breaking news
Chittoor District Latest News
-
ఉపాధిని రద్దు చేయొద్దు!
చిత్తూరు కార్పొరేషన్: ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని మౌన దీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసే యోచనలో ఉందన్నారు. ఈ పథకానికి వెచ్చించాల్సిన నిధులను 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నిబంధనలు మార్చాలని చూస్తున్నట్టు తెలిసిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం గొప్పలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా నాయకులు ఓబుల్రాజు, నాయకులు సురేంద్రన్, గిరిధర్ గుప్తా, చిట్టెమ్మ, ప్రసాద్, ప్రతాప్ పాల్గొన్నారు. -
అయ్యో..తులసీ
నగరి : నగరి మండలంలోని ఎం.కొత్తూరు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విలేజ్ సర్వేయర్ టీ.తులసీరామ్ (29) మృతిచెందాడు. పోలీసులు తెలి పిన సమాచారం మేరకు.. విజయపురం మండలం, కాళికాపురం సచివాలయలో విలేజ్ సర్వేయర్గా తులసీరామ్ విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు డీఎస్ఎస్ఎల్ఆర్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడానికి నగరికి స్కూటర్పై వస్తుండగా దేశమ్మ దేవాలయ సమీపం, ఎం.కొత్తూరు మార్గంలో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన తులసీరామ్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నగరి మున్సిపాలిటీ నగరిపేటకు చెందిన ఇతను ఇటీవల గుడుపల్లి మండలం, చీకటిపల్లికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం డిప్యూటేషన్పై కాళికాపురం సచివాలయంలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందాడు. మృతినికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. నిత్యం సర్వేలు, కాన్ఫరెన్స్లు ఇటీవల బాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు నిత్యం ఏదో ఒక సర్వే, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తోంది. వారు కుదురుగా సచివాల యాల్లో ఉండడమే లేదు. ఇలా తిరగడమే నేడు ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
దాచి పెట్టి దోపిడీ!
సాక్షి టాస్క్ఫోర్స్: ఇసుక దోపిడీలో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. అక్రమంగా తవ్వకాలు చేసి తెల్లబంగారాన్ని దోచేస్తున్నారు. వంకలో తవ్వకాలు చేసి... ఆపై డప్ చేసి రహదారి కోసమంటూ టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడ టిప్పర్ ఇసుక లక్షలకు విక్రయి స్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్టవేసేందుకు అధికార పార్టీ నాయకులే సిద్ధమవ్వడం గమనార్హం. చిత్తూరు మండలం, ముత్తుకూరు రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ తవ్వకాలు చేసి ముత్తుకూరు– తచ్చూరు జాతీ య రహదారి కూడలి సమీపంలో డంప్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ డంప్ను ప్రా రంభించారు. రీచ్ నుంచి డంప్కు రోజుకకు 80 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుక చేరుతోంది. డంప్ నుంచి జేసీబీల ద్వారా టిప్పర్లకు లోడ్ చేస్తున్నారు. రహదారి పేరుతో తరలింపు డంప్ నుంచి గుడిపాల మండలంలో జరిగే రోడ్డుకని తెల్లబంగారాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. అయితే గుడిపాల మీదుగా తమిళనాడుకు పట్టుకెళుతున్నారు. తమిళనాడులో డిమాండ్ ఉండడంతో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పొన్నై, తిరుత్తణి, చైన్నె, సోలింగరం తదితర ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అడిగే దమ్ముందా? ఈ ఇసుక అక్రమ వ్యాపారాన్ని ముత్తుకూరుకు చెందిన ఓ నేత, గుడిపాలకు చెందిన మరో నేత కలిసి చేస్తున్నారు. ముత్తుకూరుకు చెందిన ఆ నేతే రీచ్ నుంచి డంప్ ప్రాంతానికి ట్రాక్టర్ల ద్వారా చేర్చడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడుకు తరలించే ప్రక్రియ మొత్తం గుడిపాలకు చెందిన నేత చూసుకుంటున్నాడు. ఈ విషయం మండలంలోని పలువురు నేతలకు తెలియడంతో వారు తిరుగుబావుటా ఎగురవేశారు. గుడిపాలలో ఉండే వ్యక్తులు మా అడ్డాలో అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అధికారులు అడ్డుకునే దమ్ము లేకుంటే అధినేతకు ఫిర్యాదు చేస్తామని టీడీపీలోని ఓ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. -
ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవద్దు
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడి తేవద్దని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛగా బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీమ్ పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ సెలవు రోజులైన ఆదివారం, రెండో శనివారం, పండుగ రోజుల్లో పనిచేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అనంతరం డీఈవో రాజేంద్రప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. -
ఆన్లైన్లో తుది మెరిట్లిస్టు జాబితా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి వెల్లడించారు. సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘గుట్టుగా మెరిట్ లిస్టు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆమె ప్రొవిజనల్ మెరిట్ లిస్టును తోసిపుచ్చి.. తుది మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెట్టిన విషయా న్ని బహిర్గతం చేశారు. ఇక ఏయే పోస్టులను భర్తీ చేస్తున్నారో వెల్లడించారు. స్టాఫ్నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, సపోర్టింగ్ స్టాఫ్, లాస్ట్గ్రేడ్ సర్వీసు పోస్టులను మాత్రమే భర్తీ చేయనన్నట్లు ప్రకటించారు. మిగిలిన పోస్టులు వాయిదా పడ్డాయన్నారు. కాగా తుది మెరిట్లిస్టునుwww.chittoor.ap.gov.in అనే సైట్లో ఈనెల 22వ తేదీ వరకు చూసుకోవచ్చని వెల్లడించారు. టెట్కు 130 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 130 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 542 మందికి గాను 456 మంది, మధ్యాహ్నం 541 మందికిగాను 497 మంది హాజరయ్యారని చెప్పారు. టెట్ ఐదు కేంద్రాల్లో జరిగిందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం, తిరుమణ్యం రెవెన్యూ అటవీ ప్రాంతంలో క్రూర మృగాల కదలికలను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి వి.సాయిబాబా తెలిపారు. ఈ నెల 16వ తేదీన తిరుమణ్యం అటవీ ప్రాంతంలో చిరుత మేకలను చంపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చిరుత దాడిలో మేకలు చనిపోలేదని స్పష్టం చేశారు. చిరుత ఒకదాని మీదనే దాడి చేసి, నోటితో కరచి తీసుకెళ్లిపోతుందని వివరించారు. ఈనెల 16న నాలుగు మేకలు మృతి చెందడానికి అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) కారణమై ఉంటాయన్నారు. ఏది ఏమైనా గ్రామస్తుల సంరక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజర్ బీ.సుదర్శన్రెడ్డి, ఎఫ్ఎస్ఓ వై.శంకరప్ప, ఎఫ్బీఓ ఎం.మునినాయక్, ఎంపీటీసీ రవి ఉన్నారు. నేడు హైకోర్టు న్యాయమూర్తి సమీక్ష చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య శనివారం చిత్తూరుకు రానున్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో పూర్వపు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 నుంచి సమావేశం ప్రారంభం కానుంది. -
కొడితే సిక్సే!
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో క్రికెట్, షటిల్ ఇతర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్కుమార్ ఉద్యోగులతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం ఉద్యోగులకు క్విజ్ పోటీలు జరిగాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు నిర్వహించారు. డీఆర్వో మోహన్కుమార్ పోటీలను పర్యవేక్షించారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, పలమనేరు ఆర్డీవో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ బ్యాటింగ్ చేస్తున్న కలెక్టర్క్విజ్ పోటీలు -
దీన్ని ఏమందురు?
నకిలీ మద్యంపై తనిఖీలు సరే.. లీకేజీలకు కారణం? చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో లభిస్తున్న మద్యం బాటిళ్లలో.. కొన్ని లీకేజీలు అవుతున్నాయి. ఇవి కల్తీ మద్యమా..? ఒక కంపెనీ మద్యానికి బదులుగా మరో కంపెనీ మద్యం ఏదైనా మిక్డ్స్ చేస్తున్నారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. చిత్తూరులో ఇలా.. ఇటీవల చిత్తూరు నగరంలోని తిరుపతి రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో మద్యం తీసుకున్న వ్యక్తి, బాటి ల్ మూత నుంచి మద్యం లీకేజీ అవుతుండడాన్ని గమచించారు. ఇదేమిటని దుకాణ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే లీకేజీ అవుతున్న బాటిల్ తీసుకుని, మరో బాటిల్ ఇచ్చి పంపిచేశాడు. కానీ బాటిల్ మూత లీకేజీ అవుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్యాంపిల్స్ తీస్తున్న ఎకై ్సజ్ పోలీసులు ల్యాబ్కు వీటిని పంపిస్తే ఇందులో ఏదైనా కల్తీ జరిగిందా..? రసాయనాలు ఉండాల్సిన పరిమాణంకంటే ఎక్కువగా ఉన్నాయా..? అనే రిపోర్టు వస్తుంది తప్ప.. రూ.300 విలువ చేసే మద్యంలో చీప్లిక్కర్ కలిపారా..? అనే నివేదిక రాదు. దీన్ని అలుసుగా చేసుకుని కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్ల మూతలను చాకచక్యంగా తొలగించి, అందులో తక్కువ ధర ఉన్న మద్యాన్ని కలుపుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో బాటిళ్లను పరీక్షించకుండా, దుకాణ నిర్వాహకులు ఇచ్చే నెలవారి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తనిఖీలు నామమాత్రం అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో గతేడాది అక్టోబర్లో 104 ప్రైవేటు మద్యం దుకాణాలను బాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక కల్లుగీత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు మరో పది దుకాణాలను కేటాయించింది. జిల్లాలో నెలకు సగటున రూ.33 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతీ నెలా ఆయా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లలోని అధికారులు దుకాణాలు తనిఖీలు చేసి, అక్కడ ఉన్న ఏదో ఒక మద్యాన్ని తీసుకుని, వాటి నాణ్యత పరీక్షించడానికి ల్యాబ్కు పంపడం వారి విధినిర్వహణలో భాగంగా జరుగుతోంది. కానీ ఎకై ్సజ్ అధికారులు శ్యాంపిల్స్ సేకరించే ప్రక్రియ ఓ యాంత్రికంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా రూ.99 మద్యం తీసుకుని.. రూ.300 ధర ఉన్న బాటిళ్లల్లో పోసి, విక్రయిస్తున్నారని పలువురు మద్యం ప్రియులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
న్యాయ విభాగంలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వైఎస్సార్సీపీ న్యాయ విభాగం కమి టీలో నియమాకాలు చేపడుతూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. జిల్లా అధ్యక్షుడిగా సూర్యప్రతాప్(చిత్తూరు), ఉపాధ్యక్షుడిగా మల్లికార్జునరెడ్డి(పుంగనూరు), విజయకృష్ణారెడ్డి(చిత్తూరు), సురేష్రెడ్డి(జీడీనెల్లూరు), ప్రధాన కార్యదర్శులుగా సఫివుల్లా (చిత్తూరు), హరిబాబు(జీడీనెల్లూరు), ప్రకాష్రెడ్డి(పూతలపట్టు), చంద్రప్ప(కుప్పం), ఉదయభాను(నగరి), మోహన్రెడ్డి(పలమనేరు), హరినాథరెడ్డి(పుంగనూరు), కార్యదర్శులుగా స్టీఫెన్, వాసుదేవరెడ్డి(జీడీనెల్లూరు), మోహన్, ప్రసాద్రెడ్డి (పూతలపట్టు), హరికృష్ణ(కుప్పం), మురళీరాజు(నగరి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్రెడ్డి(పలమనేరు), ప్రకాష్, అంజిబాబు (పుంగనూరు)లతో పాటు 12 మంది ఈసీ మెంబర్లను నియమించారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
సాక్షి టాస్క్ఫోర్స్ : బంగారుపాళెం మండలం మట్టి అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మట్టి మాఫి యా మండలంలోని కొండలు, గుట్టలను తవ్వేసి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా మొగిలివెంకటగిరి రెవెన్యూ, పాలేరు జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గుట్టను 20 రోజుల నుంచి జేసీబీతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులేవీ..? మట్టిని తవ్వడానికి మైనింగ్ అనుమతులు తప్పనిసరి. అక్రమార్కులు అధికార పార్టీ నాయకుల అండతో అనుమతులు లేకుండానే మట్టిని తవ్వుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని మట్టి అక్రమ రవాణా గురించి పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మట్టిని టిప్పర్ల ద్వారా బంగారుపాళెం మీదుగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో దుమ్ము, ధూళి కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్టు దుకాణదారులు, ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము వెదజల్లుతోందని చెబుతున్నారు. -
ఆ టీడీపీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలి
చిత్తూరు అర్బన్: దర్యాప్తులో ఉన్న కేసు నుంచి తన పేరు తొలగించాలని బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరుకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు శోభారాణి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చిత్తూరుకు చెందిన టీడీపీ మహిళా కార్పొరేటర్ (న్యాయవాది కూడా) గురువారం రాత్రి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం, తన చావుకు డీఎస్పీ, సీఐలతో పాటు శోభారాణి కూడా కారణమని చెప్పడం తెలిసిందే. దీనిపై శోభారాణి స్పందిస్తూ తన సోదరుడి ఆత్మహత్య కేసులో ఆ కార్పొరేటర్ను నిందితులిరాలిగా చేరిస్తే, తన పేరు తొలగించాలని దర్యాప్తు అధికారులను బెదిరించడం కేసును పక్కదారి పట్టించడమే అవుతుందని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ పోలీసులను బెదిరిస్తే కేసు ఎందుకు నమోదుచేయరని ప్రశ్నించారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల్లోకి మరోలా సంకేతం వెళుతుందని తెలిపారు. ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కుప్పం విద్యార్థి కుప్పంరూరల్: కుప్పం డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్లో తృతీయ సంవత్సరం చదువుతున్న పి.రేవంత్ సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎస్వీ యూనివర్సిటీ తరుఫున ఎంపికై నట్లు కళాశాల చైర్పర్సన్ శాంతానాగరాజు చెప్పారు. తిరుపతిలో జరిగిన కాలేజీ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, డిసెంబర్ 25న చైన్నెలో జరిగే పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పి.రేవంత్ను శుక్రవారం కళాశాల అధ్యాపకులు అభినందించారు. -
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
వెదురుకుప్పం: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని పోక్సో చట్టం కింద శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్ కథనం మేరకు.. వెదురుకుప్ప మండలం, ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన ఓ బాలిక(14) ఆగస్టు 24వ తేదీ 11 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన శంకరయ్య కుమారుడు డి.మురళి (49) బాలిక ఇంటికి వెళ్లాడు. ఆపై బాలికను బెడ్ రూమ్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడి బాలిక ఎవ్వరికీ చెప్పలేదు. అయితే అప్పుడప్పుడూ బాలికకు కడుపునొప్పి వచ్చేది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గురువారం తల్లిదండ్రులు బాలికను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించడంతో 22 వారాల గర్భం ఉన్నట్టు తేలింది. అవాకై ్కన బాలిక తల్లిదండ్రులు వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం తన కుమార్తైపె లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మురళిపై వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా శుక్రవారం సాయంత్రం దేవళంపేట వద్ద పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు 2012లో ఓ కేసులో నేరస్తుడని తెలిపారు. డీఎస్పీ వెంట కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐ నవీన్బాబు ఉన్నారు. -
వైద్యం @ 22!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కోచోట నిత్యం 70 నుంచి 150కి పైగా ఓపీలు నమోదవుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో రావడం లేదు. ఇద్దరు డాక్టర్లులుంటే.. ఒకరు 104 సేవలు చూసుకోవాలి. మకొకరు...ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలి. కానీ ముఖ హాజరు వేసుకుని సర్వేలు, క్షేత్ర తనిఖీల పేరుతో బయటకు వెళ్తున్నారు. సొంత క్లినిక్లో కూర్చుని జేబులు నింపుకుంటున్నారు. లేకుంటే యూనియన్ల పేరుతో దర్జాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. డెప్యూటేషన్ అంటూ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. దీంతో పలు పీహెచ్సీలు ఖాళీగా బోసిపోతున్నాయి. ఈ విషయాలు తెలిసినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇటీవల చిత్తూరు నగరంలోని చవటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయగా వైద్యులు 10 గంటలు దాటినా రాలేదు. విచారిస్తే ఆ డాక్టర్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ జూనియర్ అధికారి బంధువని తెలిసింది. ఇటీవల ఎంపీ శ్రీరంగరాజుపురం పీహెచ్సీని తనిఖీ చేస్తే డాక్టరు విధుల్లో లేరని గుర్తించి.. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి పూట ఉండరే? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాత్రి పూట కూడా పనిచేసేలా ఆదేశాలున్నాయి. స్టాఫ్ నర్సులు డ్యూటీలో ఉండాలనే నిబంధన ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాత్రి పూట వైద్య సేవలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ప్రసవాలను స్థానికంగానే చేయాలనే లక్ష్యంతో నిర్దేశించింది. కానీ ఆ దిశగా పీహెచ్సీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. పడకేసిన ప్రాథమిక వైద్యం వైద్యానికి డబ్బులా? బాబు ప్రభుత్వం వచ్చాక వైద్య సేవలు తూతూమంత్రంగా మారాయి. పలు కేంద్రాల్లో ఆరోగ్య సేవలకు కాసులు గుంజుకుంటున్నారు. సూది వేస్తే రూ.50, కట్టుకడితే రూ.50 నుంచి రూ.100, సైలెన్బాటిల్ పెడితే రూ.100 నుంచి రూ.200, ల్యాబ్ టెస్ట్కు రూ.100 నుంచి రూ.300 వరకు గుంజుతున్నట్టు సర్వేలో తేలింది. అలాగే ఇక్కడ పలు టెస్టులు చేయాలేమని.. బయట చేసుకోవాలని, దీనికి రూ.600 అవుతుందని చెప్పి వసూలు చేస్తున్నట్లు సర్వేలో పలువురు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అందిన సేవలకు డబ్బులు అడిగారని సర్వే చేయగా.. 83,160 మంది స్పందించారు. ఇందులో 31,325 మంది(37.67శాతం) డబ్బులు అడిగారని సమాధానమిచ్చారు. ఈ లోపాలతో జిల్లా 22 స్థానంలో నిలిచింది. మొత్తం మీద వైద్య సేవలపై 61.7 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తే.. 38.3 శాతం మంది అసంతృప్తిని వ్యక్తపరిచారు. వీటన్నింటికీ ప్రధాన కారణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణాలోపమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. మందులు, మాత్రలు ఏవీ? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు కూడా లేవని గుర్తించింది. చాలా వరకు బయట రాసిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ లోపాలను 30,651 మంది(37.82శాతం) వెల్లడించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పూర్తిగా లోపిస్తోంది. ఈ విషయాన్ని 34,724 (42.65 శాతం) మంది గుచ్చి చెప్పారు. -
పేదల దేవుడు వైఎస్ జగన్
వెదురుకుప్పం : చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల తలరాతలను మార్చిన దేవుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి ప్రజల అభున్నతికి బాటలు వేశారని కొనియాడారు. నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనారిటీ అంటూ బడుగులను అక్కున చేర్చుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్ అని వెల్లడించారు. సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండాలన్న సంకల్పంతో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందించి, పాలనలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఏకంగా 31 లక్షల మంది పేదలకు స్థలంతోపాటు ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏ పథకమైనా పేదల సంక్షేమమే ప్రామాణికంగా తీసుకుని అమలు చేసినట్లు వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగు పరచి పేదల గుండెల్లో కొలువుదీరారని చెప్పారు. జగన్ పుట్టినరోజును ప్రతి పేదవాడి ఇంట్లో పండుగగా భావిస్తున్నారని తెలిపారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గవ్యాప్తంగా జననేత జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంతో కూటమిలో వణుకు మొదలైనట్లు తెలిపారు. -
ఐదుగురి అరెస్ట్
బంగారుపాళెం: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శుక్రవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కాటప్పగారిపల్లె వద్ద అక్టోబర్ 15న జాతీయ రహదారిపై కారు (కేఏ05 ఎండీ4456)వేగంగా వెళ్తు డివైడర్ను ఢీకొని రైట్ సైడ్లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారునిపైకి దూసుకెళ్లింది. ఆపై రహదరి పక్కన కాలువళక్ష బోల్తాపడింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్, కారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. కారును పరిశీలించగా అందులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో చిత్తూరు గ్రీమ్స్పేటకు చెందిన రాజశేఖర్(33), నవీన్(34), రాకేష్(30), పునీత్కుమార్(24), ముఖేష్(22)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. చిత్తూరు టౌన్కు చెందిన ఆరీఫ్, కర్ణాటక రాష్ట్రం కటికినహళ్లికి చెందిన సయ్యద్ఫైరోజ్, తిరువణ్ణామలై జిల్లా జమునముత్తూరుకు చెందిన అజిత్, గోవింద్ను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు రాజుపల్లె విద్యార్థి పెద్దపంజాణి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అండర్–14 విభాగంలో మండలంలోని రాజుపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.చరణ్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు జనార్ధనరెడ్డి తెలిపారు. శుక్రవారం విద్యార్థికి అభినందనలు తెలిపారు. పీడీ దొరై పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పచ్చికాపల్లం విద్యార్థులు వెదురుకుప్పం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు హిమజ, పూజిత, హేమంత్, మోక్షిత్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ దామోదరం, పాఠశాల కమిటీ చైర్మన్ చెంగల్రాయులు, పీడీ చెన్నకేశవులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: పురోగమిస్తున్న విజ్ఞానశాస్త్ర అభివృద్దిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజానికి అవసరమైన కొత్త ఆవిష్కరణలు తయారుచేసే విధంగా ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎంపికై న వారు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. చుడా చైర్పర్సన్ హేమలతో, జిల్లా సైన్స్ అధికారి అరుణ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి తొమ్మిది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. -
విద్యుత్ షాక్తో ఆవు మృతి
చౌడేపల్లె: విధ్యుతాఘాతానికి గురై ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రైతు మోహన్నాయుడు తన ఆవును మేత కోసం గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి తోలుకెళ్లాడు. అక్కడ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన కొయ్యలు విరిగి కింద పడడంతో ఆ వైర్లు తగిలి షాక్కు గురై ఆవు మృతిచెందింది. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..! బంగారుపాళెం: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. సీఐ శ్రీనివాసులు కథనం.. తిరుపతి జిల్లా, బైరాగిపట్టెడకు చెందిన వడ్డె రాజరాజు సమీప బంధువు వి కోటలో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం నాగరాజు అతని అన్నకుమారుడు మణికంఠతో కలసి ద్విచక్ర వాహనం(స్కూటీ)పై వెళ్లారు. ఆపై అంత్యక్రియలు ముగి సిన తరువాత స్కూటీపై తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో మండలంలోని నలగాంపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున నాగరాజు(55) నిద్రమత్తులో కింద పడ్డాడు. తలకు బ లమైన గాయం తగలడంతో మృతి చెందాడు. చలి మంటలో పడిన వృద్ధుడి మృతి రొంపిచెర్ల: చలిమంటలో పడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని బండ మీదపల్లెకు చెందిన మునిశేఖర్ (64) ఈ నెల 2వ తేదీన మద్యం సేవించి వీధిలో వేసిన చలి మంటలో చలి కాచుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మూడు దుకాణాల్లో చోరీ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మూడు దుకాణాల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. కట్టమంచిలోని ఓ ద్విచక్ర వాహన షోరూమ్, సూపర్ మార్కెట్, సిమెంటు దుకాణాల్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. దాదాపు రూ.50 వేల వరకు నగదు చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తప్పుడు సాక్ష్యంపై విచారణ చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్యల కేసులో న్యాయ స్థానంలో తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసు విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తూ చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు – ప్రత్యేక మహిళా కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. కేసు విచారణలో భాగంగా తప్పుడు సాక్ష్యం చెప్పిన ఘటనలో 14 మంది శుక్రవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. వీళ్లల్లో ఏడుగురు రాత పూర్వక సంజాయిషీని న్యాయమూర్తికి అందించారు. మరో ఏడుగురు కొంత సమయం అడగడంతో వచ్చే నెల 2వ తేదీ వరకు సమయమిస్తూ, అదే రోజు కేసు విచారణ చేయనున్నట్లు ప్రకటించారు. సాఫ్ట్బాల్ పోటీలకు ప్రకాష్ ఐరాల: జాతీయస్థాయి సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ పోటీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రకాష్ ఎంపికై నట్లు హెచ్ఎం వాసుదేవన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రకాష్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు వెల్లడించారు. పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉంది. దీనిపై ఈ నెల 16న పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా స్కూటరిస్ట్ అడ్రస్ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురూ స్కూటర్ వద్ద దొరికిన ఆధార్కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్ షాపులో హెల్పర్గా పనిచేసేవాడు. ఈ నెల 15 రాత్రి వెల్డింగ్ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలు దేరాడు. -
‘సర్వే’శ్వరా?
ఇంటింటికీ వెళ్తూనే ఉండండి చిత్తూరు కలెక్టరేట్ : సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పూటకొక సర్వే పేరుతో ఇంటింటికీ తిప్పుతోంది. తాజాగా మరో కొత్త సర్వేకు శ్రీకారం చుట్టడంపై పలువురు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఈ సర్వేను నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలివ్వడంపై మండిపడుతున్నారు. మూలిగే నక్కపై.. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఒక రకంగా వారిని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పది మంది చేయాల్సిన పనిని ఒకరికి అప్పగించి తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం మోపింది. ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈ నెల 15న సర్వే ప్రారంభించి జనవరి 12కు పూర్తి చేయాలి. సర్వేలో సేకరించాల్సిన సమాచారం వంద శాతం ఈ–కేవైపీ తప్పనిసరి. ప్రతి వ్యక్తి ఆధార్ ద్వారా వెరిఫై చేయాలి మొబైల్ యాప్ సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేయాలి వ్యక్తిగత డేటా, కుటుంబ స్థాయి డేటా సేకరించాలి పేరు, లింగ (జెండర్), పుట్టిన తేదీ, ఆధార్ సేకరణ తప్పనిసరి మొబైల్ నంబరు– ఒక నంబరు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ప్రస్తుత చిరునామాను డాక్యుమెంట్ ఆధారంతో చెక్ చేయాలి నైపుణ్యాలు, వృత్తి, ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్, డాక్యుమెంట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. ఇంటి వివరాలు– నీటి సరఫరా, ఎల్పీజీ, విద్యుత్, టాయ్లెట్, రూఫ్ వంటివాటిని సర్వేయర్ వెరిఫై చేయాలి. ఇంటి యజమాని (హౌజ్హోల్డ్) కలిగి ఉన్న ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ సామగ్రి, పశువులు, తదితర వివరాల నమోదు చేయాలి. జిల్లా సమాచారం -
సమరశంఖమై!
సంతకమే.. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. అన్ని వర్గాలతో పాటు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులే దాదాపు... లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కారుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన కూటమి సర్కార్పై సమరశంకం పూరించారు. వైద్య విద్యను గ్రామీణ, పట్టణ, పేద విద్యా ర్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర చేపన్నుతున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన వెల్లువ పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. అప్పట్లోనే వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు వెచ్చించారు. అందులో మూడు వేల కోట్ల మేర ఖర్చుచేసి ఐదు మెడికల్ కళాశాలను ప్రారంభించారు. వందల సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రారంభమైన కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్నారు. మరో 12 వైద్య కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావొచ్చాయి. అయితే చంద్రబాబు సర్కారు వాటి నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా పీపీపీకి మొగ్గు చూపుతోంది. పీపీపీ విధానంతో ప్రైవేట్కు అప్పగించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విధానాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైద్య సీట్లు వద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడంపై భగ్గుమంటోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని పెదవి విరుస్తోంది. -
గుట్టుగా మెరిట్ లిస్ట్?
కాణిపాకం: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతుల్లేకుండా ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి జిల్లా అధికారులు దరఖాస్తులు ఆహ్వనించారు. ఆపై స్క్రూట్నీ ప్రక్రియ తర్జన భర్జన నడుమ సాగించారు. తీరా కొన్ని పోస్టులకు మాత్రమే రాష్ట్ర శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ గుట్టుగా జరిపిస్తున్నారు. ప్రొవిజన్ల్ మెరిట్లిస్టు జాబితాను ఆన్లైన్లో గోప్యంగా ఉంచారు. ఫైనల్ మెరిట్ లిస్టును గురువారం రాత్రికి పూర్తి చేశారు. ఆ ఫైల్ను శుక్రవారం కలెక్టర్ ముందు ఉంచనున్నారు. ఈ భర్తీపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఎన్హెచ్ఎం పోస్టులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్టోబర్లో దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్ ఆఫీసర్ 13 పోస్టులు, స్టాఫ్ నర్సు 20 పోస్టులు, ఫైన్సాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ –1, ల్యాబ్ టెక్నీషియన్ –3, ఫిజియోథెరపిస్ట్– 1, ఆడియో మెట్రిషియన్– 2, శానిటరీ అటెండర్– 2, సపోర్టింగ్ స్టాఫ్– 4, సెక్యూరిటీ గార్డు –2, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్– 8 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గాను మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చాయి. గోప్యమెందుకో? వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నెల రోజులపాటు స్క్రూట్నీ చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు స్క్రూట్నీ ప్రక్రియను ముగించారు. 9వ తేదీ రాత్రి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ఆన్లైన్లో పెట్టారు. అయితే ఆ జాబితాను బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. మీడియా, ఆ శాఖలోని పలువురు అధికారులకు కూడా తెలియకుండా ప్రొవిజనల్ మెరిట్లిస్టును నడిపించారు. ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరణ చేయగా.. 18వ తేదీ రాత్రికి ఫైనల్ మెరిట్ లిస్టు సిద్ధం చేశారు. శుక్రవారం ఈ ఫైల్ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రొవిజన్ మెరిట్ లిస్టు ఆన్లైన్లో ఉంచిన విషయాన్ని గుర్తించలేకపోయామని పలువురు అభ్యర్థులు మదన పడుతున్నారు. పత్రిక ప్రకటన లేకుండా ఆన్లైన్లో ఎలా ఉంచారని వారు ప్రశ్నిస్తున్నారు. సిఫార్సు లేఖలకు తలొంచారా? ఎన్హెచ్ఎం పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం నుంచి సిఫార్సు లేఖలు 500పైగా సిఫార్సు లేఖలు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లేఖలకు అధికారులు తలొంచారా.. లేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. రెండు జిల్లాల్లో ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిజమైతే పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలున్నాయి.జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అభ్యర్థుల్లో అనుమానాలు పోస్టుల భర్తీ విషయంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్ర శాఖ అనుమతి తీసుకోలేదు. దరఖాస్తులు ఆహ్వానించిన విషయం పై అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఆపై ఫైల్ను తీసుకుని విజయవాడకు పరుగులు పెట్టారు. జిల్లా అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. చాలా పోస్టుల భర్తీపై కోతలు పెట్టారు. కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతులిచ్చారు. ఆ పెండింగ్ వివరాలను కూడా శాఖ అధికారులు ఇంతవరకు బయట పెట్టలేదు. కోటి ఆశాలతో దరఖాస్తు చేసుకుంటే.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ఆర్థిక సంఘం నిధులు విడుదల
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాకు రూ.28.52 కోట్లు రాగా 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించారు. జిల్లాలో 696 గ్రామ పంచాయతీలుండగా వాటిలో పలు కారణాలతో 13 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 683 పంచాయతీలకు నిధులను జమచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మొదట ఆన్టైడ్ కింద రూ.11.4 కోట్లు, టైడ్ నిధి కింద రూ.17.11 కోట్లు కలిపి మొత్తం రూ.28.52 కోట్లను విడు దల చేశారు. వీటిని పంచాయతీల్లో విద్యుత్ చార్జీలు, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శ్మశానవాటికల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఆ లెక్చరర్ను సస్పెండ్ చేయండి కార్వేటినగరం: డైట్ కళాఽశాలలో పనిచేస్తున్న ఆ లెక్చరర్ను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. డైట్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సురేష్ కొంతమంది లెక్చరర్లతో గ్రూపులు కట్టి లైంగికంగా వేధిస్తున్నారని, దసరా సెలవులకు ముందు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా మెసేజీలు పెట్టి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్టు ప్రిన్సిపల్కు లిఖిత పూర్వకంగా ఫి ర్యాదు చేశారు. పలు మార్లు తీరు మార్చుకోవా లని ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ప్రిన్సిపల్ వరలక్ష్మి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఆ మేరకు సురేష్ ను డైట్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయా లని ఆదేశించారు. రిలీవ్ చేసి సస్పెండ్ చేయా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డొంక కదులుతోంది! – అవినీతి కేసులో సర్వేయర్, వీఆర్ఓ పుంగనూరు: స్థానిక గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములు రూ.20 వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో తాజాగా మండల సర్వేయర్తో పాటు ఆ గ్రామ వీఆర్ఓపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. రెండవ రోజు కూడా ఏసీబీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. మండల సర్వేయర్, వీఆర్ఓను విచారణకు రావాలని ఆదేశించగా.. వారు రాకపోవడంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్, సర్వేయర్ ఇద్దరూ సెలవులో వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలను సరికొత్త సంస్కరణలతో నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని ఇంటర్ బోర్డు ఈఆర్టీడబ్ల్యూ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణుక్యుడు తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలను కొత్త సంస్కరణలతో నిర్వహించనుందన్నారు. గురువారం అధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్తో స్థానిక విజయం ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రామాణిక విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇన్విజలేటర్లు, పర్యవేక్షక సిబ్బంది, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. డీఐఈఓ రఘుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, పారదర్శకంగా పరీక్షలు రాసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక ఐరాల: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలని ఆర్జేడీ శ్యామూల్ ఆదేశించారు. గురువారం మండలంలోని ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూల్ను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యస సామర్థ్యాలపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వంద రోజల ప్రణాళికతో పాటు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నపత్రాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతి రోజూ ఓ పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించాలని, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించాలని ఆదేశించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం వైస్.గేటులోని ప్రాథమిక పాఠశాలకు కేంద్ర విద్యాశాఖ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) రావడంతో పాఠశాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈఓ–2 భానుప్రసాద్, ఏసీఎంఓ మధుసూదన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని వినియోగించుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్: వినియోగదారులు హక్కు ల పరిరక్షణ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. గురువారం నగరంలోని ఎన్పీఎస్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర, పరిష్కారం’ అంశంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ నష్టం జరిగినప్పుడు నేరుగా వినియోగదారుడే రూ.5లక్షల వరకు ఫీజు లేకుండా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చనన్నారు. నాణ్యత ప్రమాణాలులేని వస్తువులు, సేవా సంస్థల లోపంతో నష్టం వాటిలినప్పుడు ప్రశ్నించేతత్వం ఉండాలని ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఉషాదేవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019 విశిష్టమైందన్నారు. ఆన్లైన్ వ్యాపారంలో కూడా నష్టం జరుగుతోందని, వాటి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, కళాశాల వినియోగదారుల క్లబ్ కో–ఆర్డినేటర్ రమాదేవి, ఫోరం సభ్యుడు సలీం పాల్గొన్నారు. -
అవగాహన లోపం.. ప్రజలకు కన్నీటి శాపం!
నక్కబండలో తాగునీటికి కటకట పుంగనూరు: అధికారుల అలసత్వం కారణంగా పది రోజులుగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సి వస్తోంది. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని నక్కబండ ఏరియాలో 1,550 కుటుంబాలున్నాయి. ఇక్కడ పైపులైన్ల మరమ్మతుల పేరుతో పబ్లిక్ కొళాయిలను పెరికేశారు. డబ్బు కడితేనే కొళాయిలు వేస్తామంటూ మున్సిపల్ అధికారులు, కొంత మంది చోటీ టీడీపీ తెగేసి చెబుతున్నారు. దీంతో స్థానికులు పది రోజులుగా సరిపడా నీళ్లులేక అల్లాడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంతమాత్రం ఆలోచించలేరా? మండల పరిధిలోని నక్కబండను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి చేర్పించారు. 1,550 కుటుంబాలు కలిగిన నక్కబండలో ముస్లిం మైనార్టీలు, దళితులు అధి క సంఖ్యలో నివాసం ఉన్నారు. ఆ ప్రాంతంలో మంచినీటి సర ఫరా ఇబ్బందిగా ఉందంటూ ప్రజలు పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం నక్కబండలోని అన్ని పైపులైన్లను జేసీబీలతో తొలగించారు. కొత్త పైపులైన్లు వేసే కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలేదు. అన్ని వీధుల్లోని పైపులైన్లు, పబ్లిక్ కొళాయిలు పెరికివేశారు. దీంతో నీటి సమస్య తలెత్తింది. డబ్బు కడితేనే కనెక్షన్ మున్సిపల్ అధికారులు కొళాయి కనెక్షన్కు ఒక్కొక్కరూ రూ.7,500 చెల్లించాలని, లేకపోతే మంచినీటి సరఫరా చేయలేమని తెగేసి చెప్పారు. తాము కూలీలమని, బీపీఎల్ పథకం కింద రూ.500 చెల్లిస్తామని చెప్పినా అధికారులకు మనసు కరగలేదు. దీని కారణంగా పది రోజులుగా ఆ ప్రాంతంలో మంచినీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ అభిమానులకు ఇబ్బందులు నక్కబండ ప్రాంతంలో ముస్లిం, మైనారిటీలు, దళితుల్లో ఎక్కువభాగం వైఎస్సార్సీపీ అభిమానులే. మున్సిపల్ అధికారులు కావాలనే నక్కబండ వాసులను వేధిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పబ్లిక్ కొళాయిలను కూడా పెరికివేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం, ఆ ప్రాంత వాసుల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. టీడీపీ చోటా నేతల దంద నక్కబండ ప్రాంతంలో ఓ టీడీపీ చోటా నాయకుడు దంద చేస్తున్నాడని, ఇద్దరు ఫిట్టర్లను నియమించి, వారి వద్ద నుంచి ఇంటికి రూ.100 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ చర్చలు నక్కబండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఏర్పడడంతో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా గురువారం కమిషనర్ మధుసూదన్రెడ్డితో పాటు ఆ ప్రాంత వాసులతో సమావేశమయ్యారు. అక్కడ ఉన్న పేదకూలీలందరికీ రూ.500తో కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ అధికారుల ఓవర్ యాక్షన్ కారణంగా వందలాది కుటుంబాలకు తాగునీటి సమస్య ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. -
విధులకెళ్లి.. విగత జీవివయ్యావా తల్లీ!
