breaking news
Chittoor District Latest News
-
లాడ్జీల్లో వ్యభిచారం.. కేసు నమోదు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న రెండు లాడ్జీల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. మంగళవారం వన్టౌన్ సీఐ చినపెద్దయ్య, సిబ్బందితో కలిసి పలు లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది మంది మహిళలను అదుపులోకి తీసుకునిపునరావాస కేంద్రాలకు తరలించారు. లాడ్జీల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ బంగారుపాళెం: హత్య కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. మహారాష్టలోని నాగ్పూర్కు చెందిన సంతోష్ధర్మాదాస్వర్మ, రోహిత్భాస్కర్ఖడ్గీ, అబ్దుల్హబీబ్రాయిన్ రెండు నెలల క్రితం మామిడికాయల వ్యాపారం నిమిత్తం బంగారుపాళానికి వచ్చారు. తగ్గువారిపల్లెలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన సంతోష్ధర్మాదాస్వర్మ తనకు రావలసిన డబ్బుల విషయమై రోహిత్భాస్కర్ఖడ్గీని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆవేశానికి గురైన రోహిత్భాస్కర్ఖడ్గీ చాకుతో సంతోష్ధర్మాదాస్వర్మ ఛాతీపై పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడి భార్య దివంతిసంతోష్వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడిని బంగారుపాళెం–అరగొండ రహదారి కొత్తపల్లె ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. టీటీడీకి రూ.50 లక్షల విరాళం తిరుమల: టీటీడీకి మంగళవారం పలువురు దాతలు రూ.50 లక్షలను విరాళంగా అందజేశారు. గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంటర్ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన శ్రీపతి శ్రీనివాస్, కొటారు సునీల్ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నంకు చెందిన చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. దర్శనం పేరుతో టోకరా – టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ తిరుమల: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వీఐపీ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, తోమాల, సుప్రభాత సేవలు, అతిథి గృహాల్లో వసతి కల్పిస్తానంటూ భక్తులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన టీటీడీ మాజీ ఉద్యోగిని తిరుపతి టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి చేపట్టిన సంయుక్త చర్యల్లో నిందితుడు టి.అరుణ్కుమార్ (26)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం.. తిరుపతికి చెందిన అరుణ్కుమార్ గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసి, విధుల నుంచి తొలగించారు. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.2 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తులో నిందితుడు ఇదే తరహా మోసాల కేసులో 2023లోనూ అరెస్టయినట్లు పోలీసులు గుర్తించా రు. గత ఏడాది కాలంలో అతని బ్యాంకు ఖాతా ల్లో సుమారు రూ.85 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనం ఇవ్వలేదని హత్య సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి శివారుల ఒంటరిగా కూర్చుని మద్యం సేవిస్తున్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం ఇవ్వాలని కోరారు. వారెవ్వరో తెలియక పోవడంతో ఆ వ్యక్తి ద్విచక్ర వాహనం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు అతనిపై దాడి చేసి చంపేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులతో పాటు హత్య జరిగిన విషయం తెలిసి, చెప్పకుండా దాచిపెట్టిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహరాచారి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నెల 9వ తేదీన ఓటేరు వద్ద జరిగిన శ్రీనివాస్ అనే తాపీమేసీ్త్ర హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. హత్య జరిగిన రోజు మృతుడు శ్రీనివాస్ను ఓటేరుకు చెందిన ఉప్పుశెట్టి ఆకాష్, శ్రీనివాసపురానికి చెందిన వాసునూరి రాఘవేంద్ర హత్య చేయడం జరిగిందన్నారు. విషయం తెలిసినా దాచిపెట్టిన మారా టి జయవేలును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితులు చూపకుండానే ప్రెస్మీట్ నిందితులను మీడియాకు చూపకుండా దాచిపెట్టి వివరాలు మాత్రమే తెలియ పరచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏనుగుల బీభత్సం
గుడిపాల: ఏనుగులు బీభత్సం కారణంగా మంగళవారం వెంగమనాయుడుకండ్రిగకు చెందిన చంద్రశేఖర్నాయుడు ఖర్జూరపు తోట ధ్వంసమైంది. ఏనుగులు గుంపు ఒక్కసారిగా తోటను నాశనం చేసేశారు. కోతకు వచ్చిన ఖర్జూరపు పండ్లను తినేశాయి. దీంతో బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఐరాల: మండలంలోని అగరంపల్లె వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాణిపాకం ఎస్ఐ నరసింహులు కథ నం మేరకు.. తవణంపల్లె మండలం కొత్తూరు వడ్డిపల్లెకు చెందిన జగదీష్(35) ద్విచక్రవాహనంపై కాణిపాకంలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. అగరంపల్లె వద్ద ఐరాల వైపు వెళుతు న్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొ న్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
మరో పదిరోజులు సర్
ఏనుగుల బీభత్సం గుడిపాల మండలం వెంగమనాయుడు కండ్రిగలో మంగళవారం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.షెడ్యూల్ సవరింపు పాత్రికేయులపై దాడిని సహించం పాత్రికేయులపై తిరుపతిలో దాడి చేయడంపై చిత్తూరులో జర్నలిస్ట్లు మండిపడ్డారు. ర్యాలీ నిర్వహించి, ధర్నాకు దిగారు.బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 202699.97 శాతం డిజిటలైజేషన్ జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డిజిటలైజేషన్ 99.97 శాతం పూర్తి అయినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోందన్నారు. వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 1,511 మంది బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు పారదర్శకత కోసం ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవాలనుకునే వారు ఎన్నికల సంఘం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సేవను ఉపయోగించుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డీఆర్ఓ మోహన్ కుమార్, ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, వివిధ పార్టీల ప్రతినిధులు విజయసింహారెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాస్, యశ్వంత్, రమేష్, బాలసుబ్రమణ్యం, లోకనాథం పాల్గొన్నారు. జేసీ, డీసీ బాధ్యతల స్వీకరణ చిత్తూరు కార్పొరేషన్: వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్ హర్షవర్ధన్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులునాయుడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో డీసీగా పనిచేస్తున్న హర్షవర్ధన్ ఉద్యోగోన్నతిపై చిత్తూరుకు వచ్చా రు. కావలి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులునాయుడు ప్రమోషన్పై డీసీగా ఇక్కడికి వచ్చా రు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచే అమరావతి చాంపియన్ షిప్ చిత్తూరు కలెక్టరేట్ : అమరావతి చాంపియన్ షిప్ పోటీలను బుధవారం నుంచి ఆగస్ట్ 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పోటీలు చేపట్టినట్లు వెల్లడించారు. ల్లాకు చెందిన అండర్–17, అండర్–23 బాలు రు, బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. క్రీడాకారులు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా వయసు ధృవీకరణ పత్రం (10వ తరగతి మార్కుల జాబితా) సమర్పించాలన్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాడ్మింటన్, బాస్కె ట్ బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా, బాక్సింగ్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే rportr.ap.gov.in వెబ్సైట్లో నిర్ణీ త గడువులోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గతంలో శాప్ సమ్మర్ క్యాంప్, కోచింగ్, అసోసియేషన్ గేమ్స్ లో నమోదైన వారికి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ అవసరం లేదని తెలిపారు. వారు నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. మొదటిసారి నమోదు చేసుకునే కొత్త క్రీడాకారులు మాత్రం తప్పనిసరిగా ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు చిత్తూరులోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయం, లేదా 08572– 295619 నంబర్లో సంప్రదించాలని కోరారు. బయటపడిన గణపతి ప్రతిమ తవణంపల్లె(ఐరాల): తవణంపల్లె మండలం అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయ సమీపంలో మంగళవారం రాతి గుండుపై చెక్కబిన అతి పురాతనమైన గణపతి ప్రతిమ బయట పడింది. అర్ధగిరి ప్రదక్షిణకు సాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో వెలుగు చూసిన ప్రతిమకు స్థానికుల భక్తిప్రపత్తులతో పూజలు చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ మరో పదిరోజుల పాటు కొనసాగనుంది. జిల్లాలో ఇప్పటికీ పలువురు ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్ఓలకు తిరిగి ఇవ్వకపోవడం, మరోవైపు డేటా ఎంట్రీలో కొద్దిపాటి పెండింగ్ ఉండటంతోనే కేంద్ర ఎన్నికల సంఘం సవరణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అందిన అధికారిక నివేదిక ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ 99.97 శాతానికి చేరింది. లక్ష్యం వంద శాతం జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 12,04,840 మంది ఎన్యూమరేషన్ ఫారాలను మాత్రమే డిజిటలైజ్ చేయగలిగారు. అంటే కేవలం 89.90 శాతం మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. మిగిలిన 10.10 శాతం ఓటర్లకు సంబంధించిన ఫారాలు ఇంకా చేరకపోవడం, ప్రాసెస్ కాకపోవడం గమనార్హం.అన్న్కలెక్టబుల్ (మరణించిన, వలస వెళ్లిన) ఓటర్ల సంఖ్యను కలిపితే మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ 99.97 శాతానికి చేరుకున్నప్పటికీ.. వంద శాతం పూర్తి కావడానికి ఇంకా 396 ఓటర్ల ఫారాలు డిజిటలైజ్ కావాల్సి ఉంది. కుప్పంలోనే పెండింగ్! కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 391 ఫారా ల డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది. ఇక్కడ మొ త్తం డిజిటలైజేషన్ ప్రక్రియ 99.83 శాతం పూర్తయింది. పలమనేరు నియోజకవర్గంలో 5 ఫారాలు పెండింగ్లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో పెండింగ్ ఫారాల సంఖ్య సున్నాగా నమోదై, 100 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు నివేదికలో పేర్కొన్నారు. అన్కలెక్టబుల్ జాబితాలో లక్ష మందికి పైగా ఓటర్లు ప్రత్యేక సవరణ సర్వేలో జిల్లావ్యాప్తంగా మొత్తం 1,34,890 మంది ఓటర్లను (10.07 శాతం) అన్న్కలెక్టబుల్గా గుర్తించారు. ఇందులో మరణించిన ఓటర్లు 41,642, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 53,754, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన వారు 17,892, గైర్హాజరైన వారు 21,513, ఇతర కేసులు 89 ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు అత్యధికంగా పలమనేరులో 15,080 మంది, మరణించిన ఓటర్లు అత్యధికంగా పలమనేరులో 8,761 మంది, పూతలపట్టులో 7,654 నియోజకవర్గాల్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హర్షవర్ధన్ శ్రీనివాసులునాయుడుతమ్ముళ్ల ఆదాయ వనరుగా ‘ఓటీఎస్’ పరిశీలించి.. అర్హుల జాబితా చిత్తూరు రూరల్ (కాణిపాకం): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తూ తెచ్చిన వన్టైమ్ సెటిల్మెంట్ పట్టాలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు ఆదాయ వనుగా మారిపోయాయి. కేవలం రూ.10 నామమాత్రపు రుసుముతో, వందలాది మందికి ’జీరో పేమెంట్’ కింద రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పేదలకు పంచాల్సిన పట్టాలను పచ్చమూక మాయం చేసేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. సచివాలయాల్లో భద్రంగా ఉండాల్సిన ఈ హక్కు పత్రాలను తెలుగు తమ్ముళ్లు తమ సొంత గల్లా పెట్టె లా మార్చుకోవాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల దాగుడు మూతలు చిత్తూరు మండలంలోని 17 పంచాయతీల్లోని సచివాలయాకు గత ప్రభుత్వ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాదాపు 4 వేలకు పైగా ఓటీఎస్ పట్టాలనుఅందజేశా రు. అయితే ప్రభుత్వం మారాక ఈ పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అప్పటి నుంచి లబ్ధిదారులు తమ హక్కు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగే లా తిరుగుతున్నారు. పంచాయతీ కార్యదర్శులను అడిగితే మా దగ్గర పట్టాలు లేవని చేతులెత్తేస్తున్నారు. గతంలని సిబ్బందిని అడిగితే మాకేమీ తెలియదు అంటూ తప్పించుకుంటున్నారు. హౌసింగ్ అధికారులను ఆశ్రయిస్తే..మేము ఎప్పుడో ఆ పట్టాలను సచివాలయాలకు అప్పగించేశాం.. మాకు సంబంధం లేదని తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో అసలు పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పచ్చనేతల బేరం పట్టా కావాలంటే మాముళ్లు ఇచ్చుకోవాలని తమ్ముళ్లు హుకుం జారీ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎంత బరితెగించిందంటే.. చిత్తూరు మండలంలో ఒక పచ్చ నేత ఏకంగా తమ పార్టీకి చెందిన కార్యకర్తనే ఏకంగా రూ. 90 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు కార్యకర్త ఆవేదన తమ పార్టీ నేతల వద్ద గోడు వెళ్లబోసుకున్నా డు. దీనిపై విచారించగా, అధికారుల పేరు చెప్పి సద రు టీడీపీ నేత తన జేబు నింపుకుంటున్నట్లు తెలిసింది.రూ.10 చెల్లిస్తే చేతికి అందాల్సిన పట్టాలను దాచేసి, వాటిని బ్లాక్మార్కెట్ చేస్తున్న పచ్చ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, పట్టాలు ఎక్కడున్నాయో తేల్చాలని, దళారుల చేతిఓని పేదల హక్కు పత్రాలను తక్షణమే లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ప్రతి మామిడి రైతు వివరాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా పరిశీలించి సబ్సిడీకి అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్లో ఉద్యానవన, పలు శాఖల అధికారులతో సమా వేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ మామిడి రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీని పారదర్శకంగా, నిజమైన రైతులకే అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఈ మేరకు మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఉమ్మడి బృందాలను ఏర్పా టు చేయాలని సూచించారు. ఈ–క్రాప్ డేటా తప్పనిసరి మామిడి పంట నమోదు వివరాలను ఈ–క్రాప్ డేటాతో తప్పనిసరిగా సరిపోల్చాలని, కేవలం రికార్డులపైనే ఆధారపడకుండా భౌతిక పరిశీలన చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ–క్రాప్లో నమో దు లేకపోయినా.. క్షేత్రస్థాయిలో పంట ఉంటే, నిబంధనల ప్రకారం వారికి ఈ–క్రాప్ నమోదు పూర్తి చేసి అర్హత కల్పించాలన్నారు. రైతు మరణిస్తే కుటుంబ సభ్యులకు.. ఈ–క్రాప్లో నమోదై ఉండి రైతు మరణించిన సందర్భంలో కుటుంబీకులకు న్యాయం చేయాలని, నిబంధనల ప్రకారం సబ్సిడీ అర్హత నిర్ణయించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. అలాగే రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వరన్, హార్టికల్చర్ అధికారి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నెల 24 వరకు డెడ్లైన్! ఎన్యూమరేషన్ ప్రక్రియలోని ఈ లోపాలను సరిదిద్దడానికి, అలాగే క్షేత్రస్థాయిలో ఇంకా ఓటర్ల నుంచి తిరిగి రాని ఫారాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇప్పటికై నా ఓటర్లు స్పందించి తమ ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే అందజేయాలని, అలాగే బీఎల్ఓలు మిగిలిన కొద్దిపాటి పెండింగ్ను యుద్ధప్రాతిపదికన డిజిటలైజ్ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ఒక్క నెల.. లక్షలాది మంది ఓటర్లు.. క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి.. పూర్తి చేసిన వాటిని సేకరించాలి.. వివరాలను తనిఖీ చేయాలి.. అనంతరం మ్యాపింగ్ చేయాలి.. ఇదే లక్ష్యంతో కలెక్టర్ నుంచి బీఎల్ఓ వరకు పరుగులు తీశారు. ప్రధానంగా మంగళవారం ఆఖరి రోజున తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు. పెద్దసంఖ్యలో ఈఎఫ్లు తిరిగిరాలేదు. డేటా ఎంట్రీ సైతం కొద్దిపాటి పెండింగ్ ఉండిపోయింది. ఈ క్రమంలో ఓటర్ల సవరణ ప్రక్రియను పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జిల్లా యంత్రాగానికి కాస్త ఉపశమనం లభించింది. ఈ మేరకు ఎస్ఐఆర్ మరో పదిరోజుల పాటు కొనసాగనుంది. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ను సవరించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు నిర్వహించే ఇంటింటి ఓటరు సర్వే ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ గడువుకే పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 31వ తేదీన ప్రచురిస్తారన్నారు. అనంతరం ఆగస్టు 30వ తేదీ వరకు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారని వివరించారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ సెప్టెంబర్ 28వ తేదీ నాటికి అధికారులు పూర్తిగా పరిష్కరిస్తారన్నారు. అన్ని సవరణల అనంతరం అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. జిల్లాలో అత్యంత పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇంటింటి సర్వేకు వచ్చే బీఎల్ఓలకు ఓటర్లు సరైన వివరాలను అందించి, పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. -
అయ్యోర్ల ఆగ్రహం
చిత్తూరు కలెక్టరేట్ : పీఆర్సీ ఎక్కడ? ఐదు డీఏలు ఏమయ్యాయి అంటూ ఫ్యాఫ్టో నేతలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) నేతలు మంగళవారం ర్యాలీ, పికెటింగ్, ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుల సుదీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు నరోత్తం రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వందలాది మంది ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ మణిగండన్, సెక్రటరీ జనరల్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ధరల పెరుగుదలకు అనుగుణంగా టీచర్ల ఆర్థిక భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. జూలై 2023 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని కోరారు. ఉపాధ్యాయులకు కనీసం 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉండిపోయిన 5 కరువు భత్యం జీఓలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలను వెంటనే జమ చేయాలని స్పష్టం చేశారు. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ పెండింగ్లో ఉన్న ఉద్యోగోన్నతుల ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలన్నాని కోరారు. అర్హులైన వారికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సంపూర్ణంగా మద్దతిస్తాం జిల్లా జేఏసీ చైర్మన్ కేవీ రాఘవులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి జేఏసీ తరఫున సంపూర్ణంగా మద్దతిస్తామని ప్రకటించారు. అనంతరం ఫ్యాప్టో జిల్లా కమిటీ ప్రతినిధులు డీఆర్ఓ మోహన్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఫ్యాప్టో కో–చైర్మన్లు రామమూర్తి, అరుణ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరళ్లు ఎన్ఆర్ మదన్ మోహన్ రెడ్డి, చలపతిరావు, పీహెచ్ జగదీష్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు రెడ్డెప్ప నాయుడు, సురేష్, గిరి యాదవ్, ఇలియాస్ బాషా, ముక్తార్ అహ్మద్, దీనావతి, యువరాజు, రహనా బేగం, దేవరాజులు, ఎస్పీ బాషా, ఏకాంబరం, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులపై దాడిని సహించం
– చిత్తూరులో జర్నలిస్టు సంఘాల ఆందోళన చిత్తూరు కలెక్టరేట్: తిరుపతిలో టీడీపీ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని కవర్ చేయడానిక వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆ పార్టీ నేతలు దాడి చేయడం దారుణమని, ఇలాంటి దుర్మార్గాలను సహించమని జర్నలిస్ట్లు మండిపడ్డారు. మంగళవారం చిత్తూరులో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. చిత్తూరు ప్రెస్క్లబ్, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీగా చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ మాట్లాడుతూ మంత్రుల సమక్షంలో పాత్రికేయులపై టీడీపీ నేత లు భౌతిక దాడులుచేసి, రక్తగాయాలు వచ్చేట్లు కొట్టడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటి వరకు కేసు నమోదు కాకపోవడం అన్యాయమన్నా రు. ఈ ఘటనపై కనీసం మంత్రులు క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలని, నిందితులను టీడీపీ నుంచి సస్పెండ్చేసి.. క్రిమినల్ కేసులు పెట్టాల ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే పాత్రికేయుల పరిరక్షణ కమిటీను ఏర్పా టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంత రం ఆర్డీఓకు వినపతిపత్రం అందజేశా రు. చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, కాళేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ పాల్గొన్నా రు. అలాగే ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు సైతం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. పాత్రికేయులపై దాడు లకు పాల్పడ్డవాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు ప్రకాష్, కేశవులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా సిలిండర్ల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో పూర్తి పారదర్శకత పాటించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్యాస్ బుకింగ్, పంపిణీ విషయంలో లబ్ధిదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను డీలర్లు తక్షణమే పరి ష్కరించాలని సూచించారు. గ్యాస్ డెలివరీ సమయంలో భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. నాణ్యతను మరింత మెరుగుపరుస్తూ వినియోగదారుల కు నమ్మకమైన సేవలు అందించాలని కోరారు. ఇన్చార్జి డీఎస్ఓ లక్ష్మీ పాల్గొన్నారు. వృద్ధురాలి దారుణ హత్య తిరుపతి రూరల్: తిరుపతి నగర శివారులోని జయనగర్లో మంగళవారం సాయంత్రం వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. కత్తితో కిరాతకంగా పొడిచి ఆమె మెడలోని బంగారు గొలుసు, చెవి పోగులు, చేతి ఉంగరం తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్లో నివాసముంటున్న మల్లెమాల జ్యోతి (65) వంట గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. అబ్బాయిని అమెరికాకు పండానికి వెళ్లి! జ్యోతి కుమారుడు ఉదయ్ బెంగళూరు నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా అతనికి వీడ్కోలు పలికేందుకు తండ్రి కృష్ణారెడ్డి ఆదివారం తిరుపతి నుంచి బెంగళూరు వెళ్లారు. జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె ధరించిన బంగారు గొలుసు, కమ్మ లు, ఉంగరాన్ని లాక్కెళ్లారు. దుండగులు ఇంటి బ యట నుంచి తలుపులకు తాళం వేసుకుని వెళ్లడంతో ఆమె మృతి చెందిన విషయం ఎవ్వరికీ తెలియ లేదు. భర్త ఫోన్కు స్పందించకపోవడంతో... బెంగళూరులో ఉన్న కృష్ణారెడ్డి తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో తమ పైఅంతస్తులో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. అదే సమయానికి ఇంటి పని మనిషి కూడా తలుపులు కొడుతున్నా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇంటి యజమాని వద్ద ఉన్న తాళం తీసుకువచ్చి తెరిచి చూడగా అప్పటికే జ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది. మృతురాలి భర్త ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
మహిళా సాధికారత అవసరం
నారాయణవనం: పోటీ ప్రపంచంలో మహిళలకు సాధికారతతో పాటు ఆరోగ్యం ఎంతో అవసరమని పలువురు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిద్ధార్థ ఇన్న్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘సాధికార మహిళలు – ఆరోగ్యకరమైన జీవితం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తిరుపతి ఆకృతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అఖిల మాట్లాడుతూ జీవితంలో కీలకమైన విద్యార్థి దశలో వ్యక్తిగత ఆరోగ్యపరమైన నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయన్నారు. శారీరక, మానసిక భావోద్వేగాలు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. మంచి భావాలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు బలపడతాయన్నారు. ప్రిన్సిపల్ జనార్దనరాజు, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులో అన్ని సబ్జెక్టుల డీఆర్పీలకు రెండు రోజులపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లు నైపుణ్యాలు పెంచుకోవాలని కోరారు. శిక్షణలో జాతీయ విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, అకడమిక్ క్యాలెండర్, టీచర్స్ హ్యాండ్బుక్, విద్యార్థుల మూల్యాంకన పుస్తకం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, లీప్ యాప్ వినియోగం వంటి కీలకమైన అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ లభించిన నైపుణ్యాలతో డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణ తరగతులను విజయవంతం చేసి, విద్యా సంస్కరణల అమలుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. -
రచ్చకెక్కిన ‘కూటమి’
సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు నగరంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలపై ఆరోపణలు రచ్చకెక్కాయి. జనసేన మహిళా నేత తనను బెదిరిస్తున్నారని ఓ మహిళ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ప్రోద్బలంతోనే ఆ మహిళ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జనసేనమహిళా నేత మీడియా సమావేశంలో మండిపడ్డారు. తాజాగా చిత్తూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మహిళ ఆరోపణలు ఇలా.. తమిళనాడుకు చెందిన ఫాతిమా అనే మహిళ తన కుమార్తె చదువుకోసం చిత్తూరు రామ్నగర్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ ఇంటిపై జనసేన నేత ఆరణి కవిత, చంద్రమౌళికి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. లీజు సమయంలో తాను ఇచ్చిన నగదు తిరిగివ్వకుండా ఇల్లు ఖాళీ చేయాలని ఆరణి కవిత, ఆమె మేనల్లుడు ఆరణి జ్యోతీశ్వర్, వీరం వినోద్ అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని ఫాతిమా ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు అనుచరులు తనకు ఫోన్చేసి తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొన్ని ఆడియోలు సైతం తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరారు. కూటమి నేతలపై ఆరోపణలు చేస్తున్న ఫాతిమా చిత్తూరు ప్రెస్క్లబ్లో మాట్లాడుతున్న జనసేన నేత కవిత అన్నీ అతడివల్లే.. అయితే ఫాతిమా చేసిన ఆరోపణలను జన సేన నేత ఆరణి కవిత తోసిపుచ్చారు. మంగళవారం ఆమె చిత్తూరులోని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. తన కు, తన మాజీ భర్తకు మధ్య గత ఎనిమిదేళ్లుగా సాగు తున్న వివాదానికి కుల పెద్దలు, టూటౌన్ పోలీసుల సమక్షంలో ఎప్పుడో ముగింపు పడిందన్నారు. భరణం కింద నా పేరు, చంద్రమౌళి పేరు మీద ఉన్న ఇంట్లో సగభాగా న్ని తనకు ఇచ్చారన్నారు. అయితే, ఆ ఇంట్లో లీజుకు ఉంటున్న ఫాతిమా అనే మహిళ ఇల్లు ఖాళీ చేయకుండా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. దీని వెనుక తన మాజీ భర్త చంద్రమౌళి ఉన్నారన్నారని ఆరోపించారు. తమ మధ్య గొడవలోకి టీడీపీ నేత కాజూరు బాలాజీ ఎంట్రీ ఇచ్చి, తన సమస్యను మరింత పెద్దది చేశారన్నారు. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సెటిల్మెంట్లకు కాడ కాజూరు బాలాజీ, ఆయన అనుచరులే ఉంటారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తోంది వైఎస్సార్సీపీ నేతలు కాదని, జనసైనికులమని చెప్పుకు తిరుగుతున్న ఆ ఐదుగురేనన్నారు. ఈ కుట్రలపై ఇప్పటికే జనసే న పార్టీ కార్యాలయానికి ఫిర్యా దు చేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధిస్తున్న వారిపై పోలీసులు సైతం తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, తనకు రక్షణ కల్పించాలని ఆరణి కవిత డిమాండ్ చేశారు. -
అమరావతిలో అమెజాన్ అడవులా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబునాయుడు, పచ్చ పత్రికలు తలుచుకుంటే అమెజాన్ అడవులే కాదు.. ఏపీ అంతా ఏసీ చేయిస్తామని చెప్పగల సమర్థులని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో రూ.17.58 కోట్లతో మినీ అమెజాన్ అడవి ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనంపై భూమన స్పందించారు. ఈ విషయంపై మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘అమరావతిలో మినీ అమెజాన్. దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం. జలపాతం సవ్వళ్లు, పక్షుల కిలకిలారావాలు, అద్భుతమైన మినీ అమెజాన్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు. 20 వేలకు పైగా చెట్లు, మొక్కల ఏర్పాటు. గుబుళ్లతో అడవిని సృష్టిస్తారట. అందులో 400 జాతుల వృక్షాలు, మొక్కలు. బాగా పొడవైన, ఎత్తైన చెట్లు ఉంటాయట. అంతేకాకుండా, ఆ ఐదు ఎకరాల్లో జీవ వైవిధ్య పరిరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి వన్యప్రాణాల ఆవాస యోగ్యంగా చేయడ మే కాకుండా, చిన్నచిన్న తటాకాలు, సెలయేళ్లను కూడా ఏర్పాటు చేస్తారట’ అని చంద్రబాబు గొప్పత నం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంద్రలోకం మాదిరిగా సృష్టిస్తారేమో అమరావతిలో పసిఫిక్ మహా సముద్రాన్ని, హిమాలయ పర్వతాన్ని, ఇంద్రలోకంలో మాదిరిగా ఇక్కడ కూడా అప్సరసలను ఏర్పాటు చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తారేమోనని భూమన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతంతో పోలిస్తే అక్కడ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి ఉంటుందంట.. ఐదు ఎకరాల్లో సాక్ష్యాత్తు అమెజాన్ అడవుల్నే అమరావతిలో దించేస్తారట అని ఎద్దేవా చేశారు. ఈ మాయాజాలం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ముందు సౌకర్యాలు కల్పించండి చంద్రబాబూ.. మీరు ఆలోచిస్తే చాలు.. మీ కాళ్లకు కా దు కదా, మీ చెప్పులకు కూడా భజన చేసే పత్రికలు, చానళ్లు ఉన్నాయి. ఇన్ని గొప్పలు చేయాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది. దయచేసి ఆంధ్ర ప్రజల కోసమని రూ.2.5 లక్షల కోట్లతో నిర్మించే అమరావతిలో సౌకర్యాలు కల్పించండి.. అని భూమన సూచించారు. -
ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.కోట్లు స్వాహా!
