెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రజిని, మాజీ సైనికులు పాల్గొన్నారు. -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవ పోస్టర్ను ఇన్చార్జ్ డీఎంఅండ్హెచ్ వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తారన్నారు. మండల వైద్యాధికారులు విధిగా పీహెచ్సీల పరిధిలో దోమల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. దోమల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం గెలుస్తుంది
● జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి చిత్తూరు కార్పొరేషన్: ఎప్పటికై నా న్యాయం గెలుస్తుందని వైఎస్ఆర్ సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి బెయిల్పై బయటకు వచ్చిన చిత్తూరు, జీడీనెల్లూరు, వి.కోటకు చెందిన కార్యకర్తలు చక్రవర్తి, వినోద్, మోహన్, శంకరాచారితో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా జైలు వద్ద వారితో మాట్లాడి, భరోసానిచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయంపై ప్రశ్నించిన వారిని కేసుల పెట్టి వేధిస్తోందన్నారు. ఆ దిశగానే తన సోదర సమానులైన పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. జరుగుతున్న అన్యాయాలను భగవంతుడు, ప్రజలు చూస్తున్నారన్నారు. భవిష్యత్లో చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, వారి కష్టాలను జగనన్న దృష్టికి ఎప్పటికప్పుడు నాయకులు తెలియజేస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడే పరిస్థితి లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి నాయకులు అంజలిరెడ్డి, హరీషారెడ్డి, మధురెడ్డి, రాజేష్రెడ్డి, మురళీరెడ్డి, అన్బు, ఆను, చామంతి, వెంకట్రెడ్డి, గురువారెడ్డి, గుణశేఖర్రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏనుగులున్నాయ్ జాగ్రత్త
పులిచెర్ల(కల్లూరు): కల్లూరు, పదిపుట్ల బైలు రిజర్వు ఫారెస్టులో ఒంటరి ఏనుగు సంచరిస్తోందని, రైతులు సమీప పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట పొలాలవద్దకు వెళ్లరాదని, అలాగే తెల్లటి దుస్తులు ధరించరాదని పేర్కొన్నారు. ఏనుగులు కనిపిస్తే తరమడం, అదిలించడం లాంటివి చేయరాదని, వెంటనే 9550067503 నంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.నేడు విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక గాంధీ రోడ్డులోని ట్రాన్స్కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.దరఖాస్తుల ఆహ్వానంచిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎంపీహెచ్డబ్ల్యూ ఉచిత కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఎంఅండ్హెచ్ఓ వెంకటప్రసాద్ తెలిపారు. ఈ కోర్సు శిక్షణ కాలం రెండేళ్ల పాటు ఉంటుందన్నారు. చిత్తూరులోని జిల్లా ప్రభ్తుత్వాస్పత్రి, తిరుపతి రుయా, తిరుపతిలోని రాస్, చిత్తూరులోని శ్రీనివాస, పుత్తూరులోని సెయింట్మేరిస్, లక్ష్మీనారాయణ శిక్షణ కేంద్రాల్లో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుకు శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను శిక్షణ కేంద్రానికి లేదా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, 17 ఏళ్లు పూర్తై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.కలెక్టర్ ఆదేశించినా చర్యలేవీ?చిత్తూరు రూరల్ (కాణిపాకం): అక్రమ స్కానింగ్ విషయంలో ఓ ఆశ వర్కర్ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బేఖాతార్ చేస్తున్నారు. మేలో చిత్తూరు నగరంలోని భరత్నగర్లో అక్రమ స్కానింగ్ సెంటర్ను కలెక్టర్ సుమిత్కుమార్ రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహరంలో 20 మందిపైగా కేసు నమోదైంది. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే సిబ్బంది హస్తం ఉందని తేలింది. కానీ ఆ సిబ్బందిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సిబ్బంది(ఆశ వర్కర్)ను తొలగించాలని ఆదేశించారు. దీంతో హడవిడి చేసిన ఆ శాఖ అధికారులు తొలగింపు చర్యను నొక్కిపెట్టేశారు. ప్రభుత్వ విధుల్లో పనిచేస్తూ..కేసు నమోదైతే నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ స్కానింగ్ విషయంలో ఆ శాఖలోని అధికారులతో ఏమైనా సంబంధాలున్నాయా... అందుకే ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీకాలు విధిగా వేయించాలిచిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లలకు రొటీన్ టీకాలు విధిగా వేయించాలని ఇన్చార్జ్ డీఎంఅండ్హెచ్ఓ వెంకటప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం వ్యాధి నిరోధక టీకాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులు చంటి బిడ్డలకు రాకుండా ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. 0–5 లోపు పిల్లలకు టీకాలు వేయించే విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. విధిగా పల్లెల్లోని పిల్లలకు టీకాలు వేయించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ మౌనిక స్టెపి తామస్ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు.నేడు హుండీ లెక్కింపుకాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు బుధవారం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆస్థాన మండపంలో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: కాణిపాక వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఈవో పెంచలకిషోర్, ఏఎస్పీ నందకిషోర్ పిలుపునిచ్చారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ఆవరణలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని శాఖల అధికారులు కలిసి మాక్ డ్రిల్ చేపట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం లోపలి భాగంలో ఏదైనా జరిగితే... వారిని ఎలా ఆస్పత్రికి చేర్చాలి, అగ్నిప్రమాదం జరిగితే ఏవిధంగా స్పందించాలి, ఏ రకంగా మంటలను అదుపు చేయాలనే విషయంపై ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అధికారులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా వ్యహరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరసింహులు, కానిస్టేబుల్ మధు, అగ్నిమాపక, వైద్యాశాఖ, విద్యుత్శాఖ అధికారులు పాల్గొన్నారు. -
వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు
పలమనేరు: కొన్నేళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. వీరికి బలవంతపు బదిలీలు, డిప్యూటేషన్లు తప్పడం లేదు. గత ఆరేళ్లలో నాలుగు దఫాలు వీరు బదిలీకే పరిమితమవుతున్నారు. పోనీ బదిలీతో ఆపుతారనుకుంటే అదీ లేదు. వీరిని డిప్యూటేషన్లపై వేరే బడికి పంపడం రివాజుగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న 164 మంది భాషోపాధ్యాయులు వలసపక్షుల్లాగా మారిపోయారు. కోర్టుమెట్లెక్కి అనుమతి తీసుకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పలువురు భాషోపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 2019లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులకు (తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, సంస్కృతం) జీవో నం.91 మేరకు ఉన్నతీకరణ జరిగింది. ఆ జీవో అమలు కాకుండా కొందరు కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిని పక్కనబెట్టి ఉన్నతీకరణలో ఎస్జీటీలకు చోటు కల్పించేలా ఆదేశాలను తెచ్చారు. దీంతో విద్యాశాఖ జీవో నం.77 ద్వారా ఎస్జీటీలకు మేలు కలిగేలా చేశారు. ఎల్పీ(ల్యాంగేజ్ పండిట్స్) కేడర్ లేకుండా చేశారు. ఈ క్రమంలో వీరికి ఎల్పీ వ్యవస్థా లేకుండా .. ఉన్నతీకరణ లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలు బేఖాతర్ తమకు జరిగిన అన్యాయంపై భాషోపాధ్యాయులు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టీస్ మన్మధరావు సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2019 నుంచి వీరికి అన్ని సదుపాయాలను కల్పించి, మూడు నెలల్లో ప్రమోషన్ అర్హతలున్నవారికి అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయాలని భాషోపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖను కోరింది. దీంతో వారు వేకన్సీలు లేవని సెలవుల్లో ఈ ప్రక్రియ ఉంటుందని దాట వేసింది. ఇది జరిగితే తమకు ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఎస్జీటీలు దీనిపై హైకోర్టులో స్టేటస్కో ఉత్తర్వులను పొందారు. ఫలితంగా వీరి సమస్య మరింత జఠిలంగా మారింది. అప్పట్లో విద్యాశాఖ చేసిన అలసత్వం వీరికి శాపంలా మారింది. బలవంతపు బదిలీలు తమపైనే కోర్టుకెళ్లారనే అక్కసుతో విద్యాశాఖ సైతం వీరితో చెలగాటమాడుతోంది. ఆ మేరకు గత ఆరేళ్ల లో వీరిని నాలుగు దఫాలు బదిలీలను చేసింది. బదిలీ చేసిన చోటా ఉంచకుండా వర్క్ అడ్జెస్ట్మెంట్ సాకుతో మూడు నెలలు, ఆరు నెలలు ఓ బడిలో పనిచేశాలా డిప్యూటేషన్లు వేస్తోంది. మళ్లీ అధికారికంగా బదిలీ అయిన బడికి ఆ విద్యాసంవత్సరంలో చివరి రోజు పంపుతోంది. చేతులెత్తేసిన డిప్యూటీ సీఎం తమ సమస్యను మీరైనా పరిష్కరించాలంటూ గత యేడు తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా పలువురు భాషోపాధ్యాయులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు మీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కానీ రెండేళ్లవుతున్నా దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.క్యాడర్ లేకుండా ఆరేళ్లుగా పనిచేస్తున్నా నేను ఆరేళ్లుగా క్యాడర్ లేకుండా పనిచేస్తున్నా. కనీసం మాకు జాబ్కార్డు కూడా లేదు. ప్రమోషన్లూ లేకుండా చేశారు. కోర్టు తీర్పునిచ్చినా విద్యాశాఖ వాటిని అమలు చేయడం లేదు. ఇంత దారుణం ఎక్కడా లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో..? – బెంగళూరు స్వామినాథుడు, తెలుగు పండిట్, గుడిపల్లి మండలంఇంత వివక్ష ఎందుకు? తెలుగు భాషోపాధ్యాయులపై విద్యాశాఖ ఎందుకింత వివక్ష చూపుతోందో అర్థం కావడం లేదు. మేము ఉన్నత పాఠశాలలో తెలుగును బోధించాలి. కానీ మమ్మల్ని ప్రైమరీ బడుల్లో టీచర్లు సెలవు పెట్టిన చోటుకు పంపుతున్నారు. జాబ్చార్ట్లేకుండా చేసి ఎక్కడిపడితే అక్కడికి పంపుతున్నారు. – హిమబిందు, జెడ్పీహెచ్ఎస్, కే.గొల్లపల్లి, యాదమరి మండలం ఆడుకుంటున్నారు మేమేం పాపంచేశామోగానీ విద్యాశాఖ మాకు ఎలాంటి క్యాడర్ లేకుండా, ప్రమోషన్లు లేకుండా చేసింది. దీంతోపాటు ఉన్నత పాఠశాలలో భోదించే మమ్మల్ని ప్రైమరీ బడులకు పంపుతోంది. అదీ ఓ చోట కాదు ఎక్కడిబడితే అక్కడికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మహిళలమైన మాకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. – భాగ్యలక్ష్మి, తెలుగు పండిట్, రామసముద్రం -
అంగన్వాడీ కేంద్రం తనిఖీ
పెద్దపంజాణి: మండలంలోని రాజుపల్లి పంచాయతీ, కమ్మినాయునిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి, చిత్తూరు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, రికార్డులను పరిశీలించారు. తదుపరి రాజుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గత మూడేళ్ల మట్టి నమూనా ఫలితాలను పరిశీలిస్తే మన నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్నందున రైతులు తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను వేయాలన్నారు. యూరియా ఎక్కువగా వాడడం వల్ల కలిగే అనర్థాలు, నానో యూరియా వల్ల ఉపయోగాలను వివరించారు. అన్నదాత సుఖీశవ రాని రైతులు రైతు సేవా కేంద్రంలో 20వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేయాలన్నారు. తర్వాత గ్రామం సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఆయన వెంట పుంగనూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శివకుమార్, ఏఓ హేమలత, పంచాయతీ కార్యదర్శి రిజ్వానా, వీఆర్వో కృష్ణంరాజు ఉన్నారు. -
వింత పోకడలతో కూటమి పాలన
చిత్తూరు కార్పొరేషన్: వింత పోకడలతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ నా యకులు తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, మాట్లాడారు. సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్యాణ్భరత్ మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు తప్ప ఇతరులు వెళ్లకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. నెలరోజులుగా విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హాస్టళ్లు, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తున్నారన్నారు. అది గిట్టని సర్కారు ఇటువంటి ప్రొసిడింగ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్లు మాట్లాడారు. విద్యార్థులకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన బ్యాగుల నందు నాణ్యత లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా విద్యార్థి జేఏసీ ఛైర్మన్ సద్దాం, స్టాండ్లీ, సిరాజ్, కరీమ్, జస్టిన్, రవి, మహేష్, వెంకటేష్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులంటే అలుసెందుకు?