పూతలపట్టు( యాదమరి): ‘పండు..డ్యూటీకి వెళ్తున్నా.. రేపు ఇంటికి రాగానే చిత్తూరులో షాపింగ్కు వెళ్దాం. అక్కడ నీకేమి కావాలో తీసిస్తా..’ అని చెప్పి విధులకు వెళ్లావు కదమ్మా.. ఇప్పుడు విగత జీవిగా మారావా తల్లీ అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు .. పెనుమూరు మండలం, గుత్తావాండ్ల వూరు గ్రామానికి చెందిన వెంకటేష్నాయుడు భార్య గాయత్రి(30) పూతలపట్టు మండలం, పేటమిట్టలో ఓ కర్మాగారంలో విధులు నిర్వర్తిస్తోంది. బుధవారం యథావిధిగా విధులకు హాజరైంది. రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తన సహచర ఉద్యోగినులతో పాటు స్వగ్రామానికి బయల్దేరింది. రంగంపేట క్రాస్ వద్ద పీలేరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐషర్ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న గాయత్రితో పాటు.. మౌనిక, జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు గాయత్రి మార్గమధ్యంలో మృతి చెందింది. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూతలపట్టు సీఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. కుటుంబ పోషణ కోసం విధులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా.. అమ్మా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బెల్టుషాప్పై దాడి
శ్రీరంగరాజుపురం: మండలంలోని కొత్తపల్లిమిట్ట ప్రాంతంలో ఉన్న బెల్టుషాపుపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 42 మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. బెల్టుషాపు నిర్వహిస్తున్న భారతి అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. విద్యుద్దీపాల కోసం రూ.8 లక్షలు గుడిపాల: చిత్తూరు–వేలూరు రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు నుంచి తమిళనాడు సరిహద్దు గొల్లమడుగు వరకు రోడ్డు పక్కన విద్యుత్ దీపాలు వేయడానికి కలెక్టర్ రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్బాబు తెలిపారు. గురువారం ఆ రహదారిని ఆయన పంచాయతీరాజ్ ఈఈతో చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.8 లక్షలు మంజూరు చేశారన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 50 వీధిలైట్లు అవసరమవుతాయన్నారు. పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్నాయుడు, ఎంపీడీఓ శిరీషా తదితరులు పాల్గొన్నారు. -
● కూలుస్తూ..తొలగిస్తూ!
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముందస్తు నోటీసులు ఇచ్చిన విగ్రహాలు, ఆలయాలతో పాటు పలు కట్టడాల తొలగింపును గురువారం నుంచి అధికారులు ప్రారంభించారు. తహసీల్దార్ రవికుమార్, సీఐ మల్లికార్జున్, జాతీయ రహదారి అధికారులు పోలీసు బలగాలతో ఉదయం నుంచే తొలగింపు పనులు ప్రారంభించారు. నేత్రదేవత ఆలయ ఆర్చి, కాకవేడు కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రహరీగోడ, వీకేఆర్ పురం వద్ద గల ఓంశక్తి ఆలయ ప్రహరీ, నత్తం కండ్రి వద్ద గల శక్తి ఆలయ ప్రహరీలు, బస్ షెల్టర్లను ప్రొకై ్లన్లు, హిటాచీలు, క్రేన్ల సాయంతో తొలగించేశారు. కీళపట్టు వద్ద ఉన్న ఆంజేయ స్వామి ఆలయ తొలగింపులో నిర్వాహకులు ఆలయంలోని వస్తువులు పూర్తిగా తీసుకోలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని, భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలాగే పెకళించి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని తహసీల్దార్కు విన్నవించుకున్నారు. దీంతో వారికి నాలుగు రోజుల సమయం కేటాయించారు. మిగిలిన నిర్మాణాల తొలగింపును జాతీయరహదారి అధికారులు చకచకా కానిచ్చేశారు. – నగరి -
నా ప్రాణం పోయినా.. పది మందీ బతకాలి!
● శ్రీనివాస్రెడ్డి అవయవదానం ● పలువురికి పునర్జన్మ వి.కోట: ‘నా ప్రాణం పోయినా పది మందీ బతకాలి’ అన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్లాడు. అందుకే బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుఒడికి చేరినా.. ఆయన కుటుంబ సభ్యులు తన అడుగు జాడల్లోనే నడిచి పదుగురికి పునర్జన్మనిచ్చారు. వివరాలు.. మండలంలోని కొంగాటం పంచాయతీ, చింతల ఎల్లాగరానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రతాప్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి(61) ఈ నెల 15వ తేదీ రాత్రి బైక్ పై వెళుతూ రాజపేటరోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. బెంగళూరులోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్డెడ్కు గురయ్యాడు. కుటుంబ సభ్యలు గురువారం బెంగళూరుకు చేరుకుని శ్రీనివాసులు రెడ్డికి చెందిన గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు, పాంకియాట్రీస్ను ఇతరులకు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇతని అంత్యక్రియలు శుక్రవారం మండలంలోని చింతఎల్లాగరంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఎందుకు గైర్హాజరవుతున్నారు? చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు దాదాపు వెయ్యి మందికిపైగా క్లాసులకు గైర్హాజరవుతున్నారని, వారు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలని హెచ్ఎంలను డీఈఓ రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదోతరగతి విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించగా సీ, డీ గ్రూపు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు 15,239 మంది ఉండగా 1,477 మంది గైర్హాజరవుతున్నారన్నారు. వీరందరూ ఎందుకు పాఠశాలలకు హాజరు కావడంలేదని సంబంధిత హెచ్ఎంలను ప్రశ్నించామన్నారు. వీరిలో ఎక్కువగా తవణంపల్లె, పూతలపట్టు, పలమనేరు ఇతర మండలాల వారు ఉన్నారన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకోవాలని ఆదేశించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి పెనుమూరు(కార్వేటినగరం): పదో తరగతిలో వంద శాతం పలితాలు సాధించేలా విద్యాబోధన కొనగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం పెనుమూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, గుడ్యానంపల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు అద్యధిక మార్కులతో వంద శాతం ఫలితాలు సాఽధించేలా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదే విదంగా ఎమ్మార్సీకి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. కొనసాగుతున్న టెట్ చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో టెట్ పరీక్షలు 9వ రోజు కొనగాయి. గురువారం ఉదయం 250 మందికి గాను 242 మంది, మధాహ్నం 85 మందికిగాను 68 మంది హాజరైనట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. -
ప్రజలు క్షమించరు బాబూ!
చిత్తూరు రూరల్(కాణిపాకం): మెడికల్ కళాశాలలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు క్షమించరని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలను రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలంన్నిటినీ నిర్వహిస్తామని మంగళగిరి పాద యాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజారోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని పది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం జీ.వో నెంబర్ 590ని జారీ చేసినట్టు తెలిపారు. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. నాయకులు గోపీనాథ్, మణి, దాసరి, చంద్ర, విజయగౌరీ, రమాదేవి, పెద్దరెడ్డి కవిత, జబిలబి, కుమారి, కోమల, బాలాజీరావు, లతారెడ్డి, గుర్రప్ప, రఘు, మునిరత్నం ఫైరోజ్, ప్రవీణ్కుమార్, వసంత్, రమ్య, చైతన్యశ్రీ, భార్గవ్ పాల్గొన్నారు. -
అవినీతి తిమింగలాలు
పుంగనూరు: పుంగనూరు రెవెన్యూలో అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. 20 సెంట్ల భూమి సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.35 వేలు ఒప్పందం చేసుకుని, రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా గ్రామ సచివాలయ సర్వేయర్ను ఏసీబీ పట్టుకుంది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి కథనం.. మండలంలోని మంగళం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములును అదే గ్రామానికి చెందిన రైతు ఉమాశంకర్ 20 సెంట్ల పొలాన్ని సర్వేచేసి, సర్టిఫికెట్ ఇవ్వమని కోరారు. దీనిపై సర్వేయర్ రూ.50 వేలు ఇస్తే సర్వేచేసి, రెవెన్యూ సర్టిఫికెట్ ఇస్తామని, లేకపోతే చేసేది లేదని తెగేసి చెప్పాడు. అంత డబ్బు ఇవ్వలేనని రైతు ఉమాశంకర్ చెప్పాడు. పలు మార్లు రెవెన్యూ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఎలాగైన రెవెన్యూ అధికారుల అవినీతిని బయటపెట్టాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతు ఉమాశంకర్ సర్వేయర్ వద్దకు వెళ్లి రూ.35 వేలకు బేరం కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు ఉమాశంకర్ తహసీల్దార్ కార్యాలయంలో రూ.20 వేలు సర్వేయర్ శ్రీరాములుకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పలురకాల ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా సర్టిఫికెట్లను జారీచేసే అధికారం తహసీల్దాకు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయ అధికారులు కలసి సర్వేయర్ శ్రీరాములుతో ఈ పని చేయిస్తున్నారా?..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్పేలోనే నేరుగా లంచాలు రైతులను బహిరంగంగా లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలోనే లంచాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఈ మేరకు పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే కోణంలో ఇద్దరు వీఆర్వోలు లంచాలను ఫోన్ పేలో వేసుకోగా కలెక్టర్ వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఏసీబీ దాడుల్లో సర్వేయర్ దొరకడం చర్చనీయాంశమైంది. పుంగనూరులో అవినీతి అనకొండలు పుంగనూరు రెవెన్యుశాఖలో అవినీతి తిమింగలాలు పాతుకుపోయాయి. గత ఏడేళ్ల క్రితం ఆర్ఐగా పనిచేస్తున్న ఉదయ్కుమార్ని ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే తహసీల్దార్ రెడ్డెప్పను కూడా అరెస్ట్ చేశారు. లంచాలు అడిగితే ఫిర్యాదు చేయండి పుంగనూరులోని ప్రభుత్వ అధికారులు ఎవరైన ఏ పనికై నా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి తెలిపారు. ఫిర్యాదు చేసే వ్యక్తుల పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకారం అందిస్తే ఉత్సాహంగా పనిచేసి అవినీతి అధికారుల భరతం పడుతామని తెలిపారు. అవినీతిపై 9440446190, 1064 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్: విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యమని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. బుధవారం నగరంలోని వల్లియప్ప నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థి దశలో సేవాభావంతో పనిచేసే ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వెల్లడించారు. ఎన్ఎస్ఎస్వలంటీర్లు క్రమశిక్షణతో వారం రోజులపాటు స్పెషల్ క్యాంపులో పాల్గొని సేవలందించాలన్నారు. విభిన్న అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్పెషల్ క్యాంపులతో విద్యార్థులల్లో సమైక్యత భావం వస్తుందని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షమ్స్ అక్తర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి పాల్గొన్నారు. పసి పిల్లలపై లైంగిక దాడులు బాధాకరం యాదమరి: పసి పిల్లలపై లైంగిక దాడులు జరుగుతుండటం అత్యంత బాధాకరమని జిల్లా న్యాయ సహకార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు మహిళల చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..ప్రస్తుతం రోజురోజుకూ మహిళలు, బాలికలపై హింస, వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. చదువుకోవాల్సిన వయస్సులో తల్లిదండ్రులు బాల్య వివాహాలు జరిపిస్తున్నారని, దీని కారణంగా వారి ఆరోగ్యంతో పాటు బంగారు భవిష్యత్తును మొగ్గలోనే చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలకు భద్రత కల్పించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరేంద్ర, ఏపీఎం ఈశ్వరి, నాయకులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ఉడిపి మఠం పీఠాధిపతి తిరుమల: తిరుమలలోని శ్రీవారి బుధవారం ఉడిపిలోని సోడే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడీ ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, పోటు పేస్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
తవణంపల్లె : విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ ఆకాక్షించారు. బుధవారం మండలంలోని అరగొండ బాలుర హైస్కూల్లో మండల స్థాయి విజ్ఞాన మేళా ప్రదర్శన ( సెన్స్ ఫెయిర్) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. మండలంలోని ఆరు ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులు తయారు చేసిన సెన్స్ ప్రయోగాలను డీఈఓ రాజేంద్రప్రసాద్, ఎంఈఓలు హేమలత, మోహన్రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సెన్స్ ప్రయోగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఏడు టీములను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎంఈఓ హేమలత తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల సెన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సృజనకు పదునుపెట్టాలి బంగారుపాళెం : సృజనాత్మక ఆలోచన పెంపొందించుకునేందుకు ‘విద్య వైజ్ఞానిక ప్రదర్శన’లు గొప్ప వేదికలని ఎంఈఓ రమేష్బాబు అన్నారు. బుధవారం బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని 14 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 110 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు మేళాలో పాల్గొన్నారు. విద్యార్థుల విభాగంలో తుంబకుప్పం, కీరమంద, గుండ్లకట్టమంచి, మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనలతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తుంబకుప్పం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజేంద్రన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
వెదురుకుప్పం: మండలంలోని పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్లో అండర్–14 జిల్లా స్థాయి బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ దామోదరం తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. కాగా బాలిక విభాగం నుంచి ఢిల్లీకళ్యాణి, దీపిక(నాగరాజకుప్పం), హిమజ, పూజిత(పచ్చికాపల్లం), జనని(తిరుమలయ్యపల్లె), జూలీ(జంబాడ), లక్ష్మీప్రియ( శ్రీకాళహస్తి), తేజస్విని(మంగళంట్రెండ్స్), రకియెకసూర్(మదనపల్లె), హేమ(మునగలపాళెం), బాలుర విభాగంలో... లక్ష్మీనరసింహారెడ్డి(నగరి), దిలీప్ (శ్రీకాళహస్తి), వెంకట్, మహేష్ (జంబాడ), పార్థీవ్ (శ్రీకాహస్తి), నితీన్ (జంబాడ), చరణ్(నాగరాజుకుప్పం), భరత్(శ్రీకాళహస్తి), హేమంత్(పచ్చికాపల్లం), అయాన్(బైరెడ్డిపల్లె) ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు త్వరలో జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎంపిక పోటీలు చెన్నకేశవులు, అన్సర్ బాషా, గోపి, లోకేష్, త్రిలోకసుందరి, జయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న విద్యార్థులకు ఎంఈఓ దామోదరం, ప్రధానోపాధ్యాయులు అశోక్ అభినందనలు తెలియజేశారు. -
బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
కుప్పం రూరల్: జేఎన్టీయూ విశ్వవిద్యాలయం స్థాయి పోటీలకు బ్యాడ్మింటన్ జట్లను బుధవారం ఎంపిక చేసినట్లు బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు చెప్పారు. వర్సిటీ పరిధిలోని 22 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 92 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు పేర్కొనానరు. పురుషుల జట్టు కింద ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు, ఐదుగురుని స్టాండ్బైగా ఎంపిక చేసినట్లు చెప్పారు. మహిళా విభాగంలో ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు, నలుగురుని స్టాండ్ బైగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సెలెక్షన్లలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాల నుంచి ముగ్గురు ఎంపికై నట్టు పేర్కొన్నారు. ఎంపికై న ఆటగాళ్లు వచ్చే వారం జరిగే వర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వర్సిటీ పరిశీలకులు టి.నారాయాణరెడ్డి, వైస్ చైర్మన్ డా.సునీల్రాజ్, ప్రిన్సిపల్ సుధాకర్బాబు, ఫిజికల్ డైరెక్టర్ సతీష్కుమార్ పాల్గొన్నారు. -
పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం
పుంగనూరు: మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంపై బుధవారం మండలంలోని వనమలదిన్నె సచివాలయంలో రైతులకు ఏఎస్ఓ అరుణ శిక్షణ ఇచ్చారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మించుకునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మల్బరీ సాగుతో సంవత్సరానికి రూ.3 లక్షలు ఆదాయం పొందవచ్చనని ఆమె పేర్కొన్నారు. రైతుల సందేహాలను ఆమె నివృత్తి చేశారు. కార్యక్రమంలో టీఏ నవీన్బాబు పాల్గొన్నారు. గుడుపల్లెలో.. గుడుపల్లె: రైతులు మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం పెంచుకోవచ్చని కుప్పం సెరికల్చర్ ఏడీ మోహన్బాబు అన్నారు. బుధవారం స్థానిక శ్రీశక్తి భవనంలో మండలంలోని రైతులకు పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్బరీ సాగు చేసే రైతులకు కావలసిన పరికరాలు, పనిముట్లతో పాటు బ్లీచింగ్, సున్నం నేత్రికలు సబ్సిడీపై ఇస్తామన్నారు. అలాగే, షెడ్డు నిర్మాణానికి, మల్బరీ మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ నిధులు ఇస్తామన్నారు.కార్యక్రమంలో నాయకులు, సెరికల్చర్ అధికారులు పాల్గొన్నారు. -
రెండు కళ్లూ లేవు
అవినీతి తిమింగలాలు పుంగనూరులో తిష్టవేసిన అవినీతి రెవెన్యూ తిమింగలాలు పట్టుబడ్డాయి. ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ చిక్కాయి.సర్వర్ పనిచేయడం లేదంట ఈమె పేరు టి.నాగమ్మ. తడుకు ఎస్టీ కాలనీ. ఈమెకు రెండు కళ్లు లేవు. గత ప్రభుత్వంలో ఈమె వేలిముద్రలు పడకపోవడం, ఐరిష్ తీయలేక ఆధార్ కార్డు పొందకపోయింది. అప్పటి వలంటీర్ ఈమెను తీసుకెళ్లి కంటిని ఓ మేరకు తెరిపించి ఐరిష్ తీయించి ఆధార్ కార్డు వచ్చేలా చేశారు. ఆపై దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. వలంటీర్ వ్యవస్థను బాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇరుగుపొరుగు వారి సాయంతో వెళ్లి ఒకమారు సదరంలో దరఖాస్తు చేసుకుంది. అయినా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మరోమారు సదరంలో దరఖాస్తు చేసుకుందామంటే తీసుకెళ్లేవారు లేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు జీ.వెంకటప్ప. ఐరాల మండలం, గూబలవారిపల్లె. ఈయన గత ఏడాది గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. ఈయన దివ్యాంగ పింఛన్ కోసం గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం సచివాలయంలో స్లాట్ బుకింగ్ కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు. అక్కడి సిబ్బంది సర్వర్ పనిచేయడం లేదు.. రేపు రండి చూద్దాం అంటూ తిప్పి పంపిస్తున్నారు. ఏడాదిగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కాస్త ఓపిక తెచ్చుకొని సచివాలయానికి వెళ్లితే మీ ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లండి ఫోన్ చేస్తాం అంటూ సిబ్బంది తిప్పిపంపుతున్నారని వాపోతున్నాడు. -
ఐఐటీలో ఉత్కంఠగా స్పోర్ట్స్మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ సారథ్యంలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో నాలుగో రోజు బుధవారం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా ఐఐటీ రూర్కీ నిలిచింది. దీంతో వెయిట్లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. కాగా చెస్, టెన్నిస్ పోటీలు కొనసాగుతున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్గా ఐఐటీ రూర్కి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 60 కిలోల విభాగంలో మౌన్సోలిన్ నౌలక్ 189 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మొత్తం ఐదుగురు ఐఐటీ రూర్కీ క్రీడాకారులు ప్రతిభ చూపారు. అలాగే 65 కిలోల విభాగంలో ఆరుగురు, 71 కిలోల విభాగంలో ఐదుగురు, 79 కిలోల విభాగంలో ఒక్కరు, 79 ప్లస్ కిలోల విభాగంలో ఐదుగురు మొత్తం 22 మంది ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. అలాగే ఐఐటీ రోపర్ 9 మందితో రెండోస్థానం, ఐఐటీ కాన్పూర్ 8మందితో మూడో స్థానంలో నిలిచాయి. వారణాసి, బాంబే ఐఐటీల నుంచి ఐదుగురు చొప్పున, గౌహతి, ఖరగ్పూర్ ఐఐటీల నుంచి ఇద్దరు చొప్పున, మద్రాస్, గాంధీనగర్ ఐఐటీలు ఒక్కరు చొప్పున వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభను చూపారు. అలాగే 65కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి అభిషేక్కుమార్, 79 కిలోల విభాగంలో ఐఐటీ కాన్పూర్ విద్యార్థి దృవ్శెట్టి, 71 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి దాస్ అనుప్కుమార్, 60 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి మౌన్సోలిన్ నౌలక్ మొదటిస్థానాలలో నిలిచారు. చెస్లో ఐఐటీ ఖరగ్పూర్ మొదటి స్థానం చెస్ పోటీల్లో ఐఐటీ ఖరగ్పూర్ అద్భుతంగా ఆడి, 9.5 పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ కాన్పూర్ 9 పాయింట్లతో, ఐఐటీ బాంబే, వారణాసి 8 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో చేరువలోనే నువ్వానేనా? అంటూ పోటీ పడుతున్నాయి. 7.5 పాయింట్లతో మద్రాస్, ఇండోర్, గౌహతి కూడా పోటీలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది. -
కోతకు కుట్ర
చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లలో కోతపెట్టేందుకు కుట్ర పన్నుతోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దివ్యాంగులపై కత్తి పెట్టింది. బోగస్ పేరుతో వారిని తిప్పించుకుంది. రీ వెరిఫికేషన్ పేరుతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణ చేయించింది. అర్హులుగా ఉన్నవారిని కూడా అనర్హులుగా వేటు వేసింది. దీంతో వారంతా రోడెక్కారు. వీటిని కప్పి పుచ్చేందుకు మళ్లీ వెరిఫికేషన్ అంటూ ఆశజూపింది. తర్వాత సదరం స్లాట్ను తెరపైకి తీసుకొచ్చి..మాయ చేసింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల సంఖ్యను కుదించేందుకు చేస్తున్న కుట్ర అని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. -
జిల్లాలో పింఛన్ల సమాచారం
దివ్యాంగుల పింఛన్లు 34,538 మొత్తం పింఛన్లు 2,68,066 చిత్తూరు: సదరం రీవెరిఫికేషన్కు వచ్చిన దివ్యాంగులు (ఫైల్)రీవెరిఫికేషన్లో అనర్హులుగా 2,000కాణిపాకం: దివ్యాంగులు సదరం స్లాట్లకు పాట్లు పడుతున్నారు. పనిచేయని సదరం పోర్టల్తో కుస్తీ పడుతున్నారు. రెండు రోజులు మాత్రమే పోర్టల్ తళుక్కుమని మాయమైంది. తర్వాత సైట్ మొరాయిస్తోంది. సచివాలయాల చుట్టూ దివ్యాంగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. స్లాట్ సతాయించడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొదటి నుంచీ వివక్షే జిల్లాలో దివ్యాంగులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారికి రీ వెరిఫికేషన్ పేరుతో కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వం, కొత్త వారికి ధ్రువపత్రాల జారీలోనూ వివక్ష చూపుతోంది. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ కోసం వైద్య పరీక్షలకు దరఖాస్తు చేసుకుందామని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళితే అక్కడి సిబ్బంది సదరం సైట్ మొరాయిస్తోందని చెబుతున్నారు. గతంలో ఆన్లైన్ చేసిన వారికి వెయిటిం గెస్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి కొందరికి పరీక్ష తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు పూర్తి స్థాయి వైకల్యం ఉండి, మంచంలోనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకూ ఆ సైట్ ఓపెన్ కాలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్కెళ్లి అర్జీలిచ్చి ఆశగా ఎదురు చూస్తున్నారు. స్లాట్ బుకింగ్ ఏదీ గత నవంబర్ 10న సదరం స్లాట్ బుకింగ్కు మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటన విడుదల చేసింది. గతనెల 14వ తేదీ నుంచి ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఓ రెండు రోజులు మాత్రం సైట్ ఓపెన్ అయ్యి.. తర్వాత మూగబోయింది. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా స్లాట్ బుకింగ్కు సుమారు 15 వేల మంది దాకా ఎదురుచూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆప్షన్ కనిపించడం లేదు దివ్యాంగుల్లో పూర్తి వైకల్యంతో మంచంపైనే ఉన్న వారికి రూ.15వేల పింఛన్ ఇస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్న వారు సందరం ద్వారా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ధ్రవ పత్రాలు తీసుకున్నారు. వాటిని మరళా అప్లోడ్చేస్తేనే పింఛన్కు అర్హత సాధిస్తారు. ఆ సైట్లో ఆ ఆప్షన్ కనిపించడం లేదని దివ్యాంగులు చెబుతున్నారు. నవంబర్ నెలంతా మొరాయించిందని వాపోయారు. డిసెంబర్ నెల వెళ్లి చూస్తే స్లాట్ ఫుల్అని చూపిస్తోందని అంటున్నారు. వేధిస్తున్నారు భార్యకు మోకాలు పగిలి పోయింది. వికలాంగులనీ చూడకుండా సదరం సర్టిఫికెట్ పేరుతో వేధిస్తున్నారు. ముందుగా చిత్తూరు నుంచి కార్వేటి నగరానికి పంపారు. ఇలా రెండు సార్లు వెళ్లాం. అక్కడ వెరిఫై చేసి మళ్లీ కార్వేటినగరానికి పంపించారు. ఇలా ఎన్నిసార్లు తిప్పుకుంటారో అర్థం కావట్లేదు. కూలి పని వదులుకొని తిరుగాల్సి వస్తోంది. వాళ్లు ఇచ్చే పెన్షన్ కోసం ఇన్ని ఇబ్బందులు అవసరమా. – వెంకటాచలం, అమ్మన్ కోయిల్ వీధి, చిత్తూరు అవస్థలు పడుతున్నాం అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు వ్యయప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక చోట సదరం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. వారంలో ఒక రోజు డాక్టర్లు వచ్చి క్యాంపునకు వచ్చే దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి అంగవైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. వారికి ఇష్టం వచ్చిన చోట సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించేవారు. నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ అక్కడికి వచ్చి సర్టిఫికెట్లు పొందేవారు. ఇప్పుడు ఇబ్బందులు పడాల్సివస్తోంది. –రఘుపతిరాజు, వైఎస్సార్టీయూ జిల్లా కార్యదర్శి, బంగారుపాళ్యంసదరంరీవెరిఫికేషన్కు వచ్చిన దివ్యాంగులు (ఫైల్)సదరం కోసం ఎదురుచూస్తున్న వారు సుమారు 15వేల మంది -
ఎనిమిది నెలలుగా..
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి విద్యార్థులు భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చిన్నదొరై. తవణంపల్లె మండలం, అరగొండ చారాలలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి గుండె పోటు రావడంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో 8 నెలల క్రితం సర్జరీ చేయించుకున్నాడు. ఇతను తాఫీ మేస్త్రి. భార్య, ముగ్గురు పిల్లలను ఉన్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయడంతో కష్టమైన పనులు చేయొద్దని డాక్టర్లు సలహాలిచ్చారు. నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రలు, మందులు కొనుగోలు చేస్తు న్నాడు. ప్రభుత్వం నుంచి వికలాంగుల సర్టిఫకెట్ కోసం సదరం స్లాట్ బుక్ చేయడానికి అరగొండ సచివాలయానికి కొన్ని నెలలుగా తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. -
ప్రణాళికతో చదివితే.. ‘పది’ంతల విజయం!
విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. బంగారు భవితకు పునాది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలి మెట్టు. అలాంటి పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో అధికారులు వంద శాతం ఉత్తీర్ణత సాధనకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందు కోసం జిల్లాలో 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. డిసెంబర్ నుంచి మార్చి వరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని, మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్మెంట్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా వారికి ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. రోజు వారీ ప్రత్యేక తరగతులు డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 వరకు రెమిడియల్ క్లాసులు, తరువాత 9.15 నుంచి సాయంత్ర 4 గంటల వరకు నాలుగు సబ్జెక్టుల బోధన ఉంటుంది. సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ప్రతి రోజూ ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులను ఆన్న్లైనన్ చేస్తారు. ఆ మరుసటి రోజు ముందు రోజు చదవిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలో వచ్చిన మార్కులపైన పునఃశ్చరణ తరగతులు ఉంటాయి. ఇలా ఐదు రోజులపాటు శని, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ప్రణాళిక అమలు చేస్తున్నారు. జనవరిలో కేవలం సంక్రాంతికి సంబంధించి బోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులు మినహా మిగతా రోజులు యథావిధిగా ప్రణాళిక అమలు చేయనున్నారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 380ప్రైవేట్ హైస్కూల్స్ 185మొత్తం ఉన్నత పాఠశాలలు 565పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 26,789 -
సోలార్దే భవిత
చిత్తూరు కార్పొరేషన్: సోలార్ వాడకం భవిష్యత్లో పెరగనుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. మంగళవారం ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు ఉద్యోగులు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. రాష్ట్రంలో భారీగా 200 మెగా వాట్స్ పీఎం కుసుం యూనిట్ను పెడుతున్నామన్నారు. దీని ద్వారా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ఇప్పటికే రుణ సదుపాయంతో సబ్సిడీ ద్వారా పీఎం సూర్యఘర్ పథకం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివాసాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు పాటించాలన్నారు. అనంతరం ట్రాన్స్కో ప్రాజెక్టు డైరెక్టర్ అయూబ్ఖాన్ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొదుపు పాటించాలన్నారు. సోలార్ జీఎం విజయన్, ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, భాస్కర్నాయుడు, పీఓ రెడ్డెప్ప, డీఈఈలు ప్రసాద్, శేషాద్రి, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ సుమిత్కుమార్ ప్రతిజ్ఞ చేయిస్తున్న డైరెక్టర్ అయూబ్ఖాన్ -
జీతమో రామ‘చంద్రా’!
చిత్తూరు అర్బన్: రాష్ట్రం మొత్తంలేని సమస్య ఒక్క చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 500 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకటో తేదీన అందాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరో నెల కూడా వచ్చేస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని దిగువ మధ్యతరగతి వేతన జీవుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏం తినాలి? కార్పొరేషన్లో పనిచేస్తున్న 500 మందికి పైగా ఆప్కాస్ ఉద్యోగులకు సకాలంలో వేతనలు అందకపోవడంతో వాళ్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంట్లో తినడానికి బియ్యం లేక కొందరు, పిల్లలకు ఫీజులు, నిత్యావసర సరుకులు, ఆస్పత్రి ఖర్చులు.. ఇలా అన్నింటికీ వేతనాలపైనే ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నెలవారి వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మరికొందరు తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించకపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. కొందరు కార్మికులు ప్రజారోగ్యశాఖలోని అధికారులను దీనిపై ప్రశ్నిస్తే.. శ్రీమేం బిల్లులు పంపించేశాం. ఏదైనా ట్రెజరీలో సమస్య ఉంది. వెళ్లి వాళ్లను అడగండిశ్రీ అంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదమే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లోని ప్రజారోగ్య విభాగంలో 324 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 124, కార్యాలయం, ఇతర శాఖల్లో కలిపి మొత్తం 500 మంది వరకు కార్మికులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళారులను తీసేసి, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్స్డ్ సర్వీస్ (ఆప్కాస్) పేరిట.. నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమయ్యేలా ఓ సంస్థను రూపొందించారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆప్కాస్ను పక్కకుపెట్టి ఒక్కో ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో వేతనాలు ఇచ్చే ప్రక్రియను తీసుకొస్తోంది. దీనివల్ల మళ్లీ ఉద్యోగులు దళారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, కమీషన్ల దందా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లోని ఆప్కాస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను ఓ బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరచేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చిత్తూరు కార్పొరేషన్లో ఆప్కాస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు తెరవడంతో సిబ్బంది ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లలేదు. వేతన బిల్లులు చేసే సమయంలో ఓ బ్యాంకు ఖాతా, మరో బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్ ఉండడంతో సమస్య నెలకొంది. కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. -
సీకాం కళాశాలకు అరుదైన గౌరవం
తిరుపతి సిటీ: ఢిల్లీ వేదికగా విజయ్ వివస్ సందర్భంగా వెటరన్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్–2025 కార్యక్రమంలో తిరుపతి సీకాం డిగ్రీ కళాశాలకు హానర్స్ ఆఫ్ పార్టిఫికేషన్ కళాశాల అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి సంజయ్సేథ్, అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్, వెటరన్స్ ఇండియా వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బీకే మిశ్రా చేతుల మీదుగా సీకాం కళాశాలల డైరెక్టర్ టీ.ప్రణీత్ స్వరూప్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీకాం కళాశాల నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా సేవలందిస్తోందన్నారు. దీంతో ఇప్పటికే కళాశాల ప్రత్యేక హోదా సాధించిందన్నారు. దేశభక్తి, సేవారంగాలల్లో సైతం కళాశాల ముందంజలో ఉందని చెప్పారు. -
లారీని ఢీకొట్టిన బస్సు
పూతలపట్టు(యాదమరి): తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ గోపి కథనం.. మంగళవారం ఉదయం వేకువజామున మండల పరిధి కిచ్చన్నగారిపల్లి గ్రామ సమీపంలో నెల్లూరు నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది. అదే సమయంలో ముందు ప్రయాణిస్తున్న లారీని అధిగమించే క్రమంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. సీఐ గోపి ఆదేశాలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని మరొక బస్సులో బెంగళూరుకు పంపేలా ఏర్పాట్లు చేశారు. -
అమ్మో..చలి పులి!
సోలార్ పథకాలపై సమీక్ష చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న సోలార్ పథకాలపై ట్రాన్స్కో డైరెక్టర్ అయూబ్ఖాన్ అధికారులతో సమీక్షించారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో పలు అంశాలపై మాట్లాడారు. వ్యవసాయానికి సోలార్ ద్వారా విద్యుత్నిచ్చే పీఎం కుసుం పథకం పనులు త్వరలో ప్రారంభంకానున్నట్టు తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వాటిని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించమన్నారు. జిల్లాలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వాడుతున్న ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు ఉచితంగా సోలార్ ఫలకాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 2 సబ్స్టేషన్లు మంజూరు చేశారన్నారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సోలార్ జీఎం విజయన్, ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, శ్రీనివాసమూర్తి, భాస్కర్నాయుడు, పీఓ రెడ్డెప్ప పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం చోరీపై కేసు బంగారుపాళెం: ద్విచక్ర వాహనం చోరీపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళెం జెండా మాను వీధిలో నివాసముంటున్న రియాజ్ తన ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ ఏపీ40 డీయూ 8586)ని ఈ నెల 11వ తేదీన స్థానిక కుసుమ హోటల్ వద్ద పార్కు చేసి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కబ్జాదారునిపై ఫిర్యాదు బంగారుపాళెం: మండలంలోని మొగిలి వద్ద పాఠశాల స్థలం, శ్మశాన స్థలం కబ్జా చేసిన ఆక్రమణదారుడిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్, ప్రిన్సిపల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలోని మొగిలి ఊరగుట్ట వద్ద గిరిజన గురుకుల పాఠశాల నిర్మా ణానికి కేటాయించిన స్థలం, గిరిజనులు వినియోగించుకుంటున్న శ్మశాన స్థలాన్ని మొగిలి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదివారం ఆక్రమించుకుని చదును చేసిన విష యం తెలిసిందే. భూకబ్జాపై సోమవారం సాక్షి దినపత్రికలో శ్రీటీడీపీ నాయకుల భూకబ్జాశ్రీ శీర్షకన కథనం ప్రచురితమైంది. పాఠశాల, శ్మశాన స్థలాలను కబ్జాచేసిన మొగిలి గ్రామానికి చెందిన ఏకాంబరంనాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ షబ్బీర్బాషా, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరులో గజగజపలమనేరులో మంచు దుప్పటిపలమనేరులో పరిస్థితి ఇదీ.. -
ఫొటోలకు ఫోజులు..
