breaking news
Chittoor District News
-
పోలీసు గ్రీవెన్స్కు 43 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 43 వినతులు అందాయి. సోమవారం చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఏఎస్పీలు మహబూబ్బాషా, షాను హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ బంగారుపాళెం: మండలంలోని టేకుమంద సమీపంలో సోమవారం రాత్రి పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురుని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
నువ్వా నేనా సై..!
సంక్లిష్టమైన యోగాసనాలు వేస్తూ.. అథ్లెటిక్స్లో దూసుకెళుతున్న క్రీడాకారులుచిత్తూరు మెసానిక్ మైదానంలో అమరావతి చాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు నువ్వా, నేనా? సై అనే లెవెల్లో పోటీపడ్డారు. పరుగు పందేల్లో క్రీడాకారులు చిరుతల్లా పరుగులు తీశారు.. హాకీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇక, బాక్సింగ్ రింగ్లో అయితే క్రీడాకారులు తమ పంచ్లు విసురుతూ, హుక్లతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు శ్రమించారు. యోగా పోటీల్లో విభిన్నమైన ఆసనాలతో ఆకట్టుకున్నారు. – చిత్తూరు కలెక్టరేట్ -
ఔరా.. ఔషధి!
కాణిపాకం: తిరుపతి జిల్లాలో దాదాపు 2,600 మెడికల్ షాపులు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 14 మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన జనరిక్ దుకాణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పరిధిలో సుమారు 900 మెడికల్ షాపులు నడుస్తుండగా, వీటిలో కేవలం 9 జనరిక్ షాపులు మాత్రమే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. లాభాలన్నీ వారి ఖాతాలోకే... సాధారణంగా బ్రాండెడ్ మందులన్నీ కంపెనీ ప్రతినిధులు, సీ అండ్ ఎఫ్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ తర్వాత రిటైలర్ల ద్వారా సుదీర్ఘమైన సరఫరా వ్యవస్థ దాటుకుని వినియోగదారుడికి చేరుతాయి. కానీ, జనరిక్ మందులు నేరుగా డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్ల చేతికే అందుతాయి. ఈ ప్రక్రియలో లభించే భారీ లాభాల మార్జిన్ను వినియోగదారుడికి డిస్కౌంట్ రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. ఆ ప్రయోజనాలను మెడికల్ షాపుల యజమానులే నొక్కేస్తున్నారు. జేబుకు చిల్లు! ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో మాత్రమే అసలైన జనరిక్ మందులు, అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయనేది అధికారుల వాదన. అయితే అలాంటి పలు షాపుల్లో కూడా ప్రజలకు నిర్ణీత ధరలకు మందులు దొరకడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక సాధారణ ప్రైవేట్ షాపుల్లో మాత్రం జనరిక్ పేరుతో నాణ్యత లేని మందులను అంటగడుతూ సామాన్యుల జేబుకు చిల్లులు పొడుస్తున్నారు. ఇక అనుమతులు లేని షాపులు కూడా విచ్చలవిడిగా వ్యాపారం సాగిస్తుండడం గమనార్హం. కొందరు ఈ గోల్మాల్ను పసిగడుతున్నప్పటికీ ప్రశ్నించే నాథుడు కరువయ్యాడు. ఇదిగో సాక్ష్యం తిరుపతి నగరానికి చెందిన రెహమాన్ అనే ఓ వ్యక్తి ఎదుర్కొన్న అనుభవమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన క్రమం తప్పకుండా వాడే రాబేసిక్ డీఎస్ఆర్ అనే మాత్రల షీట్ను ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో కేవలం రూ.35లకే కొనుగోలు చేసేవాడు. అయితే, ఇటీవల తిరుపతిలోని ఒక ప్రైవేట్ జనరిక్ షాపునకు వెళ్లగా.. అదే మాత్రల షీట్కు ఏకంగా రూ.175 వసూలు చేశారు. ఇతర ప్రాంతాల్లో రూ.35లకే లభించే మందులకు ఇక్కడంత రేటు ఏంటని నిలదీయగా.. కవర్ మీద రూ.177.15 ఉంది.. ధర అంతే ఉంటుంది అని షాపు నిర్వాహకుడు దురుసుగా సమాధానమిచ్చాడు. బాధితుడు గొడవకు దిగడంతో నీ వల్ల అయింది చేసుకోపో అంటూ సదరు వ్యాపారి బెదిరింపులకు తెగబడ్డాడు. కేవలం రెహమాన్ ఒక్కడే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా రోజువారీగా ఇలాంటి దగాకు గురవుతున్న బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల్లోనూ అంతే రాబేసిక్ డీఎస్ఆర్ అనే మాత్రల షీట్ను కొత్తగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో అడిగితే ఒక షాపులో రూ.88 చెప్పారు. మరో దుకాణంలో రూ.85 చెబుతున్నారు. అధికారులు స్పందించేనా? జిల్లా వ్యాప్తంగా వందలాది మెడికల్ షాపుల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి, షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీనిపై సంబంధిత శాఖ ఏడీ హరిప్రసాద్ను వివరణ కోరగా.. ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోగానికి మందు వేసుకుంటే నయమవుతుందని వచ్చే సామాన్యుడికి మెడికల్ షాపుల నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. మందుల బిల్లులతో చెమటలు పట్టిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ప్రాణభయాన్ని ఆసరాగా చేసుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రైవేట్ మందుల షాపుల యజమానులు దోపిడీకి తెరతీస్తున్నారు. నిబంధనలను నడిరోడ్డుపై పాతిపెడుతూ, వ్యాపారమే పరమావధిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘జనరిక్’ ఆశయానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. బ్రాండెడ్ పేరుతో దోపిడీ.... చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు జనరిక్ మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నట్లు రోగులు, వారి సహాయకులు మండిపడుతున్నారు. ఇక రిటైల్ మెడికల్ షాపుల్లో జనరిక్ మందులను కూడా బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తూ అమాయక ప్రజలను నిలువునా దగా చేస్తున్నారు. ప్రైవేట్ షాపుల్లో అమ్మే జనరిక్ మందులపై స్పష్టమైన డిస్కౌంట్ నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ నిబంధనల ప్రకారం గరిష్ట ధర కంటే ఎక్కువకు అమ్మకూడదనే కనీస సూత్రాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు. -
వృద్ధులకు ఆసరాగా ‘హెల్ప్లైన్’
– అందుబాటులో 14567 టోల్ ఫ్రీ చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల (సీనియర్ సిటిజన్లు) సంక్షేమం, రక్షణ కోసం 14567 ప్రత్యేక హెల్ప్లైన్ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే వృద్ధులకు ఉచితంగా నాలుగు రకాల సేవలను అందిస్తారు. ఈ హెల్ప్లైన్ సేవలు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అవసరమైన సమాచారంతో పాటు మార్గదర్శకత్వాన్ని ఈ వేదిక ద్వారా అందిస్తారు. సేవలు ఇవే.. -
ఐరాల ఎస్ఐ సస్పెన్షన్కు డిమాండ్
చిత్తూరు అర్బన్: దివ్యాంగుల సమస్యలు పట్టించుకోకుండా.. వాళ్లపై దాడులకు కారణమైన ఐరాల ఎస్ఐను సస్పెండ్ చేయాలని వికలాంగుల జేఏసీ నేతలు చంద్రశేఖర్, సుమతి డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో నిర్వహించిన పోలీసు గ్రీవెన్సులో అధికారులకు రాత పూర్వక ఫిర్యాదు అందచేశారు. వారు మాట్లాడుతూ జూలై 8వ తేదీన దివ్యాంగురాలు విజయ ఇంటి స్థలం విషయంలో న్యా యం చేయాలని ఎస్ఐను కోరితే పట్టించుకోలేదన్నారు. పైగా తమపై దాడి చేయించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ నేతలు మురళి, బాలాజీ నాయుడు, భూపాల్ పాల్గొన్నారు. సకాలంలో సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. సోమవారం నిర్వ హించిన డయల్ యువర్ ఎస్ఈలో ఆయన మాట్లాడారు. స్థానిక ముత్తిరేవులలో తమ ఇంటి పరిసరాల్లోనే అనుమతి లేకుండా ట్రాన్స్ఫార్మర్ పెట్టారని వినియోగదారుడు రాజాగోపాల్రెడ్డి ఫిర్యాదు చేశారు. నగరంలోని సంతపేటలో రామచంద్ర ఆశ్రమం వద్ద లూజ్లైన్ను బాగుచేయాలని స్థానికుడు జగదీష్ కోరారు. అలాగే పలమనేరులోని పలమాకులపల్లె రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా కరెంటు స్తంభం నాటినట్లు సుబ్రమణ్యంరెడ్డి ఫిర్యాదు చేశారు. అన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం యాదమరి: మండలంలోని పెరుమాళ్లపల్లె సమీపంలోని ఆరు వరుసల జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం పడి ఉందని ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. సోమవారం ఈ మేరకు రాంప్రసాద్ అనే వ్యక్తి అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామన్నాఉ. మృతుడి వద్ద ఆధారాలు లేకపోవడంతో గ్రామంలో విచారించామని వెల్లడించారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిగా తెలిసిందని చెప్పారు. అనారోగ్య కారణాలతో మరణించి ఉంటాడని గుర్తించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య రేణిగుంట: మండలంలోని వెంకటాపురం సమీపంలోని ఇటుకుల తయారీ కేంద్రంలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తున్న కె.చిరంజీవి (24) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తవణంపల్లి మండలం, ముత్తరపల్లికు చెందిన చిరంజీవి వివాహ సమయంలో చేసిన రూ.4 లక్షల అప్పును తీర్చేందుకు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 9వ తేదీ రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా, చిరంజీవి నివాసముంటున్న రేకుల షెడ్డు పైకప్పులోని ఐరన్ రాడ్కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేనిగుంట పోలీసులు తెలిపారు. -
అడ్డంకులు
అడుగడుగునా పలమనేరులో చేపట్టిన ర్యాలీకి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలుచిత్తూరు అర్బన్ : డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదంగా.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేశారు. పోస్టింగులు కాపాడుకోవడానికి కొందరు., స్వామి భక్తి నిరూపించుకోవడానికి మరికొందరు పోటీ పడ్డారు. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపాలని చూసి నవ్వులపాలయ్యారు. నాయకులను అరెస్టుచేస్తే కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ పోలీసుల నీతిమాలిన చర్యను రోడ్డుపైనే కడిగేశారు. పోలీసులు ర్యాలీలైతే అడ్డుకున్నారు కానీ, ప్రజల్లో వెళ్లాల్సిన వాస్తవాలను మాత్రం దాచలేకపోయారు. ప్రతిపక్షం గొంతుకను నొక్కలేకపోయారు. పోలీసులు తరలిస్తున్న వాహనం నుంచి అభివాదం చేస్తున్న నారాయణస్వామిచిత్తూరులో విజయానందరెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులువైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలపై రెడ్బుక్ రాజ్యాంగం -
నేడు కుప్పంలో ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు కుప్పంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. స్థానిక వాల్మీకి కల్యాణ మండపంలో నిర్వహించనున్న సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. గిరిజనుల వినతులు స్వీకరించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు కుప్పం నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం బయలుదేరి వెళతారని వివరించారు. వైభవంగా ప్రదోషకాల పూజలు కాణిపాకం: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధమైన శ్రీమణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో సోమ వా రం సాయంత్రం ప్రదోషకాల పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ప్రదోష వేళ నందీశ్వర స్వామివారికి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేపట్టారు. అనంతరం నందీశ్వరుడిని వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,179 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,256 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
పరిశీలించి.. పరిష్కారం
శ్రీరంగరాజపురం : ఎస్ఆర్పురం మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జిల్లా అధికారులకు వినతులు సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ అన్ని వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. అందుబాటులో ‘క్యూఆర్ కోడ్’ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన సోమవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారిక వెబ్సైట్ www.meekosam.ap.gov.inలో నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి, ఇతర వివరాల కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో ప్రదర్శించిన ‘సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్’ను స్కాన్ చేసి అర్జీదారులు తమ ఫిర్యాదు పరిష్కారంపై ఫీడ్బ్యాక్ నమోదు చేయవచ్చని వివరించారు. బ్యాటరీ సైకిల్ కావాలి -
రిజిస్ట్రేషన్లు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగానే ఏటా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పేరిట విద్యార్థుల్లో విజ్ఞాన ప్రతిభను వెలికితీస్తున్నారు. ఈ ఏడాది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ‘32వ జాతీయ బాలల సైన్న్స్ కాంగ్రెస్–2026’లో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల ఏపీ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నోటిఫికేషనన్ విడుదల చేసింది. 15వ తేదీ లోగా రిజిస్ట్రేషన్న్ చేసుకోవాలి ‘సుస్థిరత కోసం సైన్న్స్ ఆవిష్కరణలు’ అనే అంశంపై నిర్వహించే ‘32వ జాతీయ బాలల సైన్న్స్ కాంగ్రెస్–2026’లో పాల్గొనే విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఈ నెల 15వ తేదీలోగా రిజిస్ట్రేషన్న్ చేసుకోవాలి. వ్యర్థాల నిర్వహణ, శక్తి–అన్వేషణ, వర్షపు నీటి సంరక్షణ, ఆహారం–వ్యవసాయం, స్థిరమైన అభివృద్ధి–సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు అనే ఐదు అంశాలపై సమస్యలను గుర్తించి సమాజానికి ఉపయోగపడేలా పరిష్కారం చూపిస్తూ ప్రాజెక్టులు తయారు చేయాలి. అర్హులు వీరే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్థాయి పోటీలు అక్టోబరు, నవంబరులో జరుగుతాయి. డిసెంబర్లో రాష్ట్ర స్థాయి, వచ్చే ఏడాది జనవరిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాలు ఇస్తారు. విద్యార్థులు www. ncrc.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారేందుకు ఇది చక్కని అవకాశం. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చిన్న పరిశోధన గొప్ప ఆవిష్కరణ కావొచ్చు. – లక్ష్మీనారాయణ, డీఈవో -
వర్షాల కోసం విశేష పూజలు
కాణిపాకం : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మణికంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం, విశేష పారాయణాలు చేపట్టారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఆనందంతో తులతూగాలని యజ్ఞక్రతువును శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఈఓ పెంచల కిషోర్, ఆలయ కమిటీ చైర్మన్ మణి నాయుడు, సభ్యు లు అనసూయ, కృష్ణవేణి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు. మన చేతిలోనే మన ఆరోగ్యం వి.కోట : ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అందరి జీవితాల్లోకి తీసుకురావాలన్నదే ప్రధాన ధ్యే యమని మిల్లెట్మన్ డాక్టర్ ఖాదర్వలీ తెలిపారు. సోమవారం స్థానిక విద్యానికేతన్ కాలే జీ ఆవరణలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఖాదర్వలీ ఉపన్యాసం చేపట్టారు. ఖాదర్వలీ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని, స్థానిక పంటలను ప్రోత్సహించా లని, చిరుధాన్యాలను ఆహారంగా ప్రతి ఒక్క రూ తీసుకోవాలని సూచించారు. కొర్రలు, సా మలు,అరికెలు, ఊదలు, అండుకొర్రలు, రాగు లు, జొన్నలను తీసుకోవాలని కోరారు. వీటిలో పీజు పదార్ధారాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు. జిల్లా మలేరియా అధికారిగా అనిల్ కుమార్ చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లా మలేరి యా అధికారిగా కె.అనిల్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఈ బా ధ్యతలతో పాటు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అధికారాలను కూడా బదిలీ చేశారు. ఇప్పటివరకు మలేరియా అధికారిగా ఉన్న నవీన్ తేజ్ రాయల్ అన్నమయ్య జిల్లా లద్ధిగం పీహెచ్సీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. 15లోపు వంట గ్యాస్కు ఈకేవైసీ తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులు ఈ నెల 15వ తేదీలోపు ఈకేవైసీని (బయోమెట్రిక్ ధ్రువీకరణ) తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ కనెక్షన్లు దుర్వినియోగం కాకుండా చూడడంతో పాటు, అర్హులైన వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయాలన్నదే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వివరించారు. నిర్ణీత గడువులోపు ఈకేవైసీ చేయించుకోని వినియోగదారుల గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. సిలిండర్ సరఫరా కోసం ఇంటి వద్దకు వచ్చే డెలివరీ బాయ్స్ ద్వారా కూడా బయోమెట్రిక్ యంత్రాల సహాయంతో సులభంగా ఈకేవైసీ చేయించుకోవచ్చని వెల్లడించారు. రోయింగ్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చిత్తూరు కలెక్టరేట్: జాతీయ స్థాయి రోయింగ్ పోటీలలో జీడీ నెల్లూరు మండలం పాచిగుంటకు చెందిన తనీ ష్ స్వర్ణ పతకం సాధించారు. 14 ఏళ్ల తనీష్ పూణే లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఖడ్కీ)లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రవీంద్ర సరోబర్ లేక్లో 27వ సబ్–జూనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్షిప్ పోటీలు పెట్టారు. ఇందులో తనీష్ బృందం మణిపూర్ బృందంపై గెలిచి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. -
డయల్ యువర్ సీఎండీకి 58 వినతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 9 జిల్లాల నుంచి 58 వినతులు అందినట్లు సంస్థ సంస్థ డైరెక్టర్ పి.అయూబ్ఖాన్ తెలిపారు. విద్యుత్ వ్యవసాయ సర్వీసుల మంజూరు, విద్యుత్ స్తంభాల మార్పు, వోల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, 1912, 1800 425 155333 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయవచ్చని, 91333 31912 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు తెలియజేయ వచ్చని సూచించారు. డైరెక్టర్లు కె.గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సీహెచ్.రామచంద్రరావు, కె.సంపత్కుమార్, ఎస్.రమణ పాల్గొన్నారు. -
నాటుకుంటున్న నేర సామ్రాజ్యం!
చిత్తూరు అర్బన్: జిల్లాలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. నాటు తుపాకుల మోత మోగుతోంది. సొంతంగా నాటు బాంబులు తయారు చేస్తూ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మనుషులను సైతం చంపేస్తున్నారు. దీన్ని ఆదిలోనే తుంచేయకపోతే పోలీసులకు కొరకరానికొయ్యగా మారడం ఖాయం. చిల్లర కొట్టులో దొరికినట్టు జిల్లాలో చిత్తూరు దాటుకున్న తరువాత బంగారుపాళ్యం, మొగిలి, పలమనేరు, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ వేల హెక్టార్లలో కౌండిన్య అడవులు ఉండడంతో ఇక్కడి వన్యప్రాణులను వేటాడడానికి నాటు తుపాకులు విరివిగా ఉపయోగిస్తున్నారు. సొంతంగా తయారు చేసుకునేవాళ్లు కొందరైతే, ఉత్తరాధి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు రహస్యంగా తెప్పించుకుంటున్న వాళ్లు మరికొందరు. ఎటుచేరి ఈ నాటు తుపాకులు అడవి జంతువులతో పాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం పెద్దపంజాణి మండలం, మారెప్పపల్లెలో మేకల శ్రీనివాసులు నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు, అరెస్టు చేయడానికి చర్యలు చేపట్టారు. పోలీసులు నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. బాంబుల మోత చిత్తూరులో మూడు రోజుల క్రితం ఓ ఇంటి కాపలాదారుడిని హత్య చేసిన ముఠా.. నాటు బాంబు విసిరి, ఇంటి కిటికీలు ధ్వంసంచేసి దోపిడీకి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికులను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. చోరీలు, దోపిడీలకు వస్తున్న ముఠాలు మనుషుల ప్రాణాలను ఏ మాత్రం లెక్కపెట్టకుండా నాటు బాంబులు విసురుతున్నారంటే.. అది వాళ్ల ధైర్యమా..? పోలీసుల నిఘా వైఫల్యమా..? అర్థం కావడం లేదు. ప్రశాంతతకు మారుపేరైన చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు, నాటు బాంబుల వాడకం క్రమంగా పెరుగు తుండడం నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంగా భావించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దపంజాణిలో హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీ చిత్తూరులో నాటు బాంబు వేయడంతో ధ్వంసమైన ఇల్లు నిఘా ఏమైనట్టు? పల్లెల్లో ఎవరెవరి వద్ద నాటు తుపాకులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలంటే అది పెద్ద పనేమీ కాదు. ఊర్లో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, ఆయా స్టేషన్లో ఉద్యోగాలు చేసే పోలీసులకు మాత్రం నాటు తుపాకులు ఎవరి వద్ద ఉన్నాయి? బాంబులు ఎవరు చుడుతున్నారు..? అనే సమాచారం లేకపోవడం నమ్మశక్యంగా లేదు. లేకుంటే ఆయా నిఘా సంస్థలు సరిగా పనిచేయడంలేదనే చెప్పాలి. నేరం జరిగిన తరువాత తీరిగ్గా మాత్రం పోలీసులు వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ చెబుతున్నారు. జిల్లా పోలీసు బాసు కల్పించుకుని ప్రత్యేక డ్రైవ్ లాంటివి నిర్వహిస్తే తప్ప, ఈ నాటు విష సంస్కృతికి తెరపడేలా కనిపించడం లేదు. -
చేయి తడపందే సర్టిఫికెట్ రాదు!
గుడిపాల : గుడిపాల మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇంటిపై లోన్ తీసుకునేందుకు పొజెషన్ సర్టిఫికెట్ కావాలంటే ఏకంగా రూ.20 వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ తతంగం అంతా ఓ వీఆర్వో కనుసన్నల్లోనే సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. మండలంలోని పాపసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ వీర్ఓకు రూ.20 వేలు లంచం ఇచ్చి మరీ పొజెషన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా మండలంలో వందలాది మంది బ్యాంక్ రుణం తీసుకునేందుకు లంచాలు ఇచ్చి పొజెషన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ లాగిన్లన్నీ ప్రైవేట్ వ్యక్తికి గుడిపాల మండలంలో వీఆర్ఓలు, ఆర్ఐలు, తహసీల్దార్కు సంబంధించిన లాగిన్లన్నీ ఓ ప్రైవేట్ వ్యక్తి చేతికి అందినట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వీటన్నింటికీ సూత్రధారి, పాత్రధారి ఆ వీఆర్ఓనే. ఆ వీఆర్ఓ ఏం చెబితే అందుకు తహసీల్దార్ తలూపాల్సిందే. అందుకు తహసీల్దార్ ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు సమాచారం. తహసీల్దార్ ఖర్చు రోజుకు రూ.3 వేలు స్థానిక తహసీల్దార్కు రోజుకు ఖర్చు రూ.3 వేలు అవుతుందని.. ఆ వీఆర్ఓ మిగతా వీఆర్ఓలకు బాహాటంగా చెబుతున్నాడు. రోజూ తిరుపతి నుంచి కారులో తహసీల్దార్ వస్తున్నాడని, ఖర్చు రూ.3 వేలుదాకా అవుతోందని, అందుకు అనుగుణంగా మీరు కుడా వసూళ్లు చేయాలని చెబుతున్నట్టు సమాచారం. కొత్త పాస్ పుస్తకాలు, మ్యుటేషన్స్, పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్లు చేర్చడం వంటి వాటికి రేటును అధనంగా పెంచుకోవాలని మిగతా వీఆర్ఓలకు కూడా సూచిస్తున్నట్టు చర్చ సాగుతోంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తనకు చెప్పాలని ఆయన బాహాటంగానే చెబుతున్నట్టు సమాచారం. రీసర్వే గ్రామాల రైతులకు చుక్కలు గుడిపాల మండలంలో రీసర్వే చేస్తున్న రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. కొంతమంది రైతులకు అనువంశికంగా వస్తున్న భూములకు సంబంధించి పంటలు చేసుకుంటున్నా ఎటువంటి రికార్డులు మాత్రం లేవు. అటువంటి వాటిని గమనించి వేలాది రూపాయలు రైతుల వద్ద నుంచి గుంజుకుంటున్నారు. ఓ రైతు తనవద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేవని, భూమి మాత్రం తనదేనని చెప్పడంతో ఆ రైతును మాయ చేసి అతని వద్ద నుంచి రూ.30వేలు వసూలు చేసినట్టు స్థానికంగా చర్చసాగుతోంది. రికార్డులు మొత్తం తామే చూసుకుంటామని తహసీల్దార్ కార్యాలయానికి రూ.20 వేలు, ఆర్డీఓ కార్యాలయాలనికి రూ.5 వేలు, జేసీ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి రూ.5 వేలు చొప్పున రూ.30 వేలు వసూలు చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా తహసీల్దార్ కార్యాలయం లాగిన్లో పంచాయతీల వారీగా చూస్తూ సంబంధిత వీఆర్వో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు సమాచారం. తహసీల్దార్ డ్రైవర్ ఆ వీఆర్ఓనే గుడిపాల తహసీల్దార్ డ్రైవర్గా ఆ వీఆర్ఓ వ్యవహరిస్తూ కార్యకలాపాలన్నీ చూస్తున్నట్టు తెలుస్తోంది. తానే తహసీల్దార్ డ్రైవర్గా ఉన్నానని.. ఏది ఏమైననా తానే కార్యకలాపాలన్నీ చూసుకుంటూ ఉంటానని చెబుతున్నట్టు తెలుస్తోంది. -
కృషి ఒకరిది.. ప్రచారం మరొకరిది!
పుత్తూరు: మాజీ మంత్రి ఆర్కే రోజా అలుపెరగని పో రాట ఫలితంగా పుత్తూరు పట్టణంలోని శ్రీధర్మరాజుల ఆలయ సమీపంలో రైల్వే అండర్ సబ్వే నిర్మాణానికి రైల్వేశాఖ రూ.2.47 కోట్లు మంజూరు చేసింది. ఫలితంగా గేట్పుత్తూరు వాసులతో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. దశాబ్దాల తమకల నిజమవుతోందని స్థా నికులు రోజమ్మకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు. అయితే దీనిని స్థానిక టీడీపీ నేతలు తమ అధినేత, సీ ఎం చంద్రబాబునాయుడు వారసత్వంగా క్రెడిట్ చోరీ కి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు నవ్వుకొంటున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మాజీ మంత్రి రోజా పోరాట గురుతులు కళ్ల ముందు కనిపిస్తుంటే, తామే సాధించినట్లు స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్ర చారం చేసుకోవడం పట్ల చెవులు కొరుక్కుంటున్నారు. ప్రజల కోసం రోజమ్మ పోరాటం ఇలా.. పుత్తూరు పట్టణాన్ని రెండుగా చీల్చుతూ ఉన్న రైల్వేట్రాక్ను దాటుతూ రోజువారి పనులకు పరుగులు పెట్టే స్థానిక ప్రజలకు భద్రత కల్పించాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా అధికారంలో ఉన్నా లేకున్నా గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 2023 ఆగస్టు 16న నాటి పర్యాటక శాఖ మంత్రి హోదాలో అర్కే రోజా అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలసి అభ్యర్థించారు. గత ఏడాది నవంబర్ 28న తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు మరోదఫా వినతి పత్రం ఇప్పించారు. ఇటీవలే ఢిల్లీలో మరోమారు రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇలా పట్టువదలని విక్రమార్కుడిలా రైల్వే మంత్రి వెంటబడడంతో పుత్తూరులో రైల్వే సబ్వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 29న పుత్తూరుకు వచ్చిన డివిజినల్ రైల్వే మేనేజర్ శైలేంద్రసింగ్ మాజీ మంత్రి రోజాతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోజా అభ్యర్థన మేరకు శ్రీధర్మరాజుల ఆల యం ఎదురు గా రైల్వే సబ్వే నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ఆ మేరకు రైల్వే శాఖ నిదులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
– 11 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం పుత్తూరు: ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి పుత్తూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న గంజాయి ముఠాలోని ఆరుగురుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.67 లక్షల విలువైన 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జి.రవికుమార్ తెలిపారు. డీఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాలు.. విశ్వసనీయ సమాచారంతో సీఐ నెట్టి కంఠయ్య, ఎస్ఐలు నాగేంద్రబాబు, వెంకటలక్ష్మి బృందం పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగ చెరువు సమీపంలో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అరెస్ట్ అయిన వారిలో టీఆర్కండ్రిగ కాలనీకి చెందిన కె.నవీన్కుమార్(36), గేట్పుత్తూరుకు చెందిన వి.జయప్రకాష్(25), ఎం.ఆర్.దేవరాజ్(24), సి.ఎస్.మూర్తి(24), గొల్లపల్లికి చెందిన బి.బాబునాయుడు(50), తాయిమాంబాపురానికి చెందిన రోహిత్(23) ఉన్నారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మోటార్ సైకిళ్లు, 6 సెల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. టీఆర్కండ్రిగ కాలనీకే చెందిన మరో ఇద్దరు నిందితులు రాజేష్, శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. -
గిరిజనులు ఆర్థిక సాధికారత సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన కలెక్టర్కు విద్యార్థులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజనులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను సమీక్షించి భర్తీ కి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతా ల్లో గుర్తించిన ఆరు ప్రధాన రోడ్ల నిర్మాణానికి నిధు లు మంజూరు చేయిస్తామన్నారు. వచ్చే ఆరు నెల ల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,907 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.6.52 కోట్ల విలువైన పథకాలను అందించామన్నారు. ఆర్వోఎఫ్ఆర్లో 22 మంది గిరిజన రైతులకు 19.99 ఎకరాలకు వ్యక్తి గత పట్టాలు, సామాజిక క్లెయిమ్లో 50 మందికి 41 ఎకరాలకు హక్కులు కల్పించామని వివరించారు. అర్హులైన రైతులకు పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఏడాదికి రూ.20 వేల సాయం అందుతోందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని మూడు గిరిజన విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులకు రూ.2.64 కోట్లు, ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.17.7 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ప్రద ర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నా యి. ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, గిరిజన సంఘాల నాయకులు చిరంజీవులు, జీవీ రమణ,రాజశేఖర్, రవినాయక్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మునస్వామి, రాజ్కుమార్, రఘురాం పాల్గొన్నారు. -
● పిల్లల్లో మేధో వికాసానికి దోహదం ● లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ప్రభాకర్రాజు
చదరంగం జీవితానికి ప్రతిబింబం నగరి: చదరంగం క్రీడ మాత్రమే కాదని, అది మనిషి జీవితాన్ని ప్రతిబింబించే మేధో క్రీడ అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, రిటైర్డ్ డిప్యూటీ డీఈవో ప్రభాకర్రాజు తెలిపారు. నగరి మండలంలోని వీకేఆర్పురం గ్రాండ్ వరల్డ్లో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నగరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల చెస్ పోటీల ఫైనల్స్, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో మొత్తం 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో టి.హేమాద్రి, (నగరి), డి.శ్యామ్కుమార్ (శ్రీకాళహస్తి), ఎన్.సహస్ర (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జూనియర్స్ విభా గంలో టీ.చైతన్య (నగరి), సాయిచరణ్ (తిరుపతి), ఆషిక్ ఇల్లాహి (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. అండర్ 9 విభాగంలో పి.పవన్కిరీటిరెడ్డి (తిరుపతి), తేజ సూర్యనారాయణ (నగరి), పీవీఎం.సాత్విక్ (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. సీనియర్స్ విభాగంలో ముగ్గురికి, జూనియర్స్ విభాగంలో 22 మందికి, అండర్–9 విభాగంలో 10 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న మహిళలు, దివ్యాంగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్రాజు మాట్లాడుతూ చదరంగంలో ప్రత్యర్థి వేసే ఎత్తును ముందుగానే ఊహించి తదుపరి అడు గు వేయాలన్నారు. మరో అతిథిగా పాల్గొన్న పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ చదరంగం చిన్నారుల్లో చదువుపై ఏకాగ్రతను పెంచడంతో పాటు, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రతి ఎత్తు ఒక పాఠాన్ని నేర్పుతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గజేంద్ర, డైరెక్టర్లు రవిబాబు, ఆర్ఎన్ దేవన్, చదరంగ నిపుణులు నవీన్కుమార్, జీవన్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్కుమార్, కోశాధికారి శక్తివేలు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లోకి అనుమతించాలి
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాలను, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ డిమాండ్ చేశారు. నగరంలో విద్యార్థి సంఘాలను హాస్టల్స్లోకి అనుమతించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశం, సమావేశాలను నిషేధించడం అత్యంత అప్రజాస్వామికమైన చర్య అన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. నాయకులు శామ్యూల్, రెడ్డిప్రసన్న, రెడ్డెయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం శాంతిపురం: ఆహారంలో చిరుధాన్యాలను పెంచుకొంటూ ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ మిల్లెట్ మ్యాన్, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్వలి చెప్పారు. శాంతిపురంలోని బాలాజీ కల్యాణ మండపంలో ఆదివరం సాయంత్రం జరిగిన చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మిల్లెట్స్ తింటూ జీవన శైలిలో మార్పులతో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జబ్బులను నియంత్రించవచ్చని అన్నారు. మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం వారు ఆహారంగా తీసుకున్న చిరుధాన్యాలలోనే ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుప్పం మిల్లెట్ రివైవల్ ప్రాజెక్టు ద్వారా చిరుధాన్య ఆధారిత నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు పాల్గొన్నారు. అప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తా! జీడీనెల్లూరులో చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి గంగాధర నెల్లూరు : ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్ జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది. -
డీఎస్సీ ర్యాలీపై పచ్చ కుట్రలు
సాక్షి టాస్క్పోర్స్: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ, తప్పులకు నైతిక బాధ్యతగా విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ బాధితులతో కలిసి వైఎస్ఆర్సీపీ నిరసనలకు దిగడం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండు కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 30 యాక్టు పేరుతో అనుమతులు లేవని ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగుతున్న నిరసనను ఇక్కడ కూడా చేపడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరగకుండా చేసేందుకు అకస్మాత్తుగా విజయోత్సవ ర్యాలీకి రూపకల్పన చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 50 మందిని తీసుకురావాలని స్థానిక నాయకులను పురమాయించారు. తమకు కంచుకోటగా టీడీపీ నాయకులు చెప్పుకునే కుప్పం నియోజకవర్గంలోనూ విపక్షానికి పెరుగుతున్న ఆధరణను చూసి అధికార పార్టీ జడుసుకుంటోందా?.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే కనీస హక్కును సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందా ?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. పోలీసుల పచ్చ పాతం నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కుప్పం పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పది రోజుల ముందే పార్టీ ప్రకటించిన ర్యాలీని ఓ వైపు అడ్డుకొంటూ మరో వైపున టీడీపీ మెరుపు ర్యాలీకి మాత్రం పచ్చ కార్పెట్ పరిచారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి మాత్రం ఎవరూ రాకూడదని సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టారు. ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని భావించిన నాయకులకు నేరుగా ఫోన్లు చేసి బెదిరింపులకు పూనుకున్నారు. ఒక్క రోజు ముందుగా తెర మీదికి వచ్చిన టీడీపీ ర్యాలీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా సహకారం అందిస్తున్నారు. ఇరు పార్టీల ర్యాలీలతో కుప్పం నియోజకవర్గంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. -
ఎకై ్సజ్ చేయలేక!