– పుత్తూరులో సంచలనం పుత్తూరు: పట్టణానికి చెందిన పలు విద్యా సంస్థల అధినేత కోడలు ఆన్లైన్ ట్రేడింగ్లో సుమారు 5 కేజీల బంగారానికి సమానమైన రూ.7 కోట్ల మేరకు నష్ట పోయినట్లు సమాచారం. ఈ విషయం బయ టకు పొక్కడంతో ఈ కేసు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. భర్తకు సైతం తెలియకుండా తాను భారీ గా డబ్బు సంపాదించాలనుకొన్న ఆ ఇంటి కోడలు నిర్వాకంతో ఆ కుటుంబం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. పుత్తూరులోనే హాస్టల్ నిర్వాహుకురాలైన తన స్నేహితురాలి బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మొత్తం ఆన్లైన్ ట్రేడింగ్ వ్యవహారం నడిచినట్లు సమాచారం. పోగొట్టుకొన్నది తిరిగి సంపాధించాలన్న పట్టుదలతో తమకు తెలిసిన వ్యక్తులైన సుమారు 50 మంది నుంచి ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు ఆమైపె ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరందరి మొత్తాలను కలిపితే కోట్లల్లోనే ఉంటుందని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కూడా ఆన్లైన్ ట్రేడింగ్లో భారీగా నష్ట పోవడంతో పాటు, ఇతరులు నష్ట పోవడానికి కారకురాలు కావడంతో ఈ కేసులో ఆమె పాత్రపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆ మహిళ ఒకవైపు బాధితురాలు, మరోవైపు నిందితురాలుగా మారడం పెద్ద చర్చనీయాశమైంది. ట్రేడింగ్లో నష్టపోయిన కోట్లాది రూపాయలకు లెక్కలు ఉన్నాయా, ఎవరి వల్ల ఎవరు నష్ట పోయారు వంటి అన్ని అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు మీడియా ముందు ఉంచుతామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. -
ఇది తాత్కాలిక వాయిదా మాత్రమే
చిత్తూరు కలెక్టరేట్ : మంత్రుల హామీతో ఉద్యోగుల సన్నద్ధ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ హుస్సేన్, కో–చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్ల న్యాయపరమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యల పరిష్కారం పై రాష్ట్ర మంత్రిమండలి కమిటీ ఇచ్చిన హామీ మేరకు ఈనెల 21న శ్రీకాకుళంలో నిర్వహించ తలపెట్టిన ‘ఉద్యోగుల సన్నద్ధ సభ’ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమావేశంలో మంత్రుల కమిటీకి 23 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశామని వివరించారు. 21న జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వచ్చే సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని, ఆ తర్వాతే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఆర్టీసీ విభాగం జిల్లా చైర్మన్ పి. మురుగేష్, మున్సిపల్ వర్కర్స్ విభాగం జిల్లా అధ్యక్షులు గంజి రామమూర్తి, అగ్నిమాపక, ప్రభుత్వ డ్రైవర్ల సంఘాల జిల్లా అధ్యక్షులు జి.నరేష్, శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శరవణతో పాటు జిల్లా యూనిట్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. -
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్
చిత్తూరు కలెక్టరేట్ : 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 53 జారీ చేయడంపై ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 అమలుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లలో ఎంపికై , సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకే ఒక్క సారి ఓపీఎస్ను ఎంచుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించిందన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల సుదీర్ఘ కల సాకారమైందని తెలిపారు. వినాయకుడి సేవలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి కాణిపాకం: కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారిని కేంద్ర ఎలక్షన్ కమిష నర్ కార్యదర్శి నవీన్కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈఓ పెంచలకిషోర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించు కున్న నవీన్కుమార్కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఈఓ శేషవస్త్రం, స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశా రు. దర్శనానంతరం దేవస్థానం అతిథి గృహానికి చేరుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శికు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు పూలమొక్కను అందజేశారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. రాయలసీమ బలిజలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి నగరి : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రాయలసీమ బలిజలకు అవకాశం కల్పించాలని రాయలసీమ బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని జాతీయ కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కాపు సంఘ కార్యాలయం వద్ద జాతీయ కాపు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఎంవి.బాబు, ప్రచార కార్య దర్శి గోపీరాయల్, సీనియర్ నాయకుడు జ్యోతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘ నేతలు తమ డిమాండ్ను కూటమి ప్రభుత్వం ముందు ఉంచారు. గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానా న్ని రాయలసీమ బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు. సమావేశంలో కాపునాయకులు శేఖర్, వాసు, గోపి, సౌందర్రాజన్, అయ్య ప్ప, కదిర్వేలు, మణి పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి పుత్తూరు: స్థానిక పున్నమి సర్కిల్ సమీపంలోని మహాలక్ష్మీపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియన వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ బి.వెంకటలక్ష్మి కథనం.. సుమారు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మహాలక్ష్మీపురం వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నె వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి ఒంటిపై తెలుపు,నలుపు గీత ల గళ్లు కలిగిన ఫుల్ షర్టు, బిస్కెట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. కుడి చేతిపై చంద్రశేఖర్ అని పచ్చబొట్టు ఉంది. ఈ మేరకు పుత్తూరు పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది జైలు చిత్తూరు అర్బన్: కట్టుకున్న భార్యను శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో ముద్దాయి వై.సీమాన్ సుదర్శన్కు ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడో అద నపు జుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయ స్థానం సోమవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి కథనం మేరకు.. చిత్తూరు నగరం భరత్నగర్ కాలనీకి చెందిన మౌనిక అనే మహిళకు, తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన వై.సీమాన్ సుదర్శన్తో పెళ్లయ్యింది. అయితే పెళ్లయ్యిన కొద్ది నెలలకే తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని 2020లో చిత్తూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. దీనిపై ఎస్ఐ కె.నిత్యానంద పిళ్లై కేసు నమోదుచేసి, దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. సుదర్శన్పై సాక్ష్యాధా రాలతో సహా కోర్టులో కేసు రుజువయ్యింది. మిగిలిన వాళ్లపై న్యాయస్థానం కేసు కొట్టేసింది. ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఏఎస్ఐ పరంధామనాయుడు, మహిళా ఎస్ఐ కరీమున్నిసా, అప్పటి ఎస్ఐ నిత్యానంద పిళ్లైని ఎస్పీ అభినందించారు. -
ఎరువు..బరువు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. ఆశించిన స్థాయిలో వర్షం కురవకుండా మొండికేస్తున్నాయి. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతుండడంతో ఖరీఫ్ సాగుకు రంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,268 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు సాగులో ఉన్న పంటలు 3,262 హెక్టార్లు మాత్రమే. చాలా మంది విత్తనా లు వేసేందుకు సిద్ధమవుతుండగా, ఎరువుల షాపుల ముందు కనిపిస్తున్న ధరల పట్టికలు వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. యూరియా, డీఏపీ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పంట దిగుబడికి ప్రాణాధారమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బస్తాకు రూ.300 నుంచి ఏకంగా రూ.700 వరకు ధరలను పెంచేయడంతో, సాగు ఖర్చు ఊహించని విధంగా తడిసి మోపెడవుతోంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రభుత్వం కొన్ని ఎరువులకే రాయితీని పరిమితం చేసింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలను నిర్ణయించే అధికారాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి. నిమ్మకు నీరెత్తిన సర్కారు ఎరువుల కొరతను సాకుగా చూపుతూ కొందరు డీలర్లు బ్లాక్ మార్కెటుకు తెరలేపారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలు చెల్లిస్తేనే ఎరువులు దొరుకుతున్నాయని, లేదంటే నిల్వలు లేవని సమాధానం వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలకులు క్షేత్ర స్థాయి పరిస్థితులను విస్మరించి, కేవలం రంగురంగుల ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని, ఎరువుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రకృతి ప్రకోపాలు, మద్దతు ధర లేక అగచాట్లు.. వెరసి వ్యవసాయం అంటేనే ఇప్పుడు పీడకలగా మారింది. ఆరుగాలం కష్టపడినా పెట్టిన పెట్టుబడి సైతం చేతికందని దుస్థితి నెలకొంటోంది. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడం రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుంటుపడటమే కాకుండా, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో అన్నదాతలు అగచాట్లు పడాల్సి వస్తోంది. దడ పుట్టిస్తున్న కొత్త ధరల పట్టిక ఎరువు పాత కొత్త పెరిగిన రకం ధర (రూ.) ధర (రూ.) భారం (రూ.) 16–20–0–13 1,400 2,000 + 600 12–32–16 1,900 2,450 + 550 10–26–26 1,950 2,450 + 500 14–35–14 1,900 2,350 + 450 24–24–0 2,000 2,450 + 450 ఎస్ఎస్ పి 615 1,000 + 385 16–16–16 1,675 2,050 + 375 20–20–0–13 1,800 2,150 + 350 15–15–15–09 1,650 1,950 + 300 ఎంవోపి 1,850 1,975 + 125 ఈ భారం ఎలా మోసేది? విజయ డెయిరీ మూసివేసి కొన్నాళ్లు చాలా అవస్థలు పడ్డాం. పాడి పరిశ్రమను వదులుకున్నాం. కొన్నాళ్లకు షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో చెరుకు సాగు విస్తీర్ణం పడిపోయింది. సబ్సిడీ వేరుశన విత్తనాలు సకాలంలో అందించకపోవడంతో సాగుకు సమాయత్తం కాలేని పరిస్థితి దాపురించింది. ఇక మామిడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అరకొరగా సాగయ్యే పంటలకు కూడా ఎరువుల భారం పడితే రైతులు ఏం చేయాలి..? పంట వేస్తే ఎరువులు దొరకవు, దొరికితే కొనే ధర ఉండదు. మరి మేం సాగు చేయడం ఎందుకు? –హేమంత్నాయుడు, కుర్చివేడు, చిత్తూరు మండలం -
ఇది తాత్కాలిక వాయిదా మాత్రమే
సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న తలపెట్టిన ఉద్యోగుల సన్నద్ధ సభను తాతాలికంగా వాయిదా వేశారు.ఎరువు..బరువు జిల్లాలో ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కాంప్లెక్స్ ఎరువుల ధర రెట్టింపయ్యింది. మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026వివిధ ప్రాంతాల నుంచి అర్జీలిచ్చేందుకు విచ్చేసిన ప్రజలు23న ధర్మకర్తల మండలి సమావేశం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం ఈనెల 23న జరగనున్నట్లు ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి ధర్మకర్తల మండలి సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. 99 శాతం డిజిటలైజేషన్ పూర్తి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ 99 శాతం పూర్తయినట్టు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికి 99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్టు వివరించారు. డిజిటలైజేషన్న్ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. మిగి లిన శాతాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా లని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా పురోగతి ఇలా... జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ వివరాలను కలెక్టర్ వెల్లడించారు. నగరిలో 100 శాతం, జీడీ నెల్లూరులో 99.82 శాతం, పలమనేరులో 99.57, పూతలపట్టులో 99.23, చిత్తూరులో 97.96, కుప్పంలో 97.42 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై కఠిన చర్యలు గుడిపాల: గుడిపాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన వైద్యశాఖ బృందం సోమ వారం తనిఖీలు నిర్వహించింది. ఆరోగ్యకేంద్రం పరిధిలో ఉన్న తుమ్మిందపాళ్యంలో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు ఎటువంటి రికార్డులు లేక వైద్యసేవందించడంపై మండి పడింది. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యసేవలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీషనర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాము నివేదికలు సిద్ధం చేసినట్టు వెల్లడించింది. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని సూచించింది. న్యాయం జరగాలి ‘మేము ఎస్సీ కులానికి చెందిన పేదవారం. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వెదురుకుప్పం మండలం, దేవరగుడిపల్లి పరిధిలోని సర్వే నం.288లో 3.88 ఎకరాల భూమినిచ్చింది. కానీ, మాకు తెలియకుండానే ఓసీ కులానికి చెందిన సుందరరామయ్య అనే వ్యక్తి దౌర్జన్యంగా మా భూమిని ఆన్న్లైన్ చేయించుకున్నాడు. ఇప్పుడు వేణుగోపాల్, నందగోపాల్ అనే వ్యక్తులు మమ్మల్ని మా సొంత భూమిలోకి కూడా రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మాకున్న ఒకే ఒక్క జీవనాధారాన్ని లాగేసుకుంటే మేము ఎలా బతకాలి?. క్షేత్ర స్థాయిలో అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్న న్యాయం జరగడమే లేదు. మా భూమి మాకు దక్కేలా చూడాలి. – సంతోషం, బాధితురాలు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం మండలం తిరిగి..తిరిగి అలసిపోతున్నా ‘నా పేరు మీద ఐరాల మండలం పి.యర్రేపల్లి గ్రామంలో ఖాతా నం.1575, సర్వే నం.1045/1డీ పరిధిలో 0.75 సెంట్ల భూమి ఉంది. చాలా సంవత్సరాలుగా నాకు క్రమం తప్పకుండా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వచ్చేవి. కానీ, ఈ సారి హఠాత్తుగా పథకం డబ్బులు నిలిచిపోయాయి. ఎందుకని వ్యవసాయశాఖ అధికారులను అడిగితే.. నా పేరు మీద భూమి ఆన్న్లైన్లో చూపించడం లేదని చెప్పారు. రికార్డుల్లో స్పష్టంగా భూమి ఉన్నా, కంప్యూటర్ ఆన్లైన్ లోపాల వల్ల నా పేరు ఎగిరిపోయింది. రెవెన్యూ అధికారుల తప్పిదానికి నేను పథకానికి దూరం కావాల్సి వచ్చింది. కలెక్టరేట్కు తిరిగి తిరిగి అలసిపోతున్నా ఫలితం లేకుండా పోయింది. – శారద, యర్రేపల్లి గ్రామం, ఐరాల మండలం.అలసిన అర్జీ! అర్జీదారుకి అన్యాయం జరుగుతోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో ‘స్పందన’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్కు అత్యంత ఆదరణ లభించింది. సమస్యా..! అని కార్యాలయ మెట్లెక్కే ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేది. క్షేత్ర స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభించేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక స్పందన పేరు మార్చి ప్రజాసమస్యల పరిష్కార వేదిక పేరుతో ఏర్పాటు చేస్తున్న గ్రీవెన్స్ సెల్కు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అర్జీలకు పరిష్కారం లభించకుండా పోతోంది. అర్జీదారు కార్యాలయాల చుట్టూ తిరిగి కాళ్లరుగుతున్నాయి తప్ప.. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్రంగా కుంగిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత రెండేళ్లలో అర్జీ ఆవేదనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్లైన్ సక్సెస్ ... గ్రౌండ్ లెవల్లో ఫ్లాప్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2024 జూన్ 15 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పీజీఆర్ఎస్లో 77,859 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో 65,381 పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం పరిష్కారం అయిన 65,381 అర్జీల్లో 60,398 నిర్ణీత గడువులోపు పరిష్కరించగా, 4,983 అర్జీలు గడువు దాటిన తర్వాత పరిష్కరించినట్లు వెల్లడిస్తున్నారు. అయితే అధికారులు ఆన్లైన్లో పరిష్కరించేశామని క్లోజ్ చేసిన అర్జీలు తిరిగి మళ్లీ నమోదవుతూనే ఉన్నాయి. అలాంటి అర్జీలు దాదాపు 35 వేలకు పైగా ఉంటాయని సమాచారం. ‘పరిష్కారం’ ఆన్లైన్లోనేనా? కలెక్టరేట్లో ప్రతి సోమవారం అర్జీదారుడు దరఖాస్తు ఇవ్వగానే, దానికి ఒక నంబర్ కేటాయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వీఆర్వోలు, సర్వేయర్లు ఆ ఫైళ్లను పరిశీలించి తుది నివేదిక ఇచ్చే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆన్లైన్లో ఏదో ఒక కుంటి సాకుతో అర్జీని తిరస్కరిస్తున్నారు. అభాగ్యుల ఆవేదన అంతేనా? రెండున్నరేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ లేదు. అభాగ్యులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. కొందరు అర్జీఇచ్చేందుకు వచ్చి గాయాలపాలవుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. వేధిస్తున్న భూ సమస్యలు కాళ్లరిగేలా తిరుగుతూ..! ‘గత ఏడాది కాలంగా ఐదు సార్లు పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చాను. ప్రతిసారీ విచారణ జరిపి న్యాయం చేస్తామని రశీదు ఇస్తున్నారు తప్ప, గ్రామంలోకి వచ్చి చూసే నాథుడే లేడు’ అని రమణయ్య అనే అర్జీదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు వయసు పైబడిన వారు, మరోవైపు మహిళలు తమ భూ హక్కుల కోసం రెవెన్యూ కార్యాలయాల మెట్లు దిగి ఎక్కలేక, అటు పొలం పనులూ చేసుకోలేక మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. విష ప్రయోగమా.. ప్రకృతి వైపరీత్యమా? పోలీసు గ్రీవెన్స్కు 64 ఫిర్యాదులు నేటి నుంచి వృత్తి నైపుణ్య శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లకు (అన్ని సబ్జెక్టుల డీఆర్పీలు) రెండు రోజుల పాటు జిల్లా స్థాయి ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో శిక్షణ తరగతులు జరుగుతాయని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న జాతీయ విద్యావిధానం, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, 2026–27 అకడమిక్ క్యాలెండర్, టీచర్స్ హ్యాండ్బుక్, విద్యార్థుల మూల్యాంకన పుస్తకం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు ‘లీప్’ యాప్ వినియోగంపై శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించనున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు తదుపరి డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 64 అర్జీలు వచ్చినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. వీటిలో పలు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదు ను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు నాన్క్యాడర్ ఎస్పీ రాజశేఖర రాజు, ఏఎస్పీ షాను, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. – అగరమంగళం చెరువులో చేపల మృతిపై అనుమానాలు గంగాధరనెల్లూరు : మండలంలోని అగరమంగళం చెరువులో సోమవారం చేపలు అకస్మాత్తుగా మృతి చెందాయి. అగర మంగళం పంచాయతీ తీర్మానం ప్రకారం గత నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు చెరువు వేలం పాటలో రూ.20 వేలకు చేపల చెరువును దక్కించుకున్నాడు. దాదాపు రూ.1.2 లక్షలతో చేప పిల్లలను చెరువులో వదిలి, దాదాపు మూడు నెలలుగా మేపుతున్నాడు. సోమవారం ఉదయం చెరువు దగ్గర సుమారు కేజీ, అరకేజీ వరకు సైజు ఉన్న చేపలు మృతి చెంది తేలిపోయాయి. విష ప్రయోగంతో చేపలు చనిపోయాయా..? లేక మరే ఇతర కాణాలు ఏమైనా ఉన్నాయా..? అని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలసత్వం వద్దు ‘సర్’ చిత్తూరు కలెక్టరేట్ : సర్ ప్రక్రియలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ అన్నారు. ఎన్నికల సంఘం బృంద సభ్యులు సోమవారం జిల్లాలోని చిత్తూరు, ఐరాల మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. చిత్తూరులోని దొడ్డిపల్లి, గాయత్రినగర్, ఐరాల మండలం, కాణిపాకం, చిన్నకంపల్లి, కొత్తపల్లి, వడ్డేరామాపల్లి పోలింగ్ కేంద్రాల్లో సర్ ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నవీన్కుమార్ మాట్లాడుతూ ప్రతి అర్హుడు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఇంటింటా సర్వేను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహించాలన్నారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, చిత్తూరు నగరపాకల కమిషనర్ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు. ‘ఖాకీ’ల ఆశలు.. అడియాశలు! పీజీఆర్ఎస్ అర్జీల సమాచారం (2024 జూన్ 15 నుంచి 2026 జూలై 13 వరకు) నియోజకవర్గం నమోదైన పున:పరిశీలనకు అర్జీలు వచ్చినవి కుప్పం 21,290 1200 గంగాధరనెల్లూరు 14927 1458 పలమనేరు 14254 1233 పూతలపట్టు 11798 902 చిత్తూరు 8698 1161 నగరి 4321 586 పుంగనూరు 2571 181 మొత్తం 77,859 6,721 -
● పదోన్నతుల్లో హెచ్సీలకు మొండిచేయి ● అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు.. జోన్లు ● 54 ఏఎస్సై పోస్టులు మూడు జిల్లాలకు పంపిణీ? ● 30 ఏళ్ల సర్వీసుకు మంగళం.. సివిల్–ఏఆర్లకు నష్టం ● సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం
చిత్తూరు అర్బన్: ఎప్పుడో 1993లో క్రితం పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా చేరారు. అంటే 30 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరితే, ఇప్పటికి ఎస్ఐగా ఉద్యోగ విరమణ పొందాల్సింది. కానీ జిల్లాలోని 54 మందికి పైగా కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలోని జిల్లాలను జోన్ల వారీగా విభజిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఎప్పటికై నా ఏఎస్సై పదోన్నతి వస్తుందని భావించిన సివిల్, ఏఆర్లోని కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరిగింది. తప్పెవరిది.. శిక్ష ఎవరికి? చిత్తూరు, తిరుపతి, మదనపల్లె కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉండగా 1993లో జరిగిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో వందలాది మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆపై కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. ఇక ఏఎస్సై పోస్టు వస్తుందనుకునేలోపు ఉపద్రవం వచ్చి పడింది. జిల్లా పోలీసు శాఖలోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగం తీరు వల్ల 2012లో ఏఆర్ నుంచి సివిల్లోకి వెళ్లిన సిబ్బంది సర్వీసు, అప్పటికే సివిల్లో ఉన్న సిబ్బంది సర్వీసును లెక్కించే విషయంలో నిర్లక్ష్యం నెలకొంది. సివిల్, ఆర్మడ్ రిజర్వ్(ఏఆర్) పోలీసులకు మధ్య ఎస్టాబ్లిష్మెంట్ విభాగం అధికారులు సర్వీస్ రూల్స్ వివాదాన్ని రాజేశారు. దీంతో ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు దీనిపై కోర్టు మెట్లు ఎక్కారు. ఫలితంగా చిత్తూరు పోలీసు జిల్లాలో 54 ఏఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నా, భర్తీకు నోచుకోలేదు. జరగాల్సిన నష్టం సివిల్, ఏఆర్ పోలీసుల పదోన్నతుల సర్వీస్ రూల్స్ న్యాయస్థానమే పరిష్కరిస్తుందని కొందరు హైకోర్టులో రిట్ వేశారు. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా 1998, 2000లో చేరిన వారికి పాతికేళ్లయినా ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. కోర్టులో సమస్య పరిష్కారమయ్యేందుకు సమయం పడుతుండడంతో రెండు ఇంక్రిమెంట్లు కోల్పోయినవాళ్లు ఉన్నారు. ఇక జిల్లాల వారీగా జోన్ల విధానం అమల్లోకి రావడంతో మూడు నెలల వరకు పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదు. పైగా జిల్లాలో ఉన్న 54 ఏఎస్సై పోస్టులను తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సర్దుబాటు చేస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తాము నష్టపోయామని నిట్టూరుస్తున్నారు. ముగ్గురు పోలీసు ఉద్యోగులు ఉద్యోగ విరమణ కూడా పొందడం గమనార్హం.ఇష్టానుసారంగా మార్పు జిల్లాలో 1991–94 మధ్యలో కానిస్టేబుళ్లుగా చేరిన సిబ్బందికి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 ప్రకారం ఖాళీలను పరిగణనలోకి తీసుకుని.. 2016–17 మధ్య హెడ్ కానిస్టేబుళ్లు(హెచ్సీ)గా పదోన్నతి లభించింది. తర్వాత ఏఎస్సైగా పదోన్నతులు 2024–25 మధ్యలో రావాల్సి ఉంది. అమల్లో ఉన్న సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు కల్పించాల్సిన పోలీసు శాఖ జిల్లాలో సర్వీసు రూల్స్ ఇష్టానుసారం మార్చేశారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. దీంతో పదోన్నతుల ప్రక్రియకు మెలిక పడింది. పోలీసు ప్రధాన కార్యాలయం 2013లో ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్కు పంపే ప్యానల్.. సెప్టెంబర్ 1ని ప్రాతిపదికగా నిర్ణయిస్తూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సర్కులర్ జారీచేసింది. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే, దీని వెనుక ఏపీఎస్పీ, ఏఆర్ నుంచి వచ్చిన వారి ప్రయోజనాల కోసమేనని సివిల్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాము నేరుగా సివిల్లో ఎంపికయ్యామని, ఏఆర్ పోలీసులు సివిల్లోకి కన్వర్షన్న్ అయినప్పటి నుంచి సర్వీస్ పరిగణనలోకి తీసుకుంటే అభ్యంతరం లేదని చెబుతున్నారు. దీనికి ఆర్ముడ్ పోలీసులు ససేమిర అంటున్నారు. తాము పోలీసు శాఖలో సీనియర్లమని, ఏ విభాగంలో పని చేసినా తమ సర్వీసును గుర్తించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏఆర్ ఎస్ఐల విషయంలో కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ అదే విధానాన్ని పాటించాలని కోరుతున్నారు. ఇలా ఇరుపక్షాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
శాంతిపురం: సరిహద్దుల్లోని కర్ణాటక భూ భాగంలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ తెలిపారు. కర్ణాటకలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరవనహళ్లి సమీపంలో వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాడు కావచ్చనే సందేహంతో వారు సమాచారం ఇచ్చారని చెప్పారు. మృతుడి ఆనవాళ్లను గుర్తుపట్టిన వారు 9480802753 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు -
‘యో’ అంటారేంది గణేశా?
కాణిపాకం: సకల విఘ్నాలను తొలగించే వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు భక్తిపారవశ్యంతో వస్తుంటారు. కానీ, ఆ స్వామి సన్నిధిలోనే పనిచేస్తున్న కొందరు సిబ్బంది తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, ప్రశ్నిస్తే కసురుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. గణేశా అని పిలవమంటే.. యో అంటే! తిరుమలలో భక్తులను గోవింద అని పిలుస్తూ.. వారిలో ఆధ్యాత్మిక భావనను నింపుతుంటారు. అదే తరహాలో కాణిపాకంలో కూడా భక్తులను గణేశా..! అని సంబోధించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కానీ, క్షేత్ర స్థాయిలో సిబ్బందికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఆలయ పవిత్రతను విస్మరిస్తూ, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను గౌరవప్రదంగా పలకరించడానికి బదులు.. నిర్లక్ష్యంగా యో అంటూ సంబోధిస్తూ అవమానిస్తున్నారు. ఈ తీరుపై భక్తులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. పాలకమండలిపైనే విసుర్లు సిబ్బంది దురుసుతనం ఎంతలా పెరిగిపోయిందంటే.. సాక్షాత్తు పాలకమండలి సభ్యులపైనే కసురుకునే స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు మందలించినా, సస్పెన్షన్ వేటు వేసినా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. కొందరు సిబ్బంది అహంకారపూరిత ప్రవర్తన వల్ల క్షేత్ర ప్రతిష్ట మసకబారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పాలక మండలిపైనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే.. సామా న్య భక్తులకు పరిస్థితి ఎలా ఉంటుందో దీని బట్టి అర్థఽం చేసుకోవచ్చు. ఒకే స్థానంలో వీళ్లు పాతుకుపోవడంతో కూడా...ఇలా భక్తులంటే కనీస మర్యాదలు ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతారాహిత్యం స్వామి దర్శనం కోసం ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ సిబ్బంది ప్రవర్తన చూ స్తుంటే బాధగా ఉంది. కనీస మర్యాద లేకుండా కసురుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు స్పందించి.. క్షేత్ర సిబ్బందికి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.కసురుకోవడంతోనే.. విఘ్నేష్ సస్పెన్షన్ కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం పీఆర్ఓ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విఘ్నేష్ను సస్పెండ్ చేసినట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆలయ బోర్డు సభ్యులు స్వామి వారి దర్శనార్థం వచ్చారు. ఆశీర్వచ నం అందజేసే క్రమంలో విఘ్నేష్ అమర్యాదరగా ప్రవర్తించి కసురుకున్నాడు. దీంతో మనస్తాపానికిగురైన అనసూయ ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారించిన అధికారులు అత న్ని సస్పెండ్ చేశారు. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈవో హెచ్చరించారు. -
తమిళనాడుకు తోతాపురి!
జిల్లాలో ర్యాంప్లకు వచ్చిన తోతాపురి మామిడిని అక్కడి వ్యాపారులు నేరుగా తమిళనాడుకు తరలిస్తున్నారు. దరఖాస్తు గడువు పొడిగింపు చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు ఇన్చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్లో మార్పులు చేస్తూ, ఆనన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఫైనల్ సబ్ మిషన్కు ఈ నెల 20వ తేదీ వరకు సమయం ఉందన్నారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎంఈవోలు, హెచ్ఎంలు ప్రోత్సహించాలన్నారు. ప్రతి మండలం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయులు నేషనల్ టీచర్ అవార్డ్స్కు దరఖాస్తు చేసేలా ఎంఈవోలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ముక్కంటి సేవకు పోటెత్తిన భక్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది. వరుస సెలవులు రావడంతో సుమారు 36 వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 754, రూ.200 శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 2,892 మంది, రూ.50ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,686మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టికెట్ల ద్వారా 4117 మంది, రూ.750 టికెట్ల ద్వారా 1,405, రూ.1,500 టికెట్ల ద్వారా 454మంది, రూ.2,500 టికెట్ల ద్వారా 356 మంది, రూ.5 వేల టికెట్ల ద్వారా 153 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. 17,593 ప్రసాదాలు అమ్ముడైనట్లు ఆలయ అధికారులు వివరించారు. -
ముమ్మరంగా ఉంది ‘సర్’
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,40,126 మంది ఓటర్లకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టగా, ఇప్పటివరకు 11,39,840 మంది (84.37శాతం) ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. క్షేత్ర స్థాయి ధృవీకరణ ప్రక్రియతో కలుపుకుని జిల్లాలో మొత్తం 91 శాతం పురోగతి సాధించామన్నారు. మిగిలిన ప్రక్రియను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. అర్హత లేని ఓట్లపై ప్రత్యేక నిఘా క్షేత్ర స్థాయి పరిశీలనలో అర్హత లేని ఓటర్ల పై ప్రత్యేక నిఘా ఉందని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం పూర్తిగా పరిశీలించిన అనంతరం మాత్రమే వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రక్రియలో మృతి చెందిన ఓటర్లు దాదాపు 27 వేల మంది, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు 15 వేల నుంచి 16 వేల ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు 10 వేల మంది, చిరునామాతో లభ్యం కాని వారు దాదాపు 3 వేల మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 11,39,840 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. సంతకం తప్పనిసరి సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు వారి కుటుంబ సభ్యులు సంబంధిత ఫారంపై తప్పనిసరిగా సంతకం చేయాలని కలెక్టర్ వెల్లడించారు. సంతకం చేయని పక్షంలో వారి పేర్లు రాబోయే ముసాయిదా ఓటరు జాబితాలో ఉండకపోవచ్చని స్పష్టం చేశా రు. ఇంకా సమయం ఉన్నందున, ఓటర్లు వెంటనే సంబంధిత బీఎల్వో, ఎన్నికల సిబ్బందిని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు సర్ ప్రక్రియపై ఎలాంటి నిర్దిష్ట ఫిర్యాదులు రాలేదని, ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత బీఎల్వో వివరాలతో జిల్లా ఎన్నికల అధికారికి అందజేస్తే తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కాగా, జూలై 13, 14, 15 తేదీల్లో ఎస్ఐఆర్ పురోగతిపై వరుసగా వివరాలు విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. -
ఎత్తుకు పైఎత్తు వేద్దాం రండి!
– జిల్లాలో 19న చెస్ పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 19న నిర్వహించే చెస్ పోటీల్లో అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఆర్.బి.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని టీటీడీ కల్యాణ మండపంలో చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందే క్రీడాకారులకు రూ.1,07,000 నగదు పురస్కారం అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో తొలిసారిగా చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆల్ చిత్తూరు జిల్లా చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ చెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన క్రీడాకారులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులను మూడు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు, 18 ఏళ్లు పైబడిన పురుషులకు, 18 ఏళ్లు పైబడిన మహిళలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందే వారికి నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, మెడల్స్ అందజేస్తామన్నారు. తమ పేర్లను జూలై 18న 9849313676, 9000475799, 8019424467 నంబర్లలో నమోదు చేసుకోవాలని చెప్పారు. జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ పి.బాబూప్రసాద్, స్కూల్ఆఫ్ చెస్ చైర్మన్ ఎస్.ఆర్.దినేష్, అడ్వకేట్ సునీల్, మధు, నాగసంతోష్, కుమార్ పాల్గొన్నారు. -
నేడు పోలీసు గ్రీవెన్స్డే
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని వన్టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమ వారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎస్పీ తుషార్డూడి తెలిపారు. ఉద యం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమ వుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరు గా కలిసి మాట్లాడొచ్చన్నారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయ ల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30 ... 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ చిత్తూరు కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారనిన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు చిక్కిన గంజాయి స్మగ్లర్ చిత్తూరు అర్బన్: నగరంలో రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన గంజాయి స్మగ్లర్ జఫ్రీన్ను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక–మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో ఉన్న భద్రావతి ప్రాంతానికి చెందిన ఇతడ్ని రెండు నెలల క్రితం వన్టౌన్ పోలీసులు పట్టుకున్నా రు. ఆపై స్టేషన్లో కూర్చబెట్టగా.. పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. పలు ప్రాంతాల్లో జఫ్రీన్ ఆచూకీ కోసం నిఘా ఉంచిన పోలీసులు, ఎట్టకేలకు అతడ్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు. కాణిపాకం కిటకిట కాణిపాకం: వరుస సెలవుల నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో క్యూలైన్లు, మాడ వీధులు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, క్యూల్లో వేచి ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. దర్శన సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రక్షణ గోడను ఢీకొన్న ఐచర్ – తప్పిన ప్రాణాపాయం బంగారుపాళెం: మండలంలోని కొత్తపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్పై ఆదివారం సాయంత్రం ఐచర్ వాహనం అదుపుతప్పి రక్షణగోడను ఢీకొంది. ఈ ఘటనతో తృటి లో ప్రాణాపాయం తప్పింది. బెంగళూరు నుంచి చైన్నెకి పూల బస్తాలను తరలిస్తున్న ఐచర్ వాహ నం కొత్తపల్లె ఫ్లైఓవర్పై గల రహదారిపైకి రాగా నే టైరు పగిలిపోయింది. అదుపుతప్పిన వాహ నం ఫ్లైఓవర్పై ఏర్పాటు చేసిన సేఫ్టీవాల్ (రక్షణగోడ)ను ఢీకొని వాలిపోయింది. ఐచర్ వాహనంలోని డ్రైవర్, క్లీనర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఫ్లైఓవర్పై నుంచి ఐచర్ వాహ నం సర్వేసు రోడ్డుపై పడి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని వాహనదారులు తెలిపారు. -
మోయలేం సర్
చిత్తూరు కలెక్టరేట్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులపై (బీఎల్వో) పనిభారం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,511 మంది బీఎల్వోలు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి టోపీలు, గొడుగులు పంపిణీ చేసినట్లు పైకి ఆడంబరంగా ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే చిరిగిపోతున్నాయి! భారాన్ని మోయడానికి ఎన్నికల సంఘం సరఫరా చేసిన బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభంలోనే, బరువును తాళలేక ఈ బ్యాగులు చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి. దారిలోనే సంచులు చిరిగిపోతుండడంతో ఫారాలను కాపాడుకోవడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. యాప్ల వేధింపులు ఓటరు వివరాల డిజిటలైజేషన్ కోసం ఒక్కో ఇంటికి సుమారు మూడు నుంచి నాలుగు విడతలు తిరగాల్సి వస్తోందని బీఎల్వోలు చెబుతున్నారు. ఓటర్లు కలర్ ఫొటోలు ఇవ్వకపోతే, క్షేత్ర స్థాయిలోనే లైవ్ ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి రావడం అదనపు భారంగా మారింది. వర్షాకాలంలో గొడుగులు, రెయిన్ కోట్లు ఇచ్చినప్పటికీ.. సాంకేతిక లోపాలు, యాప్ స్కానింగ్ సమస్యలు, భారీగా ఉన్న ఫారాల కట్టలతో ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మానసిక వేదనకు గురిచేస్తోందని సిబ్బంది వాపోతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి తమపై ఉన్న పనిభారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీఎల్వోలపై మోయలేని భారం భారం మోయలేక తిప్పలు! ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో అధికారులు అనుసరిస్తున్న విధానాలు బీఎల్వోలకు నరకం చూపుతున్నాయి. ఒక్కో బీఎల్వో సగటున 800 నుంచి వెయ్యి మంది ఓటర్లకు ఫారాలను పంపిణీ చేశారు. తర్వాత వాటిని సేకరిస్తున్నారు. ఇలా ప్రతి ఓటరుకు రెండేసి ఫారాల చొప్పున, ఒక్కొక్కరు సుమారు 1,600 నుంచి 2,000 ఫారాలను మోసుకుంటూ ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగితాల కట్టలను మోయడం తమకు పెద్ద శ్రమతో కూడిన పనిగా మారిందని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బీఎల్వోలు వాపోతున్నారు. -
జీరో పాలసీని రద్దు చేస్తాం!
గంగాధర నెల్లూరు: ‘పాల రైతులకు హెరిటేజ్ కుచ్చుటోపి’ శీర్షికన సాక్షి దినపత్రిక సోమవారం వార్త ప్రచురితమైంది. దీనిపై హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు మండలంలోని నాసంపల్లి గ్రామానికి ఆదివారం చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలోని డెయిరీ ఫార్మ్ నిర్వాహకులతో చర్చలు జరిపారు. గంగాధరనెల్లూరు మండలంలోని కలిజవేడు పంచాయతీ కే.నాసంపల్లి గ్రామంలో దాదాపు పది కుటుంబాలు 20 సంవత్సరాలుగా హెరిటేజ్ సంస్థ డెయిరీకి పాలు పోస్తున్నారు. గత రెండేళ్లుగా వెన్న శాతం అప్పుడప్పుడూ తగ్గుతోంది. ఇదే అదునుగా నాణ్యత తగ్గింద న్న సాకుతో ఆ రోజు పోసిన మొత్తం పాలను జీరో కింద పెట్టేసి జీరో పేమెంట్ లిస్టులో ఎక్కించారు. దీనిపై పాడి రైతులు గత శనివారం జీడీ నెల్లూరు మండలంలోని హెరిటేజ్ డెయిరీ వద్ద నిరసన తెలిపారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. హెరిటేజ్ సంస్థ జనరల్ మేనేజర్ సర్వోత్తమరెడ్డితో పాటు ప్రతినిధులు స్పందించారు. వెంటనే ఆదివారం ఉదయం కే.నాసంపల్లి గ్రామానికి చేరుకున్నారు. పాడి రైతులైన నీలావతి, ప్రభాకర్నాయుడు, దేవితో చర్చ లు జరిపారు. జీరో పాలసీ విధానాన్ని రద్దు చేస్తామని, గతంలో జీరో పాలసీ కింద వచ్చిన దానికి కూడా డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన ‘సాక్షి’కి పాడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
పీఓపీ విగ్రహాల నిషేధంపై కలెక్టర్ దృష్టి
చిత్తూరు అర్బన్: వినాయక చవితి నేపథ్యంలో ప్లాస్టరాఫ్ పారిస్ విగ్రహాలను చెరువుల్లో వేయకుండా నిషేధించడంపై కలెక్టర్ సుమిత్కుమార్ దృష్టి సారించారు. చిత్తూరులోని కట్టమంచి చెరువులో ప్రతి ఏటా వినాయక ప్రతిమలు నిమజ్జనం చేయడం.. అందులోనూ 90 శాతం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేయడం కావడంతో అవి నీళ్లలో కరిగిపోకుండా చెరువును కాలుష్యపూరితం చేస్తున్నాయి. దీనిపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ స్పందించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పీఓపీ విగ్రహాలను చెరువుల్లో వేయడానికి వీల్లేదని, చెరువును కబళిస్తున్న పీఓపీ విగ్రహాలను తొలగించాలని మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ను ఆదేశించారు. దీనిపై అధికారులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. -
ఓటరుగా నమోదు చేసుకో!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ముందస్తుగానే (అడ్వాన్స్డ్ అప్లికేషన్) ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే, ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వారికి 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు లభిస్తుంది. మారిన నిబంధనలు గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. కేవలం జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. జనవరి 2న 18 ఏళ్లు నిండినా.. ఓటరుగా నమోదు కావడానికి మరో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చేది. యువత ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టంలో కీలక సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువత, తాము 18 ఏళ్లు నిండడానికి కొన్ని నెలల ముందే ఫారం 6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. యువతా మేలుకో.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 25 వేల మందికి పైగా యువతకు సరికొత్తగా ఓటరుగా మారే అవకాశం లభించనుంది. జిల్లాలోని విద్యాసంస్థల గణాంకాలను పరిశీలిస్తే, 2023–24 పదో తరగతి విద్యార్థులు 22,500 మంది, ఇందులో బాలురు 10 వేల మంది, బాలికలు 12,500 మంది, మధ్యలో చదువు మానేసిన వారు (8, 9 తరగతులు), ఇతరులు 2,500 మంది మొత్తం 25,000 మంది ఉన్నట్లు అంచనా. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు 17 నుండి 18 ఏళ్ల వయస్సు గ్రూపులోకి వస్తున్నారు. 17 ఏళ్లకే ఓటరుగా ముందస్తు దరఖాస్తు కళాశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో బీఎల్ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువపత్రాలను ఆన్న్లైన్, వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత, అర్హులకు ఓటు హక్కు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ, సదరు యువతకు 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ఈ సరికొత్త విధానంపై అవగాహన పెంచడానికి జిల్లాలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోనే ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సులభతరమైన ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
అదాబ్బా సంగతి!
సాక్షి టాస్క్ఫోర్స్: జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా నడుస్తున్న పలు దాబాల నిర్వహణతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది. బంగారుపాళ్యం నుంచి పూతలపట్టు వరకు హైవే దారి పొడవునా వెలసిన కొన్ని దాబాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి దాటినా జోరుగా సాగుతున్న ఈ దందాపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబుల హల్చల్ రాత్రి వేళల్లో పలు దాబాల వద్ద పరిస్థితి దారుణంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి దాబాలు మూసివేయాల్సి ఉన్నా, ఇక్కడ మాత్రం ఆ పరిస్తితి లేదు. పలు దాబాల్లో బహిరంగంగానే మ ద్యం సరఫరా జరుగుతుండడంతో, మందు బాబులు ఇష్టానుసారంగా తాగి తూగుతూ రోడ్లపైకి వస్తున్నా రు. హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్లే క్రమంలో, ఈ మందుబాబుల నిర్వాకం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికుల చెబుతున్నారు. దీనికి తోడు నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న డాబాల పరిసరాల్లో దోపిడీలు, దొంగతనాలు సైతం పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. హైవే పెట్రోలింగ్ ఎక్కడ? ఈ దారిలో రక్షణ కల్పించాల్సిన హైవే పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా నిరుపయోగంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు నిఘా ఉంచకపోవడంతోనే దాబా నిర్వాహకులు బరితెగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవే వెంబడి బంగారుపాళ్యం పరిధిలోనే సుమారు 20 దాబాలు, పూతలపట్టులో 10, కాణిపాకం పరిధిలో 6 దాబాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక శాతం దాబాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు? ఇంత జరుగుతున్నా యంత్రాంగం కదలకపోవడం వెనుక మామూళ్ల కథ నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు ఈ దాబా నిర్వాహకుల నుంచి నెలవారీ ప్యాకేజీలు పుచ్చుకుని, అటువైపు కన్నెత్తి చూడడం లేదని సమాచారం. ప్రజలు, వాహనదారుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దాబాలపై ఉక్కుపాదం మోపకపోతే.. మున్ముందు మరిన్ని ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. -
ద్విచక్ర వాహనాల దగ్ధం
నాగలాపురం : స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో ఆదివారం చెత్తను తగలబెట్టడంతో ప్రమాదవశాత్తు సమీపంలోని ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. వివరాలు.. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలను పోలీసులు సమీపంలోని వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో పార్క్ చేశారు. ఆదివారం ఉదయం కార్యాలయ సిబ్బంది చెత్తను గుట్టగా పోసి నిప్పంటించారు. ఈ సమయంలో గాలికి నిప్పురవ్వలు సమీపంలోని ద్విచక్రవాహనాలపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 5 ద్విచక్రవాహనాలు కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. -
అన్నా క్యాంటీన్ వద్ద వ్యక్తి మృతి
పలమనేరు: పట్టణంలోని అన్నాక్యాంటీన్ ఎదురుగా రోడ్డు డివైడర్పై నిద్రిస్తున్న వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇతను పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీకి చెందిన మార్కొండ (55)గా స్థాని కులు గుర్తించారు. తలకు దెబ్బ తగిలి మృతి చెంది ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య బంగారుపాళెం: కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్కానిస్టేబుల్ సయ్యద్దావూద్సాహెబ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బొమ్మాయిపల్లె దళితవాడలో నివాసముంటున్న అశోక్ కుమారుడు ఉమాపతి(40)కి వివాహమైంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పలువురికి పూలే అవార్డులు పలమనేరు: పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మందికి జ్యోతీరావు పూలే అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధన విభాగాల్లో సేవలందించిన వారికి అవార్డులు దక్కాయి. ఇందులో నిర్వాహకులు పూసల రవి తదితరులు పాల్గొన్నారు. కారును ఢీకొన్న ఐచర్ వాహనం గంగవరం: మండలంలోని బైపాస్ రోడ్డులో వెళ్తున్న కారును ఆదివారం ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. పోలీసుల కథనం మేరకు.. కారు బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళుతోంది. మండలంలోని బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఐచర్ వాహనం కారుని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారుని ఢీకొట్టిన తర్వాత ఐచర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్టు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాభివృద్ధికి విరాళం పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండల కేంద్రంలోని అంకాళ పరమేశ్వరి ఆలయ ఉత్సవాల్లో రాష్ట్ర మేధావుల ఐక్య వేదిక కార్యదర్శి, వైఎస్సార్సీపీ నాయకులు జగదీశ్వర్రెడ్డి తన ఉదారత చాటుకున్నారు. ఈ ఉత్సవాలకు ఆయన రూ.లక్ష విరాళమిచ్చారు. ఆయనకు పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయనను గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ, లోకకళ్యాణం కోసం, గ్రామ ప్రజల క్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సచ్చులు, పుచ్చులు, రాళ్లు
పలమనేరు:పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని టీఎస్ అగ్రహారానికి చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి ఇటీవల ఆర్ఎస్కే లో బస్తా వేరుశనగ విత్తన కాయలు కొనుగోలు చేశాడు. వీటిని వలిస్తే ఎక్కువగా సచ్చులు, పుచ్చులు ఉన్నట్టు గుర్తించాడు. అదేవిధంగా బస్తాలోని 30 కేజీల్లో కిలో రాళ్లు ఉండ డం చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. నియోజకవర్గంలోని కొన్నిచోట్ల ఇలాంటి నాశిరకం విత్తనాలు రైతులకు చేరినట్టు తెలుస్తోంది. ఏజెన్సీల నిర్లక్ష్యంతోనే... ఇక్కడి రైతులకు ఏటా కదిరి–6 రకం విత్తనాలను పంపిణీ చేస్తుంది. ఈ దఫా నిర్వాహకులు నాణ్యమైన విత్తనాలను ఇవ్వలేదని తెలుస్తోంది. వీటిని వ్యవసాయశాఖ అన్ని రకాలుగా పరీశించి ఆపై రైతులకు పంపిణీ చేయాలి. వ్యవసాయశాఖ వాటిని చూసిందా లేదా అన్నది అనుమానంగా మారింది. అందువల్లే కాయల్లో సచ్చులు, పుచ్చులు, రాళ్లు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదలైన విత్తనకాయల పంపిణీ ఈదఫా ఖరీఫ్ సీజన్కు పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో వేరుశనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. ఏడు మండలాలకు 5,660 క్వింటాళ్లు వచ్చాయి. బస్తా (30 కేజీలు) పూర్తి ధర రూ.3,060 కాగా 40 శాతం సబ్సిడీ రూ.1,224 పోనూ రైతు రూ.1,836 చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం పంపిణీ చేసిన కే–6 రకం వేరుశనగ విత్తన కాయలుపుచ్చిపోయిన విత్తన కాయలుబస్తాలో తేలిన రాళ్లు మూటలో కిలో రాళ్లు ఉన్నాయి నేను 30 కేజీల వేరుశనగ విత్తన కాయలు కొన్నాను. వలుద్దామని చూస్తే సచ్చులు, పుచ్చులు ఉన్నాయి. వీటిని తీసేసి చూస్తే రాళ్లే కిలోకు పైగా ఉన్నాయి. అధికారులు నాణ్యతను చూడకుండా ఎలా కొనుగోలు చేశారో వారికే తెలియాలి. ఏదో ఆలస్యంగానైనా ఇచ్చారని తీసుకున్నాం. – రెడ్డెప్పరెడ్డి, రైతు, టీఎస్ అగ్రహారం, పలమనేరు మున్సిపాలిటీ -
ప్రతి రైతుకూ ఎరువులు అందాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రతి రైతుకూ ఎరువులు అందాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకూ సకాలంలో ఎరువులు, యూరియా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంటల అవసరాలకు అనుగుణంగానే యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. రైతులు తమ కోటాను ఎప్పుడైనా పొందే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. అయితే, ఒక చోట కోటా తీసుకున్న వారు మరోచోట తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. కొందరు రైతులు అవసరం లేకపోయినా, పక్కవారు కొంటున్నారనే కారణంతో అనవసరంగా యూరియాను నిల్వ చేసుకుంటున్నారన్నారు. అనర్హులు ఎవరూ యూరియా తీసుకోరాదని హెచ్చరించారు. సవరణలకు అవకాశం ఈ–పంట నమోదులో ఏవైనా లోపాలు ఉంటే, రైతులు వెంటనే సంబంధిత రైతు భరో సా కేంద్రానికి వెళ్లి ‘ఎడిట్’ ఆప్షన్ ద్వారా సవరణలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వెబ్ల్యాండ్లో వివరాలు లేని, లేదా భూవివాదాలు ఉన్న రైతులు ఈ–పంట నమోదు చేసుకోలేరని తెలిపారు. ఏపీఏఐఎంఎస్ యాప్ను డౌన్్లోడ్ చేసుకోండి రైతులు తమ సొంత మొబైల్లలో ఏపీఏఐఎంఎస్ యాప్ ఇన్న్స్టాల్ చేసుకోవాలని తెలిపారు. ఈ యాప్ లో వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలతో పాటు, ఎండా కాలంలో పంట ఫొటోను అప్లోడ్ చేస్తే పంట స్థితిగతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చని వివరించారు. బ్లాక్ మార్కెట్పై ప్రత్యేక నిఘా ఈ సీజన్లో జిల్లాకు 20 వేల మెట్రిక్ టన్ను ల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా 7 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వారం వారం ఎరువుల అవసరాల నివేదికలను పక్కాగా రికార్డు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సెప్టెంబర్లో యూరియా డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. చిన్న రైతులకు సైతం ఎరువులు సకాలంలో అందేలా చూ డాలన్నారు. యూరియా పంపిణీని పూర్తి గా ఓటీపీ ఆధారంగానే చేపట్టాలన్నారు. ఓటీపీ రాని పక్షంలో బయోమెట్రిక్ విధా నాన్ని ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ డీలర్లు ఎవరైనా యూరియాతో పాటు ఇతర లింక్డ్ ఇన్పుట్స్ (ఇతర మందులు) బలవంతంగా అమ్మితే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. -
‘నవోదయ’ ప్రవేశంపై నేడు అవగాహన
తిరుపతి అర్బన్: తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థల ఆవరణలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు సంబందించి ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించన్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథరెడ్డి శనివారం తెలిపారు. 2027 నవోదయ ప్రవేశ పరీక్షలో కీలకమార్పులు చేశారని వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, భాషా పరీక్షలతోపాటు పర్యావరణ అధ్యాయనం అనే అంశాన్ని పరీక్షలో చేర్చినట్లు వివరించారు. కొత్త పరీక్షా విధానం, సిలబస్, ప్రశ్నపత్రం నమూనా, మార్కుల విభజన, సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్, ఆన్లైన్ దరఖాస్తు విధానం తదితర అంశాలపై నిపుణులచే సమగ్రంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉందని వెల్లడించారు. అవగాహన సదస్సుకు ఎలాంటి రుసుం లేదని స్పష్టం చేశారు. వివరాలకు 8688888802, 8688888803, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డిజిటలైజేషన్ 100 శాతం పూర్తి చేయాలి గంగాధర నెల్లూరు: ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల ను తిరిగి స్వీకరించి డిజిటలైజేషన్ కార్యక్రమా న్ని వంద శాతం పూర్తి చేయాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఆయన శనివారం గంగాధర నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల నుంచి బీఎల్వోలు స్వీకరించి న ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. మండలంలో ఇప్పటివరకు 84 శాతం పూర్తయిందని, మిగిలినవి కూడా పూర్తి చేయా లని ఆదేశించారు. ఈఆర్వో మధుసూదన్, తహసీల్దార్ సీకే శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మోహన్,బీఎల్వోలు పాల్గొన్నారు. -
తల్లికి వందనం.. సాంకేతిక విఘ్నం
తల్లికి వందనం పథకాన్ని అమలుచేయడానికి క్షేత్రస్థాయిలో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి.కాణిపాకం ఆలయంలో ఈఓ తనిఖీలు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఈఓ పెంచల కిషోర్, ఆలయ బోర్డు సభ్యులు కలిసి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళ్యాణకట్ట, మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రతను పరిశీలించిన ఈఓ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నిత్య అన్నదాన భవనాన్ని సందర్శించి, భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. భోజనం రుచి, నాణ్యతపై భక్తులతో నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అన్నదాన విరాళాల కౌంటర్ను కూడా ఆయన తనిఖీ చేశారు. పవిత్రమైన ఆలయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఘాటుగా హెచ్చరించారు. -
రాయితీ విత్తనానికి ఎల్నినో ఎఫెక్ట్..!
