breaking news
Chittoor District Latest News
-
సుపరిపాలన కాదు.. ఇది దుర్మార్గ పాలన
పాలసముద్రం : ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలను దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తూ.. సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమని మాజీడిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, జీడీ నెల్లూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కృపాలక్ష్మి దుయ్యబట్టారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ మండల కన్వీనర్ తులసి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్బళగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణస్వామి, కృపాలక్ష్మి, పార్టీ నాయకులతో కలసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ ఏడాదిలో ఏం సాధించారో చెప్పే దమ్ము కూటమి నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనాల్లోకి రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృషిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు శేఖర్ యాదవ్, పుష్పాప్రకాష్, సర్పంచ్లు భాస్కర్రెడ్డి, అనురేఖ, మహేష్ బాబు, అయ్య ప్ప, జీవిత, నరసింహులురాజు, ఎంపీటీసీలు గోవిందరాజ్, లిఖిత, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ధనంజయులతోపాటు నాయకులు పాల్గొన్నారు. -
ఉరేసుకోమంటారా..!?
● ధర ఇవ్వరు.. కాయలు కొనరు.. ● అయినా మామిడి పంట పండించాలంట ● చెట్లు తొలగిస్తే కేసుల నమోదు ● దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు కొందరు మామిడి రైతులపై పగబట్టారు. మామిడి రైతుల పీక నొక్కుతున్నారు. మామిడి పంట తొలగిస్తే నేరమంటున్నారు. కక్షగట్టి వేధిస్తున్నారు. అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కేసులు, జరిమానాల పేరుతో రైతులను భయపెడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు పొగ పెడుతున్నారు. దీనిపై వివిధ పార్టీ నేతలు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. మామిడి పంటకు ఆంక్షలు ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మామిడి చెట్టు పూతకు వచ్చినప్పటి నుంచి కాయలు పక్వానికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. మంచి దిగుబడి వచ్చింది. ఆ సారి కొంచెం లాభాలైనా కళ్ల చూడచ్చని అనుకున్నారు. మామిడి కాయలు కోతలు మొదలయ్యాక తెలిసింది అసలు ధరల్లేవు అని.. ప్రభుత్వం ఒక వైపు అధికారులు మరోవైపు రోజుకో ధర ప్రకటిస్తుంటే, ఫ్యాక్టరీలు మాత్రం అసలు కాయలే కొనం అంటూ మొండికేశాయి. ఈ క్రమంలోనే మామిడి కాయల ట్రాక్టర్లు ఫ్యాక్టరీల ముందు బారులు తీరాయి. రోజులు గడిచిపోతున్నా ట్రాక్టర్లు మాత్రం అన్లోడ్ కావడం లేదు. ట్రాక్టర్లోనే కాయలు పండై కుళ్లిపోయాయి. విధిలేక రోడ్ల పక్కనే పోరబోసి ఖాళీ ట్రాక్టర్లు ఇంటికి చేరాయి. ఈ బాధతో ఇక మామిడి పంటకు బదులు వేరే ఏదైనా సాగు చేసుకుందామని, చెట్లను తొలగించేశారు. అయితే చెట్లను తొలగించే రైతులపై కేసులు పెడుతున్నారు. ఈ తరుణంలో మామిడి రైతులకు కన్నీటి సుడులు మొదలయ్యాయి. రైతులను బతకనివ్వండి ఏదైతే రైతుకు మంచి దిగుబడి ఇస్తుందో.. ఆ పంట పండించాలనే రైతు తాపత్రాయ పడుతుంటాడు. ఇప్పుడు మామిడి వల్ల రైతుకు ఒరిగింది ఏమి లేదు. ఈ పంట సక్రమంగా రాని పక్షంలో రైతు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు. అంతే కానీ మామిడి చెట్లను కొట్టేస్తున్నారని కేసులు పెట్టడం కరెక్టు కాదు. చిత్తూరులోని కొన్ని కార్యాలయాల్లో చెట్లు కొట్టేస్తున్నారని వీడియోలు తీసి పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. రైతులను ప్రశాంతంగా బతకనివ్వండి. – శరవణ, జనసేన పార్టీ నేత, చిత్తూరు రైతు చనిపోతే బాధ్యతెవరిది మామిడికి ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర అమ లు కాలేదు. పండిన పంట ను అమ్ముకోవడానికి అవస్థ లు పడుతున్నాం. విధిలేని పరిస్థితుల్లో వేరే పంట పండించుకోవాలని చూస్తున్నాం. అటవీ శాఖ అధికారు లు గ్రీనరీ అంటున్నారు కదా. రైతు అప్పుల పాలై చ నిపోతే ఈ అధికారులు బాధ్యత వహిస్తారా? దయ చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడే పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం. చెట్టు కొట్టేస్తున్నారని జరిమానా లు, కేసులు పేరుతో మమ్మల్ని వేధించొద్దు. – కొత్తూరు బాబు నాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు పంట మార్పిడికి అనుమతేంటి? అతని పొలంలో అతను మా మిడి చెట్లు పెట్టుకున్నారు. పంట బాగా వచ్చి లాభాలుంటే ఏ రైతూ పంటను నేల మ ట్టం చేయడు. నష్టం వస్తే ప్ర త్యామ్నాయం చూసుకుంటా డు. అది రైతు ఇష్టం. గ్రీనరీ పేరుతో రైతులను అధికారు లు వేధిస్తే ఎలా? అలా అనుకుంటే అన్ని రకాల పంటలు గ్రీనరీనే కదా. అప్పుడూ ఏ పంటనూ కోయకూడదు. పంట మార్పిడికి అనుమతి తీసుకోవాలనడం విచిత్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. రైతులను ఇబ్బంది పెడితే. తిరగబడడం ఖాయం. – నాగరాజు, సీపీఐ నాయకులు, చిత్తూరు -
బోయకొండ కిటకిట
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయంలో క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి దీపాలు, దీవెలతో మేళ తాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. -
జిల్లా సమాచారం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 78 టీటీడీ డిగ్రీ కళాశాలలు 5 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 132 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 66 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 521 టీటీడీ జూనియర్ కళాశాలలు 3 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 52 డిగ్రీ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్న తాత్కాలిక అధ్యాపకులు 75 జూనియర్ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారు 37 -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. 9న సార్వత్రిక సమ్మె చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జిల్లాలో సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఆదివారం ఐసీడీఎస్ సూపరింటెండెంట్కు సమ్మె నోటీసు అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు. దీనికి నిరసనగా చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఈ సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల జాబితాపై బీఎల్వోలకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్)లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఈ నెల 5 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఇచ్చేలా కలెక్టరేట్ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్వోల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం ప్రతి రోజు 50 మందికి మించకుండా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ శిక్షణలో ఎన్నికల ఓటర్ల జాబితాలో చేపట్టాల్సిన చర్యలను బీఎల్వోలకు క్షుణ్ణంగా వివరించనున్నారు. -
విధ్వంసక ‘కూటమి’ని ఎదుర్కొందాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంసక పాలన సాగిస్తున్న ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు మండలం పాలంతోపు గ్రామంలో ఆదివారం ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధాలకు మారు పేరు చంద్రబాబు అన్నారు. బాబు మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చారని, తీరా ప్రజలకు చేసేంది ఏమిలేదన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, విధ్వంసాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇళ్లు, ఆస్తులు, పంటలు ధ్వంసం చేసి సామాన్యులు, వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తాన్ని కళ్లచూశారన్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ అరాచకాలు, తప్పుడు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ప్రతి గడపలోకి వెళ్లి కూటమి మోసాన్ని వివరిద్దామన్నారు. రైతులను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని బూచి చూపించి చివరకు నడి రోడ్డుపై వదిలేశారన్నారు. ఈ బాధలు తట్టుకోలేక ఓ రైతు మామిడి చెట్లు తొలగించి ప్రత్యామ్నాయం చూసుకుంటే ఆ రైతుకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించడం విడ్డూరమన్నారు. ఇలా జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న బంగారుపాళ్యంకు వస్తున్నారన్నారు. ఆయనకు జిల్లాలోని ప్రతి రైతు స్వాగతం పలకాలని కోరారు. అనంతరం క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయపాల్, జెడ్పీటీసీ ఎం.ఎస్బాబునాయుడు, నాయకులు సంపత్, అమర్నాథ్రెడ్డి, త్యాగరాజులు రామ్మోహన్, భాస్కర్రెడ్డి, భాస్కర్, వేలుస్వామి, రాబర్ట్, స్టాండ్లీ, దిలీప్, పాండి, రాజేంద్ర, సుబ్రమణి, జయచంద్ర, సుబ్రమణ్యం, మూర్తి, వైస్ ఎంపీపీ జయరాం పాల్గొన్నారు. -
వరసిద్ధుని బ్రహ్మోత్సవానికి ముహూర్తం ఖరారు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 27వ తేదీ నుంచి బ్రహ్మో త్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకచవితి రోజు నుంచే ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 28న ధ్వజారోహణం, హంసవాహనం, 29న బంగారు నెమలి వాహనం, 30న మూషికవాహనం, 31న బంగారు చిన్న, పెద్ద శేష వాహనం, సెప్టంబర్ 1న చిలుక వాహనం, వృషభవాహనం, 2వ తేదీ గజవాహనం, 3న రథోత్సవం, 4న తిరు కల్యాణం, 5న ధ్వజారోహణం, ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. ఆపై ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 6వ తేదీ అధికార నంది వాహనం, 7న రావణబ్రహ్మ వాహనం, 8న యాళి వాహనం, 9న సూర్యప్రభ వాహనం, 10న చంద్రప్రభ వాహనం, 11న కల్పవృక్ష వాహనం, 12న విమానోత్సవం, 13న పుష్పపల్లకి, 14న కామధేను వాహనం, 15న పూలంగిసేవ, 16న తెప్పోత్సవం ముగియనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు. -
నిర్బంధ విధానం సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల పట్ల నిర్బంధ విధానం అమలు చేయడం ఏ మాత్రం సరికాదని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను ఎక్కువగా అమలు చేయడం అన్యాయమన్నారు. బోధనేతర పనుల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడి, అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. బోధన పట్ల ఏకాగ్రత కరువవుతోందని చెప్పారు. మెగా పీటీఎం పేరుతో పాఠశాలల్లో 17 కమిటీలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యాశక్తి, ఆన్లైన్ కోర్సులు, తల్లికి వందనం పోటీలు, గ్రీన్ టైల్ నమోదు, వీడియోలు రికార్డు చేయడం వంటి అదనపు ఒత్తిళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులపై నెట్టడం అన్యాయమన్నారు. -
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేద్దాం
బంగారుపాళెం: మామిడి రైతులకు అండగా నిలిచేందుకు మండలానికి విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ తెలిపారు. మండలంలోని పాలేరు గ్రామంలో ఆదివారం సాయంత్రం మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సునీల్కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 9న మామిడి మార్కెట్ను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నారని చెప్పారు. ధరలు లేక తోటల్లో కాయలు నేలరాలిపోతుంటే రైతులు కంట తడి పెట్టుకున్నట్లు తెలిపారు. మామిడి రైతులు పడుతున్న కష్టాలు కూటమి నాయకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సర్దార్, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిందరాజులు, ప్రకాష్రెడ్డి, వడ్డెర, ఈడిగ కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్లు మొగిలీశ్వర్, ఎల్లప్ప, నియోజవర్గ రైతు విభాగం అధ్యక్షులు పాలాక్షిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షులు అరుణామల్రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాకీర్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వాణీప్రియ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు మాలతి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
చిత్తూరు అర్బన్: జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడంపై ప్రతి ఒక్క న్యాయమూర్తి దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆదేశించారు. చిత్తూరు కోర్టు భవనంలో ఆదివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లా న్యాయాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత నెలాఖరు నాటికి జిల్లాలో 96,739 పెండింగ్ కేసులు ఉండగా, ఇందులో 48,751 సివిల్, 47,988 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్ ఉండడంపై రాష్ట్ర హైకోర్టు సైతం గమనిస్తోందన్నారు. ప్రధానంగా వృద్ధులకు సంబంధించిన కేసులు, అనుమతి లేని విచారణ ఖైదీల కేసులపై దృష్టి సారించాలన్నారు. న్యాయస్థానాలు జారీ చేసిన వారంట్లు ఏ మేరకు అమలు చేశారో సరి చూసుకోవాలన్నారు. జిల్లాలోని సీనియర్ జూనియర్ సివిల్ న్యాయమూర్తులకు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి లక్ష్యాలు కూడా నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు హాజరయ్యారు. ఏరియా ఆస్పత్రిలో యువకుడి హల్చల్ పలమనేరు: మద్యం మత్తులో ఉన్న యువకుడు సైకోలా మారి హల్చల్ చేసిన సంఘటన పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దండపల్లి మండలం కురప్పల్లెకు చెందిన భాను(25) భార్యతో కలిసి పట్టణంలోని గాంధీనగర్లో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్యపై దాడిచేశాడు. దీంతో ఆమెను బంధువులు స్థానిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే భర్త ఆస్పత్రికి వచ్చి మరీ భార్యతో గొడవపడి గట్టిగా కేకలు పెడుతూ చొక్కా తీసిపడేసి, అక్కడున్న వారిని తరుముకున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వారు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి ఓ చెట్టుకు కట్టేశారు. భక్తులపై హిజ్రాల దాడి చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనం కోసం ఆటోలో వచ్చిన ఐదుగురు భక్తులు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని హిజ్రాలు వారిపై దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆటోలో బోయకొండకు బయల్దేరారు. బోయకొండ సమీపంలోని మేకలవారిపల్లె వద్ద రోడ్డుపై వెళ్తున్న వాహనాలను హిజ్రాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే వారు ఇవ్వకుండా అక్కడి నుంచి బోయకొండ రణభేరి గంగమ్మ ఆలయం సమీపం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న మరి కొందరు హిజ్రాలు డబ్బులు ఇచ్చి ఆటో ముందుకెళ్లాలని పట్టుబట్టారు. వారు అడిగినంత ఇవ్వలేదని బూతులు తిడుతూ, ఆటోలో ఉన్న దేవరాజు, మంగమ్మ, భవాని, లిఖిత, నారాయణస్వామి లపై హిజ్రాలు దాడిచేసి గాయపరిచారు. వారు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరికొందరు భక్తులు వారిని రక్షించారు. అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్కు భక్తులు ఫిర్యాదు చేశారు. -
అసలు సిసలైన నాయకుడు జగనే
● హామీలిచ్చి విస్మరించిన చంద్రబాబు ఎప్పటికీ మోసగాడే ● ఇది ప్రజలకు తెలియజేయడమేరీకాలింగ్ మేనిఫెస్టో ఉద్దేశం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా నగరి : అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అసలు సిసలైన ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. నగరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేరిస్తే అంతకన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛన్ తప్ప ఏమీ అందిచలేదన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి 30 లక్షల మందికి కోతలు పెట్టి తల్లికి వందనం అమలుచేశారని దుయ్యబట్టారు. 3 అంకణాలకు మించి ఉన్నా, రూ.300 విద్యుత్ బిల్లు ఉన్నా రూ.8,020 మాత్రమే వేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. గెలిచాక యథాప్రకారం ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఎన్ని హామీలు ఇచ్చారు ఏవి అమలు చేయలేదు అని క్షేత్రస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమ ఉద్దేశమన్నారు. జగనన్న చేసిన మంచిని చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యతన్నారు. సనాతన యోధుడు ఏమయ్యాడు తిరుమలలో దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, శ్రీ కూర్మంలో తాబేళ్లు చనిపోతున్నాయని వీటిపై సనాతన యోధుడు పిఠాపురం పీఠాధిపతి పవన్ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఆయన తమిళనాడుకెళితే తాను అక్క డే పుట్టానంటాడు.. గుంటూరుకు వెళితే అక్కడా పుట్టానంటాడు.. పిఠాపురం వెళితే అక్కడే పుట్టానంటున్నాడు.. అసలు ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అందరూ వీకెండ్కు వెకేషన్కు వెళితే, పవన్ వీకెండ్కు మాత్రమే రాష్ట్రానికి వస్తారన్నారు. ఎవరు రాష్ట్రానికి మంచిచేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, విజయలక్ష్మి, దీప, వైస్చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవన్ తిక్కకు బాబు లెక్కలు పవన్ తిక్కకు చంద్రబాబు వద్దే లెక్కుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ హామీలు నెరవేర్చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎంతమంది ఉంటే అంత మందికి జగన్ చేసిన సంక్షేమం కన్నా ఎక్కువ చేస్తాం అంటూ ఎన్నికల బీరాలు పలికిన బాబు నేడు దీన స్వరంతో పథకాలు తలచుకుంటే భయమేస్తోందంటున్నారని ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని పేర్కొన్నారు. ఆయనకు నిజం చెబితే తల పగిలే శాపం ఉందేమో అన్నారు. అందుకే ఆయన అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. బాబు చంకలో కూర్చున్న పవన్ తానే టీడీపీని అధికారంలోకి తెచ్చానంటుంటే, తాము లేకుంటే పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవరని టీడీపీ చెబుతోందని, ఇలాంటి నాయకులందరూ కూటమిగా కొనసాగుతుండడం దౌర్భాగ్యమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తెస్తానన్నారు. ఇంత మంది ఆడపిల్లలు అఘాయిత్యాలకు బలవుతున్నా నోరుమెదపడం లేదేమిటని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు చూపే గ్రాఫిక్స్ తప్ప మిగతా విషయాలు ఏవీ కనబడవన్నారు. -
వైఎస్సార్ అంతరాత్మ ‘తెలుగు’
చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివంగత ముఖ్యమంత్రి డా వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంతరాత్మ తెలుగుభాష అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షులు మర్రిపూడి దేవేంద్రరావు అన్నారు. న గరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆదివారం రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ‘తెలుగుభాషాభిమా నం – వైఎస్సార్ అంతరంగం’పై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, తెలుగుభాషకు ప్రాచీనపరంగా తెచ్చిన తెలుగుతల్లి ముద్దుబిడ్డగా వైఎస్సార్ ఖ్యాతికెక్కారని చెప్పారు. పల్లెసోయగాలు ఉట్టిపడే పంచెకట్టుతో తేట తెలుగు నడికారపు పలుకుల పలకరింపులు ఒక్క వైఎస్సార్కే దక్కిందన్నారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు తోట గోవిందన్ మాట్లాడుతూ అనితర సాధ్యమైన సేవలను ఆంధ్రావనిలోని ప్రతిగుండె కు చేరవేసిన రాజన్న యుగం చిరస్మరణీయమన్నారు. అనంతరం రాజన్న పరిపాలనపై కవిసమ్మేళనం నిర్వహించారు. 20 మంది రచయితలను, సంఘసే వకులను దేవేంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు శ్రీరాజు, ఎస్.మునీంద్ర, రమేష్ బాబు, తెలుగు భాషాభిమానులు కోటీశ్వ ర మొదలియార్, డి.రోహిత్, జి.లక్ష్మీపతి, చిట్టిబాబు, భూపతి, ఎం.దినకరన్, రాజేంద్రన్, మురళి పాల్గొన్నారు. -
● ప్రశ్నార్థకంగా కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ● ఉద్యోగ భద్రత కరువు..బతుకు భారం ● ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు అందని రెన్యూవల్ ఉత్తర్వులు ● తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ● మూడు నెలలుగా అందని వేతనాలు ● దయనీయ
తిరుపతి సిటీ : ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల భద్రత కరువై బతుకు భారంగా మారింది. కళాశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు తప్ప మిగిలిన డిగ్రీ, టీటీడీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ రెన్యూవల్ ఆర్డర్స్ ఇచ్చిన పాపాన పోలేదు. 2025–26 అకడమిక్ ఇయర్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో అధ్యాపకులు మే నుంచి జులై వరకు మూడు నెలల జీతాలకు నోచుకోలేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 2002 నుంచి పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 800 మందికి పైగా అధ్యాపకులు ఉద్యోగ భద్రత కరువైె చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వం పర్మినెంట్కు ఆదేశాలిచ్చినా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు 2024లో జీఓ 114 విడుదల చేసి ప్రక్రియ శర వేగంగా కొనసాగుతున్న తరుణంలో సాధారణ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పక్కన పెట్టి డిగ్రీ అధ్యాపకుల నియామకాల కోసం ఏపీపీఎస్సీ ద్వారా నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అయోమయంలో పడింది. రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికై న అధ్యాపకులతో తాత్కాలిక అధ్యాపకుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. కొంత మంది అధ్యాపకులు గత 22 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ రెగ్యులర్ చెయ్యకపోవడం కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వకపోవడం దారుణం.రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వంజిల్లాలో ప్రభుత్వ, టీటీడీ కళాశాలలో 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోలేక సతమతమతం అవుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 75 మంది తాత్కాలిక అధ్యాపకులు రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అటు పర్మినెంట్ చేయకపోగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించకపోవడంతో వారికి ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా 12 నెలల పాటు అధ్యాపకుల చేత సేవ చేయించుకుని కేవలం 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి తోడు వేతనాలు సరైన సమయానికి అందించకుండా మూడు, నాలుగు నెలలకు ఒకసారి అందిస్తున్నారు. ఏటా నాలుగు నెలల నిరీక్షణ గతంలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి రెన్యూవల్ ఆర్డర్స్ వచ్చేవి. గత ఏడాది నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ కళాశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి కాకుండా మూడు నెలలు ఆలస్యంగా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం నాలుగు నెలలు జీతభత్యాలు ఆలస్యమవడంతో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రక్రియ పూర్తయే వరకు నూతన రిక్రూట్మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలి. ప్రస్తుతం 2025–26 సంత్సరానికి సంబంధించి తాత్కాలిక అధ్యాపకులను కొనసాగిస్తూ ఉత్తర్వులు తక్షణం జారీ చేయాలి. దీంతో పాటు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్న సబ్జెక్ట్లకు వదిలేసి ఖాళీగా ఉన్న సబ్జెక్ట్లకు మాత్రమే నూతన రిక్రూట్మెంట్ ద్వారా అధ్యాపకుల ఎంపిక చేయాలి. – డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు, తిరుపతి జిల్లా -
ఉద్యమంలా తెలుగు భాషా పరిరక్షణ
పలమనేరు: తెలుగుభాష, సంస్కృతి పరిరక్షణకు సాహితీవేత్తలు ఓ ఉద్యమంలా ముందుకెళ్లాలని ప్రముఖ శతావధాన్ని ఆముదాల మురళి సూచించారు. పట్టణ సమీపంలోని కళామందిరం మూడో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతృభాషను కాపాడుకోవాల్సిన అవరసం నేటి తరంపై ఉందన్నారు. పిల్లలు సెల్ఫోన్లు పక్కనబెట్టి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని సూచించారు. కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్త రమేష్, కడప జానమద్ది సాహితీపీఠం నిర్వాహకులు విజయభాస్కర్ ప్రసంగించారు. నిర్వాహకులు తులసీనాథం నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో నీతిని ప్రతిబింబించేందుకు నీతిపద్యాలు ఎంతో తోడ్పడతాయన్నారు. వందకు పైగా నీతి పద్యాలను చెప్పిన 50 మంది చిన్నారులకు వారు బహుమతులను అందజేశారు. సాహితీ రంగంలో ప్రతిభ చూపుతున్న చింతకుంట శివారెడ్డి, ఏనుగు అంకమనాయుడు, మల్లారపు నాగార్జున, టెంకాయల దామోదరం, మాధవి, నడ్డి నారాయణ, ప్రకాష్రెడ్డి, సాంభయ్య, విజయలక్ష్మి, రంభ, హేమాద్రి, సుధాకర్, శాంతాభాస్కర్, ఆళ్ళ నాగేశ్వరావుకు వార్షికోత్సవ పురస్కారాలను అందజేశారు. డాక్టర్ మౌని రచించిన భిన్నధ్రువాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన డా.రజని భరత, కూచిపూడి నాట్యాలు అందరినీ అలరించాయి. ఇందులో పుష్ప, ధనుంజయ, డా.మాధవి, రమ్య, భారతి, జమున, పలమనేరు బాలాజీ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూలిన విద్యుత్ దీప స్తంభం
చిత్తూరు అర్బన్: నగరంలోని గాంధీ రోడ్డు కూడలిలో అర్ధరాత్రి విద్యుత్ దీపస్తంభం కుప్పకూలింది. శనివారం అర్ధరాత్రి తరువాత ఓ లారీ వేగంగా వచ్చి దాదాపు వంద అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ దీప స్తంభాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ఆ స్తంభం రోడ్డుపైనే కూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జంతువులకు వ్యాధి నిరోధక టీకాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జంతువుల నుంచి మనుషులకు సోకే రేబిస్ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ జేడీ అబ్దుల్ ఆరీఫ్ తెలిపారు. జూనోసిస్ డేను పురస్కరించుకుని ఆదివారం స్థానిక పశువైద్యశాలలో శునకాలకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జంతువులు, పక్షుల నుంచి మనుషులకు 280 రకాల వ్యాధులు వ్యాపించే వీలుందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జూనోసిన్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువైద్య శాలల్లో 23,440 ఉచిత డోస్ల టీకాలు శునకాలకు వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,942 డోసుల టీకాలు వేశామన్నారు. ఉచిత టీకాల ప్రక్రియ స్టాక్ ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, పశువైద్యాధికారిణి సుబ్బమ్మ పాల్గొన్నారు. -
బడిబాట కాగితాల్లోనే..!
● ఆ 15,879 మంది ఎక్కడున్నారో తెలియని వైనం ● డ్రాప్బాక్స్ లెక్కలతో సమగ్రశిక్ష శాఖ అధికారుల హడావుడి ● క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం శూన్యం చిత్తూరు కలెక్టరేట్ : విద్యాహక్కు చట్టం ప్రకారం బడిఈడు ఉన్న పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు చిన్నతనంలోనే బడికి దూరమై కార్మికులుగా మారుతున్నారు. ఈ విషయం పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6–14 ఏళ్ల వయసు ఉండి బడిలో చేరి మధ్యలో చదువు మానేసిన వారి సంఖ్య అధికారికంగా 15,879 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు. తమకేమీ ఆ ఉత్తర్వులు పట్టవనే చందంగా సమగ్రశిక్ష శాఖ అధికారులు ఉదాసీన వైఖరి అనుసరిస్తున్నారు. బడి బయట పిల్లల అంశంపై కలెక్టర్ సైతం పలు మార్లు సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ జిల్లాలో బడిబాట కార్యక్రమం ఊసే లేదు. కలెక్టర్ దృష్టి పెట్టాల్సిందే జిల్లా వ్యాప్తంగా కొంత మంది విద్యార్థులను బలవంతంగా బడుల్లో చేర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. బడుల్లో చేర్పించినప్పుడు మాత్రం ఫొటోలు తీసి అధికారులకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. బడిబయటి పిల్లల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో సైతం తెలియని దుస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ప్రభుత్వ బడులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పాఠశాలల విలీనం.. విద్యకు దూరం జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసే పనిచేపట్టారు. దీంతో వేలాది మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమవుతున్నారు. సొంత గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలతో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. -
రోజువారీగా టోకెన్లు పంపిణీ
పూతలపట్టు (యాదమరి): రైతులకు రోజువారీగా టోకెన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆయన ఆదివారం పూతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించారు. అక్కడ తయారవుతున్న పల్ప్ ఉత్పత్తులను పరిశీలించారు. మ్యాంగో పల్ప్, మ్యాంగో జ్యూస్ పైన ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని ఐదు శాతానికి తగ్గిస్తామన్నారు. దీనివల్ల వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ యజమానులకు తెలిపారు. అనంతరం అన్లోడింగ్ కోసం ట్రాక్టర్లతో వేచి ఉన్న రైతులతో సంభాషించారు. జిల్లా నలుమూలల నుంచి మండలంలోని మ్యాంగో ఫ్యాక్టరీలకు వస్తున్న మామిడి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ రోజుకారోజు టోకెన్లను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నివేదిక సిద్ధం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పంచాయతీల్లో 2023–24లో జరిగిన వివిధ పనుల్లో 29 అంశాల పురోగతి పై నివేదికలు సిద్ధం చేయాలని జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తదితర అధికారులతో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో సంబంధిత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, తాగునీరు, పారుశుద్ధ్యం ఇలా 29 అంశాలపై నివేదికలివ్వాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ 2023–24 సంవత్సరంలో పంచాయతీల్లో జరిగిన, జరగాల్సిన అభివృద్ధి పనులపై పూర్తి నివేదికను సేకరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చిత్తూరు రూరల్ (కాణిపాకం): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆమె ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్నది వర్షాకాలమని, కురిసే వర్షాలకు దోమల ఉధృత్తి పెరగవచ్చన్నారు. దీనికితోడు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. వచ్చే జ్వరం కేసులను క్షుణంగా పరీక్షలు చేసి కచ్చితమైన రిపోర్టును ఇవ్వాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, మలేరియా అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
జగనన్న వస్తున్నాడనీ..!