అబ్కారీ మద్య నియంత్రణ శాఖ (ఎకై ్సజ్) పనితీరు ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రతి నెలా మద్యం ప్రియులకు రూ.కోట్ల విలువైన మద్యం తాగిస్తున్న ఎకై ్సజ్ అధికారులకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా రవాణా భత్యం, ఏడాదిగా అద్దె వాహన బిల్లులు మంజూరు చేయలేదు. ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తుంటే ఉద్యోగుల సర్దుబాటు పేరిట.. మరికొందరిని పక్క జిల్లాలకు పంపించే ఏర్పాట్లు జరగుతున్నాయి. పర్యవసనం.. ఈ విభాగంలో ఎకై ్సజ్ చేయలేక అధికారులు–సిబ్బంది నలిగిపోతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత మరోవైపు స్టేషన్లలో సిబ్బంది కొరత ఎకై ్సజ్శాఖను వేధిస్తోంది. ఎనిమిది స్టేషన్లలో ఇప్పటికే దాదాపు 200 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన నియామకాలు తప్ప.. మళ్లీ ఇప్పటి వరకు ఎకై ్సజ్ శాఖలో ఖాళీల భర్తీకి నోచుకోలేదు. ఇక ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో జిల్లాలో ఉన్న 130 మందికి పైగా సిబ్బందిని ఇతర జిల్లాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఎకై ్సజ్ పరిపాలన పూర్తిగా నిర్వీర్యం కావడం ఖాయం. చిత్తూరులోని ఎకై ్సజ్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఓవైపు ఊరూరా బెల్టు దుకాణాలు.. అక్రమ మద్యం చిత్తూరు అర్బన్: జిల్లాలో చిత్తూరు అర్బన్, చిత్తూ రు రూరల్, కార్వేటినగరం, నగరి, పుంగనూరు (నాలుగు మండలాలు), పలమనేరు, కుప్పం, పులిచెర్ల (మూడు మండలాలు)ల్లో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 31 మండలాల పరిధిలో ప్రభుత్వం విధించే ప్రతి నెలా లక్ష్యాన్ని ఎకై ్సజ్ అధికారులు చేరుకోవాల్సిందే. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు. నెలకు దాదాపు రూ.50 కోట్ల విలువైన మద్యాన్ని తాగించడంలో లక్ష్యాలు కేటాయిచి మరీ ప్రభుత్వం, అధికారులకు బాధ్యతలను అప్పగిస్తోంది. వీటిని వంద శాతం అమలు చేయాల్సిందే. ఇక పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా చేయడం, నాటు సారా నియంత్రించడం, బెల్టు దుకాణాలు ఉండకుండా చేయాలనే విధులు సైతం అబ్కారీ శాఖ చూస్తోంది. బిల్లులు ఇవ్వరా? జిల్లాలోని ఎనిమిది అబ్కారీ శాఖ పోలీస్ స్టేషన్లతో పాటు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ పేరిట ఉన్న రెండు విభాగాలు తప్పనిసరిగా గ్రామాల్లో ప్రతి రోజూ తిరగాల్సిందే. నాటు సారా తయారీని నిర్మూలించడంతో పాటు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)ను అరికట్టడానికి స్టేషన్ ఎస్హెచ్వోలకు నెలకు రూ.33 వేలు చెల్లించేలా అద్దె జీపులు ఉన్నాయి. కానీ ఏడాదిగా రూపాయి కూడా వాహన అద్దె బిల్లులు విదల్చలేదు. జేబులో ఉన్న డబ్బులు పెట్టుకుని ఇంధనం నింపుకున్నా.. ఏళ్ల తరబడిగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఖాకీ దుస్తు లు ధరించిన అధికారుల్లో కొందరు మద్యం వ్యాపారుల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. దాదాపు రూ.5 లక్షల అద్దె వాహన బిల్లులు, రెండేళ్లుగా రవాణా భత్యం ఇవ్వకపోవడంతో రూ.6 లక్షలకు పైగా బకాయిలు పేరుకున్నాయి. -
డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడిచిన తర్వాత ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ, 42 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్కు సంబంధించి దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అధికారుల అలసత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధునాతన ల్యాబ్లు, అర్హత కలిగిన అధ్యాపకులు, నామమాత్రపు ఫీజులే అయినప్పటికీ విద్యార్థుల అడ్మిషన్ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. ఏటా అడ్మిషన్ల సంఖ్య పడిపోతున్నా కళాశాలల అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు ఇంటర్ విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఆకర్షణీయమైన ఆఫర్లతో అడ్మిషన్లు పెంచుకుంటున్నారు., ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సిబ్బంది మాత్రం నామమాత్రంగా ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. తీరు మారుతుందా..? ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రూ.లక్షల వేతనాలు పొందుతున్న ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కనీస మాత్రం అడ్మిషన్ల ప్రక్రియను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వారు తీరు మార్చుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కావాల్సిన సర్టిఫికెట్లు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ దరఖాస్తుకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు,6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ కింద అయితే పీహెచ్, ఎన్సీ సీ, స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. షెడ్యూల్ వివరాలు ఇలా.. అధికారిక వెబ్సైట్ www.oamdcaprche. apcfrr.in వెబ్సైట్లో అడ్మిషన్ దరఖాస్తుకుఅవకాశం కల్పించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 12,13 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల పరిశీలన, ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు, 20వ తేదీన ఆప్షన్ల సవరణ, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 26న సీట్ల కేటాయింపు, 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. -
షాపింగ్ కాంప్లెక్స్ గదుల కూల్చివేత
పుత్తూరు: పట్టణంలోని కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి వద్ద షాపింగ్ కాంప్లెక్స్లోని రెండు గదులను శుక్రవారం రాత్రి కూల్చి వేశారు. దీనిపై దేవదాయ శాఖ అధికారులు మా ట్లాడుతూ పుష్కరిణి ముందు సిమెంట్ రోడ్డు, డ్రైనే జీ నిర్మాణం కోసం ఒక గదిని తొలగించాలనుకున్నామని, దీనిపై మరో గది ఉండడంతో రెండింటినీ పడగొట్టామని వెల్లడించారు. పైగా షాపింగ్ కాంప్లెక్స్ ఆర్అండ్బీ స్థలంలో ఉందని తెలిపారు. వాస్తవం ఏమిటంటే..! కామాక్షీ సమేత సదాశివేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా పట్టణ నడిబొడ్డున కోనేరు (పుష్కరిణి) ఉంది. దీనికి నాలుగు వైపులా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. 2006లో అప్పటి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు కోనేరుతో పాటు వ్యాపార సముదాయాలను తొలగింపునకు చర్యలు చేపట్టారు. 2016లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. కోనేరును పునర్నిర్మించాలని 2023లో అప్పటి మంత్రి ఆర్కే రోజా పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం దేవదాయ శాఖ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించారు. రూ.5 లక్షల విరాళాలను సేకరించారు. మొత్తం నిధులతో పుష్కరిణి నిర్మాణ పనులను నాటి మంత్రి రోజా ప్రారంభించారు. అలాగే గతంలో వ్యాపా ర గదులు పోగొట్టుకున్న వారి కోసం కోనేరు చుట్టూ ఎల్ షేప్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రూ.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు. దీనికి పలువురు ముందుకు రావడంతో జీప్లస్ వన్తో మొత్తం 40 గదులకు పనులు పెరిగాయి. పుష్కరిణితో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టు ద్వారా స్టే తెచ్చి పనులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా పుష్కరిణి పనులు పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పేరిట షాపింగ్ కాంప్లెక్స్లోని గదులను కూల్చి వేశారు. నిర్మాణాలు చేపట్టలేరు కానీ, కూల్చడానికి మాత్రం సిద్ధం ఉంటారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. -
ఉపాధికి ఉచిత శిక్షణ
చంద్రగిరి : గ్రామీణ ప్రాంతాల పురుషులకు చంద్రగిరిలో ఈ నెల 13వ తేదీ నుంచి 14 రోజుల పాటు సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్పై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పురుషులు శిక్షణకు అర్హులని వెల్లడించారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్కి ఉచిత భోజనంతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ ధ్రువీకరణపత్రం జిరాక్స్లతోపాటు 4 పాస్దృవీకరణ పత్రం జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లతో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆక్రమణపై ఆవేదన చిత్తూరు రూరల్ (కాణిపాకం): మా ప్రభుత్వం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన గాయత్రి ఆరోపించారు. శనివారం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడుతూ తమ స్థలం ఆక్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన దీనయ్య, మంజుల, హేమావతి, రాజేశ్వరి, మోహన్ కబ్జా చేశారని వాపోయారు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని కులం పేరుతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆక్రమణదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
సచివాలయంలో చోరీ
గుడిపాల : మండలంలోని వసంతాపురం సచివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సచివాలయం తలుపులు పగులగొట్టి రెండు సీసీ కెమెరాలను అపహరించారు. దీంతో మూడు బీరువాలను తెరిచి రికార్డులను చెల్లా చెదురు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఎదుటే ఉన్న చికెన్ సెంటర్కు వెళ్లి మూడు లింగాపురం కోళ్లతో పాటు సిలిండర్ను చోరీ చేశారు. ఇదే సచివాలయంలో 2026 ఫిబ్రవరి 10వ తేదీన ప్రింటర్లను అపహరించారు. సమీపంలోని మహాభారతం గుడి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అయితే అక్కడ ఏమీ లేకపోవడంతో వెళ్లిపోయారు. పోలీస్స్టేషన్ దగ్గరే వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం సెలవు రోజు కావడంతో వేకువ నుంచే పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలు కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ అధికారులు, పోలీ సులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కత్తితో దాడిపై కేసు నమోదు గంగవరం : మండలంలోని బొమ్మనపల్లెలో కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. గ్రామానికి చెందిన గట్టప్ప, ముని వెంకటప్పకు మధ్య వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిని పోలీసులు మందలించి పంపించారు. దీనిపై కక్ష పెంచుకున్న గట్టప్ప శుక్రవారం రాత్రి మునివెంకటప్ప(63)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో మునివెంకటప్ప తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాల్లో చోరీ కుప్పం : మండలంలోని గోనుగూరు, పరమసముద్రం, పలార్లపల్లెలోని ఆలయాల్లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పరమసముద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో హుండీ పగులగొట్టి 4 కేజీల వెండి 10 గ్రాముల బంగారు నగలు అపహరించినట్లు పూజారి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు ఆలయాల్లో ఏం చోరీ చేశారో తెలియాల్సి ఉంది. గంజాయి ముఠా అరెస్ట్ పుత్తూరు: పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షుడు రఘురామ్ నాయుడు వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొత్తం 21 పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. సంఘం అధ్యక్షుడిగా శివయ్య, కార్యదర్శిగా నరేష్బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా దేవకుమార్, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, గౌరీశంకర్, గిరిధర్రెడ్డి, వివేక్, కుమార్స్వామియాదవ్, వరలక్ష్మీదేవి, వేణుగోపాలరావు, ధరణికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోహన్, జాయింట్ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్, బాలు విజయ్కుమార్, కిషోర్, ఉమా, రుక్మాంద, భాను ప్రసాద్, ప్రమీల, అనిత, వెంకట చలపతి ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. -
నవ్విపోదురుగాక..!
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు పబ్లిసిటీ పిచ్చి పీక్కు చేరుకుంది. తన సామాజిక మాధ్యమాల్లో స్వయానా ఎమ్మెల్యేనే ఓ పోస్టు పెట్టారు. ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలను తెలియచేస్తూ.. తన ఫొటో అందులో వేసుకున్నారు. 1,538 ఖాళీలు ఎస్బీఐలో ఉన్నట్లు పేర్కొంటూ ఎమ్మెల్యే తన ఫొటో వేసుకోవడంపై జనం నవ్వుకుంటున్నారు. బ్యాంకు ఇచ్చిన నోటిఫికేషన్ను ఎమ్మెల్యే తన ఖాతాలోకి వేసుకుంటూ.. ఇది కూడా కూటమి ప్రభుత్వ విజయంగా చెబుతున్నారా..? అందుకే తన ఫొటో వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారా..? అంటూ పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. – చిత్తూరు అర్బన్ -
తిరుమలలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్కు అవమానం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో దళితులపై దాడులతో చెలరేగిపోతున్న చంద్రబాబు సర్కారు చివరికి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా పట్ల కూడా వివక్ష చూపించి, అవమానించిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వంటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తికి కూడా టీటీడీ అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదని, ప్రొటోకాల్ పాటించలేదని చెప్పారు. చైర్మన్ను ఎక్కడో చివరకు నెట్టేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీల పట్ల వివక్షకు ఇంతకంటే నిదర్శనం ఉండదన్నారు. టీటీడీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తీవ్ర విక్షకు గురవుతున్నారని మండిపడ్డారు. వారికి పదోన్నతులు సక్రమంగా ఇవ్వడంలేదని, చిన్న వ్యాపార అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పదోన్నతుల జాబితాను పరిశీలిస్తే వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పది వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ఉద్యోగులపై అదనపు పని భారం మోపుతున్నారని తెలిపారు. టీటీడీలో జరిగే సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులను ఆహ్వానించడంలేదన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. -
లక్ష్మణస్వామి వర్మ సేవలు చిరస్మరణీయం
చిత్తూరు కలెక్టరేట్ : సమాజ శ్రేయస్సుకు, ఆయుర్వేద రంగానికి లక్ష్మణస్వామి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని డీఆర్వో మోహన్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సామాజికవర్గం పురోగతికి, పేదల అభ్యున్నతికి లక్ష్మణస్వామి వర్మ విశేష కృషిచేశారని కొనియాడారు. ఆయన అగ్నికుల వీర సంప్రదాయానికి నిజమైన వారసుడని చెప్పారు. గొప్ప సమాజ సంస్కర్త అని ప్రశంసించారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించి, ఆ సామాజిక వర్గాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన పోరాట ఫలితంగానే 1927లో జీవో 271 తో అగ్నికుల క్షత్రియులుగా ప్రభుత్వ అధికారిక గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. కేవలం సామాజిక సేవకే పరిమితం కాకుండా, ఆయుర్వేద వైద్య రంగంలోనూ ఆయన అపార సేవలు అందించారని తెలిపారు. దాదాపు 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశవిదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, ఉదయ్, ప్రదీప్, సుధాకర్ పాల్గొన్నారు. -
పది ఫలితాల్లో అగ్రస్థానమే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలని డీఈవో లక్ష్మీనారాయణ ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో తక్కువ పురోగతి సాధించిన 75 పాఠశాలల ప్రధానోపాధ్యాయుల తో శుక్రవారం చర్చావేదిక నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను మొద లుపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గతంలో తక్కువ ఫలితాలు సాధించిన 75 పాఠశాలల్లో 100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలకు ఎలాంటి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి, బోధనా పద్ధతుల్లో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశాలపై సుదీర్ఘంగా, క్షు ణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. అకడమిక్ పరంగా పూర్తి మద్దతు ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ పరంగా పూర్తి మద్దతు తన నుంచి ఉంటుందని డీఈవో అన్నారు. గత ఏడాదిలో నమోదైన స్వల్ప ఫలితాలు ఈసారి ఏమాత్రం పునరావృత్తం కాకుండా ప్రతి పాఠశాల హెచ్ఎం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పదవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని విడివిడిగా అంచనా వేస్తూ వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో 75 పాఠశాలల్లోని సబ్జెక్ట్ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగితాలకే పరిమితం కాకూడదు ప్రధానోపాధ్యాయులు ప్రణాళికలను కాగితాలకే పరిమితం చేయకుండా వాటిని కచ్చి తంగా అమలు చేయాలని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠ శాలకు వచ్చేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయు లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సబ్జెక్ట్ టీచర్ బాధ్యతాయుతంగా పది మంది వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్చావేదికలో డీవైఈవో ఇందిరా, డీసీఈబీ సెక్రటరీ హేమాద్రి, ఎంఈవోలు హసన్బాషా, రమేష్, ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు అరుణ్కుమార్, బాలచైతన్య, తదితరులు పాల్గొన్నారు. చర్చావేదికలో మాట్లాడుతున్న డీఈవో లక్ష్మీనారాయణ, హాజరైన తక్కువ పురోగతి సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు -
యువకుడి కిడ్నాప్
పలమనేరు: ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన శుక్రవారం పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ నడిమి కల్లాడుకు చెందిన సంతోష్రెడ్డికి కుప్పం నియోజకవర్గంగుడుపల్లి మండలం చామనేరుకు చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి అన్న తన స్నేహితులతో కలిసి సంతోష్రెడ్డిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కుప్పం సమీపంలోని పీఈఎస్ ఆస్పత్రి వద్ద దాడి చేసినట్టు తెలిసింది. దీంతో బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు కేడీసీ విద్యార్థులు కుప్పంరూరల్: ఈ నెల 11 నుంచి 13 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ డి.సుధారాణి తెలిపారు. కళాశాలలో చదువుతున్న అర్చన హైజంప్, లాంగ్ జంప్, కె.దర్శిని 100, 400 మీటర్ల పరుగు పందెంలో, జి. సుచిత్ర 100, 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొననున్నట్లు చెప్పారు. అలాగే ఆర్.చందన షాట్ పుట్, డిస్క్త్రో, నందిని లాంగ్ జంప్, ఎస్.సురక్ష షాట్పుట్, జి.ఎస్.మౌనిష్ జావెలిన్ త్రో, షాట్ పుట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సుధారాణి తెలిపారు. విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ను కళాశాల వైస్ చైర్మన్ సాగర్రాజ్ అభినందించారు. -
గుట్టలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగర శివారులోని పూనేపల్లి మంగలోళ్ల గుట్టలో శుక్రవారం ఒక గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో సంఘటన దాదాపు 10 రోజుల క్రితం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో చిత్తూరు తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమా ర్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. టీషర్ట్పై ఆధారాలు.. తమిళనాడు వ్యక్తిగా అనుమానం మృతుడు ధరించిన స్పోట్స్ టీషర్ట్ వెనుక భాగంలో రాజేష్ అనే పేరుతో పా టు 888 అనే నంబర్ ముద్రించి ఉంది. ఈ ఆధారాల బట్టి మృతు డు పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు మృతుడి పూర్తి వివరాల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు. ఎద్దులగట్టులో బీహార్ వాసి మృతి రామకుప్పం(శాంతిపురం): రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీలోని ఎద్దులగట్టు గ్రామంలో బీహార్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. బీహార్కు చెందిన కిశోర్ గత తొమ్మిది సంవత్సరాలుగా స్థానికంగా ఓ సెంట్రింగ్ మేసీ్త్ర వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న కిషోర్ను గమనించిన యజమాని ఆస్పత్రికి తరలిస్తుంటే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి అతిగా మద్యం సేవించడం వల్లే ఈ మరణం సంభవించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒంటరిగా ఉన్న కిశోర్ చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఎవరికీ తెలియకపోవటంతో ఎద్దులగట్టు వద్దే అతని మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అందరి సూచనలతో ఆలయ అభివృద్ధి కుప్పం: శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయాన్ని భక్తులు, ప్రజలు, అర్చకులు, వేద పండితులు సూచనలు, సలహాల మేరకు అభివృద్ధి చేస్తామని ఆలయ ఈఏ రమణ శుక్రవారం తెలిపారు. గంగమ్మ దేవాలయంలో రాజకీయం అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిచాంరు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజకీయం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఆలయ పునః నిర్మాణం, గర్భగుడి అభివృద్ధి, ఏదైనా ప్రధాన మార్పులకు సంబంధించి అందరి సలహాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గర్భగుడి మార్పునకు సంబంధిం ఏలాంటి ప్లాన్లు దేవాదాయ శాఖ ఆమోదం పొందలేదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కోడిపందేల స్థావరంపై దాడి – ముగ్గురు అరెస్ట్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండల పరిధిలోని తుమ్మింద గ్రామ సమీప గుట్టల్లో శుక్రవారం నిర్వహించిన కోడిపందేల స్థావరంపై తాలూకా పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ముగ్గురు పందెంరాయుళ్లను అరెస్ట్చేయగా, పలువురు పారిపోయారు. పోలీసుల కథనం మేరకు.. తుమ్మింద గ్రామ సమీపంలోని గుట్టల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో తాలూకా పోలీసులు స్థావరంపై మెరుపు దాడులుచేశారు. ఈ దాడిలో తమిళనాడులోని కళ్లత్తూరుకు చెందిన రామచంద్రన్, బంగారుపాళ్యానికి చెందిన ఏకాంబరం, మాపాక్షికి చెందిన హేమచంద్రన్ పట్టుబడ్డారు. పందెం స్థావరం వద్ద నుంచి నాలుగు పందెం కోళ్లు, రూ.4,200 నగదుతో పాటు పందెంరాయుళ్లకు చెందిన 24 ద్విచక్రవాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో జరిగే పందెల కోసం చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యంతో పాటు తమిళనాడు నుంచి అధికంగా తరలివస్తున్నట్లు సమాచారం. పరారైన మిగిలిన పందెం రాయుళ్ల కోసం చర్యలు చేపట్టినట్లు తాలూకా ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో బీఎన్ఆర్పేట ఎస్ఐ మణికంఠేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీఆర్వో మోహన్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే చేనేత కళను కాపాడుతూ, ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత అని కొనియాడారు. ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే ఒక తరం నుంచి మరొక తరానికి ఈ నైపుణ్యాలు అందుతూ వస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని కార్వేటినగరం, నగరి, పెనుమూరు తదితర మండలాల్లో అనేక కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. యువత వారానికి ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరిస్తే నేతన్నలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేనేత రంగంను ప్రోత్సహిస్తూ నేతన్న సేవలో పథకంలో ఒక్కొక్క కుటుంబానికి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. జిల్లాలో 252 మందికి ప్రయోజనం అందుతోందన్నారు. జిల్లాలో 1,223 మంది చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చేనేత ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో చేనేత వస్త్ర ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ శాఖ అధికారి శైలజారాణి, నాయకులు కుప్పయ్యశెట్టి, షణ్ముగ వర్మ, బాలాజీ, కేశవులు శెట్టి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న డీఆర్వో మోహన్ కుమార్ , చేనేత కార్మికుడిని సత్కరిస్తున్న డీఆర్వో మోహన్కుమార్ -
డైయింగ్ యూనిట్ల పరిశీలనకు అధికారి
నగరి : డైయింగ్ యూనిట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించేందుకు సాంకేతిక అధికారిని నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో డైయింగ్ యూనిట్ల యజమానులు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి డైయింగ్ యూనిట్ను పరిశీలించేందుకు తమిళనాడు నుంచి సాంకేతిక నిపుణుడిని రప్పించి నియమించడం జరిగిందన్నారు. ఇప్పటికే అతను నాలుగు డైయింగ్ యూనిట్లు పరిశీలించి అవంతా పద్ధతి ప్రకారం నడవడం లేదని గుర్తించినట్టు తెలిపారు. డైయింగ్ యూనిట్ల వారికి అవగాహన కూడా కల్పించాల్సి ఉందని సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ ఇటీవల సక్రమంగా లేవని అధికారులే గుర్తించి కొన్ని డైయింగ్ యూనిట్లను మూసివేశారన్నారు. అయితే అవి ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని, మూయడానికి కారణాలు చెప్పే అధికారులు ఏ కారణాలతో మళ్లీ ఆ యూనిట్లు నిర్వహణలోకి వస్తాయో చెప్పడం లేదన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధిత నిపుణులు వచ్చి పరిశీలించినవే మళ్లీ తెరచుకుంటుంటే తమిళనాడు నిపుణుడు సక్రమంగా లేదని సూచించినా ఫలితం ఎక్కడ ఉంటుందన్నారు. సాంకేతిక అధికారి తప్పిదం కనుగొంటే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరలో డైయింగ్ యూనిట్లను ఊరికి దూరంగా పంపాలనదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని సూచించారు. ఈ కార్యక్రమంలో డైయింగ్ యూనిట్లు యజమానులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇకపై 125 రోజుల వేతన ఉపాధి
చిత్తూరు కలెక్టరేట్ : వికసిత్ భారత్జీ రామ్జీ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల ఉపాధి కల్పించనున్నట్లు డ్వామా పీడీ రవికుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డ్వామా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధిని సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామానికి ఎంతగానో ఉపయోగపడే చెరువుల పూడిక తీత, రహదారుల నిర్మాణం, పంట కాలువల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ నిర్మా ణాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పథకం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామసభల నిర్వహించి ఆ సమాచారంతో సరైన నిర్ణయాలు తీసుకునేలా స్థానిక వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. సామాజిక తనిఖీలతో పారదర్శకత, జవాబుదారీతనం ప్రజా భాగస్వామ్యంతో సమర్థవంతమైన పాలన అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గ్రామాల పురోగతికి అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన సదస్సులో ఏపీడీ సునీల్ కుమార్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు సంక్షేమ పెట్రోలు బంకుకు భూమి పూజ
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయనున్న ఐవోసీఎల్ పెట్రోలు బంకుకు సంబంధించి శుక్రవారం అధికారులు భూమి పూజచేశారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేయనున్న పెట్రోలు బంకుకు చిత్తూరు నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్రాజు భూమి పూజచేశారు. త్వరలోనే పనులు ప్రారంభించి, ఇంధన విక్రయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాష, డీటీసీ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి, ఆర్ఐ వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బంగారం మాయలు
చిత్తూరు డీసీసీబీ బ్రాంచ్లో వెలుగుచూసిన బంగారు మాయజాలం తీవ్ర కలకలం రేపింది. కనీస నాణ్యత లేని బంగారాన్ని అసలైనదిగా చిత్రీకరించి ఏకంగా రూ.52 లక్షల మేర రుణాలు మంజూరు చేశారు. ప్రాథమిక విచారణలో ఈ దగా రుజువు కావడంతో బ్రాంచ్ చీఫ్ మేనేజర్ను సస్పెండ్ చేశారు. దీనికి సహకరించిన తాత్కాలిక నగల అప్రైజర్ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. బయటపడిన సంఘటనలు చిత్తూరుతో పాటు కార్వేటినగరం మాత్రమేనని, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఉమ్మడి జిల్లాలోని పలు సొసైటీల్లో లోతుగా తనిఖీలు చేపడితే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావడం ఖాయమని శాఖలోని పలువురు ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై డీసీసీబీ సీఈఓ శంకర్బాబును విరణ కోరగా.. శాఖ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని, అవకతవకలకు పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. -
నిరసన
నిరాహార చిత్తూరు కార్పొరేషన్: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం యువతను నమ్మించి, మోసం చేసిన ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహారదీక్షకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమ న కరుణాకరరెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కూడా వారిద్దరూ హాజరై సంఘీభావం తెలిపారు. పెద్దిరెడ్డి మా ట్లాడుతూ 16వేల డీఎస్సీ ఉద్యోగాలను టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టి, పేద బిడ్డల జీవితాలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంటే చంద్రబాబు, లోకేష్ మాత్రం సమాధానం చెప్పకుండా తిరుగుతు న్నారని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామమని స్పష్టం చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రెండో రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరహారదీక్షలకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికుతున్నారు. యాదమరి శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ కుప్పంలో నిర్వహించిన రిలే దీక్షలో ఎమ్మెల్సీ భరత్, పార్టీ నాయకులు -
ఆడికృత్తిక ఉత్సవాలు
జనంతో నిండిన గుడివంక కుప్పం: మూడు రాష్ట్రాల కూడిలి.. పశ్చిమ నదీ ప్రవాహం ప్రాతం గుడుపల్లె మండలంలోని గుడివంకలో వెలసిన శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం భక్తులు కావుళ్లు చెల్లింపునకు భారీ సంఖ్యలో తరలిరావడంతో గుడింవంక కొండ ప్రాతంలో జనసందోహం కిక్కిరింది. హారోం హర.. నామస్మరణ సుబ్రమణ్యస్వామి భక్తులు కావుళ్లు తీసుకుని గుడివంక ఆలయంలో వేల్ మురుగనికి హరోం హరా.. నామ సర్మరణతో మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులు కావళ్లతో పాటు ఎస్కార్ట్ వాహనంలో వీపునకు కొక్కీలు తగలించుకుని గాలిలో విన్యాసాలు చేస్తూ హరోం హరా.. నామాన్ని స్మరిస్తూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా వీపునకు కొక్కీలు వేసుకుని రథం, రాగుల గుండు, తేరు లాక్కుని కొండెక్కి వచ్చి మొక్కులు చెల్లించారు. పంబ వాయిద్యాల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ వచ్చారు. కొండ కింద ఉన్న కోనేరులో స్థానాలు చేసుకుని కావుళ్ళు తీసుకుని కొండెక్కి భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారు. కిక్కిరిసిన జనం గుడివంక కొండకు ఉన్న నాలుగు వైపు రోడ్లలో భక్త జనంతో కిక్కిరింసింది. భక్తులు నడవడానికి సైతం ఇబ్బందిగా మారింది. వాహనాలు పార్కింగ్ సరైన స్థలం లేకపోవడంతో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడంలో తీవ్రమైనా ట్రాఫిక్ సమస్యల నెల కోనింది. భక్తుల విన్యాసాలురాగుల గుండును లాక్కెళుతున్న భక్తుడు -
ఆదివాసీలు దేశానికి మూలవాసులు
గుడిపాల: ఆదివాసీలు దేశానికి మూలవాసులని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుడిపాల మండలంలోని కనకనేరి ఎస్టీ కాలనీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ అటవీ హక్కు చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, విద్యాహక్కు, మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన చట్టాలు, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, న్యాయసేవలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విస్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండక ముందు వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు రూపొందించిన పోక్సో చట్టం గురించి వివరిస్తూ, పిల్లల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని వాటికి దూరంగా ఉండేలా పిల్లలను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సిద్ధార్ధ్, ఏవో వేణు, డెప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, ఎస్ఐ రామ్మోహన్, న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
చెలరేగిన మల్లికార్జున
అనంతపురం: అనంతపురం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లో బౌలర్ మల్లికార్జున రాణించారు. గురువారం ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం, చిత్తూ రు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తేజారెడ్డి (54), మాధవరాయుడు (44) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 13.4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ దీపక్ 17 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులు సాధించింది. కాగా, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన వైఎస్సార్ కడప జట్టు 75.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. జట్టులోని వాసుదేవరాజు అద్భుతమైన ఆట తీరుతో 151 పరుగులు సాధించాడు. వర్షం మొదలు కావడంతో ఆటను నిలిపి వేశారు. మల్లికార్జునవాసుదేవరాజు -
9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసంఘాల సభ్యులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. టైరు మారుస్తుండగా గుండెపోటు! – టెంపో డ్రైవర్ మృతి బంగారుపాళెం: బంగారుపాళెం మండలంలోని కేజీ సత్రం వద్ద గురు వారం జాతీయ రహదారిపై గుండెపోటుకు గురై టెంపో డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు పట్ట ణం మిట్టూరుకు చెందిన రాజేంద్ర(60) టెంపో వాహనంలో పలమనేరు నుంచి చిత్తూరుకు వెళుతున్నాడు. కేజీ సత్రం వద్ద టైర్ పంక్చర్ అయ్యింది. టైరు మార్చేందుకు జాకీరాడ్ను తిప్పుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను టైంపో కింద పడిపోయాడు. స్థానికులు గుర్తించి అక్కడికి వెళ్లే సరికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశించారు. గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవ సన్నాహాలపై సమీక్షించారు. టీటీడీ జేఈఓ శరత్, సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు ఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్లను పంపిణీ చేయాలని కోరారు. విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధానంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్రంగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళా బృందాలు వస్తున్నాయని వెల్లడించారు. టీటీడీ ఇన్చార్జి సీఈ మనోహరం, డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, భాస్కర్, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, డీఎఫ్ఓ ఫణి కుమార్ నాయుడు, ఏఎస్పీ రామకృష్ణ, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు. -
రాజకీయం
గంగమ్మ ఆలయంలో కుప్పం : కుప్పం ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంపై కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4.5 కోట్లతో గర్భగుడిని నిర్మించారు. ఈ ఏడాది జాతరను సైతం ఘనంగా నిర్వహించారు. ఆలయం సుందరంగా ఉండడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన కూటమి నేతలు రాజకీయం మొద లు పెట్టారు. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను తొలగించి మరమ్మతులు చేపట్టారు. తాజాగా గర్భగుడిని తొలగించి మళ్లీ నిర్మించాలని పాలక వర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ స్తపతితో కలిసి మార్కింగ్ కూడా వేయించారు. దీనికి ఆలయ అర్చకులు అంగీకరించడం లేదు. అనేక ఏళ్ల క్రితం గర్భగుడిని నిర్మించారని, దాన్ని పడగొట్టి స్థలాన్ని మార్పు చేయడం వల్ల అరిష్టం కలుగుతుందని వా పోతున్నారు. ఆలయంపైనా రాజకీయం చేయడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.4.5 కోట్లతో నిర్మాణం గత ప్రభుత్వం హయాంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం గర్భగుడిని రూ.4.5 కోట్ల పునర్నిర్మించారు. గోడలు, పైకప్పు పడగొట్టి రాతితో కట్టడం చేపట్టారు. అమ్మవారి మూలమూర్తి పీఠాన్ని మార్చకుండా రెండు అడుగులు ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టారు. గర్భగుడి రాతి కట్ట డాలు పూర్తిగానే 2023లో అమ్మవారి జాతర జరిపించారు. అనంతరం గోపురాన్ని కూడా రాతితోనే నిర్మించాలని భావించినా వీలుకాకపోవడంతో ఇటుకలతోనే నిర్మించారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో పెయింటింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా పనులు ఆగిపోయాయి. ప్రహరీ గోడ మరమ్మతులు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి గంగమ్మ ఆలయ ప్రాంగణం చుట్టూ దాతల సహాయంతో పనులు చేపట్టారు. ఆలయం వెనుక ఉన్న నాగులరాళ్లు, రచ్చకు మరమ్మతులు చేపట్టారు. నూతనంగా నాగల రాళ్లు ప్రతిష్టించారు. ప్రస్తుత గంగమ్మ దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత జాతర సమయంలో విశ్వరూప దర్శనం రోడ్డుపైన నిలబడిన భక్తులకు సంపూర్ణంగా అమ్మవారు కనబడుతుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గర్భగుడి స్థలం మార్చాలని నిర్ణయం ప్రస్తుతం తిరుపతి గంగమ్మ దేవాలయం గర్బగుడి స్థలాన్ని మార్చాలని ఆలయ పాలక వర్గం భావిస్తోంది. మూలమూర్తిని ప్రస్తుతమున్న స్థానంలో కాకుండా కొంచెం వెనుకకు జరిపి నూతనంగా గర్భగుడిని నిర్మించాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 115 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి పీఠం, గర్భగుడిని మార్చేందకు విజయవాడ నుంచి స్తపతిని పిలిపించి మార్కింగ్ వేయించారు. మూడే ళ్ల క్రితం రూ.4.5 కోట్లతో నిర్మించిన రాతి కట్టడాలను కూలదోసి నూతనంగా గర్భగుడి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయ. ఇప్పుడే దేవాలయం అలకారంగా బాగుంది. దీన్ని మళ్లీ నిర్మించే ఉద్దేశం ఏమి టో భక్తులకు అర్థం కాని విషయంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు గంగమ్మ దేవాలయం నిర్మాణంపై సోషల్ మీడియా లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోవద్దని అధికార పక్షం ఒక వైపు, అమ్మవారి పీఠం మారిస్తే అరిష్టమంటూ ఆలయ పూజారుల బృందం మరో వైపు పోస్టులను వైరల్ చేస్తున్నారు. కడా పీడీ ప్రకటన మేరకు అమ్మవారి పీఠం మారిస్తే భక్తుల మనోబావాలు దెబ్బతింటాయనే విధంగా వినతి పత్రాలు ముద్రించి పట్టణంలో పంపిణీ చేస్తున్నారు. -
క్రీడలతో ఒత్తిడి దూరం
తిరుపతి రూరల్ : క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యుత్ ఉద్యోగులకు ఒత్తిడి దూరమవుతుందని, మరింత సమర్థవంతంగా సేవలందించగలరని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించిన 48వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అథ్లెటిక్స్, చెస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. అథ్లెటిక్స్ విభాగంలో తమిళనాడు ఓవరాల్ చాంపియన్గా నిలవగా, కర్ణాటక రెండు, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానాల్లో నిలిచాయి. బ్యాడ్మింటన్లో తమిళనాడు, చెస్లో తెలంగాణ, క్యారమ్స్లో తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు సీఏండీ శివశంకర్, డైరెక్టర్ గురవయ్య ట్రోఫీలు అందజేశారు. స్పోర్ట్స్ కౌన్సిల్కు విశిష్ట సేవలు అందించిన ఎం.కృష్ణారెడ్డి, పురుషోత్తానికి జ్ఞాపిక అందించారు. డైరెక్టర్ కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం.మురళీకుమార్, సీహెచ్ రామచంద్ర రావు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వి.చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ కుమార వడివేలు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చిత్తూరుకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. చిత్తూరుకు చెందిన పి.సాయికృష్ణ, అన్విక శ్రీ పేరిట అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
అక్రమంగా క్వారీ ఆక్రమణ!