కనిపించరా బాలకార్మికులు? చౌడేపల్లె: బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిచ్చి ఇక తమ పని అయిపోయిందంటూ లేబర్ ఇన్స్పెక్టర్ మధుబా బు, వివిధ శాఖల అధికారులు హడాహుడి చేశారు. మంగళవారం వారపు సంత కావడంతో ఆయా షాపుల వద్ద ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అధికారులందరూ ఏకమై నామమాత్రంగా టీస్టాల్స్, ఫ్యాన్సీ స్టోర్ల వద్ద బాలకార్మికులను గుర్తించినట్లు ఫొటోలకు ఫోజులిచ్చి వెనుదిరిగారు. అసలు ఆయా షాపుల వద్ద తనిఖీలకు అధికారులు రాకముందే అక్కడ పనిచేసే బాలకార్మికులను సంబంధిత యజమానులు ఇండ్లకు పంపేశారు. కొన్ని షాపుల్లో కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి వెట్టిచాకిరీ చే యిస్తున్నట్లు గుర్తించినప్పటికీ యజమానులపై చర్యలు తీసుకోలేదు. అలాంటప్పుడు తనిఖీలు ఎందుకని..మామూళ్ల కోసమేనా.. అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. -
అభ్యంతరాల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల ఓటర్ల జాబితా కసరత్తులో భాగంగా వేగవంతంగా అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 203 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 16వ తేదీ నాటికి 15,75,899 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని ఈవీఎం యంత్రాల గోడౌను పరిశీలించారు. డీఆర్వో మోహన్కుమార్, పలు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఉదయ్, శ్రీనివాసులు, సురేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ -
కుప్పంలో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇవ్వండి
– రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ మిథున్రెడ్డి కుప్పం: త్వరలో విజయవాడ నుంచి బెంగళూరు రాకపోకలు సాగించే వందే భారత్ రైలుకు కుప్పంలో హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కుప్పంలో వందే భారత్ రైలు నిలపాల్సిన అవసరంపై వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ విజ్ఞప్తి మేరకు మిథున్ రెడ్డి లేఖను రైల్వే త్రికి అందజేశారు. కుప్పం నుంచి విజయవాడకు వెళ్లేందుకు వందే భారత్ రైలు ఎక్కాలంటే 200 కిలో మీటర్లు దూరంలో బెంగళూరులోని కృష్ణరాజపురం లేక తమిళనాడులో కాట్పాడి జంక్షన్లకు వెళ్లి ఎక్కాల్సి ఉంటుంది. కుప్పం ప్రజల అవపరాలకు దృష్టిలో పెట్టుకుని వందే భారత్ రైలును కుప్పంలో నిలపాలని ఆయన వినతి పత్రం అందజేసినట్లు ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ట్రయల్ రన్ గుడిపాల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ అమ్మవారి గుడిని దర్శించుకొనేందుకు రానున్నారు. తిరుపతికి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆమె విచ్చేయనున్నారు. వాతావరణం అనుకూలించక పోయినట్లయితే రోడ్డు మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తుగా రోడ్డు మార్గాన్ని డీఎస్పీ సాయినాథ్ మంగళవారం వాహనాల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి గుడిపాల మండలం మార్గం ద్వారా సీఐ శ్రీధర్నాయుడు, ఎస్ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ చేపట్టారు. 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికె ట్లు, అటెస్టడ్ కాపీలు, సర్వీసు పుస్తకం, ఆరు ఫొటో లు, రూ.100 స్టాంపు పత్రాలతో 20వ తేదీ ఉద యం 9 గంటలకు చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హాజరు కావాలని కోరారు. అదేరోజు లగేజీ సైతం తీసుకురావాలన్నారు. కానిస్టేబుల్గా ఎంపికై న 196 అభ్యర్థుల్లో పురుషులకు ఏటూరు జిల్లా లోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రంలో, మహి ళలకు ఒంగోలు పోలీసు శిక్షణా కేంద్రానికి తరలిస్తామన్నారు. తొమ్మిది నెలల పాటు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఉంటుందన్నారు. -
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
చౌడేపల్లె: అతిగా మద్యం సేవించి చౌడేపల్లి మండలంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని తామరాకులకుంటకు చెందిన కుట్టి అలియాస్ బీరయ్య(31) మంగళవారం కూలి పనులతోపాటు అటవీ ఫలసాయం సేకరించి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజులుగా మేకల చిన్నేపల్లె పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించి రోడ్డు పక్కనే పడి ఉన్నాడు. మంగళవారం స్థానికుల సమాచారంతో అతని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. అతని మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. కొందరు అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మృత్యువాత పడి కుటుంబీకులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. -
మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలి
పుంగనూరు: అబద్ధపు హామీలతో విద్యార్థులను మోసంచేస్తే సహించేది లేదని బాబు ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గోకుల్ సర్కిల్ వద్ద మానవహారం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరచిపోయారన్నారు. విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ 107, 108 జీవోలను రద్దు చేయకపోగా, 590 జీవో ద్వారా మెడికల్ కళాశాలలను కార్పొరేటర్లకు ధారాదత్తత చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకుని ప్రభుత్వమే బాధ్యతగా చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన సంఘాలతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ప్రవీణ్కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు మున్న, జిల్లా ఉపాధ్యక్షుడు సంజయ్, నాయకులు వసంత్అమన్, సీపీఐ నాయకులు రమణారెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చిరుత దాడిలో మేకలు మృతి
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం తిరుమణ్యం పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చిరుత దాడి చేసి నాలుగు మేకలను చంపినట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై చిరుత దాడి చేయడాన్ని గ్రామస్తులు చూసినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున శబ్దం చేయడంతో చిరుత పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారన్నారు. తిరుమణ్యం గ్రామానికి వెళ్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించినట్లు తెలిపారు. పుత్తూరు ఫారెస్ట్ అధికారులకు సైతం సమాచారం అందించారు. ఈ నెల 12న పుత్తూరు ప్రాంతంలో కనబడిన చిరుతే వడమాలపేట మండలంలోకి ప్రవేశించి ఉంటుందని, దానిని బంధించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
అడవి బిడ్డల ఆవేదన!
కానరాని గిరిజన సంక్షేమ శాఖ కుప్పం: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గిరిజనులకు భద్రత కరువైయింది. కూలి పనులకు రాకపోతే పూరి గుడిసెలు తొగిస్తాం.. సాగు చేస్తున్న పంట పొలలాను రాత్రికి ర్రాతే దున్నేస్తామంటూ అగ్రవర్ణాల వారి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా పట్టించుకునేవారు లేరు. మూడు రోజలుగా కుప్పం మండల పరిధి లోని దాసేగానూరు ఎస్టీల వేధింపులపై ప్రతికల్లో కథనాలు వెలువడ్డాయి. అయినా గిరిజనులను ఆదుకునేవారు లేరు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టిటీ సైతం స్పందించకపోవడం గమనార్హం. గిరజన సంక్షేమ శాఖ జాడ ఎక్కడ? దాసేగానూరు ఎస్టీ కాలనీలో 30 గిరిజన కుటుంబాలున్నాయి. వీరి సమస్యలపై స్పందించాల్సిన గిరిజన సంక్షేమ శాఖ కుప్పంలో జాడలేదు. పట్టణానికి కూత వేట దూరంలో ఉన్న ఈ కాలనీపై భూస్వాములు వేధింపులకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయాలు పత్రికలు, సోషయల్ మిడియాలో కోడై కూస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. కుప్పం అభివృద్ధి విదేశాలకు పాకిందని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు సైతం వారికి అండగా నిలవకపోవడం విమర్శలకు తావిస్తోంది. కడా .. ఎక్కడ? కుప్పం ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ (కడా) సైతం గిరిజనల సమస్యలపై దృష్టిసారించడం లేదు. పొలాల్లో గుట్టలపై వేసుకున్న గుడిసెలను తొలగిస్తామంటూ భూస్వాములు భయాందోళనకు గురిచేస్తున్నారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు. -
వెన్నుపోటు!
రైతుకుచెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తామంటూ బుకాయింపు ‘చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం’.. అంధకారంలో కార్మికుల భవితవ్యం నేటమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీలో 298 మంది ఉద్యోగులు పనిచేవారు. ఆకస్మాత్తుగా ఫ్యాక్టరీ లాక్డౌన్ ప్రకటించడంతో వారి బతుకు రోడ్డున పడింది. వారి జీతాల్లో నుంచి కోత విధించిన ప్రావిడెంట్ ఫండ్ కూడా అందలేదు. కొందరు బతుకుదెరువు కోసం ఉన్న గ్రామాన్ని వదలి సుదూర ప్రాంతాలకు వెల్లిపోయారు. ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన జీతపు బకాయిలు, పీఎఫ్, గ్రాట్యుటీల కోసం ఫ్యాక్టరీల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు. యాజమాన్యంపై కేసులు పెట్టినా ఇప్పటి వరకు సత్ఫలితాలు లేవు. రూ.15 కోట్ల మేర బకాయిలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. నగరి : జిల్లాలో చెరుకు సాగు సంక్షోభంలో పడింది. గతంలో పుంగనూరు వాణి షుగర్స్, శ్రీకాళహస్తి మయూర, నిండ్ర నేటమ్స్, నెలవాయి ఎస్ఎన్జే షుగర్స్ ప్రైవేటు పరిశ్రమలు కాగా, రేణిగుంట, చిత్తూరులో ప్రభుత్వ కర్మాగారాలు ఉండేవి. సుమారు 40 వేల ఎకరాలకు పైగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరుకు పంట సాగుచేసేవారు. ఒక్క నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోనే 14 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పంట రైతులు సాగుచేసేవారు. అన్ని పరిశ్రమలు మూతబడి కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే ఉండడంతో చక్కెర పరిశ్రమ యాజమాన్యం చెప్పిందే వేదంగా మారిపోయింది. రైతులు చెరుకు సాగుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 17వేల ఎకరాల్లో సాగులో ఉండగా నేటమ్స్ పరిధిలో 5వేల ఎకరాలకు పడిపోయింది. ఆరేళ్ల క్రితం క్రషింగ్ సీజన్లో చెరుకు తరలించుకొని రైతులకు బకాయిలు ఇవ్వక చేతులెత్తేయడంతో పలువురు తమ భూములను అమ్ముకున్నారు. తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం పడిపోయిన సాగు విస్తీర్ణం పలు ఫ్యాక్టరీలు మూతబడడం, ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వక అప్పుల పాలుచేయడం, పండించినా జిల్లాలో తరలించేందుకు ఒక్క ఫ్యాక్టరీనే ఉండడంతో రైతులు మెలమెల్లగా చెరుకు సాగుకు స్వస్తి పలుకుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో జిల్లా లో చెరుకు సాగు ఘననీయంగా తగ్గిపోయింది. -
ఆ సెక్షన్ల పనితీరు మారాల్సిందే
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలు సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ట్రాన్స్కో జిల్లా నోడల్ అధికారులు కృష్ణారెడ్డి, మురళీ హెచ్చరించారు. మంగళవారం ఎస్సీ కార్యాలయంలో క్షేత్ర స్థాయి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్శాఖ పై ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చే విధంగా నడుచుకోవాలన్నారు. అందులో భాగంగా సిబ్బంది ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వినియోగదారులు ఫోన్చేస్తే మర్యాదగా సమాధానం ఇవ్వాలన్నారు. జిల్లాలో గిరింపేట, సంతపేట, నిండ్ర సెక్షన్ల పనితీరు బాగుందన్నారు. అదే విధంగా గంగవరం, పాలసముద్రం, యాదమరి సెక్షన్ల పనితీరు అధ్వాన్నంగా ఉందన్నారు. సంస్థ జీతాలు ఇస్తోందని పనిచేయడానికని సాకులు చెప్పడానికి కాదన్నారు. విద్యుత్ సరఫరా, సిబ్బంది అందుబాటులో ఉన్నారా..? అనే అంశాల పై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుంటోదన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తే వాటిని తెలపాలన్నారు. ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పలమనేరులో టెన్షన్..టెన్షన్!
మళ్లీ అక్రమ నిర్మాణ రగడ! పలమనేరు: పలమనేరు పట్టణంలో మళ్లీ అక్రమ నిర్మాణ రగడ రాజుకుంది. గతంలో గుడియాత్తం మెయిన్ రోడ్డుకు ఆనుకొని స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పేరిట ఓ వ్యక్తి రస్తాపోరొంబోకులో పక్కా భవనా న్ని నిర్మించేందుకు యత్నించారు. దీన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అడ్డు కున్నారు. ఇక్కడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలువురిపై కేసులు నమోదు చేశారు. దీనిపై వారు హైకోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఇలా ఉండగా ఇదే అక్ర మ నిర్మాణాన్ని సోమవారం రాత్రి రహ స్యంగా చేపడతారనే విషయం తెలిసి మళ్లీ తాను దీన్ని అడ్డుకుంటాన్నంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ సామాజిక మాద్యమాల ద్వారా హెచ్చరించారు. దీంతో పలమనేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారుల తప్పిదాలతోనే... అధికారుల చేసిన తప్పులు ఎప్పటికై నా వారికి శాపాలుగా మారాల్సిందే. ఇప్పుడు పలమనేరు పట్టణంలో హాట్టాపిగ్ మారి న స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పీఏ అని చెప్పుకుంటున్న పార్థసారథి వ్యవహారాన్ని లోతుగా గమనిస్తే గతంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖలు చేసిన తప్పులు కనిపిస్తున్నాయి. నోరు మెదపని అధికారులు ఇలా ఉండగా మళ్లీ అక్రమ నిర్మాణం సాగుతుందనే విషయమై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. టీపీవో ఇందిర సైతం మాట్లాడలేకపోవడం కొసమెరుపు. సెంటు ఎలా పెద్దదైందో? సెంటు స్థలానికి ప్లాన్అప్రూవల్ అయ్యి ఉంటే ఇప్పుడు అక్కడ సైట్ ఎలా పెద్దదైంతో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులకే తెలియాలి. ఎప్పటికప్పుడు నిబంధనలు పాటించకుండా అధికారులు చేసిన తప్పిదాలు ఇప్పుడున్న అధికారులకు శాపాలు గా మారి అధికార పార్టీ మాట వినాలా లేకా రూల్పొజిషన్లో పోవాలా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దానికి ఎలా పట్టా ఇచ్చారు? పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో కాలే జీ సర్కిల్ వద్ద 2018లో నాటి రెవెన్యూ అధికారులు సర్వే నం.350/2లో సెంటు స్థలానికి ఓ మహిళకు సెంటు స్థలంలో పట్టా ఇచ్చారు. ఆ సర్వే నంబరులో మొత్తం వీస్తీర్ణం 5.34 సెంట్లు రస్తాపోరంబోకుగా రికార్డుల్లో ఉంది. అసలు రస్తాలో ఎలా పట్టాలిచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ స్థలం కిందనే పలు తాగునీటి పైపులైన్లు, పక్కనే ఓవర్హెడ్ ట్యాంకు, కౌండిన్య పైప్ లైన్లుంటే అప్పటి మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు ఎలా ప్లాన్ అప్రూవల్ చేశారనేది అంతుపట్టడం లేదు. ప్లాన్ అప్రూవల్ ఇచ్చినా పట్టాదారు ఎందుకు అప్పట్లోనే పక్కా నిర్మాణం చేపట్టలేదో తెలియరాలేదు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని, అధికారభయంతోనే అప్పటి అధికారులు అప్రూవల్ చేశారనే మాట వినిపిస్తోంది. దీనిపై ఇటీవల జరిగిన మున్సిపల్ మీట్లోనూ పలువురు కౌన్సిలర్లు సమస్యను లేవనెత్తారు. ఇది తప్పేనని రెవెన్యూ అధికారులు సైతం అక్కడే సెలవిచ్చారు. -
కరెంటు షాక్కుగురైన ఎస్పీడీసీఎల్ ఉద్యోగి
శాంతిపురం: మఠం పంచాయతీలోని సంతూరు వద్ద కరెంటు షాక్కు గురై ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి పురుషోత్తం తీవ్రంగా గాయడపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. దండికుప్పం పంచాయతీలోని చౌడంపల్లికి చెందిన పురుషోత్తం దండికుప్పం సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. తనకు సెలవు ఉన్న రోజుల్లో రెస్కో లైన్మెన్లు, హెల్పర్లతో కలిసి ఫీల్డ్ పనులకు వెళ్తుంటాడు. సోమవారం ఒక ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ మరమ్మత్తు కోసం రెస్కో హెల్పర్ నాగరాజు పురమాయించడంతో పురుషోత్తం ఆ పని చేసేందుకు సంతూరు వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న ఇద్దరు రైతులను ఉప్పు, బొగ్గుల కోసం ఒకరిని, బోల్టు నట్టుల కోసం మరొకరిని పురుషోత్తం పంపించాడు. నిమిషాల వ్యవధిలో బారీ శబ్దం రావడంతో ఆ రైతులు వెనక్కి తిరిగివచ్చే సరికి ట్రాన్స్ఫార్మర్పై పడి కాలుతున్న పురుషోత్తంను గుర్తించారు. తక్షణం గుండిశెట్టిపల్లి సబ్స్టేషన్కు రైతులు ఫోన్ చేసినా తీసేవారు లేరు. దీంతో తమకు తెలిసిన రెస్కో సిబ్బందికి సమాచారం ఇచ్చి, వారు సబ్స్టేషన్లోని లైన్మెన్కు తెలిపి విద్యుత్ సరఫరాను ఆపించారు. అనంతరం కాళ్లు, ఒళ్లు తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని ట్రాన్స్ఫార్మర్పై నుంచి కిందికి దింపారు. 108 అంబులెన్సు ద్వారా కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
షాట్పుట్లో ప్రతిభ
గంగాధర నెల్లూరు: జిల్లా స్థాయి పారా ఒలింపిక్స్ పోటీలలో గంగాధర =నెల్లూరు భవిత కేంద్రం విద్యార్థి మహేందర్ మొదటి బహుమతి గెలుచుకున్నట్టు ఎంఈఓలు ఆంజనేయులుశెట్టి, గుణశేఖర్రెడ్డి తెలిపారు. చిత్తూరులో ఈ నెల 12న జిల్లా స్థాయి పారాఒలింపిక్ పోటీలు నిర్వహించారన్నారు. ఇందులో స్థానిక భవిత కేంద్రంలో చదువుతున్న వేల్కూరు గ్రామానికి చెందిన బుద్ధి మాంద్యం గల ఎనిమిదో తరగతి విద్యార్థి మహీదర్ షాట్ పుట్ పోటీలో పాల్గొని మొదటి బహుమతి కై వసం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటరమణ, కో–ఆర్డినేటర్ మధు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్టు వెల్లడించారు. వైకల్యం శరీరానికే కానీ మానసిక స్థైర్యానికి కాదని మహిదర్ నిరూపించాడని ఎంఈఓ కొనియాడారు. ఐఈఆర్టీ టీచర్లు పుష్పావతి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్య పరిష్కరించండి
ఇంటి స్థలం సమస్యను పరిష్కరించాలని బాధిత మహిళ తులసి అధికారులను వేడుకున్నారు. ఈ మేర కు ఆమె మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసాపల్లికి చెందిన తనకు సర్వే నం.183లో ఇంటి స్థలం ఉందన్నారు. ఆ స్థలం పై వెరొకరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. తనకు న్యాయం చేయాలని చిత్తూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు చులకనగా చూస్తున్నారన్నారు. తమ గ్రామానికి చెందిన విజయకుమార్, అతని భార్య శశి, కుమారుడు జితేంద్ర పేరుతో ఈసీ వస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు మాయ చేసి వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్నారు. -
కరెంట్ షాక్తో కూలీ మృతి
గుడుపల్లె : కరెంట్ షాక్ తగిలి బాలకృష్ణ( 48) అనే కూలీ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం.. మండలంలోని చీకటిపల్లె గ్రామానికి చెందిన అనుమంతప్ప ఇంటి పక్కన రేకుల షేడ్డు వేసేందుకు అదే గ్రామానికి చెందిన బాలకృష్ణను కూలి పనులకు వెళ్లాడు. షెడ్డు పనులు చేస్తున్న సమయంలో ఇనుప పైపును షెడ్డు పైకి తీసుకుని వెళ్తుండగా పైన ఉన్న కరెంట్ తీగలకు పైపు తగిలింది. ఒక్కసారిగా బాలకృష్ణ కరెంట్ షాక్కు గురై కింద పడిపోయాడు. స్థానికులు అతన్ని కుప్పంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చట్టబద్ధంగా వెళ్లండి చిత్తూరు అర్బన్: ప్రజలకు అందుబాటులో ఉంటూ.. న్యాయం కోసం స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుపై చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 43 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు అందుకున్నారు. ఘన నివాళి చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు మహనీయుడని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ కొనియాడారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లారీని ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు – ఒకరి పరిస్థితి విషమం పుంగనూరు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మిని లారీ ఢీకొని నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని సుగాలిమిట్టవద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అశోక్ (29), శివకుమార్ (30), ప్రదీప్ (29), క్లీనర్ అస్సాం (28) కలసి పుంగునూరుకి వస్తుండగా మార్గమధ్యంలోని సుగాలిమిట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. లారీ ముందుబాగం నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రులను స్థానికులు పుంగునూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో అశోక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. -
నోటిఫికేషన్ ఇచ్చింది వైఎస్ జగన్.. బాబు సర్కారు పెట్టిన పేరు ‘యువగళం’
– జెండా ఊపిన ఎస్పీ చిత్తూరు అర్బన్: 2022 నవంబర్లో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయించారు. 2023 జనవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేశారు. ఆపై ఎన్నికల నేపథ్యంలో మెయిన్స్ జరగలేదు. అటు తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుది పరీక్షలు నిర్వహించి ఈ ఏడాది జూన్లో ఫలితాలను విడుదల చేసింది. ఆర్నెళ్ల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు స్టైఫండ్ కూడా కోల్పోయారు. ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులకు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటించి, అభ్యర్థులందరినీ విజయవాడకు తీసుకెళ్లారు. గతంలో నారా లోకేశ్ పాద యాత్రకు ‘యువగళం’ అనే పేరుపెట్టగా..ఇప్పుడు ప్రభుత్వ కార్యాక్రమానికి కూడా అదే పేరుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
కబ్జాకు యత్నిస్తున్నారు
దేవాలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని గంగవరం మండలం, శ్రీలంక కాలనీ గ్రామ స్తులు శశికుమార్, రామారావ్ తెలిపారు. గంగవరం రెవెన్యూ దాఖలాలో ఉండే సర్వే నం.314లో 3.5 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. మండల రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గంగవరం శ్రీలంక కాలనీ గ్రామస్తులకు దేవాలం నిర్మించుకునేందుకు టీడీడీ దేవస్థానం తరఫున అనుమతి ఇచ్చారన్నారు. దేవుని స్థలాన్ని కబ్జా చేయడం దారుణమన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. గ్రామస్తులు గంగాధరం, పవన్, చందు పాల్గొన్నారు. -
ఆలయ భూమిని సంరక్షించండి
– ఆందోళన చేపట్టిన ఇరువారం ప్రజలు చిత్తూరు కలెక్టరేట్ : చోళ రాజుల కాలం నాటి ఆలయ భూములను కబ్జా చేస్తున్నా రని జిల్లా కేంద్రంలోని ఇరువారానికి చెందిన గుణశేఖర్, విశ్వనాథ్ ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామ ప్రజలు సోమవారం కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 20వ వార్డు ఇరువారంలో సర్వే నం.345లో 2.5 ఎకరా భూమి కాళికాదేవి ఆలయానికి సంబంధించిందన్నారు. కొందరు వ్యక్తులు ఆ భూమి ఆక్రమణకు యత్నించారన్నారు. ఎండోమెంట్, రెవెన్యూ అధికారులు ఆక్ర మణదారులకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. చోళరాజు కాలంలో ఆలయానికి భూములు ఇచ్చారని, ఆ భూము లు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆ భూములపై కన్నేశారన్నారన్నారు. ఆ భూములను పురోహితులు అనుభవించవచ్చే గానీ, అమ్మడం, లీజుకు ఇవ్వడం వంటివి చేయకూడదన్నారు. అయితే ప్రస్తుతం కొంత భూమిని లీజుకు ఇచ్చారన్నారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆలయ భూమిలో బోరు వేస్తున్నారన్నారు. ఆ భూమిని కమర్షియల్గా వినియోగించడం కుదరన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ భూమి కబ్జా కాకుండా కాపాడాలని కలెక్టర్ను కోరినట్టు వెల్లడించారు. ఇరువారం ప్రజలు జ్యోతి, కమల, దుర్గాప్రసాద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు
పుంగనూరు: సైబర్ నేరగాళ్లు మున్సిపాలిటీలో కమిషనర్ పేరుతో పన్నులు ఫోన్పేకు పంపాలంటూ సోమవారం ఉదయం నుంచి ఫోన్లు చేయడంతో భవన యజమానులు బెంబేలెత్తిపోయారు. ఈ విషయంపై కమిషనర్ మధుసూదన్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పన్ను వసూళ్ల కోసం సచివాలయ ఉద్యోగులు, మున్సి పల్ సిబ్బంది నేరుగా సంప్రదిస్తారని, బకాయి లు మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలకు మోసపోయి, పన్నులు ఫోన్పే ద్వారా చెల్లించవద్దని, ఫోన్ రాగానే విచారించి, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని, ఎవరు మోసపోవ ద్దని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. 21న పల్స్పోలియో చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఈనెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఐఓ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవా రం పల్స్ పోలియో రూట్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా రెండు చుక్క లు వేయించాలన్నారు. ఇందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 221502 ఐదేళ్ల లోపు పిల్లలున్నారన్నారు. వీరందరికీ 14,730 వైల్స్ అవసరమవుతోందన్నారు. 142 రూట్లల్లో 5,794 బూత్ల ద్వారా పల్స్ పోలియో వేయనున్నట్టు తెలిపారు. సీడీపీఓలు, ఎంఈవోలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తారన్నారు. శిక్షణలో ఎస్ఓ జార్జ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. రైతులకు కావాల్సినంత యూరియా చిత్తూరు రూరల్ (కాణిపాకం): రబీ సీజన్కు అవసరమైన మేర యూరియా అందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. 20,183 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేశామన్నారు. గత రెండు నెలల వ్యవధిలో 4,127 మెట్రిక్ టన్నుల యూ రియా సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీలర్లు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోండి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనార్థం ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. స్వామి దర్శనంతో పాటు సేవలు, ప్రసాదం, వసతి బుకింగ్ సేవలు కూడా ఆన్లైన్ ద్వారానే పొందవచ్చన్నారు. వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చిత్తూరు కలెక్టరేట్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇందన పొదుపును పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. డీఆర్వో మోహన్కుమార్, ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో ఒక స్క్రబ్టైఫస్ కేసు కాణిపాకం: జిల్లాలో సోమవారం ఒక స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. ఐరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు స్క్రబ్ టైఫస్గా నిర్థారించారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 435 కేసులు దాటాయని అధికారులు చెబుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని నినాదాలు
● కోటి సంతకాల ప్రతులతో తిరుపతిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ ● 11 నియోజక వర్గాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైద్యవిద్య ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు జనం సిరా చుక్కలే కోటి సంతకాలు రూపం దాల్చుకుని గర్జించాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులతో తిరుపతిలో చేపట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని పద్మావతిపురంలో ర్యాలీ చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఆయా నియోజక వర్గాల సమన్వయకర్తలు ఇటీవలే తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. కోటి సంతకాల ప్రతులను తిరుపతి నుంచి అమరావతికి తరలించే సందర్భంలో జిల్లా కేంద్రమైన తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపుతో పుంగనూరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. గంగాధరనెల్లూరు నుంచి మాజీ మంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. నగరి నుంచి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రగిరి నియోజక వర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి, విద్యార్థి సంఘం అధ్యక్షులు చెవిరెడ్డి హరిషత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. చిత్తూరు నియోజక వర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో తిరుపతిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఆధ్వర్యంలో పలమనేరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల్లో తిరుపతికి తరలివచ్చారు. సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. పూతలపట్టు నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చారు. కుప్పం నుంచి ఎమ్మెల్సీ, నియోజక వర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన హోరుతిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో నగరంలోని పద్మావతీపురం, శ్రీనివాసపురం ప్రాంతాలు కిటకిటలాడాయి. పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఐటీ కళాశాల వరకు, అక్కడి నుంచి తిరుపతి–తిరుచానూరు రహదారిలోని గరుడ వారధి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు, పార్టీ మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. జగనన్నకు మంచి పేరు వస్తుందనే ప్రైవేటుపరం రాష్ట్రంలో 17మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా జగనన్న 17 మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో ఐదు వాటిని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా 70శాతం పూర్తయ్యాయి. మెడికల్ కళాశాలల నిర్మాణాలతో జగనన్నకు మంచి పేరు వస్తుందన్న అసూయతో వాటిని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు పేద, మధ్య తరగతి వారికి వైద్య విద్య అందకుండా గల్లంతు చేసేందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఆయనకు ఎప్పుడూ పేదలంటేనే గిట్టదు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, పేద విద్యార్థుల ఆశలను అడియాశలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – నారాయణ స్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్లకు దారాదత్తం చంద్రబాబు నాయుడుకు పేదలంటే గిట్టదు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టడంపైనే దృష్టి పెడుతారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి రూ.వేల కోట్లు దోచేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పేద పిల్లల భవిష్యత్తును కాలరాసే కుట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో స్థాపించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద, మధ్య తరగతి వారి పిల్లల భవిష్యత్తను కాలరాసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. – భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు -
నేడు కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు
చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు మంగళవారం విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న 196 మంది అభ్యర్థులకు బస్సుల్లో సోమవారం విజయవాడకు పంపించారు. అంతకుముందు చిత్తూరులో అభ్యర్థులతో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయని, ఈ నెలలోనే శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారన్నారు. పోలీసు ఉద్యోగానికి ఎంపికై న ప్రతీ ఒక్కరూ నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీ య స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని నీలీషా ఎంపికై నట్లు సోమవారం హెచ్ఎం రాజేంద్ర, పీడీ గిరిజ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా చిన్నతిప్పసముద్రంలో రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నీలీషా పాల్గొని ప్రతిభచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు తెలిపారు. ఈ నెల18 నుంచి 21వ తేదీ వరకు మధ్యప్రదేశ్లో జరగనున్న బాస్కట్బాల్ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థిని నీలీషాను పీడీ గిరిజతో పాటు, ఉపాధ్యాయులు అభినందించారు. రెండు బైక్లు ఢీ – ఇద్దరికి తీవ్ర గాయాలు చౌడేపల్లె: చౌడేపల్లె –తిరుపతి ప్రధాన రహదారిలోని ఆమినిగుంట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లెకు చెందిన మోహిత్(25) పెట్రోల్ బంక్ సమీపంలో గల ఓ ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్తుండగా ఎదురుగా ఆమినిగుంట వైపు నుంచి పుంగనూరు మండలం, బండ్లపల్లికి చెందిన గిరి(55) బైక్పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన గోపి , మోహిత్ -
చలో తిరుపతికి 150 కార్లతో ర్యాలీ
చిత్తూరు కార్పొరేషన్: పేదలను నాశనం చేసేలా చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలో సేకరించిన సంతకాల పత్రులను తిరుపతి నుంచి విజయవాడకు తరలించనున్నారు. వాటికి మద్దతుగా ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి 150 కార్లతో భారీ ర్యాలీగా చలో తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమూరు క్రాస్ వద్ద గల అయ్యప్పగార్డెన్ నుంచి ర్యాలీని విజయానందరెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి రెడ్డెప్పతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వ వెద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూడడం సరికాదని విజయానందరెడ్డి దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం నియోజవర్గంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. చిత్తూరు నుంచి 62,500 సంతకాల పత్రులను ఈనెల 10న తిరుపతిలో జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డికి అందజేసినట్లు గుర్తుచేశారు. జిల్లా నుంచి సేకరించిన సంతకాలను తిరుపతి నుంచి విజయవాడకు పంపనున్న నేపథ్యం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి ర్యాలీకి సంఘీభావంగా తిరుపతికి వెళుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపాల పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్, రూరల్ పార్టీ అధ్యక్షుడు జయపాల్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు రాహుల్రెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, హరీషారెడ్డి, మధురెడ్డి, నారాయణ, ఆను, చాన్బాషా, శివ, కృష్ణారెడ్డి, హేమారెడ్డి, శిరీష్రెడ్డి, అన్బు, లక్ష్మణస్వామి, మనోజ్రెడ్డి, ప్రసాద్రెడ్డి, అల్తాఫ్, అప్పొజీ, వెంకటేష్, శివారెడ్డి, రాంగణేష్, రజనీకాంత్, అమర్నాథరెడ్డి, త్యాగ, టిమ్ము, మధు, ప్రతిమారెడ్డి పాల్గొన్నారు. 150 కార్లతో భారీ ర్యాలీగా తిరుపతికి వెళ్తున్న నాయకులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న విజయానందరెడ్డి, రెడ్డెప్ప -
మొరవెత్తిన దేవర!