‘మామిడి’పై ఉరుకులు పరుగులు ● జగన్ పర్యటనతో రైతులను కట్టడి చేస్తున్న కూటమి నేతలు ● ధరల్లేక.. చెట్లు కొట్టేస్తుంటే రైతులపై అటవీశాఖ కేసులు ● ఉన్నట్టుండి రైతులపై ప్రేమ ఒలకబోస్తున్న కూటమి ప్రభుత్వం ● పరిశ్రమల నిర్వాహకులతో ప్రిన్సిపల్ కార్యదర్శి సమీక్షలు ● అయినా సరే.. ఇప్పటికీ కిలో మామిడి ధర తెలియని రైతు ఇంతకూ కిలో మామిడి ఎంత? పంట పండించే రైతుకు దాని ధరను నిర్ణయించే హక్కు ఉంటుంది. కానీ మామిడి రైతు మాత్రం తాను పండించిన పంటకు ఇప్పటి వరకు ధర చెప్పలేకపోతున్నాడు. సీజన్ ప్రారంభంలో రూ.12 ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆపై రూ.8 ప్రకటించి.. మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అటు తరువాత అధికారులు రూ.6 ప్రకటించారు. ఇపుడు కిలో రూ.4–5 మధ్య అంటున్నారు. ర్యాంపుల వద్ద రూ.2–3 పలుకుతోంది. అసలు రైతు నుంచి టన్నలకొద్దీ పంట కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు ఏ ఒక్కరికీ ధర చెప్పలేదు. రైతుల నుంచి ఎంత పటం కొన్నామని స్లిప్పులు ఇస్తున్నారే తప్ప.. అందులో ధర ఎంతని పేర్కొనకపోవడం మామిడి రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. చిత్తూరు అర్బన్: అధికారంలో ఉన్న పాలకులు ప్రజల కష్టాలను పట్టించుకోనప్పుడు ప్రతిపక్షం అంకుశమై ప్రశ్నిస్తుంది. జిల్లాలో మామిడి రైతుల కష్టం విని, కన్నీళ్లు తుడవడానికి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసిన కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయినా సరే, మామిడి రైతు కష్టం తీరలేదు. కన్నీళ్లు ఆగడం లేదు. వైఎస్.జగన్ ఫీవర్ పట్టుకున్న యంత్రాంగం.. క్షేత్ర స్థాయిలో పర్యటనలు, సమీక్షలు నిర్వహిస్తూ మసిపూసి మామిడి రైతును ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఏం చేశారు? ఉమ్మడి జిల్లాలో దాదాపు 56 వేల హెక్టార్లలో మామిడి సాగవుతుంటే.. 39,895 హెక్టార్లలో తోతాపురి చెట్ల నుంచి సుమారుగా 5 లక్షల టన్నుల కాయలు దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత నెల ప్రారంభమైన మామిడి సీజన్.. మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ సారి మామిడి విస్తారంగా కాయడంతో రైతులంతా పొంగిపోయారు. కానీ రైతుల ఆశలు ఎన్నో రోజులు నిలవ లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిలో మామిడికి రూ.12. కానీ జిల్లాలో ఏ ఒక్క ఫ్యాక్టరీ ఈ ధరను చెల్లించ లేదు. చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టు ప్రాంతాల్లో గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్లు రైతులు మామిడి కాయల లోడ్లతో నిరీక్షిస్తున్నారు. తొలుత టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టిన ఫ్యాక్టరీల యాజమాన్యాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాయి. ఆపై ఎవరు ముందు వస్తే, వాళ్ల పంటను లోపలకు అనుమతిస్తామన్నారు. అసలు కాయలు లోపలకు వెళితే చాలని రైతులు తిండీనిద్ర లేకుండా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల గిట్టుబాటు ధర రాకపోవడం, ఫ్యాక్టరీలోలపకు కాయలు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో పంటను రైతులు రోడ్లపై పారబోశారు. లారీల్లో మామిడి తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టారు. ఇన్ని జరుగుతున్నా ఏ ప్రజాప్రతినిధి చేసిందేమీలేదు. అధికారులు సాధించిందీ లేదు. కానీ ఒక్క జగన్ వస్తున్నాడని తెలిసిన వెంటనే ఏకంగా రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కావడం, మామిడికి మద్దతు ధర ఇస్తామని ప్రగల్భాలు పలకడం, ప్రిన్సిపల్ కార్యదర్శి చిత్తూరు జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహించడం, ఫ్యాక్టరీల వద్దకు పరుగులు పెట్టడం చూస్తుంటే జగన్ అంటే ఎంత భయమో అర్థమవుతోంది. ఏడుస్తున్న రైతులపై కేసులు పరిస్థితిని గమనించిన రైతులు మామిడికి భవిష్యత్తు ఉండదనే నిర్ధారణకు వచ్చేశారు. ఉన్న పంటను పారబోసి, వచ్చినకాడికి ఫ్యాక్టరీలకు అప్పగించి.. మామిడి పంటే వద్దనే నిర్ణయానికి వచ్చేశారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలువురు రైతులు మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని, ప్రతిపక్షానికి ఈ అంశం అంకుశంగా మారుతుందని భావించిన కూటమి ప్రభుత్వం కపట ప్రణాళిక రచించింది. చెట్లు కొట్టేస్తున్న రైతులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదుచేయించి, జరిమానాలు విధించేలా అటవీశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో ఆరుగురు రైతులపై కేసులు నమోదుచేయించి, జరిమానాలు విధించింది. తమకు ఆత్మహత్యలే శరణ్యమైన ఇలాంటి సమయంలో గుండె లోతుల్లోంచి వస్తున్న బాధను దిగమింగుకుని.. తమ కష్టాలు విన్నవించడానికి జగన్ రాక కోసం రోజులు లెక్కబెడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
గంగాధర నెల్లూరు: రాష్ట్రంలో మోసం అని పదం వినపడితే చంద్రబాబు గుర్తుకు వస్తారని, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం గంగాధర నెల్లూరు మండలంలోని వింజం పంచాయతీ సిద్ధేశ్వరస్వామి కొండ గ్రామంలో చంద్రబాబు చేసిన మోసాలను గుర్తుచేస్తూ ఇంటింటికీ వంచన అనే కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కృపాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వంలో మోసగాళ్లు ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబ్బు ఎక్కువగా ఉన్నవారిని ఎన్నుకుని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెట్టి ప్రజలందరికీ అలివి గాని హామీలిచ్చి మోసం చేశారన్నారు. అదే కోవలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటింగ్ ముందు రోజు నియోజకవర్గంలోని దళితవాడల్లో ఐదువేల రూపాయల కూపన్లు పంచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిచేన తరువాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయారని దుయ్యబడ్డారు. పాలసముద్రం మండలంలో యథేచ్ఛగా కొండలు తవ్వేసి గ్రావెల్ మాఫియా చేసి చైన్నెకి తరలించేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీలలో సెటిల్మెంట్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంగాధర నెల్లూరులో జరుగుతున్న ప్రకృతి వనరుల ధ్వంసం పై ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించి ప్రజలందరికీ తెలియజేశారు. -
పుత్తూరులో 293 కేసుల పరిష్కారం
పుత్తూరు: స్థానిక సబ్కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో మొత్తం 293 కేసులను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎస్సీ.రాఘవేంద్ర తెలిపారు. కక్షిదారుల మధ్య రూ.2,44,28,593 రాజీ చేసినట్లు పేర్కొన్నారు. 257 క్రిమినల్ కేసులు, 24 సివిల్, 12 ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన పుత్తూరు కళ్యాణపురానికి చెందిన అశోక్, పవిత్ర దంపతులకు న్యాయమూర్తులు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక్కటి చేశారు. లోక్ అదాలత్ ప్రిసీడింగ్ ఆపీసర్లుగా సీనియర్ సివిల్ జడ్జి ఎస్సీ.రాఘవేంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీ.జానకి, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి రమ్యసాయి వ్యవహరించారు. లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లుగా న్యాయవాదులు ఎం.విజయ్కుమార్, ఎస్.లక్ష్మీపతి, ఎడీ.బాలాజీ వ్యవహరించారు. లోక్అదాలత్ను పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం అందజేశారు. పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
మామిడిని కొనుగోలు చేస్తాం
– రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గుడిపాల: రైతుల వద్ద నుంచి మామిడిని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. శనివారం ఫుడ్ అండ్ ఇన్స్ మామిడి గుజ్జు పరిశ్రమని కలెక్టర్ సుమిత్కుమార్తో కలిసి పరిశీలించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా మామిడిని కొనుగోలు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. అన్లోడింగ్కు నాలుగు రోజులు పడుతున్నట్లు రైతులు తెలపగా.. అటువంటి సమస్య రాకుండా చూస్తామని తెలిపారు. అనంతరం ప్రాసెసింగ్ యూనిట్లో మామిడి తయారీ ఎలా జరుగుతుందోనని ఆయన యాజమాన్యంతో కలిసి పరిశీలించారు. తమిళనాడుకు తరలిన ట్రాక్టర్లు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి రాకతో మామిడి కాయల ట్రాక్టర్లు అన్నింటినీ తమిళనాడుకు తరలించారు. ఫుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ తమిళనాడు ప్రాంతానికి ఆనుకుని ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చౌదరి వస్తున్నారన్న నేపథ్యంలో ఫ్యాక్టరీ సమీపంలో చిత్తూరు–వేలూరు రహదారిలో ఉన్న ట్రాక్టర్లు అన్నింటినీ వెంటనే సరిహద్దులోని తమిళనాడు ప్రాంతానికి అధికారులు పంపించేశారు. ఇక్కడ పెద్దగా రద్దీ లేదని ఆయనకు తెలియజేశారు. ఫ్యాక్టరీని పరిశీలించి వెళ్లిన అనంతరం గుడిపాల రెవెన్యూ అధికారులు తమిళనాడు ప్రాంతానికి వెళ్లి ట్రాక్టర్లకు టోకెన్లను అందజేసి ఒక్కో ట్రాక్టర్ను పంపించారు. -
నకిలీ టోకెన్లు విక్రయించిన వ్యక్తి అరెస్ట్
కార్వేటినగరం: ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో కలకలం రేపిన నకిలీ టోకెన్ల విక్రయం ఘటనలో సచివాలయ ఆర్టికల్చర్ని అరెస్టు చేసినట్లు కార్వేటినగరం సీఐ హనుమంతప్ప తెలిపారు. శనివారం తన కార్యాలయ ఆవరణంలో నిందితుడ్ని అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల పరిధిలోని చింతమండి వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ నమోదు కోసం డీఎంపురం సచివాయ హార్టికల్చర్ అధికారి విధులకు కేటాయించిందన్నారు. ఇతను పుత్తూరు మండలం, నందిమంగళం గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు వెంకటేష్(31) అని పేర్కొన్నారు. అతను ఫ్యాక్టరీ వద్ద నకలీ టోకెన్లు సృష్టించి రైతులకు అమ్మి సొమ్ముచేసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో టోకెన్ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విక్రయించినట్టు తెలిపారు. ఇలా సుమారు 31 నకిలీ టోకెన్లు బయటపడ్డాయన్నారు. ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. -
మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం సీజనల్ వ్యాధులపై ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. నష్టాల ఊబిలో రైతన్నలుమామిడిని కొంటాం జిల్లాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మామిడిని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025పలమనేరు: ‘ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దేనికని?. అంత బెదురెందుకని..’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మామిడికి గట్టుబాటు ధర కోసం ఈనెల 9న బంగారుపాళెంకు వస్తున్న సందర్భంగా పలమనేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన శనివారం సన్నాహక సమావేశాన్ని నేర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పొగాకు, మిరప, టమాట రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వాపోయారు. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆ కోవలో చేరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడిని అమ్ముకోలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ఎంపీ కేంద్రానికి లేఖ రాసి వారిని ఆదుకున్న విషయం తెలిసిందేనన్నారు. కానీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు ఇక్కడి మామిడి రైతుల కష్టాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా మామిడి ధరలు బంగారుపాళెం: రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి మరింత ధారుణంగా మారిందన్నారు. తోతాపురి మామిడికి ధర లేక అవస్థలు పడుతున్నట్టు వాపోయారు. కర్ణాటకలో మామిడి రైతుల కోసం జేడీఎస్ పార్టీ నాయకుడు లేక రాస్తే 2.60 లక్షల టన్నుల మామిడి కాలయను కిలో రూ.16తో కొలుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు, గుజ్జుపరిశ్రమ యజమానులు మామిడిని కొనుగోలు చేయడం లేదన్నారు. కిలో రెండు రూపాయలకు ధర పడిపోయిందన్నారు. దీంతో దిక్కుతోచని స్ధితిలో కొట్టు మిట్టాడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మామిడి టన్ను రూ.25 వేలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మామిడి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలికిందని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. రైతు భరోసా కేందాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించి ఆదుకుందని పేర్కొన్నారు. బాబు మోసాలను ఎండగట్టాలి సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అందించలేదని ఆరోపించారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు అల్లాడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ అనే నినాదంతో ప్రతి గ్రామానికి నాయకులు, కార్యకర్తలు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల పార్టీ కన్వీనర్లు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మాజీ కన్వీనర్లు సోమశేఖర్, ప్రతాప్రెడ్డి, జయచంద్రారెడ్డి, రాజారత్నం రెడ్డి, జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి గోహతిసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, వడ్డెర, ఈడిగ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మొగిలీశ్వర్, ఎల్లప్ప, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు దత్తా త్రేయరెడ్డి, జిల్లా పార్టీ నాయకులు ప్రకాష్రెడ్డి, గోవిందరాజులు, శరత్రెడ్డి, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు కిషోర్రెడ్డి, ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ సింహారెడ్డి, పలువురు మండల పార్టీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలమనేరులో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి‘వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. అందుకే ఆయన పర్యటనలకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా మా నాయకుడు జిల్లాకు వచ్చి తీరడం ఖాయం. హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వడం లేదు. అందుకనే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళెం చేరుకుంటారు. మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తారు..’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖలో ఇద్దరికి ఉద్యోగోన్నతులు చిత్తూరు కలెక్టరేట్ : విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు డీఈఓ వరలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు డీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రెడ్డిశేఖర్కు సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఆయనకు అన్నమయ్య జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎంఆర్సీలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న వనజకు ఉద్యోగోన్నతి కల్పించి తిరుపతి పాఠ్యపుస్తకాల గోడౌన్ లో పోస్టింగ్ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంటరి ఏనుగు బీభత్సం గంగవరం: మండలంలోని కీలపట్ల పంచాయతీ, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి పంట పొలాలపై ఒంటరి ఏనుగు దాడికి తెగబడింది. గ్రామానికి చెందిన రైతు అమ్ములు వ్యవసాయ పొలంలో టమాట పంటతో పాటు వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేసింది. ఏనుగుల కట్టడికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాషా తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీ నగర్లో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో సీఎస్ఆర్ నిధులతో పలు ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆక్వా కల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రూ.12.80 లక్షలు సంజయ్ గాంధీ నగర్ బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహంలో ఓవర్ హెడ్ ట్యాంక్లు, ఆర్వో వాటర్ ప్లాంట్లు, ప్లంబింగ్ పనులు, వంటగది ఉపకరణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆక్వా కల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్లాంట్ జనరల్ మేనేజర్ సకరన్ సనజాక్, ఇతర సిబ్బంది గోపీనాథ్, అక్రమ్, మాధవరావు, ఏబీసీడబ్ల్యూవో వాసంతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పర్హానబేగం, కోటేశ్వరరావు, ఉమాదేవి, కరుణ తదితరులు పాల్గొన్నారు. నాకు న్యాయం చెయ్యండి నగరి : సహకార సంఘంలో రుణం తీసుకొని తిరిగి చెల్లించినా తనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఎస్.వేలు శనివారం నగరి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్కు స్పందనలో ఇచ్చిన అర్జీ మేరకు విచారణ అధికారిగా ఉన్న నగరి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కేవీఆర్ కుమార్కు వినతిపత్రం అందించడానికి విచ్చేసిన ఆయన తన ఆవేదనను మీడియాకు వెల్లడించారు. కోసలనగరం సింగిల్ విండో సొసైటీ బ్యాంక్లో రుణం తీసుకుని దానిని పూర్తిగా చెల్లించినా.. బ్యాంకు ఇన్చార్జి సీఈవో తనకు నోడ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. 5,098 కేసుల పరిష్కారంచిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 5,098 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం నిర్వహించిన అదాలత్లో సివిల్ కేసులు 271, క్రిమినల్ 4687, ప్రిలిటిగేషన్ 140 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కోర్టుల వారీగా చూస్తే చిత్తూరులో 1,472, తిరుపతి 2,242, మదనపల్లి 44 , పీలేరు 72, శ్రీకాళహస్తి 268, పుత్తూరు 34, పుంగనూరు 69, పలమనేరు 235, కుప్పం 67, పాకాల 132, నగరి 109, సత్యవేడు 217, వాయల్పాడు 41, తంబళ్లపల్లిలో 96 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. – భగ్గుమంటున్న యూటీఎఫ్ నేతలు చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఈనెల 10వ తేదీన చేపట్టబోయే మెగా పీటీఎం సమావేశాలను పరిశీలించేందుకు విట్నెస్ (పరిశీలన) అధికారులెందుకని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్నాయుడు, మణిగండన్ ప్రశ్నించారు. ఈ మేరకు పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆ సంఘ నాయకులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో విట్నెస్ అధికారిని నియమించడం అవమానకరంగా ఉందన్నారు. ఆ అధికారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని వారిచేత వీడియోలు తీయించి అప్లోడ్ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని వింత నిర్ణయాలు ఇప్పుడెందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. టీచర్లను అవమానించేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదన్నారు. ఇది పీటీఎం కాదు డాక్యుమెంట్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం పీటీఎం కార్యక్రమాన్ని డాక్యుమెంట్ కార్యక్రమంగా మార్చడం సరికాదని ఆ సంఘ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల విద్యాభివృద్ధి అంశం పై చర్చించే కార్యక్రమంగా మార్చాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోపే యోగా పేరుతో వారం రోజులు, పీటీఎం పేరుతో మరో వారం రోజులు బోధన సమయాన్ని హరిస్తున్నారని విమర్శించారు. టీచర్లను బోధనకు పరిమితం చేయకుండా, బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడికి గురి చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్ బంగారుపాళెం రావడం ఖాయం మామిడి రైతులకు అండగా నిలవడం తప్పా? హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వకుండా ఆంక్షలా? మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఇలా.. ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా ఎంపీపీల సంఘ అధ్యక్షుడు మొగసాల రెడ్డెప్ప, వైఎఎస్సార్సీపీ పలమనేరు పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్డీ మురళీకృష్ణ, చెంగారెడ్డి, దయానంద్గౌడ, నియోజకవర్గ కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ అనుభంద విభాగాల నాయకులు పాల్గొన్నారు. నేడు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, టమాట వంటి పంటలు పండించిన రైతులు ధరలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని వాపోయారు. సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాక అవస్థలు పడుతున్నట్టు వెల్లడించారు. మామిడికి వెన్నుదన్ను మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది వైఎస్సార్సీపీనేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్రాజా స్వగృహంలో నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఆయన సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డుకు విచ్చేయనున్నట్టు తెలిపారు. తర్వాత మామిడి రైతుల కష్ట సుఖాలను తెలుసుకుని వారికి మద్దతుగా నిలిచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. హెలీప్యాడ్కు అనుమతులివ్వడం లేదు ప్రతిపక్ష నేతగా మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటకు హెలీప్యాడ్కు సైతం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఏపీలో భారత రాజ్యాంగంకాకుండా రెడ్బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికై నా వస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అంతలా వణికిపోతోందే అర్థం కావడం లేదన్నారు. మొన్నటి దాకా తోతాపురి మామిడికి ధరలేక రైతులు కాయలు అమ్ముకోలేక తోపుల్లో వదిలేస్తున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్రెడ్డి వస్తున్నాడని తెలిసి మామిడిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే జగన్మోహన్రెడ్డి వస్తేగానీ రైతుల కష్టం ఈ ప్రభూత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో ప్రకటించిన పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన పుష్పావతి, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా తిరుపతికి చెందిన కేతంరెడ్డి మురళీరెడ్డి, రాష్ట్ర సెక్రటరీలుగా గంగాధర్ నెల్లూరుకు చెందిన వి.సుందర్ రాజు, సత్యవేడుకు చెందిన జేబీ.మునిరత్నం (జేబీఆర్), తిరుపతికి చెందిన తిరుమల రెడ్డి, భరత్ రెడ్డిను నియమించారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన నలుగురిని ప్రకటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరుకు చెందిన జి.ప్రహ్లాద, ఆర్.చెంగారెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తికి చెందిన షేక్ సిరాజ్బాషా ఉన్నారు. కూసాలు ధ్వంసం పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె సమీపంలో శనివారం తెల్లవారు జామున ఏనుగుల గుంపు డా.చంద్రబాబు మామిడి తోపులో, తోపు చుట్టూ ఉన్న 48 ముళ్ల కూసాలను ధ్వంసం చేశాయి. అలాగే చుట్టు పక్కల ఉన్న వరి పంటను తొక్కి నాశనం చేశాయి. సాహిత్య పురస్కారాలకు ఎంపిక చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరానికి చెందిన సంధ్యా శర్మ రాసిన సంధ్యా సమీరాలు(కవిత్వం) కవితా సంపుటి విశాలాక్షి సాహిత్య పురస్కారాలకు ఎంపికై ంది. పలు కవితా సంపుటి ఆమె పలు పురస్కారాలకు పంపారు. ఈ క్రమంలో సంధ్యా సమీరాలు అనే సంపుటి విశాలాక్షిని మెప్పించింది. నెల్లూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన జరిగే కార్యక్రమంలో పురస్కారం అందుకోనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య పుత్తూరు: పట్టణ పరిధిలోని మరాఠి రైల్వే గేట్ సమీపంలో శనివారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట రైల్వే ఎస్ఐ రవి కథనం మేరకు.. నాగలాపురం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన కె.దేశయ్య కుమారుడు డి.శరత్(30) డిప్లోమా చేసి చైన్నెలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. పుత్తూరులోని సమీప బంధువుల ఇంటికి 15 రోజుల క్రితం వచ్చిన శరత్ మానసిక వేదనతో బాధపడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. -
పకడ్బందీగా మెగా పీటీఎం 2.0
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన నిర్వహించే మెగా పీటీఎం 2.0 (పేరెంట్స్ టీచర్స్ మీటింగ్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. మెగా పీటీఎం అంశంపై శనివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మెగా పీటీఎం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,492 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ సమావేశం నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశాల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న 2,54,310 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన మెగా పీటీఎం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థిమిత్ర కిట్లు, విద్యార్థుల సామర్థ్యాల పురోగతి, విద్యార్థుల నమోదు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. గుర్తింపు లేని పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు అమలు చేయని పాఠశాలల పై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల కచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల లిఖిత పూర్వక సమ్మతితోనే విలీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 492 పాఠశాలలను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాలో కొత్తగా టీచర్లు నియమితులవుతారని చెప్పారు. తల్లికి వందనం పథకంలో నమోదైన అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇటీవల ఆయా యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలిచ్చామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు. -
హామీలకు లేదు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
● హామీలు అమలు చేయని మొనగాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం ● రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ కార్వేటినగరం: అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన మాట మర్చిపోయిన మొనగాళ్లు చంద్రబాబు, పవన్కళ్యాణ్ఽ అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం కొల్లాగుంట చెక్పోస్టు సమీపంలోని వెట్రివేల్ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, ఎంపీపీ లతాబాలాజీ, మండల కన్వీనర్ శేఖర్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో క్యూర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లనిచ్చిన సొంత మామ ఎస్టీఆర్ను వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడం లెక్కలేదన్నారు. అబద్ధాలు, మోశాలు, వెన్నుపోటు వంటివి బాబుకు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. కూటమి ఎమ్మెల్యేలు అడవులు, గుట్టలను తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదేనా బాబు దృష్టిలో సంపద సృష్టించడం అని చురకలు అంటించారు. నెల రోజులకు పైగా మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక, పండించిన పంటను తరలించ లేక తల్లడిల్లి పోతుంటే ఏమీ ఎరుగనట్లు బాబు మొహం చాటేయడం దారుణమన్నారు. పేదల ఓట్ల కోసం పంపిణీ చేసిన కూపన్లకు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ రూ.5 వేలు చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. దండుకున్నది చాలక ఎమ్మెల్యేలు మామిడి గుజ్జు పరిశ్రమలనే కాకుండా రైతులు తరలించే మామిడిలోనూ కమీషన్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు సీఎం కుర్చీ కోసం కూటమిగా ఏర్పడి సూపర్సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను వెన్ను పోటు పొడిచాడని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. అధికార దాహంతో 143 హామీలు గుప్పించి ఏడాది పాలనలో కేవలం రెండు పథకాలను అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. నూతన కార్యవర్గానికి ఘన సన్మానం ఈ క్రమంలో భాగంగా నూతనంగా నియామకాలు చేపట్టిన వెంకటేష్, మోహనకుమారి, ఆకులగోపి, గాంధీ, మురళీకృష్ణారెడ్డి, మురగయ్య, శ్రీనివాసులురెడ్డి, అన్నివర్గాల అధ్యక్షులను రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, ఎంపీపీ లతాబాలాజీ, మండల పార్టీ కన్వీనర్ శేఖర్రాజు చేతుల మీదుగా శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడి గురవారెడ్డి, నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధికారెడ్డి, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు ప్రకాష్, రాధిక, సుగుణమ్మ, నియోజకవర్గ యువజ విభాగం అధ్యక్షుడు కిషోర్రెడ్డి, వైస్ ఎంపీపీ కార్తిక్రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్రెడ్డి, మురగయ్య, లోకనాథరెడ్డి, ధనంజయవర్మ, మునికృష్ణ, నందగోపాల్, లడ్డు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ‘ఓఆర్ఎం’ ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులోని ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్)ను ఎట్టకేలకు శుక్రవారం ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ప్రారంభించారు. పాత మిషన్ రోజూ 200 లీటర్ల నూనెను శుద్ధి చేస్తుంది. కొత్త మిషన్ 2వేల లీటర్లను సిద్ధం చేస్తుంది. రాయలసీమలోనే మొదటి ఓఆర్ఎంను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ మిషన్ ఏర్పాటుకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. నెలల తరబడి మిషన్ను అమర్చకుండా తాత్సారం చేశారు. అయితే సాక్షి పత్రికలో పలుమార్లు దీనిపై కథనాలు రావడంతో అధికారులు స్పందించి మిషన్ను ఇన్స్టాల్ చేశారు. అయితే ఈ మిషన్ను ప్రారంభించినప్పటికీ నిర్వహణ, పర్యవేక్షణకు టెక్నీషియన్ను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
మన్యం వీరుడు అల్లూరి
చిత్తూరు కలెక్టరేట్ : బ్రిటీష్ పాలకులపై సాయుధ పోరాటం చేసిన అసమాన పరాక్రమశాలి అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ కొనియాడారు. ఈ మేరకు కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జన్మించిన జిల్లాలో తాను జన్మించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. డీఆర్వో మోహన్కుమార్, ఏవో వాసుదేవన్, సీపీవో శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాషా పాల్గొన్నారు. అల్లూరికి ఘన నివాళి చిత్తూరు అర్బన్: మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడడం, న్యాయాన్ని నిలబెట్టడం, నిబంధనలు అమలు చేయడంలో పోలీసుశాఖకు అల్లూరు ఆదర్శమన్నారు. ఏఎస్పీలు రాజశేఖరరాజు, శివానంద కిషోర్, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్బాషా పాల్గొన్నారు. -
నకిలీ లాటరీ టికెట్లు
పుంగనూరులో నకిలీ లాటరీ టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. కొందరు ధనార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు. జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం తిరుపతి మంగళం : మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ మర్యాదపూర్వకంగా భూమనను కలిశారు. అనంతరం మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి కార్యక్రమంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూమన సూచించారు. పోస్టర్ల ఆవిష్కరణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంట దెబ్బతింటే ఈ పథకం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారన్నారు. నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. చిత్తూరు జిల్లాలో వరికి రూ.42 వేలు, రాగికి రూ.17 వేలు, కందులకు రూ.20 వేలు ఒక ఎకరానికి బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు క్లస్టర్ మేనేజర్ సాగర్ 9059634144 నంబర్లో సంప్రదించాలన్నారు. డివిజనల్ కో ఆర్డినేటర్ పెద్దన్న పాల్గొన్నారు. – 8లో -
మానవత్వం పరిమళించి..స్థానికంగా విస్మరించి!
పలమనేరు: చావు బతుకుల్లో ఉన్న పసిప్రాణాలను కాపాడుకోవాలని ఏ తల్లిదండ్రులకై నా ఉంటుంది. దీనికోసం వారు పడని కష్టాలుండవు. ఇందుకోసం మానవత్వమున్న వారెవరైనా సాయం చేస్తుంటారు. కానీ ఓ ప్రజాప్రతినిధి ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడగా మరో ప్రజాప్రతినిధి ఓ పాప ప్రాణం పోయేందుకు కారణమైన వేర్వేరు ఘటనలు ఇటీవల పలమనేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనలపై బాధితుల ఆవేదన సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.పసివాడి ప్రాణం ఇలా నిలబెట్టారుపలమనేరు పట్టణానికి చెందిన గజ్జల దీపునాయుడు, జగదీష్ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే కాలేయ సమస్య ఉంది. బాబుకు ఆపరేషన్కు రూ.20లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. బిడ్డకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత వారికి లేదు. పలు స్వచ్ఛంద సంస్థలు, వారికి తెలిసిన వారి ద్వారా పసివాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరుకే చెందిన ఓ టీడీపీ కార్యకర్త వీరి గోడు విని సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందుంతుందని ధైర్యం చెప్పారు. వెంటనే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసేందుకు వారి కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. అక్కడున్న పీఏతో వారు గోడు వెల్లబోసుకున్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆ కార్యకర్త మదనపల్లిలోని తన సోదరి ద్వారా ఇంతియాజ్ అనే వ్యక్తి సాయంతో అక్కడి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిశారు. పిల్లాడి పరిస్థితి విన్న ఆయన వెంటనే స్పందించి లెటర్ ఇచ్చి మంత్రి లోకేష్ ద్వారా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.15 లక్షలను మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ పసివాడు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆ ఆస్పత్రి నుంచి పసివాడి కోసం పోరాడిన టీడీపీ మహిళా కార్యకర్త సోషల్మీడియా ద్వారా విడుడల చేసిన వీడియో వైరల్గా మారింది. మన ఎమ్మెల్యే చేయలేని పని పక్క జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే చేశారే అని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు.మరో పాప విషయంలో ఏమి జరిగిందంటే...బైరెడ్డిపల్లి మండలం, తీర్థం పంచాయతీ, కై గల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు జనసేన కార్యకర్త. ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి లివర్ దెబ్బతింది. బాలికను పరిశీలించిన డాక్టర్లు లివర్ మార్పిడి చేయాలని ఇందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పారు. నియోజకవర్గ జనసేన నాయకుని ద్వారా స్థానిక ఎమ్మెల్యే లెటర్ కోసం పలుద ఫాలు ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కుప్పానికి చెందిన వారి బంధువైన మండల స్థాయి నేత ద్వారా ఇక్కడి ఎమ్మెల్యే సిఫారస్తు లెటర్ కోసం ప్రయత్నించారు. ఓ రోజు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారని తెలిసి శ్రీనివాసులే స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడి లెటర్పై సంతకం చేస్తుండగానే లోకల్ లీడర్లు ఏమి చెప్పారోగానీ సంతకం పెట్టలేదు. ఇదేంటంటే మీ మండలంలోని నాయకులు కాకుండా కుప్పం వాళ్లు రెకమెండేషన్ ఏంటని అభ్యతరం చెప్పినట్టు తెలిసింది. ఏమీ చేయలేక ఆ జనసేన కార్యకర్త వచ్చేశాడు. గతనెల 24న ఆ పాప మృతి చెందింది. దీనిపై కడుపు మండి ఆ తండ్రి తనకు జరిగిన అన్యాయాన్ని తన బిడ్డను కాపాడుకోలేకపోయాననే బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. ఇలా ఈ రెండు ఘటనల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
20 ఏళ్ల జైలు
చిత్తూరు లీగల్ : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో రామకృష్ణ (65) అనే నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. 2020 జూలై 21న తొమ్మిదేళ్ల వయస్సున్న బాలికపై లైంగికదాడి జరిగిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమల మండలం, చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తికి పెళ్లయ్యి పిల్లలున్నారు. ఇతను మద్యానికి బానిసయ్యి.. గ్రామంలో జులాయిగా తిరుగుతుండడంతో భార్య, పిల్లలు ఇతడిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఓ మైనర్ బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి, ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడని అభియోగాలు మోపిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పునిచ్చారు. లీగల్ సెల్ సూపరింటెండెంట్పై క్రమశిక్షణా చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని లీగల్ సెల్ సూపరింటెండెంట్ షబ్బీర్బాషాపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై ఉన్న అభియోగాలకు సంబంధించి శుక్రవారం జీవో 688,689,690 లను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టరేట్లో లీగల్ సెల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న షబ్బీర్బాషా అలియాస్ షబ్బాబాషా 2023లో జిల్లాలోని శ్రీరంగరాజపురం తహసీల్దార్గా పనిచేసేవారు. ఆయన 2023 మార్చి 21న ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించి ప్రెజెంటింగ్ ఆఫీసర్గా ఎల్.వెంకటనాయుడు (ఏసీబీ ఇన్స్పెక్టర్)ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ కేసులో పట్టుబడ్డ షబ్బీర్ బాషాపై చార్జెస్ నమోదు చేయడంతో 10 రోజుల్లోపు లిఖిత పూర్వకంగా వివరణ సమర్పించాలని సూచించారు. నకిలీ టోకెన్ల కలకలం కార్వేటినగరం: ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో నకిలీ టోకెన్లు కలకలం రేపిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఓ హార్టికల్చర్ అధికారి ఏకంగా నకిలీ టోకెన్ల బుక్, ఫ్యాక్టరీ అధికారి సీలు తయారు చేశాడు. పోర్జరీ సంతకాలతో రైతులకు టోకెన్లు ఇచ్చి అటు రైతులను, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మోసగించాడు. వివరాలు.. మండల పరిధిలోని డీఎం పురం సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంటు వెంకటేష్ను ప్రభుత్వం మామిడి రైతులకు అందించే ప్రోత్సాహ సొమ్ము రూ.4ను నమోదు చేయడానికి ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద విధులు కేటాయించింది. దురాశతో పుత్తూరులో ఓ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ టోకెన్లు, ఫ్యాక్టరీ అధికారి సీలు తయారీ చేయించాడు. ఆపై ఒక్కో టోకెన్ను రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు రైతులకు విక్రయించాడు. ఇలా మొత్తం 34 నకిలీ టోకెన్లను పోలీసులు గుర్తిం సీజ్ చేశారు. ఇంతకీ ఎమిజరిగిందంటే నకిలీ టోకెన్ల వల్ల యాజమాన్యం ఇచ్చిన టోకెన్ల కన్నా అధికంగా వాహనాలు రావడంతో పాటు, టోకెన్ల వరుస నంబర్లలో తేడా రావడంతో యాజమాన్యం నిఘా ఉంచింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ హనుమంతప్ప రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హార్టికల్చర్ అధికారి వెంకటేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకాలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢమాసపు తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలతో విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
● ఛిన్నాభిన్నమవుతున్న మధ్యతరగతి కుటుంబాలు ● అమాయకులు, కూలీలకు ఎరవేస్తున్న దళారీలు ● రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం ● చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
పుంగనూరు(చౌడేపల్లె): పుంగనూరు పట్టణానికి చెందిన కొందరు సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా నకిలీ లాటరీ టికెట్ల విక్రయాలను ఎంచుకున్నారు. ఏజెంట్లను నియమించుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తూ రోజూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రధానంగా లాటరీ విక్రయాలు ప్రజలు గుమికూడే టీ దుకాణాలు, పూల అంగళ్లు, ఆటోస్టాండ్, కారు పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేటు బస్టాండ్, నానాసాబ్పేట, మార్కెట్ యార్డు, తూర్పుమొగసాల, నగిరిప్యాలెస్ తదితర ప్రదేశాలను చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. పుంగనూరు పట్టణంలోకి కూలి పనులకు వచ్చే వారు, సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు. వారికి ఆశలు కల్పించి టికెట్లను అంటగడుతున్నారు. అసలు లాటరీ టికెట్లతో పోలిన డూప్లికేట్ టికెట్లు తయారు చేసుకుని అమాయకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. తెల్లారి నుంచి సాయంత్రం 6 వరకు కష్టపడి సంపాదించిన కూలీ సొమ్ము ఖర్చయిపోతోంది తప్ప లాటరీ తగిలింది లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. లాటరీ టికెట్ల విక్రయాలను నిరోధించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయదారుల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుని ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం పుంగనూరు పట్టణంలో నకిలీ లాటరీ టికెట్ల విక్రయాల విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా లాటరీలను నమ్ముకుని డబ్బును పోగొట్టుకోవద్దని సూచించారు. టికెట్ల విక్రేతల నుంచి మామూళ్లు తీసుకనే విషయం తనకు తెలియదని, ఇంతకు మునుపు ఏదైనా జరిగివుంటే తనకు సంబంధంలేదు. –సీఐ సుబ్బరాయుడు, పుంగనూరు -
డ్రైవర్ ఆత్మహత్య
బంగారుపాళెం: కుటుంబ కలహా ల కారణంగా డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం బంగారుపాళెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ కథనం.. యాదమరి మండలం, సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన చాకల మునిరత్నం కుమారుడు చాకల దామోదరం(49) కోళ్ల వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నడు. మద్యానికి బానిస కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించా రు. మనస్తాపానికి గురైన దామోదరం బంగారుపాళెం సమీపంలోని కొత్తపల్లె రోడ్డు వద్ద కోళ్ల వాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మూడు నెలల్లో రూ.38.15 కోట్ల ఆదాయం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ పరంగా ఆదాయం మూడు నెలల్లో రూ.38.15 కోట్లు వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా ఆదాయ లక్ష్యం రూ.218 కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇప్పటి వరకు రూ.38.15 కోట్లు వచ్చిందన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం రూ.50.17 కోట్లు లక్ష్యంగా కాగా అందులో రూ.38.15 కోట్లు ఆర్జించినట్టు వెల్లడించారు. ఇందులో బంగారుపాళ్యం రూ.2.05 కోట్లు, కుప్పం రూ.5.55 కోట్లు, పలమనేరు రూ.8.12 కోట్లు, పుంగనూరు రూ.4.40 కోట్లు, కార్వేటినగరం రూ.1.34 కోట్లు, నగరి రూ.3.24 కోట్లు, చిత్తూరు ఆర్వో రూ.9.67 కోట్లు, చిత్తూరు రూరల్ రూ.3.74 కోట్లు వచ్చిందన్నారు. గతంలో నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్ వివరాలు ఆన్లైన్లో నమోదయ్యేవి కావని, ప్రస్తుతం ఈ సమస్యను ఐజీ కార్యాలయం పరిష్కరించిందని చెప్పారు. -
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువా రం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికుల కు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు. అదే విధంగా ప్రతి ఇంటి వద్ద యాంటి లార్వా కార్యక్రమాన్ని చే పట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇందిరమ్మ కాలనీలో ఎవరికి ఎలాంటి జ్వరాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాచి, చలార్చి తాగాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమ తెరలను వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ల భిస్తుందని, వేడి ఆహారం, మంచి పోషక వి లువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సెల్వియా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప కుమార్, పీహెచ్సీ వైద్యాధికారి ణి ప్రియాంక, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
– తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన 3వ అంతర్జాతీయ సమావేశం ఏర్పేడు : మెటీరియల్ సైన్స్ అను సంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చరర్ హాల్లో గురువారం ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామగ్రి– నిర్మాణ రంగం–2025పై 3వ అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని నిర్మాణ రంగంలో సాంకేతిక మేళ వింపుపై ప్రసంగించారు. వర్జీనియా టెక్ (యుఎస్ఎ), క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ (యుకె), మోనాష్ యూనివర్సిటీ మలేషియా, ఐఐటీ బాంబే, ఎన్ఐటీ కాలికట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, డాక్టర్ అలెగ్జాండర్ బ్రాండ్, డాక్టర్ నారాయణన్ నీతలత్, డాక్టర్ వెంకటేష్ కోడూర్, డాక్టర్ మైక్ ష్లైచ్, డాక్టర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణుల ప్రసంగిస్తూ నిర్మాణ శాస్త్రం పురోగతిని గురించి వివరించారు. సమావేశంలో ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సురేష్జైన్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యాబోధన తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని టీటీడీ పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమయ్యాయి. అయితే ఎయిడెడ్ మినహాయించి అన్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి వరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. దీంతో విద్యార్థులకు నామమాత్రంగా విద్యాబోధన అందుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ టీటీడీ విద్యాశాఖ స్పందించకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తుంటారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకోవడం పూర్వజన్మ సుకృతమని సంతోష పడుతుంటారు. ఈ భావనతోనే తమ పిల్లలను టీటీడీ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతుంటారు. దీంతో టీటీడీ పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ నెలకొంది. తిరుపతిలో టీటీడీకి సంబంధించి 7 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మూడు పాఠశాలలు (హైస్కూల్) మాత్రమే ప్రభుత్వ గుర్తింపు (ఎయిడెడ్) కలిగి ఉన్నాయి. ఈ హైస్కూళ్లకు ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్లు అందాయి. మిగిలిన నాలుగు ఉన్నత పాఠశాలలు, వాటిలోనే ఉన్న 7ప్రాథమిక పాఠశాలలకు పుస్తకాలు నేటికీ అందలేదు. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం టీటీడీ పాఠశాలలన్నింటికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా సరఫరా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎయిడెడ్కు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించి చేతులు దులుపుకుంది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు టీటీడీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ఏమిటో అర్థం కాలేదని తల్లిదండ్రులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నారు. ఎయిడెడ్కు అందించాం నిబంధనల మేరకు ప్రభుత్వ గుర్తింపు కలిగి న టీటీడీ ఉన్నత పాఠశాలలకు పాఠశాల తె రిచే నాటికే పాఠ్యపుస్తకాలను అందించాం. అన్ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ యాజమాన్యమే పాఠ్యపుస్తకాలను అందించాల్సి ఉంది. –కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), తిరుపతి త్వరలోనే అందిస్తాం టీటీడీ పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని అనుకున్నాం. అయి తే పాఠ్యపుస్తకాలను టీటీడీ కొనుగోలు చేసి పిల్లలకు అందించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే అందిస్తాం. – వెంకట సునీల్, టీటీడీ విద్యాశాఖాధికారి, తిరుపతి -
సిద్ధమవుతున్న ఓఆర్ఎం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్ఎం(ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఇన్స్టాలేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ప్రభుత్వంలో రూ.50 లక్షల వ్యయంతో 2వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ల ఆయిల్ను శుద్ధి చేసే మిషన్ను రేణిగుంటకు కేటాయించారు. అక్కడ ఎస్పీఎం మరమ్మతు పనులు జరుగుతుండడంతో వాటిని జిల్లాకు కేటాయించారు. రాయలసీమలోనే చిత్తూరులో మొదటి మిషన్ను పెట్టారు. కానీ దాదాపు 8 నెలలుగా ఇన్స్టాల్ చేయకుండా కాలయాపన చేశారు. వీటిని ఇన్స్టాల్ చేస్తే రైతుల ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో బాగుచేసి పంపవచ్చు. కానీ ఎస్పీఎంలో నిరుయోగంగా వదిలివేయడంతో గతంలో ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎట్టకేలకు స్పందించిన అధికారులు టెక్నీషియన్లను పిలిపించి ఇన్స్టాలేషన్ పనులు చేపట్టారు. పనులను టెక్నికల్ ఈఈ జగదీష్, ఎస్పీఎం డీఈ రవి, ఏఈ మోహన్శెట్టి పర్యవేక్షించారు. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఉరి వేసుకుని మహిళ మృతి పుంగనూరు(చౌడేపల్లె): మనస్తాపంతో ఓ మహిళ ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. సీఐ కథనం.. మండలంలోని పట్రపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు భార్య సరస్వతి(35) కుమార్తె ప్రేమలో పడి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైంది. సరస్వతి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సమ్మెకు తాత్కాలిక బ్రేక్ రిలే దీక్షలు కొనసాగించనున్న స్విమ్స్ కార్మికులు తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అత్తపై అల్లుడి దాడి – అత్తకు తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు. -
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ●రేణిగుంట బీసీ హాస్టల్లో శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు ప్రభుత్వ వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైన వంటలు, అపరిశుభ్రమైన పరిసరాలు, పర్యవేక్షణ లేని అధికారుల తీరుతో వసతి గృహాల నిర్వహణ గాడితప్పింది. ప్రశ్నించే వారు లేరనే నిర్లక్ష్యంతో కొంత మంది నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులను అర్ధాకలికి గురిచేస్తూ క్షోభ పెడుతున్నారు. వండిపెట్టే ఆహారం కూడా తరచూ కలుషితం కావడంతో విద్యార్థులు ఆస్పతుల పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. వసతిగృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జగనన్న పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కరికులం అందించి వారి ఉన్నతికి బాటలు వేసేలా విప్లవాత్మకమైన పథకాలను విద్యారంగంలో అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. హాస్టళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. దీంతోనే మొన్న సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత బీసీ హాస్టల్లో విద్యార్థులతోపాటు తినేందుకు కూర్చుంటే ఆమెకు పెట్టిన ఆహారంలోనే బొద్దింక కనిపించడం రాష్ట్రమంతా చూశారు. ఇక్కడ వరుసగా హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రులపాలవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా పరిస్థితిని చక్కదిద్దాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యమే హాస్టళ్లలో తరచూ విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుండడం దురదృష్టకరం. చాలా హాస్టళ్లలో వంట సిబ్బంది కొరత ఉంది. ఉన్నచోట వారు రాకుండా సహాయకులను పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. దీంతోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. శ్రీకాళహస్తిలో హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు సరైన మౌలిక వసతులను కల్పించాలి. – చంద్రశేఖర్, ప్రగతి సంస్థ మండల కోఆర్డినేటర్, శ్రీకాళహస్తి ఏర్పేడు :‘‘ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో నాసిరకమైన వంట సరుకులు వాడుతుండ టంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాలతో తరచూ విద్యార్థు లు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సంక్షేమ వసతి గృహాధికారులు పేద పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపు తూ వారికి ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.’’ శ్రీకాళహస్తి పట్టణంలో గతనెల 24వ తేదీన బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పులిసిన ఇడ్లీ పెట్టడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా గురువారం శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఉదయం పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షం కావడంతో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో 8 హాస్టళ్లు ఉన్నాయి. రెండు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పలు హాస్టళ్లకు వెళ్లి దత్తత తీసుకుని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తామని, హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు అధునాతన హంగులతో కూడిన వసతులను అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే ఒకటి, రెండు హాస్టళ్ల గోడలకు సున్నం కొట్టించి అభివృద్ధి ప్రారంభమైందని సోషల్ మీడియాలో ఆర్బాటంగా ప్రచారం చేశారు. పర్యవేక్షణ లోపించి.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసుకునే వార్డెన్ల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. హాస్టల్ , వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి తోడు మెనూ ప్రకారం సక్రమంగా అమలు చేయకుండా కొందరు వార్డెన్లు విద్యార్థుల మెతుకుల్లో కక్కుర్తి చూపుతూ విద్యార్థులను తరచూ అర్దాకలికి గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కిందట రేణిగుంట బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రైవేటు ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెట్టడంతో వాంతులు, విరేచనాలతో ఆప్పట్లో 20 మంది విద్యార్థులు ఆస్పత్రికి చేరారు. విద్యార్థులు తాగే నీటి తొట్లు పాచిపట్టి ఉన్నట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారులు వార్డెన్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మందలించారు. ఎప్పుడైన ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఉన్నతాధికారులు హాస్టళ్ల పనితీరుపై తనిఖీలు చేయకపోవడంతో విద్యార్థులు సమస్యల లోగిళ్లలో చదువు బండి లాగుతున్నారు.వార్డెన్ సస్పెన్షన్ – ఇన్ఛార్జిగా విజయ శ్రీకాళహస్తి : బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో ఇన్ఛార్జిగా విజయను నియమించారు. వంటమనిషి అంకమ్మను విధులు నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. -
ఘనంగా ఐసీఎస్ఐ స్నాతకోత్సవం
తిరుపతి సిటీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ఉపాధ్యక్షులు పవన్ జి చందక్, కౌన్సిల్ సభ్యుడు సీఎస్ మోహన్ కుమార్, సీఎస్ వెంకటరమణ, ఐసీఎస్ఐ ఎస్ఐఆర్సి చైర్మన్ సీఎస్ మధుసూధనన్, ప్రీతి కౌశిక్ బెనర్జీ పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు భద్రతా చర్యలు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ లేపాక్షి ఏరియా బాలాజీనగర్, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్ శేఖర్, సీఐలు విజయ్ కుమార్, శ్రీరాముడు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి గూడూరు రూరల్ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డె వలప్మెంట్ ఆఫీసర్ రంజిత్ కుమార్ను 93907 36277 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు తిరుపతి ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ కోరారు. ఐఐహెచ్టీ స్పాట్ అడ్మిషన్లు వెంకటగిరి రూరల్:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్డీ గిరిధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
రేషన్ బియ్యం పట్టివేత
– 20 టన్నుల బియ్యం స్వాధీనం నాయుడుపేటటౌన్ : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గురువారం నాయుడుపేట అర్బన్ సీఐ బాబి సిబ్బందితో తనిఖీ చేపట్టి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. శ్రీకాళహస్తి నుంచి లారీలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ బాబి , సిబ్బందితో పట్టణ పరిధిలోిని జాతీయ రహదారి కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బియ్యం బస్తాల లోడుతో వస్తున్న లారీని నిలిపి పరిశీలన చేశారు. లారీలో రేషన్ బియ్యం బస్తాలు ఉండడాన్ని సీఐ గుర్తించి బియ్యంతో పాటు లారీను స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ వేనాటి గజేంద్రను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అలాగే దిలీప్రెడ్డి అనే వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో ప్రధాన సూత్రదారిగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. పోలీసులు పట్టుకున్న బియ్యం లారీలో రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేసే బస్తాలలోనే ఉండడంతో వాటిని రేషన్ షాపులు, లేదా నేరుగా గోదాముల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్తో పాటు దిలీప్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పట్టుకున్న 400 బస్తాల (20 టన్నులు) రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులకు అప్పగించడంతో వాటిని స్థానిక సివిల్ సప్లయి గోదాములో భద్రపరిచారు. -
విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్నప్రతిభావంతుల శ్రేయస్సు, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అతవాలే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టాన్ని 27 డిసెంబర్ 2016లో అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ చట్టంలో వైకల్య వర్గాలను 7 నుంచి 12కి పెంచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 3 నుంచి 4 శాతానికి పెంచినట్టు పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,314 ప్రభుత్వ భవనాలను దివ్యాంగుల కోసం సుగమ్య అభియాన్ పథకంలో నిర్మించినట్టు వెల్లడించారు. ఈ భవనాలకు రూ.563.85 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మొత్తం 35 అంతర్జాతీయ, 55 దేశీయ విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకొచిన్నట్లు వివరించారు. 709 రైల్వే స్టేషన్లు, 8,695 బస్సులు, 637 వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 8.34 లక్షల పాఠశాలల్లో ర్యాంప్లు, హ్యాండ్రైల్లు అందుబాటులో ఉండే మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో యాక్సెసిబుల్ ఇండియా ప్రచారం ఆంధ్రప్రదేశ్లో యాక్సెసిబుల్ ఇండియా ప్రచారంలో 38 భవనాలకు రూ.29.60 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విద్యా సాధికారత దిశగా స్కాలర్ షిప్ పథకంలో 2.81 లక్షల మంది దివ్యాంగ విద్యార్థులకు రూ.921.50 కోట్లను మంజూరు చేశామన్నారు. స్కాలర్షిప్ నగదును నేరుగా అర్హులైన విద్యార్థుల ఖాతాలకు జమచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని 7093 మంది దివ్యాంగులకు రూ.45.25 కోట్ల స్కాలర్షిప్లు అందజేశామన్నారు. డీడీఎస్ పథకంలో 3.84 లక్షల మంది లబ్ధిదారులకు రూ.951.77 కోట్లకు పైగా ప్రయోజనం పొందారన్నారు. ఏపీలో రూ.193.92 కోట్లతో 60,488 మంది దివ్యాంగులకు ప్రయోజనం కలిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడీపీ, ఆర్వీవై పథకాల్లో నిర్వహించిన పరీక్ష శిబిరాల నుంచి మొత్తం 3,505 మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. వారందరికీ రూ.4.69 కోట్ల విలువైన 8,916 ఉపకరణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్కుమార్, ఏఎస్పీ రాజశేఖర్రాజు, డీఎస్పీ సాయినాథ్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్, బీజేపీ నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం నాయకులు మురళి పాల్గొన్నారు. ఉపకరణాల పంపిణీలో కేంద్ర మంత్రి రాందాస్ అతవాలే -
నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి
● బోన్ క్యాన్సర్తో పోరాడుతున్న షాహిద్ ● చిన్న వయసులోనే పెను విపత్తు ● దాతల చేయూత కోసం తల్లిదండ్రుల వేడుకోలు చౌడేపల్లె: ‘నాకు ఇద్దరు పిల్లలు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కార్పెంటర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇటీవల వెలువడిన పదోతరగతి ఫలితాల్లో నా కుమారుడు షాహిద్(16) 472 మార్కులు సాధించాడు. గత ఏడాది డిసెంబర్లో ఇంటి వద్ద పిల్లలతో కలిసి కబడ్డీ ఆడుతూ జారిపడ్డాడు. కుడి చెయ్యికి గాయమైంది. నొప్పి అధికం కావడంతో పుంగనూరు, మదనపల్లె, తిరుపతిలో చూపించాను. అయినా తగ్గలేదు. నొప్పి ఎక్కువ కావడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. బోన్ క్యాన్సర్ ఉందని తేల్చారు. ఇప్పటికే అప్పూసప్పు చేసి రూ.3 లక్షలకు పైగా ఖర్చుచేశాను. ఇంకా రూ.5 లక్షలకు పైగా అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంత స్థోమత లేక.. ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడిపోతున్నాను. బిడ్డను చూస్తే కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. కడుపు తర్కుపోతోంది. గుండె భారంగా మారుతోంది. బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంతో కాళ్లూచేతులూ ఆడడం లేదు. దైవసమానులైన దాతలు ముందుకొచ్చి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాను’ అని చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె రోడ్డు, జగనన్న కాలనీకి చెందిన షాజహాన్, నౌహీరా కోరుతున్నారు. చేతులు కలపండి..ప్రాణం పోయండి షాజహాన్ (కెనరా బ్యాంకు) 31872200068371 సీఎన్ఆర్బి0013187)కు, పోన్పే 9705508805కు సహాయం చేయాలని కోరారు. -
మామిడి..