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో క్వారీ మాఫియా పంజా విసిరింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువు అక్రమ క్వారీ దందాను సాగిస్తుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలైన క్వారీ నిర్వాహకుడిని బెదిరించి, రూ.3 కోట్లు కప్పం కట్టాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సదరు నిర్వాహకుడు అంత ఇచ్చుకోలేనని తెగేసి చెప్పడంతో ఆ క్వారీని తమ గుప్పిట్లోకి తీసుకుని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు, సొంత పార్టీ నేతలు కోడైకూస్తున్నారు. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయికి వెళ్లిన స్థానిక అధికారులు విచారణ పేరిట కంటితుడుపు చర్యలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగడం లేదంటూ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవ్వడంతో రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి అధికారులు సీక్రెట్గా విచారణ చేస్తున్నట్టు సమాచారం. తుమ్మిందలోనే కాకుండా పెద్దిశెట్టిపల్లి, నాయనిచెరువు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ దందా వ్యవహారం త్వరలోనే టీడీపీ అధిష్టానం వద్దకు చేరనున్నట్లు సమాచారం. అధిష్టానం ముందు పెట్టేందుకు కసరత్తు తుమ్మింద గ్రామంలో ఉన్న క్వారీని ఏడాది క్రితం నిలిపివేశారు. ఇటీవల క్వారీ మళ్లీ ప్రారంభమవుతున్నట్లు తెలిసి ఆ ప్రజాప్రతినిధి బంధువు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. కర్ణాటకకు చెందిన ఆ వ్యాపారి డీల్ను తోసిపుచ్చడంతోపాటు ఏమి చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరినట్లు తెలిసింది. మరోవైపు ఆ వ్యాపారికి కూటమిలోని ఓ వర్గం నేతలు సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో డైరెక్షన్ ఇస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు వస్తోందనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను జోడించి.. అధిష్టానం ముందు పెట్టేందుకు సొంత పార్టీ నేతలే రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. -
కిడ్నీ బాధితుడిని ఆదుకోవాలని వినతి
వి.కోట: మండల కేంద్రమైన వి.కోట గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాటర్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్న తిప్పన్న కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణపాయ స్థితిలో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ మార్పిడి చేయాలని, అందుకు రూ. లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు పేర్కొన్నట్టు కుటుంబ సభ్యులు వాపోయారు. తమ కు అంత ఆర్థిక స్థోమత లేదని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. పాల వ్యాను ఢీకొని వ్యక్తి మృతి గంగవరం: మండలంలోని తిరుమల డెయిరీ సమీపంలో బుధవారం రాత్రి పాలవ్యాను ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు పట్టణంలోని కంసల వీధిలో నివాసం ఉంటున్న సురేష్(37) గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి వద్ద ఉన్న కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. కంపెనీలో పని ముగించుకు ని బుధవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. తిరుమల డెయిరీ సమీపంలో వస్తుండగా పాల వ్యాను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సురేష్ ను పోలీసులు చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు వృద్ధురాలి అప్పగింత పెనుమూరు(కార్వేటినగరం): తప్పిపోయిన వృద్ధురాలిని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మండలంలోని చిప్పారపల్లికి చెందిన టీ.సరోజమ్మ(68) ఈ నెల 2వ తేదీన కనిపించకపోయింది. ఆమె చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ గురువారం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డీపీవో జె.వెంకటనారాయణ పర్యవేక్షణలో చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ సీఐ కె.రామచంద్ర ఆధ్వర్యంలో పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు, వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. పెనుమూరు బస్టాండు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. సరోజమ్మ పెనుమూరు నుంచి చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి కాణిపాకం వెళ్లినట్లు గుర్తించారు. కాణిపా కం శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆమెను పెనుమూరు తీసుకువచ్చారు.విచారణలో ఆమె ఐదు రోజులు స్వామి వారి సన్నిధిలో ఉండి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్టు తెలిపారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్పై ఆకతాయిల దాడి యాదమరి: మండల కేంద్రంలోని ఐఓసీఎల్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. చిత్తూరు నుంచి యాదమరి వైపు పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ వ్యాన్ను ఓవర్టేక్ చేయబోయిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నుంచి కిందపడిపోయారు. తాము కింద పడడానికి బస్సు డ్రైవరే కారణమని ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూల్ వ్యాన్ను అడ్డుకున్నారు. వ్యాన్ అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించారు. బస్సు లోపల ఉన్న చిన్నారులు భయాందోళనకు గురై కేకలు వేశారు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని ఆకతాయిలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మధ్య కాలంలో కొందరు ఆకతాయిలు విద్యార్థులు ప్రయాణించే వాహనాలను వెంబడించడం, వేధించడం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో యాదమరి బస్టాప్ వద్ద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. బస్టాప్ వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొందాం
– ప్రిన్సిపల్ సైంటిస్ట్ రామక్రిష్ణారావు పలమనేరు: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కరు వులో పంటలను కాపాడుకోవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడమే ఉత్తమమని తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్ధానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రామక్రిష్ణారావు తెలిపారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు వ్యవసాయశాఖ బృందం గురువారం పలమనేరు మండలంలోని మొరం గ్రామంలో పర్యటించింది. వేరుశనగ పంటను పరిశీలించింది. ఆయన మాట్లాడుతూ వంద లీటర్ల నీటికి పది లీటర్ల జీవామృతాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. వాడిన పంటలపై యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయడంతో 20 రోజుల పాటు నీటి ఎద్దడి నుంచి పంటను కాపాడుకోచ్చునని తెలిపారు. ఇలాగే వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాగి, సజ్జ, మినుములు, పెసలు, జొన్న లాంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఇందులో కోఆర్డినేటర్ రామాంజినేయులు, స్థాబిక ఏడీ గీతాకుమారి, ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల నుంచి క్రిష్ణారెడ్డి, రాజేష్, కార్తీక్రెడ్డి, స్థానిక ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
గణనాథుని సొమ్ముపై పెత్తనం!
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి భక్తులు సమర్పించుకునే సేవా రుసుములకు దేవాదాయ శాఖ రెక్కలు తొడుగుతోంది. నగదు స్వామివారి ఆలయ ఖాతాలో జమ కాకుండా దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఖాతాకు మళ్లిస్తుండడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనివెనుక ఉన్న అంతర్యమేమిటని భక్తులు, ఆలయ ఉభయదారులు దేవాదాయ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు సాధారణ రోజుల్లో 15 వేల మందికి పైగా, శని, ఆదివారాల్లో 30 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం దర్శనాలు, సేవల టికెట్ల విక్రయాన్ని వాట్సాప్ ఇ–గవర్నెన్స్, మన మిత్ర యాప్ ద్వారా డిజిటలైజ్ చేశారు. ఈ సేవల ద్వారా భక్తులు చెల్లించే సొమ్ము నేరుగా ఆలయ బ్యాంకు ఖాతాకు కాకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఖాతాకు చేరుతోంది. దీనిపై అధికారులు సరైన సమాధానాలు చెప్పడం లేదు. నిధుల ఆగడాలు! భక్తులు తమ మొబైల్స్ నుంచి మన మిత్ర ద్వారా చెల్లించే ప్రతి రూపాయి ముందుగా విజయవాడలోని దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఖాతాకు బదిలీ అవుతోంది. నేరుగా కాణిపాకం ఆలయ ఖాతాకే అనుసంధానించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.. నిధులను వేరే ఖాతాకు మళ్లించడం వెనుక ఉన్న మతలబేంటో అర్థం కావడం లేదు. కమిషనర్ ఖాతాలోకి వెళ్లిన సొమ్ము కొన్ని గంటల తర్వాత గానీ ఆలయ ఖాతాలోకి రావడం లేదని ఆలయ అధికారులే అంగీకరిస్తుండడం గమనార్హం. ఆ కొన్ని గంటల పాటు స్వామివారి నిధులు ఇతరత్రా ప్రయోజనాలు ఎవరికి చేరుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలేశారా? ఏ దేవాలయానికై నా భక్తులు సమర్పించే కానుకలు, రుసుములు అదే క్షణంలో ఆయా దేవస్థాన అధికారిక ఖాతాలో జమ కావాలన్నది ప్రాథమిక నిబంధన. దేవాదాయ శాఖ మాత్రం ఈ నిబంధనలను బేఖాతరు చేస్తోంది. మా స్వామివారికి సమర్పించుకునే రుసుములు కమిషనర్ ఖాతాకు ఎందుకు పోవాలని భక్తులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మన మిత్ర ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా కాణిపాకం ఆలయ ఖాతాలోనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈవో పెంచల కిషోర్ను వివరణ కోరగా.. అనుమానం పడాల్సిన అవరసరం లేదని, ఆ నిధులు 48 గంటల్లో ఆలయ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. -
పే ట్యాక్స్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
చిత్తూరు అర్బన్: ఇటీవల ప్రజలను మోసం చేస్తూ ‘పే ట్యాక్స్’ పేరిట వస్తున్న ఏపీకే ఫైల్స్ ను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవద్దని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో కోరారు. కొందరు సైబర్ నేరగాళ్లు పేట్యాక్స్, ఇన్కం ట్యాక్స్ పెండింగ్, ట్యాక్స్ పెండింగ్, ఈ–వెరిఫికేషన్, పెనాల్టీ నోటీస్ పేరిట తప్పుడు ఎస్ఎంఎస్లు, ఏపీకే ఫైళ్లను షేర్ చేస్తున్నారని తెలిపారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ శాఖల లోగోలు చూసి నగదు చెల్లించొద్దని తెలిపారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే డయల్–1930, డయల్–112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
నేడు జాతీయ చేనేత దినోత్సవం
● చేనేతల కోర్కెల ప్రచార దినోత్సవంగా నిర్వహణ ● రాష్ట్రంలోని 2.79 లక్షల మందిలో తొలుత 93 వేలకు కుదింపు ● నేడు 51,952 మందికి తగ్గించిన వైనం ● 81 వేల మరమగ్గాలను తొలుత 10,534 కుదింపు ● నేడు 7 వేలకు సర్దుబాటు పుత్తూరు: వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. లయబద్దంగా వినబడే మరమగ్గాల ధ్వని వినిపించడం తగ్గిపోతోంది. చేనేతలు చాలీచాలని కూలీలతో రోడ్డున పడుతున్నాయి. మరమగ్గ కార్మికులు సైతం పెరిగిన విద్యుత్ ఛార్జీలను కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలా వరకు మగ్గాలను నిలిపేస్తూ, అయిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో చేనేత కార్మికులను ఆదుకుంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది నేత కార్మికుల సంఖ్యను వేలల్లోకి తగ్గించారు. నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా 93 వేలకు కుదించారు. మరమగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్టు జీఓ 44ను విడుదల చేశారు. తీరా ఉచిత విద్యుత్, నేతన్న సేవా పథకం అమలుకు తాను ఇచ్చిన జీఓలోని 93 వేల మంది నేత కార్మికులను 51,952 మందికే పరిమితం చేశారు. అలాగే పవర్ లూమ్స్ను 7 వేలకు కుదించారు. నేతన్న నేస్తంతో ఆదుకున్న గత ప్రభుత్వం జిల్లాలో చేనేతపై ప్రత్యక్షంగా సుమారు 5 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మంది కార్మికులు ఆధారప డి జీవనం సాగిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభు త్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. విద్యుత్ ఛార్జీల నుంచి 96 పైసల యూజ ర్స్ ఛార్జీలను తగ్గించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూరైనా ఇంకా పథకం అమలుకు మీనమేషాలు లెక్కిస్తోంది. దేశ సంప్రదాయ వృత్తిని కాపాడండి దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన చేనేత వృత్తిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నేటి జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కోర్కెల ప్రచార దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. – ఆకుల వాసు, రాష్ట్ర చేనేత కార్మికుల యూనియన్ అధ్యక్షుడు, తిరుపతి -
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం సీఎంవో నుంచి అందిన ప్రజా ఫిర్యాదులపై ఆరా తీశారు. సీఎంవో నుంచి వచ్చిన నాలుగు అర్జీలపై అర్జీదారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులైన వి.కోట మండలం పెద్దపల్లెకు చెందిన జనార్ధన్ రెడ్డి, రొంపిచర్ల మండలానికి చెందిన ముప్పిరెడ్డి దీప నారాయణి, రామకుప్పం మండలం పండ్యాలమడుగుకు చెందిన మురుగేష్, రామకుప్పం మండలం వెర్నమల్ల గ్రామానికి చెందిన రాజప్పతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని పేర్కొన్నారు. -
నిరసన గళం
చిత్తూరు కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించి అర్హులకు అన్యాయం చేశారని మండిపడుతున్నాయి. వారికి వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, ప్రజలు నిరాహార దీక్షల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం చేపట్టిన రిలే నిరహారదీక్షలకు విశేష స్పందన లభించింది. ఆడికృత్తిక పండుగ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జీడీనెల్లూరులో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మిడీఎస్సీ పేరుతో దగాజిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరాహార దీక్షలు -
బీసీ హాస్టల్లో అధికారుల తనిఖీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీ నగర్లో ఉన్న బీసీ హాస్టల్ను గురువారం కలెక్టర్ నియమించిన జిల్లా స్థాయి అధికారుల సంయుక్త కమిటీ తనిఖీ చేసింది. జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి, డీఈవో, డీఎంఅండ్హెచ్వో, ఆరోగ్య భద్రత అధికారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సంయుక్త కమిటీ హాస్టల్లోని వసతులను క్షుణ్ణంగా పరిశీలించింది. పరిసరాల పారిశుద్ధ్యం, విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యత, వంటగది శుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యర్థ్యాల తరలింపు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు మాట్లాడుతూ హాస్టల్లో నివసించే విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరిశుభ్రమైన, పోషకాహారంతో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. హాస్టల్ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో సుధాకర్, డీఎంహెచ్వో నాగశశిభూషన్రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సన్నా హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బుధవారం చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతమైంది. బంద్కు జిల్లాలోని వివిధ కళాశాలల యాజమన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. చిత్తూరు సిటీ సెక్రెటరీ తేజ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిలువు దోపిడీని అరికట్టాలన్నారు. ప్రభుత్వ కళాశాలలు, వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
జనాభా లెక్కల హ్యాండ్బుక్ అత్యంత ప్రామాణికం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ అత్యంత ప్రామాణికమైనదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఆయన బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదం చేస్తాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి రంగం సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన–2027 సన్నాహకాల్లో మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారిగా శిక్షణ ఇవ్వాలన్నారు. మున్సిపల్, విద్య, వైద్య ఆరోగ్య, హౌసింగ్, ఆర్ అండ్ బీ వంటి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, రాష్ట్ర సెన్సెస్ విభాగం ఏడీ సుప్రజ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ లక్ష్మికళ తదితరులు పాల్గొన్నారు. యువజన సాధికారతకు మై భారత్ దోహదం యువజన సాధికారతకు మై భారత్ ఎంతో దోహదం చేస్తుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా అవకాశాలను కల్పిస్తోందన్నారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. సమావేశంలో 2026–27 వార్షిక కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు. సమావేశంలో జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, ప్రోగ్రామ్ సూపర్వైజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
10 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు జిల్లా స్థాయిలో అమరావతి ఛాంపియన్షిప్ –2026 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. గత నెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో జిల్లా స్థాయి క్రీడాపోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్, 11న కబడ్డీ, బాస్కెట్బాల్, ఆర్చరీ, చెస్, 12వ తేదీన బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డీసీసీబీకి ఉత్తమ బ్యాంకింగ్ అవార్డు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక ఉత్తమ బ్యాంకింగ్ అవార్డు, రూ.2 లక్షల నగదు పురస్కారాన్ని దక్కించుకుంది. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆప్కాబ్ 63వ ఫౌండేషన్ డే వేడుకల్లో, రాష్ట్రంలో ఉన్న 13 డీసీసీబీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. సహకార శాఖ రిజిస్ట్రార్ ఎ.అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి.రామకృష్ణ చేతుల మీదుగా డీసీసీబీ సీఈఓ సి.శంకర్బాబు, చైర్మన్ అమాసరాజశేఖర్రెడ్డి అవార్డును అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని బి.కొత్తకోట, కలకడ, ఏర్పేడు, నాగలాపురం, ఐరాల ప్రాథమిక సహకార సంఘాలకు రూ.20 వేల ప్రోత్సాహక నగదు, అవార్డులను అందజేశారు. ప్రశాంతంగా టెట్ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు ఉదయం, మధ్యాహ్నం 87.60 శాతం హాజరు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా రెండు సెషన్లలో 718 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 629 మంది హాజరర్యారు. 89 మంది గైర్హాజరయ్యారు. కుప్పంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. ఆలయ హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.1,67,49,621 ఆదాయం వచ్చినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో అధికారులు, పాలక మండలి సభ్యుల సమక్షంలో బుధవారం హుండీలోని కానుకలను లెక్కించినట్టు తెలిపారు. ఇందులో రూ.1,67,49,621 నగదు, 25 గ్రాముల బంగారం, 410 గ్రాముల వెండి, గో సంరక్షణ హుండీ నుంచి రూ.28,973, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.1,85,552 వచ్చినట్టు తెలిపారు. అలాగే యుఎస్ఏవీ డాలర్లు 828, యుఏఈ దిర్హమ్స్ 420, ఆస్ట్రేలియా డాలర్లు 260, యూరోలు 265, కువైట్ దీనార్లు 185, ఇంగ్లాండ్ పౌండ్లు 30, సౌదీ అరేబియా రియాళ్లు 20, కెనడా డాలర్లు 20, మలేషియా రింగిట్స్ 11, సింగపూర్ డాలర్లు 2 వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొత్తం 21 రోజులకు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణి నాయుడు, డీఈఓ సాగర్బాబు, ఏఈఓలు ఎస్.వి.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనుంజయ, సీఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పాతాళానికి గంగ
కాణిపాకం: జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంప్రారంభమైనా కనీస స్థాయిలో వర్షాలు కురవడం లేదు. నైరుతి రుతుపవనాలు మొండికేశాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అంతకంతకూ అడుగుంటుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సగటున 9.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు, ఏప్రిల్ నాటికి 12.93 మీటర్లకు, జూలై నాటికి ఏకంగా 15.15 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఈ ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే జలమట్టం ఏకంగా 5.31 మీటర్ల మేర దారుణంగా క్షీణించింది. మే నెలలో జిల్లాలో నమోదైన 83.77 మిమీల వర్షపాతం కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో నైరుతి రుతుపవనాలు విస్తరించకపోవడం పెద్ద దెబ్బతీసింది. జూన్ నెలలో 52.70 మిమీ వర్షపాతం నమోదుకాగా, జూలైలో 14.81 మిమీ అత్యల్ప వర్షపాతం నమోదైంది. మే నెలలో భూగర్భంలోకి చేరిన స్వల్ప నీరంతా భానుడి భగభగలు, విచ్ఛలవిడి వాడకానికి కరిగిపోయింది. ఎండిపోతున్న పంటలు జిల్లాలో చెరువులు, కాలువల కంటే ఎక్కువగా బోరు బావులపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. భూగర్భ జలాలు 15 మీటర్లకు పైగా లోతుకు వెళ్లడంతో వేలాది ఎకరాల్లో వేసిన మామిడి, పట్టు, కూరగాయలు, టమాటా, వేరుశనగ పంటలకు నీరు అందడం లేదు. జూలై ముగిసి ఆగస్టు ప్రారంభమైనా ఎండలు తగ్గకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నుంచి నీరు సరిగా రాకపోవడం, లోవోల్టేజీ కారణంగా మోటార్లు తరచూ కాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. పడమటి మండలాలైన కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నీటి మట్టాలు 18 నుంచి 22 మీటర్ల లోతుకు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు.నెల వర్షపాతం భూగర్భమట్టం ఫ్రిబవరి 0.22 9.84 మార్చి 9.38 10.96 ఏఫ్రిల్ 2.97 12.93 మే 83.77 13.82 జూన్ 52.70 14.24 జూలై 14.81 15.15గత ఆరు నెలల వర్షపాతం, భూగర్భ జలమట్టాల వివరాలు మరింతగా పడిపోయే అవకాశాలు ఈ జలమట్టాల పతనం వ్యవసాయ రంగాన్నే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల తాగునీటి వ్యవస్థలను కూడా కుదిపేస్తోంది. అనేక గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాల బోర్లు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి భూగర్భ జలాలు వృద్ధి చెందకపోతే తాగునీటికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులు సంప్రదాయ నీటి పారుదల పద్ధతులను పక్కనబెట్టి బిందు సేద్యం వైపు మొగ్గుచూపాలని, అలాగే చెక్ డ్యామ్ల పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి జల సంరక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.జిల్లాలో ఎండలు తగ్గడం లేదు. జూలై ముగిసి ఆగస్టు ప్రారంభమైనా భానుడు భగభగమంటున్నాడు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో నీటి సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. గడిచిన ఆరు నెలల భూగర్భ జలమట్టాల గణాంకాలను పరిశీలిస్తే ఆందోళనకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వేసవి తీవ్రతతో పాటు వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు ఊహించని రీతిలో లోతుకు జారుకున్నాయి. బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
హెచ్ఐవీ బాధితులకు సత్వరం వైద్య సేవలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారిని ఉచిత నిరోధక మందుల పంపిణీ కేంద్రాలకు అనుసంధానం చేసి వైద్య చికిత్స ప్రారంభించాలని జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి జి.వెంకటప్రసాద్ ఆదేశించారు. ఆయన బుధవారం జిల్లాలోని ఉచిత పరీక్షా కేంద్రాలు, లైంగిక సంక్రమిత రోగాల నివారణ కేంద్రాలు, ఉచిత మందుల పంపిణీ కేంద్రాల సలహాదారులతో త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యాధి వ్యాప్తి నిరోధంలో సలహాదారుల పాత్ర కీలకమన్నారు. కేంద్రాలకు వచ్చేవారికి పరీక్షకు ముందు, పరీక్ష తర్వాత అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, క్షయ వ్యాధిగ్రస్తులకు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయాలన్నారు. చికిత్స పొందుతున్న బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని, వారి వివరాలను రహస్యంగా ఉంచాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రజా సంబంధాల అధికారి కోటిరెడ్డి, సామాజిక సంక్షేమ అధికారి సురేంద్రబాబు, వివిధ కేంద్రాల సలహాదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలి
నగరిలో భారీ చోరీ నగరి పట్టణంలోని ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. 15 సవర్ల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.చిత్తూరు రూరల్ (కాణిపాకం): జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిత్య సేవారంగ వివరాల జాబితాలను ఈ నెలాఖరులోగా డిజిటల్ రూపంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ సూచికలు, హెచ్ఎంఐఎస్ గణాంకాల నమోదులో మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని అభినందించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక టీకాల పంపిణీలో వెనుకబడిన పీహెచ్సీల్లో వంద శాతం లకా్ష్య్న్ని సాధించాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త రోజుకు తప్పనిసరిగా దంపతులు, గర్భిణులు, చిన్నారుల నమోదులో కనీసం ఒక ఎంట్రీ చేయాలన్నారు. వైద్యశాలల ఆవరణలో పారిశుద్ధ్యాన్ని పక్కాగా నిర్వహించాలని, ప్రజా సంతృప్తి సూచిక 80 శాతం పైగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సంజీవిని శస్త్ర చికిత్సలు, అసంక్రమిత రోగ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట ప్రసాద్, వైద్యాధికారులు ప్రవీణ, అనిల్ కుమార్, గిరి, అనూష తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు పస్తులు
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో గందరగోళంగా మారింది. ప్రతినెలా ఆఖరు నాటికే చౌకధరల దుకాణాలకు సరుకులు చేరాల్సి ఉండగా అధికారుల అలసత్వం వల్ల పలుచోట్ల బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో నిరుపేద కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, అనేక షాపుల్లో సరుకులు లేక నిల్వలు సున్నాకు చేరుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,220 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 4.80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లాలోని లబ్ధిదారుల అవసరాల నిమిత్తం ప్రతినెలా 7,200 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతోంది. ఈ నెల ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిల్వలు జిల్లాకు చేరుకోలేదు. ముఖ్యంగా ప్రధాన పంపిణీ కేంద్రమైన ఏర్పేడు గోదాముకు బియ్యం రావడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఈ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉన్న పంపిణీ వ్యవస్థపై పడింది. ఫలితంగా ఈ నెల ఏకంగా 310 రేషన్ షాపులకు గాను రావాల్సిన 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాకు పూర్తిగా బ్రేకులు పడింది. షాపుల వద్ద పడిగావులు ఈ నెల బియ్యం రాకపోవడంతో రేషన్ బియ్యంతో జీవనం సాగించే వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బియ్యం ఎప్పుడు వస్తాయో తెలియక రేషన్ షాపుల వద్ద గంటల తరబడి పడిగావులు కాయాల్సి వస్తోందని కార్డుదారులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మండిపడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి బియ్యం సరఫరా చేసి ఆకలి తీర్చాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. పేదల పొట్ట కొడుతున్న కూటమి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ బియ్యం పేదల గడప తొక్కేవి. వలంటీర్లు, ఎండీయూ వాహనాలు నేరుగా ఇళ్ల ముందరికే వచ్చి బియ్యం అందించేవి. సరుకులు ఎప్పుడొస్తాయో కార్డుదారులకు ముందే సమాచారం ఉండేది. వృద్ధులు, దివ్యాంగులు, శ్రమజీవులు ఇబ్బంది లేకుండా నాణ్యమైన బియ్యాన్ని అందుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వాహనాలకు స్వస్తి పలికింది. డీలర్లు చేసిన తప్పులు, సాంకేతిక సాకులు చూపుతూ కార్డుదారుల కోతలతో పేదల పొట్ట కొడుతోంది. ప్రతి నెలా రేషన్ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటోంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక, పనులు మానుకుని దుకాణాల చుట్టూ తిరగలేక పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. సక్రమంగా రేషన్ అందించని ప్రభుత్వం తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