చౌడేపల్లె: పూర్వీకుల నుంచి పాటిస్తున్న ఆచారం, సంప్రదాయాలను నేటికీ చౌడేపల్లె మండలం, చారాల గ్రామంలో ఆచరిస్తున్నారు. చరిత్రలో ఎక్క డా లేని విధంగా ఆ గ్రామానికి సమీపంలో గల చారాల చెరువు మొరవ పోతే ఆ గ్రామ ఆడబిడ్డగా పేరుగాంచిన చౌడేశ్వరీదేవికి పైళ్లెన కొత్త దంపతులు తొలి సారిగా జన్మించిన బిడ్డతో కలిసి దేవర్లు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగలా జరుపుకోవడం విశేషం. దేవర చేయడానికి దేవర సామగ్రి, పొటేళ్లను చారాల గ్రామానికి వచ్చిన కోడలు ఆమె పుట్టినింటి నుంచి తీసుకురావడం విశేషం. ఎలా చేశారంటే ఆదివారం చారాల గ్రామ సమీపంలోని ఓదులపేట వద్ద గల చౌడేశ్వరీదేవి కుంట కట్ట కింద వెలసిన ఆలయం వద్ద మేళ తాళాల నడుమ గ్రామం నుంచి దేవర బుట్లతో కొత్త దంపతులు చేరుకున్నారు. ఈ చెరువు నిండి మూడేళ్లు కావడంతో ఆ గ్రామంలో మూడేళ్లలోపు పెళ్లి చేసుకున్న వారు చౌడేశ్వరీదేవికి సారెతోపాటు గంప ద్వారా దేవర చేశారు. మొక్కుబడిగా పొట్టేళ్లు సమర్పించారు. దంపతులచేత అమ్మవారికి పూజలు చేసి వారికి పుట్టిన బిడ్డలకు చెవి, ముక్కు పుడకలు కుట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడ పండుగ వాతావారణం నెలకొంది. బంధుమిత్రుల సందడి కనిపించింది. చారాల చెరువు మొరవ పోతే ..దేవర్లు చేయాల్సిందే! చెరువు నిండితేనే దేవర్లు? నా వయస్సు 85 ఏళ్లు. నాకు తెలిసినప్పటి నుంచి చెరువు నిండి మొరవ వెళ్లితేనే చౌడేశ్వరీదేవి ఆలయం వద్ద దేవర్లు చేస్తారు. ఒకసారి 11 ఏళ్లు తరువాత దేవర్లు చేశాం. ఆ సమయంలో సుమారు 52 పొటేళ్లతో ఆడ బిడ్డ చౌడేశ్వరీదేవికి మొక్కులు చెల్లించారు. ఎప్పుడు చెరువు నిండి మొరవ పోతే కొత్తగా పెళ్లయిన దంపతులు పూజలు చేయడం ఆనవాయితీ. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. – జగడం పాపిరెడ్డి, ఎరికలపల్లె, చారాల పంచాయతీ -
భూ..చిత్తు..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జింతాత..చిత..చిత..జింతాతత అంటూ ఓ తెలుగు యువత భూ మాయలొడయ్యాడు. ఊరిలో కాపుకాసి ఓ మహిళ అనుభవంలో ఉన్న భూమికి ఎసురు పెట్టించాడు. ఆ మహిళా లబోదిబోమని ఊరంతా భూ బాగోతాన్ని బహిర్గతం చేయడంతో జింతాత..చిత..చిత..జింతాతతా కథ ఊరంతా ప్రచారమైంది. బాధితుల వివరాల మేరకు ...చిత్తూరు మండలం దిగువమాసాపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు వంశపారంపర్యంగా వరించిన 5 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. పిచ్చిమొక్కలు మొలిచి ఏపుగా పెరిగింది. సెంటు రూ.2 లక్షలు పలుకుతోంది. దీనిపై తెలుగు యువతకు కన్ను పడింది. భూమిని కొట్టేయాలని ఇద్దరు టీడీపీ నాయకులను మురిపించాడు. తాచుపాముల వలే వారి వెంట పడ్డారు. అధికారుల లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఆ 5 సెంట్లను భూమిని ఏకంగా మూడు నెలలకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ స్థలంపై గతవారం బాధితురాలికి..పక్కంటివాళ్లకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇంతలోనే ఆక్రమించుకున్న యువత అక్కడి చేరుకుని..ఇది తనభూమి అని చెప్పడంతో బాధితురాలు అవాకై ్కంది. తీరా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించింది. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి సహకారంతో జరిగిందని, సర్వేయర్ రిపోర్టు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. ఈవిషయం తెలుసుకున్న బదిలీపై వెళ్లిన ఆ రెవెన్యూ అధికారి బాధితురాలిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్కు ఫిర్యాదు చేయవద్దని వేడుకుంటున్నారని, సోమవారం కచ్చితంగా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితురాలు చెబుతోంది. కాగా ఇలాంటి భూ మాయలు చాలానే జరిగాయని, అందుకే ఆ అధికారిపై బదిలీ వేటు పడిందనే విమర్శలు వస్తున్నాయి. -
ప్రతిష్టాత్మక పరీక్ష
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రతిష్టాత్మక పరీక్షగా చెప్పవచ్చు. ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం. పోటీ ప్రపంచంలో దీటుగా నిల బ డాలంటే ఆంగ్లంపై పట్టు అవసరం. ఆ దిశగా సాక్షి మీడియా విద్యార్థులను ప్రొత్సహించడం అభినందనీయం. సెమీఫైనల్కు విశ్వం విద్యాసంస్థ వేదిక కావడం గర్వంగా ఉంది. – ఎన్.విశ్వచందన్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్, విశ్వం విద్యాసంస్థలు, తిరుపతి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు సాక్షి స్పెల్బీ పరీక్షకు హాజరుకావడంతో మా అబ్బాయి ఆంగ్ల భాషపై పట్టు సాధించి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు. పదాల ఉచ్ఛారణపై పట్టు వస్తోంది. తప్పులు లేకుండా స్పెలింగ్ లు రాసేందుకు ఈ పరీక్షలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రెండు రౌండ్లలో అర్హత సాధించి మూడో రౌండ్ స్పెల్ బీ సెమీస్కు మా అబ్బాయి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. – అనిత, రెండవ తరగతి విద్యార్థి హరిన్ తల్లి, రెయిన్బో స్కూల్, నెల్లూరు -
భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం
తిరుపతి సిటీ: భాషపై పట్టు సాఽధించి ప్రతిభకు పట్టం కట్టడమే లక్ష్యంగా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన సాక్షి స్పెల్బీకి విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం విద్యాసంస్థల్లో నిర్వహించిన స్పెల్బీ సెమీఫైనల్ పరీక్షకు విద్యార్థులు పోటెత్తారు. ఈ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వ్యాఫి, అసోసియేట్ స్పాన్సర్గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. క్వార్టర్ ఫైనల్లో ప్రతిభ చూపి సెమీస్కు చేరిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన సెమీస్కు సుమారు 500 మంది విద్యార్థులు హాజరై తమ సత్తా చాటారు. ఉదయం 10.15కి పరీక్ష ప్రారంభమైన మధ్యాహ్నం 12గంటలకు ముగిసింది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాక్షి సిబ్బంది పకడ్బందీ ఏర్పాటుల చేశారు. పిల్లలు రాణించేలా ప్రోత్సాహం ఆంగ్లంలో పిల్లల రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా గ్రూప్ స్పెల్బీ పరీక్షలు నిర్వహిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు సహకరిస్తోంది. దీంతో పదాల ఉచ్ఛారణ, కొత్త పదాలను తెలుసుకోవడం, స్పెల్లింగుపై పట్టు సాధించి పోటీ పరీక్షలకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఫైనల్కు చేరుకోవడమే లక్ష్యం సాక్షి స్పెల్బీ సెమీస్కు మా అమ్మాయి ఎంపికై ంది. ఫైనల్కు చేరుకోవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. సాక్షి స్పెల్ బీతో ఆంగ్ల భాషపై భయం అనేది పోయింది. స్పెల్ బీ కోసం సాక్షి అందించిన మెటీరియల్లో సరికొత్త పదాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రొత్సహిస్తున్న సాక్షికి ధన్యవాదాలు. – రాఘవేంద్రనాయుడు, స్వప్న, విద్యార్థిని సాయి రుషిత తల్లిదండ్రులు, నాగార్జున స్కూల్, వైఎస్సార్ కడప జిల్లా ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నాం స్పెల్బీ పరీక్షలకు హాజరై ఇప్పటే రెండు రౌండ్లలో ప్రతిభ చూపి సెమీఫైనల్కు చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీంతో ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నామనిపిస్తోంది. నూతన పదాలు, వాటి అర్థాలు, స్పెలింగ్లు తెలుసుకుంటున్నాం. దీంతో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న మా అకడమిక్ విద్యకు సైతం ఎంతో ఉపయోగపడుతోంది. – ఆరాధ్య, ప్రణవీ, సిల్వర్ ఓక్స్ స్కూల్, నెల్లూరు పోటీ ప్రపంచంలో ఉపయోగం విద్యార్థులు సాక్షి స్పెల్ బీ పరీక్షలకు హా జరుకావడంతో పోటీ ప్రపంచంలో దీటు గా నిలబడేందుకు ఉపయోగపడుతుంది. మా విద్యార్థి సెమీస్కు చేరడం అభినందనీయం.స్పెల్బీ మెటీరియల్ సైతం అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో విద్యార్థులు నూతన పదాలపై పట్టు సాధిస్తారు. ఇలాంటి పోటీ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను ప్రొత్సహిస్తున్న సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – విద్యార్థి పునీత్తో టీచర్ ప్రమీల, క్యాండర్ నేషనల్ పబ్లిక్ స్కూల్, తిరుపతి సంతోషంగా ఉంది సాక్షి స్పెల్బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లలో ఉత్తీర్ణత సాధించి సెమీస్కు చేరడం సంతోషంగా ఉంది. స్పెల్ బీ పరీక్షలో నూతన పదాల స్పెల్లింగ్స్తో పాటు పదాల ఉచ్ఛారణ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. తోటి విద్యార్థులతో పోటీ పడి పరీక్షలు రాయడంతో మాలోని ప్రతిభ, సామర్థ్యం తెలుస్తోంది. – గీతిక, జశ్విత, 5వ తరగతి, విశ్వం స్కూల్, తిరుపతిథ్రిల్లింగ్గా ఉంది సాక్షి స్పెల్బీలో పాల్గొనడంతో ఇంగ్లిషు భాషలో మా సత్తా ఎంటో తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ఉత్తీర్ణులై సెమీస్కు చేరాం. పరీక్ష బాగా రాశాం. ఎన్నో కొత్త పదాలకు స్పెల్లింగ్ రాయడం థ్రిల్లింగా ఉంది. మా ఆలోచనకు పదును పెట్టి పదాలకు స్పెల్లింగ్స్ రాస్తున్నాం. దీంతో మేము చదివే ఇంగ్లిషు సబ్జెక్ట్ సులువుగా అనిపిస్తోంది. – తమన్ కృష్ణ, హర్మన్ కృష్ణ, ఎడిఫై స్కూల్, తిరుపతి పిల్లలలో ఆసక్తి పెరుగుతోంది సాక్షి స్పెల్బీపై పిల్లల లో ఆసక్తి పెరుగుతోంది. మా అమ్మాయి ఒకటో తరగతి చదువుతోంది. స్పెల్ బీ పరీక్ష ను సునాయాసంగా రాయడం సంతోషంగా ఉంది. సెమీఫైనల్ వరకు రావడం, పరీక్షలో ఉచ్చరిస్తున్న పదాలను అర్థం చేసుకుని స్పెల్లింగ్లు రాస్తుంటే ఎంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సాక్షికి రుణపడి ఉంటాం. – రమ్య,విద్యార్థిని సాయిరుషిత తల్లి, క్యాంఫోర్డ్ స్కూల్, తిరుపతి ఎంతో ఆసక్తిగా జరిగింది సాక్షి స్పెల్ బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లు ఒక ఎత్తు. కానీ, ఆదివారం జరిగిన సెమీఫైనల్ ఎంతో ఆసక్తిగా జరి గింది. నూతన పదాలను నేర్చుకున్నాం. వాటికి స్పెల్లింగ్లు కొత్తగా ఉన్నాయి. బాగా రాశాం. ఫైనల్కు చేరుకుంటామనే నమ్మకం ఉంది. విద్యార్థులను సాక్షి మీడియా ఎంతగానో ప్రొత్సహిస్తోంది. – హర్షిత, మోనిక, 7,8వ తరగతి విద్యార్థులు, ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్, నెల్లూరు పరీక్ష బాగా రాశాం సాక్షి స్పెల్బీ సెమీఫైనల్ పరీక్ష బాగా రాశాం. చాలా ఈజీగా అనిపించింది. స్పెల్బీ మెటీరియల్ పోటీ పరీక్షలతో పాటు మా అకడమిక్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పరీక్షలు మరిన్ని సాక్షి మీడియా నిర్వహించాలి. మేము మరిన్ని పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నాం. – హుమేమ, మహి, 4వ తరగతి విద్యార్థులు, విద్యోదయ అపెక్స్ స్కూల్, నెల్లూరు భయం పోయింది గతంలో ఇంగ్లిషు భాష అంటే కాస్త జంకేవాళ్లం. సాక్షి స్పెల్బీ పోటీ పరీక్షలకు హజరుకావడంతో ఆ భయం పోయింది. ఆంగ్లభాష అంటే ఇంతేనా అని మాపై మాకు నమ్మకం కలిగింది. భాషపై పట్టుతో పాటు స్పెల్లింగ్, పదాల ఉచ్ఛారణ తెలుసుకున్నాం. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు. – చరణి, సాత్విక్, 6వతరగతి విద్యార్థులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వైఎస్సార్ కడప జిల్లా -
అమ్మ ఆఖరి చూపు కోసం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తల్లి ఇక లేరనే మాట విని ఆ కన్న కొడుకు గుండె బరువెక్కింది. కన్నీళ్లతో అమ్మను స్మరిస్తూ.. అమ్మ ఆఖరి చూపు కోసం కష్టాలు అన్నీఇన్ని కావు. విదేశం నుంచి స్వదేశం చేరుకోవడానికి యూఎస్లో ఫ్లైట్ టిక్కెట్ దొరకని పరిస్థితి. ఆదివారం అమ్మ కరుణతో..అధిక రేటుకు టిక్కెట్ చిక్కింది. హుటాహుటిన బయలు దేరిన ఆ కొడుకు భసవంత్రెడ్డి సొంతూరుకు చేరుకొని తల్లి శ్రీకళాదేవి మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అంత్యక్రియలు సమాప్తం.. తీర్థయాత్రలకు వెళ్లిన చిత్తూరు వాసులు పలు వురు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈక్రమంలో గిరింపేట మరాఠివీధికి చెందిన శ్రీకళాదేవి (64) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టు మార్టు గదిలో ఉంచారు. యూఎస్ నుంచి కు మారుడు భసవంత్రెడ్డి ఆదివారం ఉదయం చిత్తూరుకు చేరుకోగానే ఇంటి కి వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆపై స్వగ్రామమై న శేషాచలపురం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా మృతురాలి ఇంటి విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడికి ఓదార్పు స్వగ్రామానికి చేరుకున్న శ్రీకళాదేవి మృతదేహానికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి నివాళులర్పించి బాధితరాలు కుమారుడిని ఓదార్చారు. విదేశాల నుంచి స్వదేశం చేరుకోవడానికి పడ్డ కష్టాలను చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు విజయ్రెడ్డి తదితరులున్నారు. పలమనేరు : దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ ఉన్నత చదువుల్లో ఉండడంతో తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అవే వారి చివరి యాత్ర గా మారుతాయని అనుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన సునంద, శివశంకర్ రెడ్డి దంపతులు ఇద్దరూ అసువులు బాశారు. వీరి మృతదేహాలు శనివారం పలమనేరుకు చేరుకున్నాయి. వీరి అంత్యక్రియలు పెద్దపంజాణి మండలం లింగాపురంలో ఆదివారం నిర్వహించారు. అశ్రునయనాల మధ్య ఇద్దరినీ ఒకేచోట ఆ భార్యాభర్తలను పలమనేరు పట్టణం మీదుగా తీసుకెళ్లి పెద్దపంజాణి మండలంలోని లింగాపురంలో వారి సొంత భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ హృదయ విచారకర సంఘటన అక్కడున్న వారిని కలచివేసింది. ఇలా ఉండగా బీడీఎస్ చేస్తున్న వీరి కుమారుడు వేంకటసాయి దిక్కులేనివాడిగా మారాడు. కలిసి బతికారు.. కలిసే కన్నుమూశారు.. -
అదరగొట్టిన అరగొండ ఆణిముత్యం
మన అమ్మాయే మిస్ ఆంధ్ర రన్నరప్ ● 15 ఏళ్లకే రాష్ట్ర స్థాయిలో మెరిసిన బాలిక సహస్ర తవణంపల్లె : మండలంలోని అరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ కుమార్తె సహస్ర 15 ఏళ్లకే పదో తరగతి చదువుకొంటూ.. టీనేజీ విభాగం అందాల పోటీల్లో మిస్ ఆంధ్ర రన్నరప్గా నిలిచి రాష్ట్ర స్థాయిలో అరగొండ పేరు ను నిలబెట్టింది. అరగొండకు చెందిన శ్రీధర్, భార్య పల్లవి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ బెంగుళూ రులో స్థిరపడ్డారు. తమ ఏకై క కుమార్తె సహస్ర బెంగుళూరులోని ఓర్కిడ్జ్ ఇంజర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సహస్రకు చిన్న నాటి నుంచి అందాల షోలో పాల్గొనడం, క్రికెట్తో పాటు డాన్స్పై మక్కువ. ఇంటర్ నేషనల్ స్కూల్లో అందాలు షోలు నిర్వహించి సహస్రను బాగా ప్రోత్సహించారు. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి బెంగుళూరులోని కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ స్కూల్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. డాన్స్లోనూ రాణిస్తోంది. సహస్ర అభిరుచికి అనుగుణంగా ప్రోత్సాహం ఇవ్వడంతో రాష్ట్ర స్థాయిలో మిస్ ఆంధ్ర పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది. క్రికెట్లోనూ మంచి కోచింగ్ తీసుకొని 15 సంవత్సరాలు తర్వాత జాతీయ స్థాయిలో రాణి స్తుందని తల్లిదండ్రులు ఆకాక్షించారు. ఓర్కిడ్జ్ ఇంజర్నేషనల్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు అందాల షోలు నిర్వహించి ప్రోత్సహించడం వల్లే తమ కుమార్తె సహస్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో స్థానం సంపాదించిందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పవి త్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అరగొండ పేరును రాష్ట్ర స్థాయిలో సహస్ర మారుమోగించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
వద్దురా కన్నా.. ఇది హైవేరా చిన్నా !
హైవేలో రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు, వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అవగాహన లేని డ్రైవింగ్, అతివేగం, తొందరపాటు నిర్ణయాలతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటిదే ఆదివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అంతంతమాత్రం అనుభవం ఉన్న ఓ మైనర్ బాలుడు మరో ముగ్గురిని కూర్చోబెట్టుకుని ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య ఇలాంటి ప్రయాణాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. – గుడిపాల -
చంద్రబాబు ప్రభుత్వం రైతులను విస్మరించింది
నగరి: చంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తి గా విస్మరించిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వరి రైతులు నిలదీస్తే మంత్రి పార్థసారథి ప్రస్టేషన్కు వెళ్లిపోయారన్నారు. జగనన్న పాలనలో రైతుల్ని కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వారానికి ఇద్దరు రైతులు చనిపోతున్నారని గుర్తుచేశారు. 18 నెలల కాలంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక హెలి కాప్టర్లలో జల్సాలు చేస్తూ విహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరి, మామిడి, చెరు కు, ఉల్లి, పొగాకు, టమాట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తుంటే వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నా రు. రైతులకు మేలు చేయని వారు పదవుల్లో ఉండడానికి అనర్హులని వారు వెంటనే రాజీనామా చేయాలన్నారు. బోయకొండకు పోటెత్తిన భక్తులు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు దీపాలు వెలిగించి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. క్యూలెన్లలో భక్తుల రద్దీ కారణంగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొండపై చలి తీవ్రత అధికం కావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
నూతన వసతి గృహానికి భూమి పూజ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన సంక్షేమ వసతి గృహం ఉపయోగకరమని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో రూ.కోటి బడ్జెట్తో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన కణ్ణన్ పాఠశాల, కళాశాల అభివృద్ధికి వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్మన్ కఠారి హేమలత, కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మౌలా పాల్గొన్నారు. -
ఎలా బతికేది తల్లీ?
● జిల్లాకు చేరిన చింతూరు రోడ్డు ప్రమాద మృతదేహాలు ● కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు ● ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ చిత్తూరురూరల్ (కాణిపాకం): ‘ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలా..? యాత్రకు పోబుద్ధి లేదన్నావే. అందరొచ్చారు..లేవ య్యా’ అంటూ మృతుడు నాగేశ్వరరావు భార్య అముల్ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుక్రవారం వేకువజామున చింతూరులో జరిగిన ఘూర రోడ్డు ప్రమాదంలో చిత్తూ రు నగరానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అందులో నాగేశ్వరరావు (68), శ్రీకళాదేవి (64), శ్యామల(67) ఉన్నారు. అలాగే తవణంపల్లి మండలం, నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37)కూడా మృతిచెందారు. ఈ మృతదేహాలు శనివారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. ఒంటరిదాన్ని చేశావయ్యా! చిత్తూరు నగరం, గిరింపేటలోని మరాఠి వీధికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహం చింతూరు నుంచి మధ్యా హ్నం 3.15 గంటలకు ఇంటికి చేరింది. దీంతో మరాఠివీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, కుటుంబీకులతో ఇంటివద్ద ఆర్తనాదాలు మిన్నంటాయి. భర్త మృతదేహం వద్ద భార్య అముల్భాయ్ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఇన్నాళ్లు ఇద్దరున్నాం.. ఇప్పుడు ఒంటరిదాన్ని చేశావంటూ ఆమె రోదించిన తీరు గుండెలు బరువెక్కేలా చేసింది. అనంతరం 4.30 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కొలిచి..గుండెలవిసి! మరాఠివీధిలోని నాగేశ్వరరావు, అముల్భాయ్ ఆ ధ్యాత్మిక దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సకలదేవతలను పూజించేశారు. ని త్యం పూజలు చేస్తూ గడిపేవారు. దేవుడంటే అపారమైన భక్తి. ఎక్కడ పూజలు జరిగినా ముందు వరుసలో నిలిచేవాళ్లు. ఆ చింతన అయ్యప్పస్వామి భక్త భజన మండలిలో వీళ్లకు సభ్యులుగా అవకాశం క ల్పించారు. దుర్గానగర్ కాలనీలో జరిగే అయ్యప్పస్వామి భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవా రని ఆ వీధిలోని వారు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్తూరు ఆస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహం చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహాన్ని భద్రపరిచారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కొడుకు భసవంత్రెడ్డి శనివా రం యూఎస్ఏ నుంచి స్వదేశం రానున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు చేయనున్నట్టు ఆమె బంధువులు పేర్కొన్నారు. శ్యామలకు తుది వీడ్కోలు చిత్తూరు కార్పొరేషన్: చింతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరుకు చెందిన ట్రాన్స్కో విశ్రాంత ఉద్యోగి శ్యామల(67)కు శనివారం తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అక్కడి నుంచి స్థానిక కొంగారెడ్డిపల్లెలో ఆమె తమ్ముడు విశ్రాంత ఎస్ఐ సదాశివంరెడ్డి నివాసం వద్దకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శ్యామల కుమారుడు ప్రసాద్, ఆయన భార్య సరిత, కూతురు నీలిమ, మనవరాళ్లు యుక్త, ముక్త, దీక్షిత ఆమెను చూసి ఏడ్చేశారు. టూరుకు వెళ్లకపోయినా బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో ఉన్న అనుభవాలను నెమరువేసుకున్నారు. పర్యాటకాన్ని ఇష్టపడే శ్యామల గత నెలలో నీలిమ, దీక్షితతో కలిసి సింగపూర్కు వెళ్లినట్లు సీనియర్ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. శ్యామల అన్నలు రామ్కుమార్రెడ్డి, సదాశివంరెడ్డి, వదినలు పుష్పలత, సంపూర్ణమ్మ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తలు సునంద, శివశంకర్రెడ్డి (ఫైల్) సంతాపం మృతురాలు శ్యామలకు వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడి సంతాపం తెలిపారు. ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆ పార్టీ ఉద్యోగుల, పెన్షన్సర్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, ట్రాన్స్కో అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్ని శ్రద్ధాంజలి ఘటించారు. అప్పుడే వెళ్లిపోయావా ‘దొర’! తవణంపల్లె: ‘రుచికరమైన వంటలు చేసి అందరి మనసు దోచుకున్నావు. భార్యా, బిడ్డలకు కూడా లోటులేకుండా చూసుకున్నావు. ఇప్పుడు హఠాత్తుగా మమ్మల్ని వదిలివెళ్లావు. మాకె దిక్కెవరు స్వామీ’ అంటూ మండలంలోని నారసింహనపల్లెకు చెందిన దొరబాబు మృతదేహం వద్ద భార్య, బిడ్డలు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు– మారేడుమిల్లి ఘాట్ రోడ్డు, రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37) మృతిచెందారు. ఆయన వంట మాస్టర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. మృతునికి భార్య సుమలత, కుమార్తెలు పావని, మౌనిక, కుమారుడు మోహన్కృష్ణ ఉన్నారు. తన తండ్రి మృతదేహం వద్ద పిల్లలు రోదిస్తూ.. ఆర్తనాదాలు పెట్టడం గుండెల్ని మెలిపెట్టింది. ‘నా పిల్లలకు తండ్రిని దూరం చేశావా..దేవుడా..! ఇక మా కు దిక్కెవరు స్వామీ’ అంటూ మృతుని భార్య గుండెలు బాదుకుంటూ రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. అనంతరం దొరబాబు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
17న మొగిలిలో తలనీలాల పోగు వేలం
బంగారుపాళెం: మండలంలోని మొగిలీశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17న తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి బహి రంగ వేలం నిర్వహించనున్నటు ఈఓ ముని రాజ శనివారం తెలిపారు. ఆలయం ఆవరణ లో ఉదయం 10.30 గంటలకు దేవదాయశాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం ఉంటుందన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ.10 వేలు ఽడిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. వివరాలకు కార్యాయలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు. ఓపెన్ చెస్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ పోస్టర్ను ఆంధ్ర చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఆర్బీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ మేరకు శనివారం ఆ సంఘం జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న చిత్తూరులో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో గెలుపొందే విజేతలకు రూ.1.29 లక్షల విలువ గల నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. పేర్ల నమోదుకు 98493 13676, 90004 75799ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు దినేష్, గిరిధర్, కృష్ణకిశోర్, మల్లికార్జున పాల్గొన్నారు. గ్రేడ్ 2 నుంచి జేఎల్ఎంలుగా మార్పు చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ పరిధిలో పనిచేస్తున్న జేఎల్ఎం గ్రేడ్–2ను పోస్టులను జేఎల్ఎంలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు సచివాలయ పరిధిలో అందుబాటులో ఉంటూ సంబంఽధిత ట్రాన్స్కో సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 285 మంది ఉండగా వీరికి జేఎల్ఎం గ్రేడ్–2 హోదా ప్రకారం బేసిక్ పే రూ.23,780 చొప్పున జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం వారిని జేఎల్ఎంలుగా గుర్తించడంతో రూ.30,800 చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఇక వీరికి ట్రాన్స్కో ఉద్యోగులు విధివిధానాలు వర్తించనున్నాయి. ‘విశ్వం’కు బెస్ట్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఇటీవల 2025– 26 విద్యా సంవత్సరానికి గాను తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్కు ‘‘బెస్ట్ అకడమిక్ ఎక్సలెన్న్స్ స్కూల్’’, ‘‘బెస్ట్ ఇన్న్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్’ అవార్డులు సొంతం చేసుకుంది. విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ విశ్వనాథ్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వం పాఠశాలలో నాణ్యత, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజీలేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి భావాలను అలవరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇటీవల తిరుపతిలో వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో జిల్లాలోని రద్దీ ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. శనివారం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మహిళ మృతి సదుం: కారు ఢీకొన్న ప్రమాదంలో మండలానికి చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్తుల కథనం మేరకు.. మర్రిమాకులపల్లెకు చెందిన ద్వారకనాథనాయుడు భార్య వనజ (40) అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో ని కంచెవారిపల్లె వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. బలమై న గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహానికి శనివారం అత్యక్రియలు నిర్వహించారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పకడ్బందీగా కెరీర్ ఫెస్ట్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కెరీర్ ఫెస్ట్ను పకడ్బందీగా నిర్వహించాలని సమగ్రశిక్షశాఖ ఏపీసీ వెంకటరమణ ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో కెరీర్ ఫెస్ట్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కెరీర్ ఫెస్ట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న జిల్లా స్థాయిలో కెరీర్ ప్రదర్శనను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేజీబీవీ జీసీడీవో ఇంద్రాణి, కెరీర్ఫెస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ ఛాయేంద్రకుమార్ పాల్గొన్నారు. రాజీమార్గమే ఉత్తమం చిత్తూరు లీగల్: న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి రాజీమార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. జిల్లా న్యాయ స్థానాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను జిల్లా జడ్జి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్న తరువాత దీనిపై అప్పీలుకు వెళ్లడానికి వీలుండదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్ కోసం 32 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒకటే మార్గం అన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, శ్రీదేవి, ఉమాదేవి, మాధవి, షేక్ బాబాజాన్, వెన్నెల, చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శంకర్ నాయుడు పాల్గొన్నారు. ఆటోను ఢీకొన్న కారు – ఆరుగురికి గాయాలు బంగారుపాళెం: మండలంలోని నల్లంగాడు గ్రామం వద్ద శనివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. తుంబకుప్పం నుంచి బంగారుపాళెం వస్తున్న ప్యాసింజర్ ఆటోను నల్లంగాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నల్లంగాడు, పెరుమాళ్లపల్లెకు చెందిన ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,202 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,864 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. -
భలే ఫేమస్!
కోట్లలో వ్యాపారాలు పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంత రాష్ట్రంలోనే ఫేమస్. ఇక్కడికి ఖరీదైన కార్లతోపాటు అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారులు క్యూ కడుతుంటారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంటారు. వారంలో ఒక్క శనివారం మాత్రమే జరిగే ఈ సంతలో కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. బక్రీద్, రంజాన్ తదితర పండుగ రోజుల్లో అయితే ఇది రెట్టింపు అవుతుంటుంది. అసలు ఒక్క పొట్టేళ్ల సంత ఇంత ఫేమస్ కావడానికి కారణాలేంటో మీరే ఓ లుక్కేయండి. పలమనేరు: రుచికరమైన భోజనాలు.. నాణ్యమైన ఆహార పదారాలు దొరుకుతాయంటే ప్రజలు ఎంత దూరమైనా వెళ్లిపోతుంటారు. తమకిష్టమైన వాటిని ఆరగిస్తుంటారు. అలాగే తమకవసరమైన వంటకాలను ఇళ్లకు తెచ్చుకుని కుటుంబ సభ్యులతో కలిసి భుజిస్తుంటారు. అలా ఒక్కోదానికి ఒక్కోరకంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇలాంటిదే పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంత రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ నుంచి సైతం వ్యాపారులు వచ్చి నచ్చిన పొట్టేళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన కార్లలో రాక ఇక్కడ కొన్న మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను ఎక్కువగా కొనే వ్యాపారులు టెంపోల్లో తరలిస్తుంటారు. చాలామంది వీటి కోసం కార్లలో వచ్చి తీసుకెళుతుంటారు. నచ్చిన పొట్టేళ్లను కొని కార్లలో దూర ప్రాంతాలకు తరలిస్తుంటారు. సాధరణంగా కొత్తగా ఈ సంతకు వచ్చే వారెవరైనా ఇక్కడ కనిపించే వందల కొద్దీ ఖరీదైన కార్లను చూసి ఇన్ని కార్లు ఎందుకొచ్చాయంటూ ఆశ్చర్యపోవాల్సిందే. వారపు సంత రోజు కిలోమీటర్ల మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్లు, వాహనాలను అదుపు చేసేందుకు పోలసులుండాల్సిదే. ఆ రెండు పండుగల కోసమే బక్రీద్ పండుగలో మాంసాహారం చాలా ముఖ్యం. స్థోమతగల ముస్లిం కుటుంబీకులు ఖుర్భానీ పేరిట పేదలకు మాంసాన్ని దానం చేస్తారు. ఈ పండుగకు ఎంత ఖరీదైన పొట్టేళు, మేకలను కొంటే వారికి అంత గౌరవంగా భావిస్తారు ముస్లింలు. అసలు ఈ పండుగ కోసమే ఈ ప్రాంతంలో చాలామంది పొట్టేళ్లను సంరక్షిస్తుంటారు. ఏడాదంతా వీటిని సాకి బక్రీద్కు మాత్రమే విక్రయిస్తుంటారు. పలు ప్రాంతాల నుంచి జీవాలు కేవలం బైరెడ్డిపల్లి సంతలో విక్రయించేందుకు ఉమ్మడి చిత్తూరు, అనంతపూర్ జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. వీటకి పచ్చి గడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి సంరక్షిస్తారు. దీంతో కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. వీటని ఇక్కడి సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. సంతలో జరిగే చేతి రుమాలు కింది వ్యాపారం బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంతకు క్యూ కడుతున్న వ్యాపారులు ఒక్కడి సంతలో కోట్ల రూపాయల మేర వ్యాపారాలు జరుగుతుంటాయి. గత బక్రీద్ సంత మాత్రమే రూ.20 కోట్ల దాకా వ్యాపారం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణ శనివారాల్లో ఇక్కడికి 20వేలకు పైగా పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు వస్తుండగా పండుగ సంతలకు సుమారుగా 40 వేల నుంచి 50 వేలదాకా వస్తుంటాయి. జత పొట్టేళ్లు రూ.40 వేల నుంచి అత్యధికంగా రూ.2 లక్షలకు పైగా పలుకుతుంటాయి. -
వణుకు పుట్టిస్తోంది!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 7 దాకా దట్టంగా మంచు కురుస్తోంది. జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు. మరోవైపు వాహనదారులకు ముప్పు తిప్పలు ఎదుర్కొంటున్నారు. పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. ఇక ఈనెల 25న క్రిస్మస్, డిసెంబర్ 31, జనవరి 1, సంక్రాంతి పండుగలు ఉండడంతో జర్నీకి ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిపించని రోడ్లు రోడ్లపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం నుంచి మంచు ప్రభావం పెరుగుతోంది. 100 నుంచి 200 మీటర్ల వరకు రోడ్డు కనిపించడం లేదు. ఉదయం 9 దాటినా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. దగ్గరికి వచ్చే దాకా ఎదురుగా వచ్చే బండ్లు కానరావడం లేదు. వాహనం ముందు దారుందో, వాహనం ఆగి ఉందో తెలియడం లేదు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు బెంగళూరు మార్గం, చిత్తూరు–వేలూరు, చిత్తూరు–పుత్తూరు, పలమనేరు–కుప్పం, ఇరువారం క్రాస్–తిరుపతి, పలమనేరు– పుంగనూరు రహదారులపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో దట్టమైన మంచు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే కొత్త రోడ్లపై మలుపులు, రహదారుల స్థితిగతులపై అవగాహన ఉండాలి మంచు తెరలు తొలిగిపోయాకే ప్రయాణాన్ని కొనసాగించాలి. వాహనానికి వెనుక, ముందు రేడియం స్టికర్లను అతికించాలి. వాహనానికి ఫాగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవాలి. పసుపు వర్ణంతో వెలిగే ఈ దీపాలు శీతాకాలంలో ఎంతో మంచిది. –బండి స్పీడ్ లిమిట్లో పెట్టుకోవాలి. ముందు వెళ్తున్న వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయొద్దు. వెహికల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి వాహనాలను రోడ్ల పక్కకు తీసుకెళ్లి ఖాళీ ప్రదేశంలో లేదా వెలుతురు ఉన్న చోట నిలపాలి. బండి ఆగిపోతే నంబరు 100కు ఫోన్న్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి అద్దాలను తుడిచే వైఫర్లు సక్రమంగా ఉంచుకోవాలి. వాహనం పూర్తిగా కండిషన్న్లో ఉండాలి -
ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడిగా రాఘవులు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా రాఘవులు (జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి) వరుసగా రెండో సారి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 17 స్థానాలకు గాను చిత్తూరు జిల్లాలోని 6 తాలూకాల పరిధిలోని 18 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో కార్యదర్శి పదవికి రెండు నామినేషన్లు దాఖలు కాగా, మిగిలిన స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. అయితే యూనియన్ నేతల రాజీయత్నాల అనంతరం కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన మహేష్ అనే ఉద్యోగి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అధ్యక్షులుగా రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా మురళి (డీఈవో కార్యాలయం) ఎన్నికయ్యారు. వీరితో పాటు 14 మంది కార్యవర్గ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికై న రాఘవులు విలేకరులతో మాట్లాడారు. తమ మూడేళ్ల పదవీకాలంలో జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సహ ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ సెక్రటరీ శ్యామసుందరరావు, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వరరావు వ్యవహరించారు. -
విద్యార్థుల్లో పోటీతత్వం ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో పోటీతత్వం ముఖ్యమని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో నైపుణ్యం ఉంటుందన్నారు. విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. పోటీ పరీక్షల పట్ల ఆసక్తి చూపి ప్రతిభ సాధించాలన్నారు. ఈ ఏడాది నవంబర్ 27, 28 తేదీల్లో జిల్లా స్థాయిలో జరిగిన కౌశల్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. ఈ పోటీల్లో మొదటి ర్యాంకు సాధించిన 8వ తరగతి విద్యార్థిని సరే సబ్రిన్ (రొంపిచెర్ల, బాలికల పాఠశాల), 9వ తరగతిలో మహమ్మద్ సాహిబ్ (మున్సిపల్ హైస్కూల్, కొత్త ఇండ్లు, పుంగనూరు), 10వ తరగతిలో విశాల్ (జెడ్పీ, నెల్లేపల్లి, జీడీనెల్లూరు మండలం) ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారిని డీఈవో అభినందించారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1,500, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1000 చొప్పున నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించారు. జిల్లా సైన్స్ అధికారి అరుణ్కుమార్, కౌశల్ జిల్లా జాయింట్ కో–ఆర్డినేటర్ యుగంధర్రెడ్డి, గుడిపాల ఎంఈవో హసన్బాషా పాల్గొన్నారు. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని మంగళంపేట హైస్కూల్ను శనివారం కడప రీజనల్ జాయింట్ డైరెక్టరు శామ్యూల్ తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మేటివ్ అసెస్మెంట్–1 వంద రోజుల ప్రణాళిక పరీక్షలను పరిశీలించారు. ఉత్తమ మార్కులు సాధించిన మల్లేష్, ఆలియాతాజ్మిన్ ను అభినందించారు. అనంతరం పాఠశాలలో గ్రీనరీ, ఆర్వోసిస్టం, విద్యార్థుల మరుగుదొడ్లను తనిఖీ చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య, హెచ్ఎం ఫజురుల్లా పాల్గొన్నారు. -
చిరుత దాడిలో దూడ మృతి
ఐరాల : చిరుత పులి దాడిలో దూడ మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని చెంగనపల్లెలో చోటు చేసుకుంది. మండల అటవీశాఖ అధికారి రాకేష్కుమార్ కథనం మేరకు.. చెంగనపల్లెకు చెందిన మనోహర్ తన ఆవులతో పాటు దూడను ఉదయం గ్రామం సమీపంలోని కొత్త చెరువు వద్ద మేతకు వదిలి ఇంటికి వచ్చాడు. తిరిగీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. దూడ పొదుగు భాగంలో కొరికిన ఆనవాళ్లు ఉండటంతో చిరుత దాడి చేసిందని నిర్ధారించారు. పశువులను మేత కోసం కొత్త చెరువు వద్ద ఉంచరాదని సూచించారు. రైతులు, ప్రజలు రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లరాదని కోరారు. మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తిపై కేసు పుంగనూరు : మండలంలోని అడవినాథునికుంటకు చెందిన మహేందర్రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని టి.వాసవి అనే మహి ళ వద్ద రూ.4.87 లక్షలు తీసుకుని మోసగించినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమ ణ తెలిపారు. శుక్రవారం రాత్రి ఎస్ఐ మాట్లాడుతూ.. బాధితురాలికి ఉద్యోగం ఇవ్వక, డబ్బులు ఇవ్వకుండా తన గ్రామానికి పిలిపించి, కుటుంబ సభ్యులతో చంపేస్తామని బెదిరించారని వాసవి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు మహేందర్రెడ్డి, రత్నారెడ్డి, విజయమ్మలపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడి నియామకం చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్సీపీలో జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మేకల శివకుమార్రెడ్డిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించినట్లు తెలిపారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బండి స్పీడు తగ్గించాలి చిత్తూరు రూరల్(కాణిపాకం) : బండి గమ్యం చేరడం..డ్రైవర్ చేతిలోనే ఉంటుందని, దీంతో పాటు బండి కండిషన్ కూడా అత్యంత ముఖ్యమని డీటీసీ నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ఉద్దేశించి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సు డ్రైవర్లు స్పీడు తగ్గించు కోవాలన్నారు. రోడ్డుపై వారికి పట్టు ఉండాలన్నారు. నిద్ర మత్తు ఉంటే బండిని పక్కన పెట్టడం మంచిదన్నారు. లేకుంటే రెండో డ్రైవర్కు బండి ఇచ్చి..కునుకు తీయాలన్నారు. గమ్యం చేరే వరకు ఏకాగ్రత కచ్చితంగా అవసరమన్నారు. చలి, వర్షాకాలంలో ఘాట్, పెద్ద మలుపులు ఉండే ప్రాంతాల్లో అతి జాగ్రత్తగా బండి నడపాలన్నారు. అలాంటి మార్గంలో అతి వేగం పనికిరాదన్నారు. నెమ్మదిగా వెళ్లడం మంచిదన్నారు. దట్టమైన మంచు కమ్ముకుని..రోడ్డు కనిపించని పక్షంలో బస్సును పక్కన పెట్టడం అత్యుత్తమన్నారు. లేకుంటే అన్ని లైట్లు ఆన్ చేసి అత్యంత జాగ్రత్తగా వెళ్లాలన్నారు. డేంజర్ జోన్లు, మలుపు బోర్డులను చూసుకుంటూ బస్సు నడపాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం దట్టమైన మంచు అని చెప్పారు. బస్సు నిర్వాహకులు ఎప్పటికప్పుడు బస్సు కండిషన్ను చూసుకోవాలన్నారు. డ్రైవర్లకు తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తూ ఉండాలన్నారు. డ్రైవింగ్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలన్నారు. బస్సుల నిర్వహణలో లోటుపాట్లు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రూ.20 లక్షల అంబులెన్స్ విరాళం కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అధికారులు శుక్రవారం అంబులెన్స్ను విరాళంగా ఇచ్చారు. రూ. 20 లక్షలు విలువ చేసే అంబులెన్స్ను బ్యాంకు చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బ్యాంకు అధికారులకు దర్శన సేవలు అందించారు. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు, ధనపాల్ సిబ్బంది వాసు తదితరులున్నారు. -
మద్యం షాపు వద్దంటూ మహిళల నిరసన
పుత్తూరు : తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం నడిబొడ్డున మద్యం షాపు ఏర్పాటుకు నాలుగోసారి ప్రయత్నించిన నిర్వాహకులకు నిరాశే మిగిలింది. శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా తిరుపతి రోడ్డులో గౌడ మద్యం షాపును తెరిచారు. విషయం తెలుసుకొన్న స్థానిక రామారావు, రామానాయుడు కాలనీలకు చెందిన మహిళలు షాపు ముందు బైఠాయించారు. దీంతో మద్యం షాపు వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకొన్న డీఎస్పీ రవికుమార్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు మద్యం షాపు నిర్వాహకులు అమ్మకాలు లేకపోయినా షాపును యథావిధిగా తెరిచే ఉంచారు. దీంతో మహిళల సంచారం ఎక్కువగా ఉన్న తిరుపతి రోడ్డులోని కాలనీల మధ్య షాపు ఏర్పాటు వద్దంటూ మహిళలు భీష్మించుకొని కూర్చొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు షాపు ముందే బైఠాయించి మద్యం అమ్మకాలు జరగకుండా అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పికెట్ వేసి కూర్చొన్నారు. ఇలా మద్యం షాపు ఏర్పాటును మహిళలు అడ్డుకోవడం ఇది నాల్గవసారి. గత నవంబర్ 5, 15, 22వ తేదీల్లోనూ ఇదే షాపు ప్రారంభోత్సవాలను స్థానిక మహిళలు అడ్డుకోవడం గమనార్హం. మద్యం షాపు వద్ద బైఠాయించిన మహిళలు, పక్కనే పోలీస్ పికెట్ రాత్రి అయినా మద్యం షాపు వద్ద మహిళల నిరసన -
● మృత్యుమార్గం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే పలు ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నా యి. బంగారుపాళ్యంలోని మొగిలిఘాట్ అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తించారు. అలాగే చిత్తూ రు నుంచి బంగారుపాళ్యం వెళ్లే మార్గంలో అక్కడక్కడా రెడ్జోన్గా బోర్డులు పడ్డా యి. పూతలపట్టు–తిరుప తి మార్గంలో తరచూ ప్రమాదాలు అవుతున్నాయి. నగరి–పుత్తూరు మార్గాల్లో మృత్యువు వెంటాడుతోంది. చిత్తూరు –వేలూరు మార్గంలో ప్రమాదాలు.. భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇరువారం బ్రిడ్జి నుంచి కాణిపాకంకు వెళ్లే మార్గంలో కూడా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. జీడీనెల్లూరు–పుత్తూరు రోడ్డు కూడా మృత్యువు కబళిస్తోంది. జిల్లా యంత్రాంగం స్పందించి మృత్యు మార్గాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. -
36 బైక్లు..ముగ్గురు దొంగలు అరెస్టు
గుడిపాల : వారందరూ కరుడుగట్టిన దొంగలు. ఇదివరలోనే చిత్తూరు, తమిళనాడులో పలు కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి అక్కడున్న వారితో పరిచయాలు పెంచుకొని బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడేవారు. వీరందరూ కలిసి తమిళనాడులో 34 ద్విచక్ర వాహనాలు, చిత్తూరు ప్రాంతంలో రెండు వాహనాలను చోరీ చేసుకొని తక్కువ ధరకు అమ్మేవారు. వీరిని గుడిపాల పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి బైక్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గుడిపాల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ.. గుడిపాల పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు బైక్ దొంగలను పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. గుడిపాల మండలం చిత్తపారకు చెందిన కిరణ్కుమార్( 34), తమిళనాడు రాష్ట్రం కాట్పాడి సమీపంలోని లత్తేరికి చెందిన వైరముత్తు(39), కాట్పాడికి చెందిన జయసూర్య(35) కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారన్నారు. వీరితో పాటు గుడిపాల మండలం పల్లూరు గ్రామానికి జయప్రకాష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. 2024 సంవత్సరంలో కాట్పాడి, వేలూరులో దొంగతనం చేసి ఆంధ్రాలో మోటార్ సైకిళ్లు అమ్ముతుండగా కాట్పాడి పోలీసులు పట్టుకొని వారిని జైలుకు పంపారన్నారు. జైలులో ఉన్నప్పుడు లత్తేరికి చెందిన వైరముత్తుతో పరిచయం ఏర్పడి జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొని ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత కిరణ్, వైరముత్తు, జయప్రకాష్, జయసూర్య అందరూ కలిసి గుడిపాల, యాదమరి, వేలూరు జిల్లాలో 36 బైక్లను దొంగతనం చేశారు. వారిని గొల్లమడుగు వద్ద అరెస్టు చేసి, బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. ఇందులో కిరణ్పై 8 కేసులు, వైరముత్తుపై 29 కేసులు, జయసూర్యపై 3 కేసులు ఉన్నాయని జయప్రకాష్ పరారీలో ఉన్నట్లు అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. సీఐ శ్రీధర్నాయుడు, ఎస్ఐ రామ్మోహన్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద సూచికల ఏర్పాటు, సోలార్ బ్లింకర్లను, రోడ్ సైన్బోర్డులు, రోడ్డు మార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమం పై సమీక్షించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 22 పాఠశాలల్లో ఓఎస్ఎస్ఏటీ సంస్థ సహకారంతో టీచర్లు, విద్యార్థులు సాంకేతిక ఆధారిత విద్యపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు. -
వేతనాలు పెంచాల్సిందే!
– కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : అంగన్వాడీ కార్యకర్తల వేత నాలు పెంచి తీరాల్సిందేనని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడు తూ.. పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోగలమన్నారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్న చంద్రబాబు ప్రభు త్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. వేతనాల పెంపు చేయకపోగా పనిభారం పెంచారన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఎక్కువైనట్లు తెలిపారు. శిశు సంక్షేమ శాఖా మంత్రి రకరకాలుగా సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీచేసిన అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారన్నారు. దీని బట్టి వ్యతిరేకత ఎలా ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చేబుతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో మోహన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గుప్తా, అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రమీల, మమత, లీలావతి, మమత, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నాభర్తకు ఏమైందీ..స్వామి ఎవ్వరూ చెప్పలేదేం..!
తవణంపల్లె : నాభర్తకు ఏమైందీ...స్వామి ఎవ్వరూ ఏమీ చెప్పరేం...బంధువులంతా ఇంటికి వస్తుంటే ఏమో అయిందీ..కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. నా భర్త క్షేమంగా తిరిగి వస్తాడు కదా.. అని బస్సు బోల్తాపడిన ప్రమాదంలో మృతి చెందిన దొరబాబు(37) భార్య సుమలత కన్నీటి పర్యంతమయ్యారు. తవణంపల్లె మండలం నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37) వంట మాస్టర్గా పనులు చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇతడికి భార్య సుమలత, కుమార్తెలు పావని, మౌనిక, మోహన్కృష్ణ ఉన్నారు. పావని చెర్లోపల్లె హైస్కూల్లో 9వ తరగతి, మౌనిక 7 వ తరగతి, మోహన్కృష్ణ 6 వ తరగతి హాస్టల్లో చదువుతున్నారు. సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దట్టమైన అటవీప్రాంతంలో బస్సు లోయలో బోల్తా పడి జరిగిన ఘోర ప్రమాదం దొరబాబు మృతి చెందాడు. భర్త మృతి చెందిన విషయం తెలిస్తే భార్య ఏమౌతుందోనని బంధువులు భర్త మరణవార్త చెప్పకుండా గోప్యంగా ఉంచి ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ బంధువులందరూ ఇంటి దగ్గరకు చేరుకోవడంతో మృతుడి భార్య సుమలత కన్నీటి పర్యంతమవుతున్నారు. నాభర్తకు ఏమైనా జరిగితే బిడ్డలు నేను ఎలా బతకాలని కన్నీమున్నీరయ్యారు. -
విషాద యాత్ర
చిత్తూరు అర్బన్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు–మారేడు మిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద బస్సు లోయలో పడ్డ ప్రమాదంలో చిత్తూరు , తిరుపతి జిల్లాలకు చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయాల సందర్శన, దైవ దర్శనం కోసం వెళ్లిన విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ఈ ప్రమాదంలో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు (68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ (70), శ్యామల (67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు (37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకర రెడ్డి (47), సునంద (45), పెనుమూరుకు చెందిన క్రిష్ణకుమారి (47), తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన తెనాలి శైలజా రాణి(64) దుర్మరణం పాలయ్యారు. కాగా చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. ఒకరికొకరు అలా.. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం నుంచి ఈనెల 6వ తేదీన విఘ్నేశ్వర ట్రావెల్స్ పేరిట ఉన్న బస్సు విహార యాత్రకు బయలుదేరింది. 32 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఓ వంట మనిషి, ట్రావెల్ ఏజెంటు మొత్తం 37 మందితో కలిసి చిత్తూరు నుంచి బస్సు బయలు దేరింది. అయితే ఇందులో ఉన్న ప్రయాణికుల్లో కొందరు భార్యాభర్త, మరికొందరు ఒంటరిగా విహార యాత్రకు వెళ్లారు. వీరిలో చాలా మందికి ఒకరికొకరితో పెద్దగా పరిచయాలు లేవు. చిత్తూరులోని దొడ్డిపల్లెకు చెందిన ట్రావెల్ ఏజెంటు వజ్రమణి అనే వ్యక్తి ఏటా నాలుగు సార్లు విహార యాత్రలు ప్లాన్ చేస్తుంటాడు. ప్రధానంగా హిందూ ఆలయాల సందర్శన కోసం పలువురు వృద్ధులను తీసుకెళుతుంటాడు. ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకు గతంలో వెళ్లిన విహార యాత్రల ద్వారా పరిచయమైన వాళ్లే. ఒకరికొకరు తోడు అన్నట్లు.. ఏటా కచ్చితంగా ఒక్క విహారయాత్రకై నా చిత్తూరు వాసులు కలుస్తుంటారు. భోజనంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.10,500 చొప్పున వసూలు చేసి, ఈ ప్యాకేజీను పెట్టారు. అరకు వెళ్లడానికి అదనంగా రూ.500 వసూలు చేశారు. ప్రధానంగా చిత్తూరులోని పాత కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న మరాఠ వీధికి చెందిన 12 మంది ఈసారి విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఒకే వీధికి చెందిన వాళ్లు కావడంతో మూడు నెలల క్రితమే ప్లాన్ చేసుకుని, ఒకరికొకరు మాట్లాడుకుని ఈ యాత్రకు బయలుదేరారు. 15 ప్రాంతాలు పూర్తి చేసి. మొత్తం వారం రోజుల విహార యాత్రలో 25 ప్రాంతాలను చూసేలా ముందస్తు ప్రణాళిక చేసుకున్నారు. చిత్తూరులో బయలుదేరిన బస్సు చిలకలూరిపేటలో హైదరాబాద్కు చెందిన వెంకటలక్ష్మి, చంద్రగోపాలరెడ్డిని ఎక్కించున్నారు. అటునుంచి తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు క్షీరలింగేశ్వరస్వామి ఆలయం, అంతర్వేది, వైశ్యపెనుగొండ, ద్రాక్షారామం, కొత్తపల్లె, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, సింహాచలం ప్రాంతాల్లోని ప్రముఖ హిందూ ఆలయాల్లో దైవ దర్శనం చేసుకున్నారు. అయిదు రోజుల పాటు సాగిన ఈ యాత్ర ఆరో రోజైన గురువారం అరకులో గడిపారు. ఆపై అరసవెళ్లి, రాజమండ్రి, భద్రాచలం చూసుకుని విజయవాడ మీదుగా శ్రీశైలం, మహానంది, అహోబిలం, బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట, తాళ్లపాక ప్రాంతాలను శుక్ర, శనివారాల్లో పూర్తి చేసుకుని తిరుపతి మీదుగా చిత్తూరుకు చేరుకోవాలని భావించారు. కానీ 15 ప్రాంతాలను చూసి, చివరకు ప్రమాదంలో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే..మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో క్షతగాత్రులు గాయపడ్డ వాళ్లల్లో చిత్తూరు నగరంలోని గిరింపేట, కట్టమంచి, దొడ్డిపల్లె ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. క్షతగాత్రుల్లో డ్రైవర్లు ఆర్.మధుశ్రీను (32), పోకల ప్రసాద్ (39), ట్రావెల్ ఏజెంటు వజ్రమణి (50)తో పాటు చిత్తూరుకు చెందిన వై.వెంకట నరసింహారెడ్డి (62), పాపర రమేష్బాబు (60), ఎస్కె.ముంతాజ్ బేగం (55), రాశిరెడ్డి మధుమతి (58), బొజ్జా పద్మజ (55), ఎస్కె.అశ్రఫ్ (54), ఎన్.స్వర్ణలత (75), తలపులపల్లె గోపిరెడ్డి (72), ఆయన భార్య తలపులపల్లె రమణమ్మ (66), కల్లూరి ప్రత్యూష (35), ఎస్.అమ్ములు బాయ్ (59), పాపర జవహరి (51), బి.భారతమ్మ(45), హైదరాబాద్కు చెందిన తిమ్మలచెరువు చంద్రగోపాలరెడ్డి (73),టి.వెంకటలక్ష్మి (60), కుప్పానికి చెందిన పి.విజయమ్మ (55), పాకాలకు చెందిన కె.రామస్వామిపిళ్లై (68) ఆయన సతీమణి కె.రుక్మిణిపిళ్లై (62), బెంగళూరుకు చెందిన కె.ఉషారాణి (60), పుంగనూరుకు చెందిన కె.నళిని (51), బెంగళూరుకు చెందిన చంద్రారెడ్డి (71), టి.గోపిరెడ్డి (72), వి.కుమారి (72), రామచంద్రన్ ఉన్నారు. తిరుచానూరులో విషాదం చంద్రగిరి : మారేడుమిల్లి ఘాట్రోడ్డులో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకు చెందిన విశ్రాంతి అధికారిణి ఈ ప్రమాదంలో తుదిశ్వాస విడిచింది. టెలిఫోన్ కాలనీకు చెందిన తెనాలి శైలజా రాణి(64), ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణికి రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటిరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆమెను చూసేందుకు పెద్దగా ఎవరూ లేకపోవడంతో తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. ఆరు నెలలకో, ఏడాదికోసారి ఆమె కుమారుడు వచ్చి వెళ్లేవాడని, అతడి వివరాలు ఎవరికి తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదిన ఇంటి ఓనర్ రామస్వామి పిళ్లై, రుక్మిణి పిళ్లై దంపతులతో కలసి శైలజరాణి తీర్థయాత్రలకు కోసం చిత్తూరుకు వెళ్లింది. దురదృష్టవశాత్తు శుక్రవారం మారేడుమిల్లి వద్ద తెల్లవారుజామున చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో శైలజరాణి మృతి చెందింది. రామస్వామి పిళ్లై, రుక్మిణి పిళ్లైలు గాయాలపాలయ్యారు. ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమెకు సుబ్బయ్య అనే తమ్ముడు ఉన్నట్లు గుర్తించారు. సుబ్బయ్య వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఒకే వీధిలో ఇద్దరు మృతులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో చిత్తూరు నగరం గిరింపేటలోని మరాఠివీధికి చెందిన ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే వీధిలో ఇద్దరు మృతి చెందడంతో ఆ వీధి శోకసంద్రంలో మునిగిపోయింది. నాగేశ్వరరావు కుటుంబ నేపథ్యం చిత్తూరు నగరం గిరింపేటలోని మరాఠివీధిలో రాజేశ్వరరావు(68), అముల్భాయ్ నివాసమున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. నాగేశ్వరరావు ఓ కంపెనీలో పనిచేస్తూ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. వచ్చే పెన్షన్ డబ్బులతో బతుకు జీవనం సాగిస్తున్నారు. నాలుగురోజులకు క్రితం విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాగేశ్వరరావును మృత్యువు కబళించింది. అముదభాయ్ తీవ్రగాయాలతో బయట పడ్డారు. మృతి చెందిన విషయాన్ని బంధువులకు ఫోన్ చేసి వివరించారు. వారి రాకతో ఇంటి వద్ద కన్నీటి సుడులు అలుముకున్నాయి. శ్రీకళాదేవి కుటుంబ నేపథ్యం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీకళాదేవి(64) కూడా చిత్తూరు నగరం గిరింపేటలోని మరాఠివీధినే. శ్రీకళ టీచర్గా పనిచేస్తూ రిటైరయ్యారు. భర్త రాజారెడ్డి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ... ఆరేళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు భసవంత్రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. ఇతను ప్రస్తుతం యూఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు. యూఎస్లో ఉన్న కుమారుడికి కూడా మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు తెలియజేశారు. శుక్రవారం ఉదయానికే వచ్చేస్తానని వెళ్లారని కంటతడిపెట్టారు. మనవరాలి స్వెట్టర్తో గుర్తింపు చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరుకు చెందిన ట్రాన్స్కో విశాంత్ర ఉద్యోగి శ్యామల(67) తీర్థయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. గతంలో చిత్తూరు స్థానిక బీవీరెడ్డి కాలనీలో నివాసం ఉండేవారు. విద్యుత్శాఖ అర్బన్ డివిజన్ ఈఆర్వో విభాగం సీనియర్ సహాయకురాలిగా పనిచేస్తూ 2018లో రిటైరయ్యారు. భర్త భాస్కర్రెడ్డి గంగాధరనెల్లూరు మండలంలో హెడ్మాస్టర్గా రిటైరయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ప్రసాద్ బెంగళూరు కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారు. కుతూరు నీలమ్మ హైదరబాద్లో నివాసముంటున్నారు. భర్త మరణం, అల్లుడు రవికుమార్ 2006లో మరణించడంతో నీలమ్మ పదవీ విరమణ అప్పటి నుంచి హైదరాబాద్లో కూతురు వద్దకు వెళ్లి సిర్థపడ్డారు. మలి వయస్సులో విహార యాత్రకు వెళతానని తిరుపతిలోని శ్యామల సోదరుడు నివాసంలో కొద్దిరోజులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. టూర్ బస్సులో తిరుపతి నుంచి వెళ్లినట్లు గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాదం విషయం న్యూస్ ఛానెల్ ద్వారా తెలుసుకున్న నీలిమ వాళ్ల అమ్మ ప్రయాణించే బస్సు ఉండదని అనుకున్నారు. తదుపరి శ్యామల ఫోన్ పనిచేయకపోవడంతో ట్రావెల్స్ వారి నంబర్లు తెలుసుకొని వివరాలు అడిగారు. వారు వివరాలు సక్రమంగా చెప్పలేకపోవడంతో ఆందోళన చెందారు. తీరా టీవీలో మనవరాలు దీక్షిత స్వెట్టర్తో ఉన్న శ్యామల వీడియోను చూశాక నిర్ధారణకు వచ్చామని కన్నీటి పర్యంతం చెందారు. మృతదేహం చిత్తూరుకు వచ్చాక దహనక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. దైవదర్శనం కోసం వెళ్లి కానరాని లోకాలకు.. పెనమూరు (కార్వేటినగరం) : దైవ దర్శనం కోసం వెళ్లిన క్రిష్ణకుమారి (47) బస్సు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండల బలిజపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. క్రిష్ణకుమారి, హరినాథరెడ్డి దంపతులకు ఒక కుమార్తె ఉంది. స్వస్థలం బలిజపల్లి గ్రామమైనా వ్యాపార నిమిత్తం బెంగళూరులోని కే ఆర్ పురం సమీపంలో బట్రహళ్లిలో స్థిరపడ్డారు. హరినాథరెడ్డి జేసీబీలు, హిటాచ్లు వంటి యంత్రాలను లీజుకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాల సందర్శనార్థం ఈ నెల 6వ తేదీ చిత్తూరు నుంచి బయలు దేరిన ప్రైవేటు బస్సులో బయలు దేరారు. అయితే భద్రాచలం సమీపంలోని మారేడుపల్లి వద్ద బస్సు అకస్మాత్తుగా లోయలో పడిన ఘటనలో కృష్ణకుమారి మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆమె భర్త హరినాథరెడ్డి , బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం కోసం పడిగాపుల కాస్తున్నట్లు సమాచారం. గ్రామంలో క్రిష్ణకుమారి బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు. -
ఆ బిడ్డకు దిక్కెవరమ్మా!
పలమనేరు : ఇద్దరు బిడ్డలను కనుక్కోమన్నా వినకుండా ఓ బిడ్డే చాలనుకున్నారే ఇప్పుడు మీరు లేకుండా ఆ బిడ్డకు దిక్కెవరమ్మా అంటూ నానమ్మ ఇంద్రానమ్మ పడుతున్న రోదనలు మిన్నంటాయి. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరు పట్టణానికి చెందిన సునంద,శివశంకర్రెడ్డి దంపతులు మృతి చెందారు. దీంతో వీరి ఒక్కగానొక్క బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ ఇక దొరకనట్టే. తల్లి పిలిచిందని.. పలమనేరు పట్ణణంలోని మునినారాయణ వీధికి చెందిన శివశంకర్ రెడ్డి(50) పెద్దపంజాణి మండలంలోని ఓ హేచరీలో సూపర్వైజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతని భార్య సునంద(45) ఇంటి వద్దే ఉంటోంది. వీరికి ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి తిరుపతిలోని ఓ కళాశాలలో బీడీఎస్ చదువుతున్నాడు. బిడ్డ డాక్టర్ కోర్సు కాగానే ఇక తమకు ఎలాంటి ఇబ్బందులుండవంటూ తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఇలా ఉండగా ఏపీటూర్ ఉందని మీరు తప్పకుండా రావాలని సునంద తల్లి చిత్తూరులో ఉంటున్న కుమారి(72)కి చెప్పడంతో భార్యాభర్తలు టూర్ కోసం ఇటీవల చిత్తూరుకెళ్లి టూరిస్ట్ బస్సులో కుమారితో కలిసి బయలుదేరారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా వీరి అత్త.. కుమారి గాయపడి భధ్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ దంపతులు కలిసే వెళ్లిపోయారు.... ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కడుచూపులోనూ కలిసే మృతి చెందడం అందరిని కలచి వేసింది. లోయలో బోల్తా పడిన బస్సు -
ఔరా.. తగునా?
చిత్తూరు నగరంలో పోలీసుల పనితీరుకు ఇక్కడ కనిపిస్తున్న చిత్రం చక్కని నిదర్శనం. బహిరంగ మద్యపానం, మద్యం సేవించి వాహనలు నడపడం, ఇదిగో ఇలా పోలీసుల కోసం ఏర్పాటు చేసిన డ్యూటీ బాక్స్లో మద్యం సేవించి తొంగోవడం.. చిత్తూరు కోర్టు వద్ద ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కోసం ఏర్పాటు చేసిన బాక్సులో ఓ వ్యక్తి మద్యం సేవించి ఇలా సేదతీరుతుండడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. చిత్తూరులో ఇవన్నీ మామూలే. అడిగే దిక్కులేదు.. అడిగినా ఎవరో ఒకరి ప్రముఖుడి పేరు చెప్పడం.. లేకుంటే అధికార పార్టీ అని జారుకోవడం ఇక్కడ షరా మామూలుగా మారిపోయింది. – చిత్తూరు అర్బన్ -
‘పది’పై ప్రత్యేక దృష్టి
చిత్తూరు కలెక్టరేట్ : పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి వహించి పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తామని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం కలెక్టర్ సుమిత్కుమార్గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను గతంలో రాయచోటి, బుక్కపట్నం డైట్ కళాశాలల్లో లెక్చరర్గా, రాయచోటిలో డీవైఈవోగా పనిచేశానని, చిత్తూరు జిల్లాకు డీఈవోగా నియమితులు కావ డం అదృష్టకరమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలలపై ప్రత్యేక దృష్టి వహిస్తానన్నారు. బడికి డుమ్మా కొట్టే టీచర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నా రు. టీచర్లు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించి, చిత్తూరు జిల్లా మంచి ఉత్తీర్ణతతో ముందడుగు వేసేలా చర్యలు చేపడుతానన్నారు. ఆకస్మిక తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం నూతన డీఈవోను ఏడీ లు వెంకటేశ్వరరావు, సుకుమార్, సిబ్బంది మురళి, గోపాల్, చైతన్య తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు సంఘాల నాయకులు డీఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు. -
అది గెలుపేనా?
నగరి : ప్రస్తుతం నిండ్ర, విజయపురం మండలాల్లో నిర్వహించిన ఎంిపీపీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నిర్వహించిన ఎన్నికలని, అందులో గెలిచినవారు పొలిటికల్ బఫూన్లని మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. ఎంపీపీ ఎన్నికలు జరిగిన తీరు పై గురువారం ఆమె మీడియా సమక్షంగా తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను వెన్నపోటు రాజకీయాలు చేసి నిర్వహించారన్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేసి లోపలకు వెళుతుంటూ చోద్యం చూసిన డీఎస్పీ, సీఐ, పోలీసు లు వైఎస్సార్సీపీకి 144 సెక్షన్ అంటూ దూరంగా పంపేశారన్నారు. విజయపురం మండలంలో 8 ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అని, నిండ్ర మండలంలో 7 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీవేనని.. వీరంద రూ ఫ్యాన్గుర్తుపై గెలిచినవారే అని ఆమె గుర్తుచేశా రు. నేడు వారు టీడీపీ అంటున్నారంటే ఎలాంటి నీచరాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుస్తోందన్నా రు. పోలీసులు, అధికారులను అడ్డంపెట్టుకొని మీడియాను దూరంగా పెట్టి ఎన్నికలు జరిపించిన తీరే ఈ ఎన్నికలు ఎలా జరిగాయో చెప్పడానికి నిదర్శనమన్నా రు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నామినేషన్ వేయడానికి వీల్లేకుండా అధికారులు వేధించారన్నారు. రెండు పార్టీలకు సమాన బలం వచ్చి టై అయితే లక్కీడిప్ పెట్టి ఎన్నుకోవాల్సి ఉంటే నిండ్రలో ఇద్దరు పోటీచేస్తే పది పేపర్లు భాస్కర్రెడ్డి అని రాసి వేశారని, దీంతో ఆ పేరే వచ్చిందని, విజయపురంలో లక్కీడిప్ చిన్న బిడ్డ తో తీయమని చెప్పారని, అలాతీస్తే మంజు బాలాజీ అని పేరువస్తే అధికారులు లక్ష్మీపతి రాజు అని ప్రకటించారన్నారు. అక్కడే ఉన్న మంజు బాలాజీ పేపర్ను తీసి తన పేరు ఉన్నట్లు అక్కడి కెమెరాలకు కూడా చూపడం జరిగిందన్నారు. అయినా అధికారులు లక్ష్మీపతిరాజు పేరే ప్రకటించడం దేశ చరిత్రలో జరగని నీచ సంఘటన అన్నారు. ఇలా జరుగుతుందని ముందే అధికారులకు తెలుసుకనుకే మీడియాను అనుమతించలేదన్నారు. క్రాకర్స్, పూలదండలు కూడా రెడీగా ఉంచుకున్నారంటే అధికారులు గెలిపిస్తారని వీరికి ముందే తెలిసినట్లుందన్నారు. పనికిమాలిన రాజకీయాలు చేస్తే.. పనికిమాలిన రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి హెచ్చరించారు. జగనన్న ఫొటోతో, వైఎస్సార్సీపీ ఇచ్చిన బీఫాంతో, ఫ్యాన్ గుర్తుపై గెలిచి, నేడు టీడీపీ పంచన చేరడం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టే అన్నారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి టీడీపీ గుర్తుపై గెలవాలన్నారు. వీరిని చూసి ఎవ్వరూ ఓటెయ్య లేదన్నారు. పార్టీని చూసి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తే వీరు గెలిచారన్నారు. ఇలా చేసిన వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. ఎన్నికల వ్యవహారంలో ఉన్న అధికారులను, పోలీసులను వదిలిపెట్టే ప్రశక్తే లేదన్నారు. గెలిచిన వారు పొలిటికల్ బఫూన్లు -
జాతీయ పోటీలకు జిల్లా షూటర్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : న్యూఢిల్లీ, భోపాల్ నగరాల్లో ఈ నెల 14నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్షిప్ పోటీల ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు షూటర్లు అర్హత సాధించారు. వీరిలో ఎం.అద్భుత వైష్ణవి, ఎ.హారిక, పి.హితేష్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో, ఎన్.సుష్మ, బి.నందగోపాల్ ఎయిర్ రైఫిల్ విభాగాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో వారిని డీఎస్డీఓ శశిధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం అధ్యక్షుడు దేవరాజ్, ఉపాధ్యక్షుడు ఎన్.సిద్ధయ్య, సంయుక్త కార్యదర్శి ఎ జె.జయరాజ్ తదితరులు అభినందించారు. -
ప్రజా పాలనలో బాబు విఫలం
రొంపిచెర్ల: ప్రజా పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన రొంపిచెర్ల మండలంలో శుక్రవారం పర్యటించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాల పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని తెలిపారు. సూపర్సిక్స్ పథకాలు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే అందే విధంగా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయం ప్రజలకు బాగా అర్థమైందన్నారు. 18 నెలల కాలంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్నారని విమర్శించారు. వరి, మామిడి, టమాట, నిమ్మ, అరటి పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. గిట్టుబాటు ధర అడిగితే వ్యవసాయం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని.. అందరు మానుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఇప్పుటికే విసిగిపోయారని అన్నారు. 18 నెలలకే ఇంత వ్యతిరేకత కనపడడం నేను ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలు, రైతులకు, ఉద్యోగులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. రొంపిచెర్ల మండలంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగడంవారిపల్లెలో రాజమ్మను పరామర్శిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కార్యకర్తలకు పరామర్శ రొంపిచెర్ల మండలంలో కష్టల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన గానుగచింత గ్రామ పంచాయతీ, జగడంవారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు హరినాథ్ తల్లి రాజమ్మను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన గానుగచింత నగిరిలో షఫీని పరామర్శించారు. కమ్మపల్లెకు చెందిన మునిరత్నం నాయుడును పరామర్శించారు. అలాగే ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలు కూల్చి వేసిన బొమ్మయ్యగారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కరుణాకర్ పట్టు పురుగుల షెడ్ను పరిశీలించారు. తమపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రికి వివరించారు. తాను అండగా ఉంటానని పెద్దిరెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సలీంబాషా, చెంచురెడ్డి, కరీముల్లా, కోటా వెంకటరమణ, చింతల ద్వారకనాథరెడ్డి, సూర్య నారాయణరెడ్డి, కమలాకర్రెడ్డి, హరికృష్ణారెడ్డి, శంకర్రెడ్డి, పెద్దిరెడ్డి దేవేంద్రరెడ్డి, విజయశేఖర్, ప్రేనంధం, రవీంద్ర, అమరనాథరెడ్డి, రాసారాయ నాయుడు, కుమార్నాయుడు, రాజాసాహెబ్, మహబుబ్బాషా, అల్లాబక్స్, బావాజీ, సైపూల్లాఖాన్, ఓబులేసు, యర్రం రెడ్డి, పాల్గొన్నారు. -
దేవుడి భూమికే శఠగోపం!