● పరిశీలన పేరుతో జిల్లాలో 4,732 దివ్యాంగ పింఛన్లు కోత ● మేమంతా నిజమైన దివ్యాంగులమేనంటూ ఆందోళన ● సోమవారం కలెక్టరేట్ ఎదుటబైఠాయించిన దివ్యాంగులు చిత్తూరు కలెక్టరేట్ : తామంటే అలుసెందుకంటూ దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క నూతన పింఛన్ ఇవ్వకపోగా...ఉన్న పింఛన్లలో కోతలు విధిస్తోంది. ప్రతి సోమవారం చిత్తూరు కలెక్టరేట్కు వందల సంఖ్యలో నూతన పింఛన్ల మంజూరు కోసం అర్జీలు ఇస్తున్నారు. ఆ అర్జీలను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప న్యాయం చేయడం లేదు. అసలే వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులపై కూడా కూటమి సర్కారు కన్నెర్ర చేసింది. తాజాగా ఆగస్టు నెలలో చిత్తూరు జిల్లాలోని 4,732 దివ్యాంగ పింఛన్లను తొలగించింది. దీంతో పింఛన్ తొలగించిన దివ్యాంగ లబ్ధిదారులు వందలాది మంది చిత్తూరు కలెక్టరేట్కు విచ్చేశారు. తమ సదరం సర్టిఫికెట్లను చేతపట్టుకుని కలెక్టరేట్లోని ప్రజాసమస్యల పరిష్కార వేదిక భవనం ముందు బైఠాయించి, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దివ్యాంగులని అనిపించడం లేదా? చూడగానే వైకల్యం కనిపిస్తున్నా దివ్యాంగులు...నిజమైన దివ్యాంగులనిపించడం లేదా అని దివ్యాంగుల ఐక్యకార్యచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీ అసెస్మెంట్ పేరుతో దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు ప్రాధాన్యమిచ్చిందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వేలాది మంది అనర్హులంటూ పింఛన్లు తొలగించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో వైద్యుల బృందం నిర్ధారించి సర్టిఫికెట్లు అందజేసి పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు తాజాగా నోటీసులు జారీ చేసి పింఛన్ తొలగించడం దారుణమన్నారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం తొలగించిన పింఛన్లను తిరిగి కొనసాగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని దివ్యాంగుల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై వ్యవహరిస్తున్న అలసత్వ ధోరణి అన్యాయమన్నారు. దివ్యాంగులపై చిన్నచూపు చూస్తే దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పింఛన్లపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది దివ్యాంగులు పొట్టకొట్టడం సబబు కాదన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ దివ్యాంగుల ధర్నా వద్దకు విచ్చేసి వారి సమస్యలను అరగంట సేపు ఓపికగా విని, పరిశీలించారు. పింఛన్లు కోల్పోయిన వందలాది మంది దివ్యాంగులు కన్నీటితో కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. గతంలో వారికి అందజేసిన సర్టిఫికెట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలన చేశారు. తప్పనిసరిగా పునఃపరిశీలన చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడీలక్స్లు శూన్యం ● పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ కోతలే ● అరకొర సేవలతోనే ఉచిత బస్సు పథకం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో కోతలు పెడుతోంది. నాలుగు రకాల సర్వీసుల్లో ఉచితమని చెప్పి, తీరా షరతులు విధిస్తోంది. జిల్లాలో సిటీ బస్సులు, అల్ట్రా డీలక్స్ సర్వీసులు లేవు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ అంత రాష్ట్ర సర్వీసుల పేరుతో కోతలు పెట్టింది. సరిహద్దుల్లో ఉచిత బస్సు తుస్స్మంటోంది. రాయితీ పేరుతో టికెట్ వసూలు చేస్తోంది. సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. కండక్టర్లు ఉచితమంటే మహిళలపై చిర్రెత్తిపోతున్నారు. ఊరించిన ఉచిత బస్సు పథకం ఉసురుమనిపిస్తోంది. అరకొరగా సీ్త్రశక్తి జిల్లాలోని 5 డిపోల పరిధిలో మొత్తం 461 బస్సు లున్నాయి. ఇందులో పల్లె వెలుగు బస్సులు 246, ఎక్స్ప్రెస్ 73, ఏసీ బస్సులు 4, సూపర్ లగ్జరీ 32, సప్తగిరి ఎక్స్ప్రెస్ 35, అద్దె బస్సులు 71 వరకు ఉన్నాయి. వీటిలో నిత్యం సుమారు 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చింది. దీంతో చాలావరకు బస్సులు తారుమారు అయ్యాయి. ఎక్స్ప్రెస్ బస్సులు వెళుతున్న మార్గాల్లో సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులను తిప్పుతున్నారు. పలు ఎక్స్ప్రెస్ బస్సులపై అంతరాష్ట్ర సర్వీసు అనే బోర్డు పెట్టేశారు. దీంతో ఉన్న బస్సుల్లో కోత పెట్టారు. పల్లె వెలుగు బస్సులను సైతం అంతరాష్ట్ర సర్వీసులుగా తిప్పుతూ, వాటిలో చాలా వరకు షరతులు పెట్టేశారు. దీంతో జిల్లాలో సీ్త్ర శక్తి పథకం అరకొరగా అమలవుతోంది. బస్సులు అరకొరే.. కూటమి ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన సాయంత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం శనివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే ఆ పథకంలో పెట్టిన షరతులతో మహిళా ప్రయాణికులు ఆయోమయంలో పడుతున్నారు. జిల్లాలోని 5 ఆర్టీసీ డిపోల్లో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు మొత్తం 319 ఉండగా.. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 246 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లెవెలుగు 27 బస్సులు, ఎక్స్ప్రెస్ 45 బస్సులు మొత్తం 73 బస్సులు అంతరాష్ట్ర సర్వీసుల పేరుతో తిప్పుతున్నారు. బెంగళూరు, తమిళనాడులోని వేలూరు, తిరుత్తణి, పొన్నై, కృష్ణగిరి, చెన్నె, తిరువణ్ణామలై తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. సరిహద్దులో ఉచితం లేదా..? సరిహద్దు ప్రాంతాల్లోని ప్రయాణికులు ఉచితానికి దూరమవుతున్నాయి. కార్వేటినగరం, ఎస్ఆర్పురం, నగరి, పుత్తూరు, చిత్తూరు, గుడిపాల, యాదమరి, కుప్పం, వి.కోట, రామకుప్పం, పలమనేరు, శాంతిపురం, తదితర ప్రాంతాల్లో ఉచితానికి బదులు రాయితీలు ఇస్తున్నారు. దీంతో మహిళలు ఉచిత పథకంపై విరుచుకుపడుతున్నారు. టికెట్ తీసుకో.. బస్సెక్కు.. టికెట్లు తీసుకుంటేనే ఈ బస్సులో ఎక్కాలని కండక్టర్లు చెప్పడంతో మహిళలు బస్సు దిగేస్తూ.. కూటమి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. వెంటనే అదే మార్గంలో నడిచే మరో ఎక్స్ప్రెస్ బస్సును ప్లాట్ఫాంపైకి తెచ్చారు. ప్రయాణికులు అందులో ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ బస్సులో మహిళలు టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇది ఎక్స్ప్రెస్.. అది ఎక్స్ప్రెస్ కదా? అని బస్సు సిబ్బందిని అడిగితే మాకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. ప్రధాన స్టాపింగ్లో దిగేందుకు కూడా సీ్త్రశక్తి పథకం వర్తించదంటున్నారు. సాయంత్రం వేళ్లల్లో మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కండక్టర్లు బస్సు ఎక్కనివ్వడం లేదు. టికెట్లు తీసుకోవాలని చెబుతున్నారు. మహిళలను ఛీకొడుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఫుల్ అయితే డొక్కు బండమ్మా..తట్టుకోలేదంటూ వెళ్లిపోతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ బస్సులో రోజువారీగా సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే.. ఇందులో అత్యధికంగా మహిళలే ఉన్నారు. 50నుంచి 60 శాతం మంది మహిళలు, 30నుంచి 40 శాతం పురుషులు, 10నుంచి 20 శాతం విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు లెక్క లు చెబుతున్నారు. ప్రధానంగా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సప్తగిరి సర్వీసులనే ప్రయాణం సాగిస్తున్నారని పరిశీలనలో గుర్తించినట్లు చెబుతున్నారు. అయినా మహిళలకు ఉచిత పథకం పథకం అరకొరగానే అందుతోంది. ప్రయాణంలో మహిళలే అధికం సప్తగిరి పేరుతో గోల్మాల్ కాణిపాకం నుంచి తిరుపతికి గతంలో ఎక్స్ప్రెస్ నడిచేది. ఉచిత బస్సు పథకం అమలుతో దాని స్థానంలో సప్తగిరి ఎక్స్ప్రెస్ నడుపుతున్నారని కాణిపాకం వాసులు మండిపడుతున్నారు. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ అన్పిట్ కావడంతో వాటిని పల్లె వెలుగు కింద మార్చేశారు. కానీ వాటికి పల్లె వెలుగు పెయింటింగ్ వేయకుండా అలానే తిప్పుతున్నారు. ఈ బస్సుల్లో ఉచితం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్ఫిట్ అయిన బస్సులు 9 వరకు కుప్పంలో తిప్పుతున్నారు. -
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని జిల్లా నోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ఇంటర్ ఉ త్తీర్ణత చెందిన విద్యార్థులు ఈ అడ్మిషన్ల ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలన్నారు. సందేహాల నివృత్తికి బీఏ(9494368020), బీకాం (9849959423), బీఎస్సీ (9985165051) నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. -
బాబుపాలనలో మోసం గ్యారెంటీ
పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసగించడం మాత్రం గ్యారెంటీ అని, అలాంటి చంద్రబాబును నమ్మవద్దని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ప్రజలను కోరారు. సోమవారం పట్టణంలోని కట్టకిందపాళెంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణంతో కలసి బాబు షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విడుదల చేసిన స్కానర్లు, క్యూఆర్కోడ్ పోస్టర్లను ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్షరీఫ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్లు కాంతమ్మ, గంగులమ్మ, భారతి, పూలత్యాగరాజు, రెడ్డెమ్మ, రేష్మా, భారతి, నూర్జహాన్, సాజిదాబేగం, నటరాజ, కాళిదాసు, కిజర్ఖాన్, జెపి.యాదవ్, నాయకులు ఎస్వీటీ.సోము, ఎస్వీటీ కిషోర్, రాజేష్, అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కార్వేటినగరం: ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారి, పోలింగ్ వ్యవస్థను తారమారు చేసి ఆ పార్టీకి వంత పాడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం నారాయణస్వామి పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ బీజేపీకి వంత పాడుతూ ప్రజల ఓటుహక్కును కాలరాసిందని ఆరోపించారు. పోలింగ్ బూత్లో ప్రజలు వేసిన ఓట్లు ఏమయ్యాయని, దీనికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని డిమాండ్ఽ చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా బీజేపీ ఎన్నికల కమిషన్ను గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికలు జరిపిస్తోందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ బేజేపీ కలసి చేసిన ఓట్ల చోరీ నిర్వాహకంపై దేశవ్యాప్తంగా చర్చించుకుంటోందన్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్నారు. దివ్యాంగులపై కూటమి క్రూరత్వం వెదురుకుప్పం: సూపర్సిక్స్ అమలు చేస్తున్నామని చెబుతూ మరో పక్క దివ్యాంగులు, పేదలు, ఆటో కార్మికుల కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం మండలంలోని ధర్మాచెరువు గ్రామంలో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలోనే సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. సమాజంలో పేదరికంతో మగ్గిపోతున్న బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలికొదిలేసినట్లు విమర్శించారు. వికలాంగులకు అందించే పింఛన్లలో కోతలు విధించి, వారిని రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మురగయ్య, రాజా రెడ్డి పాల్గొన్నారు. -
బోయకొండ పాలకమండలికి 13 దరఖాస్తులు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలకమండలి సభ్యత్వానికి 13 మంది సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఈ నెల7వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చౌడేపల్లె మండలం ఎర్రగానిపల్లెకు చెందిన ఎం.లక్ష్మణ్రాజు(పతిరాజు), పాలక మండలి సభ్యత్వానికి మరో 12 మంది టీడీపీ నేతలతో కలిసి దరఖాస్తులను ఆలయ పరిపాలన కార్యాలయంలో ఈఓకు అందజేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని, ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణరాజు, ప్రదీప్రాజు, సీవీ రెడ్డి, మాధవరెడ్డి, హరిప్రసాద్, కార్తీక్, ప్రహ్లద, రెడ్డిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దారి దోపిడీ దొంగల అరెస్టు
● రూ. 2 లక్షల విలువైన సొత్తులు స్వాధీనం ● ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులునగరి : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు పి.సతీష్ (19), ఆర్.శంకర్ అలియాస్ అజిత్ (20), ఎంఎస్ విజయకుమార్ (20)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ కథనం మేరకు.. మోటార్ సైకిల్లో ఒంటరిగా వెళుతున్న వృద్ధులను టార్గెట్ చేసి వారి వద్ద నగదు, మొబైలు ఫోన్లు బలవంతంగా తీసుకోవడం, నగదు ఇవ్వకుంటే వారిపై దాడి చేసి గాయపరచడం తదితర దారి దోపీడీ సంఘటనలపై గత రెండు నెలలుగా నగరి పోలీస్ స్టేషన్ మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిని నివారించేందుకు డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు అందిన సమాచారం మేరకు, ఇన్స్పెక్టర్తో పాటు, నగరి ఎస్ఐ విజయనాయక్, ట్రైనీ ఎస్ఐ మారెప్ప, సిబ్బందితో వెళ్లి నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు కీళపట్టు ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ సైకిల్పై వస్తున్న నిందితులు నగరి కాలనీకి చెందిన సతీష్, వేలావడికి చెందిన శంకర్ అలియాస్ అజిత్, కరకంఠాపురం కాలనీకి చెందిన విజయ్ను అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు చోరీల్లో వారు ముద్దాయిలుగా తేలింది. దీంతో వారి వద్ద నుంచి ల్యాప్టాప్, ఫ్యాన్, గ్యాస్ సిలిండర్, బైకు, నోకియా సెల్ఫోన్, రూ.37570 నగదు తదితర రూ. 2 లక్షల మేర సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. దారిదోపిడీ దొంగల అరెస్టులో ప్రతిభ చూపిన పోలీసులు లోకనాథం, ఇంద్ర కుమార్, గజేంద్ర, సురేష్, నవీన్, సత్య, గోపి, రవి, కదిర్ వేలుకు డీఎస్పీ ప్రశంసించారు. -
రాష్ట్ర వాలీబాల్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ సాధించి ఎంపికయ్యారు. సోమవారం వాలీబాల్ కోచ్, పీఈటీ ఉమాపతి మాట్లాడుతూ వరల్డ్ స్కూల్ వాలీబాల్ చాంపియన్షిప్ అండర్–15 బాల, బాలికలకు డిసెంబర్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు చైనా దేశం షాంగ్లూవో నగరంలో పోటీలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయి నుంచి ఎంపికలు జరిగాయన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పడమట జెడ్పీ హైస్కూల్లో ఎంపికలు నిర్వహించారన్నారు. ఈ ఎంపికల్లో ఎంపికై న ఏపీ టీంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ప్రతిభ చూపి, స్థానం సంపాదించారని తెలిపారు. బాలుర విభాగంలో చౌడేపల్లికి చెందిన నిరంజన్, సోమ లకు చెందిన దస్తగిరిబాషా, బాలికల విభాగంలో తిరుపతికి చెందిన కుమారి, దేవి శ్రీ అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. అనంతరం ఆ విద్యార్థులను పలువురు అభినందించారు. -
హత్యకేసులో నిందితుల అరెస్టు
యాదమరి: హత్యకేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పచ్చిమ విభాగ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు.. తొట్టిగానిఇండ్లకు చెందిన విజయ్కుమార్(26) తమిళనాడు రాష్ట్రం పరదరామిలో ఆవులు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాల కోసం సన్నిహితుల నుంచి రూ.5 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో కుటుంబసభ్యులను తన అప్పులను తీర్చమని వేధించసాగాడు. ఈ క్రమంలోనే ఈనెల పదో తేదీన తాను చేసిన అప్పులు చెల్లించడానికి అవసరమైన రూ.5లక్షలు ఇవ్వకపోతే ఇంటిల్లిపాదిని హతమారుస్తానని మద్యం మత్తులో బెదిరించాడు. ఈ క్రమంలో ఘర్షణ పడ్డారు. అప్పటికే హతుడు ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉండడంతో గ్రామంలో అవమానంగా భావించిన కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి జరిగిన అగౌరవానికి భంగపడ్డారు. దీంతో హతుని తండ్రి సదాశివం, పెద్ద కుమారుడు శివకుమార్తో కలిసి పొలం దగ్గర నిద్రిస్తున్న విజయ్కుమార్పై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని తాడుతో గొంతుకు బిగించి హతమార్చారు. అయితే ఎక్కడ తమపై అనుమానం వస్తుందోనని, పొలంలోని ఓ చెట్టుకు ఉరి వేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మృతుని తల్లి పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. హతునితోపాటు అతడి తండ్రి, సోదరుని శరీరంపై గాయాలుండంతో వారి ఇద్దరితోపాటూ మృతుని తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ఈశ్వర్ తనదైన పందాలో విచారించగా హత్యను తామే చేసినట్లుగా సదాశివం, శివకుమార్ నేరాన్ని అంగీకరించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ ఈశ్వర్ చెప్పారు. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు గంగమ్మగుడి విద్యార్థి
శ్రీరంగరాజపురం: జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు మండలంలోని గంగమ్మగుడి జెడ్పీ హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థి ఎన్.మధు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి సోమవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మధు పాల్గొని, ఉత్తమ ప్రతిభను కనబరచడంతో జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా ఈనెల 22 నుంచి 24 వరకు బిహార్లోని బుద్ధగయాలో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మధును ఉపాధ్యాయులు లోకనాథం, బాలాజీ, చంద్రశేఖర్, బాబు, పద్మశ్రీ, సత్య, జానకి, సరోజమ్మ, ప్రసన్నకుమారి, అరుణ అభినందించారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
బంగారుపాళెం: భార్యను హత్య చేసిన సంఘటనలో సోమవారం భర్తను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కొదలమడుగు గ్రామం బీసీ కాలనీకి చెందిన హరిబాబు ఈ నెల 16 వతేదీన తన భార్య ప్రియాంకను హత్య చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసుకు సంబంధించి హరిబాబును మొగిలి గ్రామం వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు. శ్రీగంధం చెక్కల పట్టివేత గుడుపల్లె: తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు గుడివంక అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుడుపల్లె జెడ్పీ హైస్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు వాహనాల్లో వస్తుండగా పట్టుకున్నారు. వారివద్ద 6.5 కిలోల శ్రీగంధపు దిమ్మెలు ఉండగా గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోవిందరాజులు, తిరుపతి, రామలింగం, శివశక్తి అని తెలిసింది. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి కుప్పంరూరల్: ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన కుప్పం మండలం, తంబిగానిపల్లిలో సోమవారం చోటు చే సుకుంది. కుప్పం సీఐ శంకరయ్య కథనం మేరకు.. తంబిగానిపల్లికు చెందిన సింగారవేలు, కంగుంది గ్రామానికి చెందిన దుర్గా (27)తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. కొంత కా లంగా దుర్గ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం దుర్గ ఇంట్లో పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మె ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నా యని దుర్గ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం సీఐ శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి
● సమస్యలు పరిష్కరించాలని అర్జీదారుల మొర ● వివిధ సమస్యలపై 324 అర్జీలు నమోదు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : అయ్యా దండం పెట్టి మొరపెట్టుకుంటున్నాం.. తమ సమస్యలను పరిష్కరించండని అర్జీదారులు ఉన్నతాధికారుల ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఓ వాసుదేవన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 324 అర్జీలు నమోదయ్యాయి. ఇంటి పట్టా ఇప్పించడయ్యా చాలా ఏళ్లుగా సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నామని, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని గుడిపాల మండలంలోని మండికృష్ణాపురం, మాదిగపల్లి, పెరుమాళ్లకుప్పం గ్రామాలకు చెందిన ప్రజలు కోరారు. ఆయా గ్రామస్తులు ధనంజయ, రాజేంద్ర మాట్లాడుతూ ఎస్సీలైన తమకు సొంత ఇళ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, తమ గ్రామంలో సర్వే నంబర్ 141లో 36 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని పరిశీలించి ఇళ్లు లేని తమకు కేటాయించాలని కోరారు. వితంతు పింఛన్ ఇప్పించడయ్యా తనకు వితంతు పింఛన్ ఇప్పించడయ్యా అని గంగవరం మండలం పత్తికొండగ్రామానికి చెందిన నాగమ్మ వాపోయారు. ఆమె మాట్లాడుతూ తనకు ఎలాంటి జీవనాధారం లేదన్నారు. వితంతు పింఛన్ కోసం సచివాలయం, మండల కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేదన్నారు. దయతో వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. గ్రానైట్ బండగా చూపిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఎద్దులబండపై తాము పండించుకునే పంటలను ఆరబెట్టుకుంటున్నామని, అయితే ప్రస్తుతం ఆ బండను గ్రానైట్ బండగా చూపిస్తున్నారని వెదురుకుప్పం మండలం కొమ్మరగుంట వాసులు వాపోయారు. ఆ గ్రామస్తులు నారాయణరెడ్డి, శాంతమ్మ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తమ గ్రామంలోని రైతులు సమీపంలో ఎద్దులబండపై తమ గ్రామంలో పండించే రాగులు, వరి, వేరుశనగ ఉత్పత్తులను ఆరబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బండను గ్రానైట్ బండగా చూపించి కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. న్యాయం చేయాలని కోరారు. దారి సమస్య పరిష్కరించాలి దారి సమస్య పరిష్కరించాలని బంగారుపాళెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన కేశవయ్య కోరారు. ఆ గ్రామస్తులు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన రాజమ్మ గ్రామ ఖాతా నంబర్ 119/4 ఏ లో తన పేరుపై 35 సెంట్లు, ఖాతా నంబర్ 118/ఏ లో 1.02 ఎకరాల భూమి ఉందన్నారు. తమ పొలానికి వెళ్లడానికి దారి లేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి తమకు దారి సమస్య కల్పించాలని కోరారు. -
ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలని తిరుమల పాదయాత్ర
రొంపిచెర్ల: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ అన్నమ్మయ్య జిల్లా పీలేరు నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పాద యాత్ర చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా రొంపిచెర్ల జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్ రెడ్డి వారికి స్వాగతం పలికి, తన మద్దతు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లడుతూ సూపర్సిక్స్ పథకాలను బయట పెడుతున్నారనే వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఈ పాదయాత్రలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి, అధికార ప్రతినిధి సుంకర చక్రధర్, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లీశ్వరి, మైనార్టీ మహిళా విభాగం నియోజక వర్గం కార్యదర్శి శాన్వాస్ బేగం, నేతలు లోకనాథరెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, కాలనీ చిన్ని, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, షాకీర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల పూజలు రొంపిచెర్ల: అక్రమ మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ రొంపిచెర్ల మండలం మోటుమల్లెల శివాలయంలో అయ్యప్ప స్వాములు సోమవారం పూజ లు చేసి, కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్రెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీతో పని చేస్తున్న ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమంగా మద్యం కేసు పెట్టి, అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, అమరనాథరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
సదుం: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. అక్రమ కేసులో అరెస్టు అయిన ఎంపీ విడుదల కావాలని సింగిల్విండో మాజీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. అనంతరం 116 టెంకాయలను నాయకులు కొట్టారు. వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పెద్దిరెడ్డి వెల్లడించారు. కేసుల పేరుతో జైళ్లలో ఉంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే గొంతుకలను నియంత్రించాలని భావిస్తే, అది వారి భ్రమ మాత్రమే అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను పార్టీ ఆధ్వర్యంలో ఎదిరించి, ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. కూటమి పాలనపై ప్రజలు ఈ కొద్దిరోజులకే విసిగి పోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పుట్రాజు, రమణ, రమణారెడ్డి, వాసు, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, ఈశ్వర్ రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఫార్మసీతో ఉజ్వల భవిష్యత్తు
–రేపు దరఖాస్తులకు చివరి గడువు తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులకు మంగళవారంతో గడువు ముగయనుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. డీఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. కోర్సులో ప్రవేశం పొంది.. రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టీఫికెట్ కలిగి ఉన్న పేద విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లు అందుతాయని తెలిపారు. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 99088 57585, 9966761446, 99635 41557 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
తెప్పపై సుబ్రహ్మణ్యస్వామి విహారం
కార్వేటినగరం: ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజు ఆదివారం స్కంధ పుష్కరిణి సమీపంలోని కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారు శనివారం పురవీధుల్లో విహరించారు. ముందుగా స్వామివారిని పట్టువస్త్ర, సుగంధ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.వేడుకగా సారె సమర్పణచాకలివానిగుంట ఎస్టీకాలనీకి చెందిన వారు వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ఆనవాయితీ ప్రకారం పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలికలను ప్రత్యేక వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.కనుల పండువగా కల్యాణోత్సవంవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారి శిరస్సుపై ముత్యాల తలంబ్రాలు పోసి నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారి కల్యాణానికి ఉభయదారులుగా ఎంపీపీ లతాబాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రాత్రి స్వామివారిని స్కంధపుష్కరిణిలో తెప్పపై ప్రతిష్టించారు. తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కృష్ణనాయక్, రవియాదవు, రాజశేఖర్, భక్తులు పాల్గొన్నారు. -
ఎవరూ అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
చౌడేపల్లె: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నేతలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం భాగేపల్లెలో కాగతి సర్పంచ్ షంషీర్, కోఆప్షన్ మెంబరు సాధిక్ బాషా, నేతలు బ్రహ్మానందరెడ్డి, నారాయణరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎవరూ అధైర్య పడొద్దని.. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ పటిష్టత కోసం కష్టపడి చురుగ్గా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చి కమిటీలో స్థానం కేటాయించాలన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ, రైతు, యువత, మహిళా కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో ఇంటింటా ప్రచారం నిర్వహించి కూటమి మోసాలు, దౌర్జన్యాలను తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఆయన వెంట బాబాజాన్, షేర్ఖాన్, నరేష్ తదితరులు ఉన్నారు. -
ప్రయాస్.. పరిశోధనలకు చాన్స్
నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థుల దృష్టి మరల్చేందుకు, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి కేంద్రం ప్రయాస్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆసక్తి గల విద్యార్థుల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న 9 నుంచి 11 వ తరగతి వరకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ప్రతిపాదనలను దరఖాస్తు చేసేలా చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సంస్థ ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 6,426 ఉన్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 9 వ తరగతి నుంచి 11 వ తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రయాస్ పథకం అర్హులు. జిల్లాలో 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఈ విద్యాసంవత్సరంలో 42 వేల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు ప్రాజెక్టు ప్రతిపాదనలను పంపవచ్చు. అయితే ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆన్లైన్ విధానంలో ఈ నెల 30వ తేదీలోపు ప్రతిపాదనల దరఖాస్తులను పంపేందుకు అవకాశం కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇలా దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల ప్రతిపాదనలను సెప్టెంబర్ 15 లోగా పరిశీలన చేసి అక్టోబర్ 15వ తేదీన విజేతలను కేంద్రం ప్రకటించనుంది. జిల్లాలోని స్కూళ్లు, కళాశాలల సమాచారం కేటగిరీ స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య ప్రాథమిక 4,247 59,067 ప్రాథమికోన్నత 738 42,380 ఉన్నత 1,203 3,037 జూనియర్కాలేజీలు 238 27,700 మొత్తం 6,426 1,59,454 ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీ ఆగస్టు 30 దరఖాస్తుల స్క్రీనింగ్ సెప్టెంబర్ 15 జ్యూరీ ఎంపిక గడువు సెప్టెంబర్ 30 ఫలితల ప్రకటన అక్టోబర్ 15 ఎంపికయ్యే ప్రాజెక్టుల ప్రారంభం అక్టోబర్ 16 ప్రాజెక్టు ముగింపు తేదీ అక్టోబర్ 16–2026 రిపోర్ట్ సబ్మిషన్ తేదీ అక్టోబర్ 20–2026 -
టీచర్ల అపరిష్కృత సమస్యలపై వినతి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ టీచర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆదివారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి అన్ని కేడర్లలో ఉద్యోగోన్నతులు చేపట్టాలన్నారు. 12వ పీఆర్సీ కమిటీ, ఐఆర్ ప్రకటన, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బకాయిల విడుదల ఆలస్యం అవుతోందని త్వరలో మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారన్నారు. తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం 10 వ తరగతి పరీక్షలు తెలుగు మీడియంలో రాయాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించినట్లు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చేపట్టబోయే మై స్కూల్, మై ప్రైడ్ పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసినట్లు ఆయన వెల్లడించారు. వైభవంగా గోకులాష్టమి నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం గోకులాష్టమి పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువనే సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. తిరుచ్చిపై శ్రీకృష్ణుని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారు, గోపాలునికి స్నపన తిరుమంజనం జరిపించారు. దేవదేవేరులు, శ్రీకృష్ణస్వామివారిని తిరుచ్చిపై ఊరేగింపుగా పదహారు కాళ్ల మండపానికి వేంచేపు చేశారు. ఈ మేరకు వేడుకగా ఉట్లోత్సవం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టి సందడి చేశారు. అనంతరం ఉత్సవర్లను ఆలయానికి తీసుకువచ్చి ఆస్థానం చేపట్టారు. ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, శ్రీనివాసభట్టాచార్య, నరసింహరాఘవ భట్టాచార్య, ఆర్జితం అధికారి భరత్ పాల్గొన్నారు. -
రాజనాలబండలో ముగిసిన తిరుణాల
● ప్రత్యేక పూజలందుకున్న వీరాంజనేయస్వామి ● తిరుణాలకు పోటెత్తిన భక్తులు చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ తిరుణాల అట్టహాసంగా ముగిసింది. తొలుత రాజనాలబండకు సమీపంలోని కొత్తగూబలవారిపల్లె, దాసరయ్యగారిపల్లె, పెద్దూరు, ఉటూరు గ్రామాలకు చెందిన దేవరెద్దులతో గ్రామపెద్దలు మేళతాళాల నడుమ రాజనాలబండకు చేరుకున్నారు. కొలింపల్లె గ్రామం నుంచి గ్రామదేవత బోయకొండ గంగమ్మ అమ్మవారి ఉత్సవమూర్తితో కలసి ఊరేగింపుగా కోలాటలు, చెక్కభజనలు, పిల్లనగ్రోవుల గానామృతంతో పాటు కత్తిసాముతో నృత్యం చేస్తూ చేరుకుని సంప్రదాయబద్ధంగా బండారు పంపకం జరిగింది. అక్కడి నుంచి దేవరెద్దులతో బోయకొండ అమ్మవారి ఉత్సవమూర్తిని కలశాలను గ్రామపెద్దలు, వంశపారపర్యంగా తెచ్చిన వారికి టీటీడీ డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి రాజనాలబండ ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ మేళతాళాలతో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించి ఆలయంలోకి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు రాజనాలబండకు రావడంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో వీరాంజనేయస్వామికి పూజలు చేశారు. ఉట్లోత్సవం, పోకుమాను బరుగుట వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోకుమాను పైకి ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. మల్లువారిపల్లె నుంచి రాజనాలబండ వరకు వాహనాల రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్, ఏఈఓ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు భానుప్రకాష్, ధనుంజయరాజు, ఉదయ్కుమార్, రాజేష్, శ్రీహర్ష, చంద్రశేఖర్, దిలీప్ తదితరులు పర్యవేక్షించారు. ప్రత్యేక పూజలందుకుంటున్న వీరాంజనేయస్వామి, పోకుమాను ఎక్కుతున్న యువకులు, దేవరెద్దులను తీసుకొస్తున్న దృశ్యం -
ఆడికృత్తికకు పుట్టింటికి వచ్చి..
శ్రీరంగరాజపురం : ఆడికృత్తిక పండుగకు పుట్టింటికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. పాతపాళ్యం గ్రామానికి చెందిన చిన్నస్వామి చివరి కుమార్తె పూజ (30)ను యాదమరి మండలం పరదరామి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే పూజ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఆడికృత్తిక సందర్భంగా పూజ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పాతపాళ్యం గ్రామానికి వచ్చింది. ఆదివారం తమ పొలం వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కింద పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను చూసి గ్రామస్తులు బోరున విలపించారు. -
భక్తులతో పోటెత్తిన బోయకొండ
చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట వరాలిచ్చే ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో బోయకొండకు చేరుకుని అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనెదీపాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. 20న విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక గాంధీరోడ్డులోని ట్రాన్స్కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వివరించారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు చౌడేపల్లె: అంకాలమ్మ కొండ సమీపంలోని అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, పశువులు, గొర్రెలు, మేకల కాపరులు వెళ్లొద్దొంటూ సోమల సెక్షన్ ఆఫీసర్ ఇంద్రాణి హెచ్చరికలు చేశారు. ఆదివారం ఆమె ఆమినిగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. గత రెండు రోజుల కిందట గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెలను గాయపరిచిన ఘటనపై అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరూ అడవుల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. కొండ చుట్టూ పంటలు సాగుచేసిన రైతులు ఒంటరిగా వెళ్లరాదని, అడవి జంతువులు కనిపిస్తే బిగ్గరగా కేకలు వేయాలని సూచించారు. చిరుతపులి ఇటీవల కాలంలో వరుసగా పశువులు, గొర్రెలపై దాడి చేసిందని గుర్తుచేశారు. ఎలాంటి ఘటనలు తలెత్తినా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట ఎఫ్బీఓలు ప్రభాకర్, రామచంద్ర తదితరులు ఉన్నారు. -
ప్యాక్హౌస్.. సబ్సిడీ మిస్
పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ప్రభుత్వ హామీని నమ్మి ప్యాక్ హౌస్లను నిర్మించుకుని ఆర్థికంగా మరింత కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం ప్యాక్ హౌస్ నిర్మాణాలకు అనుమతిస్తూ 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో సబ్సిడీ అందుతుందనే నమ్మకంతో రైతులు నిర్మాణాలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.8 లక్షల హెక్టార్లలో మమాడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి దాదాపు 67 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏటా మంచి దిగుబడినిచ్చే తోతాపురి దిగుబడిని రైతులు అత్యధికంగా జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. అయితే పక్వానికి వచ్చిన కాయలను రైతులు గ్రేడింగ్ చేసుకుని మంచి రేటుకు అమ్ముకునేందుకు వీలుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్యాక్హౌస్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సకాలంలో సబ్సిడీ మొత్తాలను అందించి రైతులకు ఆర్థిక తోడ్పాటునందించింది. అయితే కూటమి ప్రభుత్వంలో ప్యాక్ హౌస్లు నిర్మించుకున్న రైతులు సబ్సిడీ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాక్ హౌస్ అంటే ? ఎంఐడీహెచ్– మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యానవన సమగ్రాభివృద్ధి మిషన్) పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకమే ప్యాక్ హౌస్. మామిడి రైతులు పంట దిగుబడి సమయంలో కాయలను గ్రేడింగ్ చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడానికి వీలుగా తోటల్లోనే ఏర్పాటు చేసుకునే చిన్నపాటి షెడ్డునే ప్యాక్ హౌస్ అంటారు. వీటిని గ్రామాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తారు. 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో, రేకుల పైకప్పుతో నిర్మాణం చేపట్టాలి. వీటిలో సాధారణంగా పంట దిగుబడి సమయంలో రోజువారిగా నాలుగు నుంచి ఐదు టన్నుల మేర నిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటుంది. 50 శాతం సబ్సిడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసే ప్యాక్ హౌస్ నిర్మాణాలకు 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. ఒక్కో ప్యాక్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వ అంచనా వ్యయం రూ.4 లక్షలు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.2 లక్షల ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాతో చెల్లించాల్సి ఉంది.బడ్జెట్ రిలీజ్ అయింది ప్రభుత్వం జిల్లాలో మొత్తం 30 ప్యాక్ హౌస్ నిర్మాణాలను మంజూరు చేసింది. ఇందుకోసం ఇటీవలే బడ్జెట్ రిలీజ్ అయింది. అయితే ప్యాక్ హౌస్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడంతో సబ్సిడీ రిలీజ్ చేయడం లేదు. ప్యాక్హౌస్ నిర్మాణం అంటే ఒక్క షెడ్ మాత్రమే కాదు. అందులో రెండు ఫ్యాన్లు, ఐదు లైట్లు, గ్రేడింగ్ టేబుల్, వేవింగ్ మిషన్, ట్రేలు వంటి వస్తువులు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది. అన్నీ ఏర్పాటు చేస్తే సబ్బిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. – బి.దశరథరామిరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, తిరుపతి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మా ప్రాజెక్టు పూర్తి చేసి 4 నెలలైంది. రూ.4 లక్షల అంచనా వ్యయంతో చేపట్టగా రూ.4.65 లక్షలు ఖర్చు అయింది. ఇందుకు సంబంధించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసి నెలలు గడుస్తున్నా ఇంకా సబ్బిడీ మొత్తం అందలేదు. సబ్సిడీ వస్తుందని కొంత అప్పు చేసి మరీ నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.ఉషారాణి, మహిళా రైతు, శాంతినగర్, పుత్తూరు -
అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపలేరు
నగరి : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్నచూపే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. సినిమా బాగుంటే ఎవరూ అడ్డుకోలేరని, బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందన్నారు. టీడీపీ–జనసేన ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సు చేసి, టికెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా హరిహర వీరమల్లు సినిమాను ఆడించలేకపోయారని గుర్తుచేశారు. సినిమా ఫంక్షన్లల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ ఛేంజర్ గానీ, హరిహరవీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాల్లో లేడని, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడని, ఆయన అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటున్న విషయం మనం చూస్తున్నామన్నారు. -
గంగమ్మతల్లి ఆశీస్సులు అందాలి
పుంగనూరు: గంగమ్మతల్లి ఆశీస్సులు అందరికీ అందించి, అందరూ బాగుండేలా చూడాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రార్థించారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బాగేపల్లె గ్రామంలో గ్రామస్తులు నిర్మిస్తున్న నూతన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దిరెడ్డికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో సరదాగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భక్తిమార్గంలో పయణిస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామంలోనూ రామాలయాలు, గంగమ్మ ఆలయాలు నిర్మించి, ఆధ్యాత్మికత వైపు పల్లెలు పయణిస్తుండడం అభినందనీయమన్నారు. గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజ లంతా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్రెడ్డి, రాజారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఏనుగుల గుంపు మరోసారి దాడి చేసి పంటలను నాశనం చేశాయి.ముగిసిన తిరుణాల సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో తిరుణాల ఆదివారం అట్టహాసంగా ముగిసింది.సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి పాలకుల నిర్లక్ష్యంతో అన్నదాత గుండె బరువెక్కుతోంది. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న వారిపై ఎరువుల ధరల పెంపు అదనపు భారాన్ని మోపుతోంది. ప్రకృతికి ఎదురొడ్డి వ్యవసాయం చేస్తున్న జిల్లా రైతాంగానికి పాలకులు ఏమాత్రమూ సాయంగా నిలవలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగి అల్లాడిపోతున్న రైతులను ఎరువు ధరలు మరింత భయపెడుతున్నాయి. వ్యవసాయంలో ప్రధానమైన ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి , ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం కావడంతో ఎరువుల వాడకం మరింత పెరిగింది. గతంలో ఎరువుల ధరలను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడుసార్లు పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. రైతన్నలకు సాగు మరింత భారంగా మారుతోంది. సాగు విస్తీర్ణం ఇలా.. జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లు కాగా సరైన సమయంలో వర్షాలు కురవక ఇప్పటి దాకా కేవలం 50 నుంచి 70 వేల హెక్టార్లల్లో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. అందులో వేరుశనగ 3194 హెక్టార్లు, వరి 2747, కంది 135.0, చెరకు 2284, రాగి 113.5, టమాట 4,000, వివిధ రకాల కూరగాయల పంటలు 30 వేల హెక్టార్లతో పాటు ఇంకా పలు రకాల పంటలు, పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. అవసరానికి సరిపడా లేక జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువులు అవసరానికి సరిపడా లభించలేదు. ఒకవేళ దొరికినా అధిక ధరలతో పాటు వేరే ఎరువులు కూడా కొనాలనే ఒత్తిడి జిల్లా రైతాంగం ఎదుర్కొంటోంది. అవసరానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఒకసారి, కేంద్రం... రాష్ట్రానికి నెల వారీగా ఇవ్వాల్సిన కోటా ఎరువులు పంపడం లేదని ఇంకోసారి.. ఇలా కూటమి సర్కారు పొంతన లేని ప్రకటనలు చేయడం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. వాస్తవానికి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఎరువులను తెప్పించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని టీడీపీ నేతలే కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పక్కరాష్టాలకు పరుగు జిల్లాలో లభ్యమవుతున్న ఎరువుల ధరలు, నాణ్యత లోపం, సరఫరా తదితర విషయాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తద్వారా రైతులు ఎరువుల కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. పలమనేరు, కుప్పం, వీ.కోట, రామకుప్పం, శాంతిపురం, పంగనూరు తదితర ప్రాంతాల్లోని రైతులు ఎరువుల కోసం కర్ణాటకను ఆశ్రయిస్తున్నారు. బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరు, కార్వేటినగరం, నగరి, ఎస్ఆర్పురం, జీడీ నెల్లూరు, పాలసముద్రం తదితర మండలాల్లోని రైతులు తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పరదరామి, పొన్నై, సోలింగరం తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. ఎరువుల నిల్వ (ఫైల్) పెంచిన ధరలు ఏటా ఖరీఫ్తో పాటు రబీ సీజన్లో పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ పాస్పేట్ వంటి ఎరువుల వాడకం పెరుగుతోంది. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగింది. ఫలితంగా దిగుబడి ఎంత వచ్చినా రైతుకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచింది. జిల్లాలో ఒక్కో మండలంలో సరాసరిన రసాయనిక ఎరువులు ఏడాదికి 3,500 టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుం చి గరిష్టంగా రూ.4 వేల వరకూ ఎరువుల ధరలు పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. పంట వచ్చాక వడ్డీతో సహా తీర్చాల్సి ఉండటంతో వచ్చిన ఆదాయం ఎరువుల అప్పులకే సరిపోతోంది. ధరలు తగ్గించాలి ఏ పంట పండించాలన్నా పెట్టుబడి వేధిస్తోంది. బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినా తిరిగీ కట్టే పరిస్థితులు ఉండడం లేదు. పంట దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టాలు చవిచూస్తున్నాం. ఇందుకు నిదర్శనమే మామిడి విపత్తు. ఇప్పుడు అప్పొ..సప్పొ చేసి వరి పండించా. ముఖ్యంగా ఎరువులు దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి. ఇలాగైతే పంట పండించడం మానుకోవాల్సిందే. ఎరువుల ధరలు తగ్గించాలి. – ప్రభాకర్రెడ్డి, ఐరాల మండలం ఎరువుల కోసం తమిళనాడుకు నేను 2 ఎకరాలో అరటి, ఎకరాలో వరి వేశా. ఈ వర్షానికి వరి మొత్తం నేల మట్టమైంది. ఏ పంట పండించినా చేతికి చిల్లిగవ్వ మిగలడం లేదు. కష్టాల్లోనే మిగిలిపోతున్నాం. కర్షకుల కష్టాలు తెలియకుండా ఎరువుల రేట్లను పెంచుకుంటూ పోతే ఎలా. ఇది మంచిది కాదు. రైతులను బతికించాలి. ఎరువుల ధరలను తగ్గించాలి. ఈ దెబ్బతో చాలా మంది రైతులు ఎరువుల కోసం తమిళనాడుకు వెళుతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్లాల్సిందే. – కన్నయ్యనాయుడు, జంగాలపల్లి, చిత్తూరు మండలం రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచి రైతులపై భారాన్ని మోపాయి. ఏటా పెరుగుతున్న ధరల కారణంగా అన్నదాతలకు పంటల సాగు శక్తికి మించిన పనిగా మారుతోంది. పెరుగుతున్న ధరలు రైతన్నలను నడ్డి విరుస్తున్నాయి. నానో యూరియా ద్రవ రూపంలో కేంద్రం తీసుకొచ్చింది. కానీ దానిపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏటా సాగు ఖర్చులు రెట్టింపై వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇప్పటికై న పాలకులు కళ్లు తెరిచి రైతులపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల ధరలు ఇలా..(50 కిలోల బస్తా) ఎరువురకం పాతధర కొత్త ధర (రూ.లల్లో) (రూ.లల్లో) పొటాష్ 1,535 1,800 20–20–013(ఫ్యాక్ట్) 1300 1425 20–20–013(గ్రోమోర్) 1,300 1,350 20–20–013(పీపీఎల్) 1,300 1,400 10–26–26 1,470 1,800 12–32–16 1,470 1,720 16–16–16 1,450 1,600 15–15–15–0–9 1,450 1,600 16–20–0–13 1,250 1,300 24–24–0 1700 1800 14–35–14 1700 1,800 సింగల్ సూపర్ ఫాస్పేట్ 580 640 వైఎస్సార్సీపీ హయాంలో మేలు 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా తోచినప్పుడల్లా ఎరువుల ధరలు పెంచారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రసాయనిక ఎరువుల ధరలు ఒక్కసారి కూడా ధరలు పెరగలేదు. రైతులకు కావాల్సినంత మేర ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రైతుల నడ్డి విరిచేలా ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీకి మంగళం పాడుతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. -
ఉద్యమాల నిప్పుకణిక సర్దార్ గౌతులచ్చన్న
చిత్తూరు కలెక్టరేట్: ఉద్యమాల నిప్పు కణిక సర్దార్ గౌతులచ్చన్న అని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో గౌతులచ్చన్న 116 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ నేటి యువతకు సర్దార్ గౌతులచ్చన్న జీవి తం ఆదర్శమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలు చేసిన మహనీయులను గుర్తించుకోవడం మన కర్తవ్యంగా భావించాలన్నారు. 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించిన మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న అని కొనియాడా రు. స్వాతంత్య్రోద్యమం, జమీందారి వ్యతిరేక పోరాటం, హరిజన సేవ, మద్యపాన నిషేధం వంటి రంగా ల్లో లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడు తూ గౌడు లచ్చన్న స్వాతంత్య్ర పోరాటంలో చురుకై న పాత్ర పోషించారన్నారు. చిత్తూరు నగరంలోని ఇరువారంలో వచ్చే సంవత్సరం లోపు గౌతు లచ్చన్న పేరు తో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. నగర మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, మొదలియార్ సంఘం అధ్యక్షుడు త్యాగరాజన్, బీజేపీ నాయకులు అ ట్లూరి శ్రీనివాసులు, డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, తదితరులు పాల్గొని లచ్చన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కావడి మొక్కులు చెల్లించిన మాజీ మంత్రి ఆర్కే రోజా
–సుబ్రమణ్య స్వామికి వెండి శూలాయుధం సమర్పణ నగరి : ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మాజీ మంత్రి ఆర్కేరోజా కావడి మొక్కులు చెల్లించారు. సంప్రదాయ పద్ధతిలో పసుపుచీర ధరించి సుబ్రమణ్యస్వామి వ్రతమాచరించిన ఆమె పుష్పాలతో అలంకరించిన కావడి ఎత్తారు. రాష్ట్ర సరిహద్దులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.తర్వాత మొక్కుబడిలో భాగంగా వెండి శూలాయుధాన్ని హుండీలో వేసి మొక్కు చెల్లించుకున్నారు. ఆమెను ఆలయ పురోహితులు ఆశీర్వదించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, నాయకులు రమేష్రెడ్డి, మురుగ, ఆనంద్కుమార్, కృష్ణమూర్తి, దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
ఓరియంటేషన్లు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 20, 21 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీన మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై, ఈనెల 21న బాలికల కౌమార సమస్యలపై మహిళా ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 187 పింఛన్ల తొలగింపు గుడిపాల: మండల పరిధిలో 187 పింఛన్లను తొలగించినట్లు ఎంపీడీఓ శిరీషా తెలిపారు. ఆమె మాట్లాడుతూ వికలాంగులు, మానసిక రోగులకు సంబంధించిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు సరిగ్గా లేనందున పింఛన్లు తొలగించినట్లు వివరించారు. మండలంలో వికలాంగులు, మానసిక రోగులు తదితరులు 838 మంది ఉన్నారని, అందులో సర్టిఫికెట్లు సరిగా ఉన్న వారు 651 మంది మాత్రమేనని పేర్కొన్నారు. పింఛన్లు తొలగించిన వారిలో 189 కొత్తపల్లెలో 14 మంది, 197రామాపురంలో 16, ఎఎల్పురం 07, బసవాపల్లె 13, బొమ్మసముద్రం 10, చీలాపల్లె 13, చిత్తపార 25, గుడిపాల 07, నంగమంగళం 16, మరకాలకుప్పం 01, నారగల్లు 07, పానాటూరు 22, పాపసముద్రం 12, పేయనపల్లె 04, రామభద్రాపురం 07, వసంతాపురం 11 మంది ఉన్నట్టు వెల్లడించారు. నిత్యావసర సరుకుల వితరణ కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి శనివారం ఓ దాత నిత్యావసర సరుకులు వితరణ చేశారు. తవణంపల్లి మండలం, మైనగుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి రూ.2.5 లక్షల విలువ చేసే బియ్యం 5 టన్నులు, నూనె, కూరగాయలు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి పాల్గొన్నారు. -
రాజనాలబండలో తిరుణాల సందడి
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో శనివారం నుంచి తిరుణాల సందడి మొదలైంది. పూర్వీకుల నుంచి శ్రావణమాసపు చివరి శనివారం, ఆదివారం భక్తి శ్రద్ధలతో తిరుణాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుణాలను పురస్కరించుకొని టీటీడీ అధికారులు ఆలయాన్ని విధుద్దీపాలు, పూలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. శనివారం మండలంలోని ప్రజలు, తిరుణాల నిర్వహించే సుమారు 18 గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు భక్తి శ్రద్ధలతో రాజనాలబండకు చేరుకొని శ్రీవీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రాజనాలబండకు సమీపంలో గల ఎత్తైన కొండపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాలినడకన చేరుకొని లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభు విగ్రహానికి అభిషేకాలు చేశారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కొండపై ఆహ్లాదకర వాతావారణం నడుమ సేద తీరారు. అనంతరం ఆలయం వద్ద శనివారం రాత్రి అఖండ దీపారాధన వెలిగించారు. రాజనాలబండ ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి నడిచి వెళ్తున్న భక్తులకు జీఆర్ఎస్ రమణయూత్, ఎస్ఎల్ఎన్ఎస్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. -
మమ్మేల్మురుగన్!
ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గుడుపల్లెలోని గుడివంక ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఆశ చూపించింది. ఎన్నికలయ్యాక ఆ మొత్తం పెంచినట్టే పెంచి కోతలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ముసుగులో వేలాది పింఛన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లా ప్రభుత్వాస్పత్రి, ఏరియా ఆస్పత్రుల్లో రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరీక్షల్లో పలువురిని అనర్హులుగా గుర్తించి వేటు వేసింది. పింఛన్లు తొలగింపు 2024 డిసెంబర్ నుంచి సదరన్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 1,936 మంది ఉంటే 1,911 మందిని రీ వెరిఫికేషన్ చేశారు. ఈ పరిశీలనలో 1,677 మంది అర్హులుగా తేలితే 234 మందిని అనర్హులుగా తేల్చారు. అలాగే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి మొత్తం 35,277 మంది ఉంటే 22,338 మందిని రీ వెరిఫికేషన్ చేశారు. వీరిలో ఇప్పటి వరకు అర్హులుగా 17,606 మంది కాగా అనర్హులుగా 4,732 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. వీరి పింఛన్ తొలగించేందుకు సర్వం సిద్ధం చేశారు. అత్యధికంగా చిత్తూరు అర్బన్లో 504, తవణంపల్లి మండలంలో 377, ఐరాలలో 267, యాదమరిలో 263 ఎస్ఆర్పురంలో 238, పెనుమూరులో 225, పుంగనూరులో 216, కార్వేటినగరంలో 189, చిత్తూరు మండలంలో 186, గుడిపాలలో 182 మందిని తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇంకా 12,939 మందిని పునఃపరిశీలన చేయాల్సి ఉండగా మరిన్ని పింఛన్లు కోత పడే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. నోటీసులు జారీ అనర్హత పేరుతో దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ సచివాలయాల ద్వారా నోటీసుల జారీమొదలైంది. ఈ నెల 27 నాటికి తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. తొలగింపు తర్వాతనే సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించిన డేటా విడుదలయ్యే అవకాశం ఉంది. పింఛన్ల కోత..దివ్యాంగుల పింఛన్లపై కూటమి కన్ను ...ఇవి మచ్చుకు మూడు ఘటనలు మాత్రమే. జిల్లాలో ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. కనికరం లేని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల నోటికూడు లాగేస్తోంది. రీ వెరిఫికేషన్ పేరుతో వేలాది పింఛన్లను అడ్డగోలుగా తొలగించేస్తోంది. సచివాలయ వారీగా తొలగింపు జాబితాను పంపింది. అనర్హులంటూ పలువురికి సచివాలయ సిబ్బంది నోటీసులిస్తున్నారు. చేసేది లేక దివ్యాంగులు కంటతడి పెడుతున్నారు. పింఛన్లు నమ్ముకుని జీవించే తమకు ఈ కోతలేమిటని కన్నీరుమున్నీరవుతున్నారు. నా పింఛన్ తొలగించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి రూ.200 పింఛన్ మంజూరైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పింఛన్ అందుకుంటూ వచ్చాను. ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు పర్సంటేజ్ తక్కువ ఉందని పింఛను తొలగించారు. నాకు జీవించడానికి ఎలాంటి ఆధారం లేదు. పింఛన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నా. – సురేంద్రబాబు, కార్వేటినగరం -
నన్ను చూస్తే...జాలి లేదా?