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీపై ఎల్నినో నీలినీడలు కమ్ముకున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం గట్టిగా ఉంటుందని, వర్షాలు పడవని, కాబట్టి వేరుశనగ విత్తన కాయలు ఇవ్వడం అనుమానమేనంటూ గతంలో వ్యవసాయ అధికారులు చెప్పిన ముందస్తు హెచ్చరికలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. అధికారులు చెప్పిన ఆ చేదు నిజం ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. సీజన్ ముదురుతున్నా జిల్లాకు ఆశించిన స్థాయిలో వేరుశనగ కాయలు రాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళికలు వేయడంలో పూర్తిగా విఫలం కావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కాయలు కాసేలా.. ఎదురుచూపులు ప్రతి ఏటా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే వేరుశనగ రాయితీ విత్తనాలను పంపిణీ చేసేవారు. కానీ, ఈసారి జూలై 11వ తేదీ దాటిపోతున్నా విత్తన కాయల ఊసే లేదు. జిల్లాకు 27వేల క్వింటాళ్ల కాయలు కేటాయిస్తే...కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు కలిపి కేవలం 6 వేల క్వింటాళ్ల కాయలు మాత్రమే వచ్చాయని అధికారులు నోటిమాటగా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక మిగిలిన నియోజకవర్గాల రైతులకు మాత్రం మొండిచేయి మిగిలింది. పల్లెల్లో రైతులు విత్తన కాయల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సాగు కోసం చాలా మంది రైతులు అప్పులు తెచ్చి మరీ దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నా.. అధికారులు మాత్రం అదిగో వస్తున్నాయి.. ఇదిగో వస్తున్నాయి అంటూ కాలయాపన చేస్తూ బూచి చూపిస్తున్నారు. విత్తనాలు రావని ముందే గ్రహించిన కొందరు రైతులు.. తప్పనిసరి పరిస్థితుల్లో తాము నిల్వ ఉంచుకున్న కాయలను లేదా ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేసి విత్తుకున్నారు. మరికొందరు విత్తనాలు లేక దుక్కి దున్నిన పొలాలను అలాగే వదిలేశారు. సాగు కుదేలు జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 21,903 హెక్టార్లు కాగా, విత్తనాల కొరత, వర్షా భావం కారణంగా ఈసారి ఇప్పటివరకు కేవలం 93 హెక్టార్లలో మాత్రమే సాగు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం.. ఎల్నినో ఎఫెక్ట్ ఉందంటూ, వర్షాలు పడవు కాబ ట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయితీ విత్తనాలు ఇస్తారా? లేదా? అనే విషయాన్ని అధికారులు స్పష్టంగా చెబితే, తాము ఇతర పంటలైనా వేసుకుంటామని, కాలం దాటిపోతే దేనికీ పనికిరాకుండా పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు నోరు విప్పి, రాయితీ విత్తనాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని, అన్నదాతలను ఆదుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. -
అయ్యోర్లకు ఒరిగిందేమీ లేదు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా అయ్యోర్లకు ఒరిగిందేమి లేదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధ్యాయుల ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని, హక్కుల సాధనకు ఉపాధ్యాయ లోకం మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇంతవరకు 12వ పీఆర్సీకి కనీసం చైర్పర్సన్ను కూడా నియమించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ నియమించి, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 5 డీఏలను తక్షణమే మంజూరు చేయాలన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలు చేస్తూ, అర్హులైన ఉపాధ్యాయులందరికీ తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష లేకుండా, పార్లమెంటులో విద్యాహక్కు చట్టానికి అవసరమైన సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై కూటమి సర్కారు ఒత్తిడి తీసుకురావాలన్నారు. జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా, ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేసేందుకు ఈనెల 14వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద భారీ ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వ హించే కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంటా మోహన్ పేరు ప్రతిపాదిస్తూ తీర్మానం ఎస్టీయూ జిల్ల అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ఉద్యమ నాయకుడు గంటా మోహన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇన్చార్జ్గా నియమించినట్లు ప్రకటించారు. భవిష్యత్తులో జరగబోయే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఆయనను అధికారిక అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించి, రాష్ట్ర సంఘానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశమలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఇలియాజ్, ఆర్థిక కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవరాజులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యువరాజు, సంఘ నాయకులు హేమచంద్రారెడ్డి, రమణారెడ్డి, బొబ్బిలి రెడ్డి, గిరిబాబు, నాగభూషణం, నాగేంద్ర రాజు, ఢిల్లీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం -
టమాట రాదు
టమాటా రైతులు కష్టాల కన్నీళ్లు!పలమనేరు డివిజన్లో సాగు వివరాలు ధరల్లేక రోడ్డుపక్కన పడేసిన టమాటాలు పలమనేరు: సాధరణంగా సాగయ్యే టమాటా కంటే ఈదఫా ఎక్కువగా పంట సాగైంది. సాంప్రదా య రైతులే కాదు సాప్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, వైద్యు లు సైతం భారీగా టమాటా సాగులోకి దిగారు. అందు లో భారీ పెట్టుబడులతో ఎక్కువ పలసాయాన్ని ఇచ్చే పలు రకాల హైబ్రిడ్ రకాలను సాగు చేశారు. దీంతో ఎకరానికి 1700 బాక్సుల నుంచి 2వేల బాక్సులకు పంట దిగుబడులు పెరిగాయి. మార్కెట్లను టమాటా ముంచెత్తుతోంది. దీంతో ధరలు తగ్గు ముఖం పట్టా యని వ్యాపారులు చెబుతున్నారు. రైతును ఆదుకునేందుకు మార్కెటింగ్శాఖ టమాటాను కొని రైతుబజార్లకు విక్రయిస్తోంది. అయితే మొక్కుబడిగా ఓ లోడు కొంటూ రైతు లు ఆదుకున్నామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప నిజంగా టమాటా రైతులపై కూటమి ప్రభు త్వం నుంచి ఎలాంటి సాయం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి రాష్ట్రాల నుంచి డిమాండ్ లేదు బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు రావడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్ మొదలైంది. దీంతో అక్కడి అవసరాలకు స్థానిక సరుకు సరిపోతోంది. దీంతో అక్కడి వ్యాపారులకు ఇక్కడికి రావడం లేదు. ఇక అనంతపూరం జిల్లానుంచి ఎక్కువగా టమాటాలు పలు మార్కెట్లకు చేరుతున్నాయి. దీంతో ఉన్న సరుకును అమ్ముకోవాలని రైతులు మాగిన కాయలను వెంటవెంటనే కోసి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ తగ్గింది. ఆయా రాష్ట్రాల్లోనే కావాల్సినంత సరుకు అందుబాటులో ఉంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది. రైతులను ఇలాగేనా ఆదుకొనేది? రాష్ట్రంలోని టమాటా రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులనుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ టమాటాలను కొంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆమేరకు పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ కేవలం పది టన్నుల టమాటాలను కొని రైతు బజార్లకు అమ్మేందుకు తీసుకెళ్లింది. దీంతో టమాటా రైతుల కష్టాలు తీరుతాయా అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు మరెన్నో మోసాలు అసలే ధరల్లేక ఇబ్బందులు పడి టమాటాలను మార్కెట్కు తీసుకొచ్చే రైతులకు మండీ వ్యాపారు లు 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. నిబంధనల మేరకు 4శాతమే వసూలు చేయాలి. ఇదిగాక దింపుడు కూలీలని, క్రేట్ అద్దెలంటూ వసూళ్లు తప్పడంలేదు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతులకు మాత్రం కష్టాలు తప్పడంలేదు. జిల్లాలోని పడమటి మండలాల రైతులకు ఏటా టమాటానే ప్రధాన పంట. ఈ దఫా ఇప్పటికే టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. పలమనేరు మార్కెట్లో శుక్రవారం 15కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200 కాగా సగటు ధర రూ.100 మాత్రమే పలికింది. దీంతో భారీ పెట్టుబడులు పెట్టి టమాటా సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితుల్లో ఆశలు అడియాశలయ్యాయి. ఖరీఫ్ టమాటా సాధరణ సాగు 6వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 5వేల హెక్టార్లు ఇప్పుడు కోత దశలో ఉన్న తోటలు 3వేల హెక్టార్లు మరో 15 రోజుల్లో కోతలకు సిద్ధమయ్యే తోటలు 2వేల హెక్టార్లు పలమనేరు మార్కెట్కు వస్తున్న స్థానిక సరుకు రోజుకు 35 టన్నులు -
మామిడి అన్లోడింగ్కు నాలుగు రోజులు
గుడిపాల: మామిడికాయల అన్లోడింగ్కు నాలుగు రోజులు పడుతోంది. గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మూడు ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఒక ప్లాంట్లో యంత్రాలు మరమ్మతులకు గురికావడంతో యాజమాన్యం నిలిపివేసింది. దీంతో రెండు ప్లాంట్లు మాత్రం నడుస్తున్నాయి. ర్యాంపులన్నీ మామిడికాయలతో నిండిపోయాయి. ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు బారులు తీరాయి. కాయల అన్లోడింగ్కు నాలుగురోజులు పడుతోందని ట్రాక్టర్ డ్రైవర్లు తెలిపారు. పోక్సో కేసు నమోదు పలమనేరు: మండలంలోని టి. వడ్డూరు గ్రామా నికి చెందిన మైనర్ బాలిక అదృశ్యం కేసులో మున్సిపాలిటీ పరిధిలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన భుజేంద్ర అనే యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ మోహన్రెడ్డి శనివారం తెలిపారు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తనతోపాటు తీసుకెళ్లినట్టు తెలిసిందని దీంతో కేసు నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజీతో కేసుల పరిష్కారం సులభం – లోక్ అదాలత్లో 12,829 కేసులు పరిష్కారం చిత్తూరు అర్బన్: దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి రాజీ మార్గమమే మంచిదని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. శనివారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలో జాతీ య లోక్అదాలత్ నిర్వహించారు. జిల్లా జడ్జి మా ట్లాడుతూ అదాలత్లో పరిష్కరించుకున్న కేసుల పై అప్పీల్కు వెళ్లడానికి కూడా వీలుండదన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న పలువురికి అవార్డు పత్రాలను అందచేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 12,829 కేసులు కాగా పూర్వపు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్అదాలత్లో 12,829 కేసులు పరిష్కరించారు. వీటిలో 167 సివిల్, 12,565 క్రిమినల్, 97 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. -
తల్లికి వందనం.. సాంకేతిక విఘ్నం
చిత్తూరు కలెక్టరేట్ : ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి క్షేత్రస్థాయిలో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. సాంకేతిక చిక్కుల పేరుతో పథకం లబ్ధిని ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ఈ పథకానికి ప్రస్తుత ఏడాదిలో సాంకేతిక సాకులతో అధికంగా విద్యార్థులు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర అధికారులు విధించిన గడువు సమీపి స్తున్నా జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల్లో సగానికి పైగా వారి పేరు మీద ఇంకా బ్యాంక్ ఖాతాలు తెరవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున తల్లికి వందనం సొమ్ము జమ చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే విద్యార్థుల పేరు మీద ఖాతాలు లేకపోవడంతో ఆ నిధులు నిలిచిపోయే పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. గణాంకాల్లో అసలు పరిస్థితి జిల్లాలో పదో తరగతి పూర్తిచేసుకుని ఇంటర్లో చేరిన మొత్తం ఎస్సీ విద్యార్థులు 12,458 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 10 శాతం మంది కూడా ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలు తెరవని దుస్థితి. బ్యాంకు ఖాతాలు తెరిచిన విద్యార్థుల్లో సైతం చాలామంది ఎన్పీసీఐతో కూడిన లింక్తో ఖాతాలు తెరవలేదని తెలిసింది. ఈ సాంకేతిక సాకుతో వేలాది మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం ఎగ్గొట్టేందుకు కూటమి సర్కారు స్కెచ్ వేసింది. పోస్టాఫీసుల్లో ఖాతాలు ఖాతా సొమ్ము జమ కాకపోతే ఆ ప్రభావం నేరుగా పే ద విద్యార్థుల ఇంటర్ చదువులపై పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 40 శాతం, రాష్ట్ర ప్రభు త్వం నుంచి 60 శాతం నిధులు లభిస్తాయి. విద్యార్థుల పేరుతో యాక్టివ్ ఖాతా ఉంటేనే కేంద్రం నుంచి వచ్చే వాటా నేరుగా జమ అవుతుంది. సాధారణ జాతీయ బ్యాంకుల్లో ఖాతా తెరిస్తే ఎన్పీసీఐ అనుసంధానానికి కొంత ఆలస్యం అవుతుంది. అదే పోస్టాఫీసులో (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) ఖాతా తెరిస్తే కేవలం 24 గంటల్లోనే ఎన్పీసీఐ అనుసంధానం పూర్తవుతుందని అధికారులు సూచిస్తున్నారు. పాన్ కార్డు మినహాయింపు పోస్టాఫీసుల్లో ఇప్పటిదాకా కచ్చితంగా పాన్ కార్డు ఉంటేనే ఖాతా తెరవడానికి అవకాశం ఉండేది. కానీ ప్రస్తు త అత్యవసర పరిస్థితి దృష్ట్యా పాన్ కార్డు లేకున్నా.. విద్యార్థి ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబి తా, రూ. 200 ఉంటే చాలు వెంటనే ఖాతా తెరుస్తున్నా రు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ఈ ఖాతా ప్రా రంభిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. -
ఓటర్ల డేటా హైజాక్
సాక్షి, టాస్క్ఫోర్స్ : ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో లోపాలను సరిదిద్ది పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మొత్తం వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా జిల్లాలోని గుడిపాల మండలానికి చెందిన ఒక ఘటన సాక్ష్యాలతో సహా బయటపడింది. ఈనెల 10 వ తేదీన సదరు మండలానికి చెందిన టీడీపీ నేత హేమాద్రి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆ మండలంలోని రామభద్రాపురం పోలింగ్ కేంద్రం (నెంబర్ 197)లో 99.3 శాతం ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను విజయవంతంగా డిజిటలైజేషన్ చేశారని, ఇందుకు సహకరించిన బీఎల్వో సురేష్ చాలా బాగా పనిచేశాడంటూ సదరు నాయకుడు కితాబు ఇచ్చారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ డిజిటలైజేషన్ జరిగింది ప్రభుత్వ అధికారిక పోర్టల్లోనో, ఎన్నికల సంఘం యాప్లోనో అనుకుంటే పొరపాటే. ఓటర్ల నుంచి సేకరించిన అత్యంత రహస్యమైన ఎన్యూమరేషన్ ఫారాల్లోని సమాచారాన్ని అధికారిక వ్యవస్థ కంటే ముందే ‘ఐ టీడీపీ’ యాప్లో నమోదు చేశారనేది సదరు వాట్సాప్ సందేశం ద్వారా స్పష్టమవుతోంది. అధికారుల వద్ద ఉండాల్సిన ఫారాలు టీడీపీ నాయకుల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయనే ప్రశ్నకు ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనలకు విలువ లేదా? రాజ్యాంగబద్ధంగా సాగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను టీడీపీ తన యాప్తో నియంత్రించాలని చూడడంపై పలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓటర్ల నివాస వివ రాలు వంటి సున్నితమైన సమాచారాన్ని అధికార పార్టీ అక్రమంగా ప్రొఫైలింగ్ చేయడానికి ఈ డేటాను వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు. సానుభూతిపరులు కాని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ సమాచారాన్ని ఒక సాధనంగా వాడుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జూలై 14 లోగా సర్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయా లని ఎన్నికల అధికారులు గడువు విధించగా.. ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందే అధికార పార్టీ నేతలు ఈ ఫారాలను తమ యాప్లలో నమోదు చేసుకునేందుకు బూత్ బూత్కూ రంగంలోకి దిగడం గమనార్హం. ఈ డేటా హైజాక్ పై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తక్షణమే స్పందించి, విచారణ జర పాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను ప్రైవేట్ యాప్ల ద్వారా హైజాక్ చేస్తున్న వారిపై, బీఎల్వోలను బెదిరిస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికే ముప్పు వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అత్యంత పారదర్శకంగా సాగాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం పక్కదారి పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం డిజిటలైజేషన్ చేయాల్సిన ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డేటా.. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ‘ఐ టీడీపీ’ యాప్లోకి చేరుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ అధికారులు, (బీఎల్వో) లను బెదిరించి, బలవంతంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని అధికార పార్టీ నాయకులు గుంజుకుంటున్నారనే ఆరోపణలు విమర్శలకు దారితీస్తున్నాయి. లోకేష్ పేరుతో హుకుం..జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు)పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల ఇళ్ల నుంచి సేకరించిన అన్ని సర్ ఎన్యూమరేషన్ ఫారాలను ముందుగా తమకే ఇవ్వాలంటూ టీడీపీ స్థానిక నేతలు హుకుం జారీచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారాలు ఇవ్వలేమని నిరాకరిస్తున్న బీఎల్వోలను అధికార బలంతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘మాట వినకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు చెబుతాం.. మీ ఉద్యోగాలతో ఆటలాడుకుంటాం’ అంటూ క్షేత్రస్థాయిలో కొందరు నేతలు హల్చల్ చేస్తుండడంతో బీఎల్వోలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ స్థానిక నాయకులు బీఎల్వోలపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తెస్తున్నారని పలు ఉద్యోగ సంఘాలు అంతర్గతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
పోరాటం ఆపేది లేదు
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్వాడీల సమస్యలు, ఇచ్చి న హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత హెచ్చరించారు. ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బ్లాక్ డే నిరసనలో కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. అంగన్వాడీలు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్ల వద్దే అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కలెక్టరేట్ ఎదుటే అంగన్వాడీ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. 11 ఏళ్లుగా ఒక్క రూపాయి పెంచలేదు ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెంచకుండా అంగన్వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పనిభారంగా మారిన ‘నవచేతన యాప్’ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు విజయ, గిరిధర్గుప్త మాట్లాడుతూ ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో శిబిరాల వద్దకు స్వయంగా వచ్చి హామీలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలకడంతో అంగన్వాడీలంతా నమ్మి ఓట్లేసి గెలిపించారన్నారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు.‘ఏరు దాటే వరకే మల్లన్న– ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో అంగన్వాడీల పోరాటాన్ని అణచాలని చూసినందుకే చంద్రబాబును ఇంటికి పంపిన చరిత్ర ఉందని, మళ్లీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. జిల్లా సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్ హామీ ధర్నా అనంతరం అంగన్వాడీ కార్యకర్తల ప్రతినిధులు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రీ–స్కూల్స్ బలోపేతం పేరుతో అంగన్వాడీలను పాఠశాలల దగ్గరకు మార్చడం వల్ల అదనపు భారం పడుతోందని, దీనిని తగ్గించాలని కోరగా.. జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరిని కలిసి ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ‘జిల్లా సమన్వయ కమిటీ’ ఏర్పాటు చేయాలని కోరగా, అందుకు పీడీ సానుకూలంగా స్పందించి కమిటీ ఏర్పాటుకు అంగీకరించారన్నారు. ఈ ధర్నాలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజిని, మమత, లక్ష్మి, రాధిక, పద్మ, పద్మమ్మ, అనిత, శ్యామలమ్మ, ధనకోటి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జీవితాంతం జైలు
చిన్నారిపై అత్యాచారం ..బాదిత కుటుంబం పక్షాన నిలబడి, న్యాయం కోసం మాజీ మంత్రి రోజా చేసిన పోరాటం వల్ల ఆ పేద కుటుంబానికి న్యాయం చేకూరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే 2024 నవంబర్ 1వ తేదీన తిరుపతి జిల్లా, వడమాలపేట మండలం ఏఎంపురం ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న చిన్నారిపై హత్యాచారం కేసు సంచలనం సృష్టించింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడ్డ హోం మంత్రి, నాటి జిల్లా ఎస్పీ కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి రోజా బాధిత కుటుంబంతో కలసి చేపట్టిన పోరాటంతో పోక్సో కేసు నమోదుతో పాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. పోక్సో కేసు కోరుతూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్) బాధిత తల్లిని అక్కన చేర్చుకొని ఓదార్చుతున్న మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్) వడమాలపేట (పుత్తూరు): నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం ఎఎంపురం ఎస్టీ కాలనీలో అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు చిధిమేసి, హత్య చేసిన కేసులో శుక్రవారం ప్రత్యేక పోక్సో కోర్టు ముద్దాయికి యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెల్లడించింది. ముద్దాయి పాముల నాగరాజు అలియాస్ సుశాంత్కు అత్యాచారం కేసులో జీవితాంతం కఠిన కారాగార శిక్షతో పాటు, హత్య కేసులోనూ మరో జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధింపు, రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముద్దాయి జీవితాంతం సహజ మరణం వరకు జైలులోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాలు వడమాలపేట మండలం ఎఎంపురం ఎస్టీ కాలనీకి చెందిన మూడున్నరేళ్ల చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని ముద్దాయి పాముల నాగరాజు అలియాస్ సుశాంత్ గ్రామ శివార్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడేశాడు. గ్రామస్తులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించగా, బాదిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నాటి తిరుపతి జిల్లా ఎస్పీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి రోజా పోరాటంతో కేసు నమోదు చిన్నారిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని తెలుసుకొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డితో కలసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబంతో కలసి ఆందోళన చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం పోక్సో కేసు నమోదుతో పాటు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. రెండేళ్ల పాటు జరిగిన విచారణ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక పోక్సో కోర్టు ముద్దాయికి యావజ్జీవ శిక్షణను ఖరారు చేసింది. -
ప్రారంభం నుంచే మామిడి రైతులకు సబ్సిడీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సీజన్ ప్రారంభం నుంచి పరిశ్రమలకు మామిడి తోలిన రైతులందరికీ ప్రభుత్వ సబ్సిడీ అందజేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్సిడీ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేదన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా సబ్సిడీకి సంబంధించి గ్రామ సభల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేస్తామన్నారు. ఆ గ్రామ సభల్లో క్షేత్రస్థాయి పరిశీలన, గత ఏడాది రైతుల వివరాలు, రైతుల ధ్రువీకరణ, పంట ఈకేవైసీ నమోదు పకడ్బందీగా పరిశీలిస్తారన్నారు. క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే అర్హులైన రైతులను గుర్తిస్తామన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఎగుమతుల మందగమనం, పల్ప్ పరిశ్రమల్లో కొనుగోళ్లు తగ్గిపోవడంతో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా కనీస మద్దతు ధర రూ.4 ప్రకటించారన్నారు. జిల్లాలో సుమారు 51,736 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందన్నారు. దక్షిణ భారతదేశంలో మామిడి గుజ్జు తయారీ, ఎగుమతులకు చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండటంతో దాదాపు 35 వేల రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. తోతాపురి రకం కేవలం గుజ్జు (పల్ప్) తయారీకే అనువైనందున, పరిశ్రమలు కొనుగోళ్లు తగ్గించడంతో రైతులకు నష్టం కలుగుతోందన్నారు. జిల్లాలో కేంద్ర నిపుణుల బృందం అధ్యయనం జిల్లాలో తోతాపూరి మామిడి సాగు సమస్యలను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నియమించిన కేంద్ర నిపుణుల బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించిందన్నారు. లక్నో ఐసీఏఆర్–సిఐఎస్హెచ్ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరన్ నేతృత్వంలోని ఈ బృందంలో బెంగళూరు ఐఐహెచ్ఆర్ హెడ్ డాక్టర్ ఎం. శంకరన్, లక్నో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ హెచ్.ఎస్. సింగ్, అనంతరాజుపేట హార్టికల్చర్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, ఏపీ ఉద్యానశాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కేంద్ర బృందం జిల్లాలోని రైతులు, అధికార యంత్రాంగం, మామిడి పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తుందన్నారు. మామిడి ఉత్పత్తులకు డిమాండ్ పెంపు, నాణ్యత మెరుగుదల, ఎగుమతుల విస్తరణ, మార్కెటింగ్ విధానాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల పనితీరుపై సమగ్ర అధ్యయనం చేస్తారన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ బృందం పర్యటించి, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే విధానాల రూపకల్పనకు అవసరమైన సూచనలు చేస్తుందని కలెక్టర్ వెల్లడించారు. -
మల్బరీ సాగును పెంచుతాం
పలమనేరు: జిల్లాలో మల్బరీ సాగును మరింతగా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు వాణి పేర్కొన్నారు. పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్ను శుక్రవారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా అక్కడున్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే పట్టుపురుగుల సాగులో పలమనేరుకు ప్రాధానన్యత ఉందన్నారు. ఇందులో భాగంగా స్థానిక మార్కెట్లో ధరలు ఆశాజనంగా ఉండేందుకు మరిన్ని రీలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆసక్తి ఉన్న వారికి ట్విస్టింగ్ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. పట్టు రైతులకు గతంలో ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఇస్తూ మల్బరీ సాగును పెంచుతామన్నారు. ఇక్కడి పట్టు రైతులు, వ్యాపారులు, అధికారులతో త్వరలో ఓ సమావేశాన్ని నిర్వహించి రైతులనుంచి సలహాలు, సమస్యలు తెలుసుకుంటామన్నారు. వాటిని తమశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి జిల్లాలో మళ్లీ పట్టు పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకొవచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఈసందర్భంగా పట్టు రైతు ఏడూరు గురుమూర్తి శెట్టి పలు విషయాలను రైతుల తరఫున ఆమెకు విన్నవించారు. ఇందులో స్థానిక ఏడీ సరోజా తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతు కన్నీరు తుడిచేనా?
కాణిపాకం:ఏటా కష్టాలు.. ఏటా నష్టాలు.. దళారుల దోపిడీకి అడ్డూ అదుపూ లేదు.. పాలకుల హామీలకు ఆచరణ లేదు.. ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు దయనీయ స్థితి. ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నియమించిన ఒక ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం గురు, శుక్రవారాల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించింది. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఈ కమిటీ సభ్యుల తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక తరహా పాలసీ కావాలి ప్రాంతీయ మార్కెట్లలో ధరల స్థిరీకరణ లేకపోవడంతో తాము నట్టేట మునుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలుస్తూ కిలోకు రూ.18 చొప్పున ధర కల్పించిందని, అదే తరహా విధానాన్ని తక్షణమే ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేసి చిత్తూరు, తిరుపతి జిల్లాల రైతులకు న్యాయం చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. వినూత్న ప్రతిపాదనలు.. బ్యాంకింగ్ లింకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనాలు కాకుండా, తమకు శాశ్వత ఆర్థిక భరోసా కల్పించేలా రైతులు కొన్ని కీలకమైన వినూత్న ప్రతిపాదనలను కేంద్ర బృందం ముందుంచారు. పళ్లగుజ్జు పరిశ్రమలకు వెళ్లే మామిడి కాయలను వ్యాపారుల అజమాయిషీలో కాకుండా, నేరుగా రైతు పేరు మీదే పల్ప్గా మార్చేలా నిబంధనలు తీసుకురావాలి. ఆ విధంగా తయారైన పల్ప్ను సెంట్రల్ వేర్హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్ పరిధిలోకి తీసుకువచ్చి భద్రపరచాలి. మార్కెట్లో రేట్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు, ఆ వేర్హౌస్ రసీదుల ఆధారంగా బ్యాంకుల ద్వారా రైతులకు సులభంగా రుణాలు మంజూరు చేసే సరికొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని స్పష్టం చేశారు. ఊరటనిచ్చేనా ఈ పర్యటన? మార్కెట్లో ధరలు పడిపోయిన సమయంలో అత్యవసర ఖర్చుల కోసం రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా.. ఈ బ్యాంక్ రుణాల విధానం ఎంతగానో దోహదపడుతుందని నిపుణు లు సైతం అభిప్రాయపడుతున్నారు. ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు పల్ప్ను అమ్ముకుని రైతులు లబ్ధి పొందే వీలుంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది మంది రైతుల జీవనాధారమైన మామిడి సాగును సంక్షోభం నుంచి గట్టెక్కించేలా.. కేంద్ర బృందం తన నివేదికలో ఈ డిమాండ్లను పొందుపరిచి, కేంద్రానికి సిఫార్సు చేయాలని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
13న ఐటీఐలో అప్రెంటీస్షిప్ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 13 వ తేదీన అప్రెంటీస్షిప్ మేళా నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో అప్రెంటిస్షిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ మేళాను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 13 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో హాజరుకావాలన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్య ర్థులు ముందుగా అప్రెంటిస్షిప్ అధికారిక పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఒకవేళ పోర్టల్లో నమోదు చేసుకోని పక్షంలో, అభ్యర్థులు తమ విద్యార్హత సర్టి ఫికెట్లతో నేరుగా ఐటీఐ కార్యాలయానికి రావొచ్చన్నారు. ఉచిత పంట బీమాకు అవకాశం చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలోని చిత్తూరు డివిజన్ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 ఖరీఫ్ సీజన్కు గాను వరి, రాగి, కందు లు, వేరుశెనగ పంటలకు ఉచిత పంట బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చిత్తూరు డివిజన్ పరిధిలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, పూతలపట్టు,ఐరాల, పెనుమూ రు, తవణంపల్లె, వెదురుకుప్పం, కార్వేటినగరం, రొంపిచర్ల, పులిచెర్ల మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసా య శాఖ అధికారులు కోరారు. ఆయా పంటల వారీగా నిర్ణీత ప్రీమియం చెల్లించి గడువులోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మదపుటేనుగును బంధించేందుకు చర్యలు పలమనేరు: పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్లో చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ సంచరిస్తున్న ఒంటరి మదపుటేనుగుకు బంధించి దాన్ని కుంకీగా మార్చేందుకు స్థానిక అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపులోని దేవా అనే ఏనుగును తిరుపతి జూకు అప్పగించి జూలోని గణేష్ అనే ఏనుగును ఇక్కడి ముసలిమొడుగు క్యాంపునకు రప్పిస్తున్నారు. ఇక్కడున్న కుంకీలతో గణేష్ను కలుపుకుని ఓ ఆపరేషన్ చేయించనున్నట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు మావటీల ద్వారా వీటికి శిక్షణ ఇచ్చి ఒంటరి ఏనుగు ను పట్టుకునేలా చర్యలు చేపట్టారు. అది చిక్కితే దానికి శిక్షణ ఇచ్చి కుంకీగా మార్చనున్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో 5వ తరగతి అడ్మిషన్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఇరువారం వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా 5 వ తరగతి అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5 వ తరగతిలో ఖాళీగా ఉన్న మూడు సీట్లకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఏప్రిల్ 1 వ తేదీ 2014 నుంచి ఏప్రిల్ 1 వ తేదీ 2016 లోపు జన్మించిన వారై ఉండాలన్నారు. కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయిస్తారన్నారు. దరఖాస్తు ఫారాలను పాఠశాలలో ఉచితంగా స్వీకరించి ఈనెల 18 వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని ఆయన కోరారు. దరఖాస్తుల ఆహ్వానం కుప్పం: మండల పరిధిలోని గణేష్పురం వద్ద ఉన్న మహాత్మా జ్యోతీరావ్ పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాయకృష్ణ శుక్రవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. ఈ పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో బీస్సీ, ఎస్సీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి సోమవారం వర కు పాఠశాలలో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15 వతేది ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు కోసం 9985609713, 8185847668 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. టెంపో ఢీకొని యువకుడి మృతి బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద శుక్రవారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని టెంపో ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాల మండలం పాపసముద్రం గ్రామానికి చెందిన కుశాల్(20) సొంత పని నిమిత్తం బెంగళూరుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. గురువారం రాత్రి 11 గంటలకు బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గం మధ్యలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలగాంపల్లె ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో కుశాల్ అక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు బ్యాంకు రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇటీవల మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లింకేజీలు, సీ్త్ర నిధి, సీఐఎఫ్, వడ్డీ లేని రుణాలు, జీవనోపాధి యూనిట్లు మంజూరు చేయిస్తామని నమ్మబలికి కొందరు అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు పథకంలో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల పెంపుదల లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. సంఘాల్లోని మహిళలకు వారి అర్హతను బట్టి ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థ ద్వారానే రుణాలు పారదర్శకంగా మంజూరు అవుతాయని చెప్పారు. మధ్యవర్తులతో పనేమీ ఉండదని స్పష్టం చేశారు. రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు ప్రభుత్వ పథకాల పేరుతో, అధికారిక సేవల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడినా, నగదు డిమాండ్ చేసినా స్వయం సహాయక సంఘ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని కలెక్టర్ అన్నారు. బాధితులు తగిన ఆధారాలతో నేరుగా తనకు గానీ, డీఆర్డీఏ పీడీకి కాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. డీఆర్డీఏ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. బాధితులు 9390505066 నంబర్కు ఫోన్చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని సూచించారు. జిల్లాలో అవినీతి రహిత, పారదర్శకమైన వ్యవస్థను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాల సభ్యులందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. -
సవాళ్లతోనే అద్భుత ఫలితాలు
ఏర్పేడు: సవాళ్లతో కూడిన పరిశోధనలతోనే అద్భుత ఫలితాలు సాధించొచ్చని డీఆర్డీవో మాజీ చైర్మన్, ప్రముఖ రక్షణ, ఏరోస్పేస్ శాస్త్రవేత్త డా.జి.సతీష్రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్ కొలీజియం హాల్లో శుక్రవారం 7వ స్నాతకోత్సవం ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీష్రెడ్డి, ఐసర్ డైరెక్టర్ శాంతను భట్టాచార్య, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ హరిబార్తియ, రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీతో కలసి 214 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతి సతీష్రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి ‘వికసిత భారత్’ అనే భారతదేశ దార్శనికత ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. ఐసర్, ఐఐటీ రెండు జాతీయ విద్యాసంస్థలు ఒక్కచోటే ఉండడం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఎడ్యుకేషన్ హబ్గా మారిందన్నారు. దేశరక్షణ వ్యవస్థ ఎంతో సాంకేతికతను మేళవించుకుని అనూహ్యరీతిలో ఆయుధాలను తయారు చేస్తోందన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కర్తలుగా మారి దేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ఐసర్ సాధించిన విజయాలు, విద్యార్థులు చేసిన నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న సౌకర్యాలను వివరించారు. -
6 కేజీల గంజాయి స్వాధీనం
– నలుగురి అరెస్టు కుప్పం: గంజాయి అక్రమణ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీస్పీ పార్థసారధి తెలిపారు. శ్రుకవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రానికి చెందిన అలోక్ డిగాల్, సాయి డిగాల్తో పాటు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి చెందినా మౌలా, ప్రదీప్ 6 కేజీ గంజాయిని కుప్పం నుంచి తమిళనాడు తరలిస్తున్నారు. దీనిపై పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టడంతో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తనఖీ చేయగా గంజాయి బయటపడినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురికి అరెస్టు చేసి వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, పోలీసులు సిబ్బంది బాబు, రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు. -
హెల్మెట్తో మహిళను కొట్టి బంగారు నగల దోపిడీ
విజయపురం (నగరి): విజయపురం మండలంలోని పన్నూరు గ్రామంలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఒక మహిళపై దాడి చేసి ఆమె మెడలోని రూ.4 లక్షలు విలువచేసే బంగారు తాళిబొట్టు చైన్ను అపహరించిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితురాలు కామాక్షి, ఆమె భర్త వెంకటేశులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వారి ఇంటి వద్దకు వచ్చారు. తమ బైక్కు సమస్య వచ్చిందని, స్పానర్ కావాలని అడిగారు. కామాక్షి స్పానర్ తీసుకువచ్చి ఇవ్వబోతుండగా, దుండగులు తమ చేతిలో ఉన్న హెల్మెట్తో ఆమైపె దాడి చేశారు. దాడితో ఆమె తేరుకునేలోపే మెడలో ఉన్న బంగారు తాళిబొట్టు చైను లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు వేయగా అప్పటికే దుండగులు అక్కడి నుంచి వేగంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాధితులు విజయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఓపీఎస్ అమలుపై పోలీసుల హర్షం చిత్తూరు అర్బన్: పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిధిగృహంలో ఎస్పీ డూడీను కలిసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్లు, ఆయన్ను సన్మానించారు. 2003 నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన తమకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఆధారంగా ఓపీఎస్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. -
ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్, సెక్రటరీ జనరల్ ముక్తర్ అహమ్మద్ తెలిపారు. వారు గురువారం చిత్తూరులోని ఎన్జీవో కార్యాలయంలో ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందన్నారు. ఈ క్రమంలో 14న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు 2024 లోనే 12వ పీఆర్సీని అమలు చేస్తామని, ఆలస్యమైతే ఐఆర్ ప్రకటిస్తా మని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా డీఏలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వేతన సవరణ కమిషన్ను కూడా నియమించకుండా కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తా రు. సుమారు రూ.20 వేల కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 30 శాతం ఐఆర్తో పాటు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు నరోత్తమరెడ్డి, జీవీ రమణ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 కంటే ముందు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలన్నా రు. లేదా ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ మాన్యువల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబో యే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మదన్మోహన్రెడ్డి, జగ దీష్, చిట్టిబాబు, చలపతి, ఎస్పీ బాషా, పార్థసారథి, మోహన్, ధనుంజయులు, ఢిల్లీ ప్రకాష్ పాల్గొన్నారు. -
సర్లో ఐదు రోజులు కీలకం
ఐరాల: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్)లో ఓట్లు గల్లంతు కాకుండా వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు ఐదు రోజులు క్షేత్రస్థాయిలో అత్యంత కీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆయన గురువారం కాణిపాకంలో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్కుమార్ నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్ఏల పనితీరు, డిజిటలైజేషన్ వివరాలను భూమనకు తెలియజేశారు. భూమన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పూర్తయ్యేవరకు బీఎల్ఏలు ఓటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. సర్ను సాకుగా చూపి టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాలకు బీఎల్ఓలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు వారి వెంట ఉండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పార్టీ బీఎల్ఏలు ఎన్యూమరేషన్ ఫారం పూరించడంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేసే వరకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐరాల, తవణంపల్లె మండలాల కన్వీనర్లు చంద్రశేఖర్రెడ్డి, హరిరెడ్డి, మాజీ సర్పంచ్ శాంతిసాగర్రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ ప్రతాప్రెడ్డి, మండల బూత్ అధ్యక్షుడు హరీష్రెడ్డి, చిన్నారెడ్డి, ప్రభాకర్రెడ్డి, సురేష్రెడ్డి, సుధీర్, భరత్, వివేక్, సాయి, నాగరాజు, గిరి, ఎంపీటీసీ బాబు, బీఎల్ఏలు మూర్తి, సౌందర్రాజన్, తేజరెడ్డి, చంద్రరెడ్డి, నిరంజన్రెడ్డి, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంఏజీవై పనులు వేగవంతం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన గురువారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏజీవైలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల వివరాలను వెంటనే ఆన్లైన్ అప్లోడ్ చేయాలని సూచించారు. మంజూరైన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేగం పెంచాలన్నారు. నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించుకోవాలని తెలిపారు. 12 వరకు ర్యాంపుల గడువు పొడిగింపు చిత్తూరు రూరల్ (కాణిపాకం): కలెక్టర్ ఆదేశాల మేరకు బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల మండలాల్లో ఉన్న ర్యాంపుల గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది. సదరు మండలాల్లో ఇంకా 30 శాతం మేర పంట మిగిలి ఉండటంతో రైతుల సౌకర్యార్థం మరో రెండు రోజులు ర్యాంపుల కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా మురళీకృష్ణ చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లా ల ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా ఏవీ మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించా రు. గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రామకృష్ణారెడ్డి గతనెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రస్తుతం మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన చిత్తూరు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. నూతన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మాట్లాడు తూ కార్మిక సంక్షేమమే ధ్యేయమన్నారు. తమ కార్యాలయం పారిశ్రామిక రంగంలో వృత్తి భద్రత, ఆరోగ్యం, పరిస్థితుల కోడ్ ప్రకారం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చట్టబద్ధ నిబంధనల అమలు, కార్మికుల సంక్షేమ పరిరక్షణ, ఫ్యాక్టరీల్లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన పారిశ్రామిక వాతావరణాన్ని ప్రోత్స హించేందుకు తమ శాఖ నిరంతరం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. -
మామిడి తోటల్లో..
మామిడి తోటల నరికివేత తీవ్రం కావడంతో మార్కెట్కు కలప ఎక్కువగా వస్తోంది. దీంతో మామిడి కట్టెల ధరలు చరిత్రలో లేనంతగా పడిపోయాయి. గతంలో టన్ను కట్టెల ధర రూ.3,000 పలుకగా.. ఇప్పుడు రూ.1,600లకు చేరింది. జిల్లాలో రోజుకు వందలాది లారీల మామిడి కట్టెలు లోడ్ అవుతున్నాయి. స్థానికంగా ఉన్న శ్రీకాళహస్తి ఫ్లైవుడ్ పరిశ్రమలకు తరలించగా మిగిలిన కట్టెలను తమిళనాడు, తెలంగాణతో పాటు విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వ్యాపారులు దర్జాగా తరలిస్తున్నారు. మార్కెట్లో కట్టెల వరద.. సగానికి పడిపోయిన ధర -
శాస్త్రవేత్తల దృష్టికి మామిడి రైతుల సమస్యలు
వడమాలపేట (పుత్తూరు): ఏటా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి రైతులు తమ సమస్యలను ఐకేర్ ఎక్స్ఫర్ట్ టీమ్ (ఐసీఏఆర్) శాస్త్రవేత్తల ముందు ఏకరవు పెట్టారు. శాస్త్రవేత్తల బృందం గురువారం వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా మామిడి రైతులతో చర్చించా రు. ఎస్బీఆర్పురం, కేబీఆర్పురం నుంచి వచ్చిన రైతు లు మాట్లాడుతూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశించిన మేరకు గుజ్జు పరిశ్రమలు తోతాపురం కేజీకి రూ.8 వంతున చెల్లించలేదని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే గిట్టుబాటు ధర ఉండడం లేదని వాపోయారు. అడిషినల్ డైరెక్టర్ ఆఫ్ హా ర్టికల్చర్ హరినాథ్రెడ్డి మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కా రం చూపుతామని తెలిపారు. రైతులు పంట నాణ్యత ను పెంచుకోవాలని, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జీఏపీ) గ్రేడింగ్ పద్ధతి, ప్రూట్ కేర్ ఆక్టివిటీ (ఫ్రూట్ కవర్) చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేర్ టీమ్ సభ్యులు దామోదరన్, శంకరం, సింగ్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ దేవమునిరెడ్డి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ దశరథరామిరెడ్డి, పుత్తూరు డివిజన్ ఉద్యానవన అధికారి వెంకట సౌజన్య పాల్గొన్నారు. -
తీవ్రమైన ఓటు పోరు
చిత్తూరు నగరంలోని రాంనగర్ కాలనీకి చెందిన రామాంజనేయులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వలస వెళ్లాడు. అతను రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నాడు. ప్రస్తుత సర్ ప్రక్రియలో అతనికి ఏదో ఒక ఓటును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఓటు ఉంచుకోవాలో తేల్చుకోలేక మథనపడుతున్నాడు. ఇలాంటి లక్షలాది మంది వలస ఓటర్ల పరిస్థితి ప్రస్తుతం కత్తిమీద సాములా మారింది. ఈ సమస్యపై సాక్షి స్పెషల్ కథనం. చిత్తూరు కలెక్టరేట్ : ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు హక్కు ఉండడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సర్వే ఉమ్మడి కుటుంబాలు, వలస ఓటర్లలో తీవ్ర గందరగోళాన్ని రేపుతోంది. జిల్లాలోని చిత్తూరు నగరపాలక, మున్సిపాలిటీలు, మండలాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓటు ఎక్కడ ఉంచుకోవాలి?’ అనే చర్చే నడుస్తోంది. పట్టణాలు, పల్లెల్లో ఓట్లు ఉన్నవారు తమ ఓటు హక్కును ఎక్కడ వదులుకోవాలో తేల్చుకోలేక సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఓటర్లపై నేతల ఒత్తిడి.. గెలుపోటములపై గుబులు! జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 13,40,126 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.20 లక్షల మంఇ వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఈ డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నుంచి స్థానిక సంస్థల (సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్) ఎన్నికల వరకు వలస ఓటర్ల ఓటింగే గెలుపోటములను నిర్ణయిస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 15 నుంచి 20 వేల మంది వలస ఓటర్లు ఉంటారని అంచనా. గత ఎన్నికల్లో హైదరాబాద్, బెంగళూరు, చైన్నె ఇతర పట్టణాల్లో ఉంటూ పోలింగ్ రోజు సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డబుల్ ఓట్ల తొలగింపు ముమ్మరం కావడంతో ‘మా దగ్గరే ఓటు ఉంచుకోండి’ అంటూ ఇటు మున్సిపల్ నేతలు, అటు గ్రామీణ నేతలు ఓటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. బీఎల్వోలకు కొత్త చిక్కులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న బీఎల్వోలకు ఈ వలస ఓటర్ల వల్ల పెద్ద గందరగోళం ఎదురవుతోంది. గత గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం ఆధారంగా ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ పూర్తి చేసినప్పటికీ, వాటిపై ఓటర్ల ఫోన్ నంబర్లు లేకపోవడం సమస్యగా మారింది. అధికారులు ఇళ్లకు వెళ్లేసరికి చాలామంది వలస ఓటర్లు అక్కడ ఉండడం లేదు. కొందరైతే ఇళ్లు అమ్ముకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఏం చేయాలో తెలియక బీఎల్వోలు ఆ ఫారాలను తమ వద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ రెండు చోట్ల ఓట్లు ఉన్న వారిని, అటు నాయకులను తీవ్ర ఇరకాటంలో పడేసింది. కుటుంబాల్లోనూ వాదోపవాదాలు ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ ఇప్పుడు ఇళ్లల్లో రాజ కీయ సమస్యగా మారింది. పట్టణాల్లో నివసిస్తు న్న కుటుంబాల్లోని భార్యాభర్తల మధ్య కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొందరు ఓటు సొంతూళ్లలోనే (సెంటిమెంట్, చుట్టరికం, పరువు కోసం) ఉండాలని భావిస్తుండగా.. మరికొందరు పిల్లల చదువులు, భవిష్యత్ స్థానికత, రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆఫర్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం ఉంటున్న పట్టణ పరిధిలోనే ఓటు ఉంచుకుందామని వాదిస్తున్నారు. ‘ఊర్లో ఓటు తీసేస్తే చుట్టరికం, పల్లెల్లో పరువు పోతుంది’ అనే ఆందోళన కూడా ఓటర్లలో వ్యక్తమవుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సర్వేతో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండకూడదనే నిబంధనతో వసల జీవులు నలిగిపోతున్నారు. సొంత గ్రామంలోని ఓటు తొలగిపోతే అది సామాజిక బంధాలు, రేపటి గుర్తింపును శాసించే అవకాశం పోతుందని, ఉన్నచోట ఓటును తొలగిస్తే గుర్తింపును పోగొట్టుకున్నట్టేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో సొంతూరులోనా.. లేక ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనా..? ఓటు ఎక్కడ ఉంచుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడే ఓటు ఉంచుకోవాలని రాజకీయ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. -
రైల్వేస్టేషన్ను తనిఖీ చేసిన డీఆర్ఎం
చిత్తూరు కార్పొరేషన్: గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) చంద్రశేఖర్గుప్తా గురువారం చిత్తూరు రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. అమృత్ భారత్ కింద స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఒకటో నంబర్ ప్లాట్ఫాం, టికెట్ కౌంటర్, ప్రవేశ మార్గం, పార్కింగ్ ప్రాంతాలు, నూతన భవనంను చూశారు. ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. డిసెంబర్లోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. స్టేషన్లో వెయిటింగ్హాల్స్, ఏసీ విశ్రాంతి గదులు, దివ్యాంగులకు మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గుంతకల్ డివిజన్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. చిత్తూరు హైరోడ్డులోని పెట్రోల్ బంక్ లీజు సమయం ముగియడంతో స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. స్పష్టత లేని సమాధానం ఈ సందర్భంగా చిత్తూరు నుంచి వెళ్తున్న 6 రైళ్లు ఇక్కడ ఆగడం లేదని మీడియా ప్రతినిధులు డీఆర్ఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చిత్తూరు వాసుల కల అయిన చైన్నెకు నేరుగా రైలు ఎప్పుడు వస్తుందని అడిగారు. వీటిపై డీఆర్ఎం సరైన సమాధానం చెప్పలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని దాటవేశారు. మీడియాతో ఆర్పీఎఫ్ వాగ్వాదం మీడియా ప్రతినిధులపై ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు అతిగా ప్రవర్తించారు. వాహనాలను పార్కింగ్లోనే పెట్టాలని ఆదేశించారు. డీఆర్ఎం స్టేషన్లో పర్యటిస్తుండగా కవర్ చేస్తున్న విలేకర్లతో అనుచితంగా వ్యవహరించారు. మీడియా అని చెబితే అయితే ఏమి అంటూ మాట్లాడారు. దీనిపై మీడియా ప్రతినిధులు తిరగబడడంతో సీఐ రవిశంకర్, ఏఎస్ఐ అశోక్ కలుగజేసుకుని సర్దిచెప్పారు. డీఆర్ఎం పర్యటనపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, కవరేజ్ కోసం వచ్చిన వారిపై ఇలా నడుచుకోవడం సరికాదని విలేకరులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ ముత్తుస్వామి, కమర్షిషయల్ మేనేజర్ అతీషయ, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాపై ఎల్నినో పడగ
కాణిపాకం: వర్షం కోసం అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నా వరుణుడు కనికరించడం లేదు. కారు మబ్బులు కమ్ముకుంటున్నా నీటి చుక్కను జారవిడవడం లేదు. జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుణుడు ఈదురు గాలులు, మేఘాల గర్జనలతో సరిపెడుతున్నాడు. నేలను తడపడానికి మాత్రం మనసు చేసుకోవడం లేదు. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే చాలు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవాలి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఏటా జూలై లో 103 మి.మీల. సగటు వర్షపాతం నమో దు కావాల్సి ఉండగా, ఈ సారి జూలై సగానికి వచ్చినా 52.70 మి.మీల వద్దే వర్షపాతం నిలిచిపోయింది. అంటే సగటులో సగానికి పైగా లోటు పీడిస్తోంది. పడిపోనున్న సాగు విస్తీర్ణం జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాలు లేకుంటే సాగు విస్తీర్ణం ఘననీయంగా పడిపోయే అవకాశాలున్నా యి. ఇప్పటికే వర్షాలు లేక పంటలు పండించే రైతుల సంఖ్య తగ్గిపోయింది. ఎల్నినో ప్రభావంతో ఈ సారి మరింత సాగు విస్తీ ర్ణం పడిపోనుంది. ఈ సమయానికి సాగులోకి రావాల్సిన పంటలు వెనకడుగు వేస్తోంది. భూమిలోనే చిత్తవుతున్న విత్తు వానలు పడతాయనే ఆశతో కొంతమంది రైతన్నలు పొలాలను దుక్కిదున్ని విత్తనాలు వేశారు. ఇంకా అనేక మంది విత్తు విత్తేందేకు ఎదురుచూస్తున్నారు. తీరా చూస్తే వరుణుడు కరుణించడం లేదు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు తేల్చి చెబుతుండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో తడి తగలక.. వేసిన విత్తు భూమిలోనే చిత్తయిపోతోంది. ఈ నేపథ్యంలో జిల్లాను కరువు కాటకాలు కమ్ముకునే ప్రమాదం ముంచుకొస్తోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరుతున్నారు. పాతాళానికి గంగ వర్షాలు మొఖం చాటేయడంతో భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. గంగ పాతాళానికి పడిపోతోంది. గత ఏడాది డిసెంబర్లో 6.87 మీటర్ల వద్ద ఉన్న భూగర్భ నీటిమట్టం ఈ ఏడాది జనవరి నుంచి పడిపోతూ వస్తోంది. జనవరిలో 8.42 మీటర్లకు పడిపోగా.. ఫిబ్రవరిలో 9.84 మీటర్లు, మార్చిలో 10.96 మీటర్లు, ఏప్రిల్లో 12.93 మీటర్లు, మే నెలలో 13.82 మీటర్లు, జూన్ ముగిసే సరికి ఏకంగా 14.24 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లోనూ వర్షాలు పడకపోతే ఈ సంక్షోభం మరింత పెరు గుతుందని అధికారులు చెబుతున్నారు. బావులు, బోర్లు ఎండిపోయి తాగునీటి ఎద్దడి కోరలు చాచడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖం చాటేసిన వానదేవుడు జూలై సాధారణ నమోదైన (సంవత్సరం) వర్షపాతం వర్షపాతం 2021 103 మి.మీ 223.10 మి.మీ 2022 103 మి.మీ 77.90 మి.మీ 2023 103 మి.మీ 62.70 మి.మీ 2024 103 మి.మీ 90.10 మి.మీ 2025 103 మి.మీ 93.40 మి.మీ 2026(ప్రస్తుతం) 103 మి.మీ 52.70 మి.మీ(తీవ్ర లోటు) ఇదీ వర్షపాతం గడిచిన ఐదేళ్లలో జూలైలో నమోదైన వర్షపు గణంకాలను పరిశీలిస్తే.. జిల్లాలో వానల గ్రాఫ్ ఏటా ఎలా పడిపోతుందో అర్థమవుతోంది. -
జెడ్పీలో నకిలీ నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: నకిలీ మెడికల్ పత్రాలతో జెడ్పీలో పలువురు కారుణ్య నియామకాలు పొందారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రలేఖ అనే యువతి ఆరోపించారు. ఆమె గురువారం జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు ఆమెను వారించారు. ఆమె సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని సొరకాయపాళ్యం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న జయమ్మ 2010లో క్యాన్సర్ బారిన పడిందన్నారు. చికిత్స తర్వాత వ్యాధి తగ్గిందన్నారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదని, ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నట్టు మభ్యపెడుతున్నట్టు ఆరోపించారు. నకిలీ మెడికల్ పత్రాలు సృష్టించి తన కొడుకు చక్రపాణికి తన ఉద్యోగం ఇప్పించిందని పేర్కొన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ సమయంలో కూడా జయమ్మకు బదులుగా క్యాన్సర్తో బాధపడుతున్న మరో మహిళను వైద్యులు పరీక్షించేలా చేశారని ఆరోపించారు. తప్పుడు, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో ఆమె కొడుకు మార్చి 2026లో వాల్మీకిపురం ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా చేరాడని వివరించారు. అక్కడి నుంచి 15 రోజుల్లోనే పలుకుబడిన ఉపయోగించి తిరుచానూరు పద్మావతి ఆలయంలో ప్రోటోకాల్ విభాగంలో డెప్యుటేషన్ వేయించుకున్నట్టు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నకిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సహకరించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్, జెడ్పీ సీఈవోకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశానని తెలిపారు. -
వర్తించని జీవో 45
రెస్కో ఉద్యోగులకు కుప్పం రూరల్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచు తూ ప్రభుత్వం ఇటీవల జీవో ఎంఎస్ నంబర్ 45 ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కో ఆపరేటివ్ సొసైటీలకు ఈ జీవో వర్తిస్తుందని ప్రకటించింది. కుప్పం రెస్కోకు మాత్రం వర్తించదని అధికారులు పేర్కొనడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమకు కూడా ఆ ఉత్తర్వులు వర్తింపజేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు నిరాశచెందుతున్నారు. గ్రామీణ ప్రాంతమైన కుప్పంలో నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో 1983లో రెస్కో (కుప్పం గ్రామీణ విద్యుత్ సహకారం సంస్థ కోఆపరేటివ్ లిమిటెడ్)ను అప్పటి ప్రభుత్వం స్థాపించింది. ఇందులో సుమారు 240 మంది విధులు నిర్వహిస్తున్నారు. జూలై నెల మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లు చేస్తూ జీవో ఎంఎస్ నంబర్ 45ను తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కో ఆపరేటివ్ సంస్థలకు వర్తిస్తుందని పేర్కొంది. రెస్కో మాతృ సంస్థలైన ట్రాన్స్ కో, ఏపీ ఎస్పీడీసీఎల్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కుప్పం రెస్కో ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. రెస్కో సంస్థ 9,10 షెడ్యూళ్లలో ఈ అంశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో 240 మంది ఉద్యోగులకు 62 ఏళ్ల ఉద్యోగ విరమణ హక్కును పొందలేకపోతున్నారు. మొదట్లో పెంచిన 60 ఏళ్లు విరమణను వర్తింపజేయకపోగా, ఇప్పుడు 62 ఏళ్ల విరమణ ఉత్తర్వులను వర్తింపజేయకపోవడంతో ఉద్యోగులు 58 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది. సీఎం, మంత్రికి విన్నవించినా లేని హామీ 62 ఏళ్ల ఉద్యోగ విరమణను తమకూ వర్తింపజేయాలని కొంతమంది ఉద్యోగులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు విన్నవించారు. వారి నుంచి సరైన హామీ అందకపోవడంతో ఉద్యోగులు రాష్ట్ర మంత్రులను స్వయంగా కలవాలనే ఆలోచనకు వచ్చారు. ఏది ఏమైనప్పటికీ సీఎం సొంత నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక నిబంధన, రాష్ట్ర మొత్తం ఉద్యోగులకు ఒక నిబంధనగా తయారైంది రెస్కో పరిస్థితి. నష్టపోతున్న 280 మంది ఉద్యోగులు మొదటి విడతగా ప్రభుత్వం 58 నుంచి 60 ఏళ్ల ఉద్యోగ విరమణ వయస్సును పెంచిన సమయంలో రెస్కో ఉద్యోగులకు వర్తించక నష్టపోయారు. ఒకరిద్దరు కోర్టుకు వెళ్లి రెండేళ్ల ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ అలవెన్సులు ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 45 ప్రకారం 62 ఏళ్ల ఉద్యోగ విరమణ నిబంధన వర్తించదని చెబుతున్నారు. దీంతో 280 మంది ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. రెస్కోలో 62 ఏళ్ల జీవో అమలులోకి వస్తే తాజాగా ఉద్యోగ విరమణ చేసిన వారు 15 మంది విధుల్లోకి చేరాల్సి ఉంది. ఈ జీవో వర్తించకపోవడంతో 15 మంది నష్టపోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మంతా ఉద్యోగులకు ఒక రూలు మాకు మరో రూలా అంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. రెస్కో ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే రెస్కో సంస్థ 9, 10 షెడ్యూళ్లల్లో ఈ విషయం లేదని, మీరు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు వాపోతున్నారు. -
కారు ఢీకొని మహిళ దుర్మరణం
పూతలపట్టు (యాదమరి): మండలంలోని తిరుపతి–పూతలపట్టు జాతీయ రహదారిలో ఉన్న పి.కొత్తకోట వద్ద గురువారం కారు ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం పోటుకనుమ గ్రామానికి చెందిన లలితమ్మ(55), ఆమె భర్త కృష్ణయ్య సొంత పనుల నిమిత్తం తిరుపతి వెళ్లారు. తిరిగి వస్తూ పి.కొత్తకోట వద్ద బస్సు దిగారు. జాతీయ రహదారి దాటుతున్న సమయంలో తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. లలితమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూతలపట్టు సీఐ తిమ్మయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు, కొత్తకోట గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై టైఠాయించారు. పి.కొత్తకోట వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, నాయకులు దొరబాబు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
పురాతన వినాయకుడి విగ్రహం లభ్యం
వి.కోట: మండలంలోని పట్రపల్లిలో గురువారం ఓ రైతు ఇంటి సమీపంలో తవ్వుతుండగా పురాతన వినాయకుడి రాతి విగ్రహం బయట పడింది. స్థానికుల కథనం మేరకు.. పట్రపల్లికి చెందిన రైతు సుబ్బన్న తన సొంత ఇంటి జాగాలో ఆవును కట్టేసుకునేందుకు పెద్దరాయిని నాటాలని గడ్డపారతో తవ్వాడు. ఈ క్రమంలో పురాతన రాతి వినాయకుడి విగ్రహం బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పూజ లు చేశారు. విగ్రహాన్ని భద్రపరచి ఆలయంలో ప్రతిష్టించాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
కుప్పం రూరల్ : కుప్పం – గుడుపల్లె రైల్వే మార్గంలో డంపింగ్ యార్డు వద్ద గురువారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్టు కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, నీలి రంగు షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులు 8074088806 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. లారీ బోల్తా కుప్పం రూరల్ : కుప్పం మండలం, నడుమూ రు అటవీ ప్రాంతంలో గురువారం లారీ బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. లారీ పత్తి లోడుతో గుజరాత్ రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు వెళుతోంది. కుప్పం – క్రిష్ణగిరి జాతీ య రహదారిలోని నడుమూరు మోడ ల్ స్కూల్ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ చాలా వరకు దెబ్బతిందని, డ్రైవర్, క్లీనర్ వివరాలు తెలియరాలేదని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడి కోసం ముమ్మర గాలింపు విజయపురం (నగరి): విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన వివాహిత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న సీఐ ఎన్.భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, స్థానికుల నుంచి పొందిన సమాచారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు పలుచోట్ల గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ, వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రేపు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ చిత్తూరు అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. ఇందులో రాజీ చేసుకోదగ్గ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించేలా కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు, బీమా, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల అధికారులు సహకరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 న్యాయస్థానాల్లో ప్రత్యేక అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పార్కింగ్ విషయంలో గొడవ చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనం పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట మసీదు మిట్టకు చెందిన పద్మిని ఈ నెల ఒకటవ తేదీన తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్ద నిలిపింది. వాహనాన్ని తమ ఇంటి ఎందుకు నిలిపారంటూ ఎదురుగా కాపురం ఉన్న కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరి పద్మిని ద్విచక్ర వాహనాన్ని ఎదురింటి వారు ధ్వంసం చేశారు. బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువకునిపై పోక్సో కేసు పలమనేరు: గంగవరం మండలానికి చెందిన ఓ యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ రాంభూపాల్ గురువారం తెలిపారు. మండలంలోని కల్లుపల్లికి చెందిన వినోద్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఓ బాలికకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితునిపై గురువారం పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతనికోసం పోలీసులు వెతుకుతున్నారు. ఉత్తర్వులు ఇవ్వడానికి వెళ్లి.. తవణంపల్లె(ఐరాల): తవణంపల్లె మండలంలోని దిగువ తడకరలో గురువారం చిత్తూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న అమీనా జనార్దన్ (43) మృతి చెందాడు. ఆయన గురువారం కోర్టు ఉత్తర్వులు అందజేసేందుకు తవణంపల్లె మండలం దిగువ తడకరకు చెందిన సుమన్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు తవణంపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలు
చిత్తూరు కార్పొరేషన్: జనాభా, ఆదాయ వనరులు, పరిపాలనా సౌలభ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలోని గ్రామ పంచాయతీలను రూర్బన్, గ్రేడ్– 1, 2, 3గా విభజించారు. ఈ మేర కు పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 621 గ్రామ పంచాయతీలు ఉండగా రూర్బన్ కింద కాణిపాకం, వి.కోట, గంగవరం, కార్వేటినగరం వస్తాయి. 10 వేల జనాభా, రూ.కోటి ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను 04 రూర్బన్ గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే 3 వేల నుంచి 10 వేల లోపు జనాభా, రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం 100 గ్రామ పంచాయతీలను గ్రేడ్–1గా, 2 వేల నుంచి 3 వేల జనాభా ఉన్న 140 గ్రామ పంచాయతీలను గ్రేడ్–2గా, 2 వేల లోపు జనాభా ఉన్న 377 గ్రామ పంచాయతీలను గ్రేడ్–3గా పునర్విభజన చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ క్లస్టర్ల స్థానంలో ప్రభుత్వం తాజాగా రూర్బన్, గ్రేడ్ల వారీగా విభజించింది. ఉద్యోగుల సర్దుబాటు జిల్లాలోని 621 గ్రామ పంచాయతీలకు సంబంధించి పలు పంచాయతీల్లో గ్రేడ్లకు అనుగుణంగా కార్యదర్శులు విధులు నిర్వహించడం లేదు. పరిపాలనా సౌలభ్యం, ఇతర కారణాల వల్ల తక్కువ గ్రేడ్ ఉన్న కార్యదర్శి ఎక్కువ గ్రేడ్ ఉన్న పంచాయతీలో పనిచే స్తున్నారు. ఈ క్రమంలో గ్రేడ్ల వారిగానే కార్యదర్శులు పనిచేయాలని పీఆర్అండ్ఆర్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శులను సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ మొదలైతే పలువురికి స్థానచలనం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూర్బన్ గ్రామ పంచాయతీలకు తప్పనిసరిగా డిప్యూటీ ఎంపీడీఓ లేదా గ్రేడ్–1 కార్యదర్శిని నియమించాలి. -
గువ్వకల్లులో క్షుద్రపూజల కలకలం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం గువ్వకల్లు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి స్థానిక శివాలయానికి ఎదురుగా, నడిరోడ్డుపై బొమ్మను ఉంచి వింత పూజలు చేశారు. గురువారం ఉదయం రోడ్డుపై నిమ్మకాయలు, కోడి బలి ఇచ్చిన ఆనవాళ్లతో పాటు చిన్నపిల్లల చేతి ముద్రలు కనిపించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని గర్భిణులు, చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇది చేతబడా లేక ఆకతాయిల పని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. -
మామిడి రైతులను ముంచేశారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పాలకుల నిర్లక్ష్యం, గుజ్జు పరిశ్రమల దోపిడీ కారణంగా మామిడి పంట కుదేలవుతోందని, మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మామిడి రైతు సంఘం నేతలు మండిపడ్డారు. వారు బుధవారం చిత్తూరు నగరంలోని పీసీఆర్ సర్కిల్లో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు. మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సి.మునీశ్వర్రెడ్డి మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలను పలుమార్లు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ధ్వజమెత్తారు. మాటలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో రైతుకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రభుత్వం తోతాపురి కేజీకి రూ.12 మద్దతు ధర ప్రకటించిందని, అందులో ప్రభుత్వ వాటా రూ.4 రైతుల ఖాతాల్లో పడినా గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులు రూ.8 ఇవ్వకుండా దగా చేశాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం రూ.4 మద్దతు ధర ప్రకటించిందని, కలెక్టర్ ఏకపక్షంగా తోతాపురి మామిడి కేజీ ధరను రూ.7.50లుగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. కనీసం ఆ ఏడున్నర రూపాయలైనా రైతులకు ఇప్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.17.47 మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే జమ చేయాలని డిమాండ్ చేశారు.మామిడి రక్తంతో వ్యాపారుల దోపిడీ మామిడి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ఒక్క ఫ్యాక్టరీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. మామిడి రైతుల రక్తంతో జరుగుతున్న వ్యాపార దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోవడం బాధాకరమన్నారు. ఎన్ని బెదిరింపులు, నిర్బంధాలు ఎదురైనా రైతు సంఘం రైతు పక్షానే పోరాడుతుందని స్పష్టం చేశారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లను నరకలేక, అప్పులు తీర్చలేక రైతులు ఆవేదన చెందుతున్నా పాలకులకు పట్టింపులేకపోవడం దుర్మార్గమన్నారు. మామిడి రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ ‘మామిడి రైతుల సంక్షేమ సంఘం’ పేరుతో కొందరు వ్యాపారవేత్తలు రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. అలాంటి వారితో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపాధ్యక్షుడు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ అధికారులు గుజ్జు పరిశ్రమల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జనార్దన్, రామానాయుడు, వెంకట్రెడ్డి, కొట్రకోన సందీప్, రవిప్రసాద్, హేమలత, మోహన్రెడ్డి, ఉమాపతి రెడ్డి, త్యాగరాజులురెడ్డి, జయదేవయ్య, చంగల్రాయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చచ్చే వరకు కొడతాం’
యాదమరి: మండలంలోని మాధిరెడ్డిపల్లిలో టీడీపీకి చెందిన ఒక యువకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, బ్యానర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బ్యానర్లపై రాసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక బ్యానర్పై ‘మాట్న మరణ అడి’ అని రాసి ఉంది. స్థానిక భాషలో దీని అర్థం ‘దొరికితే చచ్చే వరకు కొడతాం’ అని హెచ్చరించడం. అలాగే మరొక బ్యానర్లో ‘మనల్ని ఎవడురా ఆపేది’ అంటూ రాసి ఉంది. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇలాంటి బెదిరింపు ధోరణి పోస్టర్లు పెట్టడంపై స్థానికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. క్రమశిక్షణ మాటలు ఒట్టివేనా? టీడీపీ క్రమశిక్షణకు మారు పేరని, పార్టీలో ఎవరూ హద్దులు దాటకూడదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం చెబుతుంటారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది నాయకులు, కార్యకర్తల ప్రవర్తన చూస్తుంటే చంద్రబాబు మాటలకు విలువ లేకుండా పోతోందని, అవి ఉత్తిత్తి మాటలేనని తెలుస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. సమాజంలో రెచ్చగొట్టేలా బ్యానర్లు ఏర్పాటు చేసినా, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించిన మరుసటి రోజే ఇలా బ్యానర్లు ఏర్పాటుచేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదాస్పద బ్యానర్లపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అత్యాచారాలపై కమిటీ ఏర్పాటు చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వి.కోటలో బ్రహ్మకుమారీస్ సంస్థ ముసుగులో మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసి సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్కు చెందిన నిరాకర్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజుల కోరారు. ఆమె బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. వి.కోట మండలం ముదరందొడ్డిలో ఉన్న బ్రహ్మకుమారీస్ కేంద్రంలో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రశ్నించిన బ్రహ్మకుమారి శివజ్యోతిని బెదిరిస్తున్నాడని, అతని అరాచకాలు బయటకు రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై శివజ్యోతి వీకోట పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం విచారించలేదని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించాలని, బ్రహ్మకుమారీస్లో జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో సదరు సంస్థ ప్రతినిధులు సువర్ణ, పద్మశ్రీ, నాగలక్ష్మి, రాజేశ్వరి, లీలావతి, సావిత్రి, సోమశేఖర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
విజయపురం (నగరి): విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో బుధవారం వివాహిత నిరోష (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ఇల్లత్తూరుకు చెందిన నిరోషకు తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా మనువూరుకు చెందిన కార్తీక్తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు రితీష్, కుమార్తె వేంబా ఉన్నారు. వారు ప్రస్తుతం 5, 1వ తరగతులు చదువుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా నిరోష మూడేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఇల్లత్తూరులో నివాసం ఉంటోంది. ఆమె తిరువళ్లూరు సమీపంలోని ఎల్ఎస్ఎస్ ఆటోమోటివ్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు నిరోష మేల్కొని ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. నిరోష మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, తిరుపతి నుంచి వచ్చిన ఆర్ఎఫ్ఎస్ఎల్ (రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) నిపుణులు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. పాత హత్య కేసు కోణంలోనూ విచారణ ఈ కేసులో గత కుటుంబ పరిణామాలపై పోలీసులు దృష్టి సారించారు. నిరోషకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త కార్తీక్ 2022లో ఆమెతో ఘర్షణకు దిగాడు. దీనికి నిరోష తల్లి కారణమని భావించి ఆమెను కత్తితో పొడిచి చంపి తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. జైలు నుంచి బెయిల్పై విడుదలైన కార్తీక్ ప్రస్తుతం తమిళనాడులోని తిరువళాంగాడు సమీపంలోని మనువూరు గ్రామంలో ఉంటున్నట్టు సమాచారం. ఈ నెల 5వ తేదీన కాపురానికి రమ్మని నిరోషతో అతను మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. నిరోష మెడపై గాయాలు ఉండడం, పక్కనే హీటర్ వైరు పడివుండడం ఆమెది హత్యే అనడానికి బలాన్ని చేకూరుస్తోంది. నిరోష మృతి సహజమా? లేక హత్యా? అనే కోణాలతో పాటు, గత ఘటనలతో ఏమైనా సంబంధం ఉందా, సన్నిహితులు ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సీఐ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో ఎస్ఐ వెంకటసుబ్బయ్య దర్యాప్తు చేపట్టారు. తండ్రి హత్య కేసులో జైలు, బెయిలు అంటూ కనుమరుగు కావడం, కన్నతల్లి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో చిన్నారులు అనాథలుగా మారారు. -
మావిగన్తో అభివృద్ధి పరుగులు
తిరుపతి మంగళం : మావిగన్ ద్వారా విజయవాడ అమరావతితో పాటు మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని వైస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం తిరుపతిలో మీడియతో మాట్లాడారు. చంద్రబాబు రాజధాని పేరు చెప్పుకుని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రాజధాని పేరు చెప్పి రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ 50 వేల ఎకరా లు సేకరించాలని చూస్తున్నారంటే రియల్ దందా కాక మరేముందని ప్రశ్నించారు. అమరావతి పేరు చెప్పి రూ.వేల కోట్లు అప్పు చేసి, కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులంతా నీళ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. మావిగన్ పేరు చెబితే చంద్రబాబు, ఆయన బినామీల గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. మావిగన్పై తమ పార్టీ సీనియర్ నాయకు ల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం పూర్తిగా నిరాధారమన్నారు. మావిగన్ తీసుకొస్తే తమ పార్టీ నుంచి మారే వాళ్లెవ్వరూ లేరన్నారు. వైఎస్సార్ సీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కుప్పంలో ఓట్లు మారితే చర్యలు సర్ ఓటరు సర్వే చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు బాగానే జరుగుతోందని, కుప్పంలో ఏమైనా ఓట్లు మార్పులు వంటివి ఉంటే వాటిపైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. రావణ్ అనే వ్యక్తి తమ పార్టీకి చెందిన వాడు కాదన్నారు. ఆయన ప్రశ్నించింది పవన్కళ్యాణ్ను అని, ఆయన్ను ఏ విధంగా ఇక్కడి తీసుకొచ్చి మాట్లాడిచ్చారో కూటమి నాయకులు చెప్పాలన్నారు. సాయికృష్ణను లాకప్లో చంపేసి అతని తల్లికి బూడిద కూడా దొరక్కుండా చేయడం రెడ్బుక్ పాలనకు నిదర్శనమన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాసంక్షేమం కోసం చేసిందేమీలేదన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి జనసేన కార్యకర్తలు
బంగారుపాళెం : మండలంలోని కరిడివారిపల్లెకు చెందిన జనసేన కార్యకర్తలు యువాన్, అజిత్, అవినాష్, చంటి, రాహుల్, వినయ్ తదితరులు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికిఆ పార్టీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుండె తరిగేలా..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఓ క్షతగాత్రుడిపై సెక్యూరిటీ గార్డు పాశవికంగా దాడి చేసిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జనవరిలో ఆస్పత్రిలోని ఎంఎస్ వార్డులో చికిత్స పొందుతున్న ఒక రోగిని సెక్యూరిటీ గార్డు దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా చేతులు మడిచి మరీ వికృతంగా ప్రవర్తించాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆ రోగి, తనపై జరుగుతున్న దాడిని తట్టుకోలేక అతికష్టం మీద సెక్యూరిటీ గార్డుపై తిరగబడిన దృశ్యాలు చూసే వారిని కలచివేస్తున్నాయి. బుధవారం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అసలు ఈ ఘోరం బయటపడడానికి సోమవారం రాత్రి జరిగిన మరో ఘటనే కారణం. పెద్ద పంజాణి మండలం చిన్నంపల్లికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరాడు. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రౌండ్స్ పేరుతో వార్డులోకి వచ్చిన అదే సెక్యూరిటీ గార్డు, రోగి సహాయకులను బూటు కాళ్లతో తన్నినట్టు ఆరోపణలు వచ్చాయి. పక్కనే బెడ్పై ఉన్న తమిళనాడుకు చెందిన మరో రోగి ఈ అమానుషాన్ని గమనించి సెక్యూరిటీ గార్డును నిలదీశాడు. రోగులపై బూటు కాళ్లతో దాడి చేస్తారా? అంటూ గొడవకు దిగాడు. ఈ వివాదం కాస్తా ముదరడంతో కొందరు వ్యక్తులు సదరు గార్డు గతంలో చేసిన దాడి తాలూకు వీడియోను బుధవారం బయటపెట్టారు. విధుల నుంచి తొలగింపు.. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. వివాదం ముదరడంతో మంగళవారం ఉదయం సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి అటెండర్లతో సిబ్బంది ఎలా వ్యవహరించాలనే దానిపై కఠినంగా కౌన్సెలింగ్ ఇస్తామని, ఆస్పత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. -
పాతాళానికి జలగండం
కాణిపాకం: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో జిల్లాలోని చెరువులు, బావులు, బోర్లలో నీటి మట్టం వేగంగా తగ్గిపోతోంది. భూ గర్భ జలాలు అడుగంటుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు పండించేందుకు భయపడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నీటి ఎద్దడిని తట్టుకోవడంతోపాటు వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్టడుగుకు నీటి మట్టాలు సాధారణంగా భూగర్భ జలాలు 8 మీటర్ల లోపలే ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నీటి మట్టాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్ల జూలై నెలల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. 2022 జూలైలో 77.90 మి.మీ వర్షపాతం నమోదుకాగా జలమట్టం 7.96 మీటర్లుగా ఉంది. 2023 జూలైలో 62.70 మి.మీ వర్షపాతానికి జలమట్టం 9.51 మీటర్లకు పడిపోయింది. 2024 జూలైలో 90.10 మి.మీ వర్షపాతం నమోదైనా జలమట్టం 12.60 మీటర్ల లోతుకు చేరింది. 2025 జూలైలో 93.40 మి.మీ వర్షపాతానికి 11.04 మీటర్లు ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి 52.70 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో 14.24 మీటర్ల అత్యంత ప్రమాదకర స్థాయికి నీటి మట్టం పడిపోయింది. అన్ని ఏళ్లలోనూ సాధారణ వర్షపాతం 103 మి.మీ (2026 జూన్లో 81 మి.మీ) కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలమట్టం 8 మీటర్ల లోపల ఉండాలి. గత నెలకు నీటి మట్టం ఏకంగా 14.24 మీటర్ల లోతుకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో ఈ స్థాయి మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండిపోయిన 1,834 చెరువులు జిల్లాలో ఇరిగేషన్ శాఖ రికార్డుల ప్రకారం మొత్తం 3,106 చెరువులు ఉన్నాయి. వీటి మొత్తం నీటి సామర్థ్యం 12,982.68 ఎంసీఎఫ్టీలు. ప్రస్తుత నీటి నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నిల్వలతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారమే చెరువుల పరిస్థితి ఇలా ఉంది. పూర్తిగా నిండిన చెరువులు 338 ఉండగా, 75 శాతం నీరు ఉన్నవి 182 చెరువులు, 50 శాతం నీరు ఉన్నవి 292, 25 శాతం నీరు ఉన్నవి 460 చెరువులు. పూర్తిగా ఎండిపోయినవి 183 చెరువులుగా గుర్తించారు. వీటితో పాటు వేల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న చెరువులు, కుంటలు జీవం కోల్పోయాయి. తద్వారా మేతలకు వెళ్లే మూగజీవులకు నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. ఇవీ కరువు కాటకాలకు సంకేతాలిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో కురవని వర్షాలు గొంతు ఎండుతోంది వ్యవసాయానికే కాదు.. జిల్లాలో తాగునీటికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. పంచాయతీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,490 తాగునీటి బోర్లు, 3,863 చేతిపంపులు ఉన్నాయి. వాటిలో 1,250 చేతి పంపులు–బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ఈ క్రమంలో గ్రామాల్లో గొంతు తడుపుకునేందుకు మైళ్ల దూరం నడవాల్సిన దుస్థితి దాపురించింది. ఇక చాలా చోట్ల అద్దె ట్యాంకర్లతో తాగునీటి సరఫరా అవుతోంది. చాలీచాలని నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 24 వేల వ్యవసాయ బోర్లలో నీటి కటకట జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,23,041 వ్యవసాయ ఆధారిత బోర్లు ఉండగా మరో 10 వేలకు పైగా అనధికారిక బోర్లు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి వల్ల ఈ బోర్లలో ఇప్పటికే 20 శాతం (సుమారు 24 వేలకు పైగా) బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన దాదాపు 40 శాతం బోర్లలో నీటి మట్టం అడుగంటుతోందని, ఎప్పుడు ఏ బోరు నీరు రాకుండా ఆగిపోతుందో తెలియడం లేదని రైతులు, రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, తాగునీటి ఎద్దడిని గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలని, ఉచితంగా బోర్ల తవ్వకానికి రాయితీలు, విత్తన సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
అగోడ యాప్.. అడ్డగోలు దోపిడీ!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ వసతి గదుల వ్యవహా రంలో భారీ అక్రమాలు బయటపడ్డాయని వైఎస్సార్సీ పీ నేత,టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి వెల్ల డించారు. ఆయన బుధవారం తిరుపతి వైఎస్సార్సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీటీడీ వసతి గదుల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి సీసీ టీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అగోడ యాప్లో తిరుమల గదుల విక్రయం జరుగుతోంది. టీటీడీ భద్రత, విజిలెన్స్ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకుండాపోయింది. టీటీడీ వసతి గదులకు సంబంధించిన తీవ్రమైన లోపాలు ఉన్నాయి. భద్రతా వ్యవస్థతో పాటు విజిలెన్స్ విభాగం కూడా పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ యాప్లో టీటీడీ గదుల విక్రయం! ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక, హోటల్ బుకింగ్ సేవ లు అందించే అగోడ యాప్లో టీటీడీకి చెందిన వసతి గదులు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. టీటీడీ నిబంధన ల ప్రకారం భక్తులకు కేటాయించాల్సిన గదులు ప్రైవే టు బుకింగ్ వేదికలో ఎలా దర్శనమిస్తున్నాయో ప్రభుత్వం, టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. టీటీడీకి చెందిన ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వికాస్ నిలయం, వకుళమాత అతిథి గృహం వంటి పేర్లతో గదు లు యాప్లో అందుబాటులో ఉన్నట్లు కనిపించాయి. నవనీతమ్మ వ్యవహారం ఏమైంది? ఇటీవల నవనీతమ్మకు సంబంధించిన దర్శన వ్యవహారంపై సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకరరెడ్డి తప్పుబట్టారు. వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో ప్రకటనలు చేశారు. ఆమె పాదయాత్ర చేయలేదని ఏ ఆధారాలతో నిర్ధారించారో ప్రజలకు వెల్లడించాలి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు, టీటీడీ చైర్మన్ చెప్పిన వివరాలకు మధ్య భిన్నత్వం ఉంది. నవనీతమ్మ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను ప్రజల ముందుంచాలి. నకిలీ వెబ్సైట్లపై చర్యలు ఎక్కడ? భక్తులు నకిలీ వెబ్సైట్లు, నకిలీ బుకింగ్ యాప్ల ద్వారా మోసపోతుంటే వాటిని అరికట్టేందుకు టీటీడీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. నవనీతమ్మ అంశంపై చూపిన చొరవను నకిలీ యాప్లు, నకిలీ బుకింగ్ వ్యవస్థల నియంత్రణపై కూడా చూపాలి. మా హయాంలో టీటీడీకి సంబంధించిన 48 నకిలీ వెబ్సైట్లపై ఫిర్యాదులు చేసి వాటిని మూసివేయించాం.. అని భూమన పేర్కొన్నారు. రూ.1,000 గది రూ.18 వేలకా? టీటీడీ నిర్ణయించిన అద్దె ప్రకారం రూ.వెయ్యి నుంచి రూ.1,800 మధ్య ఉండే గదులను ఆన్లైన్లో రూ.14,500, రూ.18,180, రూ.20,700 వరకు విక్రయానికి ఉంచినట్లు కనిపించింది. అధిక ధరలకు గదులు విక్రయించే ప్రయత్నం జరుగుతోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, ‘నో స్మోకింగ్ రూమ్స్’ పేరుతో కూడా కొన్ని గదులు ప్రచారంలో ఉన్నాయి. ఇది టీటీడీ అధికారిక బుకింగ్ విధానానికి ఏమాత్రం సరిపోదు. టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ అక్రమాలు ఆ విభాగాలు ఏం చేస్తున్నాయి? కోట్లాది మంది వినియోగించే యాప్లో టీటీడీ వస తులు కనిపిస్తుంటే, వాటిని గుర్తించడంలో టీటీడీ భద్రతా విభాగం, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫల మైంది. భక్తులను నకిలీ బుకింగ్లు, మోసాల నుంచి కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది. -
ములకలపల్లిలో దోపిడీ
కుప్పం రూరల్ : కుప్పం మండలం ములకలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు ఒక ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి అపహరించారు. స్థానికుల కథనం మేరకు.. ములకలపల్లికి చెందిన రత్నమ్మ పక్కింటి చెల్లమ్మతో కలిసి ఇంట్లో టీవీ చూస్తోంది. ఉన్నట్టుండి ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. రత్నమ్మ, చెల్లమ్మపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న 60 గ్రాముల బంగారం, వెండి గజ్జెలు, చెల్లమ్మ వద్ద ఉన్న మరో 8 గ్రాముల బంగారు గొలుసు దోపిడీ చేసుకుని ఉడాయించారు. మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రైల్వే స్థలం స్వాధీనం చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో రైల్వేశాఖకు చెందిన స్థలాన్ని ఆశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ను ఆనుకుని ఓ పెట్రోలు బంకు ఉంది. అక్కడికి బుధవారం రైల్వే పోలీసులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కట్టడాలను తొలగించారు. పలు వస్తువులను పెట్రోలు బంకు నిర్వాహకులు తీసుకెళ్లగా.. స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పోలీసుల గస్తీ చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ డూడీ ఆదేశాలతో బుధవారం జిల్లాలోని వాణిజ్య సముదాయాలు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ఆలయాలు, బ్యాంకు పరిసరాల్లో కాలినడకన గస్తీ నిర్వహించారు. ఫుట్ పట్రోలింగ్ ద్వారా ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు తెలిపారు. పోలీసులతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వాగ్వాదం చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగడంతోపాటు అతని కాళ్లపై వాహనాన్ని ఎక్కించడానికి ప్రయత్నించిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై కేసు నమోదైంది. చిత్తూరు వన్టౌన్ సీఐ చినపెద్దయ్య కథనం మేరకు.. నగరంలోని సాంబయ్య కండ్రిగ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తూరు మండలం ఎన్ఆర్.పేటకు చెందిన ప్రకాష్ సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ సెలవుపై వచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనం తనిఖీ చేసి రికార్డులు–హెల్మెట్ లేనందుకు రూ.2 వేలు జరిమానా వేశారు. ఈ క్రమంలో ప్రకాష్ అక్కడు భద్రతా సిబ్బందితో వాదనకు దిగాడు. పోలీసుల వాహనాలకు రికార్డులు ఉన్నాయా? మీరు అన్నీ సక్రమంగా ఉంచుకున్నారా? అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగక తన ద్విచక్ర వాహనానంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పురుషోత్తంపై కాళ్లపై ఎక్కించాడు. దీనిపై కానిస్టేబుల్ పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అయ్యోర్ల సర్దుబాటు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని మండలాల్లో ఎంఈవోల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియను ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. మూడు దశల్లో కౌన్సెలింగ్ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బుధవారం అన్ని మండలాల్లో ప్రాథమిక కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగించారు. మండల స్థాయి ప్రక్రియ ముగిసిన అనంతరం మిగిలిన టీచర్లకు డివిజన్ స్థాయిలో డీవైఈవో ఆధ్వర్యంలో సమీక్ష, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తుది విడతగా డీవైఈవో స్థాయిలో మిగిలిన వారికి డీఈవో ఆధ్వర్యంలో సర్దుబాటు ప్రక్రియను చేపడతారు. లీప్ యాప్లోనే డిజిటల్ ఉత్తర్వులు ఈ సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులకు లీప్ యాప్ ద్వారానే అధికారిక సర్దుబాటు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని ఇన్చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో వెంటనే చేరాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 859 మంది అవసరం.. 250 మందితోనే సర్దుబాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల అవసరం భారీగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 859 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు అవసరమని విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో అవసరానికి మించి అదనంగా ఉన్న 250 మంది ఉపాధ్యాయులను కొరత తీవ్రంగా ఉన్న పాఠశాలల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగానైనా సింగిల్ టీచర్ పాఠశాలలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
లారీ బోల్తా పడి ఇద్దరికి తీవ్ర గాయాలు
గుడిపాల: మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో బుధవారం లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్, క్లీనర్కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ రామ్మోహన్ కథనం మేరకు.. లారీ బియ్యం లోడుతో మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు రాష్ట్రం ధర్మపురికి వెళుతోంది. మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో బుధవారం వేలూరు వైపు వెళ్లేందుకు బ్రిడ్జి కింద తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ సచిన్ (33), క్లీనర్ రాజేష్(30) తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మామిడి ర్యాంపులు మూసివేయండి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మామిడి ర్యాంపుల మూసివేతకు కలెక్టర్ ఉత్తర్వులు జారీచేసినట్లు మార్కెటింగ్శాఖ ఏడీ పరమేశ్వరన్ వెల్లడించారు. మంగళవారం ఆయన జిల్లాలోని పలు ర్యాంపులను పరిశీలించి సూచనలు చేశారు. పులిచెర్ల, రొంపిచర్ల, గంగాధరనెల్లూరు, ఎస్ఆర్పురం, పెనుమూ రు, యాదమరి, గుడిపాల, చిత్తూరు మండలాల్లోని అన్ని ర్యాంపులను బుధవారం సాయంత్రానికి పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు రేపు సాయంత్రంలోగా కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి డేటాను సేకరించి, మార్కెట్ కమిటీ కార్యదర్శులకు సమర్పించాలని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం తర్వాత ర్యాంపులకు మామిడి కాయలు తీసుకొస్తే ఎలాంటి సబ్సిడీ వర్తించదని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే బంగారుపాళెం, తవణంపల్లి మండలాల్లోని ర్యాంపులను ఈ నెల 10న మూసివేయనున్నట్లు ఏడీ వెల్లడించారు. నేడు మామిడి రైతుల శాంతియుత నిరసన గంగాధరనెల్లూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో మామిడి రైతుల ఆవేదనను జిల్లా కేంద్రం చిత్తూరులో బుధవారం శాంతియుత నిరసన ద్వారా తెలియజేయనున్నట్టు చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘ నేత కె ఆర్ వెంకటరెడ్డి తెలిపారు. జీడీ నెల్లూరు మండల కేంద్రంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2025, 2026 సంవత్సరాలలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని, మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా నడిబొడ్డున గాంధీ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు మామిడి రైతులందరూ శాంతియుత నిరసనకు విచ్చేయా లని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట గుణశేఖర్రెడ్డి, లక్ష్మీ కరారెడ్డి, రూపకుమార్రెడ్డి, అశోక్ ఉన్నారు. మొగిలిఘాట్లో మదపుటేనుగు హల్చల్ పలమనేరు: పట్టణ సమీపంలోని మొగిలి ఘాట్లో ఒంటరి మదపుటేనుగు మంగళవారం రెండు గంటలపాటు బెంగళూరు– చైన్నై హైవేపై హల్చల్ చేసింది. ఈ ఏననుగు ఒంటరిగా గత కొన్ని నెలలుగా మొగిలి ఘాట్లోనే సంచరిస్తోంది. మొగిలి ఘాట్లో రోడ్డు దాటుతూ ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికుల స్మార్ట్ పోన్లకు చిక్కింది. ఇప్పటికే ముసలిమొడుగు వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన కుంకీ క్యాంపు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడున్న ఆరు ఏనుగుల్లో రెండింటిని రామకుప్పం సమీపంలోని ననియాలకు వెనక్కిపంపారు. క్యాంపులో ఉన్న నాలుగు ఏనుగుల ద్వారా మదపుటేనుగులను పట్టుకోలేక పోతున్నారు. ఇక్కడున్న మదపుటేనుగులను మచ్చికచేసి పట్దుకుంటే దానిని కుంకీగా మార్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకొనేదెప్పుడు, కుంకీగా మార్చేదెప్పుడో అర్థం కావడం లేదు. దీనిపై పలమనేరు ఎఫ్ఆర్వో చాంప్లానాయక్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు, వారి సిబ్బంది సైతం ఫోన్లు పిక్ చేయడం లేదు. దరఖాస్తులకు నేడే ఆఖరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్కూల్ గేమ్స్ సెక్రటరీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగానే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ – ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అండర్–19 విభాగానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అలాగే ఏపీఎస్డబ్ల్యూఆర్, ఏపీఆర్ఈఐఎస్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లకు (ఫిజికల్ ఎడ్యుకేషన్) ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరన్నారు. అమరావతిలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికయ్యే జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ పదవీకాలం ఒక సంవత్సరం (2026–27 విద్యా సంవత్సరం) మాత్రమే ఉంటుందన్నారు. -
గేటు బయటే.. ఆశలు ఆవిరి
కాణిపాకం: జిల్లాలో మామిడి సాగు తీవ్ర నష్టాలను మిగుల్చుతోంది. ఈ ఏడాది సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు చేయగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో తోతాపురి రకమే సాగైంది. అధికారులు ఈ ఏడాది జిల్లాలో 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ పల్ప్ ఫ్యాక్టరీల మాయాజాలం, అధికారుల ఉదాసీనత వల్ల సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు ఫ్యాక్టరీల గేట్ల ముందు, తోటల్లో కుళ్లిపోయినట్టు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. టోకెన్ల మాయాజాలం మామిడి కాయలు కోసి ఫ్యాక్టరీకి తీసుకొస్తే.. లోపలికి పోనివ్వకుండా వారం రోజుల పాటు టోకెన్ల పేరుతో, రంగుల పేరుతో రైతును నడిరోడ్డుపై పడిగాపులు కాయించారు. పగలు ఎండకు ఎండి, రాత్రిళ్లలో దోమ బాధకు గురవుతూ రోడ్డు పక్కనే పడుకుని రైతులు పడరానిపాట్లు పడ్డారు. వారం రోజుల పాటు లారీలు, ట్రాక్టర్ల బేసిన్లలోనే మామిడికాయలు మగ్గిపోయాయి. చివరకు గేట్ల వద్దకు రాగానే నాణ్యత లేదు.. కుళ్లిపోయాయని ఫ్యాక్టరీల యాజమాన్యాలు తిరస్కరించాయి. రూ.295 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా? రైతు సంఘాల నాయకులు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత చెప్తున్న లెక్కలు వింటే గుండె తరుక్కుపోతోంది. ఫ్యాక్టరీల నిర్వాహకులు, దళారులు ఆడిన నాటకం వల్లే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు వృథా అయ్యాయి. రైతులకు జరిగిన నికర పెట్టుబడి నష్టం అక్షరాలా రూ.295 కోట్లు. మామిడి రైతులపై కక్ష? జిల్లాలోని 35 ఫ్యాక్టరీలు, 52 ర్యాంపుల ద్వారా 2,72,769 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఈ కొనుగోళ్ల వెనుక పెద్ద స్కామే నడిచింది. ఇందులో మన జిల్లా రైతుల పంట కంటే పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చిన కాయలే ఎక్కువగా ఉన్నాయి!. సుమారు 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నారు. స్థానిక రైతుల కాయలను వారం రోజుల పాటు రోడ్లపై కుళ్లబెట్టిన అధికారులు.. తమిళనాడు నుంచి వచ్చిన లారీలను క్యూలైన్లు లేకుండా ఫ్యాక్టరీల లోపలికి ఎలా పోనిచ్చారని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారుల, ఫ్యాక్టరీల ముందస్తు ‘సిండికేట్’ దందా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం ప్రకటించాలని, రైతులను వంచించిన ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఐరాల మండలంలో మేకలకు మేతగా మారిన మామిడి కాయలు (ఫైల్) నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఫ్యాక్టరీలకు జిల్లా కాయలతో పాటు తమిళనాడు కాయలు లారీల్లో వచ్చాయి. వీటిని ఎందుకు అధికారులు అడ్డుకోలేకపోయారు. ఈ సారి జిల్లాలో పండిన పంటను కుళ్లబెట్టింది కాకుండా..ఫ్యాక్టరీ లోపలికి తీసుకెళితే అక్కడ సగానికి సగం కాయలు తిరస్కరించారు. ఈ రకంగా చేస్తే రైతులు ఎలా బాగుపడుతారు. మా అంచనా ప్రకారం సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల కాయలు రోడ్డు పాలైంది. వీటన్నింటికీ ఫ్యాక్టరీల సిండికేట్ ప్రధాన కారణం. ఇందుకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. –మునీశ్వర్రెడ్డి, మామిడి రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు పల్ప్ ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతుల పడిగాపులు రైతు సంఘాల లెక్కల ప్రకారం నష్టాల వివరాలు -
పకడ్బందీగా ‘సర్’
ఐరాల: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పొ లకలలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమారేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ 2002 ఓటర్ల లిస్ట్లో తమ తల్లి, తండ్రి పేరు సీరియల్ నంబర్ తెలుసుకోవాలన్నారు. తెలుసుకోని పక్షంలో మీరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు. 2002 సర్ ఓటరు లిస్ట్లో పేరు ఉండి, అదేవిధంగా 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు కూడా సెల్ప్ మ్యాపింగ్ చేయించుకుంటే మంచిదన్నారు. అలాంటివారు బీఎల్ఓలు వద్ద కు వెళ్లి సెల్ప్ మ్యాపింగ్ అని చెప్పాలన్నారు. 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు కూడా సెల్ప్ మ్యాపింగ్ చేయించుకోవాలని తెలిపారు. 2002లో ఓటు హక్కు, వయసు, పేరు లేకపోయినా 2025 ఓటర లిస్టులో పేరున్నవారికి మ్యాపింగ్ వర్తిస్తుందన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
ఫోన్ చేస్తే ఇంటికే బీఎల్వో
– ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు మీ ఇంటికి రాలేదా?. ఎన్యూమరేషన్ పత్రాలు నింపడంలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా?. సందేహాల నివృత్తికి సచివాలయాల చుట్టూ తిరిగినా బీఎల్వోలు అందుబాటులో లేరా? అయితే మీకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫోన్ చేస్తే చాలు సిబ్బందే నేరుగా మీ వద్దకు వచ్చేలా ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవలు ఇలా.. ఓటర్లు ముందుగా ప్లేస్టోర్ నుంచి ‘ఈసీఐఎన్ఈటీ’ (ఈసీఐనెట్) యాప్ను డౌన్్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్లో ఓటరు రిజిస్ట్రేషన్ ఫారమ్స్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఎస్ఆర్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్, సబ్మిట్ ఎ కంప్లైంట్, ట్రాక్ యువర్ అప్లికేషన్ వంటి పలు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. యాప్లో ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ’ పై నొక్కగానే ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య అడుగుతుంది. ఒకవేళ గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే.. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, పోలింగ్ బూత్ వివరాలు నమోదు చేయగానే బీఎల్వో పేరు, ఇతర వివరాలు స్క్రీనన్్ పై వస్తాయి. అందులో మళ్లీ ఓటరు పేరు, రిజిస్టర్డ్ ఫోన్ నంబరు ఇవ్వాలి. ఆ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే..48 గంటల్లోగా బీఎల్వో నేరుగా మిమ్మల్ని సంప్రదించి, మీ సందేహాలను నివృత్తి చేస్తారు. -
ప్రకృతి సేద్యం పరిశీలన
శాంతిపురం: సహజ సిద్ధ పద్ధతులతో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ పొలాలను అమెరికాలోని ప్రెస్టిషియన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం పరిశీలించింది. మంగళవారం శాంతిపురం మండలంలోని ఎంకేపురం, రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి, పెద్దగానూరు వద్ద వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతు సాధికార సంస్థ, ఏపీ సీఎన్ఎఫ్ల సహకారంతో సాగులోని ఈ తోటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గో ఆధారిత వ్యవసాయ విధానాలు, ఘన, ద్రవ జీవామృత తయారీలపై ఆరా తీశారు. ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులకు ప్రకృతి సేద్యమే మేలని వారు చెప్పారు. భవిష్యత్తులో రసాయన రహిత వ్యవసాయ దిగుబడులకు మాత్ర మే ఆదరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలలో డీపీఎం అమృతవల్లి, నోడల్ అధికారి బాజీబాబు, ఏఎంసీ చేర్మెన్ రాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
110 విద్యుత్ సమస్యల గుర్తింపు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం నిర్వహించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో 110 విద్యుత్ సమస్యలను సిబ్బంది గుర్తించారు. అందులో 80 సమస్య లు పరిష్కారించిన ట్టు వారు వెల్లడించారు. మాతాశిశు మరణాలపై సమీక్ష చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇటీవల జరిగిన మూడు మాతృ మరణాలు, ఐదు శిశు మరణాలపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి మాట్లాడుతూ.. గర్భస్థ సమయం నుంచే రెగ్యులర్ చెకప్లు, పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనతను నివారించి, మాతా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. మూఢనమ్మకాలు, ముహూర్తాల కోసం ప్రసవాలు చేయడం సరికాదన్నారు. ప్రతి హైరిస్క్ గర్భిణీని సకాలంలో గుర్తించి, సీ్త్ర వ్యాధి నిపుణులతో తనిఖీలు చేయించడంతో పాటు పర్యవేక్షణ సిబ్బందితో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి, వైద్యులు, ఏఎనన్ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు చిత్తూరు అర్బన్: సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్, కామెంట్, షేర్కు సంబంధించి డిజిటల్ ఆధారాలు శాశ్వతంగా నమోదవుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారి పై రాజీలేకుండా చర్యలు తీసుకుంటామని తెలి పారు. ఈ ఏడాది జిల్లాలో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన 10 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫేక్ అకౌంట్లు, తప్పుడు ప్రచారానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. -
ఫోన్ చేస్తే ఇంటికే బీఎల్వో
ఓటర్ల సవరణలో ఎదురవుతున్న సమస్యలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. బీఎల్వో ఇంటికి వచ్చేవిధంగా చర్యలు చేపట్టింది. పశువైద్యం..బహుదూరం! జిల్లాలో పశువైద్యం అటకెక్కింది. వైద్యశాలల్లో మందుల కొరత కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు.బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026రాజువయ్యా..గాలేరు–నగరి కాలువ మా రాజువయ్యా! చిత్తూరుతో వైఎస్సార్కు విడదీయరాని బంధం చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరుతో దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని పరవళ్లు తొక్కించిన ఆ మహామనిషి రూపం ఇంకా మదిలో మొదలాడుతూనే ఉంది. ఎందరో పేదలకు ప్రాణభిక్ష పెట్టిన ఆ పరబ్రహ్మని గుర్తుకు తెస్తూనే ఉంటుంది. ఉచిత విద్యుత్తో రైతు వెన్నుతట్టి ప్రోత్సహించిన రైతు బాంధవుడిని కర్షక లోకం స్మరిస్తూనే ఉంటుంది. ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చిత్తూరులోని అనుప్పల్లెలో ఏర్పాటు చేసిన రచ్చబండకు వస్తూ 2009 సెప్టెంబర్ 2న అనంతలోకాలకు వేగిన ఆ మహానీయుడి ని జ్ఞప్తికి తెస్తూనే ఉంటుంది. బుధవా రం ఆయన 77వ జయంతి సందర్భంగా జిల్లాకు చేసిన అభివృద్ధిని స్థానికులు మరోసారి మననం చేసుకుంటున్నారు. గాలేరు..నగరి గాలేరు..నగరి సుజల స్రవంతి పథకానికి 2005లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా జిల్లాలోని 1,03,500 ఎకరా లకు సాగునీటి తో పాటు, దాహార్తి తీర్చడానికి రూపకల్పన చేశా రు. మల్లెమడుగు డ్యామ్, బాలాజీ రిజర్వాయర్, పద్మసాగర్, శ్రీనివాససాగర్, వేణుగోపాలసాగర్లను కృష్ణా జలాలతో నింపేలా చర్యలు చేపట్టారు. రూ.14 కోట్లతో ఈటీపీ ప్లాంట్ చేనేత పరిశ్రమలో నూలుకు రంగువేసే ప్రక్రియలో భాగంగా వినియోగించే రసాయనాల కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతుండేవి. నాటి సీఎం వైఎస్సార్ రసాయన నీటిని శుభ్రపరిచే కామన్ ఈటీపీ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడమేగాక రూ.14 కోట్లు మంజూరు చేశారు. వంద పడకల ఆస్పత్రి నగరికి రూ.15 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరైంది. ఈ ఆస్పత్రి వైఎస్సార్ మరణానంతరం 60 పడకలకే పరిమితమైంది. గత పాలనలో ఆస్పత్రి అభివృద్ధికి నాడు–నేడు పథకంలో రూ.5 కోట్లు మంజూరు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తన చారిటబుల్ ట్రస్టుద్వారా అదనపు పడకలు, వైద్య సామగ్రి, కుర్చీలు అందజేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నగరి తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడానికి మున్సిపల్ పరిధి సత్రవాడ శివారుల్లో రూ.36 కోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. గాలేరు–నగరిని ట్యాంకుకు అనుసంధానం చేశారు. చిత్తూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్లొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్సార్ ఇక్కడికి చేరుకోకనే దివికేగారు. ఆ రోజు ఉదయం 10.45 గంటలకు అన్పుపల్లె చేరుకోవాల్సి ఉంది. కానీ మార్గ మధ్యంలో 2009 సెప్టెంబర్ 2న హెలిఫ్టర్ ప్రమాదంలో తనువు చాలించారు. కారణ జన్ముడు వైఎస్సార్ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంచిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు ఈ నెల 15లోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. పదేళ్ల సర్వీస్ ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు సమానమైన కేటగిరి ఉన్న వారు అర్హులన్నారు. ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలను రెండు కాపీలను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు అందజేయాలని, గడువు తర్వాత వాటిని స్వీకరించరని స్పష్టంచేశారు. తెలుగు దనానికి కొత్త వెలుగువు నువ్వు నవ శకానికి నిండైన రూపం నువ్వు నిరుపేదల ఆపన్న హస్తం నువ్వు అభాగ్యులకు ఆయువు పోసిన ఆరోగ్య బాంధవుడివి నువ్వు అక్కచెల్లెమ్మలకు పెద్దన్నవు నువ్వు అవ్వాతాతల గుండె చప్పుడు నువ్వు యువతరానికి కొత్త ఒరవడినిచ్చిన మహరాజువు నువ్వు కర్షక లోకానికి ఆత్మబంధువు నువ్వు పచ్చని పైరుపై చివురులు తొడిగిన చిరునవ్వువి నువ్వు కరువు నేలపై గలగలపారే జలప్రదాతవి నువ్వు తన మన తేడా తెలియని మనసున్న మారాజువి నువ్వు రాజశేఖరుడువి నువ్వు..ఎన్నటికీ చెరగదు నీ చిరునవ్వు జోహార్ వైఎస్సార్..రాజన్నా..నిన్ను మరువలేమన్నా!! చిత్తూరు జిల్లాలో ‘రాజ’న్న ముద్ర! -
పశువైద్యం.. బహుదూరం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పల్లెల్లో పశువైద్యం పడకేసింది. మూగజీవాల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. అధికార యంత్రాంగం కాగితాలపై చెప్తున్న మాటలకు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దారుణాలకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. నమ్ముకున్న జీవాలు కళ్ల ముందే కానరాని లోకాలకు పోతుంటే.. పాడిరైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గాడి తప్పిన పశువైద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమకు ప్రాణం పోసింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి పాడికి అండగా నిలించింది. గ్రామాల్లో పశువులకు తక్షణ వైద్య సేవలకుగాను పశువైద్య సహాయకులను నియమించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశువైద్యం పూర్తిగా గాడితప్పింది. పలు చోట్ల సహాయకులు వారి విధులను గాలికొదిలేస్తున్నారు. పశుగ్రాస క్షేత్రాలు, పాడి రైతుల ఇళ్ల వద్ద ఉండాల్సిన వీరు.. కేవలం కేంద్రాలకే పరిమితమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు ఫోన్ చేసినా స్పందించే నాథుడే కరువయ్యాడు. ఇక మండల కేంద్రాల్లోని పశు వైద్యశాలల పరిస్థితి మరీ ఘోరం. ఉదయం కాసేపు తెరుచుకునే ఈ ఆస్పత్రులు.. మధ్యాహ్నానికల్లా మూతపడుతున్నాయి. ఆ తర్వాత వైద్యులు, సిబ్బంది డుమ్మా కొడుతున్నారు. ప్రయివేటుగా కొనాల్సిందే మండల పశువైద్యశాలలకు, రైతు భరోసా కేంద్రాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న విలువైన మందులు, మాత్రలు అర్హులైన రైతులకు చేరడం లేదు. కొందరు మండల వైద్యులు, తమ కింద పనిచేసే సహాయకులతో చేతులు కలిపి ఆ మందులను ప్రైవేటుపరం చేస్తున్నారు. జిల్లా పశు ఆస్పత్రికి వస్తే.. మందులు లేవు.. బయట కొనుక్కోండి అంటూ ప్రిస్క్రిప్షన్లు చేతిలో పెడుతున్నారు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్ ఇంజెక్షన్లు, చివరకు ప్రసవానంతరం ఆవులు పడిపోకుండా ఇచ్చే కాల్షియం, ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ప్రభుత్వ కేంద్రాల్లో దొరకడం లేదు. అంతా ప్రైవేటుగా కొనాల్సి రావడంతో పాడి రైతుల జేబులకు చిల్లులు పడుతోంది. గాల్లో ప్రాణాలు జిల్లాలో ప్రభుత్వ పశు వైద్యం అపహాస్యం అవుతోంది. ఇదే అదునుగా అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. కనీస అర్హత లేని నకిలీ వైద్యులు పల్లెల్లో ఇష్టారాజ్యంగా ఇంజెక్షన్లు ఇస్తూ రైతులను దోచుకుంటున్నారు. తప్పుడు వైద్యం వల్ల తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, గాలికుంటు వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులు ముదిరి.. లక్షల రూపాయల విలువైన పాడి ఆవులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు మేల్కొని, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి, మందుల కొరత తీర్చాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా సమాచారం జిల్లా పశువుల ఆస్పత్రి 01 ఏరియా పశు వైద్యశాలలు 14 వెటర్నరీ డిస్పెన్సరీలు 68 రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లు 75 రైతు భరోసా కేంద్రాలు 297 పాడి ఆవులు 4,67,507 గేదెలు 1,036 కుక్కలు, కోళ్లు 5,08,808 మేకలు 13,80,063 గొర్రెలు 4,38,362 మూడు రోజులకు రూ.5వేల వరకు ఖర్చు గతనెల ఒక పాడి ఆవు చనిపోయింది. ఆ ఆవు విలువ రూ.85 వేలు. ఇంకో ఆవు మేత తినడం లేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద చూపిస్తే.. వాళ్లు చేసే వైద్యం వల్ల ఆవులు చనిపోతున్నాయి. ఇష్టానుసారంగా మందులు ఇచ్చేస్తున్నారు. అందుకని చిత్తూరు నగరంలోని జిల్లా పశువైద్య ఆస్పత్రికి వచ్చాను. ఇక్కడ చూస్తే మందులు లేవు. మూడు రోజుల పాటు రెండు బాటిళ్ల గ్లూకోజ్ రాసిచ్చారు. ఒక్కొ బాటిల్ ధర రూ.480. ఇలా మూడు రోజుల పాటు ఆరు బాటిళ్లు రాసిచ్చారు. దీనికి తోడు ఇతరాత్ర మందులు, మాత్రలు కలిపి రూ.5వేల వరకు ఖర్చు అయింది. – మురళి, యాదమరి మండలం -
మాకొద్దు ఈ రౌడీ ఎమ్మెల్యే! శాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులు
● ఎస్పీ కార్యాలయం గేట్లు మూసివేత.. రోడ్డుపై బైఠాయింపు ● ప్లకార్డులు లాక్కుని, చొక్కాలు చించి, ఈడ్చుకెళ్లిన పోలీసులు ● ప్రజాస్వామ్య హక్కులు కాలరాశారని మోహిత్రెడ్డి ధ్వజం ఎస్పీ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైఠాయించిన చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు‘చంద్రగిరిలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నా కనిపించవు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి బూతు మాటలు.. రోత పనులతో సీ్త్రలను కించపరుస్తున్నా వినిపించవు. అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడానికి మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే తప్పయిపోయిందా..?. ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సబబు..?. గేట్లు వేసి బయటకు తోసేయడం, చొక్కాలు చించేయడం, కార్యకర్తలను బూటుకాళ్లతో తన్నడం .. ఇదెక్కడి సంస్కృతి?..’ అంటూ వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్రెడ్డి ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ‘సేవ్ చంద్రగిరి..ఫ్రం పులివర్తి నాని’ పేరుతో సోమవారం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. సాక్షి టాస్క్ఫోర్స్:చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చెవిరెడ్డి మోహిత్రెడ్డి చేపట్టిన ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం చేపట్టిన ‘సేవ్ చంద్రగిరి.. ఫ్రం.. పులివర్తి నాని’ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి శాంతియుతంగా బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను అదిగమించిన కార్యకర్తలు, నాయకులు ఎట్టకేలకు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల చేతుల్లోని ప్లకార్డులను లాక్కోవడం, నేతల చొక్కాలు చించి వేయడం, కాళ్లతో తన్నుతూ దురుసుగా వ్యవహరించడంతో నాయకులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రగిరిని కాపాడుకుంటాం ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ప్రశ్నించే వారిపై దాడుల నుంచి చంద్రగిరిని, ప్రజలను కాపాడుకుంటామని చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఎస్పీని కలవడానికి కూడా అనుమతించకుండా గేట్లు మూసివేయడంతో రోడ్డుపై బైఠాయించిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి బూతు మాటలు.. రోత పనులతో చంద్రగిరికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, కీర్తిని దిగజార్చుతున్నారని, చిత్తూరు రౌడీ సంస్కృతి తెచ్చిపెట్టారని, ఆ రౌడీ మూకల నుంచి అమాయక ప్రజలను కాపాడుకుంటామన్నారు. డీఎస్పీ, అదనపు ఎస్పీ అత్యుత్సాహం మోహిత్రెడ్డి ర్యాలీ ప్రారంభం నుంచే అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై విరచుకుపడ్డారు. ఎస్పీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి పార్టీ క్యాడర్ను అదుపు చేశారు. ఆ వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి రోప్లు వేసి బలవంతంగా వెనక్కునెట్టి కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు గంటల పాటు తోపులాట చోటుచేసుకుంది. చివరకు చెవిరెడ్డి మోహిత్రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పలువురిపై కేసు తిరుపతి క్రైం : జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఘటనలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డితో పాటు పలువురిపై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆలోచింపజేసిన ప్లకార్డులు ఎమ్మెల్యే పులివర్తి నాని తీరును నిరసిస్తూ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ తరఫున ముద్రించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘సేవ్ చంద్రగిరి.. ఫ్రం.. పులివర్తి నాని.. మాకొద్దు.. మాకొద్దు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో.. అరాచక సంస్కృతా..? బూతు మాటలు.. రోత పనులతో ఎమ్మెల్యే నాని అరాచకం.. కాపాడుతాం.. కాపాడుతాం..’ అంటూ ముద్రించిన ప్లకార్డులు అందరినీ ఆలోచింపజేశాయి. మీవేనా కుటుంబాలు.. మావి కావా? బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు తమ వద్ద లేరని, కుటుంబాల జోలికి వస్తే సహించమని సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ బహిరంగ సభలో ఊదరగొడతారని మోహిత్రెడ్డి చెప్పారు. ‘మీవేనా కుటుంబాలు.. మావి కావా..?’. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పులివర్తి నాని మా కుటుంబంలోని మహిళలను గలీజు మాటలతో బాధపెడితే మీకు తప్పు అనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. బూతు మాటలతో ఒక రిటైర్డ్ జడ్జిని, వారి కుటుంబాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే నానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
పెద్దపంజాణి: మండలంలోని అమ్మరాజుపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద సోమవారం విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. అమ్మరాజుపల్లికి చెందిన హరినాథరెడ్డి భార్య పాడి ఆవును మేతకోసం వ్యవసాయ పొలం వద్దకు తోలుకుని వెళ్లింది. అక్కడ దాన్ని వదిలిపెట్టింది. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తెగి ఆవుమీద పడడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవు విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని హరినాథరెడ్డి కోరాడు. కారు ఢీకొని వ్యక్తి మృతి యాదమరి : మండలంలోని బెంగళూరు– చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు ఢీకొనడంతో పాదచారి మృతి చెందాడు. ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు... గాండ్లకొత్తూరుకు చెందిన శరవణ(48) ఆదివారం రాత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోవడానికి రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి చిత్తూరు వైపుగా వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శరవణకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండే గ్రామస్తులు రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా వస్తున్న వాహనాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. రేపటి నుంచి ఈసెట్ వెబ్ఆప్షన్ల ప్రక్రియ తిరుపతి సిటీ: యూజీ ఇంజినీరింగ్ కోర్సులలో నేరుగా సెకండ్ ఇయర్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్–2026 పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ వరకు చివరి గుడువు కాగా 14న అప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 20న సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించి 21 నుంచి 25వ తేదీ లోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు జిల్లా నుంచి 1,463 మంది హాజరుకాగా 1,355 మంది అర్హత సాధించారు. బంగారు గొలుసు చోరీ తిరుపతి క్రైం: మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం రాత్రి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మునిరెడ్డినగర్లోని పీఎన్న్ ఆర్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పార్వతి అనే మహిళ సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె మెడలో ఉన్న సుమారు 36 గ్రాముల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. క్రైమ్ డీఎస్పీ శ్యాంసుందర్ ఘటనా స్థలికి చేరుకుని పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించారు. బాధితురాలు పార్వతి ఫిర్యాదు మేరకు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోగుల కుటుంబంపై పీడీ యాక్ట్ తిరుమల: తిరుమలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ భక్తులు, స్థానిక వ్యాపారులు, విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న గోగుల కుటుంబ సభ్యులపై తిరుపతి జిల్లా పోలీసులు సోమవారం పీడీ యాక్ట్ను ప్రయోగించారు. పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవడంతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ మేరకు గోగుల కోటయ్య అలియాస్ కోటి (22), గోగుల శ్రీనివాసులు అలియాస్ శ్రీను (20)ను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుని శ్రీకాళహస్తి సబ్ జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మరో ప్రధాన నిందితుడు గోగుల శ్రీకాంత్ (25) పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. కుటుంబ పెద్ద గోగుల నాగేష్ (44)తో కలిసి వీరు కొంతకాలంగా తిరుమలలో వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
రుయాలో అరుదైన చికిత్స
తిరుపతి తుడా: రుయా ఆస్పత్రి వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, అధునాతన వైద్య సాంకేతికత సహాయంతో 15 నెలల చిన్నారికి శస్త్రచికిత్స లేకుండా అత్యాధునిక వైద్యం అందించారు. గంగాధరనెల్లూరుకు చెందిన 15 నెలల తాబిష్అలీ తీవ్రమైన కడుపునొప్పి, కడుపు వాపు, విరోచనాలలో రక్తం పడడంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఏబీ జగదీష్ బాలుడి పరిస్థితిని పరిశీలించారు. ‘ఇంటసస్సెప్షన్’ (ఒక పేగు మరొక పేగులోకి దూరిపోయే ప్రమాదకరమైన సమస్య) అని గుర్తించారు. సాధారణంగా దీనికి కోతతో కూడిన ఓపెన్ సర్జరీ అవసరమైనప్పటికీ డాక్టర్ జగదీష్ సీఆర్మ్ ఇమేజింగ్ సాంకేతికత సహాయంతో కోత లేకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా ఆ చిన్నారి పేగు సమస్యను వైద్య బృందం విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రక్రియలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పద్మజ, డాక్టర్ మైథిలి, డాక్టర్ మధుసూదన్, పిడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ కిరీటి సహకారాన్ని అందించారు. ఎర్రచందనం నిందితుడిపై పీడీ యాక్ట్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన నాసర్ కెఎన్ ఎలియాస్ నాసర్ భాయ్ (53)పై టాస్క్ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ జె.కులశేఖర్ మార్గ నిర్దేశకత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే నాసర్ కెఎన్ ఎలియాస్ నాసర్ భాయ్ తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతనిపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ఫోర్స్ సిఫారసు చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్ ఎస్.వెంకటేశ్వర్ పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. చాఫ్ కట్టర్ల కొనుగోలుకు ఈ–టెండర్లు తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎస్వీ గోసంరక్షణశాల డెయిరీ ఫామ్ అవసరాల కోసం రెండు చాఫ్ కట్టర్ల కొనుగోలుకు ఈ–టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆసక్తి కలిగిన సంస్థలు, సరఫరాదారులు హెచ్టీపీపీఎస్://టెండర్.ఏపీఎంపొక్క్యూర్మెంట్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి కరెంట్ టెండర్స్ విభాగంలో ఎస్వీ గోసంరక్షణశాల డెయిరీ ఫామ్ను సర్కిల్/డివిజన్గా ఎంపిక చేసి టెండర్ పత్రాలను డౌన్్ లోడ్ చేసుకోవచ్చు. టెండర్ పత్రాలను ఈ నెల 21 సాయంత్రం 5.05 గంటల లోపు సమర్పించాలని పేర్కొంది. వివరాల కోసం 9281413626లో సంప్రదించాలని సూచించింది. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,412 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,273 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.05 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటల సమయం పడుతోంది. -
రైతుకు గుండు సున్నానేనా?
కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 2025 వరకు అనుమతి పొందిన మామిడి ర్యాంపులు 25. గత సీజన్లో రూ.కోట్లను స్వాహా చేసిన అక్రమార్కులు ఈ ఏడాది ఆ సంఖ్యను ఏకంగా 52కు (రిజిస్టర్డ్) పెంచేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని మరో 20కి పైగా అక్రమ ర్యాంపులు నడుస్తున్నాయి. ఈ పెరుగుదల వెనుక ఉన్న మతలబు ఏమిటనేది బహిరంగ రహస్యం. ఈ ర్యాంపుల్లో అత్యధికంగా అధికార కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలవి కావడంతో క్షేత్రస్థాయి అధికారులు సైతం చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సీజన్లో బంగారుపాళ్యం, పలమనేరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పలు ర్యాంపుల నిర్వాహకులు రైతులకు అందాల్సిన రూ.4లను స్వాహా చేశారు. తక్కువ రకానికి చెందిన నీలం కాయలను కాగితాల్లో తోతాపురిగా మార్చేసి సబ్సిడీని నొక్కేశారు. ఈసారి ఆ దొంగ లెక్కలు చూసి ఉద్యాన శాఖ అధికారులకే మైండ్ బ్లాక్ అవుతోంది. ఏకంగా 10 వేల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల కాయలను ఫ్యాక్టరీలకు తరలించామంటూ కొందరు పెద్దమనుషులు దొంగ బిల్లులను ఆఫీసుల ముందు పడేశారు. వీళ్లు చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయి దిగుబడికి పొంతన కుదరకపోవడంతో అధికారులు అసలు గుట్టును ఛేదించే పనిలో పడ్డారు. జిల్లాలోని ర్యాంపుల ద్వారా సేకరించిన కాయలు నిజంగానే చిత్తూరులోని ఫ్యాక్టరీలకు వెళ్లాయా? లేక దొంగచాటుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఫ్యాక్టరీలకు తరలించి.. ఇక్కడ నిధి కోసం నకిలీ క్లెయిమ్లు సృష్టిస్తున్నారా? అని విచారిస్తున్నారు. లేకుంటే పక్కనే ఉన్న తమిళనాడు నుంచి తక్కువ ధరకు కాయలు తెచ్చి ఇక్కడి లెక్కల్లో తోసేసి సబ్సిడీ నొక్కుతున్నారా? అనే కోణంలో పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. మామిడికి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 ప్రోత్సాహక నిధి కూటమి నేతలకు అక్షయపాత్రగా మారింది. గతేడాది ప్రభుత్వ ఖజానాను నిలువునా ముంచేసిన మామిడి మాఫియా ఈ ఏడాది కూడా కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఈ సారి ఉద్యానవన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పచ్చముఠా మాయాజాలానికి చెక్ పెట్టాలని, నకిలీ బిల్లుల దందాకు అడ్డుకట్టవేయాలని చూస్తున్నారు. అనుమతి లేని అనధికారిక ర్యాంపులు, ట్రేడర్ల ద్వారా కాయలు తోలి ఉంటే ఈ సారి ప్రోత్సాహక నిధి వర్తించదని తేల్చి చెబుతున్నారు. -
అంగన్వాడీల పోరుబాట
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహార పర్యవేక్షణ చేయాల్సిన అంగన్వాడీ కేంద్రాలు యాప్ల నిర్వహణ నిలయాలుగా మారాయని అంగన్వాడీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు సంయుక్తం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్వాడీలు చేవిలో పూలు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ 2011 నుంచి అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెరగలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాల పోషణ కష్టంగా మారిందన్నారు. నవచేతన యాప్ భారం ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పనులను కూడా అంగన్వాడీల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. నవచేతన యాప్లో ఒక బిడ్డ వివరాల నమోదుకు 20 నిమిషాలు పడుతోందని, పోషణ్ ట్రాకర్లో ఎఫ్ఆర్ఎస్ వేయాలని, బాల సంజీవిని యాప్లో 25 రోజుల టేక్ హోమ్ రేషన్ వివరాలు పొందుపరచాల్సి వస్తోందని తెలిపారు. వీటికితోడు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులకు ప్రీ–స్కూల్ నిర్వహించడం అసాధ్యంగా మారిందన్నారు. ప్రగతిశీల అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ పీపీపీ సర్వేల పేరుతో అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సహకరించడం లేదన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పని ఒత్తిడి, అధికారుల వేధింపులతో అంగన్వాడీలు, హెల్పర్లు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. 50 ఏళ్లుగా ఐసీడీఎస్లో పనిచేస్తున్నా ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, దాసరి చంద్ర, రఘు, గోవింద్, స్వామి, మోహన్ పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరపున ప్రభావతి, అరుణ, సరస్వతి, శాంతి, జ్యోతి, సుజాత, రాధ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
నేత్తురోడుతున్న జాతీయ రహదారి
ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఇవే.. నేషనల్ హైవే రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఒక పక్క వాహనదారుల అతి వేగానికి తమకు తామే బలవుతుంటే అడ్డొచ్చిన వేరొకరి ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వేలాదిగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. శరీర అవయవాలు దెబ్బతిని వికలాంగులుగా మారిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ జంక్షన్ సమీపంలో లారీ కిందికి దూసుకెళ్లిన కారు(ఫైల్) గంగవరం: మండలంలోని జాతీయ రహదారి(ఎన్హెచ్ 75) ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ముఖ్యంగా వైఎస్సార్ జంక్షన్ నుంచి జీఎల్ఎస్ ఫారం, మామడుగు, పత్తికొండ, నాలుగు రోడ్లు, గండ్రాజుపల్లి, పెద్దఉగిణి ప్రాంతాలు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. లోప భూయిష్టమైన రోడ్డు ఇంజినీరింగ్ పనులు, బ్లాక్ స్పాట్ లైటింగ్స్, అతివేగం, అజాగ్రత్త, నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో నిత్యం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి రోడ్డుపైకి వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారో లేదోనన్న భయం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో వైఎస్సార్ జంక్షన్ వద్ద ఒక వ్యక్తి మృతిచెందాడు. అంతకు ముందు ఇదే జంక్షన్కు కొంత దూరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. పెద్దఉగిణి వద్ద బాలుడు ద్విచక్ర వాహనానికి బలవడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రమాదాల్లో వందలాది మంది మృతిచెందారు. భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో రవాణా, పోలీసు అధికారులు హడావుడి చేసి వదిలేస్తున్నారని, పూర్తి స్తాయిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాలను నిర్వహిస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదని చెబుతున్నారు. దీనికి తోడు హైవే అధికారులు ప్రమాదాలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్గా గుర్తించి అక్కడ లైటింగ్స్, రేడియం స్టిక్కర్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహదారులపై భద్రతను మెరుగు పరచడానికి అవసరమైన వేగ నియంత్రణ, రోడ్డు సంకేతాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి చట్టాలను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హై స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరింకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రమాదాలు హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. హైవేలో రాత్రిపూట లైట్లు వెలగకపోయినా పట్టించుకోకపోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో హైవేపై రోడ్డు పగుళ్లకు గురైనా మరమ్మతులు చేయడంలేదు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయలేదు. అదే విధంగా వాహనాల పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొంటున్నారు. -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కమిషనర్ పేరిట కొందరు సైబర్ నేరగాళ్లు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించాలని ఫోన్లు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు. ఓ వ్యక్తి తాను మునిసిపల్ కమిషనర్గా పరిచయం చేసుకుని, ఆస్తి పన్ను చెల్లించాలని క్యూర్ కోడ్ పంపాడు. దీన్ని రికార్డు చేసిన వ్యక్తి మునిసిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం కమిషనర్ స్పందిస్తూ పన్ను చెల్లింపుదారులు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సుల పన్నులు చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలు చెప్పి ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ పంపి డబ్బులు చెల్లించాలని మోసం చేస్తున్నారని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పన్ను చెల్లించాలని కమిషనర్, ఇతర అధికారులు ఎవరికీ నేరుగా ఫోన్ చేయరని, ఫోన్ పే, స్కానర్కు డబ్బులు పంపాలని చెప్పే అవకాశం లేదన్నారు. నగరపాలక పరిధిలో పలువురు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఫోన్ పే ద్వారా పన్నులు చెల్లించాలని అడుగుతున్నారని చెప్పారు. 9440219722 నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అరచేతిలో పంచాయతీ లెక్కలు!
ప్రతి మూడు నెలలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చిత్తూరు కార్పొరేషన్: ఇకపై పంచాయతీ లెక్కల ప్రజలకు తెలిసే విధంగా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఏ పంచాయతీలో ఎంత నిధులు.. ఏయే పనులకు ఖర్చు చేశారోననే సమాచారం సంబంధిత పంచాయతీ ప్రజల సెల్ ఫోన్లకు మెసేజ్ ద్వారా వెళ్లేలా కసరత్తు చేస్తున్నారు. పీడీఎఫ్ల ద్వారా ఫోన్లకు మెసేజ్లు పల్లెలో ప్రభుత్వ పనులు చేయాలంటే సాధారణంగా గ్రామసభ తీర్మానం, ఏకగ్రీవం, పనులకు అంచనా వేయడం, ఆ పనులను ప్రారంభించి, ముగించడం లాంటివి జరగాలి. వీటికి ఎంత తక్కువ కాదన్నా మూడు నెలలు అవసరం. అలా ప్రతి మూడు నెలలకు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు.. వాటికి పెట్టిన ఖర్చులు సంబంధిత ప్రజల ఫోన్కు పీడీఎఫ్ ద్వారా పంపనున్నారు. ఎలాగో పన్నుల చెల్లింపు సమయంలో గ్రామీణుల ఫోన్ నంబర్లు పంచాయతీ సిబ్బంది సేకరించారు. వాటికి ప్రతి మూడు నెలలకొసారి సంవత్సరానికి నాలుగు మార్లు సమా చారం పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నాహాలు చేస్తున్న అధికారులు ప్రస్తుతం పంచాయతీలో జరిగే ప్రతిపని లెక్కలను స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వీటి నమోదులో తప్పులు చేసిన 11 మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఇక ప్రతి మూడు నెలలకొసారి పల్లెలో ఖర్చుల వివరాలను ఇంటి పన్నులు చెల్లిస్తున్న యజమానులు ఫోన్లకు సమాచారం ఇవ్వనున్నారు. జిల్లా సమాచారం సిద్ధమవుతున్నాం పన్నులు చెల్లిస్తున్న వారి ఫోన్ నంబర్లకు పంచాయతీల ఖర్చుల వివరాలను పీడీఎఫ్ రూపంలో పంపనున్నాం. ఈ మేరకు ఆ పనులకు సిద్ధమవుతున్నాం. స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో గ్రామంలో జరిగే ఖర్చుల వివరాలను నమోదు చేస్తున్నాం. ఇక గ్రామీణులకు వారి ప్రాంతంలో పెట్టిన వ్యయం వివరాలను ప్రతి మూడు నెలలకోసారి వారికి సమాచారం అందించనున్నాం. – సుధాకర్రావు, జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీలు 622 మొత్తం అసెస్మెంట్లు 2,79,287 గత ఏడాది పన్ను వసూళ్లు రూ.26.27 కోట్లు -
రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక రైల్వేస్టేషన్లో విల్లుపురం–తిరుపతి ప్యాసింజర్ రైలు కింద పడి ఆదివారం గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఒకటో ఫ్లాట్ఫాం నుంచి వంద మీటర్ల దూరంలో వెళ్తున్న రైలు వద్దకు మహిళ పట్టాల పై వెళ్లడంతో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనను గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి పేరు , వయస్సు, చిరునామా వంటి వివరాలు తెలియలేదని జీఆర్పీ ఎస్ఐ నరసింహులు తెలిపారు. మృతురాలు దాదాపు 35–40 సంవత్సరాల మధ్య వయ స్సు ఉంటుందని, ముదురు రంగు గులాబీ చీర ధరించి ఉందని, కుడి చేతి పై ‘మురళి’ అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు పోలీసుస్టేషన్లో సంప్రదించాలని కోరారు. గృహోపకరణాలు దగ్ధం తవణంపల్లె(ఐరాల) : మొబైల్ చార్జర్ పేలడంతో ఇంటి గృహోపకరణాలు అగ్నికి ఆహుతైన ఘటన ఆదివారం చిత్తూరు తవణంపల్లె మండలంలోని ఎగువ తడకర, ఈ.వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండంలోని ఈ.వెంకటాపురంలో మాజీ సర్పంచ్ సుబ్రమణ్యంశెట్టి(దివంగత) ఇంట్లో ఉదయం మొబైల్ చార్జర్ పేలడంతో బెడ్రూమ్లో ఉంచిన నగదు రూ.90 వేలతో పాటు పట్టువస్త్రాలు, నిల్వ ఉంచిన వీధి దీపాలు, టీవీ, తదితర గృహోపకరణాలు బూడిదయ్యా యి. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు మంటలు గుర్తించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. కాణిపాకం కిటకిట కాణిపాకం: స్థానిక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. -
బ్యాగు పెయిన్!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2,414 ప్రభుత్వ, 431 ప్రైవేటు పాఠశాలల్లో 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతుకుంటున్నారు. చాలా ప్రైవే టు పాఠశాలల్లో 1–5 తరగతులకు ఎస్సీఈఆర్టీ పుస్తకాలకు తోడు సొంత మెటీరియల్ అంటగడుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి వారికి జేఈఈ మెయిన్స్, నీట్ స్టడీ మెటీరియల్ అంటూ భారీగా పుస్తకాలు ఇస్తున్నారు. బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటి బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. రెండు నుంచి నాలుగు వరకు అంతస్తుల్లో ఉన్న తరగతులకు మెట్ల మీదుగా చేరలేక ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. అమలు కాని స్కూల్ బ్యాగ్ పాలసీ ‘విద్యాహక్కు చట్టం– 2009’, యశ్పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీని ఆరేళ్ల కిందట అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. 1, 2 తరగతుల వారికి తెలుగు, ఆంగ్లం, గణితం, 3, 4, 5 తరగతులైతే ఆ మూడింటికి తోడు పరిసరాల విజ్ఞానం, 6–10 తరగతులైతే ఆరు పుస్తకాలే ఇవ్వాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో తల్లిదండ్రులు మాట్లాడి.. స్కూల్ బ్యాగ్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. పాఠశాలలో రెండో సంచి పెట్టడం, ఏ రోజు అవసరమయ్యే వాటిని ఆ రోజే తెచ్చుకోవడం, హోంవర్కు ఇచ్చిన సబ్జెక్టుల నోటు పుస్తకాలే ఇళ్లకు తీసుకెళ్లేలా చూడడం అవసరం. ‘నో బ్యాగ్ డే’ని బడులు విధిగా అమలు చేయాలి. చట్టాలు కాగితాలకే పరిమితం కేంద్ర మానవ వనరల అభివృద్ధి శాఖ స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం ఏ తరగతి విద్యార్థి ఎంత బరువు మోయాలో స్పష్టమైన నిబంధనలున్నాయి. విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదనేది ప్రాథమిక సూత్రం. అయితే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ర్యాంకుల ఉచ్చు, అదనపు సిలబస్ మార్కెటింగ్ వ్యూహాల వల్ల ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కే స్తున్నారు. ప్రభుత్వాలు జీవోలు జారీచేయడం, అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు చేయడం మినహా క్షేత్ర స్థాయిలో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. బడి సంచి బరువెక్కింది. సవాలక్ష పుస్తకాలతో మోయలేని భారం పడుతోంది. కేజీల కొద్దీ పుస్తకాల మోయలేక వెన్నుపూస మధ్యలోనే ఒంగిపోతోంది. బాల్యమప్పుడే బరువులు మోయలేక జబ్బుల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నిబంధనలు కఠినతరం చేసి, రేపటి పౌరులను కాపాడాల్సిన అధికార గణం కూడా కళ్లప్పగించి చూస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా స్పందించనంటోంది. బడి సంచి బరువు తరగతి అనుమతించదగిన గరిష్ట బరువు ప్రస్తుతం సగటున మోస్తున్న బరువు 1,2 తరగతులు 1.6 నుంచి 2.2 కిలోలు 4 నుంచి 5 కిలోలు 3,4,5 తరగతులు 1.7 నుంచి 2.5 కిలోలు 6 నుంచి 7 కిలోలు 6,7 తరగతులు 2 నుంచి 4.5 కిలోలు 7 నుంచి 8 కిలోలు 8,9 తరగతులు 2.5 నుంచి 4.5 కిలోలు 9 నుంచి 12 కిలోలు 10 వతరగతి గరిష్టంగా 5 కిలోలు 12 నుంచి 15 కిలోలు -
బాబొస్తే నరకమే
సాక్షి టాస్క్పోర్స్: సీఎం ఆదేశమో, అధికారుల అత్యుత్సాహమో తెలియదు గానీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతి సారీ భారీ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లకు నరకం చూపుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగే పలమనేరు–క్రిష్ణగిరి అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై అడ్డగోలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. బస్సులు, కార్లను మాత్రం అనుమతిస్తూ లారీలను ఆపేస్తున్నారు. తమిళనాడు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను కుప్పం సమీపంలోని విజిలాపురం సర్కిల్ నుంచి కంగుంది మీదుగా మళ్లిస్తున్నారు. వి.కోట వైపు నుంచి తమిళనాడు వైపు వెళ్లే వాహనాలను శాంతిపురం మండలం, బడుమాకులపల్లి నుంచి ఇదే మార్గంలో మళ్లిస్తున్నారు. దీంతో దాదాపు 12 కి.మీ అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గంలో కొంత వరకూ ఇరుకై న సింగిల్ రోడ్డు, మలుపులు ఉండడంతో రాకపోకలు సాగించలేక భారీ లారీలు, డ్రైవర్లు జాతీయ రహదారి పక్కనే ఆపి వేచి చూడాల్సి వస్తోంది. భారీ వాహనాల మళ్లింపు సందర్భంలో వచ్చే చిరు వాహనాలు, కార్లు కూడా బారులు తీరి నిలవాల్సి వస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. తిండీ నీరు లేక.. సకాలంలో గమ్యం చేరుకోలేక డ్రైవర్లు, క్లీనర్లు అగచాట్లు పడ్డారు. శిపుపురం వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న సీఎం నివాసం ముందు సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయడం ద్వారా అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం లేకుండా చూసే అవకాశం ఉన్నా అధికారులు, నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోలేక పోతున్నారు. -
తవ్వేస్తూ..సరిహద్దులు దాటిస్తూ!
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో మైనింగ్ మాఫియా బరితెగించింది. పచ్చ చొక్కాల అండదండలతో ఇసుక, మట్టి, గ్రానైట్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. నాడు ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు.. నేడు దాన్ని ‘అక్రమ ఇసుక‘గా మార్చి వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. చిత్తూరు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ ధనార్జన వ్యాపారం ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు బంగారు బాతులా మారింది. జిల్లాలోని వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాలలో హిటాచీలతో తవ్వేస్తూ ఇసుకను తరలించేస్తున్నారు. శెట్టితంగాల్ కేంద్రంగా దందా చిత్తూరు మండలం శెట్టితంగాల్ కేంద్రంగా ఇసుక అక్రమ వ్యాపారం పతాక స్థాయికి చేరింది. ఇక్కడి నుంచి గుడిపాల మండలంలోని మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ డంప్లకు తరలిపోతోంది. అక్కడి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా తమిళనాడుకు టిప్పర్లలో తరలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో టిప్పర్ ఇసుక ధర రూ. 1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు పలుకుతోంది. ఆగని దోపిడీ.. మట్టి గుల్ల నగరి నియోజకవర్గంలోనూ మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పచ్చ నేతల కనుసైగలతో టిప్పర్ల కొద్దీ మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారు. పలమనేరులోని కౌండిన్య నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఈ అక్రమ దందాపై సంబంధిత శాఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సొంత తమ్ముళ్లే ‘బోరుమంటున్నారు’! సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ‘మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. అయితే, సీఎం ప్రకటన కేవలం కుప్పానికే పరిమితమా? మిగిలిన నియోజకవర్గాల్లో దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లేనా? అని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం గమనార్హం. జిల్లాలో సాగుతున్న ఈ భారీ మైనింగ్ దోపిడీపై ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందిస్తారో..లేదో చూడాలి. మైనింగ్ మాఫియా స్వైరవిహారం -
వసూళ్ల వెం‘బడి’
● సిఫార్సులకే ప్రాధాన్యం ● కస్తూర్బాల్లో ప్రవేశాల పేరుతో నాయకుల వసూళ్లు చిత్తూరు కలెక్టరేట్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ నెలకొంది. పూర్తిగా ఆన్లైన్ విధానంలో సీట్ల భర్తీ జరుగుతున్నా.. మిగిలిపోయిన సీట్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక నాయకులు మాత్రం ‘మేము సీటు ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు వీరి మాయలో పడి డబ్బులు చెల్లించి సీటొస్తుందని ఎదురు చూస్తున్నారు. దీనివల్ల అటు డబ్బుపోగా ఇటు బాలికలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సీట్లన్నీ భర్తీ జిల్లాలో ఉన్న 7 కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 280 సీట్లు భర్తీకి చర్యలు చేపట్టారు. వీటిలో ప్రవేశాల కోసం ఆన్న్లైన్లోనే దాదాపు 11 వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి, రెండో విడతలో ఆన్లైన్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. ఖాళీగా కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. వీటి కోసం వందల సంఖ్యలో సిఫార్సు లేఖలు రావడంతో ఎంపిక ప్రక్రియ కష్టంగా మారింది. సిఫార్సు లేఖలతో పాటు పలువురు తల్లిదండ్రులు నేరుగా సమగ్ర శిక్ష కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. పీజీఆర్ఎస్కు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వందల సంఖ్యలో లేఖలు కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం గ్రామ సర్పంచులు మొదలుకొని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకుల నుంచి వందల సంఖ్యలో సిఫార్సు లేఖలు వచ్చాయి. కొందరు గ్రామ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు తీసుకొని ‘మా వాళ్లకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పించాలి’ అని సమగ్ర శిక్షా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో సిఫార్సు లేఖ కోసం తల్లిదండ్రుల నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. కానీ ఇప్పటివరకు సీటు రాకపోవడంతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. -
మావిగన్తోనే ఏపీ అభివృద్ధి
కూటమి కక్షసాధింపు వల్లే స్టీల్ప్లాంటు ఆగింది రాష్ట్ర విభన తర్వాత తన ప్యాకేజీ కోసం కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ, స్టీల్ప్లాంటును తాకట్టు పెట్టింది చంద్రబాబేనని నారాయణస్వామి తూర్పారబట్టారు. 2018లో ఎన్నికల స్టంట్లో భాగంగానే కంబాలదిన్నె వద్ద స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి ఆయిన తర్వాత స్టీల్ప్లాంటుకు భూమిపూజ చేశారని గుర్తుచేశారు. జెడ్పీటీసీ సభ్యుడులు అన్బ్లగన్, మండల కన్వీనర్ తులసీయాదవ్, మాజీ సర్పంచ్లు భాష్కర్రెడ్డి, గాలి మహేష్బాబు, అయ్య ప్ప, పుత్తూరు కేశవరెడ్డి, మాజీ మండల కన్వినర్ సుందరాజు, సుబ్రమణ్యరెడ్డి, పోలయ్య అరుల్, వేను, ఆనందన్, షణ్ముగరెడ్డి, పద్మనాభనాయుడు పాల్గొన్నారు. పాలసముద్రం : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, అభివృద్ధి మావిగన్తోనే సాధ్యమని మాజీ డెప్యూ టీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను సమన్వయం చేస్తూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ ప్రతిపాదన 2029 వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా చేర్చనున్నట్లు ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు కొత్త ఆశలు కలిగించే పరిణామమని తెలిపారు. కేవలం రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆంశం మాత్రమే కాకుండా ఏపీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే సమగ్ర విజన్కు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కీలకంగా తీసుకోండి ‘సర్’ ఓటర్ల పరిశీలనలో భాగంగా జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త కీల కంగా భావించాలని నారాయణస్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దౌర్జన్యాలు అధి కమయ్యాయన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీపులను ఉసిగొల్పి దళితులను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. దళితుల ఓట్లు అవసరం లేదని రఘరామకృష్ణంరాజు లాంటి వారు మాట్లాడుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్కల్యాణ్ ఇది తప్పు అని చెప్పకపోవడం దారుణమన్నారు. దళితులు మాట్లాడితే దాడులు చేస్తూ దౌర్జన్యాలకు దిగుతూ.. బహిష్కరణలు చేస్తున్నారన్నారు. కృష్ణలంకలో క్రాంతికుమార్ అనే దళితుడిని పోలీసులు తీవ్రంగా హింసించడంతో అతను సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్నారు. కర్నూలు జిల్లాలో మాల గంగమ్మను లాకపడెత్ చేసినా ప్రభుత్వం పట్టింకోలేదన్నా రు. బద్వేలులో ఇద్దరు దళిత యువకులను దారుణంగా హత్య చేస్తే మందకృష్ణ మాదిగ లాంటి వారు నిరసనలు చేయాలని చెప్పారేగానీ ప్రభుతాన్ని నిదీయలేదన్నారు. సాక్షా త్తు హోంమంత్రి చంద్రబాబు మెప్పుకోసం రెడ్బుక్ రాజ్యాంగానికి సహకరిస్తూ దళిత జాతికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. -
వెన్నుపూసపై అధిక ఒత్తిడి
పాఠశాల విద్యార్థులు తమ శరీర బరువులో 10 శాతానికి మించి బరువు మోయడం అత్యంత ప్రమాదకరం. లేత వయసులో ఎముకలు, వెన్నెముక పూర్తిగా ఎదుగుదల దశలో ఉంటాయి. అలాంటి సమయంలో రోజుకు 10 కిలోల చొప్పున బరువును వీపున మోస్తూ, బస్సులు ఎక్కడం, మెట్లు ఎక్కడం వల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. చిన్న వయసులోనే నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. నిరంతరం బరువు వెనక్కి వంగిపోయే స్కోలియో సిస్, ముందుకు వంగిపోయే కై ఫోసిస్ వంటి శాశ్వత వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉంది. 30–40 ఏళ్ల వయసులో వచ్చే స్పాండిలైటిస్ సమస్యలు ప్రస్తుతం 14 ఏళ్లకే చూస్తున్నాం. స్కూల్ బ్యాగుల బరువును తక్షణమే తగ్గించకపోతే భావితరం శారీరకంగా బలహీన పడుతుంది. – డా.వికాస్రెడ్డి, మెడికల్ ఆఫీసర్, చిత్తూరు -
దొంగాట!
జిల్లాలో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అన్నదాత ఆశలపై పళ్ల గుజ్జు ఫ్యాక్టరీల యజమానులు నీళ్లు చల్లుతున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లను రాత్రికి రాత్రే నిలిపివేస్తున్నట్టు ఫ్యాక్టరీల ఎదుట బోర్డులు పెట్టేశారు. నీలం రకం మాత్రమే కొనుగోలు చేస్తామంటూ డొల్లమాటలు చెబతున్నారు. తోతాపురిని తక్కువ ధరకే కొల్లగొట్టేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే మాయమాటలు చెబుతూ సిండికేట్గా ఏర్పడి దొంగాట ఆడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. కాణిపాకం/గుడిపాల: గుడిపాల మండలంలోని మూడు ప్రధాన పళ్ల గుజ్జు ఫ్యాక్టరీలతో పాటు, గంగాధరనెల్లూరు మండలంలోని పలు పరిశ్రమల వద్ద తోతాపురి కొనుగోలు నిలుపుదల చేశారు. ఈ మేరకు ఆయా ఫ్యాక్టరీ యజమానులు బోర్డులు పెట్టేశారు. తోతాపురి సీజన్ ఇంకా ముగియక ముందే.. అప్పుడే నీలం రకం కాయలు మాత్రమే కొంటామంటూ బోర్డులు పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ధర తగ్గించి తక్కువకే లాక్కోవడానికే ఈ నాటకాలంటూ మండిపడుతున్నారు. ట్రాక్టర్ల మహా క్యూ మెజారిటీ ఫ్యాక్టరీలు చేతులెత్తేయడంతో, ప్రస్తుతం కొనుగోళ్లు సాగుతున్న ఏకై క కేంద్రమైన గుడిపాల మండలంలోని గొల్లమడుగు ఫ్యాక్టరీ వద్దకు రైతు లు పోటెత్తారు. వేలాది ట్రాక్టర్లు, లారీలు రోడ్డుపైకి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. 2.5 కిమీ మేర 600కుపైగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి. వాహనాల క్యూ ఏకంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సరిహద్దును తాకింది. కంటిపై కునుకు లేదు ఫ్యాక్టరీకి తీసుకొచ్చిన లోడ్ అన్లోడింగ్ కావడానికి ఆరు రోజులు పడుతోంది. ఎండకు ఎండుతూ, వానకు నానుతూ అడవి లాంటి నిర్జన ప్రదేశాల్లో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల్లో ఉన్న పరికరాలను ఎక్కడ దొంగిలిస్తారోనని జాగారం చేస్తున్నారు. పగటిపూట ఎండలోనే కాసేపు తలవాల్చుతున్నారు. ‘సిఫార్సు’లకే దారి సామాన్య రైతులకు ఫ్యాక్టరీల వద్ద తీవ్ర అన్యా యం జరుగుతోంది. క్యూలైన్లను పక్కనబెట్టి, కొందరు పెద్దల సిఫార్సులతో వచ్చే వాహనాలను దొడ్డిదారిన లోపలికి తీసుకెళ్లి అన్న్లోడ్ చేసుకుంటున్నారని రైతులు గొగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, అధికార యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని, ఫ్యాక్టరీల దగా ఆటను కట్టించి, కొనుగోళ్లు పారదర్శకంగా సాగేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు సరిహద్దును తాకుతున్న మామిడి కాయల ట్రాక్టర్ల క్యూ , క్యూలోని టైర్ పంక్చర్ అయిన దృశ్యం చూస్తే మేలిమి బంగారం.. కోస్తే పురుగులు ఆరు రోజుల పాటు ట్రాక్టర్లలోనే మగ్గిపోతుండడంతో కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. మామిడి కాయ చూస్తే మేలిమై ఉండు.. పొట్ట విప్పు చూడు పురుగులుండు.. అన్న చందంగా తయారైంది.. ప్రస్తుత పరిస్థితి. పైకి రంగు బాగా కనిపిస్తున్నా, లోపల కుళ్లిపోవడంతో ఫ్యాక్టరీ నిర్వాహకులు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గుజ్జు ఫ్యాక్టరీల దగా -
ఎగ్గొట్టారు సర్?
చిత్తూరు టాస్క్ఫోర్స్ : రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు సవరణ కార్యక్రమం (స్పెషల్ డ్రైవ్) జిల్లాలో పూర్తిగా దారి తప్పింది. రెండో రోజైన ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి, తప్పులు సవరించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలోని 2,500 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ కనిపించ లేదు. కాగితాల్లో 2,500 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ‘కనిపించలేదు సర్’ అనే సమాధానమే వినిపించింది. సీఎం పర్యటన సాకు! జిల్లాలో ముఖ్యమంత్రి అధికారిక పర్యటన ఉండడాన్ని జిల్లా ఉన్నతాధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఉన్నతాధికారులంతా సీఎం ప్రో టోకాల్, బందోబస్తు విధుల్లో నిమగ్నమవడంతో క్షేత్ర స్థాయిలో బీఎల్వోల పర్యవేక్షణను పూర్తిగా గా లికి వదిలేశారు. దీనిని అదునుగా భావించిన మెజారిటీ బీఎల్వోలు ఆదివారం పోలింగ్ కేంద్రాలకు డు మ్మా కొట్టారు. అధికారులు అడిగితే సీఎం పర్యటన విధుల్లో ఉన్నామనే కుంటి సాకులు చెబుతూపబ్బం గడుపుకున్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడంతో, బీఎల్వోలు అసలు ఎక్కడున్నారో... ఎటు వెళ్లారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నీరుగారిన ‘స్పెషల్’ ఆశయం నూతన ఓటర్ల ఎన్యూమరేషన్, పేరు మార్పులు, చేర్పులు, చిరునామా సవరణల కోసం ఫారాలు సమర్పించేందుకు వచ్చిన పౌరులకు పోలింగ్ కేంద్రాల వద్ద చుక్కలు కనిపించాయి. పనులన్నీ మానుకుని, ఆదివారం ఉదయాన్నే కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. అనేక కేంద్రాలకు తాళాలు వేసి ఉండడం, మరికొన్ని చోట్ల సిబ్బంది లేకపోవడంతో ఓటర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తీవ్ర అలసత్వం పలుచోట్ల అరకొరగా తెరిచిన కేంద్రాల్లో సైతం సిబ్బంది తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. ఓటర్లు తీసుకొచ్చిన దరఖాస్తులను పరిశీలించడంలో, కొత్త ఫారాలను అందుబాటులో ఉంచడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఆన్లైన్లోన్ సర్వర్లు పనిచేయడం లేదంటూ, సాంకేతిక కారణాలు చెబుతూ దరఖాస్తుదారులను వెనక్కి పంపించేశారు. కలెక్టర్, ఎన్నికల అధికారులు స్పందించి, విధులకు గైర్హాజరైన బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఉర్రూతలూగించిన ‘లెనిన్’!
తిరుపతి కల్చరల్: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలు ఆదివారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరిగిన అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత, ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తిరుపతి పరిసరాలలోని రామాపురానికి చెందిన మురళీనంద కిషోర్ అంబుర్ అందించిన కథతో, ఆయన దర్శకత్వంలో రూపొందించిన లెనిన్ చిత్రం అభిమానులందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రంలో సెంటిమెంట్ ఉందని, కథలో రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పారు. అనేక ట్విస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ప్రేమ అనేది పెద్ద ఎమోషన్. ప్రేమ కోసం రాజ్యాలు కూలాయి, ప్రేమ కోసం అనేక యుద్ధాలు జరిగాయి. అలాగే లెనిన్ కూడా ప్రేమ కథా చిత్రం. ఇది సీమ కథ, సీమ మట్టి కథ, సీమలోని మనుషుల కథ, లెనిన్ అందరి ఇంట్లోని వ్యక్తిగత కథ. ప్రేక్షకులు ఈ కథను బాగా అభిమానిస్తారు. కచ్చితంగా విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నాన్నగారు చెప్పినట్టు ప్రేక్షక దేవుళ్లు లెనిన్ను చూసి ఎంజాయ్ చేస్తారని అభిప్రాయపడ్డారు. అందుకు క్షమించండి చిత్ర హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ రెండేళ్లకు పైగా గ్యాప్ ఇచ్చానని, అందుకు ప్రేక్షకులు క్షమించాలన్నారు. లెనిన్ సినిమా ద్వారా కొత్తగా మీ ముందుకు వచ్చాను, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వాడిగా చూసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. జూలై 10వ తేదీ తర్వాత ఈ చిత్రం గురించి మాట్లాడుతానని వెల్లడించారు. -
వైఎస్సార్సీపీలోకి 200 మంది చేరిక
పూతలపట్టు(యాదమరి): చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఓ నేత వైఎస్ జగన్ భావజాలానికి ఆకర్షితులై తన అనుచర గణంతో వైఎస్సార్సీపీలో చేరారు. ఐరాల మండలం, అగ్రహారంపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు, పూతలపట్టు నియోజకవర్గం బీసీవై(భారత చైతన్య యువజన పార్టీ) తరఫున 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైఎస్సార్సీ పీ అధ్యక్షులు వైఎస్ జగన్పై అభిమానంతో, ఆయ న ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక సంక్షేమ పథథకాల పట్ల ఆకర్షితులై ఆదివారం మాజీ ఎమ్మెల్యే డా.సునీల్కుమార్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయ న వెంట నియోజకవర్గంలో దాదాపు 200 మంది బీసీవై, టీడీపీకి చెందిన యువత వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ముందుకు రావడం శుభపరిణామని మిథున్రెడ్డి పేర్కొన్నారు. భానుప్రసాద్తో పాటు 200 మంది యువత పార్టీలో చేరడానికి క్రియాశీలకంగా పనిచేసిన సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, పూతలపట్టు మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డిని ఈ సందర్భంగా మిథున్రెడ్డి అభినందించారు. నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవం కోసం అహర్నిశలు కష్టపడుతామని, జగనన్నను తిరిగి సీఎంగా చేసేంతవరకు విశ్రమించబోమని భానుప్రసాద్ చెప్పారు. తలపులపల్లి బాబురెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ ద్వారకానాథరెడ్డి, సీనియర్ నాయకులు రాజారత్నంరెడ్డి, జయ చంద్రారెడ్డి, లీగల్ సెల్ కార్యదర్శి గోవర్దన్రెడ్డి, పృధ్విరెడ్డి, ఐరాల మండల బూత్ కమిటీ అధ్యక్షుడు హరీష్రెడ్డి, బ్రహ్మతేజ, ఢిల్లీ ప్రసాద్, లక్ష్మీనారాయణ, సూర్య, సాయి, లారెన్స్, నాని పాల్గొన్నారు. -
అడవిలో ఉంటున్నాం
ఇన్నాళ్లు పడ్డ బాధులు ఒక ఎతైతే..పంటను అమ్ముకోవడం మరో ఎత్తు. ఎన్ని కష్టాలు ఉన్నా ఈ కాయలను అమ్ముకోవాలి కదా. ఈ ప్రాంతం అడవి. ఏం చేద్దాం. రాత్రంతా కంటిపై రెప్ప వేయకుండా బండిని చూసుకుంటున్నాం. పగలు కునుకు తీస్తాం. ఇక్కడేమో కాయలు అన్లోడ్ చేసేందుకు ఆరో రోజులు పట్టేట్టు ఉంది. – శ్రీరాములురెడ్డి, శేషచలం పురం, చిత్తూరు నగరం ఆ ఫ్యాక్టరీలను మూసేశారు నేను వచ్చి ఇప్పటికి ఐదు రోజులు అయింది. ఇంత వరకు కాయ దిగలేదు. చిత్తూరు గంగసాగరంలోని ఓ ఫ్యాక్టరీని, గుడిపాల కొత్తపల్లిలోని ఇంకో ఫ్యాక్టరీని పూర్తిగా మూసేశారు. అక్కడ తోతాపురి కొనడం లేదు. అందుకని ఇక్కడకు వచ్చాం. ఇక్కొడొస్తే.. కాయలు ఇంత వరకు దించుకోలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – ప్రకాష్, చెన్నసముద్రం, చిత్తూరు మండలం అడ్డదారిలో తీసుకెళ్లి పోతున్నారు సిఫార్సులతో వచ్చే ట్రాక్టర్లను ఇంకో ఫ్యాక్టరీలో తూకమేసి..అడ్డదారిలో ఫ్యాక్టరీలో దింపేస్తున్నారు. ఒక్క రోజే 100 ట్రాక్టర్లు అలా సిఫార్సులతో వచ్చేస్తున్నాయి. అందుకే సామాన్య రైతు కాయలు క్యూలో కుళ్లిపోతున్నాయి. అడిగితే దురుసు గా మాట్లాడుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – రవి, ఐరాల మండలం -
● డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తయినా నిర్వహించని పరీక్షలు ● సెకండ్ సెమిస్టర్ పరీక్షల కోసం విద్యార్థుల ఎదురుచూపులు
పరీక్షల కోసం నిరీక్షణతిరుపతి సిటీ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం వారు రెండో సంవత్సరంలో అడుగుపెట్టారు. 2025–26లో పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఒక సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. తర్వాత రెండో సెమిష్టర్ పరీక్షలు చేపట్టలేదు. ఇందుకు గత ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగడమేనని అధికారులు చెబుతున్నారు. 2026–2027 విద్యా సంవత్సరం ప్రారంభమై సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టినా సెకండ్ సెమిస్టర్ పరీక్ష నిర్వహణపై వర్సిటీ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు సెకండ్ ఇయర్ సిలబస్ చదువుతూ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షల కోసం ఎలా సన్నద్ధమవ్వాలని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల ఆలస్యంపై అధికారులను వివరణ కోరగా ఈ నెల చివరి వారంలో నిర్వహిస్తామని సమాధానమిచ్చారు. మే నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేసవి సెలవుల కారణంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నామని, ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఎస్జీఎస్లో 8 నుంచి పరీక్షలు అటానమస్ హోదా పొందిన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో యూజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు గత నెల 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీతో ముగియనున్నాయి. కానీ అటానమస్ హోదా పొందిన ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో పలు పోటీ పరీక్షలకు కేంద్రంగా కేటాయించిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని, ప్రాక్టికల్స్ ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయని, ఈ నెల 8 నుంచి థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి టాస్క్ఫోర్స్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీఎల్వోలు స్థానిక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమై న ఆదేశాలు జారీచేశారు. అయితే జిల్లాలో శని వారం ప్రత్యేక డ్రైవ్ కాగితాలకే పరిమితమైంది. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోల జాడ కనిపించలేదు. చాలావరకు పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. తికమకలో ఓటర్లు ఉన్నతాధికారుల ఆదేశాలను నమ్మి శనివారం పనులు మానుకుని వచ్చిన ఓటర్లు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఏ కేంద్రంలో ఎవరు ఉంటారు? ఎవరిని సంప్రదించాలి? అనే కనీస సమాచారం కూడా ఎక్కడా ప్రదర్శించని దుస్థితి. దీంతో జిల్లాలోని అధికారుల బాధ్యతరాహిత్యానికి అద్దం పడుతోంది. ఏసీ రూమ్లకే పరిమితం బీఎల్వోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారా, లేదా? క్షేత్ర స్థాయిలో ఏం చేస్తున్నారు? అని పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక తహసీల్దార్, డివిజన్ స్థాయి లో ఆర్డీవోలదే. కానీ, శనివారం ఆ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పై అధికారులు అడగరు.. మనల్ని చూసేవారెవెరు ? అనే ధీమాతోనే విధులకు డుమ్మా కొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలువు పెట్టి వెళ్లా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేద్దామని శనివారం కార్యాలయానికి సెలవు పెట్టి మా పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ చూస్తే పాఠశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలలో వెళ్లి మొత్తం తిరిగి చూశాను. బీఎల్వోలు ఎవరూ లేరు. అక్కడున్న బీఎల్వో సెల్ నెంబర్కు ఫోన్చేశాను. ఇప్పుడు బీఎల్వో నేను కాదు. వేరే వాళ్లు అని సమాధానమిచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఎందుకు? ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? – సతీష్ కుమార్, స్థానికుడు, చిత్తూరు నగరం. కేవలం ప్రకటనలకే పరిమితం పరిశీలించిన అంశం క్షేతస్థాయి పరిశీలన ప్రభావం బీఎల్వోల హాజరు శనివారం 70 శాతం కేంద్రాల్లో ఫారాలు సమర్పించకుం అందుబాటులో లేరు డానే ఓటర్లు వెనుదిరి గారు. ఆర్డీవో, తహసీల్దార్ల పర్యటన క్షేత్రస్థాయిలో కేంద్రాలను బీఎల్వోలలో భయం సందర్శించలేదు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం కేంద్రాల నిర్వహణ పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. నిరీక్షించి ఇబ్బందులు ఎదుర్కున్నారు -
అధికార పార్టీలో ఆధిపత్య పోరు
సాక్షి టాస్క్ఫోర్స్: మండల కేంద్రమైన వడమాలపేటలో తెలుగుదేశం పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు ధనంజయులు నాయుడు టిప్పర్లను శనివారం అదే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి వర్గం ఆపడంతో వడమాలపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మండల పరిధిలోని తిరుమణ్యం చెరువు నుంచి గత రెండు రోజులుగా వందలాది టిప్పర్ల మట్టిని పాదిరేడు గ్రామంలోని ప్రైవేటు పనులకు తోలుతున్నారు. ఈపనికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధనంజయులునాయుడు నాయకత్వం వహిస్తుండగా, దీనిని వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లిన వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్రెడ్డి అడ్డుకుంటున్నారు. శనివారం పోలీసుల సాయంతో టిప్పర్లను ఆపించారు. దీనిపై ఆగ్రహించిన ధనంజయులునాయుడు వర్గం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల అనుమతితోనే మట్టిని తరలిస్తున్నట్లు వీరి వాదన. చెరువును నాశనం చేస్తున్నారన్నది మరొకరి వాదన. దీనిపై ఎటూ తేల్చుకోలేని పోలీసులు టిప్పర్లను స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిలబెట్టారు. ఇంత జరుగుతు న్నా స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. పార్టీలో చేరిన రోజు నుంచే.. మాజీ మంత్రి ఆర్కే రోజా చలవతో వడమాలపేట జెడ్పీటీసీగా గెలుపొందిన మురళీధర్రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. నాటి నుంచి స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు ధనంజయులునాయుడుపై పైచేయి సాధించాలని మురళీధర్రెడ్డి తనదైన శైలిలో ఎమ్మెల్యే భానుప్రకాష్ వద్ద రాజకీయం నెరుపుతూ వచ్చారు. దీనిపై ధనంజయులునాయుడు ఎమ్మెల్యే వద్ద ఎప్పటికప్పుడు తన అభ్యంతరాలను తెలుపుతూ వచ్చారు. అయినా పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్న చందాన ఎమ్మెల్యే మురళీధర్రెడ్డీకే తన మద్దతు ఇస్తున్నారన్నని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఈ భావనకు తాజాగా జరిగిన సంఘటన బలాన్ని చేకూరుస్తోంది. ధనంజయులునాయుడు టిప్పర్లను ఆపించగలిగే స్థాయికి మురళీధర్రెడ్డి పార్టీలో పెరిగిపోయాడన్న చర్చ మండలంలో చక్కర్లు కొడుతోంది. -
తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన మామిడి ట్రాక్టర్లు
తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన మామిడికాయల ట్రాక్టర్లు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి పెద్దపంజాణి: మండలంలోని బసవరాజుకండ్రిగ గ్రామంలో అనుమానాస్పదంగా సీతారామయ్య(40) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు సీతారామయ్య అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మను 15ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ సీతారామయ్య కుటుంబాన్ని పోషించేవాడు. 10 రోజులుగా భార్య మామ నాగరాజు ఇంట్లో సీతారాయమ్మ కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సీతారామయ్య కుటుంబంతో కలసి భోజనం చేసి పెద్దపంజాణి వెళ్లి వస్తానని వెళ్లాడు. అయితే శనివారం ఉదయం ఇంటి ముందు శవమై కనిపించాడు. అప్పటికే మృతి చెందిన సీతారామయ్య గొంతుకు చీర చుట్టుకుని ఉండడాన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతారామయ్య ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
హెల్ప్ డెస్క్ పరిశీలించిన భూమన
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని జానకారపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి శనివారం పరిశీలించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపీణీ, నమోదు, అందజేత, డిజిటలైజేషన్ వివరాలను చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి భూమనకు తెలియజేశారు. బీఎల్ఎల పనితీరు, ఫారాలు రాయడానికి వారు అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల సర్వే పనితీరును తెలియజేశారు. పలువురు ఓటర్లు హెల్ప్ డెస్క్ వద్ద ఫారాలపై సందేహాలను తెలుసుకున్నారు. బీఎల్ఎలు ఫారాలు రాసి ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు మధురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సరళామేరీ, మాజీ కార్పొరేటర్ లక్ష్మణస్వామి నాయకులు అన్బు, అంజలిరెడ్డి, ఆను, మురళీరెడ్డి, నౌషద్, హరీషారెడ్డి, రాజశేఖర్, మనోజ్రెడ్డి, సీతాపతి, ఇమ్రాన్, కౌసర్, ప్రేమ్, అల్తాఫ్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి ఖాతా తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా తమ పేరుతో బ్యాంకులో గానీ లేదా తపాలా బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆదేశించారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకా న్ని ఈ నెలలోఅమలు చేయనున్నట్లు పేర్కొ న్నారు. విద్యార్థి పేరుతో తెరిచిన ఖాతాను తప్పనిసరిగా ఎన్పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. అలా చేసిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం ఆర్థిక ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10 వ తేదేలోపు పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు, సచివాల య సిబ్బంది చొరవ తీసుకుని అర్హులైన విద్యార్థులతో వారి పేరు మీద కొత్త ఖాతాలు తెరిపించి, ఎన్పీసీఐ అనుసంధానం పూర్తయ్యేలా అవసరమైన మార్గదర్శకాలు అందించాలని కోరారు. -
ఆయప్ప వస్తే.. మాకు పడిగాపులే
పలమనేరు: ‘‘ఏం చంద్రబాబోనమ్మా ఆయప్ప మిసికిమంటే కుప్పానికి ఏమికిటి వస్తాడో గానీ ఆయప్ప వచ్చినప్పుడంతా బస్సుల్లేక ఇదేం ఖర్మ. పిల్ల పాపలు, ముసలి ముతలకు బస్సుల్లేకుండా రోడ్లపై పడిగాపులు పడుతుంటే ఆ బాధ పడేవాళ్ళకు తెలుస్తుంది’’ అంటూ రోడ్లపై బస్సుల కోసం పాట్లు పడుతున్న మహిళ శాపనార్థాలు. పలమనేరు డిపోలో గతంలో 80 దాకా బస్సులు ఉండేవి. వీటిల్లో కొన్నింటిని పుంగనూరు డిపోకు, మరికొన్నింటిని కుప్పానికి పంపేశారు. ప్రస్తుతం ఇక్కడ కాలం చెల్లిన ఆర్డినరీ బస్సులు తప్ప ఇంకేమీ లేవు. కుప్పానికి సీఎం చంద్రబాబు వచ్చినప్పుడల్లా ఇక్కడి డిపోలోని బస్సులను జనాన్ని తరలించేందుకు కుప్పానికి పంపుతుంటారు. ఇదే మాదిరి ఇప్పుడు పంపారు. అయితే శనివారం వారాంతం కావడంతో అసలే రద్దీ ఎక్కువా ఉంటుంది. దానికితోడు పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో బస్సులు లేకుంటే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆటోలు, పాల టెంపోలకు పండగ చంద్రబాబు ఎప్పుడు కుప్పానికి వస్తారా అని కాపుగాచుకుని ఉండే ప్రైవేటు వాహనాల వారు దొరికిందే దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు. బస్సులు లేని సమయంలో రెట్టింపు ధరలు షరా మామూలే. ఇక పాల టెంపోల వారికీ కొమ్ములొస్తాయి. వారు చెప్పినంత ఇవ్వాల్సిందే. పలమనేరు నుంచి బైరెడ్డిపల్లికి బస్సులో టికెట్ చార్జి రూ.40 అయితే బస్సులేనప్పుడు రూ.500 ఇవ్వాల్సిందే. ఇదే పరిస్థితి అన్ని మార్గాల్లో ఉంటుంది. ఏదేమైనా సీఎం కుప్పానికి వచ్చిన ప్రతిసారీ మహిళలు, వృద్ధులు, వికలాంగులు పడే కష్టాలు ఆ భగవంతునికే తెలియాలి. ఓటరూ.. మేలుకో! ఓటరు మహాశయా మేలుకో! నీ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు సమయం ఆసన్నమైంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిచేసి ఇవ్వడానికి కేవలం 10 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. -
పొరుగుజ్జు
జిల్లాలోని మామిడి రైతుల పొట్టగొడుతూ పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న తక్కువ ధర కాయలతో పళ్లగుజ్జు ఫ్యాక్టరీల యజమానులు కాసుల వేట సాగిస్తున్నారు. స్థానిక రైతన్న ఆవేదనను గాలికొదిలేసి, తమిళనాడు నుంచి తక్కువ ధరకు లభిస్తున్న మామిడి కాయలను ఇక్కడి ఫ్యాక్టరీలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ స్థానిక మార్కెట్ను కుప్పకూలుస్తున్నారు. గుడిపాల మండలంలోని పలు పల్ప్ ఫ్యాక్టరీలే ఇందుకు ప్రధాన కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమిళనాడుకు చెందిన కొందరు మధ్యవర్తులు, వ్యాపారులు అక్కడి తోటల్లో తోతాపురి కాయలను కేవలం రూ.3 నుంచి రూ.4లకే కొనుగోలు చేస్తున్నారు. వాటిని లారీల ద్వారా సరిహద్దులు దాటించి చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలకు రూ.4 నుంచి రూ.5లకు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఇటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కూడా స్థానిక రైతుల నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందనే నెపంతో, తమిళనాడు కాయల వైపే మొగ్గు చూపుతున్నాయి. మన రైతుకు ఆంక్షలు.. పొరుగు లారీలకు పర్మిషన్లు స్థానిక రైతుల పట్ల ఫ్యాక్టరీల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జిల్లా రైతులు తమ కాయలను కేవలం ట్రాక్టర్లలో తీసుకొస్తేనే కొంటామని, లారీల్లో తీసుకురావద్దంటూ వింత నిబంధనలు విధిస్తున్నారు. కా యల లోడింగ్ ఎక్కువైతే రేటు పడిపోతుందనే సాకు చూపుతున్నారు. కానీ, తమిళనాడు నుంచి మాత్రం యథేచ్ఛగా లారీల కొద్దీ వస్తున్న మామిడి లోడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫ్యాక్టరీల లోపలికి అనుమతిస్తుండడం గమనార్హం. దీనివల్ల స్థానిక జిల్లా కాయలను ఫ్యాక్టరీలు పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి. లెక్కల్లో మాయాజాలం! జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు కాగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో కేవలం తోతాపురి రకమే సాగైంది. ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలోని 35 పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ 2.50 లక్షల మెట్రిక్ టన్నుల లెక్కల్లో తమిళనాడు నుంచి వచ్చిన కాయలను కూడా కలిపేశారు. పొరుగు రాష్ట్రం నుంచి ఎంత మేర కొనుగోలు చేశారనే వివరాలను ఫ్యాక్టరీల యాజమాన్యాలు అధికారిక లెక్కల్లో ఎక్కడా చూపించడం లేదు. రైతు సంఘాల నాయకుల అంచనా ప్రకారం.. ఈ సీజన్లో ఇప్పటికే సుమారు 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల తమిళనాడు కాయలు జిల్లాలోని ఫ్యాక్టరీలకు చేరిపోయాయి. దీనివల్ల స్థానిక రైతుల కాయలు తోటల్లోనే మగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు స్పందించి స్థానిక రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వైభవంగా సంకటహర గణపతి వ్రతం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఆస్థాన మండపంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలోఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో మొత్తం నాలుగు బ్యాచ్లుగా ఈ వ్రతాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యే క పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రాత్రి స్వామి వారిని స్వర్ణ రథంలో ఊరేగించారు. ఊరేగింపుగా వస్తున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అడుగడుగునా కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. -
60 కొబ్బరి మొక్కల నరికివేత
ఐరాల: మండలంలోని కోళ్లపల్లె సమీపంలోని వ్యవసాయ పొలంలో తమ 60 కొబ్బరి మొక్కలను నరికివేశారని బాధిత దంపతులు సుబ్రమణ్యంరెడ్డి, చంద్రమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ కోళ్లపల్లె రెవెన్యూ పరిధిలో మూడెకరాల వ్యవసాయ భూమిలో తన పేరిట కొంత భూమిని పెట్టుకుని, మిగిలిన భూమిని తన ఇద్దరు కుమారులకు పంచిపెట్టామని తెలిపారు. కాగా తన మొదటి భార్య చనిపోవడంతో చంద్రమ్మను రెండో వివాహం చేసుకున్నాని చెప్పారు. చంద్రమ్మకు కుమారుడు నిరంజన్రెడ్డి, కుమార్తె మౌనిక సంతానం కలిగారని తెలిపారు. రెండేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు నరేష్రెడ్డి ఇంటిలో నుంచి గెంటేశాడని వాపోయారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తన రెండో భార్య కుమారుడు నిరంజన్రెడ్డి చిత్తూరు నగరంలోని సంతపేటలో అద్దె ఇంటిలో ఉంచి తమ సంరక్షణ చూసుకుంటున్నాడని తెలిపారు. సంవత్సరం క్రితం నిరంజన్రెడ్డికి సంక్రమించిన ఆస్తిలో మామిడి, కొబ్బరి చెట్లను నరేష్రెడ్డి దౌర్జన్యంగా నరికివేసిన ఘటనపై తన రెండో కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. కాగా గ్రామ పెద్దలు మధ్యస్తం ద్వారా రాజీ చేసినట్లు చెప్పారు. శుక్రవారం మరోసారి పొలంలో ఉన్న సుమారు 60 కొబ్బరి మొక్కలను నరేష్రెడ్డి దౌర్జన్యంగా నరుకుతుండగా, తాను, తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కత్తితో నరికి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ప్రాణ భయంతో డయల్ 112కు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. -
కాయ పండై.. రైతు పుండై..!
ఏడాదిలో ఎప్పుడో ఓసారి టమాటా బాక్సు రూ.1000 ఫలికి కోటీశ్వురులైనన రైతులు పదో పరకో ఉంటారు. వారిలాగే మనం కూడా టమాటాలో లక్షలు గడించాలని అప్పులు చేసి మరీ టమాటాను సాగుచేసి చేతులు కాల్చుకుంటున్న రైతులు వేలాది మంది ఉన్నారు. ఇక్కడ టమాటా సేద్యం జూదంగా మారింది. పలమనేరు: ఈసారి టమాటా రైతుకు సైతం మామిడి రైతు పరిస్థితే ఎదురైంది. మార్కెట్లో ధరలు పతనమయ్యాయి. కాయలమ్మితే కనీసం కూలీలు కూడా రావడం లేదు. పలమనేరు మార్కె ట్లో శుక్రవారం బాక్సు ధర గరిష్టంగా రూ.150, కనిష్టంగా రూ.70, సగటు ధర రూ.90గా పలికింది. ఈ ధరల్లో టమాటా కోసినా కనీసం కూలీలకు, రవాణా ఖర్చులకు డబ్బులు రావని రైతులు కాయలను కోయకుండా తోటల్లోనే వదిలేశారు. తోటల్లో ఎర్రటి సీరియల్ బుల్బుల్లా కనిపిస్తున్న టమాటాలను చూసిన జనం అయ్యో టమాటా రైతులకు ఎంత కష్టమొచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి లక్ష నష్టం ఎకరా పొలంలో టమాటా సాగు చేసేందుకు సుమారుగా రూ.2లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఎకరానికి వెయ్యి బాక్సుల దిగుబడి వస్తే ఇప్పుడున్న ధర రూ.100తో రూ.లక్ష వస్తుంది. దీంతో రైతుకు లక్ష నష్టంతోపాటు కుటుంబమంతా కష్టపడిన కూలి కూడా రానట్టే. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రెండువేల హెక్టార్లలో టమాటా సాగులో ఉంది. రైతు ఉత్పత్తులుకు ఎమ్మార్పీ ఉండదా? మార్కెట్లో దొరికే ప్రతి వస్తువుకు కంపెనీ నిర్ణయించే ఎమ్మార్పీ ధర ఉంటుంది. చివరకు గుండుసూదికి సైతఽం ధర ఉంటుంది. కానీ రైతుల పండించే ఉత్పత్తులకు మాత్రం ధర ఉండదు. రైతు చేసే వ్యవసాయం ద్వారా పరోక్షంగా పదిమంది బాగుపడుతున్నారు. కానీ రైతు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నాడు. కోతకూలి కూడా దక్కదు టమాటా కాయలు కోసేందుకు వచ్చే కూలీలకు రూ.500 కూలి, వారి గ్రామం నుంచి తోట వద్దకు ఆటోలో తీసుకురావాలి. వారికి భోజనం పెట్టి తాంబూళం కూడా రైతులివ్వాల్సిందే. ఎకరా తోటలో పదిమంది కూలీలు కాయలు కోస్తే 50 బాక్సులు అవుతాయి. ఇప్పుడున్న బాక్సు ధర రూ.వందతో రూ.5వేలు దక్కుతుంది. ఇందులో మండీ నిర్వాహకులు పదిశాతం కమీషన్తో రూ.500 పట్టుకుని రూ.4,500 చేతికిస్తాడు. పదిమంది కూలీలకు రూ.500తో రూ.5వేలు, భోజనానికి రూ.500, మా ర్కెట్కు తీసుకొచ్చే లగేజి ఆటోకు రూ.500 మొత్తం కలిపి కోత ఖర్చు మాత్రమే రూ.6వేలు. రైతుకు అందిన బిల్లు రూ.4,500 దీంతో రూ.1500 నష్టం. దీని కి తోడు రైతు కష్టం పోయినట్టే. దీంతో తోటల్లోని కాయలను కోయకుండా రైతులు వదిలేస్తున్నారు. -
ట్రాన్స్కో అధికారుల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో జిల్లా నోడల్ ఆఫీసర్, సీజీఎం శోభావాలంటీనా నగరంలో శుక్రవారం పర్యటించారు. కొంగారెడ్డిపల్లె సెక్షన్లోని సాయిబాబా ఫీడర్ను పరిశీలించారు. ఎనర్జీ ఆడిట్లో భాగంగా స్మార్ట్ మీటర్ల సరఫరాను అడిగి తెలుసుకున్నారు. ఎంత సరఫరా చేస్తున్నారు. అందుకు తగిన బిల్లులు వస్తోందని అని పరిశీలించారు. విద్యుత్ లాస్ వివరాలను తదితర విషయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, సర్వీసుల పనితీరును గమనించారు. అనంతరం సెక్షన్లో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్, ఏఈ రాము, సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీకి రూ.50.2 లక్షల విరాళం తిరుమల: తమిళనాడుకు చెందిన కేకేఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.50.2 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం చిత్తూరుకు చెందిన సురేష్కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. అలాగే చిలకలూరిపేటకు చెందిన చుండి రంగ నాయకులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. -
టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం
వి.కోట : టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ నేతల అనుచరులు దాడిచేసిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని దానమయ్యగారిపల్లి టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. మండలంలోని మద్దిరాళ్ళ గ్రామానికి చెందిన దళిత యువకుడు మంజునాథ్ టోల్ప్లాజాలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అధికార పార్టీ నేతలు, అనుచరుల వాహనాలు పలమనేరు నుంచి వి.కోట వైపునకు వచ్చాయి. నేతల వాహనాలు ఎటువంటి రుసుం తీసుకోకుండా టోల్ ప్లాజాలో వదిలేశారు. అనుచరుల వాహనాలను మంజునాథ్ ఆపాడు. దీంతో రెచ్పిపొయిన అనుచరులు వాహనం ఆపి ‘మా వాహనాలనే ఆపుతావా.. నీకు ఎంత ధైర్యం’ అంటూ మూకమ్మడిగా పిడిగుద్దులు గుద్ది అతనిపై దాడిచేశారు. టోల్ సిబ్బంది నిరసన ఘటనతో అగ్రహించిన టోల్ సిబ్బంది విధులను బహిష్కరించి టోల్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. గతంలో కూడా నాయకులు ఇలాగే తమపై దాడిచేశారని, పోలిసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంట పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపొకలకు అంతరాయం ఏర్పడి వాహనాలు కీలోమీటరు మేర బారులు తీరాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్వలి సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బందితో చర్చించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సిబ్బంది నిరసన విరమించారు. -
‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ ప్రారంభం
తిరుపతి రూరల్: చిన్నారుల విద్యారంభాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా ప్రారంభించే లక్ష్యంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ కార్యక్రమం శుక్రవారం తిరుపతి శివారులోని శ్రీ వకుళామాత ఆలయంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర పాల్గొని చిన్నారులు ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ‘అక్షర గోవిందం కిట్’లను ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి సన్నిధిలో తయారైన ప్రసాదాలతో పలువురు చిన్నారులకు అన్న ప్రాసనం నిర్వహించారు. తిరుపతిలో సంస్కృత అకాడమీ తిరుపతి సిటీ: తిరుపతిలో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, స్థలం కోసం టీటీడీకి లేఖ రాశామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ గోశాల వద్దగల తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాడమీ ద్వారానే విద్యార్థులకు టెక్ట్స్ పుస్తకాలు సరఫరా ఉంటుందని, ప్రైవేటు సంస్థలు సైతం అకాడమీ పుస్తకాలనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో వర్చువల్ అకాడమీ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి ఆదేశాల మేరకు డీపీఆర్ తయారు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్మన్గా ఉన్న లక్ష్మీపార్వతి చేసింది ఏమీ లేదన్నారు. పాలిసెట్ ఆప్షన్ ఎంట్రీకి నేడే ఆఖరు తిరుపతి సిటీ: పాలిసెట్లో అర్హత సాధించి పలు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు ఆన్లైన్లో ఆప్షన్ ఎంట్రీ చేసుకునే ప్రక్రియ శనివారంతో ముగియనుంది. 5వ తేదీ ఆదివారం ఆప్షన్స్ మార్పునకు అవకాశం ఇస్తూ 7వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో 8వ తేదీన రిపోర్టు చేసి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని పాలిసెట్ అధికారులు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత తిరుపతి అర్బన్: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణరాజు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం బాలల హక్కుల పరిరక్షణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని విభాగాలకు చెందిన అధికారులతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. కమిషన్ సభ్యులు గాంధీబాబు, శ్రీనివాసమూర్తి, పద్మలత, డీఆర్వో నరసింహులు, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, డీఎంఅండ్హెచ్వో బాలకృష్ణ నాయక్, బీసీ వెల్పేర్ అధికారి భరత్కుమార్ పాల్గొన్నారు. -
నీలం రకం.. కిలో రూ.6 లకేనా?
తోతాపురి కొనుగోళ్లను నిలిపివేసిన ఫ్యాక్టరీల యజమానులు, ఇప్పుడు వ్యూహాత్మకంగా ‘నీలం రకం మామిడి కాయలు కొంటాం’ అంటూ బోర్డులు తగిలించారు. అది కూడా కేవలం కేజీ రూ.6 లకే కొంటామని తెగేసి చెబుతున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాని ఈ ధరతో రైతులను మరింత శ్రమ దోపిడీ చేసేందుకు యాజమాన్యాలు సిద్ధపడ్డాయి. మరోవైపు గుడిపాల పరిసరాల్లోని ఫ్యాక్టరీలు అరకొరగా కొనుగోళ్లు జరుపుతూ.. పక్కనే ఉన్న తమిళనాడు కాయలపై మోజు చూపిస్తూ స్థానిక రైతులను నట్టేట ముంచుతున్నాయి. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
చిత్తూరు కలెక్టరేట్ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం చిత్తూరులో డీఆర్వో మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్త, ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్లే విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం సంభవించిదని మండిపడ్డారు. ఈ ప్రమాదంలో పదిమంది కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంతో కార్మికులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ దాసరి చంద్ర, జిల్లా నాయకులు నాగరాజులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ప్లాంట్ను కాపాడుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంవత్సరాలుగా కార్మికులు పోరాడుతున్నా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్త నిర్ణయం ప్రకారం దశలవారీ పోరాటంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆంజనేయులు, రాజా, ఏఐటీయూసీ నాయకులు విజయ్ కుమార్, రఘు, మణి తదితరులు పాల్గొన్నారు. -
ఈఏపీసెట్ ర్యాంకర్లకు మిట్స్ సువర్ణ అవకాశం
కురబలకోట : ఈఏపీసెట్ ర్యాంకర్లకు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక ఫీజు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి బీటెక్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈఏపీసెట్ ర్యాంకర్లకు అనుగుణంగా వారి ప్రతిభ అధారంగా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అభ్యసించే సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఈసీఈ, సీఎస్ఈ, బయోఇన్ఫాటిక్స్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రోచాన్సలర్ నాదేళ్ల ద్వారకనాఽథ్, వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డి. ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. -
అవ్వాతాతల పేర్లు అడుగుతున్నారు
ఇతని పేరు సి.వాసు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీ, మారుతీనగర్, డోర్ నం.6–11–211లోని అద్దె గృహంలో నివాసం ఉంటున్నారు. భార్య లేదు. తల్లి, మైనర్ బాలుడుతో కలసి ఉంటున్నారు. వృత్తి రీత్యా అలిపిరి మెట్ల వద్ద చిన్న పాటి వ్యాపారం చేసుకుంటున్నారు. కాగా సర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటి వద్దకు జూన్ మూడో వారంలో ఓటరు ప్రత్యేక సవరణలో భాగంగా ఆ ప్రాంత బీఎల్వో, స్వర్ణ వార్డు సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాలను ఇచ్చారు. వాటిని కొన్ని షరుతులకు అనుగుణంగా పూరించాలి. 2002లో ఓటరు జాబితాలో పేరు లేదని నాన్న లేదా తాత, అవ్వల పేర్లు, వారు లేని పక్షంలో మరణ ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని చెప్పారు. నాన్న పేరు గుర్తుందని, తాత, అవ్వల పేర్లు తెలివని చెప్పారు. ఇచ్చిన రెండు రెన్యూమరేషన్ ఫారాలను పూరించి రెండు ఫొటోలను అందించారు. ఇప్పటికి పదిహేను రోజులు దాటినా తాత, అవ్వల పేర్లు చెప్పాలని బీఎల్వో అడుగుతూనే ఉన్నారని చెబుతున్నారు. ఇంతకీ ఈ సవరణలో తమ ఓట్లు ఉంటాయా లేదా అనే అనుమానం వస్తోందని వాసు ఆవేదన చెందుతున్నారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 66,304 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,811 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. టీబీ నిర్మూలనపై సమీక్ష చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా క్షయవ్యాధి నియంత్రణ కార్యాలయంలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం అమలుపై శుక్రవారం జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్ఓ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ అరుత్ సెల్వన్ ముఖ్య అతిథిగా హాజరై టీబీ కేసుల గుర్తింపు, సేవల నాణ్యత, చికిత్స ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎల్ఏటీఓ జి.వెంకట ప్రసాద్ జిల్లాలో కార్యక్రమ ప్రగతిని వివరించా రు. అనంతరం డాక్టర్ అరుత్ సెల్వన్ మాట్లాడుతూ.. 2030 నాటికి క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధితులను త్వరితగతిన గుర్తించి నిరంతర చికిత్స అందించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీసీ, డీపీఎస్, పీపీఎం కోఆర్డినేటర్లు, ఎన్టీఈపీ సిబ్బంది పాల్గొన్నారు. మిస్భా తండ్రి ఆత్మహత్య పలమనేరు: గతంలో పలమనేరులో కాపురముంటూ పుంగనూరుకు వెళ్ళిన మిస్భా తండ్రి వజీర్ అహ్మద్(50) రెండ్రోజుల క్రితం అక్కడి కొత్తపేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 2022లో పలమనేరులో మిస్భా అనే బాలిక ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగాక మిస్భా కుటుంబం పుంగనూరుకు వెళ్ళిపోయింది. ఏం జరిగిందోగాని మిస్భా తండ్రి సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలమనేరులో చర్చనీయాంశమైంది. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి గంగవరం: కూలి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మిద్దైపె నుంచి కింద పడ్డ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంగవరం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న మహదేవ(65)కు కూలి పనులే జీవనాధారం. గురువారం డ్రైవర్స్ కాలనీ వద్ద కూలి పనులకు వెళ్ళాడు. ఇంటి మిద్దైపె పనిచేస్తుండగా ప్రమా దవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై మిద్దైపె నుంచి కిందికి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వృద్ధుడిని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నెకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రువారం మృతిచెందాడు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విఫల రాజు
మామిడి రైతులకు కష్టాలొచ్చాయి. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామంటే ఫ్యాక్టరీల యజమానులు దగా చేస్తున్నారు. సాకులు చెప్తూ కొనుగోళ్లకు బ్రేకులు వేస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పల్ప్ ఫ్యాక్టరీల యజమానులు ఆడుతున్న నాటకాలకు సామాన్య రైతు నిలువునా మునుగుతున్నాడు. యంత్రాలు ‘రిపేర్’ అంటూ తోతాపురి కాయల కొనుగోళ్లను అర్ధంతరంగా నిలిపివేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. మరోవైపు ఫ్యాక్టరీలు తోతాపురిని పక్కన పెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాణిపాకం: తోతాపురి మామిడి రైతు కోలుకునే పరిస్థితి కనబడడం లేదు. కాయలను గుజ్జు ఫ్యాక్టరీలు కొంటాయనే ఆశతో వారం రోజులుగా వందలాది ట్రాక్టర్లతో రైతులు ఫ్యాక్టరీల ముందే పడిగాపులు కాస్తున్నారు. ఓ వైపు ఎండలో రోజుల తరబడీ ట్రాక్టర్లోనే ఉండడంతో కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. ఒక్కో ట్రాక్టర్లో 4 నుంచి 5 టన్నుల లోడ్ ఉంటే.. తీరా అన్లోడింగ్ చేసే సమయానికి దాదాపు 2 టన్నుల కాయలు కుళ్లిపోయి వృథాగా మారుతున్నాయి. కళ్ల ముందే పంట కుళ్లిపోతుంటే ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే తీరా నీలం కొంటామని ఫ్యాక్టరీలు బోర్డు పెట్టడంతో రైతులు మండిపడుతున్నారు. టార్గెట్ పూర్తి కాకుండానే చేతులెత్తేశారు జిల్లా వ్యాప్తంగా 59 వేల హెక్టార్లలో మామిడి సాగవగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో తోతాపురి రకమే ఉంది. ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారులు 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలోని 35 పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఇంకా లక్ష్యానికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మిగిలి ఉండగానే.. అప్పుడే గంగాధర నెల్లూరులోని ఫ్యాక్టరీలు తోతాపురిని పక్కన పెట్టేసి చేతులెత్తేయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకుల సిఫార్సులు.. అధికారుల ఉత్తుత్తి తనిఖీలు సామాన్య రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఉద్యానశాఖ అధికారులు మాత్రం ఉత్తుత్తి తనిఖీలతో కాలక్షేపం చేస్తూ రైతుల బాధలను గాలికొదిలేశారు. దీనికి తోడు ఫ్యాక్టరీల్లో అధికార పార్టీ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులున్న పెద్దల కాయలను మాత్రమే ఫ్యాక్టరీల యాజమాన్యాలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేశాయని, వెనుక ఎవరూ లేని సామాన్య చిన్న, సన్నకారు రైతుల కాయలను మాత్రం రోడ్డు పాలు చేశారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలను నట్టేట ముంచుతున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, తోతాపురి కొనుగోళ్లను పునఃప్రారంభించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. -
సర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
– డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి బంగారుపాళెం: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను బీఎల్వోలు వేగవంతంగా నిర్వహించాలని డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని జంబువారిపల్లె, తగ్గువారిపల్లె, బంగారుపాళెం, వేపనపల్లె పంచాయతీలలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. సర్ కార్యక్రమం గురించి బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఏన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు, డిజిటలేషన్ తీరుపై ఆరా తీశారు. డిజిటలేషన్లో వెనుకబడి ఉండడంపై బీఎల్వోలపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలన్నదే ‘ససర్’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అనర్హులు, మృతులు శాశ్వత వలసదారులు, ఒకటికి మించి ఎక్కువ ఓట్లు ఉన్నవారిని గుర్తించి తొలగించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ఓటర్ల నుంచి తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాల వివరాలను డిజిటలేజేషన్ను ఎప్పటి కప్పుడు పూర్తిచేయాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని గుర్తించుకోవాలన్నారు. సర్ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే బీఎల్వోలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్వేయర్ లావణ్య పాల్గొన్నారు. -
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కౌన్సెలింగ్ గందరగోళం నడుమ సాగింది. శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్కు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి టీచర్లు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. అయితే సీనియారిటీ జాబితాల్లో గందరగోళం, అభ్యంతరాలు, పలు కారణాల వల్ల కౌన్సెలింగ్ను సాయంత్రం వరకు నిర్వహించలేని పరిస్థితి. పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ అన్న చందంగా మారిన ఈ ప్రక్రియలో సీనియార్టీ స్థానాల కోసం ఉపాధ్యాయులు పోటాపోటీగా నిలిచారు. ఈ కౌన్సెలింగ్ కేటాయింపుల్లో తీవ్ర ఆలస్యం జరగడంతో, ఉపాధ్యాయులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న హైస్కూల్ ప్లస్ విద్యాలయాల్లో మొత్తం 118 పీజీటీ పోస్టుల డిప్లాయ్మెంట్ కోసం ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గంటల తరబడి నిరీక్షణ.. సాయంత్రానికి మోక్షం! ఉమ్మడి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉపా ధ్యాయులు కూర్చోవడానికి సరైన వసతులు లేక, ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాడిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. పారదర్శకంగా నిర్వహించాం: ఇన్చార్జి డీఈవో కౌన్సెలింగ్ ఆలస్యమవడంపై ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు వివరణ ఇస్తూ.. ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, సీనియార్టీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా స్థానాలను కేటాయించాలనే ఉద్దేశంతోనే జాబితాల పరిశీలనకు కొంత సమయం పట్టిందని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రాధాన్యత క్రమంలో, మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఈ త్వరితగతిన భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. సబ్జెక్టుల వారీగా పోటాపోటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అప్గ్రేడ్ చేసిన హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ తరగతులకు బోధించేందుకు ఈ 118 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 270 మంది దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్కు హాజరయ్యారు. అయితే అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య భారీగా ఉండడం, ఖాళీలు పరిమితంగా ఉండడంతో ప్రతి పోస్టుకూ తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా కొన్ని ప్రధాన సబ్జెక్టుల స్థానాల కోసం ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాను పట్టుకుని అధికారుల వద్దకు క్యూ కట్టారు. ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేస్తూ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. -
ఇదెక్కడి న్యాయం
అనర్హులంటున్నారు.. చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టుల నియామకాల్లో అన్ని రకాల విద్యార్హతలు, సుదీర్ఘ సర్వీస్ ఉన్నప్పటికీ మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంలను అనర్హులుగా అధికారులు ప్రకటిస్తున్నారు. సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న తమపై వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు బదిలీలే శాపం 2025లో బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్లో ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు పూర్తయిన వారిని, రేషనలైజేషన్లో పోస్టులు కోల్పోయిన వారు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను ఎంపిక చేసుకునేలా అధికారులు ఒత్తిడి తెచ్చారు. జిల్లా స్థాయిలో సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను వారి పాత సబ్జెక్టుల సీనియారిటీ జాబితాలోనే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక పాఠశాలల బాధ్యతలను మోయాల్సి వస్తోంది. -
గుడుపల్లెలో ఫుట్వేర్ కంపెనీ
చిత్తూరు కలెక్టరేట్ : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో దక్షిణ కొరియాకు చెందిన హ్వాసెంగ్ ఫుట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.898 కోట్ల పెట్టుబడితో నాన్ లెదర్ ఫుట్వేర్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానుందని, మూడు దశల్లో అమలు చేస్తారని వివరించారు. ఈ ప్రాజెక్ట్ను సీఎం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 11న లోక్ అదాలత్ చిత్తూరు అర్బన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాల త్ నిర్వహించనున్న ట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. రాజీ చేసుకోదగ్గ కేసులను లోక్ పదాల తో పరిష్కరించుకోవాలని సూచించారు. కక్షిదారులు, న్యాయవాదులు పోలీసు శాఖ, బీమా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 కోర్టుల్లో ప్రత్యేక అదాలత్ బెంచులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ సూపరింటెండెంట్ల బదిలీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లను బదిలీ చేశా రు. ఈ మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కృపావతిని అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఈవో కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్ఎస్ఏ సూపరింటెండెంట్ ప్రేమకుమారిని నియమించారు. నేడు పీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : హైస్కూల్ ప్లస్లలో ఖాళీ గా ఉన్న పీజీటీ పోస్టుల భర్తీకి అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ కోసం స్కూ ల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా సిద్ధమైందని పేర్కొన్నారు. అందులో అభ్యంతరాలుంటే ఉదయం 11 గంటలలోగా తగిన ఆధారాల తో తెలపాలని పేర్కొన్నారు. పీజీటీ పోస్టుల కోసం 250కి పైగా దరఖాస్తులను అధికారులు గురువారం పరిశీలించినట్టు తెలిపారు. 13 లోపు ఫీజు చెల్లించాలి తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సులకు సంబంధించి సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల చివరిలో నిర్వహించడం జరు గుతుందని, విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 13వ తేదీ లోపు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేన్స్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. -
యూపీఎస్సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి సత్తా
పలమనేరు: ఇటీవల యూపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సోమల మండలం రాశెట్టివారిపల్లికి చెందిన రాశెట్టి సదాశివయ్య, పార్వతమ్మ దంపతుల కుమారుడు రాశెట్టి మంజునాథ్ సత్తా చాటాడు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలో సహాయ సంచాలకుడిగా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనకు గురువారం నియామపక పత్రం అందింది. మంజునాథ్ యూపీఎస్సీ మెయిన్స్లో విజయం సాధించి పలుమార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి కొన్ని మార్కుల్లో ఉద్యోగాలను పొందలేకపోయారు. గతేదాడి కూడా ఇంటర్వ్యూలో ఒక మార్కుతో అవకాశాన్ని కోల్పోయాడు. వెయిటింగ్ లిస్ట్లో ఇతనికి కేంద్ర ప్రభుత్వ గ్రూప్–ఏ గెజిటెడ్ హోదా కలిగిన పోస్టు దక్కింది. దీంతో కుటుంభ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కుంగిపోకుండా ప్రయత్నించాలి యూపీఎస్సీ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో ఓడాను. మొక్కవోని దీక్షతో మళ్లీ ప్రయత్నించాను. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేటి యువత పరాజయాలకు కుంగిపోకుండా ప్రయత్నిస్తే విజయం దక్కుతుంది. – రాంశెట్టి మంజునాథ్ -
ప్రాణదాన పథకానికి 261 మంది ఎంపిక
తిరుపతి తుడా: టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్లో పేదరోగులకు ఉచిత శస్త్ర చికిత్సల కోసం 261 మంది రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్లో డైరెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎంపిక ప్రక్రియలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రామూర్తి, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, రుయా హాస్పిటల్ డాక్టర్ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ఇందులో ఎనిమిది మంది కార్డియాలజీ, 25 మంది కార్డియో థోరాసిక్, 14 మంది జనరల్ సర్జరీ, 16 మంది, మెడిసన్, 76 మంది నెఫ్రాలజీ, 9 మంది న్యూరాలజీ, 45 మంది న్యూరో సర్జరీ, నలుగురు గైనకాలజీ, ఒకరు రేడియాలజీ, నలుగురు రేడియేషన్ అంకాలజీ, 48 మంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ, 10 మంది సర్జికల్ అంకాలజీ, ఒకరు యురాలజీ రోగులు ఉన్నట్టు వెల్లడించారు. -
వైభవం.. ప్రసన్నుడి రథోత్సవం
పుత్తూరు: అప్పలాయగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు గురువారం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు పట్టుపీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలతో ముగ్దమనోహర రూపంలో స్వామి, అమ్మవార్లు రథారోహణం చేశారు. అనంతరం 9.25 నుంచి మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, అశేష భక్తజన గోవిందనామ స్మరణలతో ఆలయ మాడవీధుల్లో రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కిలిపి విశ్వరూప దర్శనం, తోమాలసేవ, కొలువు, అర్చన, మొదటి గంట తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు. 8 గంటలకు పుణ్యాహవచనము, నవగ్రహపూజ నిర్వహించారు. 11.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 వరకు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు భక్తి కీర్తనల ఆలాపనల మధ్య స్వామివారి ఊంజల్ సేవ కనుల పండుగగా సాగింది. అనంతరం శ్రీవారు వాహన మండపంలోకి వేంచేపు చేశారు. అశ్వంపై నుంచి అభయమిచ్చిన ప్రసన్నుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారు అశ్వవాహనంపై పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో విహరిస్తుండగా అశేష భక్తజనం గోవిందనామ స్మరణలతో మాడవీధులు మార్మోగాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, యువతుల ఆనందడోలికల కోలాటం నడుమ స్వామివారు అశేష భక్తజనానికి అభయమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు నారికేళ, కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని కనులారా దర్శించుకొన్నారు. వాహన సేవ అనంతరం స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వాహన సేవల ముందు హిందూ ధర్మప్రచార ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన వివిధ భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవలను కంకణ భట్టర్ సూర్యకుమారాచార్యుల బృందం నిర్వహించగా, కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం. 1.30 నుంచి 10.45 గంటల వరకు తీర్థవారి చక్రస్నానం. రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు నిర్వహించే ధ్వజావరోహణంతో ప్రసన్న వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అవుతాయి. ‘‘మానవుని శరీరమే రథం, ఆత్మ రథికుడు, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. శ్రీవారు అధిరోహించిన రథోత్సవాన్ని తిలకించే వారికి కలిగే తత్వజ్ఞానమిదే.’’ -
దోపిడీకి స్కెచ్!