ఇరువారంలో 3.2 ఎకరాల దేవుడి మాన్యం సాక్షి టాస్క్ఫోర్స్: బాబు ప్రభుత్వంలో కొందరు నేతలు దేవుళ్ల భూములకు శఠగోపం పెడుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసేందుకు అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. అడ్డదిడ్డంగా భూములను నొక్కేసేందుకు పావులు కదుపుతున్నారు. లీజు పేరుతో ఆలయ భూములను అపన్నంగా దోచేయాలని ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో అర్చకులు, దేవదాయశాఖ అధికారులకు వల చేస్తున్నారు. ఓ సామాజికవర్గ బలాన్ని ప్రదర్శిస్తున్న ఓ అధికారి ఈ భూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చిత్తూరు నగరం, ఇరువారం ప్రాంతంలో దేవదాయశాఖకు సంబంధించిన 3.3 ఎకరాల భూమి ఉంది. తరతరాలుగా ఈ భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంటూ.. కాలక్రమేణా అర్చకుల ఇనాంభూములుగా మారాయి. ఒకప్పుడు ఆలయాల్లో పూజా కై ంకర్యాలు చేస్తూ.. ఈ భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ.. తద్వారా వచ్చే ఫలాలను అర్చకుల కుటుంబ అవసరాలకు ఉపయోగించేవారు. అయితే ఈ భూమిని ఎవరికీ అమ్మకూడదు. కేవలం అర్చకులు మాత్రమే అనుభవించే హక్కు ఉంది. కానీ రికార్డుల్లో ఇదీ దేవదాయశాఖ భూమిగానే రికార్డుకెక్కింది. అర్చకులు మాత్రం ఈ భూమి ఒకప్పుడు మహాదేవ గురుకుల్ పేరుతో ఉండేదని, తర్వాత ఆయన నలుగురు కొడుకుల్లో వైద్యనాథ గురుకుల్ అనే కొడుకు పేరుతో పత్రాలు మారాయని చెబుతున్నారు. ఈ భూమిలో జాతీయ రహదారికి 1.5 ఎకరాలు తీసుకున్నారని, ఇందుకు గాను పరిహారంగా నగదు కూడా జమైనట్టు వారు పేర్కొంటున్నారు. ఇక ఇదే ఈ భూమిలో ఇరువారం గ్రామస్తులు మునీశ్వరుడికి తరతరాలుగా పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే కోట్లు పలికే ఈభూమిని కొట్టేసేందుకు ఓ ప్రజాప్రతినిధి, కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. లీజు..గలీజు! కలెక్టర్రేట్ మీదుగా బెంగళూరు వెళ్లే మార్గంలో ఇరువారం ప్రాంతం వద్ద ఉన్న ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఈ భూమి కోట్లల్లో పలుకడంతో నేతలు భూ దోపిడీకి కంకణం కట్టారు. ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుపట్టారు. ఆ భూ వివరాలపై లోతుగా ఆరా తీశారు. దేవదాయశాఖ భూమిగా గుర్తించి.. ఆ అనుభవదారులను పిలిపించారు. లీజు పేరుతో 25 ఏళ్లు ఇచ్చేయాలని ఒప్పందానికి దిగారు. ఆ ఒప్పందం సందిగ్దంలో పడింది. బోరు వేసేందుకు యత్నం ఇంతలో అడ్డగోలుగా ఓ ప్రజాప్రతినిధి సహకారంతో లీజుకు ముందుండి నడిపిస్తున్న నేతలు జేబీసీలతో చదును చేశారు. గురువారం ఉదయం బోరు వేసేందుకు డ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. దేవదాయ శాఖ భూమిలో మునీశ్వరుడికి పూజలు చేస్తున్న ఇరువారం గ్రామస్తులు వారిని అడ్డగించారు. దీంతో బోరు బండి ఆగింది. జేసీబీతో చదును ప్రక్రియ మాత్రం నిరవధికంగా సాగుతోంది. లీజుకు తంత్రం.. ఆ అధికారి మంత్రం దేవదాయశాఖ శాఖలో ఓ అధికారి అడుగుపెట్టినప్పటి నుంచి లీజు దందా కొనసాగుతోంది. తన సామాజిక వర్గం అని చెప్పుకుంటూ ఇప్పుడు కుర్చీల్లో అతుక్కుపోయారు. తన సామాజికవర్గానికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులకు ఏది అడిగినా కాదనకుండా చేసిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవదాయశాఖ భూములను కూడా అప్పన్నంగా కట్టబెట్టేందుకు లీజుకుతంత్రాన్ని నేర్పించి.. ఆ మంత్రానికి అధికారి బలాన్ని చేకూరుస్తున్నారని ఆ శాఖలోని పలువురు అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ అధికారి ఉన్నంత కాలం దేవదాయశాఖ భూములకు రక్షణ కరువై.. లీజు పేరుతో అమ్ముడు పోవడం ఖాయమని చెబుతున్నారు. సనాతన ధర్మమని నీతులు చెబుతూ.. ఇలా దేవుడి భూములకు ఎసరు పెట్టడం ఏమిటని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. అర్చకుల మధ్య పోరు ఈ దేవదాయశాఖ భూమి తమ అనుభవంలో ఉందని చెప్పుకుంటున్న ఆరుగురు అర్చకుల మధ్య పోరు నడుస్తోంది. పరిహారం వచ్చినప్పటి నుంచి వీరి మధ్య వివాదం రేగింది. అయితే భూమిని లీజు పేరుతో అడుగుతున్న ఆ ప్రజాప్రతినిధి ఇద్దరు అర్చకులను మాత్రం పిలిచి మాట్లాడడంతో.. మిగిలిన నలుగురు అర్చకులు గుర్రుమంటున్నారు. పోరును వదిలించుకోవడానికి ఇద్దరు అర్చకులు మాత్రం ఆ భూమి హక్కును చేతులు మార్చాలని పట్టుబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
గుడిసెల్లో దుర్భర జీవితం
టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ తిరుపతి రూరల్ మండలం, ఎస్వీ నగర్లో నివాసముంటున్న టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దొరల రాజ్యం నడుస్తోంది. అగ్రవర్ణాల అహంకారం రాజ్యమేలుతోంది. గిరిజనులు పొలం పనులకు వెళితే కూలి తక్కువగా ఇవ్వడం.. ఏమని అడిగితే వారిపై దౌర్జన్యం చేయడం అలవాటుగా మారింది. అప్పుసప్పు చేసి వేసుకున్న కొద్దిపాటి పంటలను దున్నేయడం.. గుడిసెలు పీకేస్తామంటూ బెదిరింపులకు దిగడం నిత్యకృత్యంగా మారుతోంది. వీరిపై కక్షగట్టిన అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి గిరిపుత్రులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందకుండా వేధించడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ 24 మంది పిల్లలు ఉంటే ఏ ఒక్కరికీ కనీసం ఆధార్ కార్డుకూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం కొసమెరుపు. రోజంతా పనిచేస్తే రూ.100 ఇస్తారు ఏళ్ల తరబడి మేము కూలి పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నాం. దాసేగానూరు గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి సక్రమంగా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు మగోనికి రూ.500, ఆడవాల్లకు రూ.350 కూలి ఇస్తున్నారు. అయితే ఆ పెద్ద మనిషి రోజంతా పని చేయించుకుని మగవాళ్లకు రూ.200, ఆడవాళ్లకు రూ.100 ఇస్తావుండాడు. అందువల్ల మేమెవ్వరం కూలి పనులకు వెళ్లడం లేదు. ఆయన మాపై కక్షగట్టి గుడిసెలు కూల్చేస్తామని బెదిరిస్తున్నాడు. 30 ఏళ్లుగా గుట్టపై గుడిసెలు వేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు మా ఇళ్లు కూల్చేస్తే మేమెలా బతికేది..?. – కనకరాజ్, ఎస్టీ కాలనీ, దాసేగానూరు ఉలవ పంట దున్నేశారు మా ఇళ్ల పక్కలో ఉన్న భూముల్లో ఉలవ పంట సాగుచేశాం. రాత్రికి రాత్రే ట్రాక్టర్లు పెట్టి పంటను దున్నేశారు. ఈ భూమికి పట్టా తీసి ఇస్తాం.. మాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.16 వేలు ఇచ్చాం. మళ్లీ ఇనప్పుడు రెండున్నర లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. 30ఏళ్లుగా మమ్మల్ని ఎవ్వరూ ఇంత టార్చర్ చేయలేదు. మా పిల్లలకు ఆధార్ కార్డులు కూడా ఇవ్వలేదు. మాకు ఇప్పటి వరుకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు. మా గోడు ఎవరు పట్టించుకుంటారు..? – కనకమ్మ, ఎస్టీ కాలనీ, దాసేగానూరు రోజూ నరకమే వ్యవసాయ పనులకు వెళితే గిట్టుబాటు కావ డం లేదు. కూలి తక్కువ గా ఇస్తున్నారు. చెప్పిన ట్లు వినడం లేదని రోజూ నరకం చూపుతున్నారు. మాకు ప్రభు త్వం నుంచి ఎలాంటి ఆదరణా లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇంకా మీరు ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలే శరణ్యం. – వెంకటపతి, ఎస్టీ కాలనీ, దాసేగానూరు కుప్పంలోదొరల రాజ్యం! కుప్పం: దొరలంటే తెలంగాణ గుర్తుకొస్తుంది. వారు పెట్టే చిత్ర హింసలు, బాధలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకుంటున్నాయి. మూడు దశాబ్దాలుగా గుట్టల మధ్య గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఎస్టీలపై పెత్తనం చలాయించడం విమర్శలకు తావిస్తోంది. కూలి పనులకు రాకపోతే దౌర్జన్యం చేయడం.. రాత్రికి రాత్రే పంటలు దున్నేయడం ఇక్కడి అగ్రవర్ణాల వారికి అలవాటుగా మారింది. అది ఎక్కడ.. ఎందుకో మీరే చదవండి.. కూలి తక్కువ.. పనులెక్కువ దాసేగానూరు పంచాయతీలో ఓ పెద్దమనిషి గిరిజనులపై కక్షగట్టాడు. తన పొలం పనులకు వెళ్లే గిరిజనులకు తక్కువ కూలి ఇవ్వడం ప్రారంభించాడు. దీన్ని ఎదిరించినందుకు దౌర్జన్యాలకు దిగుతున్నా డు. తమ పొలం పక్కనున్న డీకేటీ భూములు మీ గుడిసెలు ఉన్నాయి.. నాకు పనికి రాకపోతే వాటిని తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. కడుపు మాడ్చుకుని రోజంతా కాయకష్టం చేయలేక కూలి పనులకెళ్లడమే మానేసినట్టు గిరిజనులు చెబుతున్నారు. డబ్బులు కడితే పట్టాలిప్పిస్తాం మీ ఇల్లు, పొలాలు డీకేటీ భూముల్లో ఉన్నాయి. మేము అడిగినంత డబ్బులిస్తే మీ ఇల్లు, పొలాలకు పట్టాలు తీసిస్తాం.. అంటూ ఎస్టీలను నమ్మిస్తున్నా రు. వారి మాటలు విని ఇప్పటికే రూ.16 వేలు ఇచ్చామని, ఇప్పుడు రూ.2.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ వారు అడినంత ఇవ్వలేకపోతే ఏం చేస్తారో..నన్న భయం కలుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దాసేగానూరు ఎస్టీల బతుకులు దుర్భరం కుప్పం మండలం పరిధిలోని దాసేగానూరు పంచాయతీకి విసిరేసినట్టు మూడు కిలోమీటర్ల దూరంలో ఎస్టీ కాలనీ ఉంది. అటవీ ప్రాతంలోని గుట్ట పోరంబోలో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ 30 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. కాలనీలో కనీస వసతులు లేవు. రోడ్డు సౌకర్యం లేదు. ఈ కాలనీలో 24మంది బడిఈడు పిల్లలు ఉన్నారు. వీరికి కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. ఫలితంగా పలకా బలపం పట్టి బడికి వెళ్లాల్సిన వారు చదవుకు దూరమవుతున్నారు. కాలనీలో సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ, పోలీసులకు రెండు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నామని.. కానీ ఎవ్వరూ తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పొలం పనులకు రాకపోతే అంతే! దాసేగానూరు పంచాయతీలోని అగ్రవర్ణాల వారి అహంకారం పెచ్చుమీరుతోంది. పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీ వాసులు పొలం పనులకు రాకపోతే దాడులు చేయడం, దౌర్జన్యంగా పంట పొలాలు దున్నేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇళ్లు కూల్చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు స్థానికులు కంటతడి పెడుతున్నారు. ‘మా పొలాల పక్కనే ఉన్న డీకేటీ భూముల్లో గుడిసెలు ఉన్నాయని, వాటిని కూల్చేస్తాం’ అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. ‘మీ ఇల్లు.. పొలాలు ఉండాలంటే మాకు కూలి పనులకు రండి.. లేదంటే అంతే..! అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. -
నేడు యువజన విభాగం బలోపేతంపై సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు తిరుపతిలోని డీపీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఐదు జిల్లాల పార్టీ యువజన విభాగం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల యువజన విభా గం అధ్యక్షులు ఉదయ్వంశీ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతంపై ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూ రు, అన్నమయ్య జిల్లాల యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షులు, నగర, మండల యువజన విభాగం నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్రెడ్డి హాజరవుతారని తెలిపారు. 14న అండర్–12 బాయ్స్ క్రికెట్ జట్టు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : అండర్–12 బాయ్స్ క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 14వ తేదీ ఉదయం 9గంటలకు నిర్వహించనున్నట్లు ఉమ్మ డి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) కార్యదర్శి మందపాటి సతీష్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలను తిరుపతి, చిత్తూరు, పీలేరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి డివిజన్కు సంబంధించి మంగళం రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో, చిత్తూరు డివిజన్కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్లో, మదనపల్లి డివిజన్కు సంబంధించి పీలేరులోని పీఐఓసీ క్రికెట్ నెట్స్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు 01–09–2013 సెప్టెంబర్ ఒకటో తేదీలోపు జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వారి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎంపిక ప్రక్రియ ప్రాంగణంలో హాజరుకావాలని, అలాగే తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధార్కా ర్డు, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 88861 85559, 90002 14966 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. క్రిస్మస్, న్యూఇయర్కు ప్రత్యేక రైళ్లు తిరుపతి అన్నమయ్యసర్కిల్: క్రిస్మస్తోపాటు న్యూఇయర్ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా నడుస్తాయి. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు తిరుపతి – చర్లపల్లి మధ్య నడవనుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 4.30కు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.15కు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, కర్నూ ల్, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎరగ్రుంట, కడప, రాజంపేట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–తిరుపతి ట్రైన్ (07031) ఈ నెల 19 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం చర్లపల్లిలో సాయంత్రం 3.35కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, దోమకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. పందార్పూర్–తిరుపతి రైలు (07032) ఈ నెల 21 నుంచి జనవరి 4 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు పందార్పూర్లో ఈ రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు జహీరాబాద్, వికారాబాద్, శంకర్ పల్లి, లింగంపల్లి, రేణిగుంట, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుంది. -
చిత్తూరులో గుప్పు..గుప్పు!
చిత్తూరు అర్బన్: రెండు లక్షల మందికి పైగా ఉన్న చిత్తూరు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. మూడు జీపులు తీసుకుని సరిగ్గా రెండు గంటలు తిరిగితే నగరంలో ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారు..? గంజాయి తాగుతున్న వాళ్లు ఎవరో..? సులువుగా గుర్తుపట్టొచ్చు. కానీ అలా జరగడం లేదు. సరైన సమాచా రం లేకనో.? దీనిపై ఖాకీలకు నిఘా లేదో తెలియడం లేదుగానీ..నగరంలో ఎక్కడబడితే అక్కడ గుప్పు.. గుప్పుమంటూ గంజాయి వాసన కమ్మేస్తోంది. ఆదాయం రావట్లేదా? చిత్తూరు నగరంలో పేకాట క్లబ్బులు, నిషేధిత లాటరీ టికెట్లు భారీగా నిర్వహిస్తున్నా ప్రశ్నించే దిక్కు లేదు. వీటి నుంచి కొందరు ఖాకీలకు నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయని ఆరోపణలున్నాయి. కొందరు పోలీసు అధికారులను నమ్మకుండా గత ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ బృందంతో పేకాట క్లబ్బులపై దాడులు చేయించి, వాటిని మూయించారు. అయినాసరే కొందరు ఖాకీల కనుసన్నల్లో ఇవి యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. కానీ గంజాయి విక్రయాలు వీధి వీధికి జరుగుతున్నా కొందరికి పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టకపోవడంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. గంజాయి డాన్ల నుంచి పెద్దగా ఆదాయం లభించడంలేదో..? ఏమోగానీ .? అందుకే దీన్ని నివారించడంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలోని గాంధీ రోడ్డు, తోటపాళ్యం శివారు, నీవానది, తేనబండ, కై లాశపురం, భరత్నగర్, గాంధీ నగర్, శంకరయ్యగుంట, సత్యనారాయణపురం, మురకంబట్టు కూడలి, శ్రీనివాసనగర్, చామంతిపురత తదితర ప్రాంతాల్లో చీకటిపడితే గంజాయి వాసన వస్తున్నా పోలీసుల కంట పడకపోవడం ఏమిటని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. చిత్తూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ సమీపంలో గంజాయి లభించే ప్రాంతం మాదకద్రవ్యాల నివారణపై విద్యాసంస్థల నిర్వాహకులతో మాట్లాడుతున్న కలెక్టర్, ఎస్పీ కలెక్టర్ చెప్పినా అంతే చిత్తూరు నగరంలో గంజాయి విక్రయాలు, వాడకంపై ఇటీవల కలెక్టర్కు నేరుగా ఫిర్యాదులు వెళ్లాయి. మైనర్లు, ముఖ్యంగా విద్యార్థులు గంజాయి తీసుకోవడాన్ని సరదాగా ప్రారంభించి.. ఆపై దీనికి బానిసలుగా మారిపోతున్నారని విన్నవించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కలెక్టర్, ఎస్పీతో కలసి విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రముఖలతో సమావేశం నిర్వహించారు. అసలు బీడీ, సిగరెట్లు, కై నీ, గుట్కా లాంటి వాటిని విద్యాసంస్థల ఆవరణల్లో విక్రయించకూడదని.. మైనర్లకు ఇవి అందుబాటులో ఉంచొద్దని ఆదేశించారు. గంజాయి అనేది చిత్తూరు నగరంలో ఎక్కడా కనిపించకూడదని గట్టిగానే హెచ్చరించారు. కానీ క్షేత్ర స్థాయిలో గంజాయి విక్రయాలు బీడీ, సిగరెట్లకన్నా సులువుగా లభిస్తున్నాయి. వీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. కట్టడి చేస్తాం చిత్తూరులో గంజాయి విక్రయాలు, అమ్మకాలపై ఇద్దరు సీఐలు ప్రత్యేక నిఘా ఉంచారు. విక్రయాలతో పాటు వాటి మూలాలను కనిపెడుతాం. ఎక్కడైనా విక్రయాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎవరైనా సరే వన్టౌన్–9440796707, టూటౌన్– 9491074517, డయల్–112 నంబర్లకు సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం. – టీ.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
బాలిక లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
చిత్తూరు లీగల్: ప్రేమ.. పెళ్లి పేరిట మాయ మాటలు చెప్పి.. తన మాట వినకపోతే మీ అమ్మా నాన్నను చంపేస్తానని బెదిరించి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయికి చిత్తూరు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. చిత్తూరు పోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన కుమారి కథనం మేరకు.. 2021 సంవత్సరంలో వెదురుకుప్పం పోలీస్స్టేషన్ పరిధిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక (14)తో అదే మండలం కాపుమొండివెంగనపల్లికి చెందిన టి.మణి అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తన మాట వినకపోతే మీ అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించాడు. తనతో రావాలని భయపెట్టి మోటార్ సైకిల్ ఎక్కించుకుని భాకరాపేట సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్లాడు. ఆ గుడిలో బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. భాకరాపేటలో గది అద్దెకు తీసుకుని అందులో బాలికను ఉంచి బలవంతంగా పలుమార్లు లైగింక దాడికి పాల్పడ్డాడు. అప్పటికే బాలిక తల్లిదండ్రులు వెదురుకుప్పం పోలీసులను ఆశ్రయించడంతో 2021 మార్చి 23వ తేదీన ముద్దాయి నుంచి బాలికను రక్షించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదుచేసి చిత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. చిత్తూరు పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి ముద్దాయి మణికి గరిష్టంగా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శంకర్రావు తీర్పునిచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ.ఒక లక్ష చెల్లించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. -
ఎట్టెట్టా?
పలమనేరు: జిల్లాలో కుంకీ ఏనుగుల కథ అటకెక్కింది. కుంకీల సంరక్షణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఏనుగుల మెడకు జీపీఆర్ఎస్ ట్రాకర్స్ను అమర్చనున్నట్టు తెలిపింది. ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందో త్వరలో తేలనుంది. ముందస్తు వర్ష సూచనలాగే.. వాతావరణ శాఖ నుంచి మొబైళ్లకు అలెర్ట్ మెసేజీలు వస్తుంటాయి. ఇదే విధంగా ఏనుగుల కదలికల ద్వారా అవి ఏమార్గంలో సంచరిస్తున్నాయే ట్రాక్ ద్వారా పసిగట్టి ఏ గ్రామం వైపు వెళుతున్నాయో ఆ గ్రామస్తుల ఫోన్లకు సందేశాలు పంపేలా అటవీశాఖ ప్లాన్ చేస్తోంది. కాలర్లకు కట్టడం కష్టమే ఇంతకీ అటవీశాఖ భావిస్తున్నట్టు ఏనుగుల మెడకు జీపీఆర్ఆర్ కాలర్లని అమర్చడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. గుంపులోని ఏనుగులను నిలువరించడం ఇక్కడున్న కుంకీల నుంచే సాధ్యం కాదని తేలిపోయింది. మరోవైపు మదపుటేనుగులు జోలికెళ్లే కుంకీలను సైతం ఇవి ఎదిరించి దాడులు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల మెడకు జీపీఆర్ టాగ్ను ఎలా వేస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. ఏనుగు మెడకు జీపీఆర్ఎస్ ట్యాగ్! ప్రస్తుతం పలమనేరు ప్రాంతంలో 14, తమిళనాడు సరిహద్దు అడవుల్లో ఆరు, సోమల ప్రాంతంలో మూడు, గుడిపాల వద్ద రెండు ఏనుగులతోపాటు నాలుగు ఒంటరి ఏనుగులు సంచరిస్తున్నాయి. గుంపులోని ఏనుగుల కంటే ఒంటరిగా సంచరిస్తున్న మదపుటేనుల కారణంగానే ఎక్కువగా ప్రజలపై దాడులు, పంటలకు నష్టం జరుగుతోంది. వీటిని అదుపులోకి తీసుకురావడం కుంకీ ఏనుగులతో కాదని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు తెలిసిపోయింది. దీంతో సాంకేతికంగా కొత్త మార్గంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏనుగుల గుంపులో ఓ ఏనుగు మెడకు రెండేళ్ల బ్యాటరీతో పనిచేసే జీపీఆర్ఎస్ ట్రాకర్ను తగిలించి.. దాని సంచారం ద్వారా ఏనుగుల గుంపు ప్రాంతాన్ని లొకేషన్ ద్వారా చూస్తూ ఆ ప్రాంతానికి సమీపంలోని రైతులు, ప్రజల మొబైళ్లకు సందేశాలను పంపేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
ఉత్సాహంగా పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్
కార్వేటినగరం: పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనండం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా విద్యాశిక్షణా సంస్థ( డైట్) ఇన్చార్జి ప్రిన్సిపల్ దామోదరం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాజకుమార రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని హెచ్ఎం కోటేఽశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టడం, ఆత్మవిశ్వాశాన్ని పెంపొందించడమే పరీక్ష పే చర్చ ముఖ్య లక్ష్యమన్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన వచ్చన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 1 నుంచి జనవరి 11 వరకు కొనసాగుతుందన్నారు. చర్చలో పాల్గొనదలచిన వారు వెబ్సైట్ను సందర్శించి ఎంపికను ఎంచుకుని ఈ మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇచ్చిన థమ్స్లో ఒక దాన్ని ఎంచుకుని 5 వందల అక్షరాల్లోపు ఉండే విధంగా ఒక ప్రశ్న లేదా అభిప్రాయాన్ని తెలపాలన్నారు. ఎంపిౖకైన వారు నేరుగా ప్రధానితో మాట్లాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. -
శ్రీసిటీలో టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(పీఈటీఐ) సంస్థ తమ అవరణలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎన్ఏబీఎల్( నీటి/ మురుగునీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ సన్నారెడ్డి మాట్లాడుతూ.. శ్రీసిటీని ‘ క్లీన్ అండ్ గ్రీన్’ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. పేక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ కొత్త ల్యాబ్ ‘మేక్ ఇన్ ఇండియా’ఆలోచనకు అనుగుణంగా టెస్టింగ్ సేవలను అందిస్తుందన్నారు. -
బాబును నమ్మడమంటే మోసపోవడమే
పుంగనూరు: చంద్రబాబును నమ్మడం అంటే మోసపోవడమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దెవా చేశారు. బుధవారం పట్టణంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణను నిరశిస్తూ కోటి సంతకాల బుక్లెట్ల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అభిమానులు అధిక సంఖ్యలో హాజరై, వైఎస్సార్ జిందాబాద్.. పెద్దిరెడ్డి జిందాబాద్.. మిథున్రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ బస్టాండు నుంచి ఎంబీటీ రోడ్డు, పోలీస్ స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ నుంచి తిరుపతికి వెళ్లింది. ర్యాలీని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం ఆయన నైజం అన్నారు. సూపర్–6 పేరుతో ఒక్కహామీనైనా నేరవేర్చాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కానరాలేదని, ప్రభుత్వ సంపదను ప్రైవేటీకరించడమే తండ్రి, కొడుకుల లక్ష్యమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్లు చేయడం, వేధించడం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ పరిపాలనపై ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, ఎంపీపీలు భాస్కర్రెడ్డి, సురేంద్రరెడ్డి, జెడ్పీటీసీలు సోమశేఖర్రెడ్డి, దామోదర్రాజు, పార్టీ యూత్వింగ్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి చెంగారెడ్డి, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ముతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి
చిత్తూరు కలెక్టరేట్ : అర్హులైన నిరుపేదలందరికీ కచ్చితంగా సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. -
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
పుంగనూరు: మండలంలోని మార్లపల్లె సమీపంలోని జగనన్న కాలనీలో నివాసం ఉన్న అంకాయమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూలి పనులకు వెళ్లిన అంకాయమ్మ ఇంటికి తిరిగి వచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో బంగారు నగలు, లక్ష రూపాయల నగదు, ఇతర వస్తువులు దొంగలించుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి గంగాధర నెల్లూరు: కూలి పనికి వెళ్లిన తన భర్తకు భోజనం అందించి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి చెందిన ఘటన గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వివరాలు.. గంగాధరనెల్లూరు దళితవాడకు చెందిన మూర్తి నీవా నది సమీపంలో కూలి పనులు చేసేవారు. బుధవారం కూలి పనులకు వెళ్లిన తన భర్తకు మూర్తి భార్య నాగమ్మ అలియాస్ శ్రీదేవి (45) భోజనం తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్లో చిత్తూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం శాంతిపురం: పలమనేరు జాతీయ రహదారిపై మండల పరిధిలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో వి.కోట మండలానికి చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మఠం వద్ద ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. బైకుపై వెళ్తున్న వి.కోట మండలం, దాసార్లపల్లికి చెందిన చంద్రకాంత్(31) తలకు తీవ్ర గాయామై అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని రాళ్లబూదుగూరులో కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్న చంద్రకాంత్ రోజూ బైకుపై రాకపోకలు సాగిస్తూ ప్రమాదం బారిన పడ్డాడు. మరో ప్రమాదంలో గుండిశెట్టిపల్లి వద్ద కారును బైకు ఢీకున్న ఘటనలో వి.కోట మండలం, నాగిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్(32) తీవ్రంగా గాయపడ్డాడు. సోమాపురంలో బంధువుల ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు తనను 108 ద్వారా కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయామైంది. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కనతలలో అక్రమ క్వారీ
సాక్షి టాస్క్ఫోర్స్: బంగారుపాళ్యం కనతల చెరువు వద్ద అక్రమ క్వారీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పర్యావరణ అనుమతులు, రెన్యూవల్ లేకుండా నల్లబంగారం మాయమవుతోంది. టీడీపీలోని ఇద్దరు బడా నేతల చేతిలో క్వారీ నడుస్తోంది. ఆ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఆ ప్రాంతం సరిహద్దు కావడంలో చిటికెలో గ్రానైట్ను తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయాలు తెలిసినా సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు లైట్ తీసుకుంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పాత పత్రాలతో...కోట్లా వ్యాపారం! ఈ క్వారీకి సంబంధించి గతేడాది రెన్యూవల్ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే అదునుగా భావించి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అధికార బలాన్ని ఉపయోగించి కార్వీని వశం చేసుకున్నారు. ఎగువ కనతల నుంచి తమిళనాడుకు సరిహద్దు దాటిస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే... పాత పత్రాలను చూపించి క్వారీలో దర్జాగా తవ్వకాలు చేసుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నించే వారిపై ఆ బడానేత ఎదురుతిరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. లైట్ తీసుకో! అక్రమ క్వారీ నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ఽఅధికారులు, బడా నేతకు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం అక్రమ క్వారీని ఇన్నాళ్లు దర్జాగా నడిపిస్తున్నారు. పర్యావరణ అనుమతులు, రెన్యూవల్ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది, టీడీపీలోని ఓ నేత మైనింగ్ అధికారులకు అక్రమ విషయంపై ఫిర్యాదు చేస్తే లైట్ తీసుకోడంటూ.. బుజ్జగించి పంపించారు. వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అధిష్టానానికి లేఖ పంపారు. ఓ బడా నేత కనుసన్నల్లో జరిగే ఈ అక్రమ తవ్వకాలతో తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోందని ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పట్టించుకోని పక్షంలో ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించినట్టు సమాచారం. అసలేం జరుగుతోందంటే! బంగారుపాళ్యం మండలం, ఎగువ కనతల చెరువు వద్ద విలువైన క్వారీ ఉంది. ఇది నల్ల బంగారం. తమిళనాడు, కర్ణాటకలో ఈ ఖనిజానికి మంచి డిమాండ్ ఉంది. అయితే ఏడాది క్రితమే ఈ క్వారీ రెన్యూవల్కు వచ్చింది. అధికారం ఉందని.. అవేవీ పట్టించుకోకుండానే టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు చేతులు కలిపారు. మండలంలోని ఓ బడానేతతో.. చిత్తూరుకు చెందిన మరో నేత క్వారీపై కన్ను వేశాడు. కొండను పిండేసేందుకు వెంటనే బండ్లను దింపారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఎదురుతిరిగారు. ఇంతలో మండలంలోని ఆ బడానేత రంగంలోకి దిగారు. గ్రామస్తులను బెదిరించి నోరు మూయించారు. -
కరిగిపోతున్న గుట్టపై విచారణ
రొంపిచెర్ల: చిత్తూరు–అన్నమ్మయ్య జిల్లా సరిహద్దులో అనుమతులు లేకుండా గుట్టను కిరిగిస్తున్నారని సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన వార్తకు రెండు జిల్లాల మైనింగ్ అధికారులు స్పందించారు. ఈ మేరకు దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మైనింగ్ ఏడీ సత్యనారాయణ కథనం. అన్నమ్మయ్య జిల్లా, పీలేరు మండలం, గూడరేవుపల్లె, చిత్తూ రు జిల్లా, రొంపిచెర్ల మండలం, చిచ్చిలివారిపల్లె గ్రామ సరహద్దులో ఉన్న గుట్టను పరిశీలించినట్టు తెలిపారు. తనిఖీలో పీలేరు మండలం, సూరవ్వచెరువుకు ఉత్తరం వైపున పెద్ద గుంత ఉండడంతో పరిశీలించామన్నారు. అక్కడ కూలీలు రాళ్లు కొడుతున్న వారిని బయటకు పంపిచామని చెప్పారు. రాక్ మార్క్ ప్రకారం పీలేరు మండలం, గూడరేవుపల్లె గ్రామం సర్వే నం.429లో ఉన్నట్లు గుర్తించామన్నారు. గుంతను కొలవగా సుమారు 15,000 స్క్వేర్ మీటర్లు, 6 నుంచి 10 మీటర్ల ఎత్తు ఉన్నట్లు గుర్తించి వాటి పరిమాణం గుర్తించేందుకు వివరణాత్మక సర్వే చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అన్నమ్మయ్య జిల్లా మైనింగ్ అధికారులు రికార్డులు పరిశీలించగా పీలేరు మండలం, గూడరేవుపల్లె గ్రామం సర్వే నం.429లో 1.998 హెక్టార్లలో రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ ఖనిజానికి సి.రజిత అనే మహిళకు 2022 డిసెంబరు 29 నుంచి 2032 డిసెంబరు 28వ తేదీ వరకు లీజుకు ఇచ్చినట్టు ఉందన్నారు. సదురు స్టోన్ క్రషర్కు సమీపంలో అక్రమ తవ్వకాలు జరిగిన గుంత ఉండగా అక్కడే ఉన్న కూలీలను విచారించామని తెలిపారు. అయితే కూలీలు ఈ రాయి సమీపంలోని క్రషర్కు రవాణా అవుతోందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. లీజుదారు రజిత భర్త కిషోర్కుమార్రెడ్డిని కూడా విచారించగా గుంత లీజు పరిధిలోకి రాదన్నారు. దీంతో పనులు నిలిపి వేయాలని ఆదేశించామన్నారు. అలాగే స్టోన్ కషర్ వద్ద 600 క్యూబిక్ మీటర్ల కంకర నిల్వ ఉన్నట్లు గుర్తించామని, 90 శాతం పనులు పీలేరు మండల పరిధిలోనే జరిగాయని, రొంపిచెర్ల మండల పరిధిలో 10 శాతం పనులు గతంలో జరిగినట్లు గుర్తించామని తెలిపారు. భైరవ స్టోన్ క్రషర్ పేరుతో 2008 నుంచి 2018 వరకు ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టోన్ క్రషర్పై చర్యలు తీసుకుంటామని ఏడీ తెలిపారు. -
‘పచ్చ’ లాటరీపై రంగంలోకి ఎస్పీ!
చిత్తూరు అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు రోజువారీ కూలి పనులు చేసే ప్రజలే లక్ష్యంగా చిత్తూరులో జరుగు తున్న నిషేధిత లాటరీ ముద్రణ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడానికి స్వయంగా ఎస్పీనే రంగంలోకి దిగారు. చిత్తూరులో జరుగుతున్న ఈ సామాజిక అసమాన క్రీడపై ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ‘పచ్చ లాటరీ’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రారంభమయ్యే లాటరీ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడంతో పాటు విజయవాడకు కూడా వెళుతుండడం, చిత్తూరులోని కొందరు ఖాకీలు దీనికి కొమ్ముకాయడంపై ‘సాక్షి’లో వచ్చిన వార్తపై ఎస్పీ డూడీ స్పందించారు. ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్నారు..? ఎవరెవరికి మామూళ్లు వెళుతున్నాయి..? అక్రమార్కులకు ఎవరు అండగా నిలుస్తున్నారు..? ఇందులో కింగ్పిన్ ఎవరు..? అనే వివరాలను ఆయన రాబడుతున్నారు. పోలీసు శాఖలో తనకు నమ్మకంగా ఉంటున్న వాళ్ల నుంచి నివేదిక నేరుగా తన టేబుల్పైకే తెప్పించుకుంటున్నారు. జిల్లాలో లాటరీ విక్రయాలు పూర్తిగా నిరోధించడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. ఫలితంగా లాటరీకి దన్నుగా ఉంటున్న వ్యక్తులతో పాటు కొందరు ఖాకీల గుండెల్లో రైళ్లు పడుగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందో తెలియక మదనపడుతున్నారు. హైవేల అనుసంధానానికి గ్రీన్సిగ్నల్ చితూరు అర్బన్: జిల్లాలో జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. కుప్పం–హోసూరు, బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే–కాణిపాకం ఆలయ లింకు రోడ్డు (ఎన్హెచ్–140) మధ్య కనెక్టివిటీకి తాను ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ఈనెల 15న పనుల కేటాయింపు జరుగుతుందన్నారు. -
టిడ్కో లబ్ధిదారులపై వేధింపులు తగవు
చిత్తూరు కార్పొరేషన్: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంకు అధికారుల వేధింపులు తగవని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు స్పష్టం చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారుల వద్ద డిపాజిట్ తీసుకొని ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అధికారంలో వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా కూటమి ప్రభుత్వం టిడ్కో బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. మరో వైపు బ్యాంక్ అధికారులు మాత్రం లబ్ధిదారులను డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహాలు ఇచ్చాక రుణాలు కట్టకపోతే నోటీసులు ఇవ్వాలే గానీ ముందే ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోపీనాథ్, మణి, చంద్ర విజయ గౌరీ జమీలాబి, కుమారి పాల్గొన్నారు. -
లింగనిర్ధారణపై క్రిమినల్ చర్యలు
చిత్తూరు కలెక్టరేట్: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన పీసీపీఎన్టీ చట్టం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి, పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో అబార్షన్లపై నిఘా ఉంచి నివేదికల్ని ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆర్ఎంపీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ సుధారాణి, వైద్యాధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ్, అనిల్కుమార్, అనూష, లత ఉషశ్రీ, ఇంద్రాణి పాల్గొన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు జరిగే సమీక్షలో ఆరోగ్య, విద్య ఇతర కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారని వివరించారు. -
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం
బంగారుపాళెం : విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని కీరమంద జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం రుచి చూశా రు. పిల్లలకు పరిశుభ్రంగా, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ క్రమంలోనే కొదలమడుగు పంచాయతీ బండ్లదొడ్డిలో మౌలిక వసతులను ఆరా తీశారు. తహసీల్దార్ షబ్బీర్బాషా, ఎంపీడీఓ మహేష్, ఎంఈఓ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. టెట్ను మినహాయించాలని నిరసన చిత్తూరు కలెక్టరేట్ : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి సహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి మణి గండన్, నాయకులు రెడ్డెప్ప నాయుఠి డు, సుధాకర్రెడ్డి, ఎస్పీ బాషా, ఏకాంబరం, పార్థసారథి పాల్గొన్నారు. -
మందుల్లేవ్!