బంగారుపాళెం: మండలంలోని తిమ్మోజుపల్లె సమీపంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిమ్మోజుపల్లె సమీపంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న బాడా హోటల్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాడుతుండగా పలమనేరు నుంచి చిత్తూరు వైపు పోతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదని, చిరునామా కోసం విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య బంగారుపాళెం : మండలంలోని సదకుప్పంలో కుటుంబ కలహాల కారణంగా వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సదకుప్పానికి చెందిన మునస్వామి(65), భార్య మొగిలమ్మ ఓ మామిడి తోటలో కాపలా ఉంటున్నారు. వారు మంగళవారం రాత్రి గొడవ పడ్డారు. దీంతో మునస్వామి అతిగా మద్యం సేవించి మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, భార్య మొగిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పంటలపై ఏనుగుల దాడులు గుడిపాల: మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ వరిపంట, అరటి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి పాపసముద్రం, పిళ్లారికుప్పం ప్రాంతంలో ఏనుగులు గుమ్మడి, అరటి, వరి పంటలను పూర్తిస్ధాయిలో ధ్వంసం చేశాయి. పైపులు, రాతికూసాలను విరిచేశాయి. అప్పులుచేసి పంటలను సాగుచేస్తే ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు టపాకాయలు పేల్చుకుంటూ చేతులు దుడుపుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఐడీఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
చిత్తూరు అర్బన్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆయన బుధవారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇండియన్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కానిస్టేబుల్ బి.ప్రవీణ్ కుమార్ సతీమణి లావణ్యకు రూ.లక్ష, విజయవాడలో అల్లరి మూకల దాడిలో గాయపడిన చిత్తూరు ఎస్టీఎఫ్ ఏఆర్పీసీ టి.చిన్నతంబికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.20 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్.షాను, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వెళ్తుండగా అనంత లోకాలకు.. పూతలపట్టు(యాదమరి): రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాల్లో ప్రతి రోజూ లాగే పని ముగిసింది. అలసిపోయిన శరీరంతో.. ఇంటి దగ్గర ఎదురుచూసే తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరాలన్న ఆతృతతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. విధి చిన్నచూపు చూడడంతో ఆ ప్రయాణమే వారికి చివరి మజిలీ అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన నాగరాజు(40) కొద్ది నెలలుగా రంగంపేట క్రాస్లో నివాసం ఉంటూ తాపీ మేసీ్త్రగా పని చేస్తున్నాడు. అతనితో పాటు పూతలపట్టుకు చెందిన రాంబాబు(35) కూడా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా గాండ్లపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని రాంబాబును 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతను మృతిచెందాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొనిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రీసర్వేలో తప్పులకు తావు లేదు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వేలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే రెవెన్యూ అధికారుల ప్రధాన కర్తవ్యమన్నారు. సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో సుమారు 150 నుంచి 170 వరకు రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయని చెప్పారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్లు వారానికి కనీసం 10 రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తే జిల్లా స్థాయిలో పెండింగ్ కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పొరపాటున 22(ఏ) నిషేధిత జాబితాలో నమోదైన పట్టా భూములను తొలగించే అధికారాన్ని ప్రభుత్వం ఆర్డీవోలకు బదలాయించిందన్నారు. దీంతో అర్జీలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. రీ సర్వేలో సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల నవీకరణ, మ్యాప్ల తయారీ ప్రక్రియలను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డీఎల్డీవో రవికుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి జిల్లాలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కలెక్టర్ ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఏఈలు క్షేత్రస్థాయిలో నీటి పైపుల మరమ్మతులను పర్యవేక్షించాలన్నారు. నీటి లభ్యతను అంచనా వేస్తూ తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పారిశ్రామిక వాడలు, డంపింగ్ యార్డులకు సమీపంలో ఉన్న నీటి వనరులు, చెరువులు, చెక్ డ్యామ్లు, బోరు బావుల నీటిని ఎప్పటికప్పుడు ల్యాబ్లలో పరీక్షించాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
బంధువులే నిందితులు
● ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు పుత్తూరు: గత నెల 31వ తేదీన నమోదైన పోక్సో కేసులో మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిలో పి.మురళి(37), టి.హరికృష్ణ(30) ఉన్నారు. వీరు బాలికకు సమీప రక్త సంబంధీకులు కావడం విశేషం. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గర్భం దాల్చడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి బైరెడ్డిపల్లె : మండలంలోని కడపనత్తంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి (54)కి పెళ్లి కాలేదు. ఒంటరిగా ఉంటున్నాడు. ఏమి జరిగిందో కాని మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు బుధవారం పోలీసులు, బంధువులకు సమాచా రం అందించారు. మృతుడి అన్న కుమారుడు ఉమామహేశ్వర్ ఫిర్యాదు చేశారు. క్రిష్ణమూర్తికి ఎవరితోనూ కక్షలు లేవని, మృతిపై అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ చందనప్రియ కేసు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ మహిళా నేతపై కేసు చిత్తూరు అర్బన్: తమను కించపరిచేలా వ్యవహరించారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ మహిళా నేత, ఆమె భర్తపై బుధవారం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల చామంతిపురానికి చెందిన హిందూశ్రీని కించపరుస్తూ టీడీపీ మహిళా నేత రేఖ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హిందూశ్రీ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిశీలించిన వారు రేఖ, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. -
రూ.10 వేల కోట్లతో పరిశ్రమలు
కుప్పం: నియోజకవర్గంలో రూ.10 వేల కోట్లతో 32 పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నట్టు కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లుగా కుప్పం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఒక ఫ్యాక్టరీ ప్రారంభమై పనిచేస్తోందని, 12 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మరో 19 ఫ్యాక్టరీల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. 2029 నాటికి పరిశ్రమలు పూర్తయి పనిచేస్తాయన్నారు. వీటి ద్వారా 40 వేల మంది ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. పాడి రైతులకు అనుకూలంగా మోగా పాల డెయిరీలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కుప్పంలో రోజుకు 5.12 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. దీన్ని రెండేళ్లలో 8 లక్షల లీటర్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గంలో 550 చెరువులు ఉన్నాయని, హంద్రీ–నీవా కాలువ ద్వారా ఇప్పటికి 125 చెరువులను నీటితో నింపామన్నారు. మరో ఏడాదిలో 87 చెరువులను అనుసంధానం చేసి నీరు నింపుతామన్నారు. పలమనేరు, కృష్ణగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కుప్పం నుంచి బెంగళూరుకు ఔటర్ రింగ్ రోడ్డు పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో రోడ్డు పనులకు శ్రీకారం చుడతామన్నారు. నియోజకవర్గంలో 7 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ సిస్టం అందజేశామన్నారు. మూడు నెలల్లో ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 42 వేల కుటుంబాలకు సోలార్ సిస్టిం అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం వినతి కుప్పం నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కడా పీడీ వికాస్ మర్మత్కు జర్నలిస్టులు వినతి ప్రతం అందజేశారు. ఇప్పటి వరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. నాలుగు మండలాల్లో అనేక మంది వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారని తెలిపారు. స్పందించిన కడా పీడీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఉపాధిలో అవినీతిపై ఫిర్యాదు
గుడిపాల: ఉపాధిహామీ పథకంలో జరిగిన అవినీతిపై గుడిపాల ఎంపీడీవో శిరీషకు బుధవారం గట్రాళ్లమిట్ట గ్రామంలోని రైతులు ఫిర్యాదు చేశారు. ఈనెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ఉపాధిలో లక్షల్లో అవినీతి అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై రైతులు తాము సొంతంగా సాగు చేసుకున్న మామిడి, కొబ్బరి మొక్కలకు బిల్లులు పెట్టుకోలేదని, తమ పేరుతో బిల్లులు చేసుకున్నారని తెలిపారు. పూర్తిస్ధాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సు కండక్టర్గా ఉద్యోగం చేస్తున్న గోపీనాథ్, ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న శ్రీలత, భానుప్రియకు ఉపాధి హామీ జాబ్కార్డులు ఉన్నాయని, వారి పేరు మీద పనులు చేయకుండానే రూ.లక్షల్లో నగదు జమ అయినట్టు పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో శిరీష మాట్లాడుతూ ఉపాధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. గోపీనాథ్ ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసిందని, అతను ఉద్యోగంలో ఎప్పుడు చేరారో వివరాలు ఇవ్వాలని చిత్తూరు ఆర్టీసీ ఆర్ఎంను కోరామని తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత రికవరికీ ఆదేశిస్తామన్నారు. అలాగే ఏఎన్ఎంలపైనా విచారిస్తున్నామన్నారు. ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని ఆమె తెలియజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఎంపీడీవో కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో బుధవారం ఎంపీడీవో సమావేశం నిర్వహించారు. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి జాబ్కార్డులు ఎలా ఇచ్చారని ఆరా తీశారు. జాబ్కార్డులు వెరిఫికేషన్ చేయాలని, ఉద్యోగులకు కార్డులు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఫీల్ట్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్టు వివరించారు. -
పలమనేరులో ఇసుక విక్రయ కేంద్రాలు!
పలమనేరు: కూటమి నేతలు గతంలో ఇసుకను రహస్యంగా రవాణా చేసేవారు. ఇప్పుడు మరో అడుగు మందుకు వేశారు. ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసుకుని యథేచ్ఛగా రవణా చేస్తున్నారు. పలమనేరు ప్రాంతం కర్ణాటకకు సరిహద్దులో ఉండడం, అక్కడ ఇసుకకు డిమాండ్ ఉండడంతో పట్టపగలే ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. దీన్ని చూసిన జనం ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయడంపై ముక్కున వేలు వేసుకుంటున్నారు. కౌండిన్య నుంచి ఇక్కడికి చేరుతున్న ఇసుక ఇసుక ఫ్రీ పాలసీ పేరిట కౌండిన్య నది నుంచి సేకరించిన ఇసుకను అక్రమార్కులు కర్ణాటకాకు పంపితే ఇబ్బందిగా ఉంటుంది. దీంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నది నుంచి హైవేలో ఇసుకను ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు. ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే తాము టౌన్లో ఇళ్ల నిర్మాణాలను తీసుకెళుతున్నామని నమ్మబలుకుతున్నారు. ఈ ఇసుకను పట్టణంలోని ఇసుక విక్రయ కేంద్రాలకు అమ్ముకుంటున్నారు. ఇది మంచి వ్యాపారంగా మారడంతో ఎలాంటి సమస్యలు లేకుండా నిత్యం భారీగా ఇసుక ట్రాక్టర్లు నదిలోంచి పట్టణంలోకి చేరుతున్నాయి.ట్రాక్టర్ ఇసుక రూ.3,300లు కౌండిన్య నది వద్ద ట్రాక్టర్ ఇసుక డెలవరీతో కలిపి రూ.2,400 ఉంది. ఇదే ఇసుకను పట్టణంలోని ఇసుక విక్రయ కేంద్రాలకు తరలిస్తే ట్రాక్టర్ ధర రూ.3 వేలుగా ఉంది. దీంతో ట్రాక్టర్కు రూ.600 లాభం. ఆపై ఇసుకను కొన్న వారు అవసరమైన వారికి విక్రయ కేంద్రాల్లో రూ.3,200 నుంచి డిమాండ్ను బట్టి అమ్ముతున్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఫారెస్ట్ గెస్ట్హౌస్ వద్ద ఓ ఇసుక విక్రయ కేంద్రం వెలిసింది. అలాగే గడ్డూరు కాలనీ, గుడియాత్తం రోడ్డు, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లోనూ ఇసుక అమ్మకాలు సాగుతున్నాయి. పట్టపగలే వీరు ఇసుక వ్యాపారం చేస్తున్నారంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారనే మాట సాధారణ జనంలో వినిపిస్తోంది. అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ఇలా బహిరంగంగా రోడ్ల పక్కనే ఇసుక అమ్మకాలు సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం వస్తోంది. -
ఎల్నినో ప్రభావంపై అవగాహన
కుప్పం రూరల్ : ఎల్నినో ప్రభావం, తలెత్తే నష్టాలపై రైతులకు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సుమతి అవగాహన కల్పించా రు. మంగళవారం కుప్పం మండలం కమతమూరు లో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు. వర్షాబావ పరిస్థితుల్లో వరి కి ప్రత్యామ్నాయంగా రాగి, సజ్జలు, కొర్రలు, మిను ములు, కందులను సాగు చేసుకోవాలన్నారు. డ్రిప్ ద్వారానే పంటలకు నీటిని అందించాలని సూచించారు. చెరువులు, కుంటలు, పాండ్లలో నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. పంటలు వాడిపోతుంటే లీటర్ నీటిలో 20 గ్రాముల యూరియా లేక 19:19:19 లేదా 20:20:20 మందులను పిచికారీ చేయాలని కోరారు. మల్చింగ్ ద్వారా సాగు చేపడితే ఎక్కువ రోజులు తేమ ఉంటుందన్నారు. కూరగాయలను షెడ్లలోనే సాగు చేయాలని తెలిపారు. నత్రజని ఎక్కువ ఉన్న ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులను వినియోగించాలని చెప్పారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మురళి, ఉద్యాన సంచాలకులు పల్లవి, కృష్ణారెడ్డి, శాస్త్రవేత్తలు నాగమాధురి, భారతి, మహేశ్వరరెడ్డి, విశ్వనాథ్, అరుణ, నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, శివశంకర్, ఫయాజ్, ఔరంగ్ పాల్గొన్నారు. -
సీనియారిటీ జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేయడంలో జాప్యం, విద్యాశాఖ అధికారుల అలసత్వంపై ‘సాక్షి’ పత్రికలో ‘టీచర్ల సీనియారిటీ జాబితాలపై వీడని చిక్కుముడి’ శీర్షికతో ఈ నెల 4 వ తేదీన కథనం ప్రచురితమైంది. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. వెంటనే జాబితాలను ప్రచురించారు. వెబ్సైట్లో జాబితాలు పొరుగు జిల్లాల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా సీనియారిటీ జాబితాలు పూర్తి కావస్తున్నా, చిత్తూరు జిల్లాలో మాత్రం ప్రచురించకపోవడంపై ‘సాక్షి’ పత్రిక ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన జనరల్ సీనియారిటీ జాబితాలను విడుదల చేశారు. మేనేజ్మెంట్ల వారీగా (ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్) సీనియారిటీ జాబితాలను ఎంఈఓలు, డీవైఈఓలు మెయిల్స్కు పంపడంతో పాటు అధికారిక డీఈఓ వెబ్సైట్లో అందుబాటు లో పెట్టారు. గతంలో నాలుగు విడతలుగా స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి సవరించిన సీని యారిటీ జాబితాలను రూపొందించినట్లు డీఈఓ తెలిపారు. విడుదల చేసిన సీనియారిటీ జాబితాపై ఉపాధ్యాయులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చిత్తూరులోని డీఈఓ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని స్పష్టం చేశారు. -
వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : స్వయం సహాయక సంఘ సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని డీఆర్డీఎ పీడీ శ్రీదేవి ఆదేశించారు. మంగళవారం చిత్తూరులోని డీఆర్డీఎ సమావేశ మందిరంలో ఏపీఎంలు ీసీసీలతో సమీక్షించారు. పీడీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. ప్రధానంగా వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాలపై సంఘ సభ్యులు మక్కువ చూపే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. బ్యాంకుల అనుసంధానం, మార్కెటింగ్, ఆర్థిక లావాదేవీల నిర్వహణపై దృష్టి పెడితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అలాగే చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుపై అవగాహన ఉన్న సభ్యులను గుర్తించి వారికి సాయం అందించాలని సూచించారు. సంఘాల్లోని ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డీపీఎంలు సుబ్బారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. -
చెరుకు సాగు క్షీణత ఆందోళనకరం
తిరుపతి మంగళం : తిరుపతి జిల్లాలో చెరుకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరు కు పరిశ్రమ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన మంగళవారం లోక్సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారీగా చెరుకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి వివరా లను కేంద్రం సభకు సమర్పించిందని, తిరుపతి జిల్లాలో చెరుకు సాగు, ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ఠాకూర్ పేర్కొన్నారు. సహకార చక్కెర కర్మాగారాల ఆధునికీకరణ, పునరుద్ధరణ కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా 2023–24, 2024–25 సంవత్సరాల్లో రూ.10,005 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. తిరు పతి జిల్లాలో చెరుకు సాగు క్షీణత ఆందోళన కలిగించే అంశమని, కేంద్రం వెల్లడించిన పథకాల ప్రయోజనాలు జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. -
మా మాటే శాసనం!
కుప్పం : పట్టణంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయ పునర్నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా గర్భగుడి మార్పు చేయాలని టీడీపీ నేతలు మంకు పట్టు పడుతుండడంతో వ్యవహారం ముదిరిపోయింది. ఏళ్ల తరబడిగా అమ్మవారు ఆశీనులపైన శక్తిపీఠం మార్పు చేస్తే అరిష్టమని పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో వివాదం మరింత పెద్దదైంది. మార్పు తథ్యం! ఆలయ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గర్భగుడి మార్పు తథ్యమని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వాస్తు దోషాల ప్రకారం గర్భగుడిని మార్పు చేస్తేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని వాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షం నిర్ణయాలు తీసుకోవడం తగదని పట్టణవాసులు సూచిస్తున్నారు. అయితే మా మాటే శాసనం.. గర్భగుడి మార్పు తప్పదని ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. మనోభావాలు దెబ్బతీయడమే.. సుమారు 110 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం శక్తి పీఠాన్ని మార్పు చేసేందుకు యత్నిస్తే అనర్థాలు తప్పవని పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ గర్భగుడి జోలికి వెళ్లలేదని, ఈ క్రమంలో ఏకపక్షంగా వ్యవహరించి శక్తిపీఠం మారిస్తే అరిష్టమని స్పష్టం చేస్తున్నారు. అమ్మవారు శక్తి పీఠం ఉన్న చోటే ఏటా విశ్వరూప దర్శనం ఉంటుందని, ఆ స్థానం మార్చి మరోచోట జాతర జరిపించడం సరికాదని సూచిస్తున్నారు. ఇది భక్తుల మనోబావాలను దెబ్బతీయడమేనని హెచ్చరిస్తున్నారు. -
ఎంపీడీఓ సరెండ్కు డిమాండ్
పుత్తూరు : ప్రోటోకాల్ పాటించకపోవడమే కాకుండా మండల అభివృద్ధికి ఏమాత్రం సహకరించని పుత్తూరు ఎంపీడీఓ శ్రీదేవిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఎంపీపీ మునివేలు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీఓ శ్రీదేవి మండల మీట్ను ప్రారంభించగానే ఎంపీపీ మునివేలు అడ్డుకున్నారు. మండల సమావేశంపై తమతో చర్చించకుండానే ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. రూ.1.26 కోట్ల మండల పరిషత్ ఫండ్స్ ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులు ఒక్కటి కూడా జరగడం లేదని ఆరోపించారు. గత సమావేశాల్లో ఆమో దం తెలిపిన అభివృద్ధి పనులను ప్రారంభించక కాలయాపన చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇటీవల మెయిటెనెన్స్ కింద డ్రా చేసిన రూ.లక్షలకు సైతం లెక్క చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎంపీపీని అని చిన్నచూ పు చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఎంపీపీ మునివేలు వ్యాఖ్యలతో ఏకీభవించిన ఎంపీటీసీ సభ్యులు సైతం ఎంపీడీఓను సరెండర్ చేసే తీర్మానానికి ఆమోదం తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ బంగారుపాళెం : మండలంలోని కేజీ సత్రంలో రెండు రోజుల క్రితం చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సదరు నిందితుడు ఆదివారం రాత్రి సప్లయర్స్లో తాళాలు పగులగొట్టి రూ.5 వేల నగదు, నల్లగంగమ్మ ఆలయంలో హుండీ పగులగొట్టి అందులోని రూ.1,060 విలువైన కానుకలు దోచుకుపోయిన ఘటనలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలో కేజీ సత్రం వద్ద తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న సల్లసిద్ధనపల్లెకు చెందిన క్రాంతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. విచారణలో కేజీ సత్రంలో చోరీలకు పాల్పడినట్లు తెలిసిందని, నిందితుడి నుంచి రూ.6,060 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అక్షరాలా దందా! సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపధికన కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను శాశ్వత అధ్యాపకులుగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఫైల్ను కదిలించిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా కొందరు అధికార పార్టీ నేతలు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేన్లోని కొంతమంది నేతలతో చేతులు కలిపి పెద్ద ఎత్తున దందా చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈస్ట్, వెస్ట్ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోని కొందరు అసోసియేషన్ నేతలు కాంట్రాక్ట్ జేఎల్స్ వద్ద క్రమబద్ధీకరణ కోసం పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం గమనార్హం. వసూళ్ల పర్వం తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం 124 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇందులో కొందరు అభ్యర్థులు ఫేక్ ధృవ పత్రాలతో ఉద్యోగంలో చేరారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు టీచర్లు, హెచ్ఎంలు, ఇతర కేడర్ ఉపాధ్యాయులకు కనీసం 10 ఏళ్ల సర్వీ సు పూర్తయి ఉండాలని వెల్లడించారు. అర్హులైన ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనల రెండు కాపీలను ఈ నెల 20వ తేదీలోపు సంబంధిత డీవైఈఓకు సమర్పించాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే ప్రతిపాదనలు స్వీకరించమని స్పష్టం చేశారు. నేడు జిల్లాలో కళాశాలల బంద్ చిత్తూరు కలెక్టరేట్ : విద్యారంగ సమస్యల పరిష్కారానికి బుధవారం కళాశాలల బంద్ చేపడుతున్నట్లు ఏబీ వీపీ జిల్లా కన్వీనర్ హర్షవర్ధన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలను వెంటనే విడుదల చేయాలన్నారు. డిగ్రీతో సహా అన్ని కోర్సుల అడ్మిషన్ల ప్రక్రి యను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. పీజీ విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్న జీఓ నంబర్ 77ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించా రు. జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఏ కేటగిరీ సీట్లకు అదనపు రుసుము వసూలును అరికట్టాలని స్పష్టం చేశారు. ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల్లో కన్వీనర్ కోటాను తప్పనిసరి చేయాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కళాశాలల బంద్ను విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం – ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయుడిపై ఫిర్యాదు చిత్తూరు అర్బన్ : చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు. ఇప్పటికే కర్ణాటకలో పలు భాషా సంఘాలు, ఉద్యమకారులు గురజాల జగన్మోహన్ నాయుడిపై పోలీసులకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వివాదం తమిళనాడుకు పాకింది. ఇటీవల చిత్తూరులోని ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ణాట క, తమిళనాడు ఎక్కడైనా తెలుగువాళ్లు ఏలుతారని, మోదీ ప్రధాని కావడంలో చంద్రబాబు నాయుడే కీలకపాత్ర పోషించారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బెంగళూరులోని ప్రాంతీయ భాషా ఉద్యమ కారులు ఆందోళనలు చేపట్టారు. తెలుగువాళ్లు లేకపోతే, కన్నడవాళ్లు పరిపాలన సాగించలేరా..? అంటూ మండిపడ్డా రు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మె ల్యే క్షమాపణలు చెప్పారు. తాజాగా చైన్నెకి చెందిన పలువురు న్యాయవాదులు, విద్యార్థులు సైతం గురజాల జగన్మోహన్ నాయుడుపై చైన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. వెంటనే ఆయన చైన్నెకి వచ్చి తమిళులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 78,561 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,361 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
పకడ్బందీగా పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా స్థాయిలో డీఈఓ, స్కూల్ స్థాయిలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. చైర్మన్ అందుబాటులో లేకుంటే హెచ్ఎం, ప్రిన్సిపల్ జెండాను ఎగురవేయాలన్నారు. అలాగే విద్యార్థులకు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. వేడుకలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులతో పాటు తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి భాగస్వాములను చేయాలన్నారు. జాతీయ జెండా నియమావళి, ప్రభుత్వ ఆదేశాలను విస్మరించకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. స్ఫూర్తి ఉట్టిపడేలా.. దేశభక్తి, స్వాతంత్య్ర స్పూర్తి ఉట్టిపడేలా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమం, ప్రగతిని స్పష్టంగా చాటిచెప్పేలా విద్యుత్ శక్తి, మెడికల్, పరిశ్రమల శాఖ, సోలార్ ఎనర్జీ, డీఆర్డీఏ, డ్వామా, ఇతర సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన శకటాలను, స్టాళ్లను ప్రదర్శించాలని సూచించారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది జాబితాను ఈ నెల 10వ తేదీ నాటికి సిద్ధం చేయాలన్నారు. అలాగే 12 రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులకు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా, ఆర్డీఓ శ్రీనివాసులు నాయుడు, డ్వామా పీడీ రవికుమార్, డీపీఓ సుధాకర్ పాల్గొన్నారు. బెంచీలు ఇస్తామని డబ్బు స్వాహా పలమనేరు: పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకుడు దామోదర్ శెట్టి తన బడిలో బెంచీల కోసం ఆన్లైన్లో చూసి విజయవాడకు చెందిన అరుణ్ అనే వ్యక్తితో బేరం మాట్లాడారు. అతను చూపిన నమూనాల మేరకు 150 బెంచీలకు 5.75 లక్షలు అవుతుందని చెప్పాడు. దీంతో దామోదర్ శెట్టి ఆయనకు 2.75 లక్షలను నగదు బదిలీ చేశారు. అయితే నెల రోజులుగా ఎదురుచూసినా బెంచీలు రాలేదు. అరుణ్కు కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే అతని ఫోను పనిచేయలేదు. దీనిపై ఆరా తీశాడు. అతనికి ఎలాంటి కంపెనీ లేదని మోసపోయినట్టు బాధితుడు తెలుసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. -
సమరమే!
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం వైఎస్సార్కు అంజలి ఘటిస్తున్న భూమన, ఆర్కే రోజామాట్లాడుతున్న వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ‘‘ చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసింది. మెగా డీఎస్సీ పేరుతో అక్రమాలకు తెరతీసింది. అర్హులైన అభ్యర్థులకు ద్రోహం చేసింది. ఉద్యోగాలను అమ్ముకుని వేలాదిమందిని దగా చేసేసింది. ఇందులో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేసినందుకు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి. విద్యార్థుల భవితను ప్రశ్నార్థకంగా మార్చకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఉధృతంగా ఉద్యమిస్తూనే ఉంటుంది. ఈ మేరకు యువతను సమరానికి సన్నద్ధం చేస్తోంది’’ అంటూ వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. బహిరంగ వంచన డీఎస్సీ విషయంలో యువతకు జరిగింది మోసం కాదు.. బహిరంగ వంచన, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుంది. ఈ నెల 10వ తేదీన యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. బాధిత అభ్యర్థులకు అండగా నిలవాలనే లక్ష్యంతో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు చిత్తూరు కార్పొరేషన్ : మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్సీపీ విశ్రమించదని, అప్పటి వరకు ఉద్యమం చేస్తూనే ఉంటోందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. మంగళవారం నగరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులు, సోషల్మీడియా సభ్యులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం నుంచి ఆదివారం వరకు చేపట్టనున్న ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 10వ తేదీన నిర్వహించనున్న భారీ ర్యాలీని జయప్రదం చేసేందుకు నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. -
డబ్బులున్నా.. సేవ‘లే’!