అనారోగ్య‘వసతి’ తిరుపతి జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు అధ్వానంగా మారాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సిద్ధమవుతున్న ఓఆర్ఎం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్పీఎం లో నూతన ఓఆర్ఎం ఇన్స్టాలేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ను పరిశీలిస్తున్న వైఎస్సార్సీపీ నేతలుతిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మారానని చెప్పి .. ధర పెంచకుండా మారాం చేస్తున్నారు! ఆర్కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్రెడ్డి, వెంకటేగౌడ్, సునీల్కుమార్, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోట రాజేష్, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్నష్టాల్లో మామిడి రైతు మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు ఏ ప్రాంతానికెళ్లినా జన సునామీనే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో మామిడి రైతులు మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడియాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు. ‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
మొహర్రం సెలవుపై స్పష్టత ఇవ్వండి
చిత్తూరు కలెక్టరేట్ : మొహర్రం సెలవుపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన ముస్లింల పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ సెలవు ప్రకటించిందన్నారు. అయితే పాఠశాలలకు ఆప్షనల్ సెలవులు వాడుకోవచ్చా లేదా అనే సందిగ్ధం నెలకొందన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తుంటే ఎలాంటి స్పందన లేదన్నారు. గత వారంలో రథయాత్రకు సైతం సెలవు ప్రకటించి చివరి నిమిషంలో రద్దు చేసి విధులు నిర్వహించాలన్నారు. ముందుగానే ఆప్షనల్ సెలవు పై నిర్ణయం ప్రకటించాలని కోరారు. గిరిజన భవనం ఏర్పాటు చేయండి చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో గిరిజన భవనం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి, ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖా మంత్రి రాందాస్ అతవాలేకు వినతి పత్రం అందజేశారు. మంత్రితో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలో గిరిజన భవనం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. మా బియ్యం ఎక్కడ? – రేషన్ షాపు ఎదుట కార్డుదారుల నిరసన పాలసముద్రం : మండలంలోని రాచపాల్యం 10వ నంబర్ రేషన్ షాపు వద్ద కార్డుదారులు నిరసన వ్యక్తం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ రేషన్ షాపు పరిధిలో ఎస్బీఆర్ పురం, రాచపాళ్యం, మణిపురం గ్రామాలకు చెందిన 320 రేషన్ కార్డుదారులు ఉన్నారు. గ్రామానికి కిలో మీటర్ల దూరంలోని పాలసముద్రం రైతు సేవా కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ బియ్యం పంపిణీ చేశారు. ఆపై సుమారు 30 మందికిపైగా కార్డులకు బియ్యం పంపిణీ చేయలేదు. దీంతో కార్డుదారులు తమకు రావాల్సిన బియ్యం ఎక్కడ..? అంటూ రేషన్షాపు డీలర్ను నిలదీశారు. ఆపై షాపు ఎదుటే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమకు బియ్యం పంపిణీ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. 6న బ్రహ్మోత్సవాలపై ఉభయదారుల సమావేశం కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈనెల 6వ తేదీన ఉభయదారులతో సమావేశం జరగనున్నట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని శ్రీమణికంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మధ్యాహ్నం 2గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఉభయదారులు పాల్గొన్నాలని ఆయన కోరారు. తోతాపురి.. వద్దులే మరి! యాదమరి: తోతాపురి రైతులు ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధరలేక నానాఅగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో తోతాపురిని వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారు. తోటల్లోని తోతాపురి చెట్లను తెగనరికి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనే యాదమరి మండలంలో చోటు చేసుకుంది. మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య ఐదెకరాల్లో మామిడి పంటను సాగు చేశాడు. పదేళ్లపాటు కన్నబిడ్డల్లా పెంచాడు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన తోతాపురికి గిట్టుబాటు ధర వచ్చి తమకు రక్షణగా ఉంటుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. గుజ్జు పరిశ్రమలు సిండికేట్గా మారి ధరలు తగ్గించేయడం.. దళారులు చెప్పిందే వేదంగా ఉండడంతో విసుగు చెందారు. ఎందుకొచ్చిన తంటలే అనుకుని తనకున్న ఐదెకరాల మామిడి తోటలో దాదాపు రెండు వందల తోతాపురి చెట్ల కొమ్మలను నరికేశాడు. ప్రత్యామ్నాయంగా దాని స్థానంలో వేరే రకాలను అంటు కట్టేందుకు సిద్ధపడ్డాడు. ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
కూటమి కక్ష..మామిడి రైతుకు శిక్ష!
● గిట్టుబాటుగాని మామిడి చెట్లను తొలగిస్తున్న రైతులు ● చెట్లు తొలగించినందుకు జరిమానా తప్పదంటున్న అటవీశాఖ ● కూటమి నేతల ఒత్తిడితోనే ఇలా చేయిస్తున్నారని అనుమానం! సాక్షి టాస్క్ఫోర్స్: మామిడి రైతుపై కొందరు కూటమి నేతలు కక్షగట్టారు. మామిడి చెట్ల నరికివేతను సాకుచూపి వేధింపులకు గురిచేస్తున్నారు. అటవీశాఖ అధికారుల ద్వారా రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. వివరాలు.. చిత్తూరు మండలం, తుమ్మింద గ్రామానికి చెందిన మామిడి రైతు కుమార్ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తన భూమిలో పనస నాటుకోవాలని నిర్ణయించాడు. దీంతో బుధవారం కొన్ని మామిడి చెట్లను తొలగించారు. దీనిని సాకుగా చూపించి కొందరు కూటమి నేతలు అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ రైతుపై కేసు లేదా జరిమానా విధించేలా చర్యలు చేపట్టాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో రంగలోకి దిగిన అటవీశాఖ అధికారులు పంటను పరిశీలించారు. ఆ తర్వాత రైతును కార్యాలయానికి పిలిపించి వాల్టా చట్టం ప్రకారం జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మళ్లీ శుక్రవారం కార్యాలయానికి రావాలని పంపిం చేశారు. ఇలా రైతును వేధించడంతో పాటు కార్యాలయానికి తిప్పించుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. కూటమి నేతలు కక్ష పూరితంగానే ఇలా చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతు సంఘ నేతలు, వివిధ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులపై ఇలా ఆంక్షలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. చట్టంలో కూడా మామిడి పంటకు వెసులుబాటు ఉందని, ఇంత వరకు మామిడి రైతు చెట్టు నరికాడని కేసులు, జరిమానాలు విధించిన ఘటనలు లేవని పలువురు న్యాయవాదులు సైతం వివరిస్తున్నారు. -
తోతా‘పూర్’
కాణిపాకం : ప్రస్తుతం జిల్లాలో మామిడి రైతులు కుదేలవుతున్నారు. ధరాఘాతంతో డీలా పడిపోయారు. తోతాపురి రకంను కొనేవారు లేక విలవిలలాడిపోతున్నారు. టేబుల్ రకాలు సైతం మామిడి రైతులకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఈసారి మామిడి ఫలం రైతుకు చేదును మిగిల్చాయి. తద్వారా మామిడిపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. గత ఐదేళ్లల్లో సిరులు గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులకు సిరులు కురిపించింది. టేబుల్ రకాలు...జేబులు నింపాయి. ఈరకం కేజీ రూ. 20 నుంచి సెంచరీ(రూ.100) కొట్టాయి. అదే తోతాపురి రూ. 10 నుంచి రూ.75వరకు పలికింది. దీంతో పండిన కాయలను రైతులు కోత కోసి చిత్తూరు, బంగారుపాళ్యం, దామలచెరువు మార్కెట్, ఫ్యాక్టరీలకు విక్రయించుకునేవారు. రోజుల తరబడి క్యూలో వేచి ఉండే పరిస్థితిలు ఉండేవి కావు. కాయలు అన్లోడింగ్ అయినా వెంటనే అప్పటికప్పుడే చేతికి డబ్బులు ముట్టేవి. ముఖ్యంగా టేబుల్ రకాలను చాలా మంది రైతులు బెంగుళూరు, చైన్నె వంటి ప్రాంతాలకు నేరుగా విక్రయించుకునేవారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని తద్వారా వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా కొనుగోలు దారులకు కాయలను పంపేవారు. ఇలాంటి బుకింగ్ల ద్వారా రైతులు అధిక లాభాలను గడించేవారు. అలాగే తోతాపురి కాయలు మంచి లాభాలను గడించి పెట్టాయి. ఐదేళ్ల కాలం పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మామిడి రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ప్రత్యామ్నాయం కోసం చెట్లు నరికేస్తూ.. మామిడి ఆశించిన మేర ప్రతిఫలం ఇవ్వకపోవడంతో పాటు అమ్మకపు పోరు పడలేక రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రధానంగా తోతాపురి పంటను నేలమట్టం చేస్తున్నారు. చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో మామిడి చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అలాగే తవణంపల్లి మండలంలోని మామిడి చెట్లను ఇది వరకే నరికివేశారు. యాదమరి మండలం దాసరపల్లి గ్రామంలో ఓ రైతు తోతాపురి చెట్లను తలొగించి టేబుల్ రకం కాయలను అంటుకట్టేందుకు ముందడుగు వేశారు. మరింత మంది రైతులు కూడా మామిడి చెట్లను నరికివేసేందుకు సమాయత్తమయ్యారు. కొబ్బరి చెట్లు పెట్టాలనే యోచనలో ఉన్నారు. మామిడి.. కష్టాలు..కన్నీళ్లు మార్కెట్లో అమ్ముడుపోని తోతాపురి కాయలు రైతులకు చేదును మిగుల్చుతున్న వైనం ఫలరాజుపై ఆశలు వదలుకుంటున్న రైతులు మామిడి చెట్ల నరికివేతలు.. ప్రత్యామ్నాయం వైపు చూపులు నేడు కుదేలు ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దిగుబడిని చూసి...సంబర పడిపోయినా రైతులను ధరలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో వారి ఆశలు ఆడియాశలయ్యాయి. టేబుల్ రకాలు ప్రతి ఫలం ఇవ్వకపోగా..తోతాపురి చేదును నింపింది. రైతులు తోతాపురికాయల అమ్మకానికి అష్ట కష్టాలు పడుతున్నారు. టోకెన్ పద్ధతితో తికమకపడిపోతున్నారు. ఫ్యాక్టరీలు కాయలు తీసుకొచ్చాక మద్ధతు ధర మాయమైంది. ఫ్యాక్టరీలు కేజీ తోతాపురి రూ.8 పాట పాడి...తర్వాత రూ.6, రూ.5. రూ.4 అంటూ..చివరకు నోరెత్తకుండా చేసింది. ర్యాంపుల్లో రూ.2కే అమ్ముడుబోతుంది. అది కూడా క్యూ పద్ధతిలో కాయలు అమ్ముకుంటున్నారు. ఐదురోజులు అయినా అన్లోడింగ్ కానీ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ధరలపై ఫ్యాక్టరీలు స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర అమలు విషయంలో నోరెత్తకపోవడంతో రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి మామిడి ధర వివరాలు మామిడి రకం ధరలు (రూ.లల్లో) తోతాపురి 2–8 బేనీషా 9–15 కాదర్ 15–30 పులేరా 4–15 కాలేపాడు 15–25 నీలం 10–15 మార్కెటింగ్ శాఖ అధికారుల వివరాల మేరకు గత ఐదేళ్లుగా మామిడి ధరల వివరాలు.(రూ.కేజీలల్లో) సంవత్సరం బేనీషా పులేరా తోతాపురి కాలేపాడు నీలం కాదర్ 2019–20 35 9–12 17–20 24 21 20–40 2020–21 45 17–25 22–25 35 33 22–35 2021 –22 16 –35 12–20 12–55 35–40 12 57–60 2022–23 35–40 12–15 24–75 30–35 25 27–30 కష్టాలు.. నష్టాలే మిగిలాయి.. మామిడి తోటను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడాం. కొన్నేళ్లుగా మంచి ఫలితం ఉండేది. లాభాలొచ్చాయి. తోతాపురి కేజీ రూ.75వరకు అమ్ముకున్నాం. ఈసారి కష్టాలు..నష్టాలు అనుభవించాం. చాలు ఈ పంట అని వదిలించుకుంటున్నాం. అందుకే ఎకరాలో మామిడి తోటలో పంటను తొలగించాం. ప్రత్యామ్నాయంగా పంట వేయాలని అనుకుంటున్నాం. – కుమార్, తుమ్మింద, చిత్తూరు మండలం పెట్టుబడి రాలేదు.. ఏటా పెట్టుబడి వేలల్లో పెట్టి అలసిపోతున్నాం. ఈసారి పెట్టుబడి చూస్తే రూ.60 వేలు దాటింది. దిగుబడి బాగనే వచ్చిన..పెట్టుబడికి తగట్టు ఆదాయం ఉండాలి. అప్పుడే రైతు కోలుకుంటాడు. ఆ రకంగా రైతుకు ఫలితం లేదు. తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నష్టాలను గుర్తించాలి. రైతును ఆదుకోవాలి. లేకుంటే ప్రత్యామ్నాయం తప్ప వేరేమార్గం లేదు. – కొత్తూరు బాబు నాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు మండలం -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
శ్రీరంగరాజపురం : మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కళ్యాణ మండపంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ స్థాయిలో రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇన్చార్జి కృపాలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి మండలానికి చెందిన దివాకర్, శ్రీను, మదన్కుమార్, వెదురుకుప్పం మండలం నుంచి ధనరాజ్ వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ఏడాదికే కూటమి పాలన అరాచకం, దౌర్జన్యం తట్టుకోలేక టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. రానున్న రోజుల్లో మరింత చేరికలు ఉంటాయన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్ మణి, మాజీ కన్వీనర్ అనంతరెడ్డి, జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు, కుప్పయ్య, సర్పంచ్ డిల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు కోటిరెడ్డిబాబు, నాయకులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లె : పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం కాటిపేరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాటిపేరికు చెందిన సుబ్రమణ్యం(45) కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపం చెంది పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో వెళ్లగా కుటుంబ సభ్యులు గుర్తించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి పుంగనూరు(చౌడేపల్లె) : పట్టణంలోని అంబేడ్కర్ భవనం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వివరాలపై ఆరా తీశారు. మృతుడు బిక్షాటన చేసుకుంటూ అంబేడ్కర్ సర్కిల్ వద్ద తలదాచుకునేవాడని తెలిపారు. మృతదేహాన్ని పుంగనూరు ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పుంగనూరు పోలీసులను సంప్రదించాలని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. విచారణ నివేదిక.. తప్పుల తడక చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తన కుమార్తె శ్రీదుర్గ మృతి విషయంలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ నాయకులు షణ్ముగం ఆరోపించారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన కుమార్తె శ్రీదుర్గ రోడ్డు ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తే.. సరైన చికిత్స అందక మృతి చెందిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆయన పేర్కొన్నారు. -
కోడె దూడల ఉత్పత్తి
తవణంపల్లె : జిల్లాలో అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన విత్తనపు కోడె దూడలను ఉత్పత్తి చేస్తున్నట్లు జిల్లా పశు సంతతి పరిశీలన కేంద్రం డీడీ డాక్టర్ వాసు తెలిపారు. బుధవారం తవణంపల్లె, గుడిపాల, పెనుమూరు మండలాల్లోని అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన 10 కోడె దూడలను సేకరించి నకరేకల్ వీర్య కేంద్రానికి పంపినట్లు తెలిపారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి మరింత చేయూత ఇస్తున్నట్లు వివరించారు. పాల దిగుబడి పెంచే లక్ష్యంగా ఆరోగ్యకరమైన, ధృఢమైన సంకరజాతి పశుసంపదను ఉత్పత్తి చేయడంలో జిల్లా పశు సంతతి పరిశీలన కేంద్రం ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. డీడీతో పాటు వెటర్నరీ డాక్టర్ రామయోగానందారెడ్డి, డాక్టర్ మౌనిక, సూపర్వైజర్ శివకుమార్ పాల్గొన్నారు. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
– తాళం వేసిన ఇళ్లే టార్గెట్ నగరి : తాళం వేసి ఉన్న ఇల్లు, ఆఫీసుల్లో చొరబడి చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ ధరన్సాయి (35)ను నగరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విక్రమ కథనం మేరకు గత నెల 8వ తేదీన కొండచుట్టు మండపం ఏరియాలో లాయర్ లోకేష్ ఆఫీసులో అర్ధరాత్రి, గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి లక్ష రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ విషయమై లోకేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. అందిన సమాచారం మేరకు ఓంశక్తి గుడి వద్ద నిఘా పెట్టిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధరన్సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడన్నారు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన నగదులో రూ. 75 వేల రూపాయలు, రూ. 40 వేల రూపాయల విలువ చేసే రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. అతడిపై గతంలో తిరుత్తణిలో చోరీ కేసు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ విజయ నాయక్, సిబ్బంది లోకనాథం, గోపి, సత్య, గజేంద్ర, అశోక్, రమేష్ను అభినందించారు. -
ఆర్అండ్బీలో బదిలీలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఆర్అండ్బీ, నేషనల్ హైవే (ఎన్హెచ్) పరిధిలో పలువురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్అండ్బీ జిల్లా ఎస్ఈగా సురేష్బాబును నియమించారు. కర్నూలులో ఈఈగా ఉన్న ఆయనను జిల్లా ఇన్చార్జి ఎస్ఈగా నియమించారు. చిత్తూరు ఎన్హెచ్ డీఈ కృష్ణయ్యను అనంతపురం ఎన్హెచ్ సర్కిల్ ఇంచార్జి ఈఈగా బదిలీ చేశారు. సబ్ డివిజన్ డీఈగా ఉన్న సత్యమూర్తిని టెక్కలి ఇన్చార్జి ఆర్అండ్బీ ఈఈగా బదిలీ చేశారు. ఏఈగా ఉన్న సుజాతను ఉద్యోగోన్నతిపై చిత్తూరు ఎన్హెచ్ డీఈగా నియమించారు. విద్యుత్ గ్రీవెన్స్లను వెంటనే పరిష్కరించాలి చిత్తూరు కార్పొరేషన్ : సకాలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. బుధవారం చిత్తూరు అర్బన్ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలో పలు సమస్యలను వినియోగదారులు తెలియజేశారు. బిల్లు రివిజన్ సమస్యను కొత్తపల్లె నుంచి, వాణిజ్య సర్వీసు నుంచి గృహ సర్వీసుకు మార్పు చేయాలని ఓబనపల్లె నుంచి, విద్యుత్ సర్వీసుకు ఉన్న మొబైల్ నంబర్ను మార్పు చేయాలని మురకంబట్టుకు చెందిన వినియోగదారుడు ఫిర్యాదులు చేశారు. వీటిని అప్పటికప్పుడు మార్పు చేసినట్లు ఈఈ తెలిపారు. కార్యక్రమంలో డీఈ ప్రసాద్, టెక్నికల్ ఏఈ మాధురి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని రెండు న్యాయస్థానాలకు ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులోని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి వీఆర్.రామకృష్ణ, 6వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం.బాలాజీని నియమించింది. మూడేళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు. ముగిసిన డీఎస్సీ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత నెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయ్. చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ పరీక్షలను పకడ్బందీగా పర్యవేక్షించారు. చిత్తూరు జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు మొత్తం 33,181 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 30,952 మంది హాజరయ్యారు. మిగిలిన 2,229 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు మొత్తం 21,340 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 19,550 మంది హాజరయ్యారు. మిగిలిన 1,790 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
రసాభాసగా తడుకు ప్రజాభిప్రాయ సేకరణ
పుత్తూరు : మండల పరిధిలోని తడుకు సచివాలయం వద్ద బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెంకటేశు అధ్యక్షతన సభ నిర్వహించారు. పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. తడుకు రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 182/పి లోని 6 హెక్టార్లు ఆర్.మధుసూదన్రావు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వారికి, సర్వే నంబర్ 507/2 లోని 2.520 హెక్టార్లు శ్రీకనకదుర్గ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు ఇ–వేలం ద్వారా బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు గాను లీజు జారీ చేయడానికి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి స్థితిగతులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడుకు పంచాయతీ ఎంపీటీసీ సుబ్బరత్నమ్మ భర్త గంగాధరం మాట్లాడడానికి ప్రయత్నించగా క్వారీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా సచివాలయం గదిలోకి తీసుకెళ్లి తాము పరిష్కరిస్తామంటూ గంటకు పైగా నిర్భందించారు. అనంతరం పట్టుబట్టి బయటకు వచ్చిన గంగాధరం ఆర్డీఓ రామ్మోహన్కు వినతిపత్రం అందజేసి, క్వారీలకు అనుమతి ఇవ్వరాదంటూ కోరారు. అలాగే గుంతకల్లు, తాడిపత్రి నుంచి వచ్చిన పర్యావరణ వేత్తల బృందాన్ని సైతం మాట్లాడడానికి సాక్ష్యాత్తు పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ అనుమతించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పర్యావరణవేత్తల బృందానికి, క్వారీ యజమానుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ గందరగోళం మధ్యనే సభను ముగించారు. కార్యక్రమంలో పొల్యూషన్ ఏడీ మధన్మోహన్రెడ్డి, ఏఈ శశికళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడుగా అండగా ఉంటామని, కేసులకు భయపడొద్దని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి, ఎమ్మెల్యేలు గుట్టలు, కొండలని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, అదేనా సంపద సృష్టించడం అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సామాజిక వర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.1500 చొప్పున ఇస్తానన్న బాబు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం దారుణమని దుయ్యబట్టారు, నవరత్నాలు పథకం ద్వారా జగనన్న సంక్షేమ పథకలూ అందిస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలను దారుణంగా మోసం చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ జెండా ఎత్తిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. -
నేడు కృత్రిమ పరికరాల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఉదయం 11 గంటలకు 977 మంది విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ పరికరాల పంపిణీ చేయనున్నట్లు బుధవారం డీఆర్వో మోహన్కుమార్ విలేకరులకు తెలిపా రు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాందాస్ అథాలే, జిల్లా ఇంచార్జి మంత్రి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఉద్యోగ మేళాలో 67 మంది ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ కళాశాలలో నిత్యం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాల చైర్మన్ శ్రీధర్ అన్నారు. బుధవారం నగరంలోని సీఎంటీ రోడ్డులోని ఆ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు పేరొందిన కంపెనీలు పాల్గొన్నాయన్నారు. మేళాలో 105 మంది పాల్గొనగా అందులో 67 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. పలు కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. 5న సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈనెల 5వ తేదీన బదిలీల ఉత్తర్వులు పంపనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని భావించి 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. నేరుగా ఈ మెయిల్ ద్వారా బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు పంపనున్నారు. వివిధ ప్రాంతాలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ అయినప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని అధికారులు సూచిస్తున్నారు. -
కీరమంద యూపీ స్కూల్ అప్గ్రేడ్
బంగారుపాళెం : మండలంలోని కీరమంద యూపీ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యిందని ఎంఈఓ నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత నెల పాఠశాల పునఃప్రారంభం నుంచే హైస్కూల్గా మార్పు చేసి తరగతులు బోధించాలంటూ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. కీరమందలో 1961లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయగా అటు తరువాత 2002లో ప్రాథమికోన్నత పాఠశాల, 2025లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యిందని తెలిపారు. విద్యార్థులకు ఊరట ప్రాథమికోన్నత విద్య తరువాత 9, 10 తరగతులు చదివేందుకు కొదలమడుగు, కీరమంద గ్రామ పంచాయతీల పరిధిలోని విద్యార్థులు సుమారు 8 కిలో మీటర్ల దూరంలోని ఎగువ రాగిమానుపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గానీ, లేదా టేకుమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం కీరమందలోనే యూపీ స్కూల్ అప్గ్రేడ్ కావడంతో విద్యార్థులకు కష్టాలు తప్పాయి. -
సీసీఆర్ఛీ
● కార్డుల జారీలో తీవ్ర జాప్యం ● కౌలు రైతుల కష్టాలు ● జిల్లా వ్యాప్తంగా లక్ష్యం 4,200సీసీఆర్ కార్డులు ● జారీ చేసినవి 594 కార్డులు ● రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం ● కూటమి ప్రభుత్వ తీరుపై కౌలు రైతుల ఆగ్రహం పొలం పనుల్లో కౌలు రైతుగుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం కౌలు రైతుల ను గుర్తించి వెంటనే అందరికీ సీసీఆర్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. లేని పక్షంలో గతేడాది ఇచ్చిన కార్డులను రెన్యువల్ చేయాలి. వ్యవసాయమే ఆధారంగా బతికే కౌలు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – రమేష్, కౌలురైతు, నిండ్ర మామిడి సాగులో నష్టపోయాం మామిడి తోటలు కౌలుకు సాగుచేశాం. కాపు కోతకు వచ్చే దశలో గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీల వద్ద టోకెన్లకు తిరిగి తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. దీంతో తోటల్లోనే కాయలు అలాగే వదిలేస్తున్నాం. ఇంకా 50 ట్రాక్టర్ల కాయలున్నాయి. టోకెన్లు త్వరగా ఇప్పిస్తే లాభాలు రాకపోయి నా నష్టాలైనా తగ్గించుకుంటాం. బ్యాంకులో రుణాలు పొందడానికి సీసీఆర్ కార్డులు కూడా లేవు. – ధనంజయ రెడ్డి, కౌలు రైతు, కలికిరిండ్ల, కార్వేటినగరం మండలం లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తాం కౌలు రైతులు సీసీఆర్ కా ర్డుల కోసం అభ్యర్థనలు చే శారు. కౌలు రైతుల విషయంలో దీనికి ఎంతో ప్రా ధాన్యం ఉంది. గత ఏడాది అందరికీ కార్డులు అందించాం. ఈ ఏడాది కొందరి కి అందజేశాం. త్వరలో ప్రభుత్వం లక్ష్యం మేరకు కౌలుదారులను రైతు సేవా కేంద్రాల ద్వారా గుర్తించి వారికి సాగు హక్కు పత్రాలైన సీసీఆర్ కార్డులు అందజేస్తాం. – రాఘవేంద్ర యాదవ్, వ్యవసాయ అధికారి, నగరి మండలం నగరి : వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పంట సాగు రైతులకు అందించే సీసీఆర్ (పంటసాగు హక్కుపత్రం) కార్డుల జారీ నత్తనడకన సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కౌలు రైతులకు ఈ కార్డులతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని అటకెక్కించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకూ ఈ పథకం ఊసేలేదు. ఇక పంటల సాగు చేపట్టే రైతులకు ఇచ్చే సీసీఆర్ కార్డుల జారీలోనూ జాప్యం నెలకొనడంతో కౌలు రైతులు మండిపడుతున్నారు. సీసీఆర్ కార్డుతో ప్రయోజనాలు కౌలు రైతులకు ఈ గుర్తింపు కార్డులు ఉంటేనే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం లభిస్తుంది. ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల జారీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుండటంతో కౌలు రైతులంతా సీసీఆర్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సీసీఆర్ కార్డు తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీసీఆర్ కార్డుల జారీ మాత్రం జిల్లాలో సజావుగా సాగకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.సీసీఆర్ఛీజిల్లా సమాచారం జిల్లాలోని పంచాయతీలు : 697 జిల్లాలోని గ్రామాలు : 822 2024లో ఇచ్చిన సీసీఆర్ కార్డులు : 4200 2025లో నిర్దేశించిన సీసీఆర్ కార్డులు : 4200 ఇప్పటి వరకు ఇచ్చిన కార్డులు : 594 బ్యాంకు రుణాలు అందక జిల్లా వ్యాప్తంగా గతేడాది 4200 సీసీఆర్ కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది కూడా 4200 కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కేవలం 594 కార్డులు మాత్రమే జారీ చే శారు. అంటే రెండున్నర నెలల్లో నిర్దేశించిన లక్ష్యంలో కేవ లం 14 శాతం మాత్రమే సీసీఆర్ కార్డులు జారీ చేయడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుర్తించిన మేరకు కౌలు రైతులు అందరికీ ఈ సీసీఆర్ కార్డులు జారీ చేయగా ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాల ఊసే లేదు. దీంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. -
కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు గంగవరం: బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గంగవరం ఫ్లైఓవర్ పైన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. అర్బన్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు.. పలమనేరు పట్టణం, ఆర్కే స్ట్రీట్లో నివాసం ఉంటున్న మస్తాన్(44), గంగవరం మండలం, మేలుమాయి క్రాస్కు చెందిన రితిక(20) ఇద్దురూ కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరి వెళ్లారు. గంగవరం బైపాస్లో రాంగ్ రూట్లో నిర్లక్ష్యంగా బైక్ను నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే దారిలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో అజాగ్రత్తగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా వెనుక కూర్చున్న యువతికి తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్తో పాటు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కేసు దర్యాప్తులో ఉంది. ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనానంతరం స్వగ్రామానికి భక్తులతో వెళ్తున్న ఆటో చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని జూనియర్ కళాశాల సమీపంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. సోమల మండలం, నంజంపేటకు చెందిన కొందరు ఆటోలో బోయకొండకు వెళ్లారు. గంగమ్మను దర్శించుకొని ఇంటికి బయలు దేరారు. జూనియర్ కళాశాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న అహమ్మద్, విజయ్, రమణ, పాపయ్యతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 78,730 మంది స్వామివారిని దర్శించుకోగా 28,940 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
పుంగనూరు(చౌడేపల్లె): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల నిరసనలకు వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చి సంఘీభావం ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్మికులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయకుండా ఆరాచకాలు, అక్రమాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో, గొంతెత్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. సూపర్ –6ను అమలు చేయాల్సిన ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు, కౌన్సిలర్లు సాజిదాబేగం, రేష్మా, వైఎస్సార్సీపీ నాయకులు ఇర్ఫాన్, కొండవీటి నరేష్, ఖాదర్బాషా, రాజేష్, కార్మికులు కుమార్, గోపి, దౌలత్, సంతోష్, శివకుమార్, మోహన్, సోము, వెంకట్రమణ, యూసుఫ్, జావహార్అలి పాల్గొన్నారు. భిక్షాటన అనే పదాన్ని తొలగించారు చిత్తూరు రూరల్ (కాణిపాకం): దాసరుల కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన అనే పదాన్ని తొలగించడం స్వాగతించదగ్గ విషయమని దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో దాసరులకు భిక్షాటన అనే పదాన్ని చేర్చే వారని, ఈ పదం తమ మనో భావాలనులను దెబ్బతీసే విధంగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి ఈ పదాన్ని తొలగించేలా చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. దాసరి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు వెంకట రమణ, సుబ్బయ్య, జయచంద్ర, శేఖర్, మధు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా ఏపీ ఓపెన్ స్కూల్ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఏపీ ఓపెన్ స్కూల్ సమావేశం మొక్కుబడిగా సాగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించిన మొదటి సమావేశాన్ని జిల్లా లోని 22 ప్రైవేట్ స్టడీ సెంటర్ల నిర్వాహకులు బాయ్కాట్ చేశారు. ఈ సమావేశం నిర్వహణకు ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారి నరహింహరావు హాజరయ్యారు. అయితే జిల్లాలోని ప్రైవేట్ స్టడీ సెంటర్ నిర్వాహకులు ఒక్కరు సైతం హాజరుకాలేదు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థల కో ఆర్డినేటర్లతోనే తూతూమంత్రంగా సమావేశం నిర్వహించేశారు. సంబంధిత 22 సెంటర్లలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు చేసేదిలేదంటూ పలువురు స్టడీ సెంటర్ల నిర్వాహకులు వెల్లడించారు. చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ వరం లాంటిదని డీఈఓ వరలక్ష్మి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ నరసింహరావులు తెలిపారు. డీఈవో కార్యాలయంలో ఏఐ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పదో తరగతిలో చేరేందుకు 14 సంవత్సరాలు, ఇంటర్కు 15 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని చెప్పారు. ఏడీ–2 వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
చదువుకు దారేది?
పూర్తిగాని అండర్ పాస్ రోడ్డు ● దారి లేక పాఠశాలకు వెళ్లని విద్యార్థులు ● 24 గంటల్లో తాత్కాలిక పనులు పూర్తిచేస్తామని హామీ రొంపిచెర్ల: జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. దారిలేక పాఠశాలకు హాజరుకాలేని దుస్థితి రొంపిచెర్ల మండలం, బండకిందపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. మదనపల్లె నుంచి రంగంపేట వరకు నేషనల్ హైవే రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికారులు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో బండకిందపల్లె యూపీ పాఠశాల ముంపునకు గురికాగా.. ప్రభుత్వం రూ.37 లక్షలు నష్ట పరిహారంగా మంజూరు చేసింది. అధికారులు నేషనల్ హైవే రోడ్డు పక్కనే తరగతి గదులను నిర్మించారు. సుమారు 54 మంది విద్యార్థులు రోజూ వచ్చి వెళ్లేవారు. పాఠశాలలో నలగురు ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారు. ఇంతవరకు రోడ్డు పైనే దాటుకుని విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే వారు. రోడ్డు పనులు పూర్తి కావడంతో రోడ్డు మీద దాటే అవకాశం లేకుండా పోయింది. అండర్ పాస్ రోడ్డు వేయాల్సిన అధికారులు దానిని విస్మరించడంతో విద్యార్థులు రెండు కిలో మీటర్ల దూరం చుట్టుతిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు జేసీకి, ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు అండర్ పాస్ పనులను పట్టించుకోక పోవడంతో మంగళవారం విద్యార్థులను పాఠశాలకు పంపకుండా తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు రాక పోవడంతో చేసేది లేక ఖాళీగానే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే పాఠశాలకు విద్యార్థులు రాక పోవడంతో వంట గది కూడా మూత పడింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాసులు, తహసీల్దార్ అమరనాఽథ్ బండకిందపల్లె పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, నేషనల్ హైవే సూపర్వజర్ విజయకుమార్తోనూ మాట్లాడారు. అండర్ పాస్ పనులను తాత్కలికంగా 24 గంటల్లో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని నేషనల్ హైవే సూపర్వైజర్ హామీ ఇచ్చారని తహసీల్దార్ తెలిపారు. -
త్వరలో సంఘాలకు సారథులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పల్లె ప్రాంతాల్లోని రైతులకు అండగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్వరలో సారథులు రాబోతున్నారు. ప్రస్తుతం పర్సన్ ఇన్చార్జ్లుగా సంబంధిత శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. వారి స్థానంలో త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పరిధిలో 75 సహకార సంఘాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక త్రీమెన్ కమిటీలను రద్దుచేసి సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించింది. వీరు తగినంతమంది లేక మూడు, నాలుగు సంఘాలకు ఒకరిని చొప్పున నియమించడంతో సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారు. వీరి గడువు ముగిసింది. మళ్లీ ఆరు నెలలకు పెంచాలి. ఈ దఫా నెల రోజులే పొడిగించారు. ఈ సమయంలో త్రిసభ్య కమిటీల నియామకాన్ని కొలిక్కి తీసుకురానున్నారు. పోటాపోటీగా ఆశావహులు ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలో చైర్మన్, డైరక్టర్లుగా నియమించేందుకు మూడు నెలల క్రితమే ఆశావహుల పేర్లు తీసుకున్నారు. ఎమ్మెల్యేలే జాబితాలను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. కొన్నిచోట్ల కూటమి నేతల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఇన్నాళ్లు వాటిని పక్కన పెట్టేశారు. కమిటీలో పేర్లున్న ఆశావహులంతా ఈ పదవుల కోసం రెండు నెలలుగా వేచి చూస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా సంఘాలన్నింటికీ కమిటీలు వేయబోతున్నారు. తర్వాత ఎన్నికలు నిర్వహించినా అప్పుడు కూడా వీరినే అధ్యక్షులుగా కొనసాగించేలా అభ్యర్థులను ఎంపికచే యాలని, తేడాలుంటే ఇప్పుడే సరిదిద్ది మరో సారి జాబితాను పునఃపరిశీలన చేసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ విషయంలో కూటమి నేతల్లో లుకలుకలు మొదలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
టమాట బాక్సు రూ.450
పలమనేరు: టమాట ధరలు ఎట్టకేలకు పెరుగుతున్నాయి. పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు మంగళవారం రూ.450 దాకా పలికింది. సూపర్ఫైన్ రకం(తొలి కోతలు) రూ.500 దా టింది. ఆ మేరకు పెద్దపంజాణి మండలానికి చెందిన రైతు క్రిష్ణారెడ్డి తోటలోని టమాటాలు రూ. 500 పలికాయి. అయితే వైరస్ కారణంగా పంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఈ మాత్రం ధరలున్నా టమాటా రైతులకు మేలు కలిగినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవల టీచర్ల బదిలీలు నిర్వహించిన విషయం విధితమే. అయితే ఈ బదిలీల్లో పలువురు టీచర్లు తమకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. సంబంధిత టీచర్ల అభ్యర్థనలను రెండు రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నష్టపోయిన 25 మంది టీచర్ల అభ్యంతరాలు(గ్రీవెన్స్)ను పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరుకలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం అందజేసే జాతీయ ఉత్తమ టీచర్ల అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు ఈ నెల 13వ తేదీలోపు ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.nationalawardstoteachers.education.gov.in అనే వెబ్సైట్లో సమగ్ర వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. డిజిటల్ సర్వే సిస్టమ్ పరిశీలన కుప్పం: కుప్పం నియోజకవర్గంలో టాటా సంస్థ చేపడుతున్న డిజిటల్ సర్వే సిస్టమ్ పనితీరును రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కృష్ణాబాబు పరిశీలించారు. బుధ, గురువారాలు సీఎం చంద్రబాబు కుప్పం వంద పడకల ఆస్పత్రిలో టాటా సంస్థ డిజిటల్ సర్వే సిస్టమ్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన కంగుంది పీహెచ్సీలో సర్వే పనితీరును పరిశీలించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ సుమిత్కుమార్, డీయెన్సీ మెనేజర్ కమలేష్ పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!
● ఇంటింటికీ వెళ్లాలంటే భయం ● మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేదు ● కనీసం కాయలను కొనుగోలు చేయని వైనం ● పింఛన్లు, తల్లికి వందనంలో కోతపై లబ్ధిదారుల ఆగ్రహం అడుగడుగునా అక్రమాలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసీబీల, ఇటాచీలు, లారీలు, టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ముచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదు. ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు, అధికారులు కరువయ్యారు. కూటమి నేతలు ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి సొంతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వేరొకరి అనుభవంలో ఉన్నా.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను నిలదీసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లటానికి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గు బులు పట్టుకుంది. ఏడాది పాలనలో పథకాలు అమలు చేయకపోవటం, ఉమ్మడి జిల్లాలో మామి డి రైతులు ఆగ్రహంగా ఉండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్థానికులు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? అనేదానిపై ఎమ్మెల్యేలు అధికారులు, స్థానిక టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై ‘చంద్రబా బు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ముందే సుపరిపాలన పేరుతో ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి, ప్రారంభించేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. పథకాలు అడగరా? ఏడాది కూటమి పాలనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పింఛన్లు తొలగించిన వారే సుమారు 32 వేల మంది ఉన్నారు. వాటి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదు. పింఛను కోల్పోయిన వారు, కొత్తగా ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు లేవు, ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వటం లేదు. కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. మరో వైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్ సీజన్ మొదలైనా పైసా విదల్చలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఇతరత్రా హామీలు అమలు చేయకపోవటంపై లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు. భయపెడుతున్న మామిడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత కొంత కాలంగా రైతులు మామిడి దిగుబడులను అమ్ముకోలేక వారు ఎదుర్కొంటున్న అవస్తలు వర్ణనాతీతం. మామిడి దిగుబడులతో రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు వేచి ఉన్నా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్పినా ఫలితం కనిపించలేదు. అధికారులు ఆదేశించినా ఫ్యాక్టరీ యాజమాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు చేసేది లేక కడుపు మండి చెట్లను నరికేసుకుంటున్నారు. మరి కొందరు కాయలను రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే రైతులు విరుచుకుపడుతారన్న భయం టీడీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. -
మద్దతు ధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
● తొలుత కిలోకి రూ.12, ఆపై రూ.6 ప్రకటించిన వైనం ● క్షేత్రస్థాయిలో కిలో రూ.3 కూడా దక్కక రైతుల ఆవేదన ● అయినా సరే కాయ కొనడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు ● అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పంట అమ్మడానికి అగచాట్లు ● నిద్రాహారాల్లేక ఫ్యాక్టరీల ఎదుట ఎదురుచూపులు ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దయనీయ పరిస్థి ఇంటికి పోయే పరిస్థితి లేదు కాణిపాకం నుంచి గుడిపాల సరిహద్దులో ఉన్న ఫ్యాక్టరీకి కాయలు తెస్తే రూ.5వేలు బాడుగ. ఒక్కరోజు అయినా..రెండు రోజులు..మూడు రోజులు అయినా ఇదే రేటు. ఇక్కడకు కాయలు తెస్తే.. అన్లోడింగ్ అయ్యేందుకు ఐదు రోజులు పడుతోంది. అంతవరకు ఓపికతో ఉండాల్సిందే. ఇంటికి పోను.. రాను అంటే కుదరదు. – రవి, బొమ్మసముద్రం, ఐరాల మండలం టోకెన్లు అమ్ముకుంటున్నారు వారం పది రోజులుగా తిండీనీళ్లు లేకుండా రోడ్లపై అవస్థలు పడుతున్నాం. రాత్రి సమయాల్లో అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మకై ్క దొడ్డి దారిన టోకెన్లు అమ్ముకుని డైరెక్టుగా 10, 20 వాహనాలు లోపలకు పంపించేస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దోమల బెడదతో నిద్రాహారాలు లేకుండా మేము అవస్థలు పడుతుంటే కొందరు మాత్రం దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. – బాబునాయుడు, జీడీనెల్లూరు కన్న బిడ్డల్లా సాకినాం సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడు కున్నాం. కన్నబిడ్డల్లా గా పండించాం. ఇప్పు డు మామిడి పంట మొ త్తం కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉంది. నాలుగైదు రోజుల నిరీక్షణలతో టార్ఫాలిన్పట్ట వేడికి లోలోపలే కుళ్లిపోయి, జ్యూసు లా రోడ్లపై కారిపోతోంది. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రత్యేక చొరవ చూపించాలి. – శ్రీనివాసరెడ్డి పెనుమూరు మండలం చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడినిచ్చింది. ఇందులో తోతాపురి రకం నుంచి గుజ్జు (పల్ఫ్)ను తయారుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఫలితంగా ప్రతీ ఏటా దాదాపు 40 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి రకాన్ని రైతాంగం సాగుచేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. కానీ మామిడిని కొనడానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ ముందుకు రావడం లేదు. ఒకవేళ కొన్నా కిలోకు సగటున రూ.4 –5 చెల్లిస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూ.3 మాత్రమే పలుకుతోంది. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక, ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర లభించక అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. చేజేతులా కోల్పోతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఫ్యాక్టరీలు మామిడిని కొనకపోవడంతో రైతు కంట కన్నీళ్లు ఆగడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం కిలోకు రూ.6 చెల్లించాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకునే దిక్కులేదు. ముందుగా ఫ్యాక్టరీ వద్దకు రైతు వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ నంబర్ వస్తే తప్ప మామిడిని లోపలకు తీసుకెళ్లడానికి వీల్లేదు. రెండు రోజులు అలాగే ఉంచేస్తే 40 శాతం పంట పనికిరాదు. చిన్నపాటి వర్షం పడితే వంద శాతం పంట రోడ్డుపై పడేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, తోపులాటలు, పోలీసులు–ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదాలు.. ఇవన్నీ ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలు ఉంటే ఇప్పటి వరకు 30 వరకు ఫ్యాక్టరీలు మాత్రమే తెరుచుకున్నాయి. 80 శాతం వరకు ఫ్యాక్టరీలు, కూటమి ప్రభుత్వ అనుకూలురు చేతుల్లో ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గరిష్టంగా కిలో మామిడి రూ.23కు అమ్ముడం కొసమెరుపు. ‘మద్దతు’లేక..అగచాట్లు పడలేక చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. మామిడి పంటను ఫ్యాక్టరీలకు అమ్ముదామని పంటను తీసుకొచ్చిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కిలో మామిడికి రూ.12 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఫ్యాక్టరీలు చెప్పడంతో, కిలోకు రూ.8 ఫ్యాక్టరీలు చెల్లించాలని, మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందని.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్నెన్నాయుడు ప్రకటించారు. కానీ ఫ్యాక్టరీలు కూడా ఈ ధరలు పాటించలేదు. కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.3 సైతం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ హామీలన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయాయి. సీజన్ ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతుకు మద్దతు ధర అందలేదు. -
జనావాసాల్లోకి ఏనుగులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పాళెం పంచాయతీలో తిష్ట వేసిన 14 ఏనుగుల గుంపు చుట్టు పక్కల పొలాల్లో రోజూ ఏదోఒకచోట పంటలపై పడి తీవ్ర నష్టం కలిగిస్తోంది. రోజూ మామిడి తోపుల్లో కాయలు తింటూ కొమ్మ లను విరిచేయడం, కంచె కూసాలను, డ్రిప్ పై పులను నాశనం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా మంగళవారం తెల్లవారు జామున పాళెం పంచాయతీలోని జూపల్లె, కోటపల్లె గ్రా మాల్లోకి ప్రవేశించి ఇళ్ల ముందర ఉన్న అరటి చెట్లను ధ్వంసం చేశాయి. రోడ్ల పైన తిరు గుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఏనుగులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు కుప్పం: సీఎం చంద్రబాబు నాయుడు బుధ వారం కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమ వారం జిల్లా పోలీసు యంత్రాగంతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసు బలగాలను అధికంగా మోహరించాలన్నారు. సమీక్షలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివనందకిషోర్, కుప్పం డీఎస్పీ పార్థ సారిథి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సీఎం కుప్పం పర్యటనలో మార్పు శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన ఒక్క రోజు ఆలస్యంగా ప్రారంభంకానుంది. మంగళవారం ఇక్కడికి రావాల్సిన ఆయన బుధవారం విచ్చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కి సీఎం తుమ్మిశి వద్ద ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వచ్చి 12.50కి తులసినాయనపల్లి వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూలు వద్దకు చేరుకుని బహిరంగసభ, పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.35కు తిమ్మరాజుపల్లి చేరుకుని రాత్రి 7 గంటల వరకూ ఇంటింటికీ వెళ్లి 26 కుటుంబాలను నేరుగా కలవనున్నారు. గురువారం ఉదయం 10.35కు కుప్పం ఏరియా ఆస్పత్రి చేరుకుని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15కు కడపల్లి వద్ద తన నివాసంలో అధికారిక సమిక్ష నిర్వహిస్తారు. 2.30 నుంచి 4 గంటల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తుమ్మిశి వద్ద హెలీప్యాడ్ చేరుకుని బెంగళూరుకు వెళ్తారని తెలిపారు. -
ఊరుబడంటే అలుసా?
చిత్తూరు రూరల్(కాణిపాకం): తమ పిల్లల చదువుకు ఊరు బడంటే ఒప్పుకుంటామని.. లేకుంటే తమిళనాడులోని ప్రభుత్వ బడికి పంపుతామని పిల్లల తల్లిదండ్రులు రోడెక్కారు. చిత్తూరు మండలం, అనంతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విలీ నంపై మంగళవారం పిల్లల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 24 మంది విద్యార్థులు ఉన్నా రన్నారు. ఈ పాఠశాలను విలీనం చేయడంతో పిల్లలంతా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బీఎన్ఆర్ పేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. చిత్తూరు తిరుత్తణి జాతీయ రహదారి మీదుగా పిల్లలు బడికి వెళ్లాలని, భారీ వాహనాల రాకపోకల నడుమ ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. విలీనం మాకొద్దని.. ఊరుబడే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించకుంటే కి.మీ పరిధిలో ఉన్న తమిళనాడులోని ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపుతామని స్పష్టం చేశారు. కావాలంటే రేషన్ కార్డులు కూడా రద్దు చేసుకోమని వారు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్తులు భానుచందర్, సుదీర్, శశికళ, అరుణాయాకాంబరం, తంగమని, మురళి, బాబు, వాణి, రామన్, నదియా పాల్గొన్నారు. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీలు
● ముడుపులు తీసుకుని బదిలీలు చేశారని వెల్లువెత్తిన ఆరోపణలు ● తప్పిదాల కారణంగా రెండు గంటల పాటు ఆగిన కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయ సర్వేయర్ అసిస్టెంట్ల బదిలీలు గందరగోళంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సర్వే అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించారు. చిత్తూరు సర్వే శాఖ ఏడీ జయరాజ్ ఆధ్వర్యంలో సర్వే అసిస్టెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి సర్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళంగానే సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 398 సర్వేయర్ అసిస్టెంట్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మందికి అన్యాయం జరగడంతో కలెక్టరేట్ భవనంలో అరుపులు.. కేకలు వినిపించాయి. న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ముడుపుల ఆరోపణలు సర్వే అసిస్టెంట్ల బదిలీల్లో పలవురుకి అనుకూలమైన స్థానాలను కేటాయించేందుకు సర్వే శాఖ అధికారులు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో పోస్టింగ్ నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు స్వీకరించారని కౌన్సెలింగ్కు విచ్చేసిన సర్వే అసిస్టెంట్లు ఆరోపించారు. జిల్లాల పునర్విభజన కారణంగా ఆయా జిల్లాల సర్వే అసిస్టెంట్లకు ప్రత్యేకంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే సర్వే శాఖ అధికారులు అలా చేయకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వే అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 120 మంది తిరుపతి జిల్లాకు బదిలీ అయినట్టు సమాచారం. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వే అసిస్టెంట్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సీనియారిటీ జాబితాలో అవకతవకలు సీనియారిటీ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన సర్వే శాఖ అలసత్వం వహించింది. ఆ జాబితా రూపకల్పనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకే ర్యాంక్ను ఇద్దరు సర్వేయర్లకు కేటాయించారు. అలా ఎలా కేటాయిస్తారని సర్వే అసిస్టెంట్లు అధికారులను ప్రశ్నించారు. కనీసం జాబితా ప్రచురించకుండా కౌన్సెలింగ్ నిర్వహించారని ఆరోపించారు. ఈ తప్పిదాల కారణంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రకటించారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని స్వయంగా ఏడీనే ప్రకటించారు. దీంతో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేటప్పుడు సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని సర్వే అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● రూ.1.5 లక్షల విలువచేసే 4 ద్విచక్ర వాహనాల స్వాధీనం నగరి : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ తిరుత్తణికి చెందిన సర్గుణన్(50)ని నగరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏకాంబరకుప్పం పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలలుగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల వరుస చోరీలపై ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు నిఘా పెట్టారు. తమిళనాడు సరిహద్దులో వా హనాల రాకపోకలు రికార్డు అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చోరీదారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇ టీవల ఇద్దరిని అరెస్టు చేయగా సోమవారం మరో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో మండ పం జంక్షన్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. విచారణలో అతను గత కొంత కాలంగా నగరి మున్సిపాలిటీ, ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ వద్ద నాలుగు మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు తెలిసిందన్నారు. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువ చేసే 4 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్టు చెప్పారు. ముద్దాయిపై గతంలో తిరుత్తణి రైల్వే పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది సురేష్, సత్య, గజేంద్ర, అశోక్, లోకనాథం, రమేష్ను అభినందించారు. -
సిఫారసుకే పెద్దపీట
మతలబు ఏంటీ? ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 664 మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆది, సోమవారాలతో కలిపి మొత్తం 469 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టారు. మిగిలిన 195 మందికి చేయలేదు. సీఎం కార్యక్రమం ఉండడంతో వీటిని అనధికారికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హడావిడిగా ఈ ప్రక్రియను ముగించి అధికారులు వెళ్లిపోయారు. మిగిలిన వారికి ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తారో అనే విషయం పై సృష్టత లేదు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు సమాచారం. చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో సిఫారసుకే పెద్దపీట వేశారు. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి చెప్పిన చోటుకు బదిలీ చేశారు. ఏ పలుకుబడీ లేని వారి పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో సోమవారం రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఉద్యోగులు ఆరోపించారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. తమశాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులని ఏమాత్రం గౌరవం లేకుండా ఎస్ఈ కార్యాలయ సిబ్బంది హేయ్, రేయ్, చెప్పింది చేసి పో అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ వారితో అమర్యాదగా ప్రరవర్తించారని ఇంజినీరింగ్ సహాయకులు అసహనం వ్యక్తం చేశారు. ర్యాంకులు పట్టించుకోరు తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోలేదు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. సీనియారిటీ జాబితా లేకుండానే ఏ శాఖలో అయినా సీనియారీ జాబితా ప్రదర్శించి దా ని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాల య ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియారిటీ జాబితా రూపొందించకుండా ప్రాంతాలను కోరుకోమని, వాటి ని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి ర్యాంకు ఉన్నా దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం ముగిసిన కౌన్సెలింగ్లెటర్లు ఉన్నవారికి ప్రాధాన్యం ఎమ్మెల్యే లెటర్లు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. సిఫార్సు ఉన్నవారికి వారు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరికొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫార్సు చేయడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇన్చార్జి ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే ఏ మాత్రం పలుకుబడి లేని వారికి అడిగిన చోటు కాకుండా ఇష్టం వచ్చిన చోటుకు బదిలీ చేశారు. -
ఆలయ స్థలం స్వాధీనం
ఐరాల: ఆక్రమణకు గురైన శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మండలంలోని అగరంపల్లె శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన సర్వే నం.365, 366లో అదే గ్రామానికి చెందిన పీ.దొరస్వామి, పీ.మధు ఆక్రమించుకుని రేకుల షె డ్డు, పెంకుటిళ్లు నిర్మించుకున్నారు. గుంటూరు దేవదాయ, ధర్మాదాయ శాఖ ట్రిబ్యూనల్ వారి ఆదేశాల మేరకు జిల్లా ఏసీ చిట్టెమ్మ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖాల ఆధ్వర్యంలో ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ లోకేశ్వరి పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి బంగారుపాళెం: గుర్తుతెలియని వాహనం ఢీకొ ని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పాలేరు వద్ద చైన్నె–బెంగళూరు జాతీ య రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. బెంగళూరు నగరం కేజీ హళ్లి కి చెందిన సెల్వరాజ్ కుమారుడు శ్యామ్ జయకర్(37) ద్విచక్ర వాహనంపై చిత్తూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో పాలేరు వద్ద గుర్తుతెలియ ని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయశంకర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. యువతి ఆత్మహత్య పుంగనూరు(చౌడేపల్లె): తల్లిదండ్రులు దూరమయ్యారని మనస్తాపం చెందిన ఓ యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని సుబేదారు వీధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. సుబేదారువీధిలో నివాసం ఉన్న షేక్వలిబాషా సుమారు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని భార్య రెండేళ్ల క్రితం మరో వివాహం చేసుకుంది. ఆమె కుమారుడు ఖాజా, కుమార్తె హసీనా తోపాటు మరో చెల్లి నివాసమున్నారు. తండ్రి మృతి చెందడం, తల్లి మరొక వివాహం చేసుకొని దూరమవ్వడంతో హసీనా (19) మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం శవాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పచ్చమేత
● బియ్యం అక్రమ రవాణాలో బరితెగించిన టీడీపీ నేతలు ● పీడీఎస్ బియ్యంతో పాటు టీడీపీ నేతల అరెస్ట్ ● సుమారు రూ.6 లక్షల విలువ చేసే 13 టన్నుల బియ్యం స్వాధీనం నగరి : అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచుకున్న 13 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరి మున్సిపాలిటీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ విక్రమ్ కథనం మేరకు.. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు రేషన్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్ పక్కన ఖాళీ ప్రదేశంలో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. సీఐ తన సిబ్బందిని వెంటబెట్టుకుని రెవెన్యూ అధికారులు, వీఆర్వోతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నాలుగు చిన్న వాహనాలు, ఒక ఐచర్లో లోడ్ చేసి ఉంచిన 13 టన్నుల బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నాయకుడు అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్ఎస్(62), వై.ధనుష్ (19), డీ.బోస్ (20), ఎన్.రోహిత్ (18), వీ.దినేష్ (23), గజేంద్రన్ (20), రాజేష్ అలియాస్ రాజు (25) మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నగరి, నారాయణవనం, పుత్తూరు, పిచ్చాటూరు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరించుకుని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు ఎక్కడకు పంపుతున్నారు.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న చైన్ లింక్ను పూర్తి స్థాయిలో కూపీలాగి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పట్టుకున్నవి ప్రభుత్వ ముద్రతో సీలు ఉన్న బస్తాలే పోలీసులు సోమవారం పట్టుకున్న పీడీఎస్ బస్తాలన్నీ ప్రభుత్వ ముద్రతో సీలున్న బస్తాలే కావడంతో గోడౌన్ నుంచి వచ్చాయా.. రేషన్ షాపుల నుంచి వచ్చాయా అనే అంశాలపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం రాసిన మరణ శాసనం
మద్యానికి బానిసై..కుటుంబానికి దూరమై..! ● కన్నీళ్లు మిగుల్చుతున్న ఘటనలు బంగారుపాళెం: వేళాపాళా లేని మద్యం విక్రయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. తాగుడు మానేయయని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందు బాబులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మద్యం రాసిన మరణ శాసనానికి ఇటీవల జిల్లాలో ముగ్గురు బలయ్యారు. బంగారుపాళెంలో.. పలమనేరు మండలం, జగమర్లకు చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం, నలగాంపల్లెలో ఓ రైతు మామిడితోటలో కాపలాగా ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీ పల్లవి భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో ప్రశ్నించింది. ఈ విషయమై భార్యాభర్తలు గొడవలు పడ్డారు. మొదట భర్త సుధాకర్ విషం తాగాడు. భార్య పల్లవి భయపడి ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ భర్త సుధాకర్ కోలుకున్నాడు. భార్య పల్లవి(23) ఈ నెల 26వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. పాలసముద్రంలో భార్యను చంపిన భర్త పులిచర్లకు చెందిన కార్తీక్, ప్రమీల దంపతులు. ఏడాది క్రితం పాలసముద్రం మండలం తిరుమలరాజపురానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన భర్త కార్తీక్ మద్యం తాగి రావడంతో భార్య ప్రమీల అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య కొడవ సాగింది. కార్తీక్ తాగిన మత్తులో భార్యను తలపై కట్టెతో కొట్టడంతో ఆమె మృతి చెందింది. అతిగా మద్యం సేవించి.. బంగారుపా ళెం దళితవాడకు చెందిన వినాయకం అనే యువకు డు మద్యాని కి బానిసయ్యాడు. దీంతో భార్య దూరమైంది. మే 4వ తేదీ అతిగా మద్యం సేవించి ఓ వైన్ షాప్ వద్దే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లా లో చోటు చేసుకుంటునే ఉన్నాయి. -
మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర
● ఫ్యాక్టరీ యజమానులతో కూటమి నేతల కుమ్మక్కు ● కడుపు మండి.. రైతుల ఆందోళన ● రైతుల దృష్టిని మరల్చేందుకు పెద్దిరెడ్డిపై నిందలు కూటమి సర్కారు దొంగాట ఆడుతూ మామిడి రైతులను నిండా ముంచేసింది. దొంగచాటుగా అధికార పార్టీ నేతల సిఫార్సులకు టోకెన్లు ఇచ్చి సామాన్య రైతులను పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై మామిడి రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న మామిడి చెట్లను నిలువునా నరికేసుకుంటున్నారు. ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో మామిడి కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నా, కనికరించే నాథుడు కరువయ్యారు. కాయలు అమ్ముకోవడానికి రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా నిరీక్షించిన రైతులు కడుపు మండి ధర్నాకు దిగుతున్నారు. ఈ పరిణామాల నుంచి రైతులు, ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి నేతలు, ఎల్లో మీడియాతో కలిసి వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. రెండు రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం ప్రారంభించారు. గుడిపాల మండలం గొల్ల మడుగు వద్ద.. క్యూ కట్టిన మామిడి కాయల వాహనాలుసాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా మామిడి రైతుల అవస్థలు వర్ణనా తీతంగా ఉన్నాయి. ప్రభుత్వం మొదట్లో మామిడి కిలో రూ.12గా ప్రకటించింది. ఆ తరువాత రూ.8 అని చెప్పింది. ఇంకో రోజు రూ.6 అని, ఆ తరువాత రూ.5 అని ఇష్టానుసారంగా రోజుకొక ధర చెబుతూ రైతులను మభ్యపెడుతూ వస్తోంది. ధర లేకపోతే పోనీ ఏదో ఒక రేటుకు కాయలు విక్రయించేస్తామన్న రైతులకు టోకెన్లు ఇవ్వడం లేదు. దానికి టీడీపీ నేతల సిఫార్సులు కావాలి. దీంతో పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. మరి కొందరు రైతులు మామిడి కాయల లోడ్లను తీసుకొచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా వరకు కాయలన్నీ ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. తెల్ల కాగితాలపై సంతకాలు రైతులు పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని కాయలు దించుకుని పంపేస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులు ధర్నాలకు దిగుతున్నారు. గంగాధరనెల్లూరు వద్ద ఓ ఫ్యాక్టరీ యజమాని, అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క దొంగచాటుగా వారికి అనుకూలంగా ఉన్న వారి కాయలను మాత్రం దించుకోవడాన్ని మామిడి రైతులు గమనించారు. వారి తీరుని నిరసిస్తూ ఆదివారం రోడ్డుపై వాహనాలతో మెరుపు ధర్నా చేపట్టారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు వారి దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నేతలే కొందరిని రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇంత దిగజారుడుతనమా? రైతులను ఆదుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా దిగుజారుడు రాజకీయాలకు దిగడం దారుణం. మామిడి దిగుబడులకు మద్దతు ధర కల్పించలేక, రోజుల తరబడి క్యూలో ఉన్న మామిడిని కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ యజమానులు, కూటమి నేతలు కుమ్మకై ్క మామిడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వ తీరుని గమనిస్తున్న మామిడి రైతులు తిరగబడుతున్నారు. దీని నుంచి రైతుల దృష్టిని మరల్చటానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్న దిగజారుడు తనం మరొకటి లేదు, ఉండబోదు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు అడుగడుగునా దగా.. ● ఒక ట్రాక్టర్ కాయలు ఫ్యాక్టరీల వద్ద అన్లోడ్ చేయడానికి 3 రోజుల నుంచి వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. అదే కూటమి నేతలు, అధికారులకు తెలిసిన వారి ట్రాక్టర్లు దొంగ చాటుగా ఒక్క రోజులోనే అన్లోడింగ్ చేసి పంపేస్తున్నారు. ● ప్రస్తుతం ఒక్కో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సుమారు 3 కిలోమీటర్ల దూరం మేర మామిడి కాయల ట్రాక్టర్లు క్యూ కట్టి ఉన్నాయి. ● దీని వల్ల ఒక ట్రాక్టర్లో 5 టన్నుల కాయలతో వస్తే అన్లోడ్ చేసే నాటికి దాదాపు 1.5 టన్ను కాయలు పాడైపోతున్నాయి. ● ఫ్యాక్టరీ యాజమాన్యాలు ట్రాక్టర్ల అన్లోడింగ్ కోసం రోజుకు 100 టోకెన్లు ఇస్తామని చెబుతున్నా కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. ● అన్లోడింగ్ చేసుకుని ఎన్ని టన్నులు దించుకున్నామంటూ రైతులకు బిల్లులు ఇస్తున్నారు. అయితే ఆ బిల్లులో కిలో మామిడి ధర ఎంతో స్పష్టం చేయలేదు. ● దీనిపై రైతుల నుంచి తిరుగుబాటు రాకుండా అంగీకార పత్రంపై రైతు వద్ద నుంచి సంతకం తీసుకుని పంపుతున్నారు. ● దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తర్వాత ఎంత ధర చెల్లించినా రైతులు ప్రశ్నించే అవకాశం లేదు. ● ఒక ట్రాక్టర్కు లోడ్ చేసే మామిడి కాయలు కోయడానికి రైతుకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. బాడుగ (ఐదు రోజులకు) రూ.7 వేలు. ● ఒకవేళ ఐదు రోజుల్లోపు ఫ్యాక్టరీ యాజమాన్యం కాయాలను దించుకోకుంటే, ఐదో రోజు తర్వాత మళ్లీ అదనంగా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు రైతు అదనంగా బాడుగ చెల్లించాలి. ● టీడీపీ కూటమి నాయకులు సిఫారసు చేసిన రైతుకు చెందిన మామిడి కాయల ట్రాక్టర్లను రాత్రి వేళ ఫ్యాక్టరీలోకి పంపి అన్లోడ్ చేసుకుంటున్నారు. సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి రోడ్లపైన వేచి ఉండలేక కొందరు రోడ్డుపైనే కింద పారబోసి వెళ్లిపోతున్నారు. ● ప్రభుత్వం మామిడి కాయలను రైతు నుంచి ఒక కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు 8 రూపాయల లెక్కన ఎక్కడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం ● ర్యాంపుల వద్ద కిలో మామిడి కేవలం రెండు రూపాయలుగా మాత్రమే నిర్ణయించారు. చేసేది లేక రైతులు రూ.2కే అమ్ముకోవాల్సిన దుస్థితి కలిగింది. -
బాబు హామీలు రీ–కాల్!
డీఐఈఓ శ్రీనివాసులును సత్కరిస్తున్న ప్రిన్సిపాళ్లుచిత్తూరు అర్బన్: ‘చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు ప్రజలపై హా మీల వరాలు గుప్పించారు. అప్పటి వరకు సీఎంగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో పాటు మరో 143 పథకాలు అమలు చేస్తామని, సూపర్సిక్స్ పేరిట ఇంకో ఆరు పథకాలు ఇస్తా మని ఊదరగొట్టారు. కానీ సీఎం అయ్యాక ఏడాది పాలనలో ఒక్కటీ అమలు చేయలేదు. అందుకే చంద్రబాబునాయుడు ఇచ్చి న అబద్ధపు హామీలను వివరిస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో (తప్పుడు హామీలు ప్రజలకు గుర్తు చేయడం)’ పేరిట ప్రజల్లో చైతన్యం కల్పిద్దాం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మిన ప్రజలు.. కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మోసపోయారన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ, ఇదే సమయంలో వైఎస్.జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు జరిగిన మేలును వివరించడానికి గ్రామా లు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు నడుం బిగించాలన్నారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డితో కలిసి ఆయన పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు రూ.2.85 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్టు గుర్తుచేశారు. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి నేతలు ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారన్నారు. హామీలు అమలు చేయకపోగా.. వైఎస్సార్సీపీ నేత లు, కార్యకర్తలను హతమార్చడం, దాడు లు చేయడం, విధ్వంసాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి బాధ్యతలను గుర్తుచేసినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్తో బాబు తప్పించుకుంటున్నారన్నారు. తల్లికి వందనం కింద 80 లక్షల మంది లబ్ధిదారులకు నిధులు ఎగ్గొట్టారని, 5 లక్షల మంది రేషన్కార్డులు తొలగించారని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి లాంటి పథకాల ఊసే ఎత్తలేదన్నారు. వీటన్నింటినీ ఇంటింటికీ నయవంచన పేరిట వివరిస్తామన్నారు. 149 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చ లేదు ఆ హామీల విలువ రూ.75 వేల కోట్లు ప్రతీ గడప మెట్లెక్కి.. అబద్ధపు హామీలను వివరిద్దాం చిత్తూరులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరెడ్డి మామిడికి మద్దతు ధర ఏదీ? విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారన్నారు. చిత్తూరు చరిత్రలో మామిడి రైతులు పడుతున్న పాట్లు గతంలో ఎన్నడూ లేవన్నారు. మామిడికి కనీస ధరను అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఫ్యాక్టరీల వద్ద పర్మిట్లను టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. మామిడి రైతుల బాధలు ఆలకించడానికి తమ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి త్వరలోనే జిల్లాకు రానున్నట్టు చెప్పారు. కూటమి నేతలు ప్రతి ఇంటికీ మంజూరు చేసిన అబద్ధపు బాండ్లను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు పెడుతున్న తప్పుడు కేసులను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, ఏ ఒక్క పార్టీ కార్యకర్త భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ చిత్తూరు నగర అధ్యక్షులు కేపీ.శ్రీధర్, హరిణిరెడ్డి, నాయకులు గాయత్రీదేవి, లీనారెడ్డి, ప్రకాష్, జ్ఞాన జగదీష్, ప్రసాద్రెడ్డి, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. -
యూడైస్లో కచ్చితమైన వివరాలుండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో యూడైస్ నివేదికలను కచ్చితమైన వివరాలతో నమోదు చేయాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో శ్రీనివాసులు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్తో మిట్టూరులోని ఆర్కే జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు హొలి స్టిక్ ప్రోగ్రెస్ కార్డులను మెగా పేరెంట్స్, టీచర్ సమావేశం రోజును పంపిణీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న మెగా పీటీఎం సమావేశాలను నిర్వహించాలని తెలిపారు. మూడు నెలల పాటు చిత్తూరు జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవోగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన డీఐఈఓ శ్రీనివాసులును ప్రిన్సిపల్స్ దుశ్శాలువతో సత్కరించారు. -
ఇష్టారాజ్యంగా ఎంఎస్కే బదిలీల కౌన్సెలింగ్
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల (ఎంఎస్కే) బదిలీ కౌన్సెలింగ్లో అదే గందరగోళం నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు సోమవారం కూడా చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 600 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. సాయంత్రం 6 గంటలకు సంగం మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అయితే కౌన్సెలింగ్ సక్రమంగా నిర్వహించడంలేదని, సిఫార్సులు ఉన్న వాళ్లకు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగులు ఇస్తున్నారంటూ పలువురు ఎంఎస్కేలు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకటాద్రి, ఇతర అధికారులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు మెజారిటీ ఉద్యోగులు తిరుపతి అర్బన్, చిత్తూరు అర్బన్ ప్రాంతాలనే కోరుకోవడం.. అక్కడ ఖాళీలు లేకపోవడం, కుప్పంలో 50కు పైగా పోస్టులు ఖాళీ ఏర్పడడంతో ఎవర్ని నియమించాలో తెలియక అధికారులు సైతం ఒకింత గందరగోళానికి గురయ్యారు. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రాంతాలను సోమవారం ఆయన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తుమ్మిశి వద్ద హెలీప్యాడ్, తులసినాయనపల్లి వద్ద బహిరంగ సభా వేదిక, మోడల్ స్కూలు, తిమ్మరాజుపల్లితోపాటు కడపల్లి వద్ద సీఎం నివాసాలను సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సీఎం పర్యటన ముగిసే వరకూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. బారికేడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలలో ఎక్కడికక్కడ చేయాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల్లో సీఎంవో అధికారులు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీపీవో ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసులురాజు, అదనపు ఎస్పీ నందకిశోర్, డీఎస్పీలు రాజ్నాథ్, సాయినాథ్, ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ శివయ్య పాల్గొన్నారు. నేడు చంద్రబాబు కుప్పం రాక కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళ, బుధ వారాల్లో కుప్పంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం శాంతిపురం మండలం, కడపల్లె వద్ద ఆయన సొంతింటికి చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం శాంతిపురం మండలం, తిమ్మరాజుపల్లిలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం తుమ్మిశి వద్ద ఉన్న మోడల్ పాఠశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం కుప్పం వంద పడకల ఆస్పత్రిలో టాటా సంస్థతో ఒప్పందం కుదర్చుకున్న డీఎన్సీ సెంటర్ను ప్రారంభిస్తారు. అనంతరం తుమ్మిశి వద్దనున్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగుప్రయాణమవుతారు. ‘సమగ్ర’ంగా బదిలీల కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆ శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ ఆధ్వ ర్యంలో సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి పో స్టింగ్లు ఇచ్చారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లా లోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న సీఆర్పీ, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్, కేజీబీవీ సిబ్బందికి రిక్వెస్ట్ బదిలీలు నిర్వహించాలన్నారు. సీనియారిటీ జాబితా ఆధారంగా బదిలీలకు 26 మంది దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 17 మంది బది లీల కౌన్సెలింగ్కు హాజరయ్యారన్నారు. ఐదు గురు అన్ విల్లింగ్ ఇవ్వగా, ఇద్దరు గైర్హాజరైన ట్లు చెప్పారు. అంతర్ జిల్లా బదిలీలకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారని, వారికి రాష్ట్ర స మగ్రశిక్ష కార్యాలయంలో బదిలీలు నిర్వహిస్తారన్నారు. సెక్టోరల్ అధికారులు ఇంద్రాణి, శశిధర్, సూపరింటెండెంట్ కుమార్ పాల్గొన్నారు. -
దహనక్రియలకు వెళ్లి వస్తుండగా..
● వేగంగా వచ్చి ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న టాటాఏస్ ● శరీరం నుంచి తెగిపడిన తల శ్రీరంగరాజపురం : గ్రానైట్లోడుతో వేగంగా వచ్చిన వాహనం ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టడంతో శరీరం నుంచి తల వేరుపడి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి దళితవాడకు చెందిన రమేష్ (44) శ్రీరంగరాజపురం మండలంలోని క్షీరసముద్రం గ్రామంలో తమ సమీప బంధువు మరణించడంతో దహనక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్లో బయలుదేరాడు. అయితే 49 కొత్తపల్లిమిట్ట నుంచి గ్రానైట్ లోడ్తో వచ్చిన టాటాఏస్ వాహనం చిత్తూరు పుత్తూరు జాతీయరహదారి మర్రిపల్లి వద్ద రమేష్ బైక్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ శరీరం నుంచి తల తెగి సమీప పొలంలో పడింది. అక్కడికక్కడే రమేష్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. అయితే టాటాఏస్ వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పశువుల కాపరులు తెలిపారు. తాము చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. టాటాఏస్ వేగంగా వచ్చి రమేష్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండలంలోని మర్రిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన రమేష్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శనివారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ మరణించడం బాధాకరమన్నారు. రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. -
నేడు పోలీసు గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో సోమవారం నిర్వహించాల్సిన పోలీసు గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు ఎవ్వరూ కూడా వినతులు ఇవ్వడానికి చిత్తూరుకు రావొద్దని ఆయన సూచించారు. పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా జూలై 1వ తేదీన సామాజిక పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 1వ తేదీన ఉదయం 7 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పంపిణీ కానీ పింఛన్ నగదును రెండురోజుల్లో బ్యాంకుల్లో తిరిగి చెల్లించాలని డీఆర్డీఏ పీడీ తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం గుడిపాల: మండలంలో ఆదివారం కారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో లారీ చైన్నె రోడ్డు నుంచి వేలూరు వైపు తిరుగుతోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు లారీ కిందకు దూసుకెళ్లింది. లారీకి వున్న బంపర్లు తగులుకుని కారు ఆగిపోయింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బైక్ దొంగ అరెస్టు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన రాజేష్ (20) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వన్టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని రెడ్డిగుంట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాజేష్ అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకుని విచారిస్తే.. నగరంలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. తమిళనాడులోని వేలూరు నగరానికి చెందిన రాజేష్ నుంచి రూ.3 లక్షల విలువ చేసే అయిదు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి రిమాండు విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. -
కాళ్లరిగేలా తిరుగుతున్నాం
మాది అనంతపురం. 15ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నాం. భవన నిర్మాణ కూలీలుగా పనిచేసుకుంటూ బతుకీడుస్తున్నాం. ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయికి మా దగ్గర ఉన్న సొమ్ముతో ఇటీవలే పెళ్లి చేశాం. మూడో అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో పది చదువుతోంది. రెండో అమ్మాయి మంచి మార్కులతో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. కానీ, పైచదువులకు పంపాలంటే భయమేస్తోంది. అయితే మాలాగా కష్టం చేయకూడదని బాగా చదివించాలనే కోరిక ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలో రూ.లక్షలు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవదని చెబుతున్నారు. దీంతో అప్పు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. – శారద, భవన నిర్మాణ కూలీ, తిరుపతి వడ్డీకి తెచ్చాం పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థి తి ఏర్పడింది. మా అమ్మా యి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివింది. పదో తరగతి కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించాం. ఏడాదికి హాస్టల్తో పాటు మొత్తం ఫీజు రూ.1.80వేలు కట్టాల్సి వచ్చింది. దాచుకున్న రూ.50వేలకుతోడు మరో రూ.1.30వేలను వడ్డీవ్యాపారుల వద్ద రూ.5లకు వడ్డీకి తెచ్చి కట్టా. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ స్థాయిని అందుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. నేను చిన్న ఉద్యోగిని. నా భార్య దివ్యాంగురాలు. మా కష్టం పిల్లలకు రాకూడదని అప్పు చేసి చదివిస్తున్నాం. – రామకృష్ణ, ప్రైవేటు ఉద్యోగి, గూడూరు -
గందరగోళంగా బదిలీలు
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్లో ఈ ప్రక్రియను ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టారు. చాలీచాలని స్థలంలో బదిలీలు నిర్వహించడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పలువురు రోడ్డు పై నిలబడి కౌన్సెలింగ్ పిలుపు కోసం నిరీక్షించారు. బదిలీ కౌన్సెలింగ్ను ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకుల లేఖలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు నెలకొన్నాయి. తిరుపతి పరిసర మండలాల్లోని పంచాయతీ ఖాళీలను బదిలీ కౌన్సెలింగ్లో డిస్ప్లే చూపకుండా బ్లాక్ చేశారని బాధితులు వాపోయారు. సీనియార్టీలో మొదటి 50 మందికి కూడా తిరుపతి పరసర ప్రాంతాలు చూపించకుండా 50, 60 కి.మీ, దూరంలోని పంచాయతీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంజినీరింగ్ సహాయకుల బదిలీ కౌన్సెలింగ్ భారీ సంఖ్యలో జరిగాయి. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఇంచార్జి ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. స్పౌజ్ కోటాలో సమీప పంచాయతీల ఎంపికకు అవకాశం కల్పించలేదని ఆరోపణలు గుప్పుమన్నాయి. కేంద్రాల్లో ఆందోళన నిబంధనలకు విరుద్దంగా ప్రక్రియ నిర్వహించారని ఉద్యోగులు కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని స్థానాలను బ్లాక్ చేయించినట్లు తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలు చూపకుండా మొక్కుబడిగా కౌన్సెలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ కౌన్సెలింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ ప్రక్రియ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో అభ్యర్థులు ఆందోళనను విరమించారు. టీడీపీ ఎమ్మెల్యేల మితిమీరన జోక్యంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. సిఫార్సులకు పెద్దపీటపై సచివాలయ ఉద్యోగుల నిలదీత కౌన్సెలింగ్ కేంద్రంలో అసౌకర్యాలతో అవస్థలుసౌకర్యాల్లేక ఇబ్బందులు రెవెన్యూ భవన్లో అధికారులు కనీస సౌకర్యాలు కూడ కల్పించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో 664 మంది సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులు ఉన్నారు. 650 చోట్ల ఖాళీలు ఉండగా దాదాపు 450 ఖాళీలు చూపించారని బాధితులు ఆరోపించారు. బదిలీ కౌన్సెలింగ్ సోమవారం కూడా జరగనుంది. -
స్లో బైక్ రైడింగ్ పోటీలు
చిత్తూరు అర్బన్ : రహదారి భద్రతా నియమాలను పాటించడంలో భాగంగా త్వరలోనే చిత్తూరులో స్లో మోటారు సైకిల్ రైడింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు అన్నారు. ఆదివారం నగరంలోని ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో పోలీసులకు ఈ పోటీలపై అవగాహన కల్పించడానికి ట్రయల్ నిర్వహించారు. హెల్మెట్లు పెట్టుకుని, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్న వారు ఎవ్వరైనా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వీలైనంత నిదానంగా వాహనం నడపగలగడమే ఈ పోటీ లక్ష్యమన్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు నమోదు చేసుకున్నారని, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్లు 94910 74515 నంబరుకు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆదివారం జిల్లా కార్యాలయంలో జిల్లాస్థాయి యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, మంచి విద్యను అందించి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించి ప్రభుత్వ పాఠశాలను విద్యా కేంద్రాలుగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం జీఓ 19ని అమలు చేసి 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,652 మోడల్ ప్రాథమిక స్కూళ్లు, 1–10 తరగతుల ఉన్నత పాఠశాలలు 1552, ప్రాథమికోన్నత స్కూళ్లను అప్గ్రేడ్ చేయగా 779 ఉన్నత పాఠశాలలు, ఫౌండేషన్ స్కూళ్లు 5000, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు 19,000 ఏర్పాటు చేశారన్నారు. ఈ విధానం వల్ల ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన స్కూళ్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారానే ప్రభుత్వ విద్యారంగం మనుగడ సాధ్యపడుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు సోమశేఖరనాయుడు, మణిగండన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు చేపడుతున్న నమోదు డ్రైవ్లో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలన్నారు. 10 మంది పిల్లలను చేర్పించిన వారికి మండల స్థాయిలో, 20 మందిని చేర్పించిన వారికి జిల్లాస్థాయిలో అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు ఊరి బడిలో పిల్లలను చేరుద్దాం అనే కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో ఆ సంఘం సహాధ్యక్షులు ఎస్ రెహనా బేగం, కే రెడ్డప్ప నాయుడు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్పీ బాషా, పిఆర్ మునిరత్నం, జిల్లా కార్యదర్శులు ఏ కష్ణమూర్తి, సిపి ప్రకాష్, కె సరిత, టి. దక్షిణామూర్తి, పంటపల్లి సురేష్, ఎం పార్థసారథి, పి సి బాబు, శశి కుమార్, ఎంసీ నిర్మల, తుంబూరు బాలాజీ, సాధన కుమార్, ఎస్ వి రమణ, మోహన్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ‘ఊరి బడిలో పిల్లలను చేరుద్దాం’ కరపత్రిక ఆవిష్కరణ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ -
రోజుల తరబడి పడిగాపులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లల్లో మామిడి పంట వ్యాపించి ఉంది. ప్రధానంగా తోతాపురి 39,895 హెక్టార్లల్లో సాగవుతోంది. తద్వారా 4,9,274 మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అయిందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ దిగుబడులను విక్రయించడానికి ఈ సారి రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. కాయ కోతకోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే పడిగావులు కాస్తున్నారు. వందలాది ట్రాక్టర్లు కాయలతో క్యూ కడుతున్నాయి. ఈ గందరగోళంలో కాయలను అన్లోడింగ్ చేసేందుకు రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. -
నేడు ‘రీకాల్ బాబు మేనిఫెస్టో’ పోస్టర్ ఆవిష్కరణ
చిత్తూరు కార్పొరేషన్ : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు మరిచారని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం దీనిపై పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పోస్టర్ను విడుదల చేయనున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణకర్రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రాజశేఖర్రెడ్డి ముఖ్య అతిథులుగా వస్తారన్నారు. బాబు ఘ్యూరిటీ..మోసం గ్యారెంటీ అనే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల హామీల ద్వారా ప్రజలు పొందాల్సిన లబ్ధి ఇతర విషయాలు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, క్షేత్రస్థాయిలో నిర్వహణ తదితర అంశాలపై ముఖ్య నాయకులు దిశా నిర్దేశం చేస్తారన్నారు. నియోజకవర్గంలోని నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజయానందరెడ్డి కోరారు. -
నేటి నుంచి పుర కార్మికుల సమ్మె ఉధృతం
చిత్తూరు అర్బన్ : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం కార్మికులు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్, ఇతర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదన్నారు. సోమవారం నుంచి కార్మికులు ఎవరూ నీటి సరఫరా విధులకు హాజరుకాబోరని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళుతున్నట్లు కమిషనర్కు స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శరవణ, శివకుమార్, వెంకటేష్, హరికృష్ణ పాల్గొన్నారు. -
జర్నలిస్టులపై కేసులు .. స్వేచ్ఛను హరించడమే
చిత్తూరు అర్బన్: పత్రికల్లో వార్తలు రాసినందుకు గాను జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు ఎం.లోకనాథన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కేఎం.అశోక్కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదుల వస్తే వాటిలో వాస్తవాలు విచారించి ఆపై పోలీసులు నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠను కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఓ వార్త రాసినందుకు గాను స్థానిక సాక్షి రిపోర్టర్ నాగరాజు పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం .. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయంపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ చందోలుతో చర్చించారు. జర్నలిస్టులను యాజమాన్యాలతో ముడి పెట్టొద్దని.. తమను పాత్రికేయులు గానే గుర్తించి.., హక్కులను రక్షించడానికి పోలీసు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పాత్రికేయులు పనిచేస్తున్నారని తెలిపారు. పాత్రికేయుల హక్కులు, కలం గౌరవాన్ని కాపాడాలని కోరారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీని సైతం రూపొందిస్తామని ఇటీవల కలెక్టర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడూ ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎస్పీ స్పష్టం చేశారు. పత్రికల్లో వార్త రాయడంతో పాటు వాటిని ఉదేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగారు అనే ఫిర్యాదు పైనే కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నారు. విచారణలో సంబంధిత రిపోర్టర్ ప్రమేయం లేదని తేలితే తదుపరి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. పాత్రికేయుల రక్షణ కోసం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని తాము కచ్చితంగా పాటిస్తామన్నారు. కలెక్టర్తో మాట్లాడి పాత్రికేయులపై దాడుల నివారణ కమిటీని సైతం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
జాండ్లవారిపల్లె సర్పంచ్ ఆత్మహత్య
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలం, జాండ్లవారిపల్లె పంచాయతీ సర్పంచ్ నాగిరెడ్డి (67) ఆత్మహత్యకు పాల్పడారు. ఈ మేరకు మృతుని కుమారుడు డీ.కిరణ్కుమార్రెడ్డి రొంపిచెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24న సర్పంచ్ దేవులపల్లె నాగిరెడ్డి తన కారులో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. జాండ్లవారిపల్లె సమీపంలో వెళ్తుండగా ఫోన్ వచ్చింది. గ్రామానికి అర కిలో మీటరు దూరంలో కారు దిగేశారు. బుధవారం కూడా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెందారు. శనివారం ఉదయం గ్రామానికి సమీపంలోని ఒట్టిగుట్ట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నాగిరెడ్డి శవాన్ని గుర్తించారు. తన తండ్రికి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుందని, దాని బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగిరెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు సర్పంచ్ దేవులపల్లె నాగిరెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మృతుడు నాగిరెడ్డి దహనక్రియలకు హాజరయ్యారు. నాగిరెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కరీముల్లా, ప్రేమానందం, రవీంద్ర, సూర్యనారాయణరెడ్డి, యుగంధర్ రెడ్డి, కోటా వెంకటరమణ, లక్ష్మీప్రసాద్రెడ్డి, అశోక్రెడ్డి, విజయశేఖర్ పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసాల మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి సూచించిన పెద్దిరెడ్డి, భూమన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ మేనిఫెస్టో బాండ్లను ఇచ్చి మోసగించిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్య క్షులు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి మారుతీనగర్లోని పెద్దిరెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు బొర్ర మాదవిరెడ్డి తదితరులు శనివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి దుస్సాలువలు కప్పి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించడంలో మహిళా విభాగం కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అన్నీ చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా, మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్న విషయాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు. -
అవినీతి కూటమి
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగాధరనెల్లూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ను దోచుకుంటున్నారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు హరీష్యాదవు ఒక క్వారీ యజమాని నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని గుర్తుచేశారు. పాలసముద్రం, శ్రీరంగరాజపురం మండలాల్లో గుట్టలను మాయం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ చేపట్టాలి ఎమ్మెల్యే థామస్ చేస్తున్న అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. మామిడికి పరిశ్రమలు అందించే టోకన్లు సైతం బ్లాక్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. -
విలీనంపై రగడ
బైరెడ్డిపల్లె: తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేయడంపై మండలంలోని మిట్టపల్లె గ్రామస్తులు శనివారం పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అయితే ఇందులో 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలో మీటర్ దూరంలోని నాగిరెడ్డిపల్లె పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు వ్యవసాయపొలాల గుండా వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 20 రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం లేదన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. సుమారు 30 నిమిషాల పాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బైరెడ్డిపల్లె ఎస్ఐ పరశురాముడు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ, ఎంఈఓ సుబ్రమణ్యంకు వినతి పత్రం అందజేశారు. -
వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ
గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 355 మంది హాజరయ్యారు. 7శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,229 మంది స్వామి వారిని దర్శించుకోగా 30,559 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ‘అన్నమయ్య పదామత వర్షణి’ కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. చిత్తూరుఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో -
ఇళ్లు, విల్లాలపై పడి దోచుకుంటున్న దొంగలు ఇప్పుడు కొత్త రూటును ఎంచుకుంటున్నారు. ఇటీవల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా రైలు ప్రయాణికులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్లీపర్ క్లాసుల్లోని ప్రయాణికులనే ఎంచుకుని చెలరేగిపోతున్నారు. స
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఒంటిపై ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించడం మంచిది కాదు. ● ఆభరణాలు వేసుకున్నా బయటకు కనిపించకుండా చూసుకోవాలి. ● విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ను పక్కవారికి అప్పగించడం, రైల్లోనే వదిలేసి రైలు ఆగిన సమయంలో ప్లాట్ఫాం మీదకు వెళ్లడం వంటివి చేయరాదు. ● విలువైన వస్తువులు కర్ర సంచుల్లో నిర్లక్ష్యంగా ఉంచి తీసుకెళ్లడం మంచిది కాదు. ● బ్యాగులు, సూట్ కేసులకు చైన్లాక్ సిస్టంను వేసుకోవాలి. ● అపరిచిత వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలను తినరాదు. ● రాత్రి వేళల్లో ప్రయాణించే సమయంలో కిటికీలు మూసుకోవాలి. ● అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే డయల్ 100, రైల్వే పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 1082 లేదా 139కు సమాచారం అందించాలి. రైళ్లలో రాత్రివేళ చెలరేగిపోతున్న దొంగలు ● బంగారు నగలే లక్ష్యంగా దోపిడీ ● సిగ్నల్ ట్యాంపరింగ్తో చోరీలు ● రెండు నెలల్లో మూడు ఘటనలు ● దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు ● ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు ఏసీల కంటే స్లీపర్ క్లాస్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా రైల్వేస్టేషన్లో సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగుల లైట్స్కు సంబంధించి బాక్స్లో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. స్టేషన్ టు స్టేషన్ (మిడ్ స్టేషన్) మధ్యలో ఉండే సిగ్నల్ మానిటరింగ్ వ్యవస్థలో రెడ్, గ్రీన్ లైట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో గ్రీన్ లైట్ వైర్ను దొంగలు తీసివేస్తున్నారు. ఆ సమయంలో సిగ్నల్ చూపితే రెడ్లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ సిస్టమ్ను కనుక్కొని దొంగల ముఠా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు ● మే 2న రాత్రి 10.30 గంటలకు ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైంది. రెడ్లైట్ వెలుగుతుండడంతో రైలు ఆగిన తర్వాత కొందరు దుండగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇద్దరి ప్రయాణికుల మెడలో బంగారు గొలుసులు తీసుకొని పారిపోయారు. ● మే 14న వేకువజామున 2.30 గంటలకు అదే ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో మళ్లీ హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేశారు. కొందరు రైలు బయట నుంచే బంగారు గొలుసులు దొంగలించారు. ● జూన్ 26 వేకువజామున 2.30 గంటలకు సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ గురవ్వడంతో రైలును ఆపేశారు. కొంతమంది ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంచుకొని వెళ్లారు. ఈ మూడు దొంగతనాల్లో 10 మంది మహిళల మెడల్లోని దాదాపు 120 గ్రాముల పైగా బంగారాన్ని కాజేశారు. చిత్తూరు కార్పొరేషన్: రైలు ప్రయాణమంటేనే ఉమ్మడి జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలు తలుచుకుని భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం.. కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడంతో దొంగలకు వరంగా మారింది. ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీల నివారణ కష్టతరమవుతోంది. ఎక్కువగా రాత్రి 10.30 నుంచి వేకువజామున 3 గంటల లోపు దొంగతనాలు జరగుతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. కిటీకీల వద్ద నగలు చోరీ చేసి పరారవుతున్నారు. బంగారు నగలే లక్ష్యం రైళ్లలో చిల్లర దొంగతనాలు పాత పద్ధతి. ఇప్పుడు దొంగలు రూట్ మార్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారాన్ని చాకచక్యంగా కొట్టేసేందుకు పూనుకుంటున్నారు. ఊర్లకు వెళ్లేటప్పుడు మహిళలు ఆభరణాలు ధరించుకువెళ్లడం అలవాటుగా మారిన నేపథ్యంలో దొంగలు వారినే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా రైలు కిటికీల నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దోచుకెళ్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, రోడ్డుకు దగ్గర్లో ఉండే స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిమిషాల్లో తమ పనికానిచ్చేస్తున్నారు. మహారాష్ట్ర ముఠాగా అనుమానం వరుస దొంగతనాల వెనుక మహారాష్ట్ర (పార్థీ గ్యాంగ్) ముఠాకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్లలో నేరాలకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. వీరు 4–8 మంది దొంగతనానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. చిత్తూరు రూరల్ మండలం, సిద్ధంపల్లె స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనలో వేకువజామున 2.30 గంటలకు రైలు ఆగింది. దుండగలు రైలు వెలుపల ఒకరు వెనుక ఒకరు ఉన్నారు. ఒకరి భుజం పై మరొకరు కూర్చొని తెరిచిన కిటికీల్లో టార్చ్ వేస్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపారు. ఇలా ఎస్–7, 10 బోగిల్లో నలుగురి వద్ద 60 గ్రాముల వరకు బంగారం దోచుకున్నారు. రైలులో ఉండే బీట్ పోలీసులు విజిల్స్ వేసే లోపల దొంగలు తప్పించుకున్నారు. ఘటన జరిగిన అర గంటలో రైల్వే పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అరకొరగా ఎస్కార్ట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరకొరగా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క స్టేషన్ నుంచి ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్లో 3 నుంచి 4 రైళ్లను కవర్చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్ఫీఎఫ్ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను కవర్చేసే విధంగా ఉంటే భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్పీఎఫ్ విభాగానికి చెందిన వారి విధులు బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి. రైళ్లలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నా జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత స్లీపర్క్లాస్లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రలోకి జారుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలులో కడప రైల్వేస్టేషన్ వరకు ఇద్దరు ఎస్కార్ట్గా వచ్చి కడపలో దిగుతున్నారు. కట్ చేసిన సిగ్నల్ వైర్ గస్తీ ముమ్మరం రైళ్లలో దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వివిధ బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటాం. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమ్తతంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు జరగకుండా ప్రతి రైల్వే స్టేషన్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులు సహకరించాలి. – హర్షిత, రైల్వే డీఎస్పీ, గుంతకల్లురేంజ్ రెండు నెలల్లో మూడు రాబరీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో మూడు రాబరీలు జరిగాయి. ఇందులో రెండు తిరుపతి జిల్లాలోని ముంగలిపట్టు వద్ద కాగా మరొకటి చిత్తూరు జిల్లా సిద్ధంపల్లె సమీపంలో చోటు చేసుకుంది. చిత్తూరులో ఇటువంటి దోపిడీ జరగడం ఇదే మొదటి సారి. కానీ ఈ దొంగతనాల్లో దాదాపు రూ.15 లక్షల విలువైన 120 గ్రాముల బంగారం దొంగతనం జరిగినట్లు సమాచారం. ఇటీవల చిత్తూరు రూరల్ పరిధిలో జరిగిన రాబరిపై పోలీసులు ప్రత్యేక బృందంగా విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్, యాక్టివ్ క్రిమినల్స్ గురించి ఆరా తీస్తున్నారు. -
మత్తు వదలాలి.. భవిష్యత్ మారాలి
చిత్తూరు అర్బన్: యువత మత్తు వదిలి.. భవిష్యత్ బంగారు బాట పట్టేలా అడుగులు వేయాలని కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భారతి పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం–అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహం నుంచి దర్గా సర్కిల్, చర్చివీధి మీదుగా ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలైతే జీవితం చిత్తవుతుందన్నారు. గంజాయి జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో అవగాహన తీసుకోవాలన్నారు. మత్తు వదిలేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చిత్తూరులో మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీ -
ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు!
పుత్తూరు: పట్టణంలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.151 కోట్ల వ్యయంతో నాటి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు పట్టణానికి అత్యాధునిక గ్యాస్ ఆధారిత శవ దహనవాటిక (ఎలక్ట్రికల్ క్రమటోరి యం షెడ్డు)ను ఏర్పాటు చేయించారు. శ్మశాన వాటిక మధ్యలో రోజా చారిటబుల్ ట్రస్ట్చే ముక్తి ప్రదాత శివుని భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణ కైలాస ముక్తిథామం అని నామకరణం చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది తిరక్క ముందే రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన క్రమటోరియం మిషన్లు పాడై పోయాయని షెడ్కు తాళాలు వేశారు. దీంతో మృత దేహాలను మళ్లీ పిడకలపై కాల్చే పాత పద్ధతికి శ్రీకా రం చుట్టినట్లైంది. పాడైన విషయం తెలియని ప్రజలు మృతదేహాలతో శ్మశాన వాటికలోకి వచ్చేస్తున్నారు. తీరా ఇక్కడి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని అప్పుడు పిడకల కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. గొయ్యి తీసి పూడ్చేందుకు మనుషులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తంతు గత నెల రోజులుగా జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఎలక్ట్రికల్ క్రమటోరి యం మిషన్లు మరమ్మతు చేయించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేసి ఎలక్ట్రికల్ క్రియేషన్ షెడ్ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తాం ఎలక్ట్రికల్ క్రమటోరియం షెడ్లో ఓ మోటారు తో పాటు రెండు సెన్సార్లు పనిచేయడం లేదు. వీటిని చైన్నెకి చెందిన కంపెనీ వారు ఏర్పాటు చేశారు. అదే కంపెనీ వారిని మరమ్మతులకు పిలిచాం. రెండు రోజుల్లో వస్తామని చెప్పి ఉన్నా రు. వారు వచ్చిన వెంటనే మరమ్మతులు పూర్తి చేసి, షెడ్ను వినియోగంలోకి తీసుకొస్తాం. – ఎం.మంజునాథ్గౌడ్, కమిషనర్, పుత్తూరు మున్సిపాలిటీ -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
విజయపురం : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23వ తేదీ భూ తగాద కారణంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేశ్వరన్ (55) హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ సయ్యద్ అబ్దుల్ అజీజ్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడు తిరుత్తణి తాలూకా అరుంబాకం గ్రామానికి చెందిన వెంకటేశ్వరన్, అదే కాలనీకి చెందిన వెంకటేశన్కు గత 12 సంవత్సరాలుగా భూ తగాదా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ వెంకటేషన్, తన ఇద్దరి కుమారులు ప్రభు, సేత పాతర్కాడు సమీపంలో కొబ్బరి తోట వద్ద వెంకటేశ్వరన్ను కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వెంకటేషన్ను అరెస్టు చేశారు. అతని ఇద్దరి కుమారులు పరారీలో ఉన్నారు. ఈ కేసు ఛేదించడంలో సహకరించిన సీఐ భాస్కర్, ఎస్ఐ రంగా, గోవిందరాజులు, సుబ్రమణ్యం, నరేష్, సత్యరాజ్, మణివల్లన్, అయ్యప్ప, శశికుమార్, దామోదరం, హరి, ప్రసాద్, లక్ష్మయ్యను డీఎస్పీ అభినందించారు. -
ఐదుగురు జూదర్ల అరెస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్దకొండామర్రి చెరువు కింద గల పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడులు చేయగా కేశవరెడ్డి, శ్రీనివాసులు, ముకుంద, లక్ష్మన్న, సహదేవను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,100 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తపాలా బీమా ఏజెంట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని తపాలాశాఖ పరిధిలో బీమా ఏజెంట్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. పదో తరగతి పాసై 18 ఏళ్లు దాటిన వారు ఇందుకు అర్హులన్నారు. తపాలా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలను బుక్ చేయాలన్నారు. ఆసక్తిదారులు జూలై 5వ తేదీ లోపు కార్యాలయ పనివేళల్లో చిత్తూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బంగారుపాళెం: విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మ హిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువా రం మృతి చెందినట్లు ఏఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపారు. ఏఎస్ఐ కథనం మేరకు.. పలమనేరు మండలం జగమర్ల గ్రామానికి చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం నలగాంపల్లెకు చెందిన శ్యామల మామిడితోటలో కాపలాగా ఉన్నారు. ఈ నెల 22న భర్త సుధాకర్ మద్యం సేవించి రావడంతో భార్య పల్లవి ప్రశ్నించింది. ఈ విషయంపై భార్య, భర్త గొడవలు పడ్డారు. దీంతో సుధాకర్ మొదట విషం తాగాడు, భయపడిన పల్లవి కూడా విషం తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు భార్యాభర్తలను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. భర్త సుధాకర్ కోలుకోగా, భార్య పల్లవి(23) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఐరాల: రోడ్డు ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎం.పైపల్లె వద్ద గురువారం చోటు చేసుకుంది. కాణిపాకం ఇన్చార్జి ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని మామిడిగుంట్లపల్లెకు చెందిన ఏ.ప్రకాష్(42) కాణిపాకం ఆలయంలో ఔట్ సోర్సింగ్ హెల్పెర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో చిత్తూరుకు సొంత పనుల నిమిత్తం బయలుదేరాడు. మండలంలోని చిన్నవెంకటంపల్లెకు చెందిన నరసింహారెడ్డి ఓ కారులో చిత్తూరు నుంచి ఐరాల వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డి అతివేగంగా కారు నడుపుతూ ఎం.పైపల్లె వద్ద ద్విచక్రవాహనంలో వెళుతున్న ప్రకాష్ను కారుతో ఢీకొన్ని, వెనుక వస్తున్న ఆటోను ఢీకొన్ని కొంత దూరం కారుతో లాక్కొని వెళ్లి ఓ చెట్టుకు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటోలో ఉన్న మండలానికి చెందిన జుబేరా కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను ఓ ప్రైవేటు వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రకాష్ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం జుబేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టమ్ అనంతరం ప్రకాష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి మురగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ మృతికి కాణిపాకం ఆలయ సిబ్బంది ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. -
అంతా మా ఇష్టం!
● కుప్పం లైనింగ్ పనుల్లో రూ.169 కోట్ల పనులు ఆ ఇద్దరికే! ● ఇద్దరితో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ సాధ్యమా? ● ఏరికోరి వారినే నియమించిన ఉన్నతాధికారులు మదనపల్లె: వడ్డించే వాడు మనోడైతే ఏ బంతిలో ఉన్నా కొరవుండదన్న సామెత హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగమైన చిత్తూరు జిల్లా కుప్పం ఉపకాలువ లైనింగ్ పనులకు అతికినట్టు సరిపోతుంది. ఈ లైనింగ్ పనులు చేపట్టింది అనకాపల్లె ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, అందులోనూ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఇక చెప్పేదేముంటుంది. ఎవరెమనుకున్నా సరే మనోళ్లు, మనం చెప్పినట్టు వినేవాళ్లకు పనులు అప్పగిస్తే..ఇక అడ్డు అదుపు ఉండదనుకున్నారేమో.. సరిగ్గా అదే జరిగింది. రూ.169 కోట్ల విలువైన పనులను చూసే బాధ్యతను కేవలం ఇద్దరంటే ఇద్దరే అధికారులకు అప్పగించి, ఉన్నతాధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. అంతటిలో ఆగలేదు..మీ పనులు మీ ఇష్టం అన్నట్టుగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేశారన్న విమర్శలు వినిస్తున్నాయి. డివిజన్ అధికారిని తప్పించేసి.. హంద్రీనీవా ప్రాజెక్టు సబ్ డివిజన్ కేంద్రం కుప్పంలో ఉంది. దీనికి సెల్వరాజ్ డీఈగా స్థానికంగా ఉండి పని చేస్తున్నారు. వాస్తవానికి కుప్పం ఉపకాలువ లైనింగ్ పనుల్లో ఈయన కీలకంగా పని చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థకు నచ్చలేదో లేక చెప్పినట్టు పని చేయరని అనుకున్నారో కాని కుప్పం లైనింగ్ పనుల బాధ్యత వహించాల్సిన సెల్వరాజ్కు ఒక్కశాతం బాధ్యత లేకుండా పూర్తిగా తొలగించి, పక్కన పెట్టారు. అయితే పూర్తిగా బాధ్యతలు అప్పగించకపోతే వివాదం రేగుతుందని అనుకున్నారేమో ఆయనకు చిత్తూరు జిల్లాలో పని కల్పించకుండా అన్నమయ్యజిల్లాలో జరుగుతున్న పుంగనూరు ఉపకాలువ పనుల్లో 12 కిలోమీటర్ల బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకున్నారు. అంతా ఆ ఇద్దరికే.. రూ.169 కోట్ల విలువ కలిగిన 90 కిలోమీటర్ల కాలువ పనులు..అందులో లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులు కీలకమైనవి. అయితే ఉన్నతాధికారుల కనుసన్నల్లో పనుల అప్పగింత వ్యవహారం సాగింది. పీబీసీ పనుల్లో ఐదుగురు డీఈఈలను నియమిస్తే..కుప్పం పనులకు అంతేమందిని నియమించాలి. అయితే ఇక్కడ నిబంధనలు పని చేయలేదు. డీఈ సెల్వరాజ్ను తప్పించాక..ఏరికోరి ఇద్దరికి బాధ్యతలు ఇచ్చారు. 90 కిలోమీటర్ల కాలువ పనులకు ఒకే ఒక్క డీఈగా గోవర్దన్ను, ఒకే ఒక్క ఈఈగా వెంకటేశ్వర్లును నియమించారు. ఎక్కువ మంది ఉండాల్సిన జేఈల సంఖ్య కేవలం నాలుగుకే పరిమితం చేశారు. మిగిలిన ఎవరికీ ఈ పనుల్లో భాగస్వామ్యం కానీ, బాధ్యతలు కానీ అప్పగించకుండా దూరంగా ఉంచేశారు. కుప్పం లైనింగ్ పనులకు ఒక ఈఈ, ఒక డీఈకే పూర్తి కాలువ బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు మరి పుంగనూరు ఉపకాలువ విషయంలో అలా వ్యవహరించలేకపోడం వెనుక కారణాలేమిటన్నది చర్చనీయాంశమైంది. ఇక్కడ ఐదుగురు డీఈలకు బాధ్యతలు ఇస్తే..90 కిలోమీటర్లకు ఒకే డీఈకి ఎలా బాధ్యత ఇచ్చారో..ఒక్కరే ఇంత పని ఎలా నిర్వహిస్తారని ఉన్నతాధికారులు భావించారో అర్థంకాని వ్యవహారంగా మారింది. పీబీసీ పని నామినేషన్పై అప్పగిస్తే..కుప్పం పనిని టెండర్ ద్వారా రెండు రీచ్లుగా పనులు చేపట్టారు. ఇలా అయినా కనీసం ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈలైనా ఉండాలి. అలా కూడా లేకుండా ఒక్క డీఈనే నియమించారు. పనులపై అనుమానాలెన్నో కుప్పం ఉపకాలువలో జరుగుతున్న లైనింగ్ పనులు కేబీసీ లైనింగ్ పనులివీ.. కుప్పం ఉపకాలువ(కేబీసీ)లో లైనింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక రెండు కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొనగా అందులో రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థ అదనంగా టెండర్ దాఖలు చేయడంతో ప్రభుత్వం దాన్నే ఖరారు చేసి పనులు అప్పగించింది. రెండు రీచ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం రూ.169,80,935తో 90.393 కిలో మీటర్ల కాలువకిరువైపులా సిమెంట్ లైనింగ్, అందులో 26.391 కిలోమీటర్లు షార్ట్ క్రీటింగ్ పనులు పూర్తి చేయాలి. మిగిలిన 64.002 కిలోమీటర్లు లైనింగ్ చేయాలి. ఈ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయించాలన్నది లక్ష్యం. ఇందుకోసం పూర్తిస్థాయి సాంకేతిక అధికారులను నియమించి, పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాల పాటింపు, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. అంటే ఇందుకు తగినంతమంది అధికారులను నియమించాలి. అయితే ఇక్కడ నిక్కచ్ఛిగా పనిచేసే అధికారులు అవసరం లేదనుకున్నారు. అంతే అయినవారికి పనులు అప్పగించేశారు. కుప్పం ఉప కాలువ పనులను 2015లో చేపట్టిన అప్పటి టీడీపీ ప్రభుత్వం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట సంస్థలోకి సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థకు భాగస్వామ్యం కల్పించడంతో పనుల వ్యవహారం అస్తవ్యస్తంగా మారడమే కాకుండా రూ.122 కోట్లను అదనం పేరుతో దోపిడీ చేశారు. ఈ పరిస్థితుల్లో లైనింగ్ పనుల కాంట్రాక్టు రిత్విక్ సంస్థకు దక్కడంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనుల పర్యవేక్షణ కేవలం ఒక డీఈకే అప్పగించడం, వాటి వివరాల నమోదు, నాణ్యత పరిశీలన తదితర అంశాల్లో పారదర్శకంగా సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది.పది మంది జేఈలు కుప్పం లైనింగ్ పనులకు ఒకే డీఈ, ఒకే ఈఈకి అప్పగించడం, కేవలం నలుగురు జేఈలే ఉన్నారన్న అంశంపై ప్రాజెక్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. పది మంది జేఈలు పని చేస్తున్నారని చెప్పారు. పనులను పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. -
టీడీపీలో కుమ్ములాట
పాలసముద్రం : మండలంలోని తెలుగుదేశం గ్రామ స్థాయి కమటీల నియామకంలో గురువారం శ్రీకావేరిరాజుపురంలో జరిగిన కార్యక్రమంలో మండలంలో ఇరువర్గాలు కుమ్ములాడుకున్నాయి.. టీడీపీ పాలసముద్రం మండల అధ్యక్ష పదవికి మండలంలో నెల రోజులుగా ఎమ్మెల్యే, చిట్టిబాబు నాయుడు వర్గాల నడుమ విబేధాలు ఎక్కువయ్యాయి. పార్టీ మండల అధ్యక్ష పదవికి అధిస్థానం గ్రామస్థాయి కమిటీ నమోదు చేసుకుని, అందులో ఎక్కువ మంది ఎవరికి అమోదం తెలుపుతారో అతన్ని మండల అధ్యక్షుడిగా నియమించకోవచ్చని చెప్పడంతో మండంలో ఎమ్మెల్యే.. చిట్టిబాబు నాయుడు ఇరుఇర్గాలు గ్రామస్థాయి కమిటీ నియామకానికి కుమ్ములాడుకుంటున్నాయి. కమిటీ నమోదు చేయడానికి వచ్చిన అబ్జర్వర్లు కూడా నాయకులు చేస్తున్న గొడవలు చూసి గ్రామస్థాయి కమిటీలు నియామకం చేయకుండా పేరు నమోదు చేసుకుపోతున్నారు. మండలంలో ఎమ్మెల్యే ఎవరిని అమోదిస్తారో వారికే మండల అధ్యక్ష పదవి వస్తుందని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. కొలమాసనపల్లి అడవిలో పేకాట పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి, గొల్లపల్లి అటవీప్రాంతంలో రహస్య ప్రదేశంలో పేకాట సాగుతోందని తెలిసింది. కొందరు అధికారపార్టీ అండతో పేకాటను నడిపిస్తున్నట్టు సమాచారం. అడవిలోని రహస్య ప్రదేశంలో స్థానికులే కాకుండా బయట రాష్ట్రాలకు చెందిన వారు సైతం వచ్చి ఇందులో పాల్గొంటున్నట్టు తెలిసింది. గతంలో ఇదే అడవిలో పేకాట ఆడుతుండగా స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచి సిబ్బంది మూకుమ్మడి దాడులు చేసి, పేకాటరాయుళ్లను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్పీ పీడీ యాక్టు నమోదు చేసి జిల్లా బహిష్కరణ సైతం విధించారు. మళ్లీ కూటమి రాకతో ఓ పోలీసు కానిస్టేబుల్ సహకారంతో ఓ వ్యక్తి అడవిలో జూదం నడిపిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడికి నిత్యం పెద్దసంఖ్యలో జూదగాళ్లు బైకులపై వచ్చి వాటిని రహస్యంగా దాచి అక్కడి నుంచి కాలినడకన వెళ్లి ఆటలో పాల్గొంటున్నారని సమాచారం. ఈ అడవిలోకి వెళ్లే మార్గంలో ఎవరు లోనికొస్తున్నారని తెలుసుకొని సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఇరువురు ఏజెంట్లు ఉన్నట్టు తెలిసింది. వీరు ఈలలు వేయడం, సెల్ఫోన్ ద్వారా మెసేజ్ లివ్వడం ద్వారా జూదగాళ్లకు వద్దకు ఎవరూ వెళ్లకుండా కాపుగాస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికారులైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు. గురుకుల టీచర్లకు బదిలీలు నిర్వహించాలి చిత్తూరు కలెక్టరేట్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీజీటీ, పీజీటీలకు బదిలీలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం కోరారు. ఆ సంఘ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ పద్మజను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా, టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు సకాలంలో జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఆర్జేసీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటం ప్రదర్శించాలన్నారు. ఆరో తరగతి పాఠ్యాంశాల్లో అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు డీసీఓను శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు మురళి, భాస్కర్, షణ్ముగం, పొన్నయ్య, సంతానం తదితరులు పాల్గొన్నారు. -
సెలవు విషయంలో నిమిషానికో నిర్ణయం
టీడీపీలో కుమ్ములాట శ్రీకావేరిరాజపురంలో టీడీపీ గ్రామస్థాయి కమిటీ నియామకంలో ఆ పార్టీలోని ఇరువర్గాలు కుమ్ములాడుకున్నాయి.● గందరగోళం సృష్టించిన డీసీఈబీ ● బడులు వదిలేశాక పాఠశాలలున్నట్లు మెసేజ్లు ● నేడు పాఠశాలలు పనిచేస్తాయి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఉ మ్మడి పరీక్షల విభాగం (డీసీ ఈబీ) శాఖ పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జి ల్లాలోని పాఠశాలలకు ఈ నె ల 27వ తేదీన సెలవు ప్రకటించే విషయంలో డీసీఈబీ అధికారులు గందరగోళం సృష్టించారు. ఆ శాఖ సెక్రటరీ బుధవారం డీసీఈబీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అకడమిక్ క్యాలెండర్లో ఇవ్వాల్సిన ఐదు ఆప్షనల్ సెలవులతో నిర్ణ యం తీసుకున్నారు. తొలి ఆప్షనల్ సెలవుగా ఈ నె ల 27వ తేదీన జిల్లా మొత్తానికి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి ఆప్షనల్ సెల వు అనేది జిల్లా మొత్తానికి వర్తించదని, స్కూల్ యూనిట్కు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కచ్చితంగా ఆప్షనల్ సెలవును లీప్ యాప్లో నమోదు చే యాలని చెప్పారు. లేని పక్షంలో ఆబ్సెంట్గా పరిగణిస్తామని తెలిపారు. ఈ ఆదేశాలు పాఠశాలలు ముగిసిన తర్వాత పంపారు. ఆర్జేడీ మరో మెసేజ్ ఈ ఆప్షనల్ సెలవు విషయంలో వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ మరో మెసేజ్ పంపారు. ఆ ప్షనల్ సెలవు అనేది కేవలం ఉద్యోగి వ్యక్తిగతమని, ఇది పాఠశాల మొత్తానికి సంబంధించింది కాద ని పేర్కొన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో పాఠశాలలకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు ప్రకటించకూడదన్నారు. ఈ ఆదేశా లు కమిషనర్ ఉత్తర్వుల మేరకు తెలియజేస్తున్న ట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఆదేశాలు జా రీ చేస్తూ గందరగోళం సృష్టించారు. ఆప్షనల్ సెలవులను అమలు చేసే విషయం విద్యాశాఖ అధికారులకు ముందస్తుగా తెలియదా? అని పలువురు టీచ ర్లు ప్రశ్నిస్తున్నారు. నిమిషానికి ఒక ఆదేశం ఇచ్చి గందరగోళం ఎందుకు సృష్టించాలని మండిపడుతు న్నారు. డీసీఈబీ సెక్రటరీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదని టీచర్లు మండిపడుతున్నారు. చివ రికి ఈ నెల 27వ తేదీన జిల్లాలో స్కూళ్లు పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. – 8లో -
మామిడి సబ్సిడీపై అవగాహన కల్పించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.4 సబ్సిడీని రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గతంలో పండే దాదాపు 70 వేల మెట్రిక్ టన్నుల మామిడిని వ్యాపారవేత్తలు నేరుగా మామిడి తోటలకే వెళ్లి కొనుగోలు చేసే వారన్నారు. ప్రస్తుతం ర్యాంప్ల వద్ద కొనుగోలు తగ్గిందని చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో మామిడి గుజ్జు పరిశ్రమలు లేవని, ఈ కారణంగా జిల్లాలోని ఇతర మామిడి గుజ్జు పరిశ్రమల వద్దకు రైతులు పోటెత్తుతున్నారన్నారు. మామిడి కాయల దిగుబడి పెరిగి డిమాండ్ తగ్గడంతో మార్కెట్లో మామిడి కాయల ధర తగ్గిందన్నారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మార్కెట్ ధరకు అనుగుణంగా రూ.4 సబ్సిడీని రైతుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేయడం జరుగుతోందన్నారు. మండలాల్లో ఉన్న ర్యాంప్లను మండల వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ అసిస్టెంట్లు తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తున్న సిబ్బంది ర్యాంప్ల వద్ద రైతులు నిర్వహిస్తున్న అమ్మకాలను నిర్దేశించిన ప్రోఫార్మాలలో నమోదు చేసి, కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీని సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు స్వయంగా మామిడి తోట నుంచి నేరుగా తమ పంటను వేరే రాష్ట్రాలకు సరఫరా చేసినప్పటికీ ఆ వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. -
వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు
చిత్తూరు కలెక్టరేట్ : తల్లికి వందనం పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్ స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఎవరు ఏ సమస్యతో అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించడంతో వాటి ఆధారంగా తగు పత్రాలను జతచేసి గ్రీవెన్స్కు దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ క్రమంలో జత చేయాల్సిన పత్రాల కోసం రెండు జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తల్లులు చక్కర్లు కొడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏటా పకడ్బందీగా అమలు చేశారు. తల్లులకు ఎలాంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి, నేరుగా ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక వేళ పొందలేని వారికి తిరిగి మరోసారి అవకాశం కల్పించి, ఏటా డిసెంబర్లో అమ్మఒడి పథకం అందజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేసిన మొదటి సారే గందరగోళ పరిస్థితి తలెత్తేలా అర్హులకు నష్టం కలిగేలా పథకాన్ని అమలు చేసింది. రెండు జిల్లాల్లో 12,589 అర్జీలు చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని సచివాలయాల పరిధిలో 1,327 సచివాలయాల పరిధిలో 12,589 అర్జీలు పోటెత్తాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోని 612 సచివాలయాల పరిధిలో 5,897 వరకు అర్జీలు వచ్చాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేయడం విశేషం. తమ పేరుపై అనేక విద్యుత్ మీటర్లు సీడింగ్ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లా ట్రాన్స్కో పరిధిలో సీడింగ్ సమస్య అర్జీలు 1,789 వరకు ఉండగా, తిరుపతి జిల్లాలో 1,815 వరకు ఉన్నాయి. తమ కారు విక్రయించినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదాయం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అనేక మంది అర్జీలు దాఖలు చేశారు. సర్టిఫికెట్లకు ఇబ్బందులు చిత్తూరు జిల్లాలో మొత్తం 1,30,382 మందిని, తిరుపతి జిల్లాలో 2,10,407అర్హులుగా గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 98748 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు. రెండు జిల్లాల్లో అధిక శాతం మందికి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. అనర్హత జాబితాలో ఉన్న వారు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. గ్రీవెన్స్ దరఖాస్తుతోపాటు జత చేయాల్సిన సర్టిఫికెట్లను పొందడంలో ఆలస్యం అవుతుండడంతో ఇంకా సగం మందికిపైగా సవరణ/ ఫిర్యాదు దరఖాస్తులు సమర్పించాల్సి ఉందని తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలల్లో అనర్హులుంటే కేవలం 12,589 అర్జీలు రావడమే అందుకు ఉదాహ రణ. సచివాలయ సిబ్బందికి తల్లికి వందనం గ్రీవెన్న్స్పై అవగాహన లేకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. తల్లికి కూటమి పరీక్ష సచివాలయాల వద్ద క్యూ కట్టిన అనర్హులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా అర్జీలు రెండు జిల్లాల్లో 12 వేలకు పైగా దరఖాస్తులు అధికంగా విద్యుత్ బిల్లులు, కారు, ఐటీ కారణాలు వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో పారదర్శకంగా అమ్మఒడి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏ ముహూర్తాన ఈ పథకం అమలు చేసిందో కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లుల్లు సమస్యలతో అల్లాడుతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా మంది అర్హులకు ఈ పథకంలో కోత విధించారు. గతంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకంలో అనర్హులుగా గుర్తించారు. అలాగే విద్యుత్ బిల్లులు, కారు, ఐటీ వంటివి వర్తించనప్పటికీ చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సచివాలయాల వద్ద అనర్హుల జాబితాలో ఉన్న తల్లులు అర్జీలను చేతపట్టుకుని క్యూ కట్టారు. ఈ పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం తల్లులకు పరీక్ష పెట్టినట్టుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తల్లికి వందనం పథకంలో అనర్హులైన తల్లుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కథనం. ‘తల్లికి వందనం’ పథకం తమకు వర్తింపజేయాలంటూ చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా వేల సంఖ్యలో అర్జీలు పోటెత్తుతున్నాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ వేలాది మంది తల్లులు సచివాలయాలకు క్యూకడుతున్నారు. ఎప్పుడో కారు విక్రయించినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు.. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 12,589 మంది తల్లులు అర్జీలు దాఖలు చేశారు. వీరిలో అర్హులుంటే వచ్చేనెల 5వ తేదీన తిరిగి ప్రభుత్వం డబ్బులు జమచేయనుంది. ఈ నేపథ్యంలో అధికారులు మళ్లీ ఈ అర్జీలను పునఃపరిశీలిస్తున్నారు. ఈ పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న తల్లులకు క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైనట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. పరిశీలనలో అలసత్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆయా శాఖల అధికారులు పరిశీలనలో అలసత్వం చూపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కారు సంబంధిత అర్జీ సమస్యను ఆయా జిల్లా రవాణా శాఖకు నేరుగా సచివాలయాలు పంపి ఆరా తీస్తున్నాయి. అయితే ఆ అర్జీల పరిష్కారంలో ముందడుగు పడడం లేదు. ఆదాయ పన్ను అర్జీలను తహసీల్దార్లకు లాగిన్లో పంపుతున్నారు. ఆ అర్జీలను తహసీల్దార్లు అస్సలు పట్టించుకోవడం లేదు. కొంత మంది తహసీల్దార్లు పరిష్కరించి ఆర్డీఓ లాగిన్లకు పంపుతున్నారు. పనిఒత్తిడిలో ఉన్న ఆర్డీఓలు వాటిని పట్టించుకోని దుస్థితి ఉంది. విద్యుత్ బిల్లులకు సంబంధించిన అర్జీలను ఆ శాఖ అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరికి పథకం వర్తించదని నిర్ధారించి, సచివాలయాల దశలోనే రెండోసారి అనర్హత కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ నెలాఖరులోగా అర్హుల జాబితా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే రెండు జిల్లాల్లో ఈ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించని దుస్థితి నెలకుంది. -
చివరి కాయ వరకు మామిడిని కొంటాం
గంగాధరనెల్లూరు : మామిడి రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని గంగాధర నెల్లూరులోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. తోతాపురి మామిడి చిట్టచివరి దాకా ఆగస్టు నెల చివరి కాయ వరకు ఎంత పంట వస్తుందో అంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మామిడి కాయల కొనుగోలు ధరలపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మార్కెట్లో డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల సమస్యలు ఉన్నాయన్నారు. టోకెన్ పద్ధతి విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక పది రోజులు ఇలా ఉండొచ్చు తర్వాత అన్ని సమస్యలను తగ్గిపోతాయని కలెక్టర్ చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసులు , సీఐ శ్రీనివాసంతి, జైన్ ఫ్యాక్టరీ మేనేజర్ దిలీప్ పాల్గొన్నారు. -
రైతులకు సేవ చేద్దాం
చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటుధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, క్లబ్ సేవల్లో ఇకపై రైతులకు సేవ చేసేలా చూద్దామని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ చంద్ర హెచ్ రెడ్డి, మాజీ గవర్నర్ భానుమూర్తి రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా శ్రీధర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా శ్రీనివాసమూర్తి, కోశాధికారిగా ప్రసాద్రెడ్డి ఎన్నియ్యారు. గవర్నర్లు మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా శ్రీధరర్రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికయ్యారన్నారు. లయన్స్గోల్డ్ సేవలను విస్తృతం చేస్తూ..ముందుకు వెళ్లాలన్నారు. ప్రధానంగా జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బెంగుళూరులో కేజీ మామిడి కాయ రూ.200 వరకు పలుకుతుంటే..ఇక్కడ రూ.4 రూ.5 అంటున్నారు. ఇలాంటి తరుణంలో క్లబ్ తరపున రైతులకు మేలు చేసేలా చూద్దామన్నారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు టీకాలు అందుబాటులోకి వచ్చాయని , 25 మంది ఆడపిల్లలకు తొలి వ్యాక్సిన్ ఖర్చులను తాను భరిస్తానని మాజీ గవర్నర్ వెల్లడించారు. అనంతరం కుట్టుమిషన్లు, గొడుగులు పంపిణీ చేశారు. మాజీ గవర్నర్ విజయభాస్కర్రెడ్డి, రీజన్ చైర్పర్సన్ లయన్ ఏవీ భాస్కర్, జోన్ చైర్పర్సన్ రవి, సభ్యులు సుభాష్ జైన్, మనోహర్, జమీర్ అహ్మద్, నరేష్, మోహన్రెడ్డి, విజయకుమార్రెడ్డి, పూల సుబ్రమణ్యం, చంద్రశేఖర్రెడ్డి, రమణ, మల్లి, ఎర్రయ్య పాల్గొన్నారు. -
పరిశీలనలో ఇలా..
కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణుల, బాలింతలకు పంపిణీ చేసిన నాసిరకం, పురుగు పట్టిన కందిపప్పు సరఫరాపై ఈనెల 25న సాక్షి జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ నాసిరకం కందిపప్పు సరఫరా అయినట్లు తేలింది. ● గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని 389 అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం కందిపప్పు సరఫరా చేశారు. ఆ నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం ఆముదాల, సింహరాజపురం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించగా పుచ్చిపోయిన పురుగు పట్టిన కందిపప్పు దర్శనమిచ్చింది. మరికొన్ని చోట్ల తుది గడువు ముగిసిన కందిపప్పు ప్యాకెట్లను పంపిణీ చేశారు. ● పుంగనూరు నియోజకవర్గంలో 380 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం అంగన్వాడీ కేంద్రం–3 ను పరిశీలించగా కందిపప్పు నాసిరకంగా ఉంది. అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 15,431 మంది చిన్నారులకు, 4259 మంది గర్భిణులు, బాలింతలకు మొత్తం పురుగు పట్టిన, నాసిరకం కందిపప్పును సరఫరా చేసేశారు. ● పలమనేరు నియోజకవర్గంలో 408 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సాక్షి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించింది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీలకుంట అంగన్వాడీని పరిశీలించగా పురుగు పట్టిన కందిపప్పు కనిపించింది. -
పీజీ సెట్లో 88.60 శాతం ఉత్తీర్ణత
తిరుపతి సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా 17 వర్సిటీల్లోని 143 పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 9 నుంచి నాలుగు రోజులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఎస్వీయూలో వీసీ, పీజీ సెట్ చైర్మన్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు సబ్జెక్టుల వారీగా ఫలితాలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ పరీక్షలకు 21,995 మంది హాజరుకాగా 19,488 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. 88.60 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఎస్వీయూ రీజియన్లో 5,764 మంది పరీక్ష రాయగా 5,019 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,422 మంది పరీక్షలకు హాజరుకాగా 1,279 మంది అర్హత సాధించినట్టు వెల్లడించారు. జాగ్రఫీ, జనరల్ టెస్ట్లో చిత్తూరు జిల్లాకు చెందిన దివ్వేష్రెడ్డి, ఎం.ప్రేమ్కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు వివరించారు. సీట్లు 25 వేలు, ఉత్తీర్ణులైన అభ్యర్థులు 19 వేలు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలో 25 వేలకు పైగా పీజీ సీట్లు ఉన్నాయి. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు 19,488 మంది. ఒక సీటుకు ఒక అభ్యర్థి కూడా పోటీ లేకపోవడం విశేషం. తద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోనున్నాయి. దీంతో వర్సిటీల భవితవ్యం ప్రశ్నార్థకమేనంటూ మేధావు లు, విద్యానిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు విడుదల ఎస్వీయూ రీజియన్లో 87.07 శాతం ఉత్తీర్ణత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 89.94 శాతం మంది జాగ్రఫీ, జనరల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ పీజీ సెట్–2025 ఫలితాల వివరాలు కోర్సులు సెట్కు హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారు కెమికల్ సైన్స్ 5,396 4,719 లైఫ్ సైన్స్ 3,641 3,408 కంప్యూటర్ కోర్సులకు 1,858 1,547 కామర్స్ 1,203 1,009 ఇంగ్లీష్ 721 702 హ్యుమానిటీస్ 736 726 జువాలజీ 1,347 1,177 గణితం 983 821 ఫిజిక్స్ 808 652 బోటనీ 1,146 1,041 ఇతరాలు 4,156 3,686 మొత్తం 21,995 19,488 -
ఆరుగురు
విద్యార్థులు గురువులునగరి : ఉపాధ్యాయుల బదిలీల్లో తమిళ మాధ్యమ ఉపాధ్యాయులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు ఉండాలన్న అంశాన్ని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం శ్రీ రంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు తమిళ మాధ్యమ విద్యార్థులు ఉండగా వారికి ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించడం ఆరోపణల్లో వాస్తవికతను చాటి చెబుతోంది. తమిళనాడు సరిహద్దును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లాలో తమిళ మాధ్యమం కలిగిన 16 ఉన్నత పాఠశాలలు, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సుమారు 200 మంది తమిళం బోధించే ఉపాధ్యాయులున్నారు. వీరికి ఇటీవల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. వెబ్ కౌన్సెలింగ్ మేరకు బలవంతపు బదిలీలు నిర్వహించిన అధికారులు ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీ చేస్తున్నామా? లేదా? అనే అంశాన్ని విస్మరించారు. దీంతో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. నగరి మున్సిపాలిటీలో 252 మంది తమిళ మాధ్యమ విద్యార్థులున్న ఏకాంబరకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 గురు ఉపాధ్యాయులను, 230 మంది తమిళ మాధ్యమం విద్యార్థులున్న సత్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 గురు ఉపాధ్యాయులనే కేటాయించారు. గుడిపాల మండలం శ్రీరంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 గురు విద్యార్థులకే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించారు. అలాగే బొమ్మసముద్రం పాఠశాలలో 8 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లను కేటాయించారు. దీంతో తమిళ ఉపాధ్యాయులు ఇదేమి వెబ్ కౌన్సెలింగ్ అంటూ విస్తుపోతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ బదిలీలేంటని అవాక్కవుతున్నారు. అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు. తమిళ మాధ్యమ టీచర్లపై వివక్ష వెబ్ కౌన్సెలింగ్ పేరిట బలవంతపు బదిలీలు 252 మంది ఉన్న పాఠశాలకు ఆరుగురే టీచర్లు -
కూటమి నేతల దౌర్జన్యం
● ఏకపక్షంగా వ్యవహరించిన తహసీల్దార్ యాదమరి: కట్టకిందవూరులో తమ పొలాలకు వెళ్లే కాలువ మార్గాన్ని దౌర్జన్యంగా కొందరు కూటమి నేతలు ఆక్రమించుకుని జేసీబీతో దారి ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, 50 ఏళ్లుగా తాము ఈ కాలువ గుండా తమ పొలాలకు వెళ్లేవారమని, ఇప్పుడు కూటమి నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించి, జేసీబీతో వచ్చి, మట్టితో దారి ఏర్పాటు చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ పార్థసారథి సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే చివరికి కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరించారు. పది మందికి ఉపయోగపడే చెరువు కాలువ విషయంలో తహసీల్దార్ కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు(చౌడేపల్లె) : కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం మండలంలోని సింగిరిగుంటలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సురేష్ భార్య వెంకటమ్మ (39) కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్రగాయాలు పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ గ్రామం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. తొట్టికండ్రిగ గ్రామంలో గంగజాతర పురస్కరించుకుని పరిసరాలు శుభ్రం చేసి, జేసీబీని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన జేసీబీని ఢీకొన్నారు. దీంతో ఇద్దరి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో సోళింగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. ప్రెస్, పోలీసు స్టిక్కర్లు అనధికారికంగా వేసుకుంటే చర్యలు పలమనేరు : జిల్లాలో కొందరు జర్నలిస్టులు కాకున్నా వారి వాహనాలపై ప్రెస్ అని, పోలీసులు కాకున్నా పోలీస్ అని, సైనికులు, పలు డిపార్ట్మెంట్ల పేర్లతో పేర్లు రాసుకొని తిరుగుతున్నారని వీరిపై చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు కాకున్నా యూట్యూబ్ విలేకరులమంటూ కొందరు, తాము పోలీసుల బంధువులమంటూ మరికొందరు, వివిధ శాఖలకు సంబంధించి వాహనాలు, ద్విచక్ర వాహనాలపై రాసుకున్న వారిపై తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సంబంధం లేకుండా బైక్లపై ప్రెస్ స్టిక్టర్ వేసుకున్న వారిపై చర్యలు తప్పవన్నారు. కేవలం జిల్లా కలెక్టర్ ద్వారా అక్రిడేషన్ కలిగి ఉన్న విలేకరులు మాత్రమే బైక్లపై ప్రెస్ అని వేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన స్టిక్కర్లను తమ శాఖ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. మట్టి గణపతిని పూజించాలి కాణిపాకం : వినాయక చవితి దృష్ట్యా భక్తులు మట్టి గణపతిని పూజించి.. ప్రకృతికి హాని కలగకుండా చూడాలని ఈఓ పెంచల కిషోర్ అన్నారు. కుమారస్వామి అనే భక్తుడు రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తొలుత ఆ మట్టి గణపతి పంపిణీని బుధవారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో ప్రారంభించారు. ఈఓ ఈ పంపిణీని ప్రారంభిస్తూ..మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. -
క్వారీ పేలుళ్లల్లో ఒకరి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు కుప్పం రూరల్ : కుప్పం పట్టణానికి సమీపంలోని క్వా రీలో జరిగిన పేలుళ్లల్లో ఒకరి మృతి చెందగా మరొక రు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం చో టు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇ లా.. కుప్పం పట్టణానికి సమీపంలోని బీసీఎన్ కన్వెన్ష న్ హాల్ వెనుక వైపు కొంత మంది క్వారీ చేపడుతున్నా రు. ఈ క్రమంలో బుధవారం బండలను చీల్చేందుకు చేపట్టిన పేలుళ్లల్లో గుడుపల్లె మండలం, పాపానూరు గ్రామానికి చెందిన రాజు (20), మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు క్వారీ యాజమాన్యం ప్ర యత్నించింది. మార్గమధ్యలోనే రాజు మృతి చెందిన ట్లు స్థానికులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ క్వారీపై మున్సిపాలి టీ పరిధిలోని 7వ వార్డు ప్రజలు అధికారులకు ఫిర్యా దు సైతం చేశారు. జనవాసాల మధ్య క్వారీ నిర్వహించడంపై తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని పేలుళ్ల తో వెలువడే శబ్దాలతో చెవులు పోతున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అంగన్వాడీల తనిఖీ
నగరి : నిండ్ర మండలం అత్తూరు అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు పురుగు పట్టిన కందిపప్పు ఇవ్వడాన్ని వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘జల్లించి.. ఎండలో వేసి..వండి పెట్టేయండి’ అంటూ వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం సీడీపీఓ ఇందిరా ప్రియదర్శిని అత్తూరు అంగన్వాడీ సెంటర్కు వెళ్లి విచారణ చేపట్టారు. పిండి అయిన కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు ప్యాకెట్లను గర్భిణులు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 202 అంగన్ వాడీ కేంద్రాలకు సివిల్ సప్లై గోడౌన్ నుంచి చౌక దుకాణాల ద్వారా 2476 కేజీల కందిపప్పు సరఫరా అవుతుందని ఇందులో చాలా వరకు పాడైపోయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవ్వరికీ సరఫరా చెయ్యకండని అంగన్వాడీ సెంటర్లకు కూడా ఆదేశించడం జరిగిందన్నారు. అత్తూరు సెంటర్లో మాత్రమే సమాచారం అందకా సరఫరా జరిగిందని దానిని కూడా సరిదిద్దడం జరిగిందన్నారు. సివిల్ సప్లై గోడౌన్ డీటీతో మాట్లాడి 821 కేజీల పాడైన కందిపప్పు వాపసు ఇవ్వడం జరిగిందని ఆ స్థానంలో మంచి కందిపప్పు అందించామన్నారు. ఆమె వెంట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.వెంకటేశులు, ఉపాధ్యాయులు లోకేశ్వరి, ప్రమీల, డీలర్ చంద్రకళ పాల్గొన్నారు. -
డ్రోన్లతో నిఘా పెంచండి
–ఎస్పీ మణికంఠ చందోలు చిత్తూరు అర్బన్: అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా జిల్లాలో డ్రోన్లతో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో బుధవారం పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ప్రజలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా డ్రోన్ల సాయంతో నిఘా పెంచాలన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేర పరిశోధన చేయాలన్నారు. శాంతిభద్రతల పరిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్మిత్రను సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి పేరుతో మోసం చిత్తూరు అర్బన్ : తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై ఓ యువతి మంగళవారం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఎస్ఐ నాగసౌజన్య వివరాల మేరకు.. రామ్నగర్ కాలనీకి చెందిన జాహిద్, గిరింపేటకు చెందిన రేష్మ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబాలకు తెలిపి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో రేష్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో జావిద్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను మోసం చేసిన జావిద్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు రేష్మ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యను వ్యాపారంగా మార్చేశారు!
– కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కేశవరెడ్డి పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని విద్యాశాఖ అధికారులు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరులోని మురుగానపల్లిలో ఉన్న కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రిని పాఠశాల ఎదుట పెట్టి ధర్నా నిర్వహించారు. బండి చలపతి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యూనిఫాం, పుస్తకాలను అమ్ముకుంటున్న కేశవరెడ్డి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులతో పాటు విద్యాసామగ్రిని దోచుకుంటున్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చేసిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా, నాయకులు యోగేష్, నిరంజన్ పాల్గొన్నారు. -
పాత కక్షలతో 108 ఉద్యోగిపై దాడి
వి.కోట : పాత కక్షల తో ఓ వ్యక్తిపై పలు వురు దాడి చేసిన ఘటన మండలంలోని చింతమాకులపల్లె పంచాయతీ కాంచిమట్లపల్లెలో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజు(35) 108లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు లక్ష్మీపతి, గణేష్, గంగులప్ప, కుమార్, సుధాకర్ , వి,కోటకు చెందిన అశోక్ కలసి మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న నాగరాజుపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో నాగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబీకులు హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాలుగేళ్ల క్రితం వారితో నాగరాజు గొడవ పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం దాడి చేశారని కుటుంబీకులు ఆరోపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.శ్రీవారి దర్శనానికి 18 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 84,179 మంది స్వామివారిని దర్శించుకోగా 33,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.72 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. -
అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశాలకు 30 వరకు గడువు
తిరుపతి సిటీ: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడుపు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 16తో ప్రవేశాల గడువు ముగిసిందని, విద్యార్ధుల సౌకర్యార్థం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు చెప్పారు. అగ్రికల్చర్, ఆర్గానిక్, సీడ్ టెక్నాలిజీ, అగ్రి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్ధులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలియజేశారు. ఎస్వీయూను సందర్శించిన యూకే డిప్యూటీ హైకమిషనర్ తిరుపతి సిటీ: యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం ఎస్వీ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారతీయ పారిశ్రామిక రంగాలతో యూకే బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అంకితభావంతో ఉందన్నారు. ఉమ్మడి పరిశోధన, విద్యామార్పిడి, వాణిజ్య వెంచర్ల కోసం స్పష్టమైన మార్గాలను అన్వేషించడం తన సందర్శన లక్ష్యమని చెప్పారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో సహాయ సహకారాలకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, లక్ష్మి, శ్రీనివాస్, శశికుమార్ పాల్గొన్నారు -
పోటీలు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తల్లి పాత్ర సహకారం అనే అంశంపై పోటీలు నిర్వహించాలన్నారు. ఈ నెల 28 వరకు వ్యాసరచన, వ్యక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. భోజనం సకాలంలో అందుతుందా? గుడిపాల: సమస్యలు ఏమైనా పరిష్కారమయ్యాయా..? భోజనం సకాలంలో అందుతుందా..? అంటూ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఆయన గుడిపాల మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్, తాసా మామిడి గుజ్జు పరిశ్రమలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల వద్దకు వెళ్లి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సకాలంలో అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా వచ్చిన రైతులకు ముందుగా టోకెన్లు జారీ చేయాలన్న నిబంధన పాటించాలని మామి డి గుజ్జు పరిశ్రమ వారిని ఆదేశించారు. ప్రభు త్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధరను డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, డెప్యూటీ తహసీల్దార్ లక్ష్మి ఉన్నారు. టమాట ధరలకు రెక్కలు పలమనేరు: టమాట ధరలకు రెక్కలొచ్చాయి. పలమనేరు మార్కెట్లో 15కిలోల బాక్సు మంగళవారం రూ.350 దాకా పలికింది. పొరుగునే ఉన్న కర్ణాటకలోని వడ్డిపల్లి మార్కెట్లో రూ.400 దాకా పెరిగింది. వర్షాల కారణంగా సరుకు నాణ్యత తగ్గింది. దీనికితోడు సీజన్ ముగిసిపోతుండడంతో దిగుబడి తగ్గుతోంది. ఫలితంగా టమాట రేట్లు పెరుగుతున్నాయి. జూలై నుంచి ఆశాజనకంగా ధరలు ఇలా ఉండగా జూలై తొలి వారంలో కోతకొ చ్చే తోటలకు ధరలు ఆశాజనంగా ఉంటాయని ఇక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా ఉన్న తోటలు ఈనెల ఆఖరుకల్లా వడిగిపోతాయి. ఆపై కొత్త తోటలు కోతకు రావడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. -
ఊరిలోని బడి కోసం పోరాటం
పలమనేరు : తమ గ్రామంలోనే బడి ఉండాలని, పక్క ఊరికి మారిస్తే పిల్లలను పంపే ప్రసక్తే లేదని, ఇందుకోసం పోరాటం కొనసాగిస్తామని మండలంలోని కొలమాసనపల్లె పంచాయతీ పాలమాకులపల్లె వాసులు స్పష్టం చేశారు. మంగళవారం ఈమేరకు పలమనేరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మా గ్రామంలోని బడిలో 30మంది పిల్లలున్నారన్నారు. ఎర్రగొండేపల్లె, కురప్పల్లె, జల్లిక్వారీ, హాచరీ ప్రాంతాలనుంచి ఇక్కడికే విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. అయితే ఈ బడిలోని 3,4,5 తరగతుల పిల్లలను దిగువ కల్లాడు పాఠశాలకు పంపాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. ఆ మార్గంలో నిత్యం టిప్పర్లు వేగంగా వెళుతుంటాయని, దీంతో పిల్లలకు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎక్స్ప్రెస్ హైవే పనుల వద్ద బ్లాస్టింగ్లు జరుగుతుంటాయని వాపోయారు. అలాగే రోడ్డు పక్కనే చెరువులా వరదనీరుందని అందులో పిల్లలు పడిపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని మా గ్రామంలోని బడిని మార్చవద్దని కోరారు. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పర్యవేక్షణ కరవు
తొలిబడి అమ్మ అయితే.. మలిబడి అంగన్వాడీ కేంద్రాలే. పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలి. అయితే అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదు. నాణ్యమైన ఆహారం అందజేస్తున్నామ ని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మా త్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన కందిపప్పును గ ర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నారు. ఈ నాసిరకం కందిపప్పునే అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు వండి పెడుతున్నారు. నగరి: నగరి ఐసీడీఎస్ పరిధిలో 202 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 161 మెయిన్, 41 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ఈ సెంటర్లకు నగరి సివిల్ సప్లయిస్ గోదాము నుంచే సరుకులు సరఫరా చేస్తారు. గోదాముకు వచ్చి చేరిన సరుకే నాసిరకంగా ఉంటోంది. దానినే మూడు మండలాల అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. ఈ పురుగులు పట్టిన పప్పునే నిండ్ర మండలం అత్తూరు గ్రామ అంగన్వాడీ కేంద్రలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసేశారు. పురుగులు పట్టిన పప్పు చూసుకున్న వారు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీ చేయాల్సినవారు కాసులకోసం కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కుతున్నారంటూ ఆరోపించారు. సరఫరా ఆపేయమన్నాం వచ్చిన కందిపప్పు నాసిరకంగా ఉండడంతో సీడీ పీఓ గోదాము డీటీని సంప్రదించారని, అలా ఉంటే పప్పు పంపిణీ చేయొద్దని, వాపసు పంపేస్తే వేరే పప్పు ఇస్తామన్నారని సూపర్వైజర్ శంకరమ్మ తెలిపారు. దీంతో అందరికీ సరఫరా చేయవద్దని ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు. నగరి, విజయపురం మండలాల్లో పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదన్నా రు. అయితే విషయం తెలియక నిండ్ర మండలం అ త్తూరు అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేశారన్నా రు. సరఫరా ఆపేయమని వారికి సూచించామని త్వరలో వేరే సరకులు ఇస్తామని ఆమె తెలిపారు. అంగన్వాడీలకు గోదాము అధికారుల సూచన చిన్నారులకు.. నాణ్యత లేని ఆహారం అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం కంది పప్పు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు ‘జల్లించి, ఎండలో వేసి, వండి పెట్టేయండి.. ఏమీ కాదు’ అని నాసిరకం కందిపప్పు సరఫరా చేయడంపై ప్రశ్నించిన అంగన్వాడీ కార్యకర్తకు సివిల్ సప్లయిస్ గోదాము అధికారులు చేసిన సూచనలివి. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడేలా గోదాము అధికారులు నిర్లక్ష్యపు సమాధానమివ్వడంతో నిండ్ర మండలం, అత్తూరు అంగన్వాడీ కేంద్రం కార్యకర్త నివ్వెరపోయారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సరుకుల పంపిణీ దారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే పప్పును చెరిగితే సగానికి సగం వేస్టేజీ పోతుందని, పప్పు గింజల కంటే ఎక్కువగా పురుగులు ఉంటున్నాయన్నారు. దీనినే కేంద్రంలోని పిల్లలకు కూడా వండిపెడుతున్నారన్నారు. ఇప్పటికే విజయపురం పన్నూరు హాస్టల్లో 30 మందికిపైగా పిల్లలు అస్వస్థతకులోనై ఆస్పత్రి పాలయ్యారు. ఆ పరిస్థితి అంగన్వాడీ పిల్లలకు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అత్తూరు కేంద్రంలోనే ఆరుగురు గర్భిణులు ఉన్నారు. వారికేమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అంతా ప్రశ్నిస్తున్నారు. -
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్–2025 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులో 13 పీజీ సబ్జెక్టుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీపీజీసెట్కు ఎస్వీయూ రీజియన్ నుంచి 3,946 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రవేశ పరీక్షకు 3,434మంది హాజరయ్యారు. వీరిలో 3,208 మంది ఉత్తీర్ణత సాధించారు. జీఈఓ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫోమ్యాటిక్స్ విభాగంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టి. సుధాకర్రెడ్డి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన విజయ్వర్మ 5వ ర్యాంకు సాధించాడు. నేడు కరికులంపై ప్రాంతీయ వర్క్షాప్ తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై తిరుపతిలోని గోల్డెన్ తులీప్ హోటల్లో బుధవారం ప్రాంతీయ వర్క్షాపు నిర్వహించనున్నట్టు స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాఽథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్షాప్కు సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్కుమార్, ఎస్బీటీఈటీ కార్యదర్శి జీవీవీఎస్.మూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, డెప్యూటీ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మీపతి హాజరవుతారని, ఈ వర్క్షాప్లో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొని పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులకు అవసరమైన సిలబస్ తయారీపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. -
మేం చూసుకుంటాం.. నువ్వు నిర్మించుకో!
పలమనేరులో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు ● అధికారులు, నేతల అండతో సాఫీగా పనులు ● రాత్రికి రాత్రే వెలుస్తున్న భవనాలు ● నోరుమెదపని మున్సిపల్ అధికారులు పలమనేరు: ‘చూడబ్బా అధికారం మాది. పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాం.. ఇప్పుడు సంపాదించుకోకుండా ఇంకెప్పుడు సంపాదించేది. మాకు పైనుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు.. నీవు అక్రమ నిర్మాణాలు చేస్కో.. అధికారులు అసలు మాట్లాడరు.. వారికిచ్చేది ఇస్తాం.. ఎవరైనా అడిగితే మేం చూసుకుంటాం..’ ఇది పలమనేరు మున్సిపాలిటీలో సాగుతున్న అక్రమ నిర్మాణాల జోరు. ఎక్కడ ఆక్రమణలు జరిగినా మున్సిపల్ అధికారులకు చెప్పి వారి అండతోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. దీన్ని చూసిన జనం వీళ్లేమి నాయకులు సామీ అని ముక్కున వేలేసుకుంటున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు పట్టణంలోని మదనపల్లి రోడ్డులో చదరపు అడుగు విలువ రూ.4 వేలుగా ఉంది. దీంతో ప్రభుత్వ స్థలాలపై పలువురి కన్ను పడింది. అంబేడ్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ స్థలాన్ని గతంలో మాజీ మంత్రిగా ఉన్న అమరనాథ్రెడ్డి బీసీ భవన్ కోసం శంకుస్థాపక చేశారు. ఇప్పుడు కూటమి పాలనలో ఈ స్థలాన్ని ఓ వ్యక్తి ఇటీవలే ఆక్రమించుకొని దాంట్లో రేకుల షెడ్డు వేసుకున్నాడు. ఈ విషయం నేతలకు తెలిసే జరిగింది. అధికారులకు సైతం తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురైన ఈ స్థలం విలువ ఇప్పుడు రూ.50 లక్షలకు పైమాటే. ఏమీ భయపడొద్దు? పట్టణంలోని మదనపల్లి రోడ్డులో సత్య బిల్డింగ్కు ఎదురుగా బసవన్న గుడి వెనుక వైపున్న డ్రైన్పై ఓ వ్యక్తి ఇటీవలే రాత్రికి రాత్రే రేకుల షెడ్డును కట్టేశాడు. దీనివెనుక ఆ ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీ నేత హస్తంతోనే ఈ వ్యవహారం సాగినట్టు తెలుస్తోంది. మున్సిపల్ అధికారుల ద్వారా పర్మిషన్ కోసం ఆలయానికి చెందిన వారి ద్వారా ఆరు నెలల ఖాళీస్థలం లీజు అగ్రిమెంట్ రాయించుకొన్నట్టు తెలిసింది. దీన్ని మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులకు చూపెట్టి ఎన్క్రోచ్మెంట్ ఫీజు చెల్లించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. దీనిపై పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మూడు రోజులు మూతబడిన ఈ అక్రమ దుకాణం తాజాగా తెరుచుకుంది. మున్సిపల్ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు తలొగ్గి దీన్ని పట్టించుకోలేదు. ఓ కీలక నేత తానున్నానంటూ ముందుండి మళ్లీ దీన్ని ప్రారంభించడం గమనార్హం. దండపల్లి రోడ్డులో ఇదేతంతు మున్సిపాలిటీ పరిధిలోని దండపల్లి రోడ్డులో ఓ కూటమి నేత ఇటీవలే తనకు పట్టా ఉందని ఓ రేకుల షెడ్డును నిర్మించాడు. గతంలో నాగమణి అనే తహసీల్దార్ విధుల్లో ఉన్నప్పుడు భాను అనే వ్యక్తి పట్టణంలో పలు నకిలీ ఇంటిపట్టాలను భారీగా డబ్బు వసూలు చేసి విక్రయించేశాడు. ఇలా పట్టాలు పొందిన వాళ్లు గత ఎన్నికల్లో కూటమి పార్టీలో చేరి వారుపొందిన పట్టాల్లో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మున్సిపల్ టీపీఎస్ ఇందిరను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరగా పట్టణంలో ఆక్రమణ విషయాలు తన దృష్టికి రాలేదని చెప్పారు. -
మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు
ప్రశ్నిస్తే కేసులా? బంగారుపాళెం: ‘కూటమి ప్రభుత్వం మామిడి రైతునూ వదల్లేదు. ఆర్భాటంగా మద్దతు ధర ప్రకటించి చేతులు పైకెత్తేశారు. దిగుబడి వచ్చినా.. మద్దతు ధరలేక.. రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫ్యాక్టరీల ఎదుట రోజుల తరబడి తిండీతిప్పలు లేక అల్లాడాల్సి వస్తోంది..’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ ధ్వజమెత్తారు. కిలో మామిడికి రూ.12 లెక్కన మద్దతు ధర ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మంగళవారం బంగారుపాళెంలోని మామిడి మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. స్థానిక గ్రామీణ బ్యాంక్ వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా మామిడి మార్కెట్ వరకు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ చేపట్టారు. అనంతరం మామిడి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. మామిడి మార్కెట్యార్డు ప్రధాన గేట్ వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మద్దతు ధర అమలులో అంతులేని నిర్లక్ష్యం బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల ధర్నా ప్రభుత్వం ప్రకటించిన ధరను అమలు చేయాలని డిమాండ్ ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి రకం మామిడికి గిట్టుబాటుధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. తోతాపురి కిలో రూ.12 కు కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద టోకన్ల కోసం పడరాని పాట్లు పడి కాయలు కోసి తరలిస్తే రోజుల తరబడి తిండిలేక అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. వ్యాపారులు, జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తోతాపురి కిలో రూ.2కు కొనుగోలు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయాందోళనకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల కన్వీనర్లు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ధనుంజయరెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి గోహతిసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి ప్రకాష్రెడ్డి, సీనియర్ నాయకుడు థామస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్కుమార్రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అరుణామల్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, ఎస్సీ, బీసీ, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, మొగిలీశ్వర్, షాకీర్, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు విజయకుమార్, బూత్ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాష్రెడ్డి, సోషియల్మీడియా వింగ్ అధ్యక్షడు శైలేష్, మణిరాజ్, నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఆదేశాలు బేఖాతరు
విద్యా హక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఆనన్లైన్ ద్వారా సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయనట్టే. దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. స్కూల్ అనుమతి రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు/ కార్పొరేటు స్కూళ్లను బతిమలాడుకోవాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అయితే రెండు జిల్లాల్లో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం) కింద ఒకటో తరగతి అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అనంతరం ఆన్లైన్ లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రవేశాల పత్రాలను తల్లిదండ్రులు తీసుకెళ్లి పాఠశాలల్లో ఇస్తుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదంటూ తిరిగి పంపించేస్తున్నారు. ఇదేమిటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరెందుకు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే....తమకు ఆర్టీఈ అడ్మిషన్ల జాబితానే ఇవ్వలేదంటూ పాఠశాలల నిర్వాహకులు సమాధానమిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3978 సీట్లు కేటాయిస్తే అందులో 10 శాతం సీట్లను సైతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాలు చేసుకోని దుస్థితి నెలకొంది. వివరాలు గోప్యం? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతున్నా.. వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఏటా అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని ప్రవేశాలు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఈ ద్వారా కల్పించిన వివరాలు విద్యాశాఖ బయట పెట్టలేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఒత్తిడితోనే వివరాలు బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.విద్యాశాఖ అధికారులకే స్పష్టత కరువు ఉచితమైనా లాగేస్తున్నారు.. జిల్లాలో మొక్కుబడిగా ఆర్టీఈ అడ్మిషన్లు పర్యవేక్షించే నాథుడే కరువు చిత్తూరు, తిరుపతి జిల్లాలో 3,978 సీట్లు కేటాయింపు ఆమోదించిన సీట్లు 10శాతం లోపే చట్టం ఆదేశాలు పట్టించుకోని యాజమాన్యాలు వైఎస్సార్సీపీ పాలనలో పక్కాగా ఆర్టీఈ అమలు ఆర్టీఈ అడ్మిషన్ల ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులకే స్పష్టత లేని దుస్థితి. ఈ చట్టం ద్వారా ఎంత మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారనే విషయంపై అధికారులు స్పష్టత లేదు. నిత్యం వందల మంది తల్లిదండ్రులు ఆర్టీఈ అడ్మిషన్ల విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ఆర్టీఈ ప్రవేశాలు పొందినప్పటికీ తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది ఒకటో తరగతిలో జాయిన్ చేసుకున్న చిత్తూరు నగరంలోని ఓ ప్రముఖ కిడ్స్ పాఠశాల.. ఈ ఏడాది మాత్రం ఏకంగా తమ స్కూల్లో ఒకటి, రెండు తరగతులు నిలిపివేశామని సెలవిచ్చింది. దీంతో ఆన్లైనన్లో కేటాయింపు జరిగిన 18 మంది పిల్లల అడ్మిషన్లు అయోమయంలో పడ్డాయి. రెండు జిల్లాల్లో ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఈ ప్రవేశాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆర్టీఈ అడ్మిషన్లు ఖరారు అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా నిత్యం తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు తప్ప న్యాయం మాత్రం జరగడం లేదు. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు ఆర్టీఈ ప్రవేశాలను పకడ్బందీగా అమలు చేయాలి. – ప్రవీణ్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకూ ఆ వెసులుబాటు ఉంటుంది. ఇవాళ ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో చూస్తే ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్తవంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు, ఐఐటీ, నీట్ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషనన్ ఫీజులో మాత్రమే ఉచితం కాదుగానీ రాయితీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అనగానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!
బారులు తీరిన ట్రాక్టర్లు గుడిపాల సరిహద్దులోని ఓ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడులోని కాట్పాడి కింగ్స్టన్ కాలేజీ వరకు మామిడి కాయల ట్రాక్టర్లు క్యూకట్టాయి. గత మూడు రోజులుగా ఈ సమస్య తీవ్రతరమవుతోంది. అన్లోడింగ్కు రైతులు రోడ్డుపైనే కాపు కాస్తున్నారు. తిండీలేక తిప్పలు పడుతున్నారు. గుడిపాలలోని కొత్తపల్లి వద్ద ఇదే పరిస్థితి ఎదరవుతోంది. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి వద్ద ఉన్న ఫ్యాక్టరీ వద్ద కూడా మూడు కి.మీ మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఇక్కడ కాయలు అన్లోడింగ్కు ఐదు రోజులకుపైనే పడుతోంది. దీని దెబ్బకు ఆయా ఫ్యాక్టరీల నిర్వాహకులు కాయలు కొనలేమని చేతులెత్తేశారు. చిత్తూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ సైతం మామిడి కొనుగోలు చేయలేమని బోర్డు పెట్టేస్తున్నాయి. పూతలపట్టు, బంగారుపాళ్యం, తవణంపల్లి, కార్వేటినగరం తదితర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఫ్యాక్టరీలు రైతులను వేధిస్తున్నాయి. జిల్లాలో పళ్ల గుజ్జు పరిశ్రమదారులు సిండికేట్ అయ్యారు. మామిడి రేటును చెప్పకుండా నాన్చుతున్నారు. ఇన్నాళ్లూ రూ.8 నుంచి రూ.5 వరకు పాటపాడారు. తీరా కూటమి ప్రభుత్వం పరువుపోతోందని నోటిమాటగా అమలవుతున్న మద్దతు ధరకు తాళం వేసేశారు. దీని దెబ్బకు రెండు రోజులుగా మామిడిరేట్లు మూగబోయాయి. రైతులకు ఇస్తున్న బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ధర వివరాలను ప్రస్తావించకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కాణిపాకం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇందులో 31 ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. ఇవీ ఈనెల 6 నుంచి తోతాపురి కొనుగోలును ప్రారంభించాయి. ఫ్యాక్టరీలు తోతాపురి కేజీ రూ.8కి కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున కేజీకి రూ.4 చొప్పన రైతులకు ప్రోత్సాహక నిధి ఇస్తామని పాట పాడింది. ఫ్యాక్టరీలు టోకన్లు జారీచేసి కాయలు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈటోకన్ల జారీ గందర గోళంగా మారడంతో ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. మధ్యలో పోలీసులు, అధికారులు కల్పించుకుని రైతులందరికీ టోకెన్లు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. కొనేవారేరీ? టోకన్ల గోల ముదరడంతో అధికారులు కొత్తపల్లవిని అందుకున్నారు. ఇకపై టోకన్లు అవసరం లేదని ప్రకటించారు. కాయలు కోత కోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని బోర్డులు పెట్టేస్తున్నాయి. కాయలు కోసి తెచ్చిన వారిని తిప్పి పంపిచేస్తున్నాయి. లేకుంటే ఐదు రోజుల తర్వాత వరస నంబరు వేసి రైతు ఫలాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. సిఫార్సులుంటే అప్పటికప్పుడే దింపుకుంటున్నాయి. మామిడి విపత్తును అదునుగా తీసుకుని ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యాయి. మామిడి రైతులను దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ధర ఎంత? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది రైతుల వరకు సుమారు 1.5 లక్ష టన్నుల మామిడి కాయలు ఫ్యాక్టరీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో తొలుత వచ్చిన రైతులకు ఫ్యాక్టరీ నిర్వాహకులు తోతాపురి కేజీ ధర రూ.8ని రుచిచూపించారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు కేజీ ధర రూ.6ని తీసుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు రూ.5ని చెప్పి ముఖం చాటేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రైతులకు పెద్ద షాక్ ఇస్తున్నా యి. తోతాపురి ఎంతకు కొనుగోలు చేస్తున్నాయో చెప్పడం లేదు. గుండె గు‘బిల్లు’ ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఏ ఒక్కరైతుకు కూడా బిల్లులో ఫ్యాక్టరీలు ధరల విషయాన్ని ప్రస్తావించ లేదు. కేవలం కాయలు, ట్రాక్టర్ లోడింగ్తో సహా ఎంత బరువు ఉంది.. ఖాళీ ట్రక్కుతో ఎంత బరువు ఉంది.. అని మాత్రమే బిల్లుల్లో ప్రస్తావిస్తున్నారు. ధర విషయాన్ని ఖాళీగా చూపుతున్నారు. ధరలు చెప్పకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఫ్యాక్టరీలో మామిడి కాయల క్లీనింగ్ టబ్ ధరల బోర్డు పెట్టాలి కదా..? ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. మా కడుపు మంట ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. విధిలేని పరిస్థితుల్లో కాయలు దింపుకుంటే చాలనుకుంటున్నాము. దీన్ని అదునుగా చేసుకుని ఫ్యాక్టరీలు ఇప్పుడు ఎంతకు కొంటున్నాయో కూడా చెప్పడం లేదు. బయట మాత్రం కాయలు కొనలేం.. టోకన్లు ఇవ్వలే మని బోర్డులు పెడుతున్నారు. ధరలపై కూడా బోర్డు పెట్టాలి కదా. దీనిపై అధికారులు కూడా నోరు విప్పడం లేదు. –గోవర్దన్, పెనుమూరు మండలం -
యువతకు వెన్నుపోటు గ్యారెంటీ
మా బడిని విలీనం చేయొద్దు మా ఊరి బడిని విలీనం చేయొద్దని పలమనేరు మండలం, అయ్యంరెడ్డిపల్లె గ్రామస్తులు డిమాండ్ చేశారు. హామీల డాబు..మేము చెప్పిన పాఠశాలలోనే చేరాలి! మద్యం దుకాణానికి నోటిఫికేషన్ తోతాపురి @ రూ.2 మొన్నటి దాకా ఫ్యాక్టరీల్లో రూ.8.. ఆ తర్వాత రూ.5.. ఇప్పుడు.. ర్యాంపుల్లో అయితే తోతాపురి కిలో రూ.2కు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025‘ఎన్నికల ముందు యువతకు ప్రాధాన్యత నిస్తామన్నారు. భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊదరగొట్టారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలంటూ గొప్పలు చెప్పారు. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ జబ్బలు చరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అటకెక్కించేశారు. అడిగేవారు లేరని యువతను వెన్నుపోటు పొడిచారు. జాబులు చూపండి బాబూ..! అంటూ రోడ్డున పడాల్సిన దుస్థితికి దిగజార్చారు..’ అని నిరుద్యోగులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన యువత పోరు కార్యక్రమానికి పోటెత్తారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నినాదాలు మిన్నంటించారు. చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్: ‘అధికారమే పరమావధిగా ఎన్నికల సందర్భంగా సవాలక్ష హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక ఒక్క హామీనీ నెరవేర్చకుండా దగా చేశారు..’ అంటూ యువత, నిరుద్యోగులు నిరసన గళం వినిపించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఆ ధ్వర్యంలో నిరుద్యోగులకు భాసటగా సోమవారం యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఉద యం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని రెడ్డిగుంట జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్టులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన యువత, నిరుద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కిషోర్, దొరబాబు, విద్యార్థి సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ సద్ధాం, నాయకులు రూపేష్, సుబ్బునాయుడు, శివ, బావాజీ, గజేంద్ర, నవీన్రెడ్డి, స్టాండ్లీ, మురళీరెడ్డి, చక్రీ, ఢిల్లీబాబు, లోకనాథ, కల్యాణ్, భరత్, విద్యార్థి నాయకులు విఘ్ణరెడ్డి, శశిదీప్రెడ్డి, కళ్యాణ్, భరత్, నరేష్, మహేష్, శ్రీకాంత్, ధనరాజ్, సుమంత్, మనోజ్నాయుడు పాల్గొన్నారు. బాబూ..జాబు! కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోసగించిందని వైఎస్సార్సీపీ యువత విభాగం రాష్ట్ర కార్యదర్శి చెంగారెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రూ.3 వేలు భృతి ఎప్పుడిస్తారని నిలదీశారు. రీజనల్ కో ఆర్డినేటర్ హేమంత్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో యువతను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్ కో నేడు హామీల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తొలగించకపోతే చాలని చెప్పారు. జాబ్క్యాలెండర్ అమలు చేస్తామన్న లోకేశ్ ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చిందని, అందులో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు భృతి కింద రూ.36 వేలు చెల్లించాలని చెప్పారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న యువత, నిరుద్యోగులు బోయకొండ హుండీ ఆదాయం రూ.86.84 లక్షలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.86.84 లక్షలు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా నగదు రూ.86,84,343, బంగారం 64 గ్రాముల 400 మిల్లీలు, వెండిి 780 గ్రాముల 400 మిల్లీలు వచ్చినట్టు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.59,250 నగదు లభించినట్టు వెల్లడించారు. ఈ ఆదాయం 46 రోజులకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు. మూడు చక్రాల సైకిల్ వితరణ చిత్తూరు అర్బన్: రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి చిత్తూరు ట్రాఫిక్ పోలీ సులు చేయూత అందించి అండగా నిలిచారు. సోమవారం దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ను ఉచితంగా అందజేశారు. నగరానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి గతంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. ఇతనికి మూడు చక్రాల సైకిల్ అవసరమని గుర్తించిన.. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జ్యోతి, తన నగదుతో ఓ సైకిల్ను కొనిచ్చాడు. సీఐ నిత్యబాబు చేతులు మీదుగా సైకిల్ను బాధితుడికి అందచేశారు. రెవెన్యూ డే నిర్వహించకుండా అవమానం చిత్తూరు కలెక్టరేట్ : ఎంతో గొప్ప చరిత్ర ఉన్న చిత్తూరు జిల్లాలో రెవెన్యూ డే నిర్వహించకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని అవమానించారని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయసింహారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ డేని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ డేని ఎందుకు నిర్వహించలేకపోయారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రెవెన్యూశాఖతో పాటు ఆ శాఖ అధికారులను, సిబ్బందిని కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అలసత్వ ధోరణి రెవెన్యూ వ్యవస్థనే అవమానించనట్లని ఆయన ఆరోపించారు. చౌడేపల్లె: మేము చెప్పిన పందిళ్లపల్లె ప్రాథమిక పాఠశాలలోనే చేరాలి... చౌడేపల్లె ఎమ్మార్సీ వద్ద ఉన్న పాఠశాలలో ఎవర్నీ చేర్చుకునేది లేదంటూ ఎంఈఓ కేశవరెడ్డి, హెచ్ఎం నాగరత్నమ్మ చెప్ప డం వివాదానికి దారితీసింది. ఈ ఘటన సోమవారం ఎమ్మార్సీ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. చౌడేపల్లె మండలం, మేకలచిన్నేపల్లె ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4 ,5 తరగతి విద్యార్థులను పందిళ్లపల్లెలోని పాఠశాలలో విద్యాశాఖ అధికారులు విలీనం చేశారు. మేకలచిన్నేపల్లె పాఠశాల నుంచి పరిసర గ్రామాలైన ముదిరెడ్డిపల్లె, మేకలచిన్నే పల్లె, యానాదిండ్లు, తోటకురప్పల్లెకు చెందిన 35 మంది విద్యార్థులకు అక్కడి ఉపాధ్యాయులు టీసీలు ఇచ్చి పంపారు. మేకలచిన్నేపల్లె నుంచి పందిళ్లపల్లెకు చెరువు కట్టపై సుమారు కిలోమీటరుకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా..? అంటూ తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. మేకలచిన్నేపల్లెలో అంగన్వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు సౌకర్యం ఉందని, ఆ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థులెవ్వరూ పందిళ్లపల్లెలోని పాఠశాలకు వెళ్లేది లేదని, చౌడేపల్లె ఎమ్మార్సీ వద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తామంటూ తల్లిదండ్రులు పట్టుబట్టారు. ఈ మేరకు సోమవారం అక్కడికి చేరుకొని హెచ్ఎం నాగరత్నమ్మను కలిశారు. అయితే ఆమె ససేమిర అనడంతో వివాదం నెలకొంది. తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించుకోరంటూ తల్లిదండ్రులు హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. తీరా ఎంఈఓ కేశవరెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎం అక్కడికి వచ్చిన 15 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. దీనిపై ఎంఈఓను వివరణ కోరగా తాము ఎమ్మార్సీ వద్ద గల పాఠశాలలో చేర్చుకోబోమని చెప్పలేదని.. రెండు రోజులు ఆగాలని, లేకుంటే మీరు పందిళ్లపల్లె పాఠశాలకు వెళ్లి చేరాలని చెప్పినట్లు తెలిపారు. చిత్తూరు అర్బన్: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణిలో కల్లుగీత సామాజికవర్గాలకు రిజర్వు చేసిన మద్యం దుకాణం నిర్వహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండ్ శ్రీనివాస్ తెలిపారు. 50 శాతం లైసెన్సు ఫీజుతో గౌండ్ల సామాజికవర్గానికి చెందిన వాళ్లు మాత్రం ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లాలోని ఏదైనా ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 319 గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 319 గ్రామాల్లో భూముల విభజనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2022–24 సంవత్సరాల్లో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెబ్ల్యాండ్ 2.0లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు ఆ భూముల విభజనకు సదావకాశం కల్పించారన్నారు. ఈ భూముల విభజనకు ఫీజు రూ.50 చెల్లిచి గ్రామ సచివాలయంలో జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాయింట్ హక్కుదారులుగా ఉన్న భూములపై తరచూ వివాదాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో ఆటంకాలు వస్తున్నాయన్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన అర్జీలను పరిశీలించి కొన్ని జాయింట్ ఎల్పీఎంలను పరిష్కరించామన్నారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్ఏడాదైంది ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? కదంతొక్కిన యువత, నిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద యువత పోరు కార్యక్రమం కూటమికి వ్యతిరేక నినాదాలు హామీలు నెరవేర్చాలని డిమాండ్ ససేమిరా అంటున్న తల్లిదండ్రులు చౌడేపల్లెలో చేర్చుకోమనడంతో వివాదం ఎంఈఓ, హెచ్ఎంతో వాగ్వాదం ఎట్టకేలకు 15 మందికి అడ్మిషన్లుబకాయిలు విడుదల చేసే వరకు పోరు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బ కాయిలు చెల్లించే వరకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం. జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగమైన ఇవ్వాలి, లేదా ఈ 12 నెలల కాలానికి రూ.3వేలు చొప్పున భృతి అయినా విడుదల చేయాలి. –మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మేనిఫెస్టో పట్టించుకోరా? ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను కూటమి ప్రభుత్వం అ మలు చేయాలి. అధికా రం చేపట్టి ఏడాది అవుతున్నా ఇంతవరకు వా టి ప్రస్తావన ఎందుకు చేయడం లేదు. హామీ లు అమలు చేస్తారో లేదో అనే సందేహం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. నిరుద్యోగభృతితో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి. – కిరణ్కుమార్, పుంగనూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు ఉన్న ఉద్యోగాలు తొలగించేశారు కూటమి ప్రభుత్వం అ ధికారంలో వచ్చి ఏడాది అవుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపా యి కూడా అందించలేదు. యువతకు ఇస్తాన న్న నిరుద్యోగభృతి ఇవ్వడం లేదు. కొత్త ఉద్యోగాలు లేవు. ఏడాదిలో ఉన్న ఉద్యోగులను పీకేశా రు. అకారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారో తెలియడం లేదు. – తేజారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ యువత అధ్యక్షుడు భృతి ఇవ్వాల్సిందే నిరుద్యోగభృతి అందిస్తామని ఎన్నికల్లో హా మీ ఇచ్చారు. ఈ పథకం పై తక్షణం సృష్టత ఇవ్వాలి. ఎంతో మంది నిరుద్యోగులు ఆశగా భృతి కోసం వేచి చూస్తున్నారు. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పథకం పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదు. – చంద్రశేఖర్, పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడుఅప్పు చేసి ఫీజులు వసతిదీవెన, విద్యాదీవెన సొమ్ము సకాలంలో విడు దల చేయకపోవడంతో వి ద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గత టీడీపీ పాలనలో చూశాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఇచ్చినట్లు వసతి దీవెన, విద్యాదీవెన క్ర మం తప్పకుండా అందించాలి. –కిషోర్రెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు -
మా ఊరే ముద్దు.. విలీనం వద్దు
ఐరాల: మోడల్ స్కూల్ పేరుతో తమ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను పుత్రమద్దికి తరలించడం సమంజసం కాదని మండలంలోని కుల్లంపల్లె, కామినాయనపల్లె గ్రామస్తులు సోమ వారం పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు హెచ్ఎంకు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో సుమారు 25 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారన్నారు. మోడల్ స్కూల్ పేరుతో 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుత్రమద్ది పాఠశాలకు విలీనం చేస్తూ విద్యార్థులను తరలించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో 1942 నుంచి ప్రాథమిక పాఠశాల కొనసాగుతోందని, తమ గ్రామాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ప్రస్తుతం పాఠశాలలో 96 శాతం మంది దళిత పిల్లలే ఉన్నారని చెప్పారు. పాఠశాల దూరమైతే దళిత విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని వాపోయారు. పుత్రమద్దికి వెళ్లే మార్గం గుండా మధ్యలో చెరువు కట్ట ఉందని, చెరువు నిండిన సమయంలో మొరవ ఉధృతంగా సాగుతుందని, ఆ సమయంలో ఆ మార్గం గుండా పాఠశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎంసీ అనుమతి లేకుండా తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేశారని మండిపడ్డారు. ‘మోడల్ స్కూల్ మాకొద్దు.. మా ఊరు పాఠశాల మాకు ముద్దు’ అంటూ తల్లిదండ్రులు నినాదాలు చేశారు. -
● ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, నిరుద్యోగ భృతి అంతా ఉత్తుత్తిమాటలే ● పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు, పవన్, లోకేష్కు మాత్రమే ఉన్నత ఉద్యోగాలు ● బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు ఎక్కడ ? ● యువతకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం ● మాజీ మంత్రి ఆర్కేరోజా
నగరి : కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తాం, డీఎస్సీ నిర్వహిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, 10 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలిస్తాం అంటూ మాయమాటలు చెప్పి నిరుద్యోగులను పక్కాగా మోసం చేసిందని, జాబ్ గ్యారెంటీ అనుకున్న వారికి వెన్నుపోటు గ్యారెంటీ అని తెలిసిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. సోమవారం నియోజకవర్గం నుంచి యువతపోరుకు తిరుపతి కలెక్టరేట్కు బయలుదేరిన బైక్ ర్యాలీని వడమాటపేట వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన హామీలు ఏదీ నెరవేరకపోవడం, క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో యువత ఆగ్రహావేశాలకు లోనయ్యారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది నిరుద్యోగులకు 10 లక్షల స్వయం ఉపాధి రుణాలిస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు సీఎం పోస్టు, పవన్కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పోస్టు, లోకేష్కు మంత్రి పోస్టు, నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టు వచ్చిందని ఎద్దేవా చేశారు. బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టారు ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు నేడు ఎక్కడికెళ్లారని ఆర్కే రోజా ప్రశ్నించారు. పవర్ స్టార్ పవర్ వచ్చాక ఫ్లవర్లా మారిపోయారన్నారు. గబ్బర్ సింగ్లాగా డైలాగు లు చెప్పిన ఆయన రబ్బర్లాగా మెలికలు తిరుగుతున్నాడన్నారు. నేడు నిరుద్యోగులు తమకు ఉ ద్యోగం రాలేదు న్యాయం చెయ్యండని అడగడాని కి వెళితే ఆయన సినిమాల్లో బిగాగా ఉన్నాడన్న సమాధానం వస్తోందన్నారు. డిప్యూటీ సీఎం కనబడటం లేదని ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నా రు. చంద్రబాబుకు, పవన్కు, లోకేష్కు స్పెషల్ ఫ్లై ట్లు, స్పెషల్ హెలికాప్టర్లుకు ఉన్న డబ్బు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి లేదా అని ప్రశ్నించారు. ని రుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు, 13 నెల ల భృతి ఇచ్చేంతవరకు వారికి అండగా నిల బడి పోరాడుతామన్నారు. నియోజవర్గ యువత విభా గం నాయకులు, పార్టీ నాయకులు, కమిటీ లు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగులపై వివక్ష తగదు
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శుల బదిలీలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులతో వేలాది మందికి ఇబ్బందులు తప్పవని సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో నెం–05ను సవరించాలని కోరుతూ సోమవారం చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యూనియన్ నాయకులు మహేష్, వినోద్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం కల్పించకుండా, ప్రభుత్వం తమపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ నరసింహ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రతాప్, వెంకటేష్, సతీష్, జానకిరామ్ పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 33 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 33 వినతులు అందాయి. స్థానిక ఏఆర్ కార్యాలయంలో చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కుటుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి, పరిష్కరించాలని ఆదేశించారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకరరావు కూడా ఫిర్యాదులు స్వీకరించారు. -
5న జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు అర్బన్: జూలై 5న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి కోరారు. సోమ వారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జాతీయ అదాలత్ నిర్వహించనున్నట్టు చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, చెన్ బౌన్స్, ఇతర కేసులను అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే చిత్తూరు కోర్టులో డీఎల్ఎస్ఏ భవనంలో సంప్రదించాలన్నారు. -
వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి
● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన ప్రజలు ● వివిధ సమస్యలపై 283 అర్జీలు మామిడి లోడింగ్ చేస్తున్న కూలీలు కమ్మ కార్పొరేషన్లో రుణం ఇప్పించండి ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కమ్మ రుణంకు దర ఖాస్తు చేసుకున్నానని, రుణం ఇప్పించాలని చిత్తూరు రూరల్ తాళంబేడు గ్రామానికి చెందిన దివ్యాంగులు గోపాల్ కోరారు. ఈ మేరకు ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. పాఠశాల విలీనం వద్దు తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేయకూడదని పలమనేరు మండలం, కోతిగుట్ట గ్రామస్తులు వనజ, బుజ్జెమ్మ, రోజా కోరారు. ఈ మేరకు గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద తమ పిల్లలతో కలిసి నిరసన చేపట్టారు. తమ గ్రామంలోని పాఠశాలలో 3, 4, 5 తరగతులను దూరప్రాంతంలో ఉన్న పెంగరకుంట గ్రామంలోని పాఠశాలలో విలీనం చేశారని, ఆ పాఠశాలకు వెళ్లడం ప్రమాదాలతో కూడుకున్న పని అని వాపోయారు. ఆయా తరగతులను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : శ్రీప్రతి వారం దూరాభారం నుంచి కలెక్టరేట్కు వస్తూనే ఉన్నాం.. తమ సమస్యలు పరిశీలించి న్యాయం చేయాలిశ్రీ అని బాధిత అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు వినతులు అందజేశారు. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 283 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి పాల్గొన్నారు. రేషన్ కార్డు ఇప్పించండి రేషన్ కార్డు ఇ ప్పించాలని చి త్తూరు రూ రల్ మండలం, అ నుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కస్తూరి కోరారు. ఈ మే రకు ఆమె పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశా రు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన కూతురి వద్ద గత నాలుగేళ్లుగా అనుపల్లిలో నివసిస్తున్నాని, చాలా రోజులుగా రేషన్కార్డు కు దరఖాస్తు చేసుకుంటున్నా మంజూరు చేయడం లేదన్నారు. విలీనం వద్దు పాఠశాల విలీనం అ న్యాయం అని శ్రీరంగరాజపురం మండలం, దిగువ మెదవాడ ఎస్ టీ కాలనీ వాసులు గాంధీ, ధనలక్ష్మి, దేవి వాపో యారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను దూర ప్రాంతంలో ఉన్న ఎగువ మెదవాడ పాఠశాలలో విలీనం చేయడం అన్యాయమన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించకుండానే బడిని విలీనం చేయడం సబబు కాదన్నారు. మా గ్రామంలోనే బడి కొనసాగించాలి తమ గ్రామంలోనే ప్రభుత్వ బడిని కొనసాగించాలని గంగాధరనెల్లూరు మండలం, అంబోధరపల్లి గ్రామస్తులు రామయ్య, నరసమ్మ, భారతి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ గ్రామంలోని బడిని విలీనం చేయకూడదన్నారు. ఎవరిని అడిగి తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేశారని ప్రశ్నించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. -
అక్రమ మైనింగ్పై దాడులు
శాంతీపురం/ పలమనేరు: కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, 121 పె ద్దూరు సమీపంలోని జేబీ కొ త్తూరు వద్ద పచ్చనేతలు అక్రమంగా సాగిస్తున్న మైనింగ్పై అధికారులు కొరడా ఝుళిపించారు. మైనింగ్ డీడీ సత్యనారాయణ ఆదేశాలతో పలమనేరు మైనింగ్ అధికారులు సోమ వారం దాడులు చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పది గ్రానైట్ దిమ్మెలను సీజ్చేశారు. తెల్లబోయే దోపిడీ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమ వారం వెలువడిన కథనంపై మైనింగ్ డీడీ స్పందించారు. పులిగుండ్లపల్లికి చెందిన డీకేటీ రైతుల పొలాల్లోని తెలుపు గ్రానైట్ను అధికార పార్టీకి చెందిన వారు యథేచ్ఛగా మైనింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే అక్కడ పనులు చే స్తున్న వాహనాలను ఎందుకు వదిలేశారో చెప్ప డం లేదు. ఇదే మండలంలో అక్రమ మైనింగ్ సా గుతోందని గతంలో ప్రతిపక్ష నేతగా ఉండిన చంద్రబాబునాయుడు నానా హంగామా చేసిన విష యం తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ వాళ్లే అ క్రమ మైనింగ్కు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే మాట అక్కడ వినిపిస్తోంది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారా అని మైనింగ్ డీడీ సత్యనారాయణ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్ఫోన్ను లిప్ట్ చేయకపోవడం కొసమెరుపు. -
తోతాపురి @ రూ.2
ఉమ్మడి జిల్లా సమాచారం మామిడి విస్తీర్ణం: 56వేలహెక్టార్లు దిగుబడి అంచనా: 6.45 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపురి సాగు విస్తీర్ణం: 39,895 ఎకరాలు దిగుబడి అంచనా: 4.99 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ల గుజ్జు పరిశ్రమలు: 43 పనిచేస్తున్న ఫ్యాక్టరీలు: 31 ర్యాంపులు: 40 ఫ్యాక్టరీలకు చేరిన కాయలు: 1.3 లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి జిల్లాలో మామిడి ధర మళ్లీ పతనమైంది. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.2 పలుకుతోంది. ఫ్యాక్టరీలో రూ.5కు అమ్ముడుబోతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8 పూర్తిగా అంతమైంది. జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీల్లో రూ.6, ర్యాంపుల్లో రూ.3.5 తగ్గదని చెప్పింది. కానీ క్షేత్ర స్థాయిలో ఇవేవీ అమలుగాకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. మొత్తంగా 6.45లక్షల మెట్రిక్ టన్నుల వరకు మామిడి దిగుబడి అయ్యింది. టేబుల్ రకాలు కోత చివరి దశకు చేరుకుంటే... తోతాపురి కోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమయ్యాయి. ఈ రకం మామిడి 39,895 హెక్టార్లు ఉంటే.. 4.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1.5 లక్షల టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు వారి గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి తోతాపురి కోతలు ప్రారంభమైతే.. చాలా ఫ్యాక్టరీలు తోతాపురి కొనలేమని చేతులెత్తేశాయి. అధికారులు పట్టుబట్టినా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర మూన్నాళ్ల ముచ్చటే కూటమి ప్రభుత్వం తోతాపురి రకం మామిడి కేజీ రూ.8గా మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ ప్రోత్సాహ నిధి కింద మరో రూ.4తో కలిపి మొత్తం రూ.12 ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి పండుగ చేసుకున్నారు. తీరా ఆ సంబరాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ర్యాంపుల్లో కేజీ రూ.2 ఈ సారి మామిడి ధరలు, అవస్థలు చూసి ర్యాంపులు తెరుచుకోవడం కష్టతరంగా మారింది. ర్యాంపులు ఫ్యాక్టరీకి రోజూ ఒక లారీ కాయలు తరలించేలా అవకాశం కల్పించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 ర్యాంపులు ఏర్పడ్డాయి. ఈ ర్యాంపుల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్ కూడా లేవు. అనాధికారికంగా ర్యాంపులను నిర్వహిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండే ఫలాన్ని ర్యాంపు నిర్వాహకులు చులకనగా చూస్తున్నారు. వీరు ఆడిందే..ఆట పాడిందే పాటగా ధరలను ఫిక్స్ చేస్తున్నారు. తొలుత తోతాపురి కేజీ రూ.4 అంటూ రంగంలోకి దిగారు. తర్వాత రూ.3.50, రూ.3కు సిండికేట్ అయ్యారు. శనివారం నుంచి తోతాపురి కేజీ ధర రూ.2 పలుకుతోంది. చిత్తూరు, పులిచెర్ల, బంగారుపాళెం, దామలచెరువు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో రూ.2 లెక్కన కొనుగోలు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో రూ.5 ఫ్యాక్టరీల్లో తోతాపురి కేజీ రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. అదే టోకన్ తీసుకున్న రైతు వద్ద తోతాపురి రూ.6కు కొనుగోలు చేస్తున్నాయి. పలు ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యి ధరలను రూ.6 నుంచి రూ.5కు తగ్గించేశాయి. 95శాతం ఫ్యాక్టరీలో ఇదే ధరలు మాత్రమే అమలవుతున్నాయి. ఈ పర్యటనలు ఎందుకో? జిల్లా అధికారులు ఫ్యాక్టరీల వద్దకు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. అయితే అధికారులు మరోవైపు తప్పులన్నీ రైతులపై నెట్టేస్తున్నారు. పక్వానికి రాని కాయలను కోసి తెచ్చేస్తున్నారని, ఆగస్టు వరకు కోత కోయవచ్చని, ర్యాంపులు, ఫ్యాక్టరీలు అడిగిన రేట్లకు ఇచ్చేస్తున్నారని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం చేరవేసి మామిడి రైతులను నట్టేటా ముంచేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. చిత్తూరు నగరంలోని మామిడి కాయల ఫ్యాక్టరీలో క్యూకట్టిన వాహనాలు మళ్లీ పతనమైన మామిడి ధరలు తోతాపురి ర్యాంపుల్లో కేజీ రూ.2 ఫ్యాక్టరీలో రూ.5కు కొనుగోలు రూ.6 తగ్గకుండా చూస్తామన్న అధికార యంత్రాంగం మరింత దిగజారే అవకాశం మండిపడుతున్న రైతులు ఏమైపోవాలి? ఈసారి దిగుబడి బా గొచ్చింది. పది రూపాయలు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఆ పంటను చూస్తే కన్నీళ్లు తప్ప కాసులు రావడం లేదు. ఫ్యాక్టరీలకు తోలుదామనుకుంటే టోకన్లు లేవు. నేరుగా తీసుకెళితే ఫ్యాక్టరీ వాళ్లు తీసుకోవడం లేదు. ర్యాంపుకు వెళితే కేజీ రూ.2కు అడుగుతున్నారు. ఇలాగైతే రైతులు ఏమైపోవాలి. –హరినాథ్, పులిచెర్ల మండలం మద్దతు ధరపై ఏమంటారు? కూటమి ప్రభుత్వం తోతాపురి కేజీకి రూ. 12 కల్పించింది. ఈ ధరకే కొనాలని చిత్తూ రు ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్వాహకులకు, మ ధ్యవర్తులకు మీడియా ముందు వార్నింగ్లు ఇచ్చారు. ఫ్యాక్టరీలు కొనలేదంటే సీజ్ చేస్తామన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చిత్తూరు పర్యటనకు వచ్చి ఫ్యాక్టరీలు కేజీ రూ.8కి కొంటాయని ప్రగాల్భాలు పలికారు. కానీ వీరి మాటలు.. వార్నింగ్లు అన్నీ ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఇప్పుడు ర్యాంపుల్లో కిలో రూ.2కు, ఫ్యాక్టరీల్లో రూ.5కు కొనోగులు చేస్తున్నారు. –విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు -
మామిడికి ‘తమిళ’ సెగ
● జిల్లాలోని మామిడిని కొనలేమంటున్న ర్యాంపు నిర్వాహకులు ● తమిళనాడు కాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని రోడ్డెక్కిన అక్కడి రైతులు ● క్రిష్ణగిరిలో ఫ్యాక్టరీల ఎదుట క్యూకట్టిన వాహనాలు ● జిల్లాలోని మామిడి కాయలకు తమిళ రైతుల సెగ ● కాయలు వద్దంటున్న క్రిష్ణగిరి ఫ్యాక్టరీలు ● కొనుగోలుకు విరామం ప్రకటించిన ర్యాంపులు కాణిపాకం : మామిడి కొనుగోలు ర్యాంపులకు తమిళనాడు రైతుల సెగ తగులుతోంది. అక్కడి తోతాపురి కాయలు రోడ్డు పాలు కావడంతో తమిళ రైతులు రోడ్డెక్కుతున్నారు. స్థానికంగా పండిన పంటకు ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలపై దండ యాత్రకు దిగుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాక్టరీలు ఆంధ్రా కాయలను వెనక్కు నెట్టుతున్నారు. ఈ దెబ్బతో జిల్లాలోని ర్యాంపులు కాయలు కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఆరు రోజుల వరకు కొనుగోలుకు విరామం పలకనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 ర్యాంపులున్నాయి. ఈ ర్యాంపులు తోతాపురి కాయలను కొనుగోలు చేసి జిల్లాలోని పలు ఫ్యాక్టరీలకు తరలించడంతో పాటు అధికంగా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరిలోని పండ్ల గుజ్జు పరిశ్రమలకు తరలిస్తున్నాయి. 30 నుంచి 40 శాతం కాయలు జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే..మిగిలిన 60 నుంచి 70 శాతం పంటను తమిళనాడులోని క్రిష్ణగిరికి పంపుతున్నాయి. ఈ క్రమంలో ర్యాంపు నిర్వాహకులకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. క్రిష్టగిరిలో పరిస్థితి ఇదీ.. తమిళనాడులోని క్రిష్ణగిరిలో గుజ్జు పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిశ్రమలకు తోతాపురి కాయలు భారీగా క్యూ కడుతున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద వందల లారీలు, ట్రాక్టర్లు కిక్కిరిస్తున్నాయి. ఇవీ అన్ లోడింగ్ కావాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ఈ కారణంగా పలు వాహనాల్లోని కాయలు మాగిపోతున్నాయి. దీంతో అక్కడి రైతులు కాయలను రోడ్డుపైనే పడేసి వెళ్లిపోతున్నారు. ఈ సమస్య ఉధృతం కావడంతో అక్కడి రైతులు రోడ్డెక్కారు. తమిళనాడు రైతులను ముందు వరుసలో పెట్టాలని ఫ్యాక్టరీని ముట్టడించారు. దీని దెబ్బకు అక్కడి ఫ్యాక్టరీలు తలొగ్గాయి. జిల్లా అధికారులు చెప్పే ధరకు కొనలేం తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50 అమ్ముడవుతోంది. ఇక్కడ రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయమంటున్నారు. ఇదీ సాధ్యం కాదు. తమిళనాడులోని ఫ్యాక్టరీలు కిలో రూ.4కు కొంటున్నాయి. మేము అదే రేటుకు కొంటే..చేతులు కాల్చుకోవాల్సిందే. ఒక్కో లారీలో 20 వేల టన్నుల కాయలు పంపుతున్నాం. టన్నుకు రూ.1300 నుంచి రూ.1500 వరకు ఇస్తున్నాం. ఇలా ఒక్క లోడ్ పంపించాలంటే లారీకి మొత్తం రూ.30 వేల వరకు ఖర్చువుతోంది. అక్కడి రైతుల సెగతో ఇక్కడి కాయలు వద్దని చెప్పారు. కాయలు కొనుగోలు ఆపేస్తున్నాం. ఈ రోజే కొనుగోలు ఆఖరు. – విజయన్, ర్యాంపు నిర్వాహకులు, చిత్తూరు కాయలు వద్దంటున్న నిర్వాహకులు తమిళళనాడులో తలెత్తిన సెగతో క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలు జిల్లా కాయలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అక్కడి కాయలు రోడ్డుపాలు కావడం, రైతుల నిరసనలు, ధర్నాలతో జిల్లా కాయలను వద్దంటున్నారని ర్యాంపు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కారణంగా కాయల కొనుగోలు వారం రోజుల పాటు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు రోజుకు 15 లక్షల టన్నుల కాయలు జిల్లా నుంచి క్రిష్ణగిరికి ఎగుమతి చేస్తున్నారు. తోతాపురి కిలో రూ.2 నుంచి రూ.2.50కు కొనుగోలు చేసి..అక్కడి ఫ్యాక్టరీలో రూ.4 వరకు విక్రయిస్తున్నారు. ఇక జిల్లా యంత్రాంగం రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ధరకు తాము కొనలేమని ర్యాంపు నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. జిల్లా నుంచి క్రిష్ణగిరికి కాయలు తరలించాలంటే లారీ బాడుగలే రూ. 30 వేలు వ్యయమవుతోందని వారు వివరిస్తున్నారు. దీనికి తోడు తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి ప్రాంతాల్లోని మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50కు పలకడంతో జిల్లాలోని ర్యాంపు నిర్వాహకులు అదే రేటును ఫిక్స్ చేశారు. ఇవన్నీ కూడా సిండికేట్ దెబ్బ అంటూ...రైతులు మండిపడుతున్నారు. -
యువతను నమ్మించి వంచించింది
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగాల కల్పనలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఇంత వరకు యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర విభాగం యువత పోరుకు పిలుపునిచ్చింది. సోమవారం ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు చర్యలు చేపట్టాం. యువత అధిక సంఖ్యలో హాజరై తమ గళాన్ని వినిపించాలి. – హేమంత్రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం హామీల అమలులో విఫలం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందింది. యువతకు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు పలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాకా యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించారు. కూటమి ప్రభుత్వం మోసానికి నిరసనగా నేడు యువత పోరు ర్యాలీ నిర్వహించనున్నాం. డిమాండ్లు పరిష్కరించకపోతో ఆందోళనలు ఉధృతం చేస్తాం. – మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు ● -
ఎంటీఎస్ టీచర్లపై కుట్ర
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) టీచర్ల బదిలీల ప్రక్రియలో ఖాళీలన్నీ చూపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభించారు. ఆ రెండు డీఎస్సీల టీచర్లకు టీడీపీ ప్రభుత్వం పాలనలో అన్యాయం జరిగితే గత వైఎస్సార్సీపీ సర్కారు మేలు జరిగేలా చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ టీచర్గా పనిచేయాలని కలలు కన్న ఆ టీచర్ల కోరికను వైఎస్సార్సీపీ సర్కారు నెరవేర్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లపై కక్ష సాధింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఖాళీలు బ్లాక్ చేసి.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్ల బదిలీల్లో కుట్రకు పాల్పడేందుకు ప్రయత్నించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీలన్నీ చూపించకుండా తక్కువ ఖాళీలను చూపించి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎంటీఎస్ టీచర్లు తమకు అన్యాయం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యాశాఖ అధికారులకు హెచ్చరించారు. దీంతో ఆదివారం ఉదయం నిర్వహించాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3.15 గంటల వరకు ప్రారంభం కాని దుస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల నుంచి హాజరైన ఎంటీఎస్ టీచర్లు పడిగాపులు కాశారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఎంటీఎస్ టీచర్ల డిమాండ్లను పరిశీలించిన జిల్లా వి ద్యాశాఖ అధికారులు సమస్యలను ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించిన తర్వాత 3.15 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షించారు. వైఎస్సార్ 98 డీఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు స్వామి కణ్ణన్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్రెడ్డి, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు ఎంటీఎస్ టీచర్ల సమస్యలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 పోస్టులకు మొదటి విడతగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 369 పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 1664 పోస్టులను ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్లో చూపించారు. ఇందులో 549 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జిల్లాలో 1115 టీచర్ల పోస్టులు మిగులు ఉంటాయి. ఆ పోస్టులను ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. -
యువతకు కూటమి దగా
● నేడు జిల్లా కేంద్రంలో ‘యువతపోరు’ నిరసనలు ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్కు ర్యాలీ ● హామీలు అమలు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్ : సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మాట తప్పింది. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో యువత పోరు నిరసన చేపట్టనున్నారు. అగమ్య గోచరంగా చదువులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయని దుస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలు ఊసే లేకుండా పోయాయి. పేద కుటుంబాల్లో పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ గతంలో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లో పెట్టారు. జిల్లాలో 183 ఉన్నత కళాశాలల్లో చదువుతున్న 24,149 మంది విద్యార్థులకు రూ.44.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా ఉన్నత చదువులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నిరసన కార్యక్రమం ఇలా.... జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న అమూల్ డెయిరీ వద్ద యువత పోరు నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి యువత విచ్చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టర్కు డిమాండ్ల వినతిపత్రం అందజేయనున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి పలు శాఖల్లో ఉద్యోగుల తొలగింపును వెంటనే ఆపాలి. ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి 20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి పోస్టులను భర్తీ చేయాలి గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి నిరుద్యోగ భృతి అమలు చేసి నిధులు కేటాయించాలి. నిరుద్యోగ భృతి విడుదల చేయాలి. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
పుంగనూరు (చౌడేపల్లె) : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయన పర్యటించిన అనంతరం పుంగనూరులో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా బాధాకరమన్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ మరుగున పడేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోయారన్నారు. అలాగే పత్తి, మిర్చి, పొగాకు, షుగర్కెన్ (చెరకు) పంటలు సాగుచేసిన రైతులు, చిత్తూరు జిల్లాలో కోట్లు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పల్ప్ ప్యాక్టరీ కూడా మ్యాంగో తోతాపూరి కొనే పరిస్థితి లేదన్నారు. కొద్దో గొప్పో కొనుగోలు చేసినా రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేస్తే రైతు ఏ విధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేరుకు మాత్రం రూ.8 ఇచ్చి కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు చెప్పడం, ప్రభుత్వం ఏమో రూ.4 సబ్సిడీ ఇస్తామని చెబితే రూ.12 గిట్టుబాటు ధర అవుతుందని అనుకుంటే బూటకపు మాటలు చెప్పి రైతుల నుంచి కేవలం రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేయడం పరిస్థితి దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిందన్నారు. ప్రతిపక్ష నేత వెళ్లకుండా అడ్డంకులు రెతులను పలకరించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వెళ్తుంటే రకరకాల అడ్డంకులు, కేసులు పెట్టడం, రైతులను, పార్టీ నేతలను వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో టమాటాకు ధరలు లేని సమయంలో గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకొన్న ఘటనను గుర్తుచేశారు. ఇప్పుడు టమాటా, మామిడి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. నాలుగేళ్ల పాటు రైతులందరూ క్రాప్ హాలిడే ప్రకటించి సెలవుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా, నాయకులు ఫకృద్దీన్ షరీఫ్, రాజేష్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్లు రైతులకు క్రాప్ హాలీడేనే చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -
యువతకు తీరని ద్రోహం
● ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు ● కూటమి ప్రభుత్వంపై భూమన ఆగ్రహం ● యువత పోరును విజయవంతం చేయాలని పిలుపుతిరుపతి మంగళం : అధికారంలోకి వస్తే ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తామంటూ మాయమాటలు చెప్పి యువతకు మొండిచెయ్యి చూపించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం విద్యార్థులకు అందించలేదని విమర్శించారు. దీంతో కళాశాలల యాజమాన్యాల వేధింపులతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సైతం అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలహీనపరచి అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులపై పెడుతున్న శ్రద్ధలో పావు వంతు కూడా యువత, ప్రజా సంక్షేమంపై చూపడం లేదని మండిపడ్డారు. ఇది ఉద్యమ సమయం కూటమి ప్రభుత్వం చేసిన మోసం, ద్రోహంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భూమన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యువత పోరుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తరలిరావాలని కోరారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అందరితో సమన్వయం చేసుకుంటూ తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ల వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని సూచించారు. అనంతరం యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు. అబద్ధపు హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వానికి హడలు పుట్టేలా భారీ సంఖ్యలో యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు. -
మామిడి రైతులను ఆదుకోవాలి
గంగాధర నెల్లూరు : మామిడి రైతుల కన్నీళ్లు చూస్తుంటే కడుపు కాలిపోతోందని రైతు ఉద్యమ నేత ఈదర వెంకటాచలం నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు పూత్తూరు మార్గంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మామిడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతుల పడుతున్న కష్టాలను గమనిస్తున్నామన్నారు. ఏడాది పొడువునా కన్న బిడ్డల్లా మామిడి పంటను సాగు చేస్తే నేడు గిట్టుబాటు ధర లేక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. కుటుంబాన్ని వదిలి వారాల పొడవున ఫ్యాక్టరీ గేట్లు ఎదుట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో తిండి నిద్రలేక రోడ్లపై రైతులు అగచాట్లు పడుతున్నా ఆదుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మామిడికి కనీసం మద్దతు ధర 50 రూపాయలు ఇచ్చి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు. -
‘తెల్ల’బోయే దోపిడీ
● తమ్ముళ్ల అక్రమ గ్రానైట్ దందా ● రైతుల భూముల్లో దౌర్జన్యంగా పనులు ● యథేచ్ఛగా పేలుళ్లు ● నిలదీసిన వారికి బెదిరింపులు ● పట్టించుకోని అధికారులు చంద్రన్నే కాపాడాలి మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులం. మా అందరికీ పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. మా తాతగారి నుంచి వచ్చిన భూమిలో గుట్టలు ఉన్న ప్రాంతంలో నీలగిరి చెట్లు పెట్టుకుని, మరికొంత విస్తీర్ణం చదును చేసి సేద్యం చేసుకుని బతుకుతున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉండి కూడా మా భూముల్లో దౌర్జన్యంగా రాళ్లు తవ్వుతుంటే ఏమీ చేయలేకపోతున్నాం. రాత్రింభవళ్లు జరుపుతున్న పేలుళ్లతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. మా పొలంలోకి వెళ్లాలంటే భయంగా ఉంటోంది.మా చంద్రన్నే (సీఎం) స్పందించి మమ్మల్ని కాపాడాలి. – మురుగేష్, బాధిత రైతు, జేబి కొత్తూరు అక్రమంగా రాళ్లను ఎత్తుకుపోతున్నారు మా అనుమతి లేకుండా, మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో రాళ్లను బ్లాకులుగా కత్తిరించి ఎత్తుకుపోతున్నారు. శాంతిపురంలో ఉన్న పెద్ద నాయకుడు వెనుక ఉండి పెద్దూరులో ఉన్న చిన్న నాయకుడితో ఈ పని చేయిస్తున్నాడు. అడిగితే కేసులు పెడతామని, ఆఫీసర్లకు చెప్పి మాకు ఉన్న భూములను కూడా పీకేసుకుంటామని అంటున్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకునే వారు లేకపోయారు. మా పార్టీ అధికారంలో ఉన్నా మా బతుకులకు దిక్కు లేకుండా పోయింది. – మునిరాజు, బాధిత రైతు, జేబీ కొత్తూరుశాంతిపురం : అధికార అండతో కొందరు తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యంలోని ప్రాంతంలో సొంత పార్టీలోని వారే వద్దని వారించినా అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. విలువైన గ్రానైట్ (తెల్లరాయి)ను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు దోచేస్తున్నారు. దీనికి అడ్డు చెప్పిన వారికి నరకం చూపుతున్నారు. తమ భూముల్లో రాళ్ల తవ్వకం పనులు చేయొద్దన్న పాపానికి ఓ కుటుంబాన్ని వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. విపక్షంలో ఉండగా అక్రమ క్వారీలను ఆపాలని పోరాటం చేసిన చంద్రబాబు పాలనలోనే కుప్పంలో కుప్పలు తెప్పలుగా అక్రమ క్వారీలు సాగుతున్నాయి. 121 పెద్దూరు పంచాయతీలోని జేబీ కొత్తూరు వద్ద ఉన్న పులిగుండ్లపల్లి ప్రాంతంలో రెండు నెలలుగా అక్రమ క్వారీ పనులు చేస్తున్నారు. రైతుల అధీనంలోని అసైన్డ్ భూముల్లో ఉన్న భారీ రాళ్లను కత్తిరించి బ్లాకులుగా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీనికి అభ్యంతరం చెప్పిన రైతు కుటుంబాలను బెదిరింపులతో నోరు నొక్కుతున్నారు. గుట్టలపై కన్నేసి చెట్ల తొలగింపు జేబీ కొత్తూరుకు చెందిన మునెప్ప కుమారులైన వెంకటరాజు, మునిరాజు, నారాయణస్వామికి అసైన్డ్ భూములు ఉన్నాయి. భాగ పరిష్కారాల్లో అన్నదమ్ములు వీటిని పంచుకున్నారు. అవకాశం ఉన్న మేర భూములు చదును చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. మిగతా భూమి గుట్టలు ఎక్కువగా ఉండటంతో వాటి మధ్య నీలగిరి చెట్లు నాటుకుని వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. కానీ ఆ గుట్టలపై కన్నేసిన టీడీపీ నాయకులు నీలగిరి చెట్లను పెకిలించి వేసి క్వారీ పనులకు పూనుకున్నారు. కంప్రెషర్లు, హిటాచీలతో బ్లాకులను సిద్ధం చేసి కర్ణాటక మీదుగా తెల్లరాయిని తరలిస్తున్నారు. తమ నీలగిరి చెట్లను ధ్వంసం చేయడంపై రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మొత్తం భూములను లాక్కుంటామని, ఓవరాక్షన్ చేస్తే కేసులు పెట్టి బొక్కలో వేస్తే జన్మలో బయటకు రాలేరని దబాయింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావడంతో ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు వారు గత్యంతరం లేక మీడియాకు సమాచారం ఇచ్చారు. తమ గోడును వెలుగులోకి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని, సీఎం చంద్రబాబు స్పందించి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అధికార పార్టీలో పట్టున్న నాయకులు సాగిస్తున్న ఈ అక్రమ బాగోతంపై అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. -
భృతి ఎగ్గొట్టారు
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులందరికీ మాయమాటలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగభృతి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచేసింది. మోసం చేయడం సబబుకాదు. – మున్నా, చిత్తూరు మోసం చేశారు 2014–2019 సంవత్సరాల్లో రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని హామీనిచ్చారు. తూతూమంత్రంగా ఆ భృతిని కొందరికే ఇచ్చి మోసం చేశారు. ఈ సారి కూడా అలాగే మోసం చేస్తున్నారు. నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం ఉచ్చులో పడి అల్లాడుతున్నారు. ఉద్యోగాలు ఏమైన ఇస్తార అంటే అది కూడ లేదు. – సంజయ్, చిత్తూరు -
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి రాత్రి వరకు ఆలయంలో రద్దీ చోటుచేసుకుంది. క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. రాత్రి వరకు కూడా రద్దీ తగ్గలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ (ఎంటీఎస్, మినిమం టైం స్కేల్) టీచర్లకు ఆదివారం బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల సీనియారిటీ జాబితా సంబంధిత మండలాలకు పంపినట్లు చెప్పారు. ఆ జాబితా ప్రకారం ఆదివారం చిత్తూరులోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. 2008 ఎంటీఎస్ టీచర్లకు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. నేడు గురుకులాల్లో సీట్ల కేటాయింపు తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆదివారం సీట్లు కేటాయించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాలికలకు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు సమీపంలోని సంజయ్ గాంధీ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అలాగే బాలురకు చిత్తూరులోని వేము ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని పూతలపట్టు బాలుర గురుకుల పాఠశాలలో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి హాజరు కావాలని ఆమె కోరారు. గిన్నిస్ రికార్డు కోసం గిరిజన పిల్లలకు కష్టాలా? చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ రికార్డు, ప్రధాని మోదీ మెప్పు కోసం గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు కోసం అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన హాస్టల్స్ నుంచి యోగాంధ్ర కార్యక్రమానికి అర్ధరాత్రి 2 గంటలకు బస్సులో తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులు నిద్రించడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇదే రీతిలో ప్రజాప్రతినిధుల పిల్లలను తరలిస్తారా..? అని ప్రశ్నించారు. వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పౌష్టికహారం పెట్టడానికి, జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించడం చేతకాదని, యోగాంధ్ర కార్యక్రమానికి మాత్రం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు మంజూరు చేయాలి. – మన్సూర్, పుంగనూరు ఇస్తారో.. ఇవ్వరో కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ట్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇప్పుడు ఆ నిధుల గురించి ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. ఇలా చేస్తే ఎలా..? – రుషి, పలమనేరు -
ఇటు కోతలు.. అటు దాడులు!
నేలరాలుతున్న మామిడి సీజన్ ఆఖర్లోనైనా ధరలు పలుకుతాయేమోనని చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలేశారు. మాగిన కాయలు రాలి నేలపాలవుతున్నాయి. ఎంత ధర దక్కినా అమ్ముదామునుకొని కాయలు దింపిన రైతులు గుజ్జు ఫ్యాక్టరీల వద్దకెళితే టోకెన్లు దొరకడం లేదు. ఫ్యాక్టరీల వద్ద బండ్లు పెట్టుకొని వేచి చూడాల్సి వస్తోంది. దీంతో కొందరు రైతులు మార్కెట్కు తీసుకెళ్లిన మామిడి కాయలను చేలల్లో పారబోసి వచ్చేస్తున్నారు. మరికొందరు తోటల్లో కాయలు కోయకుండానే వదిలిపెట్టేస్తున్నారు. టమాటాలకంటే తోతాపురి మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సకాలంలో అన్లోడ్ చేసుకోక ట్రాక్టర్ల ట్రక్కుల్లోనే కాయలు కుళ్లిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు కాయలను తోటల్లోనే వదిలేయడంతో అవి మాగి వాసన వెదజల్లుతున్నాయి. ఇదే అదునుగా ఏనుగుల మంద తోటలపై పడి ఉన్న కాయలను ఊడ్చేస్తుండడంతో మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. పలమనేరు: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏడాది మామిడి నట్టేన ముంచేసింది. తోతాపురి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. వీటికి ధరల్లేక గుజ్జు పరిశ్రమల్లో టోకెన్లు చిక్కక, స్థానిక మండీల్లో అడిగేవారు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారులేమో తోటల్లోని కాయలను పలు దఫాలుగా కోయాలని ఆంక్షలు పెడుతున్నారు. మరోవైపు తోటల్లోనే కాయలు మాగి నేలరాలుతున్నాయి. మాగిన మామిడి వాసనతో కౌండిన్య అడవిలోంచి ఏనుగుల గుంపు మామిడి తోటలపై పడి కాయలను ఆరగిస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో మరీ ఘోరం... జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడితోటలున్నాయి. ఏటా ఈ సీజన్లో 7 లక్షల టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. ఇందులో 45 వేల ఎకరాల్లో తోతాపురి రకమే ఉంది. మూడున్నర లక్షల టన్నుల దాకా తోతాపురి దిగుబడి ఉంటుంది. కాగా ఏనుగుల సంచారం ఉన్న పలమనేరు, కుప్పం, పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 40వేల ఎకరాల్లో మామిడి ఉండగా.. ఇందులో 22వేల ఎకరాలు తోతాపురి రకంగా ఉంది. వీటికి ధరల్లేక రైతులు తోటల్లోనే మామిడిని వదిలేశారు. ఇదే అదునుగా ఏనుగులు మామిడి తోటలనే టార్గెట్ చేస్తున్నాయి. పలమనేరు, బంగారుపాళెం, పెద్దపంజాణి, గంగవరం, సోమల, గుడిపాల తదితర మండలాలు కౌండిన్య అడవికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా రెండు విధాలుగా మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. లోకల్ ర్యాంపుల్లో మొదలుకాని వ్యాపారం తోతాపురికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోనే ఏటా వ్యాపారులు ర్యాంపులు పెట్టి సరుకును కొనేవారు. దీంతో ఫ్యాక్టరీలకు వెళ్లే సరుకు తగ్గేది. ఈ దఫా ధరలు లేనందున బయటి వ్యాపారులు చాలా చోట్ల ర్యాంపుల వద్ద మామిడి కాయల వ్యాపారాలు మొదలు పెట్టలేదు. బంగారుపాళెం సమీపంలో మామిడిని చేలల్లో అన్లోడ్ చేస్తున్న రైతుఏనుగులు తినేస్తున్నాయి మాకు 2.5 ఎకరాల్లో మామిడితోట ఉంది. ఈ మధ్య రెండు సార్లు ఏనుగుల మంద తోటపై పడి కాయలను తిని, కొమ్మలను విరిచేశాయి. పోనీ కాయలు దించి అమ్ముదామంటే కిలో రూ.3 కూడా కొనేవారు లేరు. సంతవ్సరానికోపంట.. దీన్ని నమ్ముకుని బతికేటోళ్లం. అందుకే మామిడితోటే వద్దనుకుంటున్నాం. – నాగరత్మమ్మ, తిప్పిరెడ్డిపల్లి భారీగా నష్టపోయాం ఈ దఫా మామిడితోటలుకొని లక్షల్లో నష్టపోయాం. తోటకు కొట్టిన మందుల ఖ ర్చు, తోటమాలి డబ్బు కూడా మిగల్లేదు. పలమనేరులో ర్యాంపు లేదు. బంగారుపాళెంకు పోవాలంటే టన్నుకు ట్రాక్టర్ బాడుగ, కూలీలకే రూ.2,500 అవుతోంది. అక్కడ టన్నుకు దక్కేది రూ.3 వేలు. మాకు మిగిలేది రూ.500. – నయాజ్, మామిడితోటల కొనుగోలుదారు, పలమనేరు పలు దఫాలుగా కోతలు కోయాలి రైతులు తోటల్లోని కాయల ను మాగినవి మాత్రమే పలు దఫాలుగా కోయాలి. అప్పుడు సీజన్ ఆఖర్ దాకా కోతలుంటాయి. ఒకేసారి కాయలన్నీ దించేసి వాటిని అమ్ముకోలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంకా ర్యాంపులు ప్రారంభం కానిచోట్ల ర్యాంపులు ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి -
మామిడి రైతులకు న్యాయం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి నేలరాలుతోందని, న్యాయం చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. శనివారం కలెక్టరేట్ వద్ద రైతు సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వ అలసత్వ వైఖరిని ఎండగట్టారు. రైతు సంఘం నాయకులు జనార్ధన్ మాట్లాడుతూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మామిడి కిలో రూ.12 పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని అనేక ఫ్యాక్టరీలు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. చాలా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాల్సింది పోయి రూ.5 ఇస్తున్నాయన్నారు. వారిని చూసి ర్యాంపుల నిర్వాహకులు రూ.3 ఇస్తున్నారని చెప్పారు. ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతుల ట్రాక్టర్లు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీని రూ.6గా అందజేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ రూ.5 ఇచ్చేలా ప్రతిపాదనలు అనంతరం రైతు సంఘ నాయకులతో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా గుజ్జు పరిశ్రమల యజమానులు రూ.6 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీ రూ.4కు బదులు రూ.5 ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ర్యాంపుల ఆగడాలను అరికడతామని హామీ ఇచ్చారు. జిల్లాలో నిబంధనలు పాటించని నాలుగు ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ర్యాంప్లను సైతం క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రైతు సంఘ నాయకులు రామానాయుడు, ఉమాపతి, మునీశ్వర్రెడ్డి, ఆనంద్నాయుడు, మునిరత్నం, హేమలత, భారతి, రాజేందర్రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ● గిట్టుబాటు ధరపై కలెక్టరేట్ వద్ద ధర్నా ● రైతులతో కలెక్టర్ చర్చలు ● ప్రభుత్వ సబ్సిడీ పెంపునకు ప్రతిపాదనలు -
మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ
చిత్తూరు కార్పొరేషన్: పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజ అనా రోగ్యం కారణంగా చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలో బంధువుల నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆమెను శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణలత, కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి పరామర్శించారు. యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పారు. తొలుత నగరంలోని దొడ్డిపల్లె సప్తకనికలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్కుమార్రెడ్డి, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్రెడ్డి, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, ప్రసన్న, మనోజ్రెడ్డి, శేఖర్, అల్తాఫ్, స్టాండ్లీ పాల్గొన్నారు. కళ్యాణ్పై పీడీ యాక్టు పలమనేరు: పట్టణంలోని మొండోళ్ల కాలనీకి చెందిన ఎం.కళ్యాణ్(30)పై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్టు పలమనేరు డీఎస్పీ డేరంగుల ప్రభాకర్ శనివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసుతోపాటు మరో పది నేరాలు కళ్యాణ్పై ఉన్నాయన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పీడీ చట్టాన్ని నమోదు చేశామన్నారు.