కాణిపాకం: మందుల కొరత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వేధిస్తోంది. సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో అక్కడ చికిత్సలు అటుంచి అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అనేక మందులు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం మోయలేక అల్లాడుతున్నారు. దీనికితోడు 104 వాహనాల్లో కూడా మందుల కొరత పీడిస్తోంది. సెంట్రల్ డ్రగ్స్ నుంచే మందులు, మాత్ర ల సరఫరాలో జాప్యం ఉందని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో ప్రజలు మంచంపడుతున్నారు. కొన్ని చోట్ల డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. స్క్రబ్టైఫస్ కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నా యి. వీటితోపాటు ఇతరత్రా వ్యాధుల బారినపడి ప్రజ లు ప్రభుత్వ వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు అటుంచి మందు బిళ్లలు కూడా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులు చీటీలు రాసి ఇచ్చి పంపుతుండడంతో పేదలపై భారం పడుతోంది. ఆ మాత్రలు నిల్! ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచడంలో విఫలమవు తోంది. ప్రసూతి సేవలకు అవసరమైన ప్యాడ్స్ వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బాలింతలు, గర్భిణులకు అవసరమైన మందులు కూ డా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేవు. ప్రస్తుతం జిల్లా లో వాతావరణ మార్పులతో ఎక్కువగా చిన్న పిల్లలు జలుబు, దగ్గు, జ్వరంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. ఒక వైద్యశాలలో సుమారు 50 ఓపీ లు వచ్చాయంటే అందులో పది మంది పిల్లలు ఉంటున్నారు. అయితే జలుబు, దగ్గుకు ఇచ్చే టానిక్లు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. అప్పుడు పరిస్థితి ఏంటో? జిల్లాలో ఇప్పటి వరకూ భారీ వర్షాలు కురిశాయి. వర్షా ల కారణంగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలుచోట్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా యి. మళ్లీ వర్షాలు ప్రారంభమైతే వీటి దాడి మరింత అధికమవుతుంది. విష జ్వరాలు, డెంగ్యూతోపాటు మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తా యి. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితి అటు వైద్యులను, ఇటు రోగులను ఆందోళనకు గురిచేస్తోంది. మున్ముందు పరిస్థితిని ఊహించుకొని వారు మరింత కలవరపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. మాత్రలు లేవంటే ఎలా? మా ఊళ్లో పడినట్లు వర్షం యాడా పడలేదు. ఈ వర్షానికి దోమలు.. చిటుకు.. చిటుకుమని కరుస్తున్నాయి. వాతావరణం కూడా సరిగాలేదు. కారుమబ్బులు కమ్ముకుని చలి చంపేస్తోంది. ఈ చలికి చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు ఒకటే జలు బు, తలనొప్పి. మళ్లా జ్వరం కూడా వస్తా ఉంది. ఏం చేయాలి. ఊరికి దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే మాత్రలు ఏం లేవంటున్నారు. – గోవిందమ్మ, పెద్దతయ్యూరు, ఎస్ఆర్పురం మాత్రలు ఇస్తే చాలు జ్వరాలు పట్టి పీడిస్తుండాయి. అందరూ జ్వరా ల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా రు. ఆరోగ్య కేంద్రాలకు వెళితే డాక్టరు ఉండరు. డాక్టరు ఉంటే మందులు, మాత్రలు ఉండవు. ఆరోగ్య కేంద్రాలు వద్దని ప్రైవేటు ఆస్పత్రికి వెళుతున్నాం. అక్కడ ఫీజుతో కలిసి జ్వరమంటే రూ.1000 లాగేస్తున్నారు. ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా మందులు, మాత్రలు ఇవ్వాలి. – రవి, ఎస్ఆర్పురం పీహెచ్సీల్లో మందులు, మాత్రల కొరత ఈ మందులు ఎక్కడ? జిల్లా వ్యాప్తంగా 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతిరోజూ 100 నుంచి 200వరకు ఓపీలొస్తున్నాయి. సీజనల్ ప్రభావంతో ఆరోగ్య కేంద్రాలకు జ్వరం కేసుల తాకిడి పెరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు మందులు, మాత్రల సరఫరా లేదు. పారాసెటిమల్ 500 ఎంజీ, డైక్లోఫెనాక్, పాంటోప్, బీకాంప్లెక్స్, సిట్రిజన్ మందులు ప్రధానంగా లేవని తెలిసింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వాడే సెప్ట్రాన్, డాక్సీసైక్లోన్, నార్పోక్లైస్ కూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే సిరఫ్లు పారాసెట్మాల్, అమ్రోక్స్, ఫ్రోజెనాల్డె, సిట్రిజన్ సిరఫ్లు లేవు. పెద్దలకు చలికాలంలో ఆయాసం ముంచుకొస్తుంటుంది. ఇలాంటి తరుణంలో సలాబుటమోల్ సిరప్ అత్యంత అవసరం కాగా..అవి ఆరోగ్య కేంద్రాల్లో లేవు. అలాగే 104లో కూడా మందుల కొరత పీడిస్తోంది. పలు రకాల రోగాలకు మందులు, మాత్రలు ఇవ్వలేక 104 సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. ఇదేమని అడిగితే సెంట్రల్ డ్రగ్స్ నుంచి సరఫరా లేదని అంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 175 రకాల మందులను అందుబాటులో ఉండాలి. కానీ వాటిలో పదుల సంఖ్యలో కూడా ఉండడం లేదు. జ్వరానికి ఉపయోగించే పారాసెట్మాల్ కూడా లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఖరీదైన యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయ లేని వారు రోజుల తరబడి మంచానికే పరిమితమవుతున్నారు. దీనికితోడు వైద్య పరీక్షలకు ఉపయోగించే వివిధ రకాల రసాయనాలు, పరికరాలు కూడా లేవు. అనేక చోట్ల బయట ల్యాబ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ఐరాల: వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రకు తెరదీశారని ఎంపీపీ మోహన్ మండిపడ్డారు. సోమ వారం సాయంత్రం రంగమ్మచెరువులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంటింటా తిరిగి సంతకాలు సేకరించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందవన్నారు. అలాగే దివిటివారిపల్లె, ఎర్రేపల్లె, చుక్కావారిపల్లె, నాగంవాండ్లపల్లె, వినాయకపురం, ఐకే.రెడ్డిపల్లెల్లో స్థానిక నేతలు ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నేతలు హరి, లోక, రాము, ఉమాపతిరెడ్డి, మహేష్, విజయ్కుమార్రెడ్డి, కృష్ణారెడ్డి, బుజ్జిరెడ్డి, గణపతి, శేఖర్, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య విద్య ప్రజల హక్కు వడమాలపేట (పుత్తూరు): ఉచిత వైద్య విద్య ప్రజ ల హక్కుని వడమాలపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి స్పష్టం చేశారు. సోమ వారం పాదిరేడు, కదిరిమంగళం, వడమాల, బుట్టిరెడ్డికండ్రిగ, ఎస్వీపురం పంచాయతీల్లో వైద్య విద్య ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇంటింటికెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వైద్య విద్య ప్రైవేటీకరణపై గ్రామాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపేంత వరకు ప్రజా ఉద్యమం కొనసాగుతుందన్నారు. సర్పంచ్ మంజులారెడ్డి, నాయకులు సుదర్శన నాయు డు, బత్తయ్య, కళ్యాణ్, పవన్, ఉమాపతి, రమేష్, జయంతు, తుకారం పాల్గొన్నారు. -
చివరి ఆశలు ఆవిరి
నష్టాలబాటలో వరి రైతులు! పలమనేరు: ఈ సారి వరి రైతులు నిండా మునిగిపోయారు. చెమటోడ్చి పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక కుమిలిపోతున్నారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో ఈ రబీకి సంబంధించి సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సన్నర కాలైన బీపీటీ, నర్మద, అమన్, ధనిష్ట, దొడ్డ రకాలైన జేజేఎల్, ఆర్ఎన్ఆర్ లాంటి రకాలను సాగుచేశారు. ఇందులో 2 వేల ఎకరాల దాకా ఇప్పటికే ఒబ్బిళ్లు జరిగాయి. మరో వవెయ్యి ఎకరాల్లో వరికోతలు జరగాల్సి ఉంది. కోతలు మొదలుకాగానే ఉన్నట్టుండి ధాన్యం ధరలు తగ్గాయి. మొన్నటి దాకా క్వింటాళ్ ధర రూ.2,500 దాకా ఉండగా ఇప్పుడు రూ.1,800 సైతం పలకడం లేదు. ఒబ్బిళ్ల సమయంలో తుపాన్లు, కూలీలు రాక ఎన్నో ఇబ్బందులు పడి పండిస్తే తీరా రైతుకు మిగిలేది నష్టమే. ఎకరానికి రూ.40 వేల పెట్టుబడి ఎకరా పొలానికి వరి విత్తనాలు తెచ్చి నారుమడి వేయడానికి రూ.2 వేలు. ఆపై బురదమడి దున్నడానికి ట్రాక్టరుకు గంటకు రూ.1,200 చొప్పున ఏడు గంటలకు రూ.9,600, మడిచుట్టూ గెనాలు కొట్టేందుకు రూ.2వేలు అవుతుంది. నాటేందుకు ముందు పొలంలో రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువుకు రూ.2,600 అవుతుంది. వరినాట్లకు రూ.7వేలు, ఆపై చెత్త తీసేందుకు రూ.3వేలు అవుతోంది. ఈ సమయంలో యూరియా కోసం రూ.1,200 ఖర్చు పెట్టాలి. పంటకు చీడపీడల నివారణకు రూ.1000 అవుతుంది. పంట కోతకొచ్చాక యంత్రాల ద్వారా అయితే రూ.11వేలు, కూలీల ద్వారా అయితే రూ.10వేలు అవుతుంది. ఇవన్నీ పూర్తయి ధాన్యాన్ని ఎండబెట్టి బస్తాల్లో నింపేందుకు మరో వెయ్యి పెడితే ధాన్యం ఇల్లు చేరుతుంది. మొత్తం మీద నారుపోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరేందుకు ఎకరానికి రూ.40 వేలదాకా ఖర్చవుతోంది. చేలవద్దే కొంటున్న బయట రాష్ట్రాల వ్యాపారులు స్థానికంగా వరికి ధర లేదని తెలిసి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు, చింతామణి, శ్రీనివాసపుర తమిళనాడులోని తిమ్మిరి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లారీలతో వచ్చి రైతు పొలాల వద్దే నెమ్ముగా ఉన్న ధాన్యాన్ని కొంటున్నారు. ఆపై అక్కడే రైతుకు నగదు చెల్లిస్తున్నారు. పంటబాగా పండినా.. ఎకరా పొలంలో పంట బాగా పండితే 30 బస్తాలు (బస్తా 80 కేజీలు) లెక్కన 24 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. ఇప్పుడున్న ధరల మేరకు క్వింటాల్ రూ.1,800 చొప్పున రూ.43,200 చేతి కొస్తుంది. ఇందులో రైతు పెట్టిన పెట్టుబడి రూ.40వేలు పోతే చివరికి మిగిలేది రూ.3,200 మాత్రమే. కొనుగోలు చేయని ప్రభుత్వం గతంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వ్యవసాయశాఖ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనేవారు. కాని చంద్రబాబు పాలనలో ధాన్యాన్ని కొనకపోగా కనీసం ధర కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించాలని పలువురు కోరుతున్నారు. -
ఏదీ.. ఆపన్న హస్తం?
వీధిన పడుతున్న రోడ్డు ప్రమాద బాధితులు ● సాయం అందించడంలో బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ● మాజీ డెప్యూటీ సీఎం ధ్వజం వెదురుకుప్పం: ‘రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడంలేదు. వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి..’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులైన పేద ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వారి కుటంబాలకు బీమా ప్రీమియం గానీ, ఎలాంటి ఆర్థిక సాయం గానీ చెల్లించకపోవడంపై దారుణమన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ హాయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు బాబు ప్రభుత్వం ఆయా బాధితులకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో దిక్కుతోచడం లేదన్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల కా లంలో సుమారు 14 మంది వివిధ రోడ్డు ప్రమాదా ల్లో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. వారికి నేటికీ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదన్నారు. ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వారికి సైతం ఎలాంటి సాయం అందలేదన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు ఏం ఒరిగిందో చెప్పాలన్నారు. -
పోలీసులు నిబద్ధతతో పనిచేయాలి
చిత్తూరు అర్బన్: న్యాయం కోసం స్టేషన్కు వచ్చే ప్రతీ ఒక్క ఫిర్యాదుదారుతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించి, నిబద్ధతతో పనిచేస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అభిప్రాయపడ్డారు. చిత్తూరులోలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 31 వినతులు అందాయి. ఎస్పీ తుషా ర్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకు న్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపు లు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదా లు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. బీజెపీలో పదవులు చిత్తూరు కార్పొరేషన్: బీజెపీలో పలు అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను నియ మించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు తెలిపారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కై లాసం (నగరి), కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా సుజిత్రెడ్డి (పూతలపట్టు), మహి ళా మోర్చా అధ్యక్షురాలిగా కవితరాజు (పలమనేరు), ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా శేఖర్ (జీడీనెల్లూరు), మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ ముబారక్ (పలమనేరు)లను నియ మించినట్లు ఆయన వివరించారు. ఈ ఆఫీస్ అమలు చేయాల్సిందే చిత్తూరు కలెక్టరేట్ : అన్ని శాఖల అధికారులు కచ్చితంగా ఈ ఆఫీస్ అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో ఈ ఆఫీస్ను అమలు చేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఈ నెల 8 వరకు 68,998 అర్జీలు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 58,594 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను ప్రీ ఆడిట్ చేయాలన్నారు. డీఆర్వో మోహన్ కు మార్, డీఎల్డీవో రవికుమార్ పాల్గొన్నారు. -
సర్పంచ్ కుర్చీ మాయం
గంగాధరనెల్లూరు మండలంలో సర్పంచ్ కుర్చీ మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డును బాగు చేయండి చిత్తూరు కలెక్టరేట్ : రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ను జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు ఆయన సోమ వారం కలెక్టర్ సుమిత్కుమార్ దృష్టికి విన్నవించా రు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వి.కోటలోని కేజీఎఫ్ నుంచి పట్రపల్లి, పి.కొత్తూరు, గోవిందపురం, నాగన్నగుట్ట, చిన్నచెరువు, కనగానపల్లి, దొమ్మిరిమిట్ట, చేర్నపల్లి, చెరువుముందరవాగు, జౌనిపల్లి, మావత్తూరు మీదుగా పలమనేరు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆర్అండ్బీ పరిధిలోని బెంగళూరు–చైన్నె రహదారుల పనులకు ఎక్కువ మొత్తం టన్నే జ్ లారీలు, టిప్పర్లతో ఇసుక, రాళ్లు తరలించడంతో దారి మొత్తం గుంతల మయంగా మారిందన్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. పలు ప్రమాదాలు సైతం జరిగాయన్నారు. గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. సరెండర్? చిత్తూరు రూరల్(కాణిపాకం): ఉమ్మడి జిల్లాలో ని సత్యవేడు మండలానికి సంబంధించిన ఓ పశుసంవర్థక శాఖ సిబ్బందిని ఆ శాఖ జిల్లా అధికారులు సరెండర్ చేశారని తెలిసింది. ఇటీవల ఆ సిబ్బందిపై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు విచారణ చేసినట్టు సమాచారం. విచారణలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ఆపై ఆ సిబ్బందిని సరెండర్ చేశారని శాఖ లోని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఇందుకు సంబంధించిన విషయాలను ఆ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో త్వరలో వెల్లడించనున్నారు. ఇతనొక్కడే కాదని.. మరింత మంది కూడా బయ టపడే అవకాశాలున్నాయని ఆ శాఖలోని పలువురు గుసగుసలాడుతున్నారు. -
చిరుత దాడిలో ఆవు మృతి
చిరుత దాడిలో పాడి ఆవు మృతిచెందింది. ఈ ఘటన తవణంపల్లె మండలం, చెర్లోపల్లె సమీపంలో చోటు చేసుకుంది.మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025చిత్తూరు జిల్లాలో ‘పచ్చ’ లాటరీ మూడు ముక్కలు.. ఆరు పేకాట స్థావరాలుగా విరాజిల్లుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల వారినే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోవడం.. దానికి అధికార పార్టీ నేతలతోపాటు కొందరు ఖాకీలు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. కూలి పనులు చేసే సామాన్య ప్రజలు ఈ రొంపిలోకి దిగి సర్వం పోగొట్టుకుని.. కుటుంబాలను వీధిన పడేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులుగానీ.. అధికార పార్టీ నేతలుగానీ అటువైపు కన్నెత్తి చూడక పోవడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది. పచ్చలాటరీ! -
పింఛన్ తొలగించారు
టీడీపీ నేతల సూచనలతో అర్హులైన 8 మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించడం దారుణమని ఏపీ వికలాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ విమర్శించారు. ఈ మేరకు బాధిత దివ్యాంగ పింఛనర్లు కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐరాల మండలం, వడ్రాంపల్లెలో అర్హులైన 8 మంది దివ్యాంగుల పింఛనర్లకు అన్యాయం జరిగిందన్నారు. మండలంలోని చినకాంపల్లి సచివాలయ పరిధిలో ఉన్న వడ్రాంపల్లెలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్నాయుడు, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం, మునేంద్ర, అలాగే 45కొత్తపల్లికి చెందిన దామోదర్నాయుడు అర్హులైనప్పటికీ టీడీపీ నాయకులు కక్ష పూరితంగా వారి పింఛన్లను తొలగించారన్నారు. వెంటనే వారి పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. -
నయా స్కామ్!
– అరికట్టలేకపోతున్న జీఎస్టీ అధికారులు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జీఎస్టీ స్కామ్ పుట్టగొడుగులా పుట్టి నేడు మహా వృక్షంలా వ్యాపిస్తోంది. ప్రజలకు అవగాహన లేకపోవడంతో సామాన్యులకు మంచి మాటలు చెప్పి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. నియంత్రించాల్సిన జీఎస్టీ అధికారుల చర్యలు నామామత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అరికట్టలేరా? ఇనుప వ్యర్థాలు(స్కాప్) వ్యాపారం మోసం చేసి రూ.కోట్లు సంపాదించవచ్చని గతంలో చిత్తూరుకు చెందిన వ్యాపారి రుచి చూపించాడు. దక్షిణాది రాష్ట్రాల్లో బోగస్ కంపెనీలను సృష్టించి లేని వ్యాపారాన్ని చేసినట్లు బిల్లులు సృష్టించాడు. కట్టని పన్నులకు బిల్లులు పెట్టి అప్పనంగా ఐటీసీ రూ.కోట్లు గడించాడు. ఈ తతంగం మరువకముందే నగరంలోని ఓ చిరు వ్యాపారిని మోసగించాడు. ఆ వ్యాపారికి దాదాపు రూ.12 కోట్ల వరకు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసు రావడంతో కొత్త స్కామ్ బయటపడింది. అదుపులో కీలకవ్యక్తి స్కాప్తో అవినీతి రాజ్యాన్ని సృష్టించి కోట్లు వెనకేసిన వ్యాపారి.. ఇప్పుడు చిరు వ్యాపారుల జీవితాలతో అడుకొని ఐటీసీ దోచుకుంటున్నాడు. ఇతన్ని సంబంధిత అధికారులు అదుపులో తీసుకొని పలు విషయాలు రాబట్టినట్లు సమాచారం. గతంలో బోగస్ సంస్థల అకౌంట్లను లాక్ చేయగా వాటి పై నకిలీ వ్యక్తులతో హైకోర్టులో కేసు వేసి సమస్యను పరిష్కారించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు బ్యాంకుల అధికారుల పాత్ర ఇందులో ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. అకౌంట్దారుడు లేకుండా ఖాతాలను ఎలా తెరుస్తున్నారు.. ఇందులో వారి ప్రమేయం ఎంత అనే వాటిపై సందేహాలు కలుగుతున్నాయి. ఇంటి దొంగల సహకారం లేనిదే ఇంత మొత్తంతో మోసాలు చేసే అవకాశాలు ఉండవు. జీఎస్టీ ఖాతాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ, బ్యాంక్ అధికారులు, చార్టడ్ అకౌంట్స్ సహకారంత ఈ సిండికేటు జరిగినట్లు తెలుస్తోంది. కొత్త ప్లాన్స్తో మోసాలు నగరంలో తోపుడు బండ్లు మీద చిరుతిండ్లు, కూరగాయలు, పండ్లు విక్రయించే వారి అమాయకత్వాన్ని వాడుకొని ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్లు తీసుకుంటారు. చిరువ్యాపారి వివరాలతో బ్యాంక్ అకౌంట్ తెరచి సీజీఎస్టీకి లైసెన్స్ తీసుకుంటున్నారు. అనంతరం వాటి ద్వారా బోగస్ కంపెనీల పేరుతో చేయని వ్యాపారిన్ని చేసినట్లు బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి ఐటీసీ వసూలు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరుకు చెందిన చిరు వ్యాపారికి రూ.12.32 కోట్లు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో అవాక్కయ్యాడు. నగరంలోనే వందలాది చిరువ్యాపారాలను మోసగించి ఈ దండా సాగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా వందల కోట్లు ఐటీసీ కై ్లమ్ చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అరహం పెట్రో అండ్ నాన్ పెట్రో సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, మదీనా స్టీల్స్, జెడ్ఎఫ్ ట్రేడర్స్, యార్ స్టీల్స్, ఎమ్మార్ స్టీల్స్ ప్రైవేటు లిమిటెడ్ వంటి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి వీటితో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు గడించినట్లు అధికారులు గుర్తించారు. -
కుల ధ్రువీకరణ పత్రం లేదు
తమ కులానికి కులధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పిరమల్లై కల్లర్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సౌందర్రాాజా వాపోయారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. జిల్లా లోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, తదితర ప్రాంతాల్లో 2 వేల కుటుంబాలు తమ కులానికి చెందినవారున్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో తాము ఓబీసీ జాబితాలో ఉన్నట్లు చెప్పారు. ఏపీలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
అమ్మా..నాన్నా.. వెళ్తున్నా.. గొడవ పడొద్దు!
వి.కోట: మనోవేదనతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముదిమడు గు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ సోమశేఖర్రెడ్డి కథనం.. మండలంలోని ముదిమడుగు గ్రామానికి చెందిన తిమ్మరాజు, రేణుక దంపతుల కుమార్తె అణుశ్రీ పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 10వ తర గతి చదువుతోంది. ఈ క్రమంలో దంపతులు ఇంట్లో తరచూ గొడవ పడేవారు. తీవ్ర మనస్తాపానికి గురైన అణుశ్రీ ‘అమ్మా, నాన్నా నేను చనిపోయిన తర్వాత అయినా మీరిద్దరూ గొడవ పడకుండా ఉంటారని కోరుకుంటున్నా’ అని లెటర్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక అణుశ్రీ తగ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. జాతీయ బేస్ బాల్ పోటీలకు ఎంపిక బంగారుపాళెం: జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు మండలంలోని ఎగువ రాగిమానుపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిరోష ఎంపికై నట్లు ఇన్చార్జి హెచ్ఎం రామమూర్తి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో గత నెల 29 నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్ర స్థాయి అండర్–14 బేస్బాల్ పోటీలు నిర్వహించారన్నారు. ఆ పోటీలలో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నిరోష పాల్గొని జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. 2026 జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న బేస్బాల్ పోటీలలో నిరోష పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థి నిరోషను వ్యాయామ ఉపాధ్యాయుడు గురుప్రసాద్ తదిరతులు అభినందించారు. చిరుత దాడిలో ఆవు మృతి తవణంపల్లె: చిరుత దాడిలో ఆవు మృతిచెందిన ఘట న మండలంలోని చెర్లోపల్లె సమీపం, శివ కోన గుట్టలో చోటుచేసుకుంది. ఫారెస్టు ఎఫ్బీఓ జబి సమాచారం మేరకు.. మండలంలోని చెర్లోపల్లెకు చెందిన ఎన్.పరదేశి తమ పశువులను మేత కోసం ఆదివారం శివకోన గుట్టలోకి తరలించా డు. అక్కడ మేత మేస్తున్న పాడి ఆవుపై చిరుత దాడి చేసింది. అడవిలోకి మేతకు వెళ్లిన ఆవు తిరి గి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం శివకోనగుట్టకు వెళ్లి గాలించాడు. గుట్టలో ఎత్తైన భాగంలో రెండు గుండ్లు మధ్యలోని గుహలో చిరుత పులి చంపి తినేసి పడేసిన ఆవు కళేబరాన్ని గుర్తించాడు. ఆపై ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్బీఓ జబి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెటర్నరీ అసిస్టెంట్ ద్వారా పోస్టమార్టం చేయించి ఆవును అక్కడే ఖననం చేయించారు. -
టీడీపీ నేత అత్యుత్సాహం
– అనుమతి లేకుండా పాఠశాలలో తన తండ్రి విగ్రహం ఏర్పాటు సాక్షి టాస్క్ ఫోర్సు: టీడీపీ నేత అత్యుత్సాహం ప్రదర్శించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని కొళత్తూరు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన స్టేజీని శనివారం ప్రారంభించాడు. దీంతో పాటు అదే స్టేజీ మీద తన తండ్రి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడు. అయితే గ్రామస్తులు, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల ప్రాంగణంలోని స్టేజీ మీద తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాల ప్రాంగణంలో అనుమతులు లేకుండా టీడీపీ నాయకుడు తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. పీఎస్సై మారప్ప గ్రామానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. దీనిపై ఎంఈఓ గోపాల్రెడ్డిని వివరణ కోరగా హెచ్ఎం నివేదికను, పాఠశాల ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
మా గోడు వినేదెవరయ్యా?
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా....మా గోడు పట్టించుకోండి’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్వో మోహన్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో వివిధ సమస్యలపై 370 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తెలిపారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్న చెర్లోపల్లి గ్రామస్తులు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు మొరపెట్టుకుంటున్న అర్జీదారులుతమ గ్రామంలోని 120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవయ్యా..! అంటూ జిల్లాలోని చెర్లోపల్లి గ్రామస్తులు తేజశ్రీ, రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని 120 కుటుంబాలకు ఇంటి స్థలాలు లేక బాడుగ ఇళ్లల్లో ఉంటున్నామన్నారు. తేనెబండ గ్రామంలోని సర్వే నం.1121, 654లో ప్రభుత్వ భూమి ఉందని, గ్రామ కమిటీ తీర్మానించిందన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారిలో ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ కులస్తులు ఉన్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. విభజన వొద్దు జిల్లాలోని వెదురుకుప్పం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ విభజన వొద్దని ఆ గ్రామస్తులు రవి, నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం ప్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. తమ పంచాయతీని బొమ్మాయిపల్లి, దేవళంపేట పేరుతో రెండుగా విడగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అలా జరిగితే బడుగు, బలహీన వర్గాలుండే బొమ్మాయిపల్లె ప్రజలు పూర్తిగా వెనుకబడుతారన్నారు. న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవయ్యా -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్సీపీ పదవులు ఇస్తూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర వైఎస్సార్టీఎఫ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన కమ్రుద్దీన్, జిల్లా వైఎస్సార్టీఎఫ్ అధ్యక్షుడిగా పలమనేరుకు చెందిన సోమ చంద్రరెడ్డి, జిల్లా ఆర్టిషన్ విభాగ అధ్యక్షుడిగా జీడీ నెల్లూరుకు చెందిన కొత్తపల్లె మోహన్, నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన సద్దాం, నియోజకవర్గ వైఎస్సార్టీఎఫ్ అధ్యక్షులుగా నగరి నుంచి రామచంద్రారాజు, పలమనేరు నుంచి గోవింద్రెడ్డి, పుంగనూరు నుంచి మోహన్రెడ్డి, పూతలపట్టు నుంచి కోదండరామిరెడ్డి, చిత్తూరు నుంచి కోతండాన్లను నియమించారు. అలాగే జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం కల్చరల్ విభాగ అధ్యక్షుడిగా మునేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా సుమతి, సుబ్రమణ్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వెంకటరమణ, సుధాకర్, కుప్పయ్య, కార్యదర్శులుగా గణేష్రెడ్డి(గౌతమ్), గోపి, జగదీష్రెడ్డి, ఇమ్రాన్, గోవిందస్వామి, ఏడుగురు ఈసీ మెంబర్లను నియ మించారు. కార్వేటినగర మండల ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా ధర్మయ్య, ఉపాధ్యక్షులుగా చల్లా మోహన్, విష్ణువర్మ, ప్రధాన కార్యదర్శులుగా చంద్ర, యోగానందరెడ్డి, అరుణ్కుమార్రెడ్డి, కార్య దర్శులుగా ఎం.సుదర్శన్, బాలసుందరన్, సబ్దార్, రాజేంద్ర, జగన్మోహన్రెడ్డి, ఆరుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. కార్వేటినగర మండల ఐటీ విభాగం అధ్యక్షుడిగా చరన్రెడ్డి, ఉపాధ్యక్షులుగా తేజువర్మ, కొండూరు హరికిషన్, ప్రధాన కార్యదర్శులుగా పురుషోత్తం, గోపాల్రెడ్డి, జ్యోత్స ్న, తులసీరామ్రెడ్డి, కార్యదర్శులుగా జగదీష్రెడ్డి, ధనశేఖర్రెడ్డి, సాయి ప్రతాప్రెడ్డి, రూపేష్రెడ్డి, జయప్రకాష్రెడ్డి, ఎ.జగదీశ్వర్, 8 మందిని ఈసీ మెంబర్లుగా నియమించారు. కార్వేటిన గర మండలం వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షులుగా మున్నా, వి.రెడ్డి అత్తూరు, ప్రధాన కార్యదర్శులుగా లవకుమార్, మదన్రెడ్డి, గిరిప్రసాద్, కార్యదర్శులుగా నరేష్, రఘురెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, సి.వెంకటేష్రెడ్డి, ఎస్.కే.అల్లబకాష్, దాము రెడ్డి, ఈసీ మెంబర్లుగా ఆరుగురిని నియమించారు. వైఎస్సార్టీయూసీ విభాగ అధ్యక్షుడి శ్యామ్, ఉపాధ్యక్షులుగా రామిరెడ్డి, జ్యోతిశ్వరన్, ప్రధాన కార్యదర్శులుగా ము రళీకృష్ణ, రమేష్రెడ్డి, హరిబాబు, లోకేష్రెడ్డి, కార్యదర్శులుగా సుబ్రమణ్యం, లాల్బాషా, గురవయ్య, రమే ష్, ఈసీ మెంబర్లుగా ఆరుగురిని నియమించారు. -
జిల్లా విద్యాశాఖ కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు ఎన్జీవో సంఘం కార్యాలయంలో ఆదివారం జిల్లా విద్యాశాఖ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. వీటికి ఎన్నికల అధికారిగా రాజేంద్రప్రసాద్, పరిశీలకులుగా పద్మకుమారి వ్యవహరించారు. నూత న కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా కుమార్ (సూపరింటెండెంట్, సమగ్రశిక్ష), ప్రధాన కార్యదర్శిగా చైతన్య (సీనియర్ అసిస్టెంట్, డీఈవో కార్యాలయం), కోశాధికారిగా గోపాల్ (సీనియర్ అసిస్టెంట్, డీఈవో కార్యాలయం) ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామ్కుమార్, ఉపాధ్యక్షులుగా రమేష్, నాగరాజు, రెడ్డిశేఖర్, ఎన్.కుమార్, రహమత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బాలాజీ, సహాయ కార్యదర్శులుగా సుల్తానా, రేణుకావతి, దీపిక, తులసీరామ్, రాజేష్, మహిళా కార్యదర్శిగా కృపావతి, మెంబర్లుగా రవిశేఖర్, సాయిప్రశాంతి, యువరాజ్, మునిరాజ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఏపీ జిల్లా అధ్యక్షుడు రాఘవులు, కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయం కూల్చివేతపై వివాదం శాంతిపురం : పంచాయతీ కేంద్రమైన సి.బండపల్లిలో పురాతన శ్రీకోదండరామ స్వామి ఆలయం, దాని పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా.. గ్రామంలో సుమారు 300 ఏళ్ల చరి త్ర ఉన్న కోదండరామస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఆ మేరకు నిధుల సమీకరణ చేశారు. వీరు ప్రభుత్వ సాయం కోరడంతో అధికారులు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కొందరు ఆదివారం జేసీబీతో ఆలయాన్ని, కమ్యూనిటీ భవనాన్ని కూలదోశారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. చిన్నారిపై కుక్కల దాడి శ్రీరంగరాజపురం : ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన మండలంలోని క్షీరసముద్రం దళితవాడలో చోటుచేసుకుంది. బాధిత చిన్నారి తండ్రి మధు కథనం మేరకు.. ఆదివారం కావడంతో చిన్నారి రిచ్లిన్ (9) ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కుక్కలు ఒకసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రిచ్లిన్కు తీవ్ర రక్తస్రావం అయ్యింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలోనూ గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య -
వైభవంగా భక్త కనకదాసు ఉత్సవాలు
వి.కోట : మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను కురబలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర బీసీ వెల్ఫేర్శాఖ మంత్రి సవిత, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కర్ణాటక రాష్ట్రం కోలార్ ఎమ్మెల్యే వర్తూర్ ప్రకాష్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మహిళలు పాల కలశాలతో కనకదాసు విగ్రహం వరకు ఊరేగింపు చేపట్టి భక్త కనకదాసు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కురబలు తమ సంప్రదాయ పద్ధతిలో భక్తుల తలపై టెంకాయలు కొట్టి వారి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర మంత్రి సవిత మాట్లాడుతూ.. కురబలు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కురబ సంఘం అద్యక్షుడు కృష్ణప్ప, ప్రదాన కార్యదర్శి అమర్గౌడ్, స్థానిక నేతలు రామచంద్రా నాయుడు, రంగనాథ్, ఈశ్వర్ గౌడ్ , దీరజ్ కురబ కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్మోహన్ రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్మోహన్రెడ్డి రెండవ సారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఆ సంఘం 79వ వార్షిక కౌన్సిల్ సమావేశం జిల్లా కేంద్రంలోని విజయం విద్యాసంస్థల్లో నిర్వహించారు. ముఖ్య అతిధులు, జిల్లా ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, పరిశీలకులుగా బాలగంగిరెడ్డి, చిత్తూరు జిల్లా కు చెందిన గంటామోహన్ తొలుత ఎస్టీయూ జెండాను ఎగురవేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఇలియాస్ భాషా, ఆర్థిక కార్యదర్శిగా పురుషోత్తం, గౌరవ అధ్యక్షునిగా పీతాంబరరాజు, రాష్ట్ర కౌన్సిలర్లుగా గంటామోహన్, దేవరాజులురెడ్డి, చంద్రన్, చంద్రశేఖర్నాయుడు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా కమాలపతి, బొబ్బిలిరెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శులుగా కిషోర్కుమార్రెడ్డి, సుల్తాన్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేష్కుమార్, గణపతి, కోదండయ్య, కుమారస్వామిరెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్గా రాధాకుమారి ఎన్నికయ్యారు. -
సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం
నగరి : కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. మున్సిపల్ పరిధి 11వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం కార్యదర్శి గుడుబా ఆధ్వర్యంలోనూ, సత్రవాడలో మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు రమేష్రెడ్డి ఆధ్వర్యంలోనూ ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు తెలు పగా జనం ముందుకు వచ్చి సంతకాలు చేపట్టడంతో ఒక ఉద్యమంలా కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. వైద్య కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యా ర్థుల వైద్య విద్యకు గండికొట్టి జేబులు నింపుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కళైసెల్వన్, కేశవన్, రవి, గుణ, అయ్యప్పన్, మోహన్రాజ్, భూపాలన్ పాల్గొన్నారు. ఉచిత వైద్య విద్య కోసం పోరు వడమాలపేట (పుత్తూరు) : ఉచిత వైద్య విద్య పేదలకు అందే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ నాయకుడు గాంధీ స్పష్టం చేశారు. ఆది వారం వడమాలపేట మండలం కాయం గ్రామంలో గాంధీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేని చంద్రబాబుకు ఉన్నవాటిని ప్రైవేటీకరించే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. నేడు గ్రామాల్లో ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నా రు. అలాగే వడమాలపేట మండలం బట్టికండ్రిగ, ఎస్వీపురం, వడమాలపేటలో పార్టీ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి, సురేష్రాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. వేణునాధం, చంద్ర, నిరంజన్రెడ్డి, నాని, తుకారాం, జయంతు, గిరిబాబు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వెల్లువెత్తిన నిరసన సంతకం పూతలపట్టు(యాదమరి) : కోటి సంతకాల సేకరణతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నిస్తేజం మొదలయ్యిందని పూతలపట్టు ని యోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తలపులపల్లి పంచాయతీలో బాబు రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్ర మం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు స్వ చ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, వైద్య కళాశాలలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న స్వార్థ పూరిత నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళతా మని చెప్పారు. స్థానిక సర్పంచ్ సుబ్రమణ్యం, ఉప సర్పంచ్ రెడ్డప్ప రెడ్డి, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి.హరి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉద్యమంలా సంతకాల సేకరణ బైరెడ్డిపల్లె : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో విద్య, వైద్యంతో పాటు మహిళా, రైతు సంక్షేమం సక్రమంగా అందిందని రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం ఆదివారం మండల పరిదిలోని పలు గ్రామాల్లో ఉద్యమంలా సాగింది. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. బైరెడ్డిపల్లెలో సంతకాలు సేకరిస్తున్న రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి క్రిష్ణమూర్తి , 11వ వార్డులో సంతకాలు చేస్తున్న ప్రజలు , సత్రవాడలో.. , పూతలపట్టులో కోటిసంతకాల కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు -
పల్లె వైద్యం..పేదలకు దూరం
కాణిపాకం : చంద్రబాబు సర్కారు రాకతో వైద్య ఆరో గ్య సేవలు కుంటుపడుతున్నాయి. పల్లె వైద్యం పక్కా దారి పడుతోంది. క్షేత్రస్థాయిలోని వైద్య వ్యవస్థను నీరుగారుస్తోంది. ఏఎన్ఎంల సొంత సేవలను వదిలించుకునేలా చేస్తోంది. అదనపు పనులు అంటగడుతోంది. మండల అధికారులతో మాటలు పడాల్సి వస్తోంది. ప్రశ్నిస్తే.. కడుపు కోతలు పెట్టిస్తోంది. తద్వా రా వైద్య ఆరోగ్య సేవలు, సర్వేలు నత్తనడకగా మారుతున్నాయి. దీంతో ఏఎన్ఎంలు ఆవేదనతో కుమిలిపోతున్నారు. ఈ గోడును ఆ సంఘం నేతలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి విన్నవించారు. సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సిబ్బందికి ఇతర పనులు, సర్వేలకు పరిమితం చేసింది. తద్వారా సచివాలయ సేవలకు ప్రజలు దూరమయ్యారు. మండల స్థాయికి పరుగులు తీస్తున్నారు. ఇదే మాదిరిగానే విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలు దూరం అవుతున్నాయి. ఈ కారణంగా పల్లైవెద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. కేంద్రాల్లో వైద్య సిబ్బంది కనుమరుగవుతున్నారు. ప్రస్తుతం సిబ్బందిని ఇతర సేవలకు వినియోగిస్తుండడంతో పేద ప్రజలకు సేవలు దూరం అవుతున్నాయి. చేయకుంటే వేతనాలపై వేటు జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు, 464 విలేజ్ హెల్త్ క్లినిక్లున్నాయి. వీటి కింద సచివాలయ ఏఎన్ఎంలు 464 మంది, అర్బన్లో ఏఎన్ఎంలు 103 మంది, సెంకడ్ ఏఎన్ఎంలు 84 మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా సచివాలయ ఏఎన్ఎంలను వారి పరిధిలో జరిగే సర్వేలు చేయమని పలువురు ఎంపీడీఓలు ఒత్తిడి తెస్తున్నా రు. వాళ్లు చెప్పిన పనిచేయని పక్షంలో నోటీసులు ఇస్తున్నారు. లేకుంటే జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీనికితోడు డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్సబర్సింగ్ ఆఫీసర్) కూడా ఏఎన్ఎంలపై పెత్త నం చలాయిస్తున్నారు. వాళ్ల సర్వేలను కూడా చేయాలని, లేకుంటే ఎంపీడీఓకు రిపోర్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. సర్వేలకు తలొగ్గని పక్షంలో డీడీఓ లు జీతాల్లో జాప్యం చేయిస్తున్నారు. దీనికారణంగా వైద్య ఆరోగ్య సేవలు పల్లె జనానికి దూరమయ్యాయి. ఎంఎల్హెచ్పీలపై ప్రభావం ఏఎన్ఎంలను పట్టి పీడిస్తున్న అదనపు పనులు ఇప్పుడు..ఎంఎల్హెచ్పీలపై ప్రభావం చూపుతోంది. ఐరాల మండలంలోని ముగ్గురు ఎంఎల్హెచ్పీలను ఇతర పనులు చేయాలని ఇటీవల అక్కడి మండల, డీడీఓలు ఒత్తిడి తెచ్చారు. ఈవిషయాన్ని వెంటనే వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాల యం దృష్టికి తీసుకొచ్చారు. వారు అదనపు పను లు చేయొద్దని, వైద్య సేవలు మాత్రమే చూడాలని ఆదేశించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంలు వైద్య సేవ లు మాత్రమే చూసేవారు. విధిగా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వర్తించేవా రు. మంగళవారం ఆశా మీటింగ్, బుధవారం కేంద్రాల్లో వ్యాక్సినేషన్, శనివారం క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్, మీటింగ్లు, శిక్షణ కార్యక్రమాలు హాజరవుతూ..సొంత సర్వేలను చూసుకునేవారు. దీనికి తోడు విలేజ్ హెల్త్ క్లినిక్కు వచ్చే వారికి మందులు, మాత్రలు ఇచ్చుకుంటూ..వైద్య సేవలను ఎప్పటికప్పుడు పూర్తి చేసేవారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక పల్లె వైద్యం పేదలకు దూరం అయింది. ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్రాలు వదిలి అనధికారిక సేవలకు పరిమితమవుతున్నారు. పింఛన్ల పంపిణీ, ఓటరు పరిశీలన, ఆధార్ సీడింగ్, యోగా డే, నాన్ ఏపీ రెసిడెంట్, రేషన్కార్డు పంపిణీ, ఇంటింటా సర్వేలతో పాటు సచివాలయ పరి ధిలో జరిగే వాటన్నింటికి వారిని బాధ్యులు చేస్తున్నారు. కొందరు సచివాలయ సిబ్బంది తలకు మించిన సర్వేలు తాము చేయలేమని చేతులెత్తేయడంతో ఆ పనులను కూడా ఏఎన్ఎంలకు అంటగడుతున్నారు. బలవంతంగా సర్వేలు చేయిస్తున్నారు. చేయని పక్షంలో మండల అధికారులు నరకం చూపిస్తున్నారు. విజృంభిస్తున్న విష జ్వరాలు పల్లెల్లో వైద్య సేవలు దూరం కావడంతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రస్తుతం పల్లె, పట్నం తేడా లేకుండా విషజ్వరాల ముప్పు ను తెచ్చిపెడుతున్నాయి. ఇందుకు తగ్గట్టు పల్లెల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండడం లేదు. సీజనల్ వ్యాధుల కట్టడి చేయలేకపోతున్నారు. స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే...అదనపు పనులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక స్క్రబ్ టైఫస్ కేసులు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని జనానికి మందు బిల్లులు ఇచ్చేవారు కూడా కరువుతున్నారు. కనీసం సలహాలు, సూచనలు ఇచ్చేవారు దూరమవుతున్నారు. ఎన్సీడీ–4, క్షయ, కుష్టు వ్యాధి తదితర సర్వేలన్నీ కూడా వెంటాడుతున్నాయి. ఈ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా మళ్లీ యథావిధిగా సాగుతోంది. వైద్య సిబ్బంది సొంత శాఖ పనులు తప్ప..ఏ ఇతర పనులు చేయకూడదని జీఓలు ఉన్న వాటిని పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కానీ పక్షంలో రోడెక్కడం కాయమని వైద్య సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. -
గంగమ్మా..దీవించమ్మా
బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.ఉద్యమం.. మహోద్యమం! సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 పుంగనూరు మున్సిపాలిటీలో కోటి సంతకాల సేకరణ ప్రతులను అందుకుంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్)చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా 92 వేల సంతకాలు సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్న్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరో 8వేల సంతకాలు కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో నియోజక వర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి కానుంది. 5 కేంద్రాల్లో టెట్ – 10 నుంచి పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : ఐదు కేంద్రాల్లో టెట్ నిర్వహిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 5 సెంటర్లలో ఈనెల 10వ తేదీ నుంచి 21 వరకు టెట్ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని మదర్థెరిస్సా (పలమనేరు), ఎస్వీ సెట్ (ఆర్వీఎస్ నగర్), వేము ఇంజినీరింగ్ కళాశాల (పి.కొత్తకోట, పూతలపట్టు మండలం), సీతమ్స్ (చిత్తూరు), కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (కుప్పం)లో టెట్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఒక గంట ముందుగా చేరుకోవాలన్నారు. ఒరిజనల్ ఐడీ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 7386408270, 9885506094 నంబర్లలో సంప్రదించాలన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. కాణిపాకం.. భక్తజన సందడి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి పోటె త్తారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు స్వామి దర్శనం కోసం భారీగా వచ్చారు. వీరి రాకతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆలయం ఆవరణం భక్త జనంతో కిక్కిరిసింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనంతో పాటు వీఐపీ గేటు గుండా భక్తులు కిటకిటలాడారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. సంతకం..సమర శంఖారావంసిరా చుక్కలు సంతకాల రూపం ధరిస్తున్నాయి.. అక్షర ఆయుధాలుగా మారుతున్నాయి. ఆ సంతకాలే సమర శంఖారావం పూరిస్తున్నాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాయి. సర్కారుపై దండెత్తుతున్నాయి.. వైద్య విద్యను బాబు ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తున్నాయి. చిన్న ఉద్యమంగా మొదలై మహోద్యమంగా అవతరిస్తున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల యాగంలో పాలుపంచుకోవడానికి ఊరూవాడా సిద్ధమవుతున్నాయి. తమ పిల్లలపై ప్రైవేటు పెత్తనం వద్దంటూ సామాన్య, మధ్యతరగతి జనం స్వచ్ఛందంగా సంతకం చేసి, తమ నిరసనను వెలిబుచ్చుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం.. మహాద్యమంలా సాగుతోంది. పార్టీలకతీతంగా విద్యార్థినీ విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతుండడంతో తిరుపతి, చిత్తూరు, జిల్లాల్లో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కళాశాలలు 2023–2024 మధ్య కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆ ఐదు కళాశాలల ద్వారానే అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు వచ్చేలా చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో మెడికల్ కళాశాలలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. మెడికల్ కళాశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతోంది. పూతలపట్టు: యాదమరిలో కోటి సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ (ఫైల్)నగరి: ముడిపల్లెలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్)చిత్తూరు : సంతకాల సేకరణలో సమన్వయకర్త విజయానందరెడ్డి, పలమనేరులో సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , కుప్పం: కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ భరత్ , కార్వేటినగరం: సంతకాల సేకరణలో సమన్వయకర్త కృపాలక్ష్మి (ఫైల్ ఫొటోలు)ఎవరి స్వలాభం కోసం.. ప్రభుత్వ బడ్జెట్తో నిర్మించిన మెడికల్ కళాశాలను ఎవరి స్వలాభం కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మించాల్సింది పోయి ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయడం దారుణం. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ పేద విద్యార్థులకు తీవ్ర అన్యా యం చేసేందుకే చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇంక సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాలల పనులు పూర్తి అవుతాయి. అది చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం బాధాకరం. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేరా? అని ప్రశ్నిస్తున్నాం. – పురుషోత్తం, చిత్తూరు నగరం ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి. ప్రైవేట్ పరం చేయకూడదు. వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగా ల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలు గుతుంది. ఇప్పటికే వైద్యం, విద్య రెండూ ఖరీదయ్యాయి. మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం తన నిర్ణ యం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే వైద్య విద్య పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుంది. – దినేష్, చిత్తూరు నగరం -
సార్.. ఎందుకింత మంది పోలీసులు?