కాణిపాకం: విఘ్నాలు తొలగించే కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో ఆన్లైన్ సేవలు భక్తులకు కొత్త విఘ్నాలను సృష్టిస్తున్నాయి. అక్రమాల కట్టడి, టికెట్ల గోల్మాల్కు చెక్ పెడతామంటూ అర్జిత సేవలకు అమల్లోకి తెచ్చిన నగదు రహిత విధానం గందరగోళానికి దారితీస్తోంది. మాన్యువల్ కౌంటర్లను ఎత్తేసి, కేవలం మనమిత్ర ఆన్లైన్ విధానం, కియోస్క్ మిషన్ల ద్వారానే టికెట్లు జారీ చేస్తుండడంతో సామాన్య, గ్రామీణ, వృద్ధ భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యూపీఐతోనే చెల్లింపులు కాణిపాకం ఆలయంలో ప్రస్తుతం ఫోన్పే, జీపే, పేటీఎం వంటి డిజిటల్ యాప్ల ద్వారా ఆన్న్లైన్ చెల్లింపులు చేస్తేనే అర్జిత సేవల టికెట్లు ఇస్తున్నారు. దీంతో చేతి నిండా డబ్బులు పట్టుకుని వచ్చినా, స్వామివారి సేవల్లో పాల్గొనే అవకాశం లేక అనేకమంది భక్తులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల్లో అధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కావడంతో పాటు ఇప్పటికీ చాలామంది వద్ద సాధారణ కీప్యాడ్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ వాలెట్లు వాడడం రాని వృద్ధులు టికెట్ల కోసం క్యూలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో నగదు ఉన్నా, ఆన్లైన్ చెల్లింపుల కోసం చుట్టుపక్కల ఇతర భక్తులను బతిమాలుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. తమ తరఫున ఆన్న్లైన్లో డబ్బులు కట్టాలని, తాము నగదు చేతికి ఇస్తామని వేడుకుంటున్నారు. పునరుద్ధరిస్తే మేలు కాణిపాకం క్షేత్రానికి సాధారణ రోజుల్లో 15 వేల మందికి పైగా, శని, ఆదివారాలు, పండుగ రోజుల్లో 30 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. ఒకేసారి వందలాది మంది కియోస్క్ మిషన్ల వద్ద డిజిటల్ చెల్లింపులు చేస్తుండడంతో సర్వర్లు డౌనై, గంటల తరబడి సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఆలయంలో పారదర్శకత పెంచడం స్వాగతించదగినదే అయినా, భక్తుల సౌకర్యాన్ని పూర్తిగా మర్చిపోవడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం స్మార్ట్ఫోన్లు లేనివారు, వృద్ధుల కోసం ఒక మాన్యువల్ టికెట్ కౌంటర్ను అత్యవసరంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
గ్రీన్ సిగ్నల్
జిల్లావాసులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ వినిపించింది. కర్ణాటక నుంచి పడమటి మండలాల మీదుగా చిత్తూరుకు నూతన రైలు మార్గం నిర్మించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు లొకేషన్ సర్వే చేయించేందుకు చర్యలు చేపడుతోంది. కొత్త లైన్ మంజూరుపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. పంటల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే వెసులుబాటు వస్తుందని వెల్లడిస్తోంది. అలాగే ప్రధాన నగరాలతో సైతం కనెక్టివిటీ పెరుగుతుందని వివరిస్తోంది. పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాలు అభివృద్ధి పరంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి. కష్టపడి పంటలను సాగుచేసే రైతులున్నప్పటికీ సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో మార్కెటింగ్ వసతి లేక, తగిన ధర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ప్రాంతానికి రైలు మార్గం కావాలనే డిమాండ్ దశాబ్ధాలుగా ఉంది. రైలు మార్గం ఉంటే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని బంగారుపేట జంక్షన్ నుంచి చిత్తూరుకు కొత్త రైలుమార్గం ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఆమేరకు ఫైనల్ లోకేషన్ సర్వేకు పచ్చ జెండా ఊపింది. తగ్గనున్న ప్రయాణ సమయం చిత్తూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు రైలుమార్గం ఏర్పాటుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వారు బెంగళూరుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఒకటిన్నర గంటలు తగ్గుతుంది. నిత్యం ఉమ్మడి జిల్లానుంచి ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వేలాదిమంది బెంగళూరుకు వెళుతుంటారు. అదే విధంగా కర్ణాటక నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల, కాణిపాకం ఆలయాలకు వస్తుంటారు. ఈ మేరకు కొత్త రైలు మార్గం ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా మారుతుంది. హార్టికల్చర్ హబ్గా మారే అవకాశం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువ. అయితే పండించిన కూరగాయలను సుదూర ప్రాంతాలకు పంపలేని పరిస్థితి. ఇక్కడ ఎక్కువగా సాగుచేసే బంగాళాదుంప, టమాట, బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ, పూలు తదితర ఉత్పత్తులకు కేరళ, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, గోవా తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కొత్త రైలు మార్గంతో బెంగళూరు నుంచి తిరుపతి, నెల్లూరుల మీదుగా అమరావతి, హెదరాబాదుకు రవాణా సౌకర్యం వస్తుంది. 92 కిలోమీటర్ల తగ్గుదల ప్రస్తుతం తిరుపతి నుంచి బెంగళూరుకు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట్, కుప్పం, బంగారుపేటలమీదుగా రైళ్లు వెళుతున్నాయి. దీంతో తిరుపతి నుంచి బెంగళూరుకు 325 కిమీగా దూరం ఉంది. అదే చిత్తూరు నుంచి కాణిపాకం, పలమనేరు, ముళబాగిళు మీదుగా బంగారుపేటకు లింకుగా రైలుమార్గం నిర్మిస్తే ఈ రెండు నగరాల మధ్య 92కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు ఒకటిన్నరగంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దీంతో చిత్తూరు జిల్లాలోని పలు పట్టణాలు అభివృద్ధి పథంలో నడిచే అవకాశముంటుంది. కర్ణాటక నుంచి కృష్ణపట్నం పోర్టుకు సైతం కనెక్టివిటీ ఏర్పడుతుంది. నూతన రైలు మార్గం స్కెచ్ -
అంతగోప్యత ఎందుకో?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో అకౌంటబిలిటీని మెరుగుపరిచే ఉద్దేశంతో ఏఐ (ఆ ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను వినియోగించే అవకాశాలపై ఒక ప్రైవేటు సంస్థ బృందం ఇటీవల ఆలయంలో పర్యటించినట్లు తెలిసింది. బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించి వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఆ బృందం ఏ అంశాలపై అధ్యయనం చేసింది, ఏ వ్యవస్థలను ఏఐ తో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది, ఏ వివరాలు సేకరించింది అనే విషయాలను ఆలయ అధికారులు వెల్లడించడం లేదు. కొత్త ప్రణాళికలు చేపట్టినప్పుడు వాటి వివరాలను మీడియాకు తెలియజేసే ఆనవాయితీ ఉన్నప్పటికీ, ఈ విషయంలో మాత్రం పూర్తి సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఆ బృందంలోని కొందరికి హుండీ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే హుండీ కౌంటింగ్లో ఏ అంశాలను పరిశీలించారు, వాటిని ఏఐతో ఎలా అనుసంధానం చేయాలనుకుంటున్నారు అనే విషయాలపై స్పష్టత లేదు. ఈ విషయమై ఆలయ ఈవో వెంకటేశ్వర్లును వివరణ కోరగా, ఆలయంలో అకౌంటబిలిటీని మరింత మెరుగుపరచే ఉద్దేశంతోనే ఏఐ సాంకేతికతను వినియోగించే అవకాశాలను పరిశీలించేందుకు ఆ ప్రైవేటు సంస్థ బృందాన్ని తామే ఆహ్వానించామని తెలిపారు. అయితే వారు ఏ అంశాలపై అధ్యయనం చేశారనే వివరాలను వెల్లడించ లేదు. ఈ బృందం పర్యటన తమకు సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. -
అలసత్వం వహిస్తే సహించం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తే లేదని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విద్యాబోధన, విద్యాసంస్థల నిర్వహణలో సమర్థత పెంచేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలల పనితీరు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలిస్తామని వెల్లడించారు. విధులకు గైర్హాజరైనా, బోధనలో అలసత్వం ప్రదర్శించినా శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. పది విద్యార్థులకు మిషన్ మార్చి–2026 అమలు చేస్తున్నామన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. నేటి నుంచి టెట్ పరీక్షలు జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఆన్న్లైన్ విధానంలో టెట్ పరీక్షలు సాగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,510 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని, ఈ మేరకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నా రు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే జిల్లాలోని సీతమ్స్ ఇంజినీరింగ్ (చిత్తూరు), ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ (చిత్తూరు), మధర్ థెరిస్సా ఇంజినీరింగ్ (పలమనేరు), ద్రవిడ యూనివర్సిటీ (కుప్పం), కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (కుప్పం)లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వినియోగదారుల సమస్యలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరం మురుకంబట్టులోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అపోలో క్లినిక్లో ఉన్న స్కానింగ్ సెంటర్ను సోమవారం జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి జి.వెంకటప్రసాద్ తనిఖీ చేశారు. చేంజ్ ఆఫ్ అడ్రస్, స్కానింగ్ సెంటర్లో అందిస్తున్న సేవలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాల పనితీరు, రోగుల నమోదు రిజిస్టర్లు, నివేదికల నిర్వహణ, సిబ్బంది హాజరు, సేవల నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎవరైనా పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ బాలసుబ్రమణ్యం, డెమో ఇన్చార్జి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీగా మహబూబ్ బాషా చిత్తూరు అర్బన్: జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా సయ్యద్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1991లో పోలీసు శాఖలో ఎస్ఐగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మహబూబ్ బాషా అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 2005లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది సీఐడీ, కడపలో సేవలందించారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది రాయచోటి, అనంతపురం ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2026 మేలో జరిగిన పదోన్నతుల్లో అడిషనల్ ఎస్పీగా ఎంపికయ్యారు. అనంతపురంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో చిత్తూరు జిల్లాకు అడిషనల్ ఎస్పీగా నియమితులయ్యారు. ఆయనను జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి యాదమరి: రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన సోమవారం యాదమరిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి నిర్వహణలో దొర్లిన లోపాలను గుర్తించి వాటిని తక్షణమే సవరించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాటి మేటి క్రికెటర్.. నేడు రోడ్డుపై.. పలమనేరు: 1980, 90 దశకంలో పలమనేరు పట్టణంలో గన్సెట్ అనే వ్యక్తి అంటే తెలి యనివారు లేరు. ఎందుకంటే ఆయన అప్పట్లో క్రికెట్లో మంచి ఆల్ రౌండర్గా పేరు గడించారు. రాయలసీమ స్థాయిలో జరిగిన ఎన్నో టోర్నమెంట్లలో పలమనేరు టీం గెలుపులో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ చేయడంతోపాటు హార్డ్ హిట్టర్గా పేరు సాధించారు. అప్పట్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై నా ఆర్థిక స్థోమత లేక పైస్థాయికి వెళ్లలేకపోయారు. ప్రస్తుతం ఆయన మానసిక పరిస్థితి సరిగ్గాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయనను చూసిన నాటితరం వాళ్లు ‘‘అయ్యో ఎలాంటి క్రికెటర్ ఇలా అయ్యాడే..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరు వేటగాళ్ల అరెస్టు
యాదమరి: అడవి జంతువులను వేటాడేందుకు లైసెన్సు లేని తుపాకీ, పేలుడు పాదార్థాలతో తిరుగుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఈశ్వర్ చెప్పారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు యాదమరి మండలం కృష్ణంపల్లి–వేపనపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఇద్దరు యువకులు తమను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. వారిని వెంబడించి పట్టుకున్నట్టు పేర్కొన్నారు. వారు గుడిపాల మండలానికి చెందిన దిలీప్, భరత్గా గుర్తించామన్నారు. జంతువులను వేటాడటానికి తమిళనాడులోని ఓ వ్యక్తి నుంచి తుపాకీని కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. వారి నుంచి నాటు తుపాకీ, పేలుడు పదార్థాలతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులపై ఆయుధాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. -
ఇద్దరిని బలిగొన్న అతివేగం
నగరిలో అతివేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఆర్ఎంపీలపై నిఘా పెంచాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో అనధికారిక వైద్య సేవలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రయోగశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో సోమవారం డమ్మీ వైద్యం దందా శీర్షికన కథనం వెలువడింది. దీనిపై ఆయన స్పందించారు. వైద్యాధికారులు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి తమ పరిధిలోని ఆర్ఎంపీల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని, సైలెన్లు, ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇవ్వకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో నిఘా పెట్టనున్నట్టు తెలిపారు. సంజీవిని–కేసీడీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ఈ నెల 10వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్, వైద్యాధికారులు ప్రవీణ్, గిరి, అనూష, జార్జ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నా భూమి ఇప్పించండి సామీ !
నడవలేని స్థితిలో ఉన్నాను. నాకు నా తండ్రి రాసిచ్చిన వీలునామా ప్రకారం భూమి వాటాను తమ్ముడు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నాకు న్యాయం చేయండి సామీ! అని మండల కేంద్రమైన పెద్దపంజాణికి చెందిన దివ్యాంగుడు పి.మునివెంకటరెడ్డి డీఆర్వో ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. పెద్దపంజాణి గ్రామానికి చెందిన పి. వెంకటరామరెడ్డి ఖాతా నంబరు 342లో మొత్తం 20.10 ఎకరాల భూమి ఉంది. తండ్రి రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తిని మూడు భాగాలుగా విభజించగా, రెండవ భాగం పి.మునివెంకటరెడ్డి (దివ్యాంగుడైన అర్జీదారుడు)కి, మరో భాగం భయారెడ్డికి చెందుతుంది. ప్రస్తుతం భూమిని తమ్ముడు తన పేరు మీదనే నమోదు చేసుకున్నాడు. అన్నకు భాగం ఇవ్వలేదు. తనకున్న శారీరక వైకల్యం వల్ల ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో ఉన్నానని, తండ్రి వీలునామా ప్రకారం తనకు రావలసిన ఆస్తి వాటాను ఇప్పించి, న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. స్పందించిన డీఆర్వో మోహన్కుమార్ క్షేత్రస్థాయిలో భూమి రికార్డులను పరిశీలించి, వీలునామా ప్రకారం విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,645 మంది స్వామిని దర్శించుకున్నారు. 29,700 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. వారు సోమవారం డీఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకురాలు పెద్దిరెడ్డి కవిత, యూనియన్ జిల్లా కార్యదర్శి కె.రమాదేవి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కార్మికులకు 16 నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన బియ్యం, తగినన్ని వంట పాత్రలు సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తల తరహాలోనే మధ్యాహ్న భోజన కార్మికులకు గ్రాట్యూటీ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్యను బట్టి వేతనంతో కూడిన అదనపు వర్కర్లను నియమించాలని కోరారు. -
ఆలయ కుంబాభిషేకంలో పెద్దిరెడ్డి దంపతులు
బంగారుపాళెం : మండలంలోని పాలేరు గ్రామంలో సోమవారం శ్రీకనకాద్రి కై లాసేశ్వర దేవాలయ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత పాల్గొన్నారు. వారికి ఆలయ నిర్మాణకర్తలు విశ్రాంత ప్రొఫెసర్ చెంగల్రెడ్డి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి దంపతులు స్పటిక శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. అదే విదంగా స్వామి వారిని మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, లలితకుమారి, మాజీ ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు దర్శించుకున్నారు. -
ఇద్దరిని బలిగొన్న అతివేగం
నగరి : నగరి దళితవాడ ఎదురుగా జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. అతివేగ మే ఇందుకు కారణమని స్థానికులు తెలిపా రు. పోలీసుల కథనం మేరకు.. చింతలపట్టెడ దళితవాడకు చెందిన చినరాసు అలియాస్ మురుగన్ (21), భీమానగర్కు చెందిన రఘుబాల (19) ఏర్పేడు సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్లో స్వగ్రామాలకు బయలుదేరారు. అతివేగంతో వస్తుండడంతో నగరి దళితవాడ సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. మురుగన్ రోడ్డుపైనే ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రఘుబాల డివైడర్ దాటి అవతలి వైపు మట్టిరోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి కొన ఊపిరితో ఉన్న అతన్ని అంబులెన్స్లో నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతిచెందాడు. మురుగన్ (ఫైల్) రఘుబాల (ఫైల్) అతివేగమే కారణం ఈ ప్రమాదం ఎంత భయానకంగా జరిగిందో బైక్ పరిస్థితే చెబుతోంది. బైక్ ఒక డివైడర్ను ఢీకొని మరోవైపు ఉన్న డివైడర్ను దాటి వెళ్లిపడింది. దీన్ని బట్టి బైక్ ఎంత వేగంతో ప్రయాణిస్తోందో తెలుస్తోంది. మురుగన్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల కూతురు, ఏడాది వయస్సు గల కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు దూరం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. రఘుబాల తన తల్లిదండ్రులకు ఒక్కడే మగసంతానం. తమకు ఆధారంగా ఉంటాడని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కళ్లముందే కుమారుడు కన్నుమూయడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రి ఆవరణలో విషాదచాయలు అలుముకున్నాయి. అక్కడికి చేరుకున్న బంధువులు, స్నేహితు లు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న నగరి సీఐ మల్లికార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన మరోసారి ‘అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం‘ అనే చేదు నిజాన్ని గుర్తు చేసింది. కొన్ని నిమిషాలు ముందుగా చేరాలనే తొందర రెండు కుటుంబాలకు జీవితాంతం తీరని కన్నీటిని మిగిల్చింది. -
సమస్యలకు సత్వర పరిష్కారం
చిత్తూరు అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా పోలీసు అధికారులను ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. ఆయన సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 41 ఫిర్యాదులను స్వీకరించారు. నాన్ క్యాడ ర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ ఎస్.షాను, డీఎస్పీ వెంకటనారాయణతో కలిసి బాధితు ల సమస్యలను విన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయడమే పోలీసు శాఖ లక్ష్యమన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్న బాధ్యతతో పనిచేయాలని అధికారులకు సూచించారు. 41 ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ తగాదాలకు 10, ఆస్తి తగాదాలకు 6, చీటింగ్కు 3, వేధింపులకు 3, డబ్బు తగాదాలకు 3, చిన్న గొడవలకు 2, బెదిరింపులకు 1, పోలీసు సేవలకు సంబంధించి 1, దారి సమస్యకు సంబంధించిన 1 ఫిర్యాదు ఉన్నట్టు అధికారులు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 8 మందికి రూ.80 వేల జరిమానా
చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని ప్రథమ ప్రత్యే క ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ జి.నిత్యబాబు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ల్లో వారు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహ నాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని, రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 12 ఏళ్ల తర్వాత నిందితులకు జైలు శిక్ష గంగవరం: 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ పలమనేరు కోర్టు స్పెషల్ జడ్జి రాధమ్మ సోమవారం తీరు చెప్పారు. గంగవరం అర్బన్ సీఐ రాంభూపాల్ కథనం మేరకు.. 2014లో మండలంలోని మదర్థెరిసా కళాశాల వద్ద ఆటో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అప్పట్లో బాధితుడు క్రిష్ణప్ప గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ షఫివుల్లాపై నేరం రుజువు కావడంతో 11 నెలల 15 రోజులు జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా, ఆటో యజమాని జయచంద్రకు రూ.వెయ్యి జరిమానా లేదా రెండు నెలలు జైలు శిక్ష విధించారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని మెక్సికో యూనివర్సిటీ ప్రొఫెసర్ మోహన్ కుమార్ తెలిపారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నానో పదార్థాలు, వాటి అనువర్తనా లు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నానో పదార్థాల నిర్మాణం, తయారీ విధానాలు, ప్రత్యేక లక్షణాలపై విద్యార్థులు పట్టుసాధించాలన్నారు. వైద్యరంగం, ఔషధ పంపిణీ, శక్తి ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, నీటి శుద్ధి వంటి రంగాల్లో నానో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తాజా పరిశోధనలు, ఉన్నత విద్య, పరిశోధనా అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ జీవనజ్యోతి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు ఏర్పా టు చేయడంతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అధ్యాపకులు శశికళ, భానుప్రకాష్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు యాదమరి: మండలంలోని కీనాటంపల్లి గ్రామ దళితవాడలో గత నెల 27న జరిగిన వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఈ ఘటనకు సంబందించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కీనాటంపల్లిలో జరిగిన సంఘటనపై జూలై 31న అదే గ్రామానికి చెందిన పౌలు, గోపీనాథ్ నాయుడు స్థానిక పోలీసు స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. పౌలు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్గా గోపీనాథ్నాయుడు ఇచ్చిన ఫిర్యాదుపైనా మరొక కేసు నమోదైంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సోమవారం స్వయంగా రంగంలోకి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇరుపక్షాల సాక్షులను విచారించి వివరాలు సేకరించారు. భూవివాదం కారణంగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ట్రాక్టర్ను ఢీకొన్న మినీ లారీ – డ్రైవర్ మృతి గంగవరం: మండలంలోని గోశాల వద్ద సోమ వా రం రాత్రి ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నారెడ్డిపల్లికి చెందిన జగదీష్(24) సొంతంగా మినీ లారీ కొనుక్కుని బాడుగలు తోలుకుంటున్నాడు. పత్తికొండ వద్ద టమాటా బాక్సు లు లోడ్ చేసుకుని పలమనేరు మార్కెట్కు వెళ్తున్నాడు. గంగవరం మండలం గోశాల వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు. జగదీష్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్టర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. -
టీచర్ల సీనియారిటీ జాబితాలపై వీడని చిక్కుముడి
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల జిల్లా విభజన, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన చేపడుతున్న కేడర్ కేటాయింపుల ప్రక్రియ పొరుగు జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురం, ఇతర జిల్లాల్లో ఇప్పటికే కేడర్, మీడియం, సబ్జెక్ట్ల వారీగా డ్రాప్ట్ సీనియారిటీ జాబితాలను ప్రచురించారు. టీచర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మొదలు పెట్టారు. తుది సవరణలను సైతం పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయోమయంలో అయ్యోర్లు జాబితాల ప్రచురణలో జాప్యం జరుగుతుండడంతో టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. తమ సర్వీసు వివరాలు, సీనియారిటీ సంఖ్య సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం లేక ఆందోళన చెందుతున్నారు. ఆఖరి నిమిషంలో హడావుడిగా జాబితాలు విడుదల చేస్తే అభ్యంతరాలు సమర్పించేందుకు తగినంత సమయం దక్కదని అయ్యోర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రచురించాలని డిమాండ్ ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున, సర్దుబాటు, సర్వీస్ సంబంధిత ప్రక్రియలు సకాలంలో పూర్తి కావాలంటే జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని టీచర్లు కోరుతున్నారు. అన్ని కేడర్ల సీనియారిటీ జాబితాలను పారదర్శకంగా ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణకు తగిన సమయం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జాబితాలు ఏవి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా సబ్జెక్టులు, మేనేజ్మెంట్ వారీగా టీచర్ల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. పొరుగు జిల్లాల్లో జాబితాలను సిద్ధం చేసి డీఈవో అధికారిక వెబ్సైట్, ఎంఈవో, డీవైఈవో ఆఫీసుల్లో ఉంచారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయలోపం, రికార్డుల పరిశీలనలో ఆలస్యం వల్ల జాబితాలు వెలువడడం లేదు. -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం
● కుప్పం ప్రాంతానికి చెందిన ఒకరు మృతి కుప్పం రూరల్: తమిళనాడులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్పం ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందా రు. 15 మంది గాయపడ్డారు. బాధితుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. సోమవారం ఆడిపదినెట్టి పర్వదినం కావ డంతో కుప్పం మండలం మోట్లచేను గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది భక్తులు తమిళనాడు రాష్ట్రం తీర్థకొండ సుబ్రమణ్యస్వామివారి ఆలయానికి ఉదయం బయ లుదేరారు. స్వామివారిని దర్శించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో తిరుపత్తూరు జిల్లా మరకుప్పం వద్దకు రాగానే ఎదురుగా మినీ బస్సు వచ్చి టాటా పికప్ వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో కుప్పం భక్తులు 15 మంది త్రీవంగా గాయపడ్డారు. వారిలో మదన్(28) అక్కడిక్కడే మృతిచెందాడు. పెద్దపాప, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, చెల్లమ్మ, మల్లమ్మ, జయంతి, శివశంకర్, దేవరాజు, చెంగొటమ్మ, సత్య, సంధ్య, శిరీ, సతీష్, రాజప్పతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానికులు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో శివశంకర్, పెద్దపాప, వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలియగానే మోట్లచేను గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టాటా పికప్ వాహన డ్రైవర్ వెంకటేష్ ఉతంగరి పోలీసుల అదుపులో ఉన్నాడు. -
ఆరోగ్య భరోసా
చిన్నారులకు బిడ్డలు చేసే అల్లరి.. బోసి నవ్వులను చూస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే దూరమవుతుంది. పిల్లలు ఉండే ఇల్లు కళకళలాడుతూ సందడిగా ఉంటుంది. అందుకే ప్రతి ఇంటిలోనూ పిల్లలు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు చిన్నారుల్లో సరైన ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. పుట్టుకతో వచ్చే సమస్యలా లేక పోషకాహార లోపమా అన్న విషయం తెలియక మానసిక వేదనతో కుమిలిపోతుంటారు. కారణం ఏదైనా వ్యాధి ముదరకముందే పసిగట్టి బిడ్డలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఉద్దేశించిందే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే 2.0). దీనికింద ప్రతి చిన్నారికీ డిజిటల్ హెల్త్కార్డు ఇస్తారు. తద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేసి జీవితాలను ఆనందమయం చేస్తారు. కాణిపాకం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 60 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 536 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని చిన్నారులను జల్లెడ పట్టనున్నారు. జిల్లాలోని 2,188 అంగన్వాడీ కేంద్రాల్లోని 50,355 మంది పిల్లలతో పాటు ఎన్రోల్ కాని 1,313 మంది చిన్నారులను రెండు విడతల్లో పరీక్షించనున్నారు. మొదటి విడత స్క్రీనింగ్ జూలై 15 నుంచి డిసెంబర్ 15 వరకు, రెండో విడత డిసెంబర్ 16 నుంచి జూన్ 15 వరకు కొనసాగుతుంది. అలాగే 2,086 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 1,26,545 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 1,78,213 మంది చిన్నారులకు వైద్య తనిఖీలు నిర్వహించడమే లక్ష్యంగా వైద్యాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 126 పనిదినాల్లో రోజుకు సగటున 1,414 మందిని, వారానికి 7,072 మంది చొప్పున ప్రతినెలా 28,288 మంది చిన్నారులను కవర్ చేయాలనేది పక్కా లక్ష్యంగా చేకున్నారు. మారిన కాలానికి తగ్గట్టుగా.. ఈ సారి అందుబాటులోకి వచ్చిన ఆర్బీఎస్కే 2.0 వర్షన్ పాతదానికంటే భిన్నంగా, ఆధునికంగా రూపుదిద్దుకుంది. పాత రకం వ్యాధులకే పరిమితం కాకుండా డిజిటల్ ఎక్స్పోజర్, మానసిక ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు, కిడ్నీ సంబంధిత రుగ్మతలను కూడా ఇందులో చేర్చారు. ఆయుష్ వైద్యులతో పాటు నర్సులు, కౌన్సెలర్లు, ఇతర ఆరోగ్య నిపుణులను భాగం చేస్తున్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్య రికార్డులను భద్రపరిచేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డ్ పంపిణీ చేయనున్నారు. దీనిని ఆర్సీహెచ్, యు–విన్, పోషణ్ పోర్టళ్లతో అనుసంధానిస్తారు. చెవుడు సమస్య ఉన్న పిల్లలకు చేసే ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఉచిత వైద్యం వయోపరిమితిని 2 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పెంచడం పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. 38 రకాల రుగ్మతలకు ఉచిత సంరక్షణ పరీక్షల్లో బిడ్డకు సమస్య ఉన్నట్లు తేలితే ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుంది. పుట్టుకతో వచ్చే గ్రహణమొర్రి, గుండె లోపాలు, డౌన్ సిండ్రోమ్, కంటి శుక్లాలు, చెవుడు, విటమిన్ ఎ, డి లోపాలు, రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపాలను గుర్తిస్తారు. అలాగే చర్మ వ్యాధులు, చిన్ననాటి మధుమేహం, ఫిట్స్, టీబీ, కిడ్నీ సమస్యలు, ఆటిజమ్, ఏడీహెచ్డీ, అభ్యసన లోపాలు, మాటలు సరిగా రాకపోవడం వంటి 38 రకాల రుగ్మతలను గుర్తించి ప్రాథమిక దశలోనే నివారిస్తారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, నేరుగా బడులు, అంగన్వాడీల వద్దకే ప్రత్యేక వైద్య బృందాలు రానున్నాయి. చిన్నారి శరీరంలో నిద్రాణంగా ఉన్న అనారోగ్యాన్ని ముందే తుంచేయడమే ఈ ప్రాజెక్ట్ ధ్యేయం. చిత్తూరు జిల్లాలో ప్రారంభం కానున్న ఈ ప్రణాళిక ఎంతోమంది పేద తల్లిదండ్రులకు కొండంత అభయాన్ని ఇస్తోంది. లక్ష్యం మేరకు పనిచేస్తాం జూలై 27 నుంచి ఆర్బీఎస్కే 2.0 ప్రారంభమైంది. పకడ్బందీగా స్కీనింగ్ చేస్తున్నాం. వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తాం. పిల్లలకు ఆరోగ్య భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అనారోగ్య సమస్యలను గుర్తించి తగిన వైద్యం అందేలా చూస్తాం. స్క్రీనింగ్ పరీక్షలు వంద శాతం పూర్తి చేసేందుకు పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు సహకరించాలి. – నాగశశిభూషణ్రెడ్డి, డీఎంహెచ్ఓ, చిత్తూరు -
ఆరోపణలు మాని అభివృద్ధి చేయండి
కార్వేటినగరం: ప్రభుత్వం ప్రతిపక్షంపై ఆరోపణలు, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం మాని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆయన సోమవారం పుత్తూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందన్నారు. అవినీతి పెచ్చుమీరిందని, దీనిపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కూటమి నేతలు గుట్టలు, కొండలు, వాగులు, వంకలను దోచుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రిగా ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చావు. ఎన్ని కళాశాలలు నిర్మాణం చేశావు. ఎంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావు.. ఎంతమంది రైతులను ఆదుకున్నావు’’ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ నాయకుడూ నాణ్యమైన మద్యం ఇస్తా అని ఓటు అడగలేదని, చంద్రబాబు ఒక్కరే మద్యం ఇస్తానని ప్రకటించాడన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలతో 21 మంది విద్యార్థులు మృతి చెందితే చంద్రబాబు మాట్లాడకపోవడం దారు ణమన్నారు. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రంగా కాపుల కోసం పోరాడిన వ్యక్తులని గుర్తు చేశారు. సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కాపుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాపులను కాల్చిబూడిద చేసినా, దాడు లు చేసినా పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదని విమర్శించారు. ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చెయ్ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారని, దేశంలో ఎన్నడూ చేయలేని సంక్షేమ పథకాలను అమలు చేశారని నారాయణస్వామి గుర్తు చేశారు. జగనన్నపై బురద చల్లడం మాని, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నిక ల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్.జగన్మోహన్రడ్డి అధికారంలోకి వచ్చాక పేద వాడి తలరాతలు మారా యని తెలిపారు. నేడు చంద్రబాబు హయాంలో పేదవాడికి సంక్షేమం అందిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాల కన్వీనర్లు శేఖర్రాజు, పద్మనాభరెడ్డి, మణి, వెంకట్రెడ్డి, విజయకుమార్రెడ్డి, వళ్లివేడు పృథ్వీరెడ్డి, జెడ్పీటీసీ సుకుమార్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు తదితరులు పాల్గొన్నారు. -
పరిష్కారమేదీ..?
కలెక్టరేట్కు వచ్చిన దివ్యాంగుడు మునివెంకటరెడ్డి చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పోటెత్తారు. వారి నుంచి డీఆర్వో మోహన్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ తదితర అధికారులు అర్జీలు స్వీకరించారు. ప్రజలు మాట్లాడుతూ ఎన్నిసార్లు తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా న్యాయం చేయండి సారూ అంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసులు, భవాని, డిప్యూటీ కలెక్టర్ వెంకటసునీల్, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి పుల్లారెడ్డి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మా ఊరి ఉనికిని కాపాడండి పలమనేరు–కుప్పం మధ్య ప్రతిపాదించిన ఎన్హెచ్–42 నాలుగు లేన్ల జాతీయ రహదారి అలైన్మెంట్ వల్ల తమ గ్రామానికి ముప్పు వాటిల్లుతోందని వి.కోట మండలం దానయ్యగారిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊరి మధ్యగా రహదారి వెళ్లడం వల్ల గ్రామంలో రూ.60 లక్షలతో నిర్మించిన పురాతన ఆలయం దెబ్బతింటుందని చెప్పారు. అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, 40 ఇళ్లు, బోర్లు, భూములు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి అలైన్మెంట్ను కొద్దిగా మార్చి తమ ఊరి ఉనికిని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దు విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడంతోపాటు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు ఆరణి ఉపేంద్ర, టి.జగన్నాధం, నాయకులు భాస్కర్, మురళీ వాపోయారు. వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోనే నడపాలని కోరారు. సీ్త్ర శక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా 4 వేలకు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆయాలకు 5 నెలల జీతాలు చెల్లించాలి నగరి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు 5 నెలలు జీతాలు చెల్లించలేదని, వారు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు ఎస్.నాగరాజు, జిల్లా అధ్యక్షుడు వి.సి.గోపీనాథ్, ఏపీ ప్రభుత్వ పాఠశాల ఆయమ్మల వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.జయకుమారి తెలిప4ఆరు. వారు మాట్లాడుతూ కలెక్టర్ జోక్యం చేసుకుని ఆయాల పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. బడి ఉంది, పిల్లలున్నారు.. టీచర్ ఎక్కడ ? బడి ఉంది. పిల్లలున్నారు.. టీచర్ ఎక్కడ అంటూ బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామస్తులు వాపోయారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థుల చదువు దెబ్బతింటోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు జి.సుధాకర్, జి.భారతి, టి.నిర్మల, టి.భాస్కర్ సమస్యను పీజీఆర్ఎస్లో ఉన్నతాధికారులకు విన్నవించారు. అర్హత కలిగిన సోషల్ ఉపాధ్యాయుడిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే!
రాజీనామా చేసేంత వరకు పోరాటం కార్వేటినగరం: నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి బాధ్యత వహించిన ఽకేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు డీఎస్సీ నియామకాల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్యర్యంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ నాయకుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన డీఎస్సీలో అర్హులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముసుగులో నారాలోకేష్ దాదాపు 16 వేల టీచర్ పోస్టుల్ని ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్ లో పాల్గొనని, ఏ పతకం సాధించని వారిని దొంగ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా కింద టీచర్ పోస్టులు ఇచ్చారని విమర్వించారు. నారా లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్, ఆముదాలవలస ఎమ్మెల్యే పూర్ణరవికుమార్ సాఫ్ట్బాల్ డ్యూరేకి ఒక క్రీడా సంఘాన్ని ఏర్పాటు చేసి అనర్హులైన 29 మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. డీఎస్సీ దందాపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు నీట్ పరీక్షల్లో జరిగిన తప్పులపై యువత రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు పోరాటం చేశారని, అదే తరహాలో రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాల్లో జరిగిన అన్యాయానికి కారుకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం చేస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోను నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చి అధికారపార్టీ మెడలు వంచి న్యాయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు 6వ తేదీ నుంచి 9వరకు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. 10వ తేదీ నియోజకవర్గం స్థాయిలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరీశీలకులు వల్లివేడు పృథ్విరెడ్డి, మండల కన్వీనర్లు శేఖర్రాజు, పద్మనాభరెడ్డి, మణి, వెంకటరెడ్డి, విజయకుమార్రెడ్డి, జెడ్పీటీసీ సుకుమార్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి, హేమసుందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూదిమోహన్, మాజీ మండల కన్వీనర్ ధనుంజయవర్మ, వెంకటేష్రెడ్డి, మధివన్నన్ పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు ముందస్తు భేటీ
● సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు వార్షిక ఉత్సవాలు ● ఉభయదారులు కలిసికట్టుగా విజయవంతం చేయాలి ● ఈవో పెంచలకిషోర్ కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ 2026 సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉభయదారులు కలిసికట్టుగా పనిచేయాలని ఈవో పెంచల కిషోర్ కోరారు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉభయదారులు, గ్రామస్తులతో దేవస్థానం అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ ఈ ఏడాది వినాయక చవితి నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉభయదారులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. 21 రోజుల పాటు ఉత్సవాలు దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ సెప్టెంబరు 14వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు 21 రోజుల పాటు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఉభయదారులు, స్థానిక ప్రజలు కలిసికట్టుగా శ్రమించి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ముఖ్య అధికారులు, ఆలయ మాజీ చైర్మన్లు, పలువురు ఉభయదారులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం చిత్తూరు కలెక్టరేట్ : నాటకరంగ దిగ్గజం, సంఘ సంస్కర్త బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయమని డీఆర్వో మోహన్ కుమార్ కొనియాడారు. కలెక్టరేట్లో ఆదివారం బళ్లారి రాఘవ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ బళ్లారి రాఘవ తెలుగు, కన్నడ నాటక రంగాలకు అనేక సేవలందించారన్నారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికి వెచ్చించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నరేంద్రకుమార్, టూరిజం శాఖ మేనేజర్ గౌరి, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి చిత్తూరు జిల్లా చెస్ పోటీలు ప్రారంభం
నగరి : స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు నగరి చెస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వీకేఆర్ పురం గ్రాండ్ వరల్డ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు. జూనియర్ విభాగంలో 140 మంది, సీనియర్ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రీజినల్ చైర్పర్సన్ ప్రభాకర్ రాజు, పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు ఓ.బాలసుబ్రమణ్యం చెస్ ఆడి పోటీలను ప్రారంభించారు. ప్రభాకర్రాజు మాట్లాడుతూ పూర్వం రాజులు యుద్ధంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు అనుసరించిన విధానాలతో పుట్టుకొచ్చిందే చదరంగమన్నారు. అది క్రీడగా మారి విశ్వవ్యాప్తమైందన్నారు. ఈ క్రీడతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు. ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ 29 యేళ్ల క్రితం స్నేహితుల దినోత్సవం రోజు ఈ పోటీలను నగరిలో ప్రారంభించినట్టు తెలిపారు. నేడు అదే స్నేహితుల దినోత్సవం రోజున పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గజేంద్ర మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ ఫైనల్స్ జరుగుతాయని, విజేతలకు బహమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చదరంగ నిపుణులు నవీన్కుమార్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్కుమార్, కోశాధికారి శక్తివేలు తదితరులు పాల్గొన్నారు. -
ఆగని ఇసుక సెగ
సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు మండలం అనంతాపురం పంచాయతీ పరిధిలోని శెట్టిన్తంగాల్లో జరుగుతున్న ఇసుక అక్రమాలపై గతవారం అధికారులకు ఫిర్యాదు అందింది. దీని వెనుక అదే పంచాయతీకి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ ఉన్నారనే అనుమానంతో శనివారం గ్రామంలో జరిగిన ఒక గొడవలో సొంత పార్టీ నేత జయచంద్రనాయుడు దాడికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బాధితుడు ప్రవీణ్ నేరుగా ఐటీ, విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్కు ఎక్స్ ద్వారా, అలాగే రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే ఇసుక దందాకు సంబంధించి జరిగిన గొడవ అధి ష్టానం వద్దకు వెళ్లడంతో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బాధితుడు ప్రవీణ్ను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా పంచాయతీలో సదరు నేతలు సాగిస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రవీణ్ ఎమ్మెల్యేకు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది. అమరావతి నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్స్, ఇసుక గొడవ వివరాలను ప్రవీణ్కు ఎమ్మెల్యే చూపించి వివరణ ఇచ్చినట్టు సమాచారం. దాడి చేసిన సదరు నేత వైఖరిపై ఎమ్మెల్యే కూడా గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మళ్లీ కూడా రచ్చ..రచ్చ ఎమ్మెల్యేను కలిసి వచ్చిన వెంటనే ప్రవీణ్పై ప్రత్యర్థి వర్గం బురదజల్లే కార్యక్రమానికి తెరలేపింది. గతంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే తనయుడి సమక్షంలో ప్రవీణ్ వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్న పాత ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయించారు. దీన్నే బలమైన ఆయుధంగా మలుచుకుని, ప్రవీణ్ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ ప్రచారం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆదివారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ప్రవీణ్ నిర్ణయించుకోగా, స్థానిక టీడీపీ నేతలు తొక్కిపెట్టారు. మరోవైపు కుర్చీవేడు కాలనీకి చెందిన కొందరు యువకులతో ప్రవీణ్పై మళ్లీ భౌతిక దాడి చేయించేందుకు ప్రత్యర్థి వర్గం కుట్ర పన్నుతోందని టీడీపీలోని రెండు వర్గాలు ఆరోపిస్తున్నాయి. స్థానికంగా సరైన న్యాయం జరగకపోవడంతో అనంతాపురం పంచాయతీలో జరుగుతున్న ఇసుక అక్రమాలు, దందాలు, అరాచకాలపై ఆధారాలతో సహా నేరుగా మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రవీణ్ సిద్ధమయ్యాడని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ఈ ఇసుక గొడవలు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుండడంతో చిత్తూరు రూరల్ మండల నేతలు అత్యవసరంగా సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. -
డమ్మీ వైద్యం దందా
జిల్లాలో డమ్మీ క్లినిక్లు, అనుమతి లేని దొంగ ఆస్పత్రుల దందా యథేచ్ఛగా సాగుతోంది. వైద్య విద్య అర్హత, ప్రభుత్వ అనుమతి లేకుండా వీధి వీధిలోనూ ఆస్పత్రులు, క్లినిక్లు ఏర్పాటుచేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు బొందపెట్టి దర్జాగా నిర్వహిస్తున్న ఈ డమ్మీ దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు కంటితుడుపు చర్యలైనా తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాణిపాకం: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోనే అనుమతులు లేని క్లినిక్లు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 వరకు అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు నడుస్తున్నట్టు సమాచారం. నగరంలోని పొన్నియమ్మగుడి వీధి, దర్గా సర్కిల్, సుందరయ్య వీధి, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, ప్రశాంత్నగర్, మిట్టూరు, గాంధీరోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా డమ్మీ క్లినిక్లు విచ్ఛలవిడిగా వెలిశాయి. నగరి, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లోనూ వేలాదిగా అనుమతి లేని ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ఎలాంటి వైద్య కోర్సులు చదవని వారు ఇక్కడ డాక్టర్ల అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వైద్యం అందిస్తున్నారు. విచ్ఛలవిడి దోపిడీ ఈ డమ్మీ సెంటర్లలో రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా అనుమతి లేని మందులు, హై డోసేజ్ మాత్రలను విచ్ఛలవిడిగా విక్రయిస్తున్నారు. చిన్నపాటి రుగ్మతలకు కూడా తీవ్రమైన యాంటీబయోటిక్స్ మందులు ఇస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రజ లను భయాందోళనలకు గురిచేసి వేలకు వేలు ఫీజులు గుంజేస్తున్నా రు. జిల్లాలో ఏయే ప్రాంతా ల్లో అనుమతు లు లేకుండా క్లినిక్లు నడుపుతున్నారు, ఎవ రు అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారు అనే పక్కా వివరాలు వైద్యారో గ్య శాఖ అధికారుల వద్ద ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకా రం కనీసం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయకపోవడం వెనుక విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్న ఈ నకిలీ వైద్యులపై తక్షణ మే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న డమ్మీ క్లినిక్లు, ఆస్పత్రుల వివరాలను సేకరిస్తాం. ప్రత్యేక టీమ్ల ద్వారా సమగ్ర విచారణ జరిపిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తులు వైద్యం అందించినా, అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగశశిభూషణ్రెడ్డి, డీఎంహెచ్ఓ, చిత్తూరు -
తాగి నడిపితే అంతే..!
చిత్తూరు అర్బన్: ‘‘మద్యం మత్తులో స్టీరింగ్ పడితే అది రోడ్డుపై మృత్యుఘంటికలు మోగించడమే. క్షణికానందం కోసం బాటిల్ పట్టి, ఆపై వాహనమెక్కితే కుటుంబాలకు శాశ్వత విషాదమే మిగులుతుంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అంటే మీ ప్రాణాలను మాత్రమే కాదు అమాయకుల ప్రాణాలను కూడా బలితీసుకోవడమే’’ అని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి 771 మందికి రూ.77.10 లక్షల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 771 మందికి ఫైన్ల వాత రోడ్డు ప్రమాదాల నివారణ, అమాయకుల ప్రాణాల రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఈ ఏడు నెలల కాలంలో పోలీసుల తనిఖీల్లో వందలాది మంది తాగుబోతు డ్రైవ ర్లు చిక్కడం గమనార్హం. 771 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. వారికి కోర్టు రూ.77.10 లక్షల జరి మానా విధించింది. ప్రధాన, జాతీయ రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆక్సిడెంట్ జోన్లలో బ్రీత్ అనలైజర్లతో పోలీసులు డేగకన్ను వేశారు. మద్యం తాగి వాహనం తోలుతూ దొరికిపోతే మో టారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుల్లో నిలబెడుతున్నారు. జరిమానాతో వదిలేది లేదని, క్రమంతప్పకుండా దొరికితే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. అవసరమైతే జైలు శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు. బాధ్యత మరవరాదు జిల్లా ప్రజలందరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పక పాటించాలి. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనా లు నడపకూడదు. కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మద్యం మత్తులో నిర్ణయాలు తీసుకునే సామ ర్థ్యం నశిస్తుంది. ప్రమాదాన్ని ముందే గుర్తించే స్పృహ లేకపోవడం వల్లే ఘోర విపత్తులు జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్పై ఎలాంటి రాజీ ఉండేది లేదు. ప్రజల భద్రత కోసమే తనిఖీలను మరింత విస్తృతం చేస్తాం. – తుషార్ డూడి, జిల్లా ఎస్పీ, చిత్తూరు -
‘ఉపాధి’లో లక్షల్లో అవినీతి
గుడిపాల: మండలంలోని గట్రాళ్లమిట్ట పంచాయ తీ శాంతినగర్కు చెందిన గోపీనాథ్ ఆర్టీసీ బస్సు కండెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి పోస్టాఫీసులో ఖాతా ఉంది. రెండేళ్లుగా ఇతని ఖాతాలోకి రూ.లక్షలు ఉపాధిహామీ నిధులు జమ అవుతున్నాయి. ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఉపాధిహామీ పని ఎలా చేస్తారని పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నగదు ఫీల్డ్ అసిస్టెంట్కు చేరిందని తెలుస్తుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభు త్వ ఉద్యోగులకు ఉపాధిహామీ పనులు కల్పించకూడదు. ఇక్కడ మాత్రం ఏకంగా జాబ్కార్డ్ అందించి మరీ బిల్లులు పెట్టిన వైనం చూస్తుంటే మండలంలో ఎన్నిచోట్లా ఎన్ని లక్షలు స్వాహా అయ్యా యో ఇట్టే అర్థమవుతుంది. మరోవైపు శాంతినగర్ గ్రామానికి చెందిన శ్రీలత ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె బ్యాంకు ఖాతాలోనూ వేలల్లో నగదు జమ అయింది. వంక పనిచేయకుండానే బిల్లులు గట్రాళ్లమిట్ట పంచాయతీలో తమ్మిరెడ్డిచెరువు నుంచి నత్తం గ్రామానికి వెళ్లే వంక పనులు చేసినట్లు సుమారు రూ.1.50 లక్షలు స్వాహా చేసినట్టు సమాచారం. ఇందుకు గాను రూ.3 లక్షలు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభిచాల్సి ఉంది. పనులు చేయకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ తమ బంధువుల పేర్లను మస్టర్లో చూపించి సుమారు రూ.1.50 లక్షలు కాజేసినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. పనులు చేయకుండానే బిల్లులు ఎలా మంజూరు చేస్తారని నిలదీయడంతో టీడీపీ నాయకుడైన తన భర్తను రంగంలోకి దింపింది. ఎవరైనా ఏమైనా మాట్లాడితే మీకు పనులు కల్పించేది లేదని కూలీలను బెదిరించారు. దీంతో వారు పనులు దొరకవేమోనన్న భయంతో సైలెంట్ అయిపోయారు. రైతులకు తెలియకుండానే కొబ్బరి మొక్కల బిల్లు స్వాహా శాంతినగర్కు చెందిన బాబు అనే రైతు ఎకరాలో కొబ్బరి మొక్కలు నాటాడు. ఇందుకు సంబంధించి ఉపాధిహామీ (వీజీబీరామ్జీ) పథకంలో కొబ్బరి మొక్కల పెంపకం పథకం ఉందని కూడా ఆ రైతుకు తెలియదు. ఆ రైతు పొలంలో ఫారంపాండ్ గుంతలు తవ్విస్తామని చెప్పి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డ్, జాబ్కార్డ్లను తీసుకొని పని కొబ్బరి మొక్కలకు బిల్లులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైతు ఉపాధి హామీ కార్యాలయానికి వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ చాకచక్యంగా అతన్ని మేనేజ్ చేసి ఇంటికి పంపించేసినట్టు సమాచారం. తర్వాత భూమి రికార్డులు ఇస్తే తాను బిల్లులు పెట్టిస్తానని చెప్పి ఆ రైతును నమ్మించింది. సంబంధింత అధికారులు ఈ అవినీతిని పూర్తిస్ధాయిలో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని గట్రాళ్లమిట్ట గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఏపీవోను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ ఉద్యోగి గోపీనాథ్ద్ ఖాతాలో జమైన ఉపాధిహామీ నగదు ఏఎన్ఎం శ్రీలత ఖాతాలో పడిన ఉపాధి హామీ బిల్లులు గుడిపాల మండలంలో ఉపాధిహామీ పథంకం (వీజీబీ రామ్జీ)లో లక్షల్లో అవినీతి జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా బిల్లులు పెట్టి రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు. ఇందులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్ భర్త తెలుగుదేశం నాయకుడు కావడంతో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రోడ్డు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కేవీబీపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కేవీబీపురం మండలంలో చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం, పెనుమల్లం గ్రామానికి చెందిన పెమ్ముగారి సెల్వ కుమార్ (50) కేవీబీపురం మండలం, ఆదవరం గ్రామంలోని అక్క పార్వతమ్మ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో హాజరై తిరుగు ప్రయాణమయ్యాడు. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు గుంటమెట్టు వద్ద ఢీకొట్టింది. సెల్వకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108లో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కొత్తకండ్రిగ వద్ద మృతిచెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు భరత్కుమార్ ఉన్నారు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సెల్వకుమార్ అకాల మరణంతో కుటుంబం వీధిన పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబయ్య తెలిపారు. -
నూటికి రూ.20 వడ్డీ
పలమనేరు: పట్టణంలో కొందరు అనధికారిక వడ్డీ వ్యాపారులు సాగిస్తున్నా రు. ప్రజల అవసరాన్ని బట్టి నూటికి రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ వ సూలు చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. పలువురు మహిళలు చుట్టుపక్కల ఉన్న వారికి ఇలా అధిక వడ్డీలకు అప్పులిస్తున్నట్టు తెలు స్తోంది. వడ్డీలకు డబ్బులివ్వాలంటే అధికారుల నుంచి అనుమతులు పొందాలనే విషయం కూడా వీరికి తెలియదు. దీంతో అడిగేవారే లేరని ఇష్టానుసారంగా అధిక వడ్డీలతో జనాన్ని పీడిస్తున్నారు. తమిళ తంబీల ఫైనాన్స్ గోల పలమనేరు ప్రాంతం తమిళనాడుకు ఆనుకుని ఉండడంతో ఆ రాష్ట్రానికి చెందిన గుడియాత్తం, వేలూరు తదితర ప్రాంతాలకు చెందిన వడ్డీ వ్యాపారులు గ్రామాల్లోని చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తూ అధిక వడ్డీలకు నగదు ఇస్తున్నారు. వీరు సకాలంలో కంతులు కట్టకుంటే దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. బాధితుల పింఛను కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులను ముందుగానే స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. లబోదిబోమంటున్న బాధితులు ఏదో అవసరాల కోసం అప్పు చేసిన బాధితులు అధిక వడ్డీలు కొన్నాళ్లు కట్టి ఆపై కట్టక అసలు, వడ్డీ పెరిగి దాన్ని చెల్లించక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులిచ్చే వారు ఎంతమేరకు వడ్డీ వసూలు చేయాలనే అంశం వడ్డీ నియంత్రణ అధికారి పర్యవేక్షణలో జరగాలి. ఎవరూ అధుక వడ్డీలపై చర్యలు తీసుకోకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఆడిందే ఆటగా తయా రైంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు ఇలాంటి అధిక వడ్డీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు బీసీ కాలనీకి చెందిన గంగాదేవికి భర్త లేడు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడింది. చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. తన అవసరం నిమిత్తం ఒక మహిళ ద్వారా రూ.లక్ష అప్పు తీసుకుంది. ఇందుకు గాను రూ.10ల చొప్పున వడ్డీ చెల్లించింది. ఆపై వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో డబ్బు చెల్లించలేకపోయింది. దీంతో అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఆమె ఇంట్లో లేనప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకుంది. బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇదే గంటావూరు కాలనీకి చెందిన కొందరు అధిక వడ్డీలు కట్టలేక గ్రామాన్ని వదిలి గతంలో పారిపోయారు. పట్టణంలోనే కాకుండా గ్రామాల్లోనూ అధిక వడ్డీ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. అనధికారిక ఫైనాన్స్ సంస్థల కార్యకలాపాలు మరోవైపు పట్టణంలో పదుల సంఖ్యలో అనధికారిక ఫైనాన్స్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీరు డైలీ, వీక్లీ ఫైనాన్స్లను ఇస్తుంటారు. ఎవరైనా అప్పు తీసుకుని కంతు చెల్లించకుంటే బాధితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చే డైలీ ఫైనాన్స్ ఏజెంట్లు ఏమాత్రం భయపడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల దందా -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 86,231 మంది స్వామి ని దర్శించుకున్నారు. 32,017 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శ న టిక్కెట్లు లేని వారికి 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నా రు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలి గిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణవనం జెడ్పీ ఉన్నత పాఠశాల తమిళ (సోషియల్) ఉపాధ్యాయుడు కె.మునివేలును సస్పెండ్ చేసినట్లు ఆదివారం డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థినికి మొబైల్ ఫోను ద్వారా అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో సదరు విద్యార్థిని వేధింపులు తాళలేక మరణించించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మౌఖిక నివేదిక మేరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నారాయణవనం మండల విద్యాశాఖాధికారి విచారించి తమకు అందజేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు. అలిపిరిలో రోడ్డు ప్రమాదం – గుర్తు తెలియని వృద్ధుడి మృతి తిరుపతి క్రైం : తిరుపతి లోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని వామన ఇన్ లాడ్జ్ వద్ద ఉదయం సుమారు 5.15 గంటల సమయంలో 65 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓ వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, లీలామహల్ నుంచి కపిలతీర్థం వైపు వెళ్తున్న బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ప్రమాద వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మోటార్ సైకిల్ను నడిపిన వ్యక్తి తిరుపతికి చెందిన మాధవగా పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆటో బోల్తా – ఉప్పు వ్యాపారి మృతి శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ముచ్చివోలు సమీపంలో శనివారం ఉప్పు బస్తాలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. నెల్లూరు జిల్లా, సంగం మండలం, జానగొండ దిబ్బకు చెందిన మురళి (29) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో వెంకటగిరి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ముచ్చివోలు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు. -
● కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆస్థాన మండపంలో ఆదివారం సంకటహర గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో నాలుగు బ్యాచ్లుగా వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి స్వామి వారిని స్వర్ణ రథంలో ఊరేగించారు. ఈ క్రమంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. – కాణిపాకంస్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. – కాణిపాకం -
భక్తుల వినూత్న మొక్కులు
● భక్తులతో కిటకిటలాడిన సుబ్రమణ్య స్వామి ఆలయం కుప్పం: మండలంలోని వానగుట్టపల్లిలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడిమాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా ఆడిమాసంలో భక్తులు కావళ్లు చెల్లిస్తారు. ఈ ఏడాది భక్తులు శరీరానికి శూలాలు గుచ్చుకుని ఎస్సార్ట్ వాహనంలో విన్యాశాలు చేశారు. సైకిల్ చక్రం తరహాలో ఒక భక్తుడు శరీరానికి శూలాలు గుచ్చుకున్నాడు. కొందరు నోటిలోనూ శూలాలు గుచ్చుకున్నారు. వీటిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో హారోం హర నామ స్మరణతో వానగుట్టపల్లి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. -
బయట రూ. 46.. ఇక్కడ రూ. 52..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మంచి నాణ్యమైన 26 కేజీల బియ్యం బస్తా రూ.1,200లకు (కిలో సగటున రూ.46) లభిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో సూపర్ఫైన్, స్టీమ్, సోనామసూరి రకాల బియ్యం కిలో రూ. 52 చొప్పున, రా బియ్యం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రకటించారు. బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లోనే ధరలు ఎక్కువగా ఉండడం ఏమిటని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ కేంద్రాలను, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి ధరలకు .. బయట ధరలకు వ్యతాసం కనిపిస్తోంది. -
వినాయకుడి సాక్షిగా..
దైవ సాక్షిగా వైఎస్సార్సీపీ శ్రేణుల ప్రమాణం టీడీపీ నేతల దొంగ నాటకాలను స్పష్టం చేసేలా వైఎస్సార్సీపీ రాష్ట్ర మొదలియార్ విభాగ అధ్యక్షుడు జ్ఞానజగదీష్, రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి గాయత్రిదేవి, జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు హరీషారెడ్డి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి పుష్కరిణిలో మునిగి దైవ సాక్షిగా మీడియా సమక్షంలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్ వైఖరితో కర్ణాటకలో తలెత్తిన వివాదంతో తమ నాయకుడు ఎంసీ విజయానందరెడ్డికి కానీ, వైఎస్సార్సీపీకి కానీ ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు విజయానందరెడ్డి దగ్గర షణ్ముగం అనే వ్యక్తి లక్షలాది రూపాయల డబ్బులు తీసుకున్నది కూడా నిజమేనని ప్రమాణం చేశారు. తాము ధైర్యంగా కోనేరులో మునిగి ప్రమాణం చేస్తుంటే, సవాల్ విసిరిన టీడీపీ నేత షణ్ముగం డ్రామాలు ఆడుతూ అసలు ప్రమాణమే చేయకుండా జారుకున్నారని మండిపడ్డారు. గతంలో టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు నకిలీ బంగారం పెట్టి డబ్బులు కాజేసిన కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లాడని, నాటి టీడీపీ ప్రభుత్వమే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్లీ పచ్చ చొక్కా వేసుకుని అధికార బలంతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టిస్తూ బెదిరించాలని చూస్తే భయపడేది లేదని హెచ్చరించారు. ప్రమాణం ముగించుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు బయటకు వచ్చే సమయంలో టీడీపీ వర్గాలు వారిపైకి దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడగా, పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను సర్దుబాటు చేశారు. వీఐపీ గేటు ఇరుపార్టీలు చేరుకోవడం ఉద్రిక్తత వాతావరణం సత్యప్రమాణంలో జ్ఞానజగదీష్, గాయత్రిదేవి, హరీషారెడ్డి సాక్షి టాస్క్ఫోర్స్: దేవుడి సాక్షిగా సత్యం చెప్పే ధైర్యం నిజాయితీపరులకే ఉంటుందని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో శనివారం స్పష్టమైంది. వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డిపై టీడీపీ నేతలు చేసిన అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రమాణం చేసి మరీ తిప్పికొట్టాయి. ఎమ్మెల్యే నోటి దూలతో.. కర్ణాటకకు చెందిన వారు ఆగ్రహించడంలో విజయానందరెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, టీడీపీ విసిరిన సవాల్ను స్వీకరించి స్వచ్ఛందంగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు శనివారం కాణిపాకం ఆలయ కోనేరులో మునిగి సత్యప్రమాణం చేశారు. మరోవైపు సవాల్ విసిరిన టీడీపీ నేత షణ్ముగం మాత్రం ప్రమాణానికి ముఖం చాటేసి, లోపలి నుంచి దొంగచాటుగా పారిపోయినట్లు వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపించాయి. కాణిపాకంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రమాణానికి వస్తున్నారనే విషయం తెలిసి పోలీసులు కాణిపాకంలో శనివారం తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించారు. పార్టీ నాయకులను అడుగడుగునా అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినా, పోలీసుల అడ్డంకులకు చెక్ పెట్టి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు కాణిపాకం చేరుకున్నాయి. అదే సమయంలో టీడీపీ వర్గాలకు మాత్రం ఆలయంలోకి సులభంగా వెసులుబాటు కల్పిస్తూ పోలీసులు తీవ్ర పక్షపాత వైఖరి ప్రదర్శించారని, కనీసం మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయలే దని వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా నేత ప్రమాణంకు సిద్ధం.మీరు సిద్ధమా..? వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆదివారం స్వయంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చి సత్యప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ధైర్యముంటే స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్, ఆయన పచ్చ బ్యాచ్ అంతా కలసి కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయాలని బహిరంగంగా సవాల్ విసిరారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, నాయకులు త్యాగరాజులు, అంజలిరెడ్డి, మనోజ్రెడ్డి, ఆను, రజనీకాంత్, స్టాండ్లీ, నారాయణ, అల్తాఫ్, మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాణిపాకం ఆలయానికి విరాళాలు
కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి శనివారం పలువరు భక్తులు విరాళాలు అందజేశారు. తిరుచానూరుకు చెందిన దాత ఏ.సూర్య పవన్ కుటుంబ సభ్యులు స్వామివారికి రూ.38 లక్షల విలువైన 12 కిలోల వెండి కవ చాలను (సర్వాంగ కవచం, తొండం, హస్తాలు, చెవు లు) సమర్పించారు. దాతలకు ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు ప్రత్యేక దర్శనం కల్పించి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే నిత్య అన్నదాన ట్రస్టుకు గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావు రూ.1,00,116, తూర్పు గోదావరికి చెందిన సూర్యనారాయణ రూ.1,00,016, వై ఎస్ గేట్కు చెందిన గంగారపు హరిబాబు నాయుడు రూ.1,00,116 చెక్కు రూపంలో విరాళాలు అందించారు. ఏఈఓ ధనపాల్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు. -
క్రిష్ణప్ప మృతికి టీడీపీ నేతే కారణమా?
పలమనేరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చోటా నాయకులంతా దందాలకు దిగడం, సెటిల్మెంట్లు చేయడం ఎక్కువైంది. ఇదే నేపధ్యంలోనే పలమనేరులో బోడిరెడ్డిపల్లికి చెందిన క్రిష్ణప్ప ఆత్మహత్యకు కారణాలను గమనిస్తే దీనికి టీడీపీ నేత శ్రీనివాసులు వేధింపులే కారణమని తెలుస్తోంది. దళితుడైన క్రిష్ణప్ప వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడమే ఇందుకు కారణమైందని భావిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం గడ్డూరు కాలనీలో ఇప్పుడు క్రిష్ణప్ప కుటుంబం నిర్మించుకున్న ఇంటికి పట్టా ఇప్పిస్తానని చెప్పి శ్రీనివాసులు రూ.50 వేలు తీసుకున్నాడు. అయితే ఆ ఇల్లు బయటి ప్రాంతానికి చెందిన రమాదేవికి పట్టా కేటాయించగా, ఆమె స్థానికురాలు కాదని అప్పట్లోనే ఆమె పట్టాను రద్దు చేయించింది కూడా శ్రీనివాసులుగా తెలుస్తోంది. ఆపై రమాదేవి ఇక్కడికి రాలేదు. ఈ నేపధ్యంలో తాను రూ.50 వేలిచ్చాను కాబట్టి పట్టా ఇవ్వాలని క్రిష్ణప్ప.. శ్రీనివాసులును అడగడంతో తహసీల్దార్ సీలు, సంతకంతో ఉన్న నకిలీ పట్టాను చేతిలో పెట్టాడు. దీన్ని తీసుకుని కృష్ణప్ప మున్సిపల్ కార్యాలయంలో పన్ను కట్టేందుకు వెళితే అది నకిలీ పట్టాగా తేలింది. దీంతో క్రిష్ణప్ప శ్రీనివాసులును ప్రశ్నించడంతో వివాదానికి కారణమైంది. ఫలితంగా శ్రీనివాసులు ఎక్కడో ఉన్న రమాదేవిని రప్పించి స్థానిక రెవెన్యూ అధికారులకు అర్జీ ఇప్పించాడు. శ్రీనివాసులు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వీఆర్వో పవన్ క్రిష్ణప్పకు గత నెల 27న తాఖీదు ఇచ్చి మూడు రోజుల్లో ఇంటికి సంబంధించిన హక్కు పత్రాలను చూపాలని హెచ్చరించారు. దీంతో క్రిష్ణప్ప ఇదేం అన్యాయమని శ్రీనివాసులను నిలదీయగా అతనిపై దాడికి దిగడమే కాకుండా పెద్దమనుషుల ద్వారా రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో ఇంటిని జేసీబీతో కూల్చేస్తామని హెచ్చరించినట్టు బాధితురాలు అనురాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇచ్చిన గడువు గతనెల 31తో ముగియడంతో జరిగిన అన్యాయం, టీడీపీ నేత బెదిరింపులు, వీఆర్వో నోటీసుపై ఆందోళన చెందిన క్రిష్ణప్ప ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి చూడగా అతని జేబులో తన చావుకు కారణం శీనా అని రాసి పెట్టుకున్న సూసైడ్ నోట్ కూడా లభించింది. దీంతో పాటు శ్రీనివాసులు బెదిరించిన పలు కాల్ రికార్డింగ్స్ మృతుని సెల్లో ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న క్రిష్ణప్ప (ఫైల్ ) క్రిష్ణప్ప జేబులో దొరికిన సూసైడ్ నోట్ -
ఇదేం అన్యాయం దేవరా!
● సర్వే చేయకనే చేసినట్టు చూపారే? ● బాధిత రైతు రెడ్డెప్ప రెడ్డి ఆవేదన పలమనేరు: తన పట్టా భూమిని చట్టు పక్కల రైతులు ఆక్రమించారని ఆ భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే.. గంగవరం రెవి న్యూ అధికారులు తన భూమి సర్వే చేసినట్టు తనకు ఎండార్స్మెంట్ పంపారని తనకు తెలియకుండానే ఎలా సర్వే చేశారో దిక్కు తోచడం లేదని అదే మండలం పాతకీలపట్లకు చెందిన రెడ్డెప్పరెడ్డి శనివారం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్య చంద్రమ్మ పేరిట కీలపట్లలో సర్వే నెం:55/2బీలో 99 సెంట్లు పట్టాభూమి ఉందన్నారు. దీన్ని నలువైపులా ఉన్న రైతులు 20 సెంట్ల దాకా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలని గత నెల 20న పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేశానన్నారు. కానీ తన భూమిని సర్వే చేయకనే తనకు ఎండార్స్మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలకు ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు దాతలను ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు తెలిపారు. యాప్ ను మెగా పీటీఎం రోజున అధికారికంగా విడుదల చేసినట్లు చెప్పారు. మౌలిక వసతుల సమస్యలున్న ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకునేందుకు ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిపారు. మౌళిక సదుపాయాల వివరాలు schoolinfra. ap. gov. in/ donations పోర్టల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఆ వివరాల ఆధారంగా అదన పు తరగతి గదులు, వంటగది, కళా వేదిక, ఇతర సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వొచ్చన్నా రు. కనీసం రూ.వెయ్యి నుంచి తోచినంత మొ త్తం సాయం చేయవచ్చని తెలిపారు. వస్తువుల రూపంలో సైతరం వితరణ చేయవచ్చన్నారు. -
బంగారు గొలుసు కోసమే మహిళ హత్య
కార్వేటినగరం: బంగారు గొలుసు కోసమే వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామంలో మే నెలలో మహిళను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప శనివారం వివరాలు వెల్లడించారు. గొడుగుచింత గ్రామానికి చెందిన పార్వతమ్మ (63) మే నెలలో వ్యవసాయ పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండడాన్ని ఆమె కుమారులు గమనించి వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలించారు. మహిళలను హత్యచేసి రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తిని శనివారం వెదురుకుప్పం మండలం దేవలంపేట బస్టాప్ వద్ద అదుపులోకి అరెస్టు చేశారు. పార్వతమ్మ మెడలో నుంచి అపహరించిన 24 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం క్రైమ్ కానిస్టేబుల్ లోకనాధం, కానిస్టేబుల్ గణేష్, అలాగే సిబ్బందిని ఉన్నతస్థాయి అధికారులు ప్రశంసించారు. సిబ్బందికి ఎస్పీ రివార్డును ప్రకటించారు. కార్యక్రమంలో వెదురుకుప్పం ఎస్ఐ నవీన్బాబు, ఎస్ఆర్పురం ఎస్ఐ సుమన్ పాల్గొన్నారు. -
ఓట్ల కోత
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ సమ్మేటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం జూలై 31 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించారు. ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో లక్షకు పైగా ఓట్లను తొలగించేశారు. జిల్లా యంత్రాంగం విడుదల చేసిన వివరాల ప్రకారం ఏకంగా 1.36 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోవడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల పరిశీలనకు ముసాయితా జాబితాలు అందుబాటులో పెట్టారు. జిల్లాలో 12,04,067 ఓట్లు ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల సవరణ (సర్) ప్రక్రియ పూర్తవ్వడంతో జిల్లాలో 12,04,067 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల వివరాలను జూలై 31 న ప్రచురించిన ముసాయిదా జాబితాలో వెల్లడించా రు. 2024 ఎన్నికల నుంచి ఇప్పటికి 1,36,059 మంది ఓటర్లు వివిధ కారణాలతో అందుబాటులో లేరని (ఏఎస్డీ) బీఎల్వోలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ధారించారు. ఆచూకీ తెలియని, శాశ్వతంగా వలస, రెండు ప్రాంతాల్లో ఓట్లున్న వారితో పాటు మృతులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ తరహా ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 3 వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. జూలై 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఫారం 6 తో కొత్తగా ఓటు పొందేందుకు, మార్పులు చేర్పులకు ఫారం 8 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 23,881 మంది నో మ్యాపింగ్ జిల్లాలో సొంత, తల్లిదండ్రుల 2002 నాటి ఓటు వివరాలు సమర్పించకుండానే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారి సంఖ్య జిల్లాలో 23,881 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరినీ నో మ్యాపింగ్ కేటగిరీలో పెట్టారు. వీరందరికీ బీఎల్వోలు ప్రస్తుతం నోటీసులు జారీ చేయనున్నారు. మహిళా ఓటర్లదే పైచేయి ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల కంటే 16,739 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అత్యధికంగా పలమనేరు నియోజకవర్గంలో 1,22,599 మంది మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చిత్తూరు నియోజకవర్గంలో 91,256 మంది ఓటర్లున్నారు. మిగిలిన నగరి నియోజకవర్గంలో 94,047, గంగాధరనెల్లూరులో 96,934, పూతలపట్టు లో 1,02,616, కుప్పంలో 1,02,925 మంది మహిళా ఓటర్లున్నారు. -
తమ్ముళ్ల ఇసుక గలాటా
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం అనంతాపురం గ్రామంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కసా రిగా భగ్గుమన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే పర్యటిస్తుండగానే, ఆయన కళ్లముందే ఒక సీనియర్ కార్యకర్తపై మరో నేత కరల్రతో విరుచుకుపడి భౌతిక దాడికి దిగడంతో శనివారం చిత్తూరు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది. ఎమ్మెల్యే కళ్లముందే రౌడీయిజం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ప్రవీణ్ గత కొన్నాళ్లుగా తన నివాస స్థల సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు శనివారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం పేరుతో గ్రామానికి వస్తున్నారని తెలిసి, సమస్యను విన్నవించి వినతిపత్రం ఇచ్చేందు కు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై వేచి చూశారు. అయి తే ఎమ్మెల్యే వాహనం ఆగకుండా వెళ్లడంతో, వారు పంచాయతీ కా ర్యాలయం వద్దకు వెళ్లారు. సరిగ్గా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రవీణ్పై టీడీపీ నాయకుడు జయచంద్రనాయుడు, ఆయన డ్రైవర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అత్యంత హేయమైన పదజాలంతో దూషిస్తూ కరల్రతో తీవ్రంగా కొట్టారు. కళ్లెదుటే సొంత పార్టీ కార్యకర్తపై దౌర్జన్యం జరుగుతున్నా ఎమ్మెల్యే అడ్డుకోకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన బాధితు డు రోడ్డుపైనే బైఠాయించాడు. పోలీసులు రంగంలోకి దిగి అతని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక దందా వెనుక అసలు కథ..? ఈ దాడి వెనుక పెద్ద ఇసుక కథే ఉన్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. మూడు రోజుల క్రితం అనంతాపురం పరిసరాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా పై ప్రవీణ్ నేరుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు ఫిర్యా దు చేశారని జయచంద్రనాయుడు దృష్టిలో పడింది. ఈనేపథ్యంలోనే జయచంద్రనాయుడు ప్రవీణ్పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకే ఈ దాడికి ఒడిగట్టారని టీడీపీలోని రెండు వర్గాలు కోడై కూస్తున్నాయి. బాధితుడి ఆవేదన ఇలా .. ‘‘నేను 2008 నుంచి పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా పనిచేస్తున్నాను. నివాస స్థల సమస్యపై ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇద్దామని వస్తే, సొంత పార్టీ నేత జయచంద్రనాయుడే నాపై దారుణంగా దాడి చేశారు. దెబ్బలుతిన్న నాపైనే కేసులు పెట్టిస్తామని బెదిరిస్తుండడం దారుణం. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిపై రౌడీయిజం చేస్తున్నారు. ఒక్క ఇసుక బ్యాగ్ను కూడా అక్రమంగా తరలించనిచ్చేది లేదు. ఈ అక్రమాలు, దాడులపై మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తా’’ అని ప్రవీణ్ శపథం చేసినట్లు తెలిసింది. -
హాజరు.. బేజారు!
చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుంది. ఏదేదో చేసేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. కార్యాచరణలో మాత్రం తూతూమంత్రంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఉన్నత విద్యారంగంలో వందశాతం హాజరును నిర్ధారించేందుకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలులోకి తీసుకువచ్చింది. అయితే నమోదు ప్రక్రియలో మాత్రం తడబడుతోంది. నిర్దేశిత గడువులోపు యాభై శాతం కూడా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదనే విమర్శ వినిపిస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : ఉన్నత విద్యారంగంలో నిజమై న హాజరును నిర్ధారించేందుకు చంద్రబాబు ప్రభు త్వం ఆర్భాటంగా ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) తీసుకువచ్చింది. అయి తే ఈ విధానం సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో నే వెనుకపడింది. క్షేత్రస్థాయిలో ఎఫ్ఆర్ఎస్ నమో దు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీని వెనుక ప్రైవే ట్ విద్యాసంస్థల వ్యూహాత్మక నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ఆగస్టు 10వ తేదీ తుది గడువు. అయితే అప్పటిలోగా ప్రక్రియ సగం కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రైవేట్ అలసత్వం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో దాదాపు 1,500 మంది వరకు విద్యార్థులు ఉన్నా రు. ఆ కళాశాల యాజమాన్యం ఇప్పటివరకు ఒక్కరినీ కూడా ఎఫ్ఆర్ఎస్లో ఎన్రోల్ చేయలేదు. అలాగే కుప్పం పరిధిలోని ఓ డిగ్రీ కళాశాలలో 200 మంది అడ్మిషన్లు పొందినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఒక్కరూ ఎఫ్ఆర్ఎస్లో ఎన్న్రోల్ కాలేదు. పలమనేరు లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలోనూ 500 మంది విద్యార్థులకుగాను 70 మందిని మాత్ర మే యాప్లో నమోదు చేశారు. ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించి ఏయే కశాశా లలో ఎంతమేర ఎన్ రోల్మెంట్ జరిగిందనే వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలకు సంబంధించి ఎన్న్రోల్మెంట్ 20 శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. బీఈడీ, డీఈడీలో సున్నా నమోదు జిల్లాలోని 7 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉండగా, వాటి లో 600 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి వివరాలు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. సాధారణంగానే బీఈడీ, డీఈడీలోనే హాజరు శాతం తక్కువ. వందలాది మంది విద్యార్థులను చూపుతున్న ప్రైవే ట్ యాజమాన్యాలు ఆన్లైన్లో వివరాలను నమో దు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. కొందరు వచ్చే ఏడా ది నమోదు చేద్దామనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. బోగస్..బయటపడుతుందనే.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 42 డిగ్రీ కళాశాలల్లో 24 వేల మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. పలు కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా రికార్డుల్లో పూర్తి హాజరు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఆర్ఎస్లో విద్యార్థుల వివరాలు నమోదు చేస్తే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి యాప్లో హాజ రు వేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిస్థాయిలో అమలైతే బోగస్ హాజరు గుట్టు రట్టువుతుంది. విద్యార్థుల హాజరు తగ్గిపోతే ఫీజ్ రియింబర్స్మెంట్ లబ్ధి దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ఆయా సంస్థలు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. -
సీబీఎస్ఈ క్లస్టర్–7లో మళ్లీ అకార్డ్ స్కూల్దే ఆధిపత్యం
తిరుపతి రూరల్: సీబీఎస్ఈ క్లస్టర్–7 అథ్లెటిక్స్ మీట్–2026లో తిరుపతికి చెందిన అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరోసారి సత్తా చాటుకుంది హైదరాబాదులోని మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ ఆవరణలో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్–7 అథ్లెటిక్స్ మీట్ – 2026లో అకార్డ్ స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాపియన్షిప్ను కై వసం చేసుకున్నారు. మొత్తం 39 పతకాలు సాధించారు. వీటిలో 33 స్వర్ణ, మూడు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్ నీరజారెడ్డి తెలిపారు. అలాగే 168 చాపియన్షిప్ పాయింట్లు సాధించి, గత పదేళ్లలో ఏ పాఠశాల నమోదు చేయని అత్యధిక స్కోరును నమోదు చేస్తూ కొత్త రికార్డు సృష్టించినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు విజేతలను అకార్డ్ స్కూల్ డైరెక్టర్లు ప్రశాంత్ రెడ్డి, వివేక్ రెడ్డి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అభినందించారు. -
క్రెడిట్ చోరీనే బాబు నైజం
నగరి : భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం విష యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహ జ నైజం ప్రకారం క్రెడి ట్ చోరీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. శుక్రవారం నగరిలో ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు భోగాపురం విమానాశ్రయానికి హడావుడిగా శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అస లు ప్రాజెక్టు నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగాయని స్పష్టం చేశారు. జగనన్న తీసుకువచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైందని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే జరుగుతోందని విమర్శించారు. ఉద్యోగ భద్రతే లక్ష్యం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్నామని స్కీమ్ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గంగరాజు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతు న్నా చంద్రబాబు ప్రభు త్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా మాట్లాడుతూ పనిభారం పెంచే నవచేతన యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందించారు. -
తూతూమంత్రంగా ముసాయిదా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ, ప్రచురణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు పాతర కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాల ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన వెంటనే జిల్లాలో గుర్తించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల ఫొటోలతో కూడిన ప్రింటెడ్ (హార్డ్) కాపీలను ఉచితంగా ఒక సెట్ అందజేయాల్సి ఉంటుంది. అయితే కలెక్టరేట్ విభాగం అధికారులు ఈ నిబంధనను పక్కన పెట్టేశారు. పెన్డ్రైవ్లో సాఫ్ట్ కాపీలను అందించి చేతులు దులిపేసుకున్నారు. దీనిపై వివిధ పార్టీల ప్రతినిధులు అధికారులను ప్రశ్నించగా, ఎన్నికల సంఘం నుంచి జాబితా ఇంకా రాలేదని బాధ్యతారాహిత్యంగా సమాధానమివ్వడం గమనార్హం. జాబితాల ప్రచురణ తేదీ ముందే తెలిసినప్పటికీ ప్రింటింగ్, పంపిణీ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విడుదల కాని ఏఎస్డీ జాబితా సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం ఏఎస్డీ (ఆబ్సెంటీ, షిప్టెడ్, డెడ్) ఓటర్ల పరిశీలన. వాస్తవానికి జూలై 31వ తేదీ నాటికే కలెక్టరేట్ అధికారులు ఏఎస్డీ జాబితాలను సిద్ధం చేసి బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బీఎల్ఓలు క్షేత్రస్థాయికి వెళ్లి సదరు ఓటర్లకు నోటీసులు జారీచేయాల్సి ఉంటుంది. జిల్లాలో అసలు ఏఎస్డీ జాబితాలే విడుదల కాలేదు. దీంతో బీఎల్లో ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది. మారిన పోలింగ్ స్టేషన్లపై అయోమయం ఇటీవల జిల్లాలో పునర్విభజన నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను మార్చారు. ఈ మేరకు కొత్త జాబితాలను పార్టీల ప్రతినిధులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి ఎవరు వస్తారనే దానిపై రాజకీయ పార్టీలు, ఓటర్లలో అయోమయం తలెత్తింది. జాబితా వివరాలు నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం నగరి 88,762 94,047 5 1,82,814 గంగాధరనెల్లూరు 95,780 96,934 4 1,92,718 చిత్తూరు 85,820 91,256 24 1,77,100 పూతలపట్టు 99,812 1,02,616 6 2,02,434 పలమనేరు 1,20,345 1,22,599 1 2,42,945 కుప్పం 1,03,119 1,02,965 12 2,06,056 మొత్తం 5,93,638 6,10,377 52 12,04,067 -
జిల్లాలో 12,04,067 మంది ఓటర్లు
చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్ల జాబితా పారదర్శకతకు పార్టీలు సహకరించాలని డీఆర్ఓ మోహన్ కుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఎస్ఐర్ ప్రక్రియలో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు. మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 12,04,067 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్లను ఆగస్టు 30 వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. విచారణ పూర్తి చేసే గడువు సెప్టెంబర్ 28, తుది ఓటర్ల జాబితా ప్రచురణ అక్టోబర్ 3 వ తేదీ వరకు ఉంటుందన్నారు. అన్న్కలెక్టబుల్గా గుర్తించిన 1,36,059 పేర్లను తొలగించామని వెల్లడించారు.గడువులోగా మ్యాపింగ్ చేసుకోని 23,881 మంది ఓటర్లకు, అలాగే తార్కిక దోషాలున్న 1,10,205 మందికి శుక్రవారం నుంచి నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత విజయసింహారెడ్డి, ఉదయ్కుమార్, టీడీపీ నేతసురేంద్ర, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మెగాగ్రహం
‘‘మెగా డీఎస్సీ అంటూ జబ్బలు చరుచుకున్నారు.. 16వేల ఉద్యోగాలని ఊదరగొట్టారు.. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆర్భాటంగా ప్రకటించారు.. అయితే ఆశగా పరీక్షలు రాసిన నిరుద్యోగులను మోసం చేశారు.. పోస్టుల భర్తీలో అవినీతికి పాల్పడి అందరినీ బురిడీ కొట్టించారు.. కాసులకు కక్కుర్తి పడి అర్హులందరికీ టోపీ పెట్టేశారు.. ఈ క్రమంలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఆర్ఓ మోహన్కుమార్కు వినతిపత్రం అందించారు. బాధితులందరకీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిత్తూరు కార్పొరేషన్ : దగా డీఎస్సీపై క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు మంత్రి లోకేష్ కూడా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని స్పష్టం చేస్తున్నారు. అప్పటి వరకు పోరాడుతామని హెచ్చరిస్తున్నారు. అలాగే వసతిదీవెన, విద్యాదీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జిల్లాలోని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున గడిచిన రెండేళ్లలో బకాయి మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్ఓ మోహన్కుమార్కు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్కుమార్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, ఎంపీపీ సంఘం రాష్ట్ర నేత రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ యువత, విద్యార్థి విభాగాల అధ్యక్షులు మనోజ్రెడ్డి, సద్దాం, నేతలు త్యాగ, హరీషారెడ్డి, శశిదీప్, చక్రి, మురళి, మధురెడ్డి, రెడ్డిసాయి, స్టాండ్లీ, లోకేష్, హితీష్, రుత్విక్, గని, మణిరుధ్, శేఖర్, జయంత్, భాను పాల్గొన్నారు. పాఠశాలలను మూసేస్తున్నారు గత రెండేళ్లలోనే రాష్ట్రంలో 900 పైగా పాఠశాలలను మూసేశారు. 7 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు చేరారు. నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమస్యలు తిష్ట వేశాయి. విద్యాదీవెన, వసతిదీవెన బకాయి రూ.కోట్లలో ఉంది. లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని టీడీపీకి చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రూ.లక్షలు చెల్లించాలి, ఇసుక దోపిడీతో పాలన అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్సీపీ పాలనలో విద్యావ్యవస్థ ఉన్నత స్థానంలో ఉంటే ప్రస్తుతం 13వ స్థానానికి పడిపోయింది. ఇప్పటికై నా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ -
రేపటి నుంచి బియ్యం విక్రయ కేంద్రాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ (ఎంఐపీ) ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లాలో అమలు కానుందన్నారు. రైతు బజార్లు, గుర్తించిన రైస్ మిల్ అవుట్లెట్లలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52, స్టీమ్ బియ్యం (బీపీటీ) కిలో రూ.52, రా బియ్యం (బీపీటీ) కిలో రూ.50, సోనా మసూరి రకాల బియ్యం కిలో రూ.52 చొప్పున అందుబాటులో ఉంటాయని వివరించారు. ఆయా అవుట్లెట్లలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విక్రయ కేంద్రాల వద్ద ధరల పట్టికలు, బియ్యం రకాలు, పని వేళలు, ఫిర్యాదుల నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సచివాలయాల ద్వారా విస్తతంగా ప్రచారం చేయాలని కోరారు. -
వైభవం.. విరులయాగం
పుష్పాలను తీసుకువస్తున్న అర్చకులు, అధికారులు సుగంధ సుమాల నడుమ శ్రీవారు వడమాలపేట (పుత్తూరు): అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువనే సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. వైదిక కార్యక్రమాల అనంతరం దేవదేవేరుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపించారు. ఈ క్రమంలోనే విశేష పుష్పాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సర్వభూపాల వాహనంపై స్వామివారిని కొలువుదీర్చారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు వేద పండితుల వేదమంత్రోచ్చణాలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం నిర్వహించారు. సుగంఘ సుమాలతో స్వామివారిని అర్చించారు. సాయంత్రం 6 గంటలకు ఉభయదేవేరీల సమేతంగా శ్రీవారిని అలంకరించి వీధి ఉత్సవం జరిపించారు. డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ అధికారి వేణుగోపాల్, ప్రధాన అర్చకుడు సూర్యకుమారాచార్యులు పర్యవేక్షించారు. -
ప్రాణాలు పోతున్నాయని ఫిర్యాదు
– నైల్ కంపెనీపై చర్యలకు వినతి వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం గాజులమండ్యం ఎస్టేట్లోని నైల్ కంపెనీపై కల్లురు వాసులు గురువారం తిరుపతిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ నైల్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ జలాలు, పొగ కారణంగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామని ఆరోపించారు. గుండె, ఊపిరితిత్తులు, పెరాలసిస్ వ్యాధులు సోకి కొందరు మృత్యువాత పడ్డారని వెల్లడించారు. నైల్ కంపెనీతో పాటు ఇండోమెమ్, స్టీవెలిస్, విజయం బయోటెక్ ఫ్యాక్టరీల కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆయా కంపెనీలను సందర్శించి, కాలుష్యాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన పొల్యూషన్ అధికారి గాజులమండ్యం ఎస్టేట్లోని ఫ్యాక్టరీలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మోహన్నాయుడు, రామానాయుడు, కుమారస్వామి మొదలి, వాసు, మధు, రోహిత్, వెంకటేష్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో ‘బామ్మ పాఠాలు’
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్వాడీల్లో చిన్నారుల కు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు నైతిక విలువలతో కూడిన బామ్మ పాఠాలు బోధించేందుకు చర్యలు చేపట్టినట్లు ఐసీడీఎస్ అధికారు లు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ జిల్లాలో ఆసక్తి గల బామ్మలు, రిటైర్డ్ ఉద్యోగులతో పాఠా లు నేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 2,420 అంగన్వాడీ కేంద్రాల్లో వృద్ధ మహిళల సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం, ఆటపాటలు నేర్పించడం, ఆరోగ్య సూత్రాలు, నైతిక విలువలతో కూడిన కుటుంబ బంధాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. రోజూ ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైన సమయాల్లో వచ్చి ఆరేళ్ల లోపు పిల్లలకు పాఠాలు నేర్పించాల్సి ఉంటుందని ఐసీడీఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల తనిఖీ గంగాధర నెల్లూరు : మండలంలోని ఎట్టేరి, మోతరంగనపల్లె, రామానాయుడుపల్లె, గంగాధరనెల్లూరు అంగన్వాడీ కేంద్రాలను డీఆర్డీఏ పీడీ శ్రీదేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఇన్చార్జి సీడీపీఓ అనూరాధ, సూపర్వైజర్ సంగీత పాల్గొన్నారు. ‘ప్రేరణ’కు పదోతరగతి విద్యార్థిని పెద్దపంజాణి: మండలంలోని రాయలపేట కేవీసీఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని జి.శాంభవి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రేరణ కార్యక్రమానికి ఎంపికై ంది. గురువారం ఈ మేరకు ఉపాధ్యాయులు మాట్లాడుతూ త్వరలో గుజరాత్లో జాతీయ విద్యా విధానంపై చేపట్టనున్న ప్రత్యేక సదస్సులో శాంభవి పాల్గొంటుందని వెల్లడించారు. నిరక్షరాస్యులకు సదవకాశం గుడిపాల: నిరక్షరాస్యులకు సార్వత్రిక విద్యాపీఠంలో చదువుకునేందుకు సదవకాశం కల్పిస్తున్నట్లు విద్యాపీఠం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఓపెన్ స్కూల్ డీసీఓ జయప్రకాష్ తెలిపారు. గురువారం నరహరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక విద్యాపీఠంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులతోపాటు పదోతరగతిలోపు చదువు మానేసిన వారు సార్వత్రిక విద్యాపీఠంలో చేరి 10, 12వ తరగతులు అభ్యసించవచ్చని వివరించారు. ఎంఈఓలు హసన్బాషా, గణపతి, ప్రధానోపాధ్యాయులు దుర్వాసులు, కిరణ్కుమార్, హేమాద్రి, శారద, పండరీ పాల్గొన్నారు. 2న యోగాసన పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీన జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్న ట్లు సంఘం ప్రధాన కార్యదర్శి యుక్తా చౌదరి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ఆదివారం చిత్తూరు గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్ యోగాసన, రిథమిక్ యోగాసన కింద మొత్తం ఆరు కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. సబ్ జూనియర్స్ (10–14 ఏళ్లు), జూనియర్స్ (14–18 ఏళ్లు), సీనియర్స్ (18–28), సీనియర్స్–ఏ (28– 35), సీనియర్–బీ (35–45), సీనియర్స్– సీ (45–55) కేటగిరీల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. ఇతర వివరాలకు 6303899780, 9985407782 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కదంతొక్కిన కార్మికులు
– కలెక్టరేట్ వద్ద ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కార్మికచట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్గుప్తా, కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ధ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పనిచేస్తూ అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే మహిళా కార్మికులపై వేధింపులు మానుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదాల నడుమ విధులు రైతులకు ఇబ్బంది కలగకుండా రాత్రింబవళ్లు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేసే స్టోర్ కార్మికులకు సక్రమంగా వేతనాలు అందడం లేదని సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడే 108, 102, 104 వాహనాల సిబ్బందికి వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. డెయిరీలు, గార్మెంట్స్, క్వారీ, గ్రానైట్ పరిశ్రమల్లోని వేలాది మంది కార్మికులకు చట్టాలు వర్తించడం లేదని మండిపడ్డారు. జూన్ 30న కలెక్టర్ ఆదేశించిన వేతన జీఓలను ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. అనంతరం డీఆరక్ష మోహన్కుమార్కి వినతిపత్రం అందజేశారు. నేతలు గోవిందప్ప, మధు, శివ పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాపై అప్రమత్తం
చిత్తూరు కలెక్టరేట్ : మానవ అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి భారతి పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన, అప్రమత్తత పెంచుకోవాలన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా లైంగిక దోపిడీ, వెట్టిచాకిరి, బలవంతపు వివాహాలు, అవయవాల అక్రమ విక్రయాలు వంటి దారుణాలు కొనసాగడం ఆందోళనకరమని తెలిపారు. ఉద్యోగాల పేరుతో, సోషల్ మీడియాలో వల విసిరి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో విద్యార్థులు 1098 చైల్డ్ హెల్ప్లైన్ వినియోగించుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని, అపరిచితులను నమ్మవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు మానవ అక్రమ రవాణా నిరోధక పోస్టర్ను ఆవిష్కరించారు.గాంధీ విగ్ర హం నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఉషరాణి, రోప్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ధనశేఖరన్, జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ నిర్మల పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : ఓపెన్ స్కూల్కు సంబంధించి 2026– 27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రాంరభమైనట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం చిత్తూరులోని బాపుబాలభవన్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యలో చదువు మానేసిన వారు, డ్రాపౌట్లు ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. విద్యాప్రమాణాల పెరుగుదలకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, హెచ్ఎంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలలకు వెళ్లని విద్యార్థులను గుర్తించి ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఓపెన్ స్కూల్పై అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ జయప్రకాష్నాయుడు, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్ పాల్గొన్నారు. -
టార్గెట్ చేసి నోటీసులు
పలమనేరు : మున్సిపాలిటీలో అన్ని అనుమతులు పొంది ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు నిబంధనలు పాటించలేదంటూ నోటీసులు జారీ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు సోమచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో ఉన్నాననే అధికారులు టార్గెట్ చేసి తన ఇంటికి సెట్ బ్యాక్ లేదని నోటీసు ఇచ్చారని ఆరోపించారు. ఇదే మున్సిపల్ అధికారులు గతంలో అనుమతులు ఇచ్చి, ఇప్పు డు కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని స్పష్టం చేశారు. పట్టణంలో టౌన్ప్లానింగ్ నిబంధనలు పాటించని వారెందరో ఉన్నారని, వీధులను ఆక్రమించుకున్న వారిని వదిలిపెట్టి తమను వేధించేందుకే నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేక హెల్త్ క్యాంప్ చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్నకు విశేష స్పందన లభించిందని డీఆర్ఓ మోహన్కుమా ర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లోని వివిధ శాఖలకు చెందిన దాదాపు 300 మంది ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా జనర ల్ మెడిసిన్, నేత్ర వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు ఉద్యోగులకు వైద్య సేవలందించాని వివరించారు. రక్తం, మూత్ర పరీక్షల తో పాటు షుగర్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్టులు, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అగర్వాల్ఐ ఆస్పత్రి వైద్యులుసుమంత్, మోహ న్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. -
జ్వరోత్పాతం!
