breaking news
Chittoor District Latest News
-
సీబీఐ విచారణకు సిద్ధమా?
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వం డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిందని, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పుత్తూరులోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకలు, అవినీతిని ఆధారాలతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని తెలిపారు. వాటిని ఎల్లోమీడియా వక్రీకరించి రాయడం సబబుకాదని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో తమ బంధువులైన తొక్కుడు బిళ్లలు, పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన జాబితాలోని వారికి ఉద్యోగాలు కల్పించడమే నారాలోకేష్ నిజాయితీనా అని విమర్శించారు. మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ పత్రికా విలువలను కాలరాయడం సరికాదని పేర్కొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను అసెంబ్లీ సమావేశాల్లో ఎత్తి చూపడానికి ఎమ్మెల్యేలు ముందుకు రాకపోయినా ఎమ్మెల్సీలు నిలదీయడంపై నారాయణ స్వామి అభినందించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 78 నోటిఫికేషన్లు విడుదల చేశారని, ఏపీపీఎస్సీ ద్వారా 6,276 ఉద్యోగాలు, సచివాలయాల్లో 2.30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తమకు అన్యాయం జరిగిందని ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అసెంబ్లీలో కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల సమస్యల గురించి మాట్లాడడం లేదని, జగనన్నను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మీడియా మిత్రులు నిజాలను ప్రజలకు తెలియజేస్తే విలువలు ఉంటాయని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు -
వచ్చే నెలలో గొర్రెల పెంపకందారుల సంఘాల ఎన్నికలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉమ్మడి చిత్తూ రు జిల్లా పరిధిలో పదవీకాలం పూర్తయిన 119 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ సుమిత్కుమార్ అనుమతినిచ్చినట్లు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిణి