సంక్లిష్టమైన యోగాసనాలు వేస్తూ..
అథ్లెటిక్స్లో దూసుకెళుతున్న క్రీడాకారులు
చిత్తూరు మెసానిక్ మైదానంలో అమరావతి చాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు నువ్వా, నేనా? సై అనే లెవెల్లో పోటీపడ్డారు. పరుగు పందేల్లో క్రీడాకారులు చిరుతల్లా పరుగులు తీశారు.. హాకీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇక, బాక్సింగ్ రింగ్లో అయితే క్రీడాకారులు తమ పంచ్లు విసురుతూ, హుక్లతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు శ్రమించారు. యోగా పోటీల్లో విభిన్నమైన ఆసనాలతో ఆకట్టుకున్నారు.
– చిత్తూరు కలెక్టరేట్