జిల్లాలో పూర్తిగా పడకేసిన పారిశుద్ధ్యం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అరకొర వర్షాలకే పల్లెలు.. పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా జ్వరపీడితులు భారీ సంఖ్యలో మంచాన పడుతున్నారు. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో అధికారులు వైఫల్యం చెందారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం పరిసరాల పరిశుభ్రతకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా దోమల నివారణలో విఫమవుతున్నారు. ఈ క్రమంలోనే డెంగీ రోగులు సైతం క్రమేణా పెరిగిపోతున్నారు. కాణిపాకం : జిల్లావ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో వ్యాధులు ప్రబలకుండా అడ్డుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లోపించింది. ఫలితంగా జిల్లాలోని అధికారి గణాంకాల ప్రకారం వారం రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో 907 జ్వరం కేసులు నమోదైనట్లు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ప్రభుత్వ వైద్య కేంద్రాలపై నమ్మకం లేక, సౌకర్యాల కొరత కారణంతో ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం రోజుల్లోనే సుమారు 2 వేలకుపైగా ఫీవర్ కేసులు నమోదై ఉండవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అధికారికంగా 34 డెంగీ కేసులు రికార్డయ్యాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలు, చిన్న ప్రైవేట్ క్లినిక్లు, ల్యాబ్లలో నమోదవుతున్న డెంగీ, టైఫాయిడ్, మలేరియా కేసులు అధికారిక లెక్కల్లోకి రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లేట్లెట్స్ పడిపోతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిధుల కొరత పరిస్థితి ఇన్ని రకాలుగా క్షీణించడానికి పంచాయతీలకు ఏర్పడిన నిధుల సంక్షోభమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధులను ఏప్రిల్లోనే పంచాయతీ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పైసా కూడా విడుదల కాలేదు. మేజర్ పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల సాధారణ నిధులు కూడా సున్నాకి చేరాయి. మరోవైపు, పారిశుద్ధ్య రక్షణలో కీలక పాత్ర పోషించే క్లాప్ మిత్రలకు పలు చోట్ల ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వ్యవస్థను మరింత దెబ్బతీసింది. బ్లీచింగ్ చల్లేందుకు, చెత్త తరలించేందుకు కూడా గ్రామాల్లో డబ్బులు లేని దుస్థితి దాపురించింది. ప్రభుత్వం తక్షణమే పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ నిధులు విడుదల చేయాలని, క్లాప్ మిత్రల వేతన సమస్యను పరిష్కరించి గ్రామాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ డ్రైవ్ చేపట్టాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో జ్వరాల బారిన పడి పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమాచారం జిల్లా ఆస్పత్రి 01 ఏరియా వైద్యశాలలు 04 సీహెచ్సీలు 07 అర్బన్ హెల్త్ సెంటర్లు 15 పీహెచ్సీలు 50 ప్రైవేటు హాస్పిటళ్లు సుమారు 1,000 దోమలకు కేరాఫ్ అడ్రస్ పల్లెలు, పట్టణ పరిధిలోని మురికివాడల్లో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా తయారైంది. రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండడం, డ్రెయిన్లలో పూడిక తీయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దోమల నివారణకు వాడాల్సిన ఫాగింగ్ మిషన్లు పంచాయతీ కార్యాలయాల్లో మూలన పడి తుప్పు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో చూడాల్సిన సిబ్బంది, ప్రత్యేక అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఐషే ఘోష్ అరెస్ట్ యత్నంపై నిరసన
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘోష్ అక్రమ అరెస్ట్కు యత్నించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి వాడ గంగరాజు మండిపడ్డారు. బుధవారం చిత్తూరు కొంగారెడ్డిపల్లె లో ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్న్లోకి పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవేశించడం దుర్మార్గమన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మసూద్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం ప్రైవేటు వాహనంలో, యూనిఫామ్ ధరించకుండా వచ్చి జాతీయ నాయకురాలిని ఢిల్లీలోని కార్యాలయంలో అరెస్టు చేసేందుకు యత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. బెదిరింపు చర్యలతో ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు. -
అగరబత్తీ తయారీపై ఉచిత శిక్షణ
చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఆగస్టు 6 నుంచి 12 రోజులు మహిళలు, పురుషులకు అగరబత్తీల తయారీపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగి తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు, పురుషులు అర్హులన్నారు. 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు, టూల్కిట్టును ఇస్తామని తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగోన్నతులపై ఆరోపణలు సాక్షి, టాస్క్ఫోర్స్ : ట్రాన్స్కో చిత్తూరు రూరల్ విభాగంలో చేపట్టిన ఉద్యోగోన్నతుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఆర్ వివరాల నమోదులో నిర్లక్ష్యం కనపడుతోందని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పలువురు ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాలకు ఎప్పుడో బదిలీ అయిన ఉద్యోగులకు సైతం ఇక్కడ ప్రమోషన్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. అర్హులైన స్థానిక ఉద్యోగులకు మాత్రం రివర్షన్ ఇచ్చి అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను సరిగా పూర్తి చేయకపోవడంతో అకౌంట్స్ అధికారి తనిఖీకి వచ్చి వెనుతిరిగారని వెల్లడిస్తున్నారు. ప్రమోషన్ వచ్చినప్పటికీ ఆర్డర్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సీఎండీ శివశంకర్ స్పందించి సమగ్ర విచారణ చేయించాలని కోరుతున్నారు. పుత్తూరులో దుండగుల హల్చల్ పుత్తూరు: పది రోజుల క్రితం స్థానిక లక్ష్మీనగర్లోని ఓ ఇంట్లో దొంగలు పడి రూ.20 లక్షలు విలువైన బంగారు, వెండి నగలు దోచుకెళ్లారు. ఈ ఘటనను మరవక ముందే లక్ష్మీనగర్ కాలనీకి సమీపంలోని ఎస్బీఐ కాలనీలో మంగళవారం అర్థరాత్రి దుండగులు ఓ ఇంటి తలుపులు తట్టి హల్చల్ చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానిక ఎస్బీఐ కాలనీలోని కె.సుబ్రమణ్యం అనే ఉపాధ్యాయుడు ఇంటి వద్ద దుండగులు హల్చల్ చేశారు. ఇంటి తలుపులు తట్టారు. నిద్రలేచి కిటికీ వద్దకు వచ్చి ఎవరూ అంటూ ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. వరండాలోని లైటు వేయగా నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో కనిపించడంతో సుబ్రమణ్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఇది గమనించిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. వెంటనే స్పందించిన ఎస్ఐ నాగేంద్రబాబు బృందం ఎస్బీఐ కాలనీ చుట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే దుండగులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ నేత ఇంట్లో చోరీ గంగాధర నెల్లూరు: మండలంలోని పెద్దకాలవ పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ నేత లోకమ్మ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలయని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. బాధితురాలు లోకమ్మ అర్ధగిరి ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లారు. ఆమె భర్త గోవిందరాజులు ఆర్టీసీ డ్రైవర్గా తన విధులకు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఇంటికి వచ్చిన లోకమ్మ చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రూ.1.60లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురుగేష్ తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ బంగారుపాళెం : స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్లో సోమవారం బీరువాను పగులగొట్టి 16 గ్రాముల బంగారు నల్లపూసల దండను చోరీ చేసిన కేసులో నిందితుడిని బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా, చంద్రశేఖరపురానికి చెందిన పురుషోత్తమ్ను నిందితుడిగా గుర్తించామని, ముంగరమడుగు క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
ఘనంగా పున్నమి గరుడ సేవ
‘వేంకటాద్రి’లో ఏదీ భద్రత!తిరుమల: ఉగ్రవాద ముప్పు హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ, వేలాది భక్తుల కోసం నిర్మించిన వేంకటాద్రి నిలయంలో ఏమాత్రం భద్రత కరువైంది. శ్రీవారి ఆలయం, తిరుమలవ్యాప్తంగా వేలాది సీసీ కెమెరాలు, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో నిరంతర నిఘా ఉన్నప్పటికీ, వేంకటాద్రి నిలయంలో మాత్రం రక్షణ లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. రూ.125 కోట్లతో 30 హాళ్లతో 5 వేల మంది భక్తులు బస చేసేలా నిర్మించిన ఈ అత్యాధునిక యాత్రికుల వసతి సముదాయం–5 (వేంకటాద్రి నిలయం)లో తగిన సంఖ్యలో సీసీ కెమెరాలు, ఇతర భద్రత ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భవనంలో నిత్యం వేలాదిమంది యాత్రికులు బస చేస్తున్నప్పటికీ, ప్రవేశ ద్వారం వద్ద మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. హాళ్లు, కారిడార్లు వంటి కీలక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రద్దీ రోజుల్లో భక్తుల సెల్ఫోన్లు, బ్యాగులు, నగదు చోరీకి గురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. అయితే, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ఈ వసతి సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు పలుమార్లు టీటీడీని కోరినప్పటికీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. భక్తుల రద్దీని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
హోరా హోరీగా క్రీడా పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్న్షిప్– 2026 క్రీడా పోటీలు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో బుధవారం రెండో రోజుకు చేరాయి. అండర్–17, అండర్–23 విభాగాల్లో నిర్వహించిన ఖోఖో, వాలీబాల్, పోటీలలో పలు స్కూళ్ల విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్భాస్కర్ పర్యవేక్షించారు. ఈ నెల 30న బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్ పోటీలు, 31న అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హైవే దాబాలపై ప్రత్యేక నిఘా
చిత్తూరు అర్బన్: హైవే దాబాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల సాక్షి దినపత్రికలో అదాబ్బా సంగతి అనే పేరిట ప్రచురితమైన కథనానికి డీఎస్పీ జె.వెంకటనారాయణ స్పందించారు. బుధవారం ఈ మేరకు చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్లో దాబా యజమానులతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి దాబాలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కనీసం 30 రోజుల ఫుటేజీని భద్రపరచాలని సూచించారు. దాబా పరిసరాలు, పార్కింగ్, వాష్రూమ్ల వద్ద తగినంత వెలుతురు ఉండాలని, పనిచేసే సిబ్బంది ఆధార్తో సహా పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. గంజాయి, మద్యం, జూదం, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశమిస్తే దాబా యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే112 నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, ఈస్ట్ సీఐ రామచంద్ర, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు పాల్గొన్నారు. -
కక్ష సాధింపులకే నోటీసు
పలమనేరు : రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కక్ష సాధింపులకే పురపాలక అధికారుల ద్వారా నోటీసు జారీ చేశారని పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నేరుగా ఏమీ చేయలేక మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని వేధింపులకు దిగుతోందని ఆరోపించార. నిబంధనల మేరకు ఉన్న భవనానికి విరుద్ధంగా ఉందంటూ నోటీసు జారీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నోటీసులు న్యాయపరంగానే సమాధానమిస్తామని, పట్టణంలో నిబంధనలు పాటించని వారి వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకుని కమిషనర్కు సైతం నోటీసు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. వివరం ఇదీ.. పలమనేరు బసవన్న కట్టవీధిలో హేమంత్కుమార్ రెడ్డికి డోర్ నంబర్ 12–6లో ఓ భవనం ఉంది. దీనికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని మున్సిపల్ అధికారులు నోటీసు పంపించారు. ప్లాన్ మేరకు గ్రౌండ్లో లేదని, రెసిడెంట్గా కాకుండా కమర్షియల్గా ఉందని, పార్కింగ్ లేదని, బిల్డప్ ఏరియాలోనూ డీవియేషన్ ఉందంటూ ఏపీఎం చట్టం 1965 మేరకు టౌన్ప్లానింగ్ వారు నోటీసు జారీ చేశారు. కుట్రపూరితంగానే.. పట్టణంలో టౌన్ప్లానింగ్ నిబందనలు పాటించని కట్టడాలు సుమారు 50శాతం వరకు ఉన్నాయి. వీరి దగ్గర ఎంత నగదు తీసుకుని టౌన్ప్లానింగ్ అధికారులు అనుమతులు జారీ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం హేమంత్కుమార్రెడ్డిని వేధించేందుకే నిబంధన ప్రకారం ఉన్నప్పటికీ సదరు భవనానికి నోటీసులు జారీ చేశారు. టీడీపీ నేతల ఆదేశాల మేరకు నోటీసు ఇచ్చినందుకు అధికారులే కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హేమంత్కుమార్రెడ్డి హెచ్చరించారు. -
పుష్పయాగానికి అంకురార్పణ
పుత్తూరు: అప్పలాయిగుంటలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పుష్పయాగ అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం జరిపించారు. పుట్టమట్టిని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు పుట్టమట్టిని మేదినీదేవి రూపంలో అలంకరించారు. రాత్రి 8 గంటలకు ఆలయ మహాగోపురం వద్ద వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంకురార్పణ చేపట్టారు. అనంతరం ఏకాంతసేవ నిర్వహించారు. సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం జరిపించనునానరు. అనంతరం తిరువీధి ఉత్సవం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
చెడ్డీ గ్యాంగ్తో అప్రమత్తం
నగరి : పీలేరు ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లికార్జున హెచ్చరికలు జారీచేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ పీలేరు పరిధిలోని రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలో జిల్లాలోకి కూడా ప్రవేశించే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివసించే వారు రాత్రి వేళ తలుపులు, కిటికీలను మూసివేయాలని, ఇంటి పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనుమానితులను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్న్కు సమాచారం అందించాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులంతా ఊరికి వెళ్లే సందర్భంలో బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వీలైతే ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారమిస్తే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
అట్టల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం?
పుత్తూరు: పరమేశ్వరమంగళం పంచాయతీలోని కోలార్ పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అట్టల ఫ్యాక్టరీ)లో ఈనెల 26వ తేదీ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలను అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు అగ్నిమాపక అధికారులు మీడియాకు తెలపక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకోవడానికే ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రమాద ఘటనకు తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పుత్తూరు నుంచి అగ్నిమాపక వాహనం వెళ్లి మంటలను అదుపు చేసినట్లు సమాచారం. అనంతరం ఫ్యాక్టరీ యాజమాన్యం 300 టన్నుల పేపర్ బండిల్స్ పూర్తిగా కాలిపోయినట్లు, విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని నివేదించినట్లు సమాచారం. కార్మికుల ప్రాణాలకు భద్రత లేదు కోలార్ పేపర్ మిల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు భద్రత లేదని తెలుస్తోంది. ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలను విధిగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవని సమాచారం. దీంతో కార్మికుల ప్రాణాలతో పాటు పరిసర ప్రాంత ప్రజల భద్రత కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా దానిని పునరుద్ధరించకపోవడంతో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఫ్యాక్టరీలో ఉండాల్సిన ఫైర్ ఎక్విప్మెంట్స్, వాటర్ లైన్స్, అత్యవసర స్పందన వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలపై లోతైన తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా ఈ ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవల్సి అవసరం ఎంతైనా ఉంది.. మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీకి ఎన్ఓసీ లేదు పరమేశ్వరమంగళం సమీపంలోని కోలార్ పేపర్ మిల్స్కు అగ్నిమాపక శాఖకు సంబంధించి నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) లేదు. ఇదే ఫ్యాక్టరీలో ఈనెల 26వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంపై యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని, 300 టన్నుల పేపర్ బండిల్స్ కాలిపోయాయని, విలువ రూ.35 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.. అయితే ఫ్యాక్టరీ వారు ఎన్ఓసీని రెన్యూవల్ చేసుకోలేదు. పైగా ఇప్పుడే ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. ఈ మేరకే ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. – నాగేశ్వరరెడ్డి, ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్, పుత్తూరు. లెక్కలపై పలు సందేహాలు ఫ్యాక్టరీలో పాత అట్టల ద్వారా తయారైయ్యే పేపర్ బండిల్స్ సాధారణంగా ఎక్కడ నిల్వ ఉంచుతారు? ఫ్యాక్టరీ గోడౌన్ బయట అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ 300 టన్నుల పేపర్ బండిల్స్ ఎందుకు ఉన్నట్లు? వర్షం వస్తే తడవవా? ఎండకు ఎండిపోవా? అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఆరుబయట వేస్ట్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది కదా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా 300 టన్నుల పేపర్ నిల్వలు ప్రమాద సమయంలో అక్కడ ఉంటే వాటికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, రా మెటీరియల్ కొనుగోలు బిల్లులు, జీఎస్టీ రికార్డులు, గిడ్డంగి నిల్వల వివరాలను పరిశీలించాల్సి ఉంది. -
వైభవం.. శాకంబరీ ఉత్సవం
వరిసిద్ధుని ఆలయం వద్ద అలంకరణకాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు, శ్రీమణికంఠేశ్వరుని ఆలయంలో కూరగాయలు, పండ్లతో స్వామివార్లను దివ్యంగా అలంకరించారు. ఉత్సవాల కోసం పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, ముల్బాగల్, హోసూర్ తదితర మార్కెట్ల నుంచి రైతులు, వ్యాపారులు, రవీంద్ర రెడ్డి, మిత్రబృందంతో కలిసి సుమారు 15 టన్నుల వివిధ రకాల కూరగాయలు, పండ్లను స్వామివారికి విరాళంగా సమర్పించారు. దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తీర్థప్రసాదాలు అందించారు. ఈఓ పెంచల కిషోర్, ఆలయ కమిటీ చైర్మన్ మణి నాయుడు పాల్గొన్నారు. -
దరఖాస్తు ఇలా..
ఔత్సాహిక విద్యార్థులు తమ పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడి సహాయంతో www.inrpirea wardrd-rt.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదుచేసి సేవ్ చేయాలి. ఆ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళుతుంది. అక్కడ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్కు యూజర్ ఐడీతో కూడిన లింకు వస్తుంది. విద్యార్థి సమాచారంతో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరు నమోదు చేయాలి. విద్యార్థి ప్రదర్శించాలని అనుకుంటున్న ప్రాజెక్టు వివరాలను సంక్లిప్తంగా వెబ్సైట్లో నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్న్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో 2023–24కి సంబంధించి జిల్లా స్థాయిలో 396, రాష్ట్ర స్థాయిలో 31, 2024–25కి సంబంధించి జిల్లా స్థాయిలో 310, రాష్ట్ర స్థాయిలో 25, 2025–26వ సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయిలో 263 ప్రాజెక్ట్లు ఎంపికవడం విశేషం. -
ఆర్ఓబీ నిర్మాణానికి భూ పరిశీలన
పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ బుధవారం భూ పరిశీలన చేపట్టారు. జేసీ మాట్లాడుతూ ఆర్ఓబీ పనులకు రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. నగరి నుంచి దిండి వరకు చేపడుతున్న రైల్వే లైన్ భాగంగా తమిళనాడు సరిహద్దులోని తొట్టికండ్రిగ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తమిళనాడు భూములకు అధిక శాతం పరిహారం ఇస్తున్నారని, ఆ మేరకే తమ భూములకు కూడా పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని జేసీ హామీ ఇచ్చారు. తహసీల్దార్ గుర్రప్ప పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లు చెల్లింపులకు యూపీఐ సేవలు
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ బిల్లు చెల్లింపులకు తిరిగి యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. సుమారు ఏడాదిన్నరగా యూపీఐ ద్వారా కరెంటు బిల్లులు చెల్లింపు విధానం నిలిపినట్లు వెల్లడించారు. దీంతో వినియోగదారులు విద్యుత్శాఖ వెబ్సైట్, లింక్, మనమిత్ర యాప్ ద్వారా బిల్లులు కట్టేవారన్నారు. బిల్లుల చెల్లింపు సులభతరంగా చేయడానికే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, బీబీపీఎస్ యాప్లకు అనుమతించినట్లు వివరించారు. వినియోగదారులు గమనించాలని కోరారు. శాస్త్రోక్తం.. సత్యనారాయణవత్రం కాణిపాకం : పౌర్ణమి పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజ స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వైభవంగా వ్రత క్రతువును జరిపించారు. పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చిత్తూరు కార్పొరేషన్ : గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్రావు ఆదేశించారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో చేపట్టిన ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శుల సదస్సులో ఆయన మాట్లాడారు. చెత్తను సంపదగా మార్చాలని కోరారు. గ్రీన్ అంబాసిడర్లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పశువుల నుంచి వచ్చే పేడను రైతుల సహకారంతో సేకరించి వర్మీకంపోస్టుగా తయారు చేయాలని సూచించారు. ఇంటింటి నుంచి సేకరించే తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేయించాలన్నారు. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేసి, పొడి చెత్తను గ్రామంలో నిల్వ ఉంచి స్వచ్ఛ రథాల ద్వారా విక్రయించే విధానం అమలు చేయాలని సూచించారు. గ్రీన్ అంబాసిడ్లకు అదనంగా రూ.5వేల వరకు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, డీపీఓ సుధాకర్రావు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలని, త్వరితగతిన అనముతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత, మహిళలకు పరిశ్రమల ఏర్పాటులో విశేష ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అందించిన దరఖాస్తులను పారదర్శకంగా సమీక్షించి సింగిల్ విండో విధానంలో ఆమోదించాలన్నారు. అవసరమైతే ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికవేత్తల నుంచి అందిన 23 ప్రోత్సాహక క్లెయిమ్లకు గాను రూ.1.48 కోట్లు ఆమోదించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు లేని మరో క్లెయిమ్ను వాయిదా వేశామన్నారు. పారిశ్రామికవేత్తలు తమ సమస్యలు, అవసరాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సంబంధిత పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 36 పరిశ్రమలు, 12 విద్యుత్ ఉపకేంద్రాలు (సబ్స్టేషన్లు), 7 పారిశ్రామిక పార్కుల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వారానికి ఒకసారి ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకుల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పరిశ్రమల సంఘం నేతలు గోవర్ధన్బాబీ, పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, ఎల్డీఎం షేక్ ఇనుల్, విద్యుత్ శాఖ ఎస్ఈ అమీర్, అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. -
సేద్యం.. చేయలేం!
పలమనేరు : యుద్దం ముగిసినా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే బాటలో చాలా మంది వ్యాపారులు ఎరువులు,డీఏపీలు, డ్రిప్ ఎరువుల రేట్లను భారీగా పెంచేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా.. నిర్వాహకులు మాత్రం ఇస్టానుసారంగా ధరలను పెంచి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఇవేం ధరలు బాబోయ్! జిల్లాలోని పడమటి ప్రాంతంలో ఎక్కువగా హార్టికల్చర్ పంటలను రైతులు సాగుచేస్తుంటారు. హైబ్రిడ్ వంగడాలైనా వీటికి కచ్చితంగా నూతన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఆమేరకు ఏ పంట సాగుకై నా చీడపీడల నివారణ కోసం మల్చింగ్ షీట్లను వాడాల్సిందే. మొన్నటి దాకా మల్చింగ్ షీట్ 20 ఎంఎం ధర 400 మీటర్ల రోల్ రూ.1800 ఉంటే, అధి ఇప్పుడు రూ.26,00 అయ్యింది. 600 మీటర్ల రోల్ గతంలో రూ.2,200 ఉండగా దాని ధర ప్రస్తుతం రూ.2,900 అయ్యింది. 800 మీటర్ల రోల్ గతంలో రూ.2,400 ఉండగా ఇప్పుడు రూ.3,600 విక్రయిస్తున్నారు. 25 ఎంఎం ధరలు గతంలో 400 మీటర్లు రూ.2,200 ఇప్పుడు 2,900.,600 మీటర్లు రూ.2600 ఇప్పుడు రూ.3,200, 800 మీటర్లు రూ.3,400 ఇప్పుడు రూ.4,800 గా ఉండగా అన్నింటిపై రూ.వెయ్యి పెంచేశారు. ఇక 30 ఎంఎం రోళ్లపై కేజీ రూ.175 ఉండగా ప్రస్తుతం రూ.200, గతంలో డ్రిప్పులకు సంబంధించిన డ్రిప్ లేటర్ల 1000 మీటర్లు ధర రూ.1200 గా ఉండగా వీటి ధర ఇప్పుడు రూ.1,700గా ఉంది. పంటలకు అవసరమైన డ్రిప్పు ఎరువులు గతంలో 19–19–19 ధర రూ.2,200 ఉండగా, ఇప్పుడు రూ.3,200 పలుకుతోంది. 20– 20– 20 ధర గతంలో రూ.2,100 కాగా, ఇప్పుడు రూ.3,100 అయ్యింది. 1261 ఎరువు ధర గతంలో రూ.3,600 కాగా ప్రస్తుతం రూ.4,800 దాటింది. ఆఖరుకు మొన్నటిదాకా కిలో రూ.150 గా ఉన్న ట్వైన్ ఇప్పుడు రూ.240 వరకు పెరిగిపోయింది.భారీగా పెంచిన రిటైలర్లు వాస్తవం ఇదీ.. ప్రస్తుతం కాంప్లెక్స్ 20– 20– 13 ధర రూ.2,200 ఉంది, 15,15,15 ధర రూ.2,100గ ఉంది.10.26.26 ధర రూ.2,100 ఉంది. 14.30.14 ధర రూ.2080గా ఉంది. అదే యూరియా ప్రభుత్వ ధర రూ.270 ఉండగా ట్రాన్స్ఫోర్ట్ చార్జీలను పెంచి బ్లాక్ మార్కెట్లో రూ. 350గా అమ్ముతున్నారు. ఇక డీఏపీ బస్తా ధర రూ.1475 ప్రభుత్వ ధర ఉండగా రూ.1,800 లెక్కన అమ్ముతున్నారు.పలమనేరు వ్యవసాయశాఖ పరిధిలో 580 దాకా ఫర్టిౖలైజర్స్ దుకాణాలున్నాయి. వీటిల్లో ఎరువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి విక్రయిస్తున్నారు. వ్యవసాయం అంటే దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. పెట్టుబడి సైతం గిట్టుబాటు కాని దుస్థితి దాపురించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రేటు దక్కక అన్నదాత కుంగిపోతున్నాడు. ప్రభుత్వం సైతం చేయూతనందించకపోవడంతో మరింత దిగాలుపడుతున్నాడు. ఎరువులు.. పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాడు. రైతు ఇక్కట్లను పరిగణనలోకి తీసుకోని వ్యాపారులు మాత్రం యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. డీఏపీలు.. డ్రిప్ ఎరువులను యథేచ్ఛగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన వారికి యుద్ధం సాకును చూపిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు సేద్యం అంటేనే రైతులు భయపడే స్థాయికి తీసుకువచ్చేస్తున్నారు. మల్టీబ్రాండ్ కంపెనీలైన జెనిగో, సొనైట్, గ్రీన్ఫ్రో, అగ్రిబ్రాండ్, ఐరిస్ లాంటి కంపెనీలు మల్చింగ్ షీట్లు కిలోపై రూ.200 దాకా పెంచారు. ఇదే అదునుగా భావించిన స్థానిక రీటైల్ దుకాణదారులు మరో రూ.500 పెంచేస్తున్నారు. ఈ క్రమంలో ఎరువులైనా, పురుగుమందులైనా, మల్చింగ్ షీట్లు అయినా, ప్రతి ఐటం మీద రూ.1000 అధికంగా వసూలు చేస్తున్నారు. అసలే పండించిన పంటలకు ధరల లేక, పెట్టిన పెట్టుబడి దక్కడ కుదేలైన రైతులు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నారు. -
వదలని భీకరి
కౌండిన్య అభయారణ్య ప్రాంతంలో ఒంటరి ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. ఒక గజరాజును పట్టగానే మరొకటి రంగంలోకి దిగుతుండడంతో అధికారులకు సైతం దిక్కుతోచని పరిస్థితులు తలెత్తుతున్నాయి. మొసలిమడుగులో ఒకటి.. అటవీ సరిహద్దుల్లో మరో రెండు సంచరిస్తున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మదపుటేనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. పలమనేరు : జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఒంటరి ఏనుగుల సమస్య తీరేలా లేదు. ఇటీవల ఓ మదపుటేనుగును అటవీశాఖ కుంకీల ద్వారా బంధించింది. అయితే మరో మదపుటేనుగు ముసలిమొడుగులో బీభత్సం సృష్టిస్తోంది. మరో రెండు మదపుటేనుగులు కౌండిన్యలో ఒంటరిగా సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మదపుటేనుగుల కారణంగా ఈ ప్రాంత రైతులకు ఇప్పట్లో కష్టాలు తీరేలాలేవు. పరిష్కారం ఎలా..? ఏనుగుల సమస్య దశాబ్ధాలుగా తీరని సమస్యగా మారింది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడు ల్లో రైతుల ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. అడవిని దాటి బయటకొచ్చిన ఏనుగులు సైతం వివిధ కారణాలతో మృతి చెందుతున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటిదాకా అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాలు ప్రయోజనం లేకుండా పోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి గజరాజులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు చేపట్టింది. అయితే మొత్తం మదపుటేనుగులను బంధిస్తే కానీ ఈ సమస్య తీరేలా లేదు. అన్నింటినీ బంధిస్తేనే.. కుంకీల ద్వారా ఒంటరి ఏనుగులను బంధిస్తేగానీ ఈ సమస్య పరిష్కారమైయ్యేలా కనిపించడం లేదు. దీంతోపాటు అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా పూర్తి స్థాయిలోమ సోలార్ ఫెన్సింగ్ను నిర్మించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. పలమనేరు మండలంలోని పెంగరగుంట నుంచి చెత్తపెంట దాకా సోలార్ ఫెన్సింగ్ లేనందునే ఏనుగులు యథేచ్ఛగా రైతుల పంటలపై పడడం, గ్రామాల్లోకి రావడం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హడల్ పుట్టిస్తున్నాయి అసలే ఇది మేకింగ్ సీజన్ కావడంతో కౌండిన్యలో ఒంటరిగా తిరుగుతూ మదమెక్కిన ఏనుగులు తర చూ జనావాసాలపైకి వస్తున్నాయి. వీటిని మళ్లించేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ బాణాసంచా పేల్చడం, జనం అరుపులు వీటికి మరింత ఆగ్రహాన్ని తెప్పించి ప్రజల తిరగబడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు మొదలైయ్యాక మదపుటేనుగులు మరింతగా రెచ్చిపోవడం అటవీశాఖకు నిద్రపట్టడంలేదనే చెప్పాలి. ఽఽఏనుగులు ధాన్యం, నీటి కోసం బోర్లు, పైపులు, కసితో కుక్కలు, ఆవులు, దూడలపై ప్రతాపం చూపుతున్నాయి. -
అశ్రునయనాలతో అంత్యక్రియలు
శాంతిపురం : టెంపో ఢీకొని మృతి చెందిన వారికి బంధు మిత్రులు అశ్రునయనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం కడపల్లె వద్ద దూసుకొచ్చిన టెంపో ముగ్గురి ప్రాణాలు తీసి, ఐదుగురిని ఆస్పత్రి పాలు చేయడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతి చెందిన బీరనకుప్పం గ్రామానికి చెందిన టీడీపీ నేత సుందరప్ప, అదే గ్రామానికి చెందిన మునివెంకటమ్మకు పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామంలో అంత్య క్రియ లు నిర్వహించారు. వారి సొంత భూముల్లోనే వారిని ఖననం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరితో మంచిగా ఉండే సుందరప్ప రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందడంతో పెద్ద సంఖ్యలో జనం కడసారి చూపులకు తరలివచ్చి నివాళులర్పించారు. తీవ్రంగా గాయపడి కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న నందిని, లక్ష్మి, కనగవళ్లి, సతీష్, పూంగోడి, అక్షయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. మరో వైపు ఇదే ప్రమాదంలో మృతి చెందిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మహేష్, దీప కుమారుడు సాత్విక్(6) మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కడపల్లెకు వచ్చిన దంపతులు ప్రమాదంలో ముక్కపచ్చలారని తమ కుమారుడిని కోల్పోయారు. -
నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
తిరుమల : తిరుమలలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు బంగారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరిస్తాం తిరుమల : శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించేందుకు టీటీడీ కార్యాచరణ చేపట్టిందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్న్లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించే అవకాశాలను గుర్తించి టీటీడీ దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. శ్రీవారి సేవకుల పనితీరును ఆధారంగా చేసుకుని సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆ రేటింగ్ ఆధారంగా విధుల కేటాయింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి.శ్రీనివాస్, చైన్నెకి చెందిన శరత్ను ఈవో శాలువాతో సత్కరించారు. టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ, శ్రీవారి సేవా సదన్ సిబ్బంది పాల్గొన్నారు. -
● ఎస్వీయూలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఆమోదం తెలపండి ● తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి ● పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి
‘నైలెట్ ’ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం లోకసభ జీరో అవర్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాల న్నారు. ప్రస్తుతం శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూ కేటాయింపు, డీపీఆర్ సమర్పణ వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, నైలెట్ సంస్థ మధ్య చర్చల్లో ఉన్నాయని కేంద్రం ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి శాశ్వత క్యాంపస్ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. అలాగే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాధిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్న్స్ని కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం తెలిపి చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనువైన భూమి ఇప్పటికే గుర్తించినప్పటికీ, ఇప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ఈ అంశాలపై ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు ఎంపీ తెలిపారు. హెచ్ఎంపై డీఈవో ఆగ్రహంఏర్పేడు: మండలంలోని పాపానాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇందులో విద్యార్థుల రోజువారీ సగటు హాజరుకు మించి కోడిగుడ్లను అధికంగా ఇండెంట్ చేసి పాఠశాలకు సరఫరా చేయించడమే కాకుండా, వాటినే సుమారు నెల రోజుల పాటు విద్యార్థులకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారం పై డీఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీచేసి, పూర్తి వివరణ సమర్పించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాలు, విషయ పరిజ్ఞానం, నేర్చుకునే స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సూచనలు జారీ చేశారు. రోజువారీ సగటు విద్యార్థుల హాజరును అనుసరించి మాత్రమే కోడిగుడ్లు, చిక్కీలకు ఇండెంట్ ఇవ్వాలని తెలిపారు. -
అపూర్వ అవకాశం.. వరిస్తే మరింత అదృష్టం
తిరుపతి సిటీ: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ సరికొత్త కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు, విజ్ఞాన్.. మంథన్ స్కాలర్ షిప్ పోటీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బాల మేధావులకు అవకాశం విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 32వ జాతీయ బాలల కాంగ్రెస్ పోటీలను (ఎన్సీఎస్సీ) దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. అన్ని రకాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులే. ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈనెల 30లోపు ఈ పోటీలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు విద్యార్థులు టీమ్గా ఏర్పాడి ఓ గైడ్ పర్యవేక్షణలో ప్రధానంగా ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, భారతీయ విజ్ఞాన వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ చూపితే రాష్ట స్థాయిలో రాణించాలి. రాష్ట స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుతో పాటు మరిన్ని వివరాలపై ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం అందించారు. సైన్స్ ఉపాధ్యాయులను సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి సులువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతిభకు పట్టం విద్యార్థుల ప్రతిభను జాతీయ స్థాయిలో పరీక్షించి ప్రొత్సహించేందుకు కేంద్రప్రభుత్వం విజ్ఞాన్..మంథన్ పేరుతో ప్రతిభాన్వేషణ్ పరీక్షను నిర్వహిస్తోంది. ఆరవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష తెలుగుతో పాటు 14 భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ చివరి గడువు. అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పాఠశాల స్థాయి తొలి లెవల్ పరీక్షను నిర్వహించనున్నారు. నాలుగు స్టేజ్లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాది పాటు భాస్కరా స్కాలర్షిప్లను కేంద్రప్రభుత్వం అందించనుంది. రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు httpr://vvm.orf.in వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది.