– పోలీసుల బందోబస్తు మధ్య మండల సమావేశం బంగారుపాళెం : స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద కు ఉదయం 10 గంటలకు పలమనేరు డివిజన్ పరిధి లోని పది మంది పోలీసులు వచ్చి ఆఫీస్ వద్ద కూర్చున్నారు. ఆదివారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పోలీసులను చూస్తూ సభ్యులు ఇంత మంది పోలీసులు ఎందుకు వచ్చారు. ఏమై ఉంటుంది. ఏమి జరుగుతుందో..ఏమోనని మనసులో అనుకుంటూ సమావేశ మందిరం వైపు సాగా రు. 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. యథా విధిగా సమావేశంలో అధికారులు అజెండాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి వివరించారు. సభ్యు లు వారి సందేహాలు, సమస్యలపై ప్రస్తావించారు. సమావేశం మధ్యలో నుంచి ఓ సభ్యురాలు బయటకు వచ్చి తన సందేహాన్ని తీర్చుకునేందుకు వచ్చింది. అక్కడే ఉన్న ఓ పోలీసన్నను ఇలా అడిగింది. సార్, మండల సర్వసభ్య సమావేశానికి ఇంతమంది పోలీసులను బయట నుంచి ఎందుకు రప్చించారు. ఏమి జరుగుతోంది..? అని అడిగింది. నేను గతంలోనూ ప్రజాప్రతినిధి హోదాలో పలుసార్లు మండల సర్వస భ్య సమావేశాలకు హాజరయ్యాను. ఇలా భారీ స్థాయి లో మండల సమావేశానికి బందోబస్తు లేదు. గత నాలుగైదు సమావేశాలప్పటి నుంచి ఇలా పోలీసులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఎందుకు...? అసెంబ్లీ సమావేశాల తరహాలో పోలీసులను మండల సమావేశానికి బందోబస్తుగా రావడం ఆశ్చర్యంగా ఉంది సార్ అని అన్నారు. ఆ పోలీసన్న నోటి నుంచి చిరునవ్వు తప్ప సమాధానం లేదు. స్థానిక సీఐ పర్యవేక్షణలో ఓ ఎస్ఐ, 10 మంది పోలీసులు మండల సమావేశానికి బందోబస్తుగా రావడంపై చర్చగా మారింది. మండలంలో మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్సా ర్సీపీ పార్టీకి చెందిన వారే. టీడీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన 18 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడ మండల సమావేశంలో నిలదీస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
పలమనేరు : పట్టణంలోని బండ్లవీధికి చెందిన విష్ణుతేజ(28) తన దుకాణంలో శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలనున్న వారు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. మరోవైపు అతడి ఒంటిపై ఐదు చోట్ల కత్తిపోట్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కాగా ఇది ఆత్మహత్య లేక హత్య అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది. -
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఈనెల 22న తలపెట్టిన మామిడి రైతుల చలో చిత్తూరు కలెక్టరేట్ను జయప్రదం చేయాలని మామిడి రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని ఎస్టీ యూ కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు మురళీ మాట్లాడుతూ.. గుజ్జు పరిశ్రమలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం మామిడి రైతులకు కిలోకు రూ. 8 ఇవ్వాల్సి ఉందన్నారు. పరిశ్రమలు ఆరు నెలలు గడుస్తున్నా బిల్లుల చెల్లింపులో జాప్యం చేసి తీరా రూ.4 చెల్లిస్తోందన్నారు. ఇదీ చాలా దారుణమన్నారు. మళ్లీ పూతకొచ్చే సమయం ముంచుకొస్తోందన్నారు. గిట్టుబాటు ధర ప్రకారం ఇవ్వాల్సి న బకాయిల కోసం ఈనెల 22వ తేదీన చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సురేంద్రన్, సంజీవరెడ్డి, మునిరత్నం నాయుడు, ఉమాపతి నాయుడు, మోహన్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు. -
రౖపెవేటీకరణపై అంకుశం
కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు కావడంలో వైఎస్సార్సీపీ నేతలు సఫలీకృతం అయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు , ప్రజల నుంచి ఊహించని ఆదరణ లభించింది. దీంతో పార్టీ నేతలు ఉత్సాహంగా ఊరూ వాడ ఏకమై సంతకాల సేకరణ ఉద్యమంలా చేపడుతున్నారు. బంగారుపాళెం : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ అన్నా రు. శనివారం బంగారుపాళెంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో సునీల్కుమార్ పాల్గొని ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించి ప్రజల మనస్సులో నిలిచిపోయాడన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు వ్య క్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తు తరాల కోసమే ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరుబాట సాగిస్తోందన్నారు. అదే విధంగా మండలంలోని ఆండారెడ్డిపల్లె, తగ్గువారిపల్లెలో మాజీ సమితి అధ్యక్షుడు తులసీరామకృష్ణారెడ్డి ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిందరాజులు, రఘుపతిరాజు, కృష్ణమూర్తి, ప్రకాష్రెడ్డి, థామస్, కిషోర్కుమార్రెడ్డి, సర్దార్, వడ్డెర కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మొగిలీశ్వర్, రెడ్డెప్ప, షాకీర్, మహేంద్ర, గజేంద్ర, జగదీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య కాలేజీలను బినామీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర పెద్దపంజాణి: వైద్య కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలకు తీవ్ర నష్టం కలుగుతుందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వారు శనివారం రాయలపేట, కొళత్తూరు, ముత్తుకూరు, పెద్దవెలగటూరు, పెద్దపంజాణి పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు పిల్లలు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని తెలిపారు. వాటిని చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో తమ వారికి ఇచ్చుకునేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుహేబ్, మేధావుల ఫోరం మండల అధ్యక్షుడు గుర్నాథరెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్, రవికుమార్, నాయకులు మార్కొండయ్య, రాజా, మంజునాథరెడ్డి, హనీఫ్ బాషా, రాజన్న, ముబారక్ పాల్గొన్నారు. బైరెడ్డిపల్లెలో అనూహ్య స్పందనబైరెడ్డిపల్లె : ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి అన్నారు. బైరెడ్డిపల్లెలో శనివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లబించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వలన పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. దీన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కార్తిక్, మండల యూత్ ప్రెసెడెంట్ మహేష్బాబు, వైస్సార్సీపీ నేతలు జయకుమార్రెడ్డి, తబ్రాజ్బాష, చంద్రశేఖర్, కుమార్, దినేష్ పాల్గొన్నారు. -
సమస్యలపై నిలదీత
జిల్లాలో కీలకమైన జెడ్పీ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ డుమ్మా కొట్టడం విస్మయానికి గురిచేసింది. కాగా జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు అధికారుల తీరును ఎండగట్టారు. గోకులం షెడ్లు, యూరియా కొరత, ఆరోగ్యశ్రీ బకాయిలపై నిలదీశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కీలకమైన అధికారులు డుమ్మా కొట్టడంపై కలెక్టర్ మండిపడ్డారు. చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్కుమార్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి డీఆర్వో నరసింహులు, సీఈఓ రవికుమార్నాయుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి తిరుప తి, అన్నమయ్య జిల్లాల నుంచి పలువురు ఉన్నతాధికారులు (హెచ్ఓడీ)లు హాజరు కాలేదు. దీంతో అధికారులకు నోటీసులు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పలు అంశాలపై సమస్యలు లేవనెత్తా రు. కాగా నెలల తరబడి పెండింగ్లో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ జీతాలు ఇవ్వాలని సభ్యులు కలెక్టర్కు వినతి చేశారు. తొలుత ఇటీవల మరణించిన రామసముద్రం, రామకుప్పం ఎంపీపీలు కుసుమకుమారి, శాంతమ్మకు నివాళి అర్పించాల ని రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి కోరగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మెడికల్ కళాశాలల పీపీపీపై తీర్మానం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వం అప్పగించడం సరికాదని రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని జెడ్పీ చైర్మన్కు వినతి చేశారు. పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా చైర్మన్ తీర్మానించగా సభ్యులు ఆమోదించారు. గోకులంషెడ్లు పై రగడ జిల్లాలో అర్హులైన వారికి కాకుండా టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి గోకులం షెడ్లు మంజూరు చేస్తే వాటిని కారు షెడ్డుగా వాడుకుంటున్నారని పలువురు జెడ్పీటీసీలు ప్రస్తావించారు. వీటిపై ఇటీవల శ్రీసాక్ష్ఙి పత్రికలో వచ్చిన శ్రీగోకులం..అవినీతిలో బలం్ఙ అనే కథనం గురించి ఉదాహరణగా చూపరు. గోకులం షెడ్లు అనర్హులకు ఇవ్వలేదని అధికారులు నిరూపిస్తే రాజీనామా చేయడానికి కూడా వెనుకడమని సవాల్ విసిరారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్ని షెడ్లు మంజూరు చేశారు అనే సమాచారం కూడా అధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ కరుణాకర్రెడ్డి, సదుం జెడ్పీటీసీ సోమశేఖర్రెడ్డి, బంగారుపాళ్యం ఎంపీపీ అమరావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు దక్కాల్సిన షెడ్లను కార్ పార్కింగ్ కోసం వాడుకోవడం అన్యాయమన్నారు. నివేదిక రాసుకొని వెళ్లిపోయారు.. పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంవత్సర కాలంలో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనుల్లో అవినీతి జరిగిందని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారన్నారు. వీటిపై విచారణకు ఆదేశించగా కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా రిపోర్టు రాసుకోని వెళ్లిపోయారని సదుం జెడ్పీటీసీ సోమశేఖర్రెడ్డి, పులిచెర్ల ఎంపీపీ సురేంద్రరెడ్డి ఆరోపించారు. పొజిషన్ పత్రానికి రూ.30 వేలా..? లబ్ధిదారులు హౌసింగ్ పథకం కింద గృహ నిర్మాణానికి లబ్ధి పొందాలంటే రెవెన్యూ అధికారులు పొజిషన్ పత్రం ఇవ్వాలని నారాయణవనం జెడ్పీటీసీ సుమన్ తెలిపారు. అందుకు ప్రతిఫలంగా రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే మందలించినా తీరు మారడం లేదన్నారు. మండలంలో 10 వేల మంది రైతులు ఉన్నారని ఇప్పటి వరకు వేరుశనగ కాయలు ఇవ్వలేదన్నారు. టమోటా రైతులు గిట్టుబాబు ధరలు లేక నష్టపోతున్నరని పెద్దమండ్యం ఎంపీపీ పూర్ణచంద్రిక ఆవేదన వ్యక్తం చేశారు. జాక్పాట్ పేరుతో దళారులు దోచుకుంటున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లు చేసిన తీర్మానాలు అమలు చేయడం లేదని వెదురుకుప్పం జెడ్పీటీసీ సుకుమార్ ఆరోపించారు. నాడు–నేడు పథకం ద్వారా పలు పాఠశాలల అభివృద్ధి సగంలో అగిపోయిందని వాటిని పూర్తి చేయాలని మదనపల్లె జెడ్పీటీసీ ఉదయ్ కోరారు. చౌడేపల్లె ఆస్పత్రుల నందు అంబులెన్స్లు పనిచేయకపోవడం ప్రైవేటు అంబులెన్స్ ద్వారా వైద్యం కోసం పలమనేరుకు పంపుతున్నామని జెడ్పీటీసీ దామోదారరాజు సమస్యను వివరించారు. వ్యవసాయ సర్వీసుల కోసం డబ్బులు కట్టి ఏడాదిన్నర అవుతున్నా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని జెడ్పీటీసీ శివన్న ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ విత్తనాలివ్వాలియూరియా కొరతపై చర్యలేవీ జిల్లాలో యూరియా కొరతపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై కలెక్టర్ ప్రశ్నించారు. రానున్న మూడు నెలల్లో యూరియాను ఎలా ఇస్తారు..?బ్లాక్ మార్కెట్ విక్రయాలు ఎలా అరికడతారు..?వాటిపై తీసుకున్న చర్యలమేమిటన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడా లన్నారు. ప్రజాప్రతినిధులు సమావేశంలో తెలియజేసిన సమస్యలకు అధికారులు పరిష్కార మార్గం చూపాలన్నారు. గతంలో హౌసింగ్ ద్వారా గృహ నిర్మాణాలకు ఎంపికైన లబ్ధిదారులను రద్దు చేయడం లేదని సృష్టం చేశారు. రైతులకు 3 రోజుల్లో వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని వాటిపై అధికారుల అలసత్వం ఎందుకని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూ రియా కొరత పంపిణీ జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీల పరంగా పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇలాంటివి చూడలేదన్నారు. గోకులం షెడ్లు అర్హులైన రైతులకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. వీటిపై పలు ఫిర్యాదులు వస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పలు పాఠశాలల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తే పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసుల పై చర్యలేమిటని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రశ్నించారు. వ్యాధి రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తల పై ఆరా తీశారు. వీటికి సంబంధించి మందులు ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఎందుకు లేవన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నందు ఇటీవల కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు ఆస్పత్రిపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.300 కోట్లు పైగా ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉందన్నారు. మామిడి రైతులకు రాయితీ ఇంకా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. -
అక్రమ కేసులతో అడ్డుకోలేరు
– కావడితో మొక్కులు తీర్చుకున్న కృపాలక్ష్మి కార్వేటినగరం : కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నట్లు గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి అన్నారు. శనివారం కార్వేటినగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై గొంతునొక్కి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అవినీతి, అక్రమాలను తమ పార్టీ నేతలకు అంటగట్టి ఏదో రకంగా జైలు పాలు చేయాలన్న కుట్రలు చేస్తున్నట్లు విమర్శించారు. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అబాసుపాలు చేయాలన్న కక్షతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నిటికీ ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ కేసులో త్వరగా బెయిలు రావాలని సుబ్రమణ్య స్వామికి అప్పట్లోనే మొక్కుకున్నారు. ఇటీవల ఆయనకు బెయిల్ రావడంతో శనివారం పుత్తూరులోని కృపాలక్ష్మి నివాసంలో పుష్ప కావడిని ప్రత్యేకంగా అలంకరించి కార్వేటినగరం లోని శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆమె వెంట ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి(వెదురుకుప్పం), మణి (శ్రీరంగరాజపురం), రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రాధికారెడ్డి, స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ, పట్నం ప్రభాకర్రెడ్డి, పురంధర్, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, జనార్దన్, వెంకటరత్నం,మునిక్రిష్ణ, నందగోపాల్, ధనశేఖర్యాదవ్, పట్టాభిరెడ్డి,తులసి, మోహనకుమారి, శ్రీనివాసులురెడ్డి, మున్నా, రత్నంరెడ్డి, దాము, అంబిక, రుక్మిణి , నాగేంద్ర, సాయికుమార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, జనార్ధన్, కాళప్ప, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజి, వైద్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, మాజీ సర్పంచ్లు రమేష్రెడ్డి, పెద్దిరెడ్డి, గోవిందన్, బొజ్జారెడ్డి, మాజీ యువత మండల అధ్యక్షుడు నరేష్ రెడ్డి, ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు
చిత్తూరు అర్బన్ : ‘‘ పూర్వపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇది గతనెలాఖరు నాటి సంఖ్య. పెండింగ్ కేసుల పరి ష్కారంపై సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు వరకు పర్యవేక్షిస్తోంది. కేసుల పరిష్కారంలో న్యాయమూ ర్తులు చొరవ చూపించాలి. ప్రతి కోర్టుకు నిర్దేశించిన కేసుల పరిష్కార లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందే..’’ అంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు కేసుల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులతో పోలిస్తే.. కొత్త కేసుల నమోదు సంఖ్య ఆశ్యర్యాన్ని కలిగిస్తోందన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయవ్యవస్థ పనిచేస్తోందన్నారు. వయో వృద్ధులకు సంబంధించిన కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా జడ్జిలు చొరవ చూపాలన్నారు.సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు గురునాథం, రామ్గోపాల్, అర్చన, శ్రీదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బలహీనతను బలంగా మార్చుకోవాలి
–ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చిత్తూరు రూరల్(కాణిపాకం) : మనిషి తన బలహీనతను... బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శనివారం చిత్తూరు శ్రీనారాయణి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాల కార్యక్రమం కొనసాగింది. ఏ ధర్మానికై నా క్రమశిక్షణ ప్రధానమైందన్నారు. అప్పట్లో హైందవ ధర్మం చాలా గట్టిగా నిలబడిందన్నారు. ఈ ధర్మాన్ని పురాణాలు, సంస్కృతి, ఇతిహాసాలతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా ఎంతో అభిమానిస్తున్నాయన్నారు. బలహీనతను బలంగా మార్చుకొని మనిషి సమాజంలో శక్తికి ఎదగాలన్నారు. ఇందుకు నిష్టతో శివనామస్మరణ చేయాలన్నారు. కోపం వస్తే ప్రజల మీద చూపించకూడదన్నారు. అలా చేస్తే..కేసులు, కోర్టులు తప్పవన్నారు. పూజ గదిలో కూర్చుని భగవంతుడి వద్ద కోపతాపాలను చూపాలన్నారు. కష్టం వచ్చిందని కుంగిపోకుండా స్వామి వద్ద భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టాలన్నారు. దేవుడి కోసం సర్వస్వం వదిలేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కల్యాణ్ పాల్గొన్నారు. పాల్గొన్న ప్రజలుప్రవచనాలు చేస్తున్న గరికిపాటి నరసింహారావు -
హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
– ఘనంగా హోంగార్డు ఆవిర్భావ దినం చిత్తూరు అర్బన్ : హోంగార్డుల పనితీరు తీరును.. మరెవ్వరితోనూ పోల్చడం సాధ్యంకాదని ఎస్పీ తుషార్ డూడీ స్పష్టం చేశారు. 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు పరేడ్ గ్రౌండ్స్లో శనివారం నిర్వహించారు. పోలీసులకు ఏ మాత్రం తీసిపోకుండా నిర్వహించిన కవాతును ఎస్పీ అభినందించారు. దాదాపు 62 ఏళ్లకు పైగా హోంగార్డులు పోలీసులతో కలిసి సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం ఇటీవల హోంగార్డులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. అలాగే హోంగార్డులు చిత్తూరు నగర వీధుల్లో ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న హోంగార్డు పిల్లల్లో ప్రతిభ ఉన్నవారికి ఉపకార వేతనాలను అందజేశారు. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ చూపించిన 13 మందికి ఉత్క్రిష్ట, అతి ఉత్క్రిష్ట పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్.రాజశేఖర్ రాజు, డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, మహబూబ్ భాష, సీఐలు నిత్యబాబు, శ్రీధర్ నాయుడు, మనోహర్, ఉమామహేశ్వరరావు, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ హోంగార్డు కుమారుడికి ఉపకార వేతనం అందజేస్తున్న ఎస్పీ -
జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
– మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ వెదురుకుప్పం: ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షంపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. బాబు సర్కార్ అస్తవ్యస్త పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పుత్తూరులోని శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీసూపర్సిక్స్ మోసాల్లో భాగంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని గొంతు నొక్కాలని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రాష్ట్రంలో పేదలు, రైతులు, మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను జగన్ కూలంకుశంగా వివరిస్తూ మీడియా ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాజకీయ స్వలాభం కోసమే తిరుమల లడ్డూపై లేనిపోని వివాదాలు సృష్టించి రాద్దాంతం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. అలాంటి వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. పేదల సంక్షేమాన్ని తన బాధ్యతగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అమలు చేశారు. వారి ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వీటిని ప్రైవేటు పరం చేసి చంద్రబాబు ప్రభుత్వం కోటీశ్వరులకు కొమ్ముకాస్తోందిశ్రీ అని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినట్లు వివరించారు.ఇప్పటికైనా ప్రైవేటీకరణ విదానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. -
ప్రగల్బాల పీటీఎం
చిత్తూరు కలెక్టరేట్ : పేరుకే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం), కానీ జిల్లా అంతటా మొక్కుబడిగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న పాఠశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో డుమ్మా కొట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2408 పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించాల్సి ఉంది. అయితే 2,202 పాఠశాలల్లో సమావేశం నిర్వహించగా 206 పాఠశాలల్లో ఎగ్గొట్టారు. ఈ సమావేశాల నిర్వహణకు హంగు, ఆర్భాటాలు చేశారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల వద్ద హంగామా చేశారు. సమావేశాల్లో సమస్యలపై మాట్లాడవద్దని విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ముందుగానే చెప్పించినట్లు తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా పీటీఎం కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికే పనికొస్తుందని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. తూతూమంత్రంగా హాజరై.. జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా ఒక్కొక్క పాఠశాలకు హాజరై ఆ తర్వాత ముఖం చాటేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం జెడ్పీ హైస్కూల్లో హాజరై ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి వి.కోట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ కుప్పం కేజీబీవీ పాఠశాలకే పరిమితమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలాంటి కేడర్ లేకున్నా చల్లా రామచంద్రారెడ్డి జెడ్పీ రొంపిచెర్ల పాఠశాలలో హంగామా చేశారు. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏ ఒక్క పాఠశాలలో పాల్గొనకుండా డుమ్మా కొట్టారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు రూరల్ లోని తుమ్మింద పాఠశాల సమావేశానికి మాత్రమే పరిమితమయ్యారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ కాణిపాకం జెడ్పీ హైస్కూల్ లో పాల్గొని ఆ తర్వాత డుమ్మా కొట్టారు. మిగిలిన చోట్ల కార్పొరేటర్లు, టీడీపీ నామినేటెడ్ సభ్యులతో మమ అనిపించారు. టీడీపీ సంబరాల్లా? జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పీటీఎం మీటింగ్లు టీడీపీ సంబరాలుగా మార్చేశారు. ఈ సమావేశాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కార్యా చరణ, ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం, విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డుల పురోగతి తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు సమావేశాల్లో పాల్గొని ఊకదంపుడు ప్రసంగాలతో ముగించారు. ఈ సమావేశాల్లో తల్లిదండ్రులు కేవలం 40 శాతం మాత్రమే పాల్గొనగా తమ గొప్పల కోసం అధికారులు తప్పుడు నివేదికలను సిద్ధం చేశారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా ఏర్పాట్లు చేశా రు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా హాజ రు కావాలంటూ ముందస్తు హుకుం జారీ చేశారు. -
గజరాజులకు మృత్యుగండం
పలమనేరు : కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోని ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవిలోంచి మేత కోసం అడవిని దాటి వచ్చే ఏనుగులు పలు రకాల ప్రమాదాలు, పెనుగులాటలు, ముఖ్యంగా కరెంట్ షాక్లతో మృతి చెందుతున్నాయి. కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోని ఏనుగులకు నిత్యం ప్రాణగండం తప్పడం లేదు. ఐదు రోజుల కిందట కౌండిన్య నుంచి పరదరామి బీట్లోకి వెళ్లిన ఒంటరి ఏనుగు గాయపడి చికిత్స నిమిత్తం తిరుపతి జూపార్క్కు తరలించగా బుధవారం మృతి చెందింది. తాజాగా కౌండిన్యకు ఆనుకుని ఉన్న తమిళనాడు మోర్థనా అడవిలో మరో ఒంటరి ఏనుగు మృతి చెందిన కళేబరాన్ని అక్కడి ఫారెస్ట్ అధికారులు శుక్రవారం గుర్తించారు. దీంతో ఇప్పటికి 22 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహారం కోసం అడవిని దాటి... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవసరమైన ఆహారం తక్కువ. దీంతో ఏనుగులు ఇష్టౖమైన ఆహారం కోసం అడవిని దాటుతున్నాయి. దీనికితోడు తమిళనాడులోని మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళ్తే తమిళనాడు అటవీశాఖ కౌండిన్య వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండడడం లేదు. ఇటీవల కాలంలో కౌండిన్యలోని ఏనుగులు సోమల మీదుగా చంద్రగిరి వైపునకు బంగారుపాళెం, గుడిపాల వైపునకు వెళ్లిన విషయం తెలిసిందే. శాశ్వత పరిష్కారం చేపడితేనే.. అడవిని దాటి ఏనుగులు రాకుండా అటవీశాఖ శాశ్వత పరిష్కారాలను చూపడంలో ఆ శాఖ విఫలమవుతోంది. తాజాగా కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోని ఏనుగులను కట్టడి చేసే కార్యక్రమం సైతం విజయవంతం కాలేదు. దీంతో ఏనుగులు అడవిని దాటి బయటకొస్తున్నాయి. ఏనుగులను కాపాడుకొనేందుకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చనిపోయిన ఏనుగు పలమనేరులో హల్చల్ తిరుపతి జూలో రెండు రోజుల క్రితం మృతి చెందిన ఒంటరి ఏనుగు ఇటీవల పలమనేరులో హల్చల్చేసి ఎఫ్ఎస్వో సుకుమార్పై దాడి చేసింది ఇదే. మదపు టేనుగులు చేసిన దాడిలో ఇది తీవ్రంగా గాయపడి చెరువులో పడిపోయింది. కుంకీ ఏనుగుల ద్వారా దాన్ని బయటకు లాగే ప్రయత్నంలో మరింత గాయపడి మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా మోర్థనా ఫారెస్ట్లో ఓ ఒంటరి ఏనుగు మృతి చెందిన కళేబరాన్ని అక్కడి ఫారెస్ట్ అధికారులు శుక్రవారం గుర్తించారు. ఇది కూడా ఇక్కడినుంచి ఆ ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
కార్వేటినగరం : ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశిక్షణా సంస్థ డైట్ ఆవరణలో ఉన్న మోడల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ముఖ్య అతిథిగా డీఈఓ వరలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన కొనసాగుతోందన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు పోటీ పరీక్షల్లో మెరుగ్గా ఉత్తీర్ణత సాధిస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దూరవిద్య లైబ్రరీ సైన్స్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో దూరవిద్య ద్వారా బీఎల్ఎస్సీ డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
8న బోయకొండలో హుండీ కానుకల లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 8వ తేదీ సోమవారం హుండీ కానుకలు లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు. రాహుకాల పూజలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించా రు. రాహుకాల సమ యం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేకాలు చేశా రు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయ దారులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, భక్తుల కు ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీలో కార్యదర్శుల నియామకం చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమిస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం వివరాలను ప్రకటించింది. జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సోమేశ్వరప్రభునాయుడు, కుప్పం నియోజకవర్గానికి చెందిన చక్రపాణిరెడ్డిని నియమించారు. ఎస్టీయూ కౌన్సిల్ సమావేశం జయప్రదం చేయండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 7వ తేదీ ఆదివారం నిర్వహించే ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుందరరాజపురంలోని విజయం విద్యాసంస్థల్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలకు పైగా అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం దారుణమని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్యాదవ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న టీచర్ల సమస్యలు, 12వ పీఆర్సీ నియామకం వెంటనే పూర్తి చేయాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 8న ధర్మకర్త మండలి సమావేశం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినా యకస్వామి దేవస్థాన ధర్మకర్త మండలి సమావేశం ఈనెల 8వ తేదీ సోమవారం జరగనున్న ట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఈఓ కార్యా లయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సభ్యులు హాజరు కావాలని పేర్కొన్నారు. -
స్క్రబ్ టైఫస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్యశాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. స్క్రబ్ టైఫస్ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సమీప ఆస్పత్రిలో వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు. -
ఎక్కువగా మదపుటేనుగులే..
పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతో పాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం , కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గుట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. వీటిల్లో 21 ఏనుగులు వివిధ కారణాలతో మృతి చెందాయి. గత పదేళ్లలో కరెంట్ షాక్లతో 15 ఏనుగులు మృతి చెందాయి. మిగిలిన వాటిల్లో మూడు మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. మరో రెండు మదపు టేనుగుల దాడులతో పాడుబడిన బావుల్లో పడడంతో చనిపోయాయి. ముఖ్యంగా ఏనుగులకు కరెంట్ శత్రువులా మారింది. మేతకోసం అడవిని దాటి పంటలపైకొచ్చే ఏనుగులు ఎక్కువగా కరెంట్ షాక్లతో మృతి చెందుతున్నాయి.