తోతాపురి రకం మామిడి కిలోకు ప్రభుత్వం ఇచ్చే రూ.4 ప్రోత్సాహక నిధిని స్వాహా చేయడానికి ముఠాలు కన్నేశాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకముందే జిల్లాలోని కొన్ని ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద బోగస్ బిల్లుల కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు ర్యాంపుల నిర్వాహకులు కాయలు విక్రయించకుండానే బిల్లులు సిద్ధం చేస్తామని, ఆధార్, పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంకు పాస్బుక్ ఉంటే చాలని రైతులను ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సారి కూడా ప్రోత్సాహక నిధిలో భారీ గోల్మాల్ జరిగే అవకాశాలపై ఉద్యానశాఖలో ఆందోళన నెలకొంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో గత ఏడాది 25 మామి డి కొనుగోలు ర్యాంపులు ఉండగా ఈ సారి 42 పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్నింటి కార్యకలాపాల పైనే అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి కాయలు కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించే అవకాశం ఎక్కువగా ర్యాంపుల ద్వారానే ఉంటుందని భావిస్తున్నారు. ఫ్యాక్టరీల కంటే ర్యాంపుల్లో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు అవకాశంగా మారుతోంది. ఈసారి అధికారులకు ముందే సమాచారం ఈ ఏడాది అక్రమాలకు సంబంధించిన సంకేతాలు ముందుగానే ఉద్యానశాఖ అధికారులకు చేరుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ర్యాంపులు, ఫ్యాక్టరీలు రైతుల నుంచి ముందుగానే పత్రాలు సేకరిస్తున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతమున్న ర్యాంపులు, ఫ్యాక్టరీలన్నింటినీ పర్యవేక్షించేందుకు ఉద్యానశాఖ వద్ద తగిన సిబ్బంది లేరు. ఉన్న వారితోనే అన్ని కేంద్రాలను పరిశీలించడం అసాధ్యంగా మారింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అక్రమాలను ఎలా అరికట్టాలనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కట్టుదిట్టమైన చర్యలే పరిష్కారం గతేడాది వెలుగులోకి వచ్చిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, రైతుల భూముల ధృవీకరణ, జియో ట్యాగింగ్, డిజిటల్ తూకం నమోదు, ఒకే రైతు పేరుతో బహుళ బిల్లులను నిరోధించే సాఫ్ట్వేర్ వ్యవస్థ తీసుకువస్తేనే అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు, రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు. మామిడి ప్రోత్సాహక నిధిపై మళ్లీ ముఠాల కన్ను -
మామిడి అలా... టమాట ఇలా!
జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మామిడి కాయలకు సరైన ధర అందలేదు. రైతులు కాయలను చెట్లలోనే వదిలేశారు. అలాగే టమాట పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎప్పుడు ధర ఉంటుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని అయోమయ స్థితి. ఈ రెండు పంటలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది మంది రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకకు, ఇక్కడికీ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుచేస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. పలమనేరు: జిల్లాలో 58 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో 40 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగులో ఉంది. రైతులు 40 వేల మంది వరకు ఉన్నారు. గతేడాది ధరల్లేక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. పల్ప్ ఫ్యాక్టరీల వద్ద మామిడి బండ్లు అన్లోడింగ్ కావడంలేదు. ర్యాంపుల వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వం ధర పెంచకుండా ప్రోత్సాహకం ఇస్తున్నామంటూ చేతులుదులుపుకుంది. దీంతో ఎక్కువ మంది రైతులు కాయలను తోటల్లోనే వదిలేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి కిలో రూ.17 ఉంటే గాని రైతులకు గిట్టుబాటు కాదు. కాయలను కోసి ఫ్యాక్టరీలకు వద్దకు తీసుకువచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. సకాలంలో అన్లోడింగ్ కాకపోవడంతో సకానికి పైగా కాయలు కుళ్లిపోతున్నాయి. ట్రాక్టర్ల అద్దె, కూలీల ఖర్చు, పెట్టుబడి ఏదీ వచ్చే పరిస్థితి లేదని రైతులు కుమిలిపోతున్నారు. కర్ణాటకలో ధరలు బాగున్నాయి కర్ణాటకలో తోతాపురి మామిడి ధర కిలో రూ.17.50 ఉంది. ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన ధర కిలో రూ.7.50లు. కిలోకు రూ.10 వ్యత్యాసం. ఇక్కడ టమాటా బాక్సు రూ.200 ఉండగా పక్కనే ఉన్న కోలారు టమాట మార్కెట్లో బాక్సు రూ.400 పలుకుతోంది. ఇక్కడికి.. అక్కడికి రూ.200 వ్యత్యాసం. ఇలా పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో ధరల్లో ఇంత భారీ తేడా ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. హార్టికల్చర్ హబ్ ఏమైందో.. గత ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాను హార్టికల్చర్ హబ్గా చేస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామని, వ్యవసాయాన్ని పండగలా మార్చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఇజ్రాయేల్కంటే మిన్నగా హార్టికల్చర్ హబ్గా మార్చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా వాటి ఊసేలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధరల్లేక పడేసిన మామిడి కాయలు పలమనేరు సమీపంలోని హైవేలో పడేసిన టమాటాలు(ఫైల్) భారీగా ధరలు పతనం లాటరీగా మారిన టమాట జిల్లాలోని పడమటి ప్రాంతాలైన పలమనేరు, కుప్పంలో టమాట సాధారణ సాగు 20 వేల హెక్టార్లలో ఉంది. సుమారు 30 వేల నుంచి 40 వేల మంది రైతులు సీజన్తో సంబంధం లేకుండా టమాటాను సాగు చేస్తుంటారు. ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఎకరా పొలంలో టమాట సాగుకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఆ లెక్కన బాక్సు ధర రూ.400 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. రెండు నెలల్లో పది రోజుల పాటు బాక్సు ధర రూ.500 వరకు పలికింది. మళ్లీ ధరలు పడిపోయి రూ.150 నుంచి రూ.200 లకు చేరింది. ధరలు ఎప్పుడు ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పుడున్న ధరలతో రైతు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రానట్టే. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 78,067 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,158 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. అక్షర గోవిందానికి సర్వం సిద్ధం తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయతీలో ఉన్న టీటీడీ ఆధీనంలో ఉన్న శ్రీ వకుళామాత సన్నిధిలో శుక్రవారం అక్షర గోవిందం – అన్నప్రాసన కార్యక్రమం నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు టీటీడీ జేఈవో ఎ.శరత్ గురువారం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు వేదోక్తంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి రోజు నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిర్ణీత సమయానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్ర మం నిరంతరం కొనసాగుతుందని, పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్షర గోవిందంలో పా ల్గొనే ప్రతి చిన్నారికీ ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. 4 నుంచి ఆలయ అర్చకుల పర్యవేక్షణలో.. జూలై 4వ తేదీ నుంచి ఒక్క మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు ఒక్కో బ్యాచ్కు 25 మంది చొప్పున రెండు బ్యాచ్లకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు జేఈవో వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు రామచంద్రాపురం: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అసభ్య పదజాలాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఢిల్లీరాణి భానుకుమార్ తదితరులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు. పులివర్తి నాని చేసిన వ్యాఖ్యలు, ఫోన్ సంభాషణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజా ప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఫోన్ కాల్ రికార్డులు, ఆడియోల ఆధారాలను పరిశీలించి ఎమ్మెల్యే పులివర్తి నానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పంచవటి జ్యోతి, యశ్వంత్రెడ్డి, పవన్కుమార్రెడ్డి, ఓబుల్రెడ్డి, సెంథిల్కుమార్, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి, బాబురెడ్డి, సతీష్రెడ్డి, ఇరగమరెడ్డి, చిరంజీవినాయుడు, మధు, భాస్కరయ్య పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును నిర్దేశించేవి పరిశోధనలే తిరుపతి సిటీ: భారత భవిష్యత్తును పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలే నిర్దేశిస్తాయని జాతీయ భద్రతా మండలి సభ్యులు, మాజీ డీఆర్డీఏ చైర్మన్, ఏరోస్పెస్ శాస్త్రవేత్త డాక్టర్ జీ.సతీష్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఎస్వీయూను సందర్శించి ఆయన సెనెట్ హాల్లో దేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశోధనాభివృద్ధి అకాడెమియా పాత్ర అనే అంశంపై జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, జాతీయ అభివృద్ధికి కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. వీసీ నర్సింగరావు నాయకత్వంలో విశ్వవిద్యాలయం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశోధన ప్రయోగశాలలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అంతరశాఖ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఏరోస్పేస్, రక్షణ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్లు, పరిశోధనా అవకాశాలు, భవిష్యత్ సాంకేతిక రంగాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్ర సమాధానాలు ఇచ్చారు. వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, డీన్ చెండ్రాయుడు పాల్గొన్నారు. -
అయోమయం.. గందరగోళం!
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో అధికారులు చేపట్టిన అడ్మిషన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా అధికారులు అడ్మిషన్ల ప్రక్రియను సాగదీస్తూ నరకం చూపిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ సాధారణంగా రెండు విడతలు పూర్తి చేసి మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లతో భర్తీ చేసే సంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగేది. అలాంటిది ఈ ఏడాది విచిత్రమైన రీతిలో ఇటు విద్యార్థులకు, అటు తల్లిదండ్రులకు చుక్కలు చూపుతూ నాలుగు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియను గురువారానికి పూర్తి చేశారు. అయినా ఇప్పటికీ ఎస్వీ జూనియర్ కళాశాలలో 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. పద్మావతి జూనియర్ కళాశాలలో 70 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలుసుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు పెట్డం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదో విడత ఉంటుందా? టీటీడీ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. నాలుగు విడతల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఐదో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారా..? లేక స్పాట్ అడ్మిషన్లకు వెళతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. సీట్ల కోసం వ్యవ ప్రయాసల కోర్చి కళాశాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న తల్లిదండ్రుల ఆవేదనను అధికారులు దృష్టిలో ఉంచుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు. ప్రవేశాల ఎస్వీ పద్మావతి ప్రక్రియ జూనియర్ జూనియర్ కళాశాల కళాశాల తొలివిడతలో 172 252 రెండో విడతలో 103 191 మూడో విడతలో 81 128 నాల్గో విడతలో 140 45 మొత్తం సీట్ల సంఖ్య 968 792 ఇప్పటివరకు భర్తీఅయిన సీట్లు 401 711 మిగిలిన సీట్ల సంఖ్య 391 257 -
జెడ్పీలో ఖాళీల భర్తీకి సన్నాహాలు
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమల్లోకి వచ్చాయి. జిల్లాలో ఉద్యోగుల స్థానికతను నిర్ణయించే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్కు శాఖకు చెంది జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఫ్రీజింగ్ను ప్రభుత్వం సడలించింది. దీంతో జిల్లాలోని సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లకు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాలు రూపొందిస్తున్నారు. జూన్ 30వ తేదీన పలువురు ఉద్యోగ విరమణ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు జెడ్పీ పరిధిలోని 65 మంది మండల పరిషత్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిని కొత్త జిల్లాలైన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఏర్పాటు కానున్న జెడ్పీ కార్యాలయాలకు కేటాయించనున్నారు. జెడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం సెప్టెంబరులో ముగియనుంది. అనంతరం కొత్తగా తిరుపతి, అన్నమయ్య జెడ్పీలను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. చిత్తూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందోనని కంగారుపడుతున్నారు. ఉద్యోగ విరమణతో ఖాళీలు జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల పరిపాలన అధికారులు (ఏవోలు) 15 మంది జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి ఆ స్థానాలను భర్తీ చేయనున్నారు. అలాగే సీనియర్ అసిస్టెంట్లు 12 మంది, జూనియర్ అసిస్టెంట్లు 10 మంది ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ స్థానాల్లో ఆఫీసు సబార్డినేట్లు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించనున్నారు. ఈ మేరకు జాబితాలు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో జూలై 5 తర్వాత ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై నిషేధం అమల్లోకి వస్తోంది. -
గతేడాది బట్టబయలైన గోల్మాల్
గతేడాది జిల్లాలోని 31 ఫ్యాక్టరీలకు 49,350 మంది రైతులు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు సరఫరా చేసినట్లు అధికారిక లెక్కలు నమోదయ్యాయి. అలాగే 25 ర్యాంపుల ద్వారా 30,600 మంది రైతులు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు విక్రయించినట్లు బిల్లులు సమర్పించారు. అనంతరం జరిగిన పరిశీలనలో సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల కాయల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకే రైతు పేరుతో రెండు వేర్వేరు ర్యాంపుల్లో బిల్లులు సమర్పించడం, మామిడి తోటలే లేని వారి పేర్లతో కొనుగోళ్లు చూపించడం, నీలం రకం మామిడిని తోతాపురి రకంగా చూపించి ప్రోత్సాహక నిధి పొందడం, కాయలు తరలించకుండానే కొనుగోలు జరిగినట్లు రికార్డులు సృష్టించడం వంటి అక్రమాలు బయటపడినట్లు సమాచారం. కొందరు మధ్యవర్తులు రైతుల వివరాలను సేకరించి వారి పేర్లతోనే బిల్లులు రూపొందించినట్లు ఆరోపణలు వినిపించాయి. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కుప్పం రూరల్ : పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులు ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం పరిశ్రమలకు భూములు ఇచ్చిన పొగురుపల్లి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి వచ్చిన 33 సమస్యలపై అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలన్నారు. కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని పేర్కొన్నారు. పెద్ద ఇండస్ట్రియల్ పార్కు వస్తుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, మౌలిక వసతులు వస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఈ గ్రామానికి వస్తున్నారని, ఆయన రైతులతో మాట్లాడతారని చెప్పారు. ఆయనతో సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడా ఏపీడీ శ్రీనివాసరాజు, ఆర్డీవో షేక్ మహ్మద్ హుస్సేన్, తహసీల్దారు సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్లు చేసి మరీ ఒప్పించారు.. నేడు రోడ్డున పడేశారు!
2025 బదిలీల్లో అధికారులు స్వయంగా ఫోన్లు చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పీజీ టీ పోస్టుల భర్తీలో మీరు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు.. మీకు అర్హత లేదని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి మా పనితీరును మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. అధికారులు నిబంధనల సాకుతో అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేసి తీరాల్సిందే. – శ్రీనివాసులు, పీఆర్టీయూ స్టేట్ అడిషనల్ సెక్రెటరీ అర్హతలున్నా వివక్ష చూపడం ఎంతవరకు న్యాయం? పీజీటీగా అన్ని రకాల అర్హతులున్నా మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల సాకుతో వివక్ష చూపడం ఎంతవరకు న్యాయం. నిబంధనల ప్రకారం సాధారణ హైస్కూళ్లలో ఉండే స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించారు. మేము కూడా స్కూల్ అసిస్టెంట్ కేడర్కు చెందిన వారమే. మాకు అన్యాయం చేయడం తగదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు న్యాయం చేయాలి. – లత, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్లో ఉన్నామనే ఆపేస్తారా? ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టూ స్థాయి విద్యను బలోపేతం చేసేందుకు హైస్కూల్ ప్లస్ విధానాన్ని తీసుకువచ్చారు. నేను పీజీ పూర్తి చేసి పీజీటీ పోస్టుకు అన్ని అర్హతలు సాధించాను. నా సీనియారిటీ కూడా జిల్లా స్థాయి సబ్జెక్ట్ లిస్టులోనే ఉంది. అధికారుల బలవంతం వల్ల సర్దుబాటు నిమిత్తం మోడల్ ప్రైమరీ స్కూల్స్కు హెచ్ఎంగా వచ్చాను. ఇప్పుడు సాంకేతిక కారణాన్ని చూపి అర్హత లేదని చెబుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం. – బత్తిన నాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం -
డెంగీ దడ!
డెంగీ వివరాలు సంవత్సరం డెంగ్యూ 2022 179 2023 235 2024 307 2025 2026(జూన్ 26 వరకు) 116 వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ల మధ్యలో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా యాంటీ డెంగీ నివారణ మాసోత్సవం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో నివారణ చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినా గ్రామాలు, పట్టణాల్లో చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా పేరుకుపోయిన మురుగు, నీటి తొలగింపు చేపట్టకపోవడం, ఫాగింగ్ లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్గునియా జ్వరాలు ప్రబలుతాయన్న భయం వెంటాడుతోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలు, గుంతలు, ఖాళీ స్థలాలు, ఇంటి పరిసరాల్లోని పాత్రల్లో నీరు నిల్వ ఉంటోంది. ఇవి డెంగీ వ్యాప్తికి కారణమయ్యే దోమల పెంపక కేంద్రాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, పట్టణాల్లో మురుగు నీరు నిల్వ ఉండడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. జిల్లాలో అనేక గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సకాలంలో చెత్తను తొలగించకపోవడం, మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేస్తున్నా స్థానిక సంస్థల అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణలో కీలకమైన ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికే పరిమితమైన మలేరియా శాఖ డెంగీ, మలేరియా నియంత్రణకు మలేరియా శాఖ తీసుకుంటున్న చర్యలు క్షేత్ర స్థాయిలో పెద్దగా కనిపించడం లేదని పలువురు అంటున్నారు. అడపాదడపా అవగాహన కార్యక్రమాలు, తనిఖీలతోనే సరిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించాల్సిన ’ఫ్రైడే–డ్రైడే’ కూడా చాలా చోట్ల ఫొటోలకు పరిమితమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, ఫాగింగ్ను ముమ్మరం చేయడం, గ్రామాలు–పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడం అత్యవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలతో దండెత్తిన దోమలు -
మామిడి రైతు నోట్లో మట్టి!
కాణిపాకం: కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన కుదరడం లేదు. తోతాపురి మామిడి కిలోకు రూ.4 సబ్సిడీ ఇస్తామని కోతలు కోసిన పెద్దలు అందులో సగం భారాన్ని కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా, రైతులకు చేకూరుస్తున్న అదనపు ప్రయోజనం ఏమీ లేదనే పచ్చి నిజం బయటపడింది. 8.65 లక్షల టన్నుల దిగుబడి ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో 8.65 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో స్పందించిన కేంద్రం 25 శాతం లోపు అంటే 2.16 లక్షల టన్నులకే సబ్సిడీ ఇస్తామని మెలిక పెట్టింది. మిగిలిన 6 లక్షల టన్నులకు పైగా ఉన్న పంట పరిస్థితి ఏమిటని అన్నదాతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం అండగా నిలిచింది గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆనాడు మొత్తం రూ.176 కోట్ల సబ్సిడీ అందితే, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 94.16 కోట్లు భరించి రైతులను ఆదుకుంది. నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రం కిలోకు ఇచ్చే రూ.2.18ల లబ్ధిని కూడా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. చేతులెత్తేసిన కూటమి సర్కార్ రాయలసీమ వ్యాప్తంగా మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, గురుమూర్తి చొరవ తీసుకుని కేంద్రానికి లేఖలు రాశారు. ఇక్కడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. దీంతో కేంద్రం స్పందించింది. మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద కిలోకు రూ.17.47 మద్దతు ధర ప్రకటించింది. అందులో 25 శాతం రూ.4.36 సబ్సిడీగా ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఇందులో సగం వాటా రూ.2.18లను భరిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.4 సబ్సిడీ ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. కేంద్రం ఇస్తున్న వాటాను దాచి పెట్టింది. గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కంటే ఈ ప్రభుత్వం అదనంగా ఇస్తున్నదేమీ లేదని అధికారులు స్పష్టం చేస్తుండడం గమనార్హం. -
హైవేకు అనుసంధానించాలి
నగరి: విజయపురం మండలం ఇష్టకామేశ్వరపురం (గొల్లకండ్రిగ)–పన్నూరు సబ్స్టేషన్ క్రాస్ రోడ్డు సమీపంలోని చిత్తూరు–తచ్చూరు ఆరులేన్ల జాతీ య రహదారిపై ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధానంగా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆమె ఈ విషయాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్హెచ్ఏఐ చైర్మన్, ప్రాజెక్టు డైరెక్టర్, ప్రాంతీయ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధాన రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. దీనిపై అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. భారతమాల పర్యోజన కింద నిర్మాణంలో ఉన్న చిత్తూరు–తచ్చూరు ఆరులేన్ల జాతీయ రహదారి ప్రాంతీయ అభివృద్ధికి కీలకమ ని తెలిపారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ప్రవేశం–నిష్క్రమణ మార్గం లేకపోవడం, ఈ రోడ్డుకు తిరుత్తణి–నాగలాపురం రాష్ట్ర రహదారితో అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు అనుసంధానంతో రాకపోకలు సులువు ఇష్టకామేశ్వరపురం ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగినదని, విజయపురం, నిండ్ర మండలాలతో పాటు అనేక గ్రామాల ప్రజలకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా ఉపయోగపడుతుందని ఆర్కే రోజా వివరించారు. ఈ ప్రాంతంలో ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపుతో పాటు అనుసంధాన రహదారి ఏర్పాటు చేస్తే ఎన్హెచ్–716, ఎన్హెచ్–716ఏ, తిరుత్తణి–నాగలాపురం రాష్ట్ర రహదారులతో సులభ అనుసంధానం ఏర్పడి చిత్తూరు, శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతం, తిరుత్తణి, నాగలాపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–తమిళనాడు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రవాణా మరింత మెరుగుపడుతుందని వెల్లడించారు.ర్యాంపు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఇష్టకామేశ్వరపురం వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధాన రహదారి ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విజయపురం, నిండ్ర మండలాల ప్రజలు చిత్తూరు తదితర పట్టణాలకు వేగంగా, సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు. అలాగే ఎన్హెచ్–716ఏతో రవాణా అనుసంధానం బలపడడంతో పరిశ్రమలు, సెజ్ల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని వెల్లడించారు. దక్షిణకాశి ఆలయం, ఆరే జలపాతం, సింగిరికోన, కై లాసకోన జలపాతం, శ్రీకాళహస్తి, కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సందించాలని కోరారు. -
మద్దతు ధర పేరిట మోసం
పలమనేరు : మామిడికి మద్దతు ధర ప్రకటించామని ప్రభుత్వం చెబుతూ మోసం చేసిందని జిల్లా మామిడి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు ఆరోపించారు. స్థానిక మామిడి రైతులు బుధవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యాలయ అధికారిణి తహసీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమాపతినాయుడు మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడికి రిజిస్టర్ అయిన ర్యాంపుల్లో గత వారం కేజీకి రూ.4 ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రూ.3 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ ఆదేశాలను ర్యాంపు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ప్రభుత్వం కిలో మామిడి ధర రూ.7.50 లుగా ప్రకటించిందని, జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలు ఈ ధర ఇవ్వకుండా రూ.3లు ఇస్తున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ సైతం కరువైందన్నారు. మనిషికి హానిచేసే పొగాకుకు బోర్డు ఉన్నప్పుడు, మామిడికి మాత్రం ఎందుకు మ్యాంగో బోర్డు లేదని ప్రశ్నించారు. కనీసం ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగినా ఈ ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ర్యాంపుల వద్ద ఇష్టానుసారంగా తక్కువ ధరలతో రైతులను మోసం చేస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జిల్లాలో 40 వేల మంది మామిడి రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోయారన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో మాత్రం ధరలు బాగుంటే ఇక్కడ మాత్రం ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ నిరసనలో నేతలు సుబ్రమణ్యం నాయుడు, మధుసూధన్రావు, నరసింహారెడ్డి, దొరస్వామి నాయుడు, వాసు, విజయ్,యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● స్వార్థ రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండండి ● కూటమి ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
దళిత గ్రామాల్లో అలజడులు సృష్టించొద్దు శ్రీరంగరాజుపురం: కూటమి ప్రభుత్వం దళిత గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తోందని, వారి స్వార్థ రాజకీయాలకు దళితులు బలి కావొద్దని, హక్కుల సాధన కోసం కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఆయన బుధవారం పుత్తూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయన్నా రు. ప్రశాంతంగా ఉన్న దళిత గ్రామాల్లో అధికార పక్ష నేతలు అలజడులు సృష్టిస్తూ, దళితుల మధ్య వైషమ్యాలు రేపుతున్నారని మండిపడ్డారు. జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నారాయణస్వామి కొనియాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, రాజకీయం తారతమ్యం లేకుండా ప్రతి పేదవాడి అభివృద్ధి కోసం జగనన్న కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించి ఉన్నత వర్గాలు, బినామీల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న దళిత యువత.. కూటమి రాజకీయ నేతల ఉచ్చులో పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం బాధాకరమన్నారు. కేసులు పెట్టుకుని ఆర్థికంగా, జీవితపరంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్, మదర్ థెరిసా, సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత ద్వేషాలను పక్కనపెట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. -
టీడీపీ నాయకుల బరితెగింపు
జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికారిక బూత్ లెవల్ ఏజెంట్లను పక్కన పెట్టి, ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించారని ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు నియోజకవర్గం ప్రజాప్రతినిధి పీఏ కనుసన్నల్లో యాప్లో ఓటర్ల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. అనుకూల ఓటర్లను ఒకలా, వ్యతిరేక ఓటర్లను మరోలా వర్గీకరిస్తూ క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్ : ఓటు పవిత్రతను కాపాడాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నేతలు పెడచెవిన పెట్టారు. మై టీడీపీ యాప్ పేరుతో ఓటర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆధారాలతో సహా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాల పర్వం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓటర్ల గోపత్యను కాలరాస్తూ, మై టీడీపీ యాప్లో అనైతిక ఓటర్ల ప్రొఫైలింగ్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న ఈ కుట్రపై అధికారులకు అందిన ఫిర్యాదులు సంచలనంగా మారాయి. రహస్య ఓటు హక్కుకు భంగం రాజ్యాంగం కల్పించిన రహస్య ఓటు హక్కు సూత్రానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓటరు పేరు, ఐడీ కార్డ్ నంబర్తో పాటు వారి కులం, ఏ పార్టీ వైపు ఉన్నారనే అత్యంత సున్నితమైన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఆధారాలతో సహా ఫిర్యాదు జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మై టీడీపీ యాప్లో ఓటర్ల నమోదు చిత్రాలు, ప్రైవేట్ వ్యక్తులు డేటా సేకరిస్తున్న వీడియోలు, క్షేత్రస్థాయి ఆధారాలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించి పొలిటికల్ ప్రొఫైలింగ్ చేస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్) ల గుర్తింపు కార్డులను కచ్చితంగా ప్రభుత్వ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించాలన్నారు. సర్ ప్రక్రియ పురోగతిని ప్రతి రోజూ ఆన్లైన్లో పబ్లిష్ చేసి పారదర్శకతను కాపాడాలని కోరారు. -
విస్త‘రణం’ తప్పదా?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని హై రోడ్డు విస్తరణ పనుల్లో మళ్లీ సందిగ్దత నెలకొంది. గత రెండేళ్లకు పైగా హై రోడ్డు విస్తరణ పనుల్లో నెలకొన్న నిర్లిప్తతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులు కేటాయించింది. జాతీయ రహదారుల (ఎన్హెచ్) శాఖ నుంచి విడుదలైన ఈ నిధుల ద్వారా త్వరలోనే టెండర్లు పిలిచి, ఆపై పనులు మొదలుపెడాతమని ఇటీవల కలెక్టర్ ప్రకటించారు. కానీ ఇక్కడున్న భవన యజమానులకు దీనిపై స్పష్టతలేదు. అధికారుల వద్ద సమాధానాల్లేవు. పరిహారం మాటేంటి..? ఇందులో మరో అంశం పరిహారం. విస్తరణలో భవనాలు కోల్పోయే యజమానులకు పరిహారం ఇవ్వా లని ఇప్పటికే అందరూ గట్టిగా ఉన్నారు. అయితే పరిహారం ఇవ్వాలంటే రూ.వందల కోట్లతో ముడిపడ్డ అంశమని, దీనికి తాము అనుకూలంగా లేమని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. పరిహారానికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ బాండ్లను ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. టీడీఆర్ బాండ్లపై తమకు ఆసక్తి లేదని, ఏదైనా నగదు రూపంలో పరిహారం ఇవ్వాల్సిందేనంటూ కొందరు కోర్టు తలుపులు సైతం తట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిహారం ఇవ్వకుండా, టీడీఆర్ బాండ్లను ఇచ్చి భవన యజమానులకు విస్తరణకు ఒప్పించడం అధికారులకు కత్తిమీదసామే. అనేకమార్లు ఈ విషయమై హైరోడ్డు భవన యజమానులతో చర్చలు జరిపాల్సి ఉంది. వాళ్లు దేనికి అంగీకరిస్తారో తుదిగా తేలితేనే విస్తరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకూ ఎన్ని అడుగులు? దాదాపు రూ.37 కోట్లతో చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ కూడలి నుంచి మురకంబట్టు బైపాస్ రోడ్డు వరకు హై రోడ్డును విస్తరించడానికి ఎన్హెచ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే రోడ్డును విస్తరించి, కాలువలు – డివైడర్లు నిర్మించే పనులు, ఇతర మౌలిక వసతులను మాత్రమే ఎన్హెచ్ శాఖ పూర్తి చేస్తుంది. ఇక్కడ భవన యజమానులకు పరిహారం ఇవ్వడానికి ఈ నిధులు కేటాయించలేదన్నది సుస్పష్టం. ఎన్హెచ్ పనులు మొదలుపెట్టాలంటే తొలుత మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై బరువు–బాధ్యత ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎంత వరకు..? అంటే ఉన్న రోడ్డుతో పాటు ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరణ పనులు మొదలు పెట్టాలి..? అనే విషయం మార్కింగ్ చేసి, ఆపై ఎన్హెచ్కు అప్పగిస్తే వాళ్లు పనులు చేస్తారు. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం హైరోడ్డును వంద అడుగుల వెడల్పుకు విస్తరించాలి. కానీ కొందరు భవన యజమానులు 80 అడుగుల విస్తరణకు సహకరిస్తామని చెబుతుంటే, మరికొందరు పనిలో పనిగా ఒకేసారి వంద అడుగులకు విస్తరించాలని కోరుతున్నారు. భవన యజమానుల సంఘంలో కూటమి పార్టీకి చెందిన ఓ వ్యక్తి పరిహారం విషయంలో గతంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం, ఆపై క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారా..? సొంత ప్రణాళిక తెరపైకి తీసుకొస్తారా..? అనేది తెలియడంలేదు. మార్కింగ్ పూర్తి హైరోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఎంఎస్ఆర్ కూడలి నుంచి మురకంబట్టు వరకు తొలి దశలో 4.31 కి.మీ విస్తరించాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ఓసారి భవన యజమానులతో సమావేశం నిర్వహించి కలెక్టర్కు నివేదిస్తాం. పనులు ప్రారంభమైతే త్వరలోనే పూర్తవుతాయి. – నరసింహ ప్రసాద్, కమిషనర్, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ -
గణనాథుని సేవలో సంగీత దర్శకుడు కోటి
కాణిపాకం: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి మంగళవారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేటి నుంచి నాల్గో విడత ప్రవేశాలు తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలలో భాగంగా అధికారులు నాల్గొవ విడత కౌన్సెలింగ్ కోసం మెరిట్లిస్ట్ను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఏ ఒక్క కళాశాలలోనూ కనీసం 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఇలా ఎన్ని విడతలు ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తారని, అధికారులు విద్యార్థులతో చలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7న ప్లాస్టిక్ బకెట్ల ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్ బకెట్లను జూలై 7న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ– వేలం వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల బిడ్డర్లు ఈఎండీ రూ.25 వేలు చెల్లించి ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877–2264429 నంబర్లో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్సైట్, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ను సంప్రదించాలని సూచించింది. పంచాయతీ కార్మికుల ప్రాణాలతో చెలగాటం చంద్రగిరి: పంచాయతీ కార్మికుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ బ్యానర్లను తొలగించేందుకు కార్మికులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఫలితంగా కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నేతలు బ్యానర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం టీడీపీ నేతల ఆదేశాలతో వాటిని తొలగించేందుకు పంచాయతీ ఈఓ చంద్రశేఖర్రెడ్డి పూనుకున్నారు. వెంటనే పంచాయతీ కార్మికులందరూ వెంకంపేట వద్దకు రావాలంటూ హుకుం జారీచేశారు. పంచాయతీ కార్మికులు గుణశేఖర్, సతీష్ ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. వెంకటంపేటకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో గుణశేఖర్కు తీవ్రగాయం కావడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. సతీష్ కుడి కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదాన్ని పట్టించుకోని వైనం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై సిబ్బంది మండిపడ్డారు. రాజకీయ నేతల ఆదేశాలతో పంచాయతీ ఈఓ అవలంబించిని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏం చేశారని పాలాభిషేకం
జిల్లాలో మామిడి రైతులు గత నెల రోజులుగా రోడ్లపై అల్లాడిపోతున్నారు. టోకన్లు, వరుస నంబర్లతో విసిగిపోతున్నారు. ఫ్యాక్టరీ వద్దే కునుకు తీస్తూ పంటను అమ్ముకోవడానికి నానాతిప్పలు పడుతున్నారు. కూటమి నేతల సిఫార్సులతో సామాన్య రైతు కాయలు కుళ్లి పోతున్నాయి. రైతులు గుండె నిండా కన్నీళ్లు దాచుకుని...తమ గోడును బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. అయితే కూటమినేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం మామిడి రైతుల కష్టాలపై నోరెత్తకపోగా.. రూ.4కే పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉంది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే మేము మళ్లీ ఉద్యమం చేపడుతాం. – కృపాలక్ష్మి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త -
రిటైర్ట్ పోలీసు అధికారులకు సన్మానం
చిత్తూరు అర్బన్ : జిల్లాలో జూన్ నెలలో పదవీ విరమణ పొందిన తొమ్మిది మంది పోలీసు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ అతిథి గృహంలో మంగళవారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు నాన్ కేడెర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, అడిషనల్ ఎస్పీ ఎస్.షాను తదితరులు పదవ విరమణ పొందిన అధికారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ఉమామహేశ్వర రావు, ఆర్ఐలు సుధాకర్, వీరేశ్, ఏఓ నాగభూషనమ్మ, పోలీస్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు!
● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తోంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఇష్టం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్ర మంత్రి ఉన్నా అక్కడి మామిడికి కిలో రూ.17లు మద్దతు ధర ఉందని గుర్తుచేశారు. ఇక్కడేమో కేవలం రూ.4 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము ఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ శాతం మామిడి రైతులే ఉన్నారన్నారు. ప్రస్తు తం ఉన్న ధరలకు కూలీలకు కూడా రావని తేల్చిచెప్పారు. కనీస ధర అయినా ఇస్తే రైతులు నష్టాల నుంచి బయటపడుతారని తెలియజేశారు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడం, బూడిద కూడా దొరక్కుండా చేయడం జరుగుతోందని ఆరోపించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జూలై 3 నుంచి 5 వ తేదీ వరకు కుప్పం పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభి వృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రజాసభలు, రైతులతో ముఖా ముఖి, పారిశ్రామికవేత్తలతో చర్చలు, కీలక ఎంఓయూలు ఉండనున్నాయని తెలిపారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను అత్యంత బాధ్యతాయుతంగా, సమయపాలనతో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సభా ప్రాంగణాల వద్ద తాగునీరు, అల్పాహారం, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటితో పాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత, వేదికల నిర్మాణం, మైక్, విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఏకరీతిలో రూపొందించాలని, పారిశ్రామిక ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం పర్యటనకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపా రు. ఈ కాన్ఫరెన్స్లో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మోహన్ కుమార్ పాల్గొన్నారు.