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతులు దినసరి కూలీలు. వీళ్లకు సొంత ఇల్లు లేదు. సెంటు జాగా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు ఇంటి స్థలం మంజూరు చేశారు. వీరి పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతం నుంచి రక్షించేందుకు 19 సవరాల బంగారాన్ని అమ్మేశారు. అయినా కుమారున్ని పక్షవాతం నుంచి కాపాడలేకపోయారు. మందులు, మాత్రలతోనే ప్రాణంతో నిలబెడుతున్నారు. నెలవారీగా రూ.7,500 ఖర్చువుతోంది. 20 ఏళ్లు దాటినా అతని ఆలనాపాలన మొత్తం తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇప్పుడు అతనికి చూపు కూడా మందగించింది. ఈ దుస్థితిని గుర్తించి వైద్యులు 2013లో సదరన్ సర్టిఫికెట్ జారీచేశారు. అప్పటినుంచి పింఛన్ మంజూరవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో భాగంగా ఐదుగురు అధికారులు బృందంగా ఇంటివద్దకు వచ్చి వికలత్వం 40శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు ఇచ్చారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కావాలని పూజలు
పుంగనూరు: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలోని శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనారిటీ సెల్ కన్వీనర్ ఫకృద్దీన్షరీఫ్తో కలసి ఆయన కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి, తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర, వైఎస్సార్సీపీ నా యకులు జయరామిరెడ్డి, కిజర్ఖాన్, రాజేష్, ఖాదర్ బాషా, ఖాదర్, మమ్ము, రేష్మా, అంజాద్, తులసమ్మ, సాజిదా, శ్రీనివాసులు, నజీర్, భారతి, ఇంతియాజ్, రాఘవేంద్ర, అస్లాంమురాధి పాల్గొన్నారు. -
చెరువులో మట్టి తరలింపుపై కలెక్టర్, ఎస్పీ సీరియస్
పెద్దపంజాణి: మండలంలోని బట్టందొడ్డి పంచాయతీ, కొత్తూరుగ్రామ సమీపంలోని ఎర్రచెరువులో మట్టి తవ్వకాలపై మండల అధికారులు ఎవ్వరూ స్పందించక పోవడంతో కలెక్టర్, ఎస్పీ నేరుగా రంగంలోకి దిగారు. దీంతో అక్రమార్కులు ఉడాయించారు. దీనిపై ఫిర్యాదు చేసిన పెద్దపంజాణి సింగిల్ విండో మాజీ చైర్మన్ శంకరప్ప వివరాల మేరకు.. మండలంలోని ఎర్రచెరువులో శనివారం ఉదయం నుంచి అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు శ్రీరామాపురం సమీపంలోని లేఅవుట్కు మట్టి తోలేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను అధికార పార్టీలో ఉన్నానని, తనను ఎవరు అడగుతారంటూ మూడు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో మట్టిని తరలించడం ప్రారంభించాడు. దీనిపై తహసీల్దార్, ఎస్ఐ, మైన్స్, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమార్కులకు కొమ్ముకాయడంతో తాను చేసేదేమి లేక కలెక్టర్, ఎస్పీకి ఫొటోలు, వీడియోలు పంపినట్టు ఆయన వివరించారు. చివరకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించడంతో విషయం తెలుసుకున్న చోటానాయకుడు వాహనాలతో సహా అధికారులు రాకముందే చెరువు నుంచి ఉడాయించాడని తెలిపారు. మొగిలి ఘాట్లో లారీ బోల్తా బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం వేకువజామున లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కర్ణాటకలోని హసన్ నుంచి విజయవాడకు దానిమ్మ, ద్రాక్ష పండ్ల లోడ్డుతో వెళ్తున్న లారీ మొగిలి ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో భయటపడ్డారు. రహదారిపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు. -
నాల్గోసారీ!
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ 4వ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగింది. శనివారం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన, సీఈఓ రవికుమార్నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జేసీ విద్యాదరి హాజరయ్యారు. ఇక సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆదిమూలం, మురళీమోహన్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మినహా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాలేదు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించగా మధ్యాహ్నం 1.30కు ముగించేశారు. అజెండాలో 11 అంశాలపై చర్చ జరపాల్సి ఉండగా.. అందులో రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆర్యోగ శాఖలపై చర్చించి మిగిలిన వాటిని తూతూమంత్రంగా కానిచ్చేశారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల అధికారులు హాజరు కాలేదు. సభ్యుడు కానీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజన్ సమావేశానికి హాజరవ్వడం గమనార్హం. 50 ఏళ్లుగా ఇలాంటి పాలన చూడలేదు ప్రజాప్రతినిధులంటే దిష్టిబొమ్మల్లా అధికారులకు కనపడుతున్నట్టు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పిచ్చి తుగ్లక్ పాలన చూడలేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో తన చేతులమీదుగా ఇచ్చిన చెక్ను మరోసారి కార్యక్రమం పెట్టి ఇంకొకరి చేతుల మీదుగా వ్యవసాయశాఖాధికారులు ఇప్పించారన్నారు. పలు కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. ప్రొటోకాల్ పాటించని అధికారుల పై స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గత పాలనలో రోడ్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో బాగా జరిగాయన్నారు. ప్రస్తుతం 36 రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాపోయారు. ఆర్అండ్బీ బైపాస్ రోడ్డు మంజూరైనా పనులు చేయలేదని, సీకేపొడి, నాగలాపురం– శ్రీసిటీ, నాగలాపురం–టీపీకోట రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. చాలా రోడ్లపై కనీసం ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కేవీపురం మండలం, ఎగవ పూడిబ్రిడ్జి, నారాయణవనంలోని తంబూరు, పాలమంగళం బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. నాగలాపురం–సురటపల్లెకు వెళ్లే మార్గంలో మూడు కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉందన్నారు. జెడ్పీ గెస్ట్హౌస్లో కనీసం ఫర్నిచర్ కూడా లేదన్నారు. 108 వాహనాలు లేవు పలు ప్రభుత్వాస్పత్రుల్లో 102, 104, 108 వాహనాలు అందుబాటులో లేవని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర కేసులను దూరంగా ఉండే ప్రభుత్వాస్పత్రులకు కాకుండా సమీపంలో ఉండే నెట్వర్క్ ఆస్పత్రులకు పంపాలన్నారు. తల్లీబిడ్ల ఎక్స్ప్రెస్ వాహనాల సంఖ్యను పెంచాలని చెప్పారు. గ్రామాల్లో వేసిన బోర్లకు విద్యుత్ సర్వీసులు ఇవ్వడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆరోపించారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, జేసీ విద్యాదరి పక్కన సీఈఓ రవికుమార్నాయుడు సమస్యలు ఏకరువు -
మమ్మేల్మురుగన్!
గుడుపల్లె: గుడివంక శ్రీవళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యస్వామి కొండ హారోహర.. వేల్ మురుగా.. నామస్మరణంతో మార్మోగింది. శనివారం ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కావళ్లు ఎత్తుకుని పశ్చిమ వాహినిలో స్నానాలు ఆచారించారు. అనంతరం స్వామి వారి నామస్మరణతో పశ్చిమ వాహిని కొండపైకి చెరుకున్నారు. కావళ్లను ఎత్తుకుని ఆలయం చట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ఆకృతులతో కావళ్ల చెలింపు కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామి వారికి పలు ఆకృతులతో కావళ్ల ద్వారా మొక్కులు చెల్లించారు. తేరు కావళ్లు, రాగి గుండులు, ఇనుప శూలాలు, నిమ్మకాయలతో సూదులు శరీరానికి గుచ్చుకుని ఆలయం ఎదుట కావళ్లు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కొంత మంది భక్తులు ఎస్కాట్ వాహనంపై వీపుకు కొక్కిళ్లు వేసుకుని వెలాడుతూ వేల్ మురుగా అంటూ నినాదాలు చేస్తూ ఆలయం చట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గుడివంకలో జన సందడి ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామి వారిని దర్శర్శించుకునేందుకు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం కనిపించింది. పశ్చిమ వాహిని నుంచి ఆలయం వరకు డప్పు వాయిద్యాల నడుమ కావళ్లు ఎత్తుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అలంకరణంతో గంగాధరేశ్వరస్వామి గుడివంక బ్రహ్మోత్సవాల సందర్భంగా గంగాధరేశ్వరస్వామిని ప్రత్యేక ఆలంకరణంతో భక్తులకు దర్శనం కల్పించారు. కొండపై సుబ్రమణ్య స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు గంగాధరేశ్వరస్వామిని దర్శించుకుని గ్రామాలకు తిరుగుప్రయాణమయ్యారు. తేరు కావళ్లతో భక్తుల సందడిశూలాలతో వస్తున్న భక్తులు ఆలయం వద్ద మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు దర్శనం కోసం క్యూలో కిక్కిరిసిన భక్తులు -
బాధితులకు పరామర్శ
గంగాధరనెల్లూరు: కారులో గత మంగళవారం తిరుత్తణికి వెళ్తూ ప్రమాదానికి గురై గాయపడి, రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. శనివారం తమిళనాడులోని రాణిపేట సీఎంసీకి తమిళనాడు రాష్ట్రం, షోలింగర్ మాజీ ఎమ్మెల్యే పార్దిబన్తో కలిసి చేరుకున్నారు. సీఎంసీ డైరెక్టర్ దీపక్ సెల్వంతో భేటీ అయ్యారు. ప్రమాద బాధితులకు ప్రత్యేక వైద్య సేవలందించాలని కోరారు. చిట్టెమ్మ, రేఖ, కీర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీకరరెడ్డి, రూపకుమార్రెడ్డి, సురేంద్రరెడ్డి ఉన్నారు. -
శాసీ్త్రయ సమాజ నిర్మాణమే జేవీవీ లక్ష్యం
పలమనేరు: శాసీ్త్రయ సమాజ నిర్మాణమే జనవిజ్ఙాన వేదిక లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డా.గేయానంద్ పేర్కొన్నారు. పల మనేరులోని ఓ ప్రైవేటు స్కూల్లో జేవీవీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలు, సూడోసైన్స్, అశాసీ్త్రయ భావజాలం విపరీతంగా ప్రచారమవుతోందన్నారు. వీటిని అరికట్టి శాసీ్త్రయ సమాజాన్ని నిర్మించాలంటే యువత నడుం బిగించాలన్నారు. మరో అతిఽథి పలమనేరు బాలాజీ మాట్లాడుతూ నేటి సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక నేతలతో కలసి వారు సెప్టంబర్ 13న విజయనగరంలో జరగనున్న జేవీవీ వార్షిక సమావేశపు వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. జేవీవీ జిల్లా నూతన కార్యవర్గం జేవీవీ జిల్లా అధ్యక్షుడిగా అరుణశివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మిఠాయి యుగంధర్బాబు, కోశాధికారి గా గిరిధర్ మూర్తితోపాటు కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నాయకులు మునిరత్నం, బాలచైతన్య, సుధాకర్, విజయకుమార్, ఆనందబెన్, సెల్వం, శ్యామల, రామలింగం పాల్గొన్నారు. -
సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాల సమర్పణ
సదుం: స్థానిక శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భరణి కావళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. శనివారం ఆడికృత్తిక సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే భక్తులకు అన్నదానం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతమ్మ ఆలయం వద్దకు చేరుకుని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తాటిగుంటపాలెంలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్రెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరమణ, నారాయణరెడ్డి, పుట్రాజు, ఇమ్రాన్, కల్యాణ భరత్, అంజిబాబు, వెంకటస్వామి, మోహన్ రెడ్డి, దామోదర రెడ్డి, గిరిధర్ రెడ్డి, ఎల్లారెడ్డి, హనుమంత రెడ్డి, వాసు, బాబు, హరినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీకి బెయిల్ రావాలని పాదయాత్ర
చిత్తూరు కార్పొరేషన్, చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికు బెయిల్ రావాలని వైఎస్సార్సీపీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ఆధ్వర్యంలో చిత్తూరు–కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం స్థానిక దొడ్డిపల్లెలోని సప్తకనికలమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ర్యాలీని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, ఉద్యోగుల పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడారు. అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎంపీ మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు త్వరగా బెయిల్ రావాలని అమ్మవారిని ప్రార్థించి కాణిపాకం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. చేయని తప్పుకు ఎంపీని జైలులో పెట్టడం ఎంత వరకు న్యాయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాణిపాకంలో స్వామివారిని దర్శించుకొని ప్రార్థనాలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గుడిపాల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, చిత్తూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు జయపాల్, జెడ్పీటీసీ బాబునాయుడు, నాయకులు, ప్రజాప్రతినిధులు హరీషారెడ్డి, ప్రతిమారెడ్డి, మధురెడ్డి, శివ,మనోజ్రెడ్డి, అన్బు, మధుసూదన్, త్యాగ, అమర్నాథ్రెడ్డి, సంపత్, అప్పొజీ, భాను, స్టాండ్లీ,శేఖర్, లోక, చంద్ర, చామంతి, జస్టిన్, శ్యామ్, సద్దాం, రవి, మహేష్, చిన్నా, ట్వింకిల్, శివారెడ్డి, సెల్వ, విజయ్ పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో ప్రథమ చికిత్స కేంద్రం
చిత్తూరు లీగల్ : చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రథమ చికిత్స కేంద్రాన్ని జిల్లా జడ్జి అరుణసారిక ప్రారంభించారు. కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు.. ఎవ్వరైనా సరే ప్రథమ చికిత్స అవసరమైనప్పుడు ఇక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా జడ్జి తెలిపారు. న్యాయస్థానాలు పనిచేసే రోజుల్లో ప్రథమ చికిత్స కేంద్రం కూడా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారన్నారు. అధికారులు సమాచారంతో రావాలని కోరారు. కాణిపాకం..జనసందడి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినా యకస్వామి దేవస్థానం శుక్రవారం భక్తజన సందడితో రద్దీగా మారింది. ఉచిత దర్శనం మొదలు శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనం వరకు భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. మూడు రోజుల పాటు సెలవులు కావడంతో ఆలయం భక్త జనులతో కిటకిటలాడింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. వాణ్యిసముదాయానికి వేలంపాటతో ఆదాయం వెదురుకుప్పం : మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన వాణిజ్య సముదాయానికి అధికారులు ఎట్టకేలకు వేలంపాట నిర్వహించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెదురుకుప్పం పంచాయతీని వ్యాపారపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో మాట్లాడి రూ.50 లక్షలు జెడ్పీ నిధులు మంజూరు చేయించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకుడు, కాంట్రాక్టర్ రామయ్య 11 గదులు నిర్మించి పూర్తి చేశారు. అప్పట్లోనే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభోత్సవం చేసేశారు. అయితే వేలం పాట సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైంది. స్థానిక సర్పంచ్ శిల్ప వేలం పాటకు నోటీస్ అందించి తేదీ నిర్ణయించినా టీడీపీ నేతలు అధికారులను బెదిరించి జరపకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో వేలం పాట నిర్వహించాలంటూ రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో అధికారులు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. 11 గదుల కొత్త షాపింగ్ కాంప్లెక్స్ను వేలం వేయగా నెలకు రూ. 65,500, 10 గదుల పాత కాంప్లెక్స్ గదుల వేలం ద్వారా నెలకు రూ. 28,300 వచ్చినట్లు కార్యదర్శి కోదండరామిరెడ్డి తెలిపారు. అదేవిదంగా వారపు సంత వేలం ద్వారా సంవత్సరానికి రూ. 1,81,500 వచ్చిందన్నారు. మొత్తానికి అన్ని విధాలా సంవత్సరానికి రూ. 13,07,100 ఆదాయం పంచాయతీకి వచ్చిందన్నారు. వేలం పాటలో ఎంపీడీఓ పురుషోత్తం, సర్పంచ్ శిల్ప, డిప్యూటీ ఎంపీడీఓ బాలసుబ్రమణ్యం, కార్యదర్శి కోదండరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మిథున్రెడ్డి విడుదల కావాలని దర్గాలో ప్రార్థనలు
చౌడేపల్లె : అక్రమ కేసులో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని జైలుకు పంపారని త్వరగా బెయిల్ ఇవ్వడంతో పాటు అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకురావాలని దాదేపల్లెలోని మషాయక్ బహదూర్ అలీషాబాబా దర్గాలో దుర్గసముద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం దర్గాలో బాబా మజ్జార్కు చాదర్ను కప్పి గంధం, పూలు సమర్పించి మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు , దువ్వా చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకొని వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, అమర, కో ఆప్షన్ మెంబర్ సాధిక్, రమేష్బాబు, ఉపసర్పంచ్లు కృష్ణంరాజు, అల్తాఫ్, వైఎస్సార్సీపీనేతలు సుబ్రమణ్యం రాజు, అల్తాఫ్,రెడ్డిభాషా, అనీష్ తదితరులున్నారు. -
5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం
జిల్లాలో 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకం రెపరెలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలుతో వివిధ శాఖల అధికారులతో కలిసి జెండావిష్కరణ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షో అలరించింది. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ : రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. డిజిటల్ నెర్వ్ సెంటర్లు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా కుప్పంలో నిర్వహిస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్లను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం కుప్పంలో ఏర్పాటు చేసిన నెర్వ్ సెంటర్ పరిధిలోకి 13 వైద్య ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవలను సమన్వయం చేస్తూ వ్యక్తుల హెల్త్ హిస్టరీని డిజిటలైజ్ చేయడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో రూ.5 లక్షలు వార్షిక ఆదాయం లోపు ఉన్న ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయల ఖర్చు పైబడి ఉన్న 3255 జబ్బులకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 47,725 మందికి రూ.91 కోట్లు, ఆరోగ్య ఆసరాలో 15,711 మందికి రూ.7.80 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలుగా భావించి గ్రామాల అ భివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాలో పల్లెపండుగలో ఇప్పటి వ రకు రూ.85 కోట్లతో పనులు ప్రారంభించామని, ఇందుకు 1454 రోడ్లు పూర్తి కాగా, రూ.19 కోట్ల తో ప్రా రంభించిన 33 బీటీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నా యని చెప్పారు. స్వా మిత్రా డ్రోన్ టెక్నాలజీ జిల్లాలోని 781 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. జిల్లా లో 72,763 గృహాలకు ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్ష ల చొప్పున రూ.1350 కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు చేస్తున్నామన్నారు. జెండా వందనం చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్, కలెక్టర్ ఉప్పొంగిన దేశభక్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. వైఎస్సార్ కడపకు చెందిన జయచంద్ర అకాడమీ నిర్వహించిన కళారిపట్టు నృత్యం ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా ఎస్వీ యూనివర్శిటీకి చెందిన విద్యార్థినులు నిర్వహించిన రాణి ఆఫ్ ఝాన్సీ ప్రదర్శన అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విజయం విద్యా సంస్థల విద్యార్థులకు మొదటి బహుమతి, ఏపీ ట్రైబల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు రెండో బహుమతులను మంత్రి సత్యకుమార్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అందజేశారు. శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖ మొదటి బహుమతి , విద్యాశాఖ శకటం రెండవ బహుమతి కై వసం చేసుకుంది. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, టీచర్లు పాల్గొన్నారు. స్టాల్స్ ప్రదర్శన: స్టాల్స్ ఏర్పాటులో హార్టికల్చర్ శాఖ మొదటి బహుమతి, పట్టుపరిశ్రమ శాఖ రెండవ బహుమతిని కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ తదితరులు పాల్గొన్నారు. సీ్త్ర శక్తి పథకం పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం ప్రారంభించుకున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాలనలో బా ధ్యత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్ర తి సోమవారం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని చెప్పారు. కడా ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో ఏబీఐఎస్, ప్రోటిన్, మథర్ డెయిరీ వంటి పరిశ్రమలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఇంకా 14 పరిశ్రమలు స్థాపన దశలో ఉన్నాయని, జిల్లాలో సర్వేలో గుర్తించిన 42,852 మంది నిరుపేదలను 3640 మంది మార్గదర్శకులతో ప్రత్యక్షంగా దత్తత తీసుకుని సహాయం చేసే పీ–4 విధానం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. మురిసిన మువ్వన్నెల రెపరెపలు జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో 44 చంద్రన్న సంచార రథాలతో ఇంటింటికి వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలో 2,23,201 మంది విద్యార్థులకు సంబంధించి రూ.335 కోట్లు తల్లుల ఖాతాలకు తల్లికి వందనం నగదు జమచేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. అనంతరం పనితీరులో ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలను, స్టాల్స్ను మంత్రి తిలకించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు టీసీ రాజన్ను సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, థామస్, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్ కుమార్, డీఎఫ్వో భరణి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆర్డీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
బోయకొండలో రాహుకాల పూజలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా గంగమ్మకు రాహుకాల పూజలు నిర్వహించారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయంగా అర్చనలు , అభిషేక పూజలు చేశారు. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదం పంపిణీ చేశారు. -
నేటి నుంచి రాజనాలబండ జాతర
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ లక్ష్మినరసింహస్వామి ,శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నేటి నుంచి రెండు రోజులపాటు వైభవంగా జాతర జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో తిరుణాల జరగనుందన్నారు. ఏటా పూర్వీకుల నుంచి శ్రావణమాస చివరి శనివారం రోజున రాజనాలబండపై వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు పక్కనే ఉన్న ఎత్తైన శ్రీలక్ష్మినరసింహస్వామి కొండపై భక్తులు తరలివెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. అదే రోజు రాత్రి కొండపై గల రాతి స్తంభంపై దీపం వెలిగించి అఖండ దీపారాధన చేస్తారు. స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు చేపడుతారు. ఆదివారం రోజున కోలాహలంగా తిరుణాల నిర్వహిస్తారు. రాజనాలబండకు సమీపంలోని మొత్తం 18 గ్రామాలకు చెందిన ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకొంటారు.కొలింపల్లె నుంచి గ్రామదేవత బోయకొండ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తితో కలిసి ఊరేగింపుగా చేరుకొని బండారు పంపకం చేసిన అనంతరం సంప్రదాయ రీతిలో దేవరెద్దులు, బోయకొండ అమ్మవారిని రాజనాలబండకు చేర్చుతారు. వేల మంది భక్తులు వీరాంజనేయస్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. అక్కడి నుంచి ఉట్లోత్సవం, పోకుమాను బరుగుట వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ ఇన్చార్జి ధర్మేంధ్ర ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
ఎమ్మెల్సీ మేరిగకు పరామర్శ
రాపూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ను పలువురు పరామర్శించారు. మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు (89) గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాపూరులోని లక్ష్మీపురంలోని ఆయన నివాసంలో ఆనందరావు భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు నాయకులు మేరిగ మురళీధర్ను పలకరించి, సంతాపం తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జోన్–4 వర్కింగ్ ప్రెసిడెండెంట్ కాకాణి పూజితమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు బత్తిన పట్టాభిరామిరెడ్డి, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మండల కన్వీనర్ బోడ్డు మధుసూదన్రెడ్డి, దందోలు నారాయణరెడ్డి, మస్తాన్యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి తదితరులు శుక్రవారం ఆనందరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మేరిగను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. -
జేసీబీ తరలిస్తుండగా విద్యుదాఘాతం
ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు, జేసీబీని తరలిస్తున్న టెంపో – డ్రైవర్ మృత్యువాత చౌడేపల్లె : టెంపోలో జేసీబీని తరలిస్తుండగా విద్యుదాఘాతంతో జేసీబీ డ్రైవర్ సుబ్రమణ్యంరెడ్డి(45) మృతి చెందిన ఘటన శుక్రవారం కొలింపల్లె వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. పుంగనూరు మండలం ఎల్లారుబైలు నుంచి జేసీబీని టెంపోలో కొలింపల్లె మీదుగా పుంగనూరు వైపునకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న రామసముద్రం మండలం టి.గొల్లపల్లెకు చెందిన సుబ్రమణ్యంరెడ్డి టెంపోలో జేసీబీని ఎక్కించి ఆ సీటులోనే అక్కడే కూర్చొని ప్రయాణిస్తుండగా కొలింపల్లె సమీపంలోని ఒడ్డోనితోట సమీపంలోకి రాగానే టెంపోలో గల జేసీబీకి విద్యుత్ తీగలు తగులుతాయని టెంపో డ్రైవర్ సుబ్రమణ్యం రెడ్డిని కట్టె సాయంతో పైకి ఎత్తాలని సూచించారు. జేసీబీలో నుంచి దిగేందుకు డోర్ తీయగా విధ్యుదాఘాతానికి గురై సుబ్రమణ్యంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో టి.గొల్లపల్లెలో విషాధఛాయలు అలుముకొన్నాయి. ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం గల తీరుపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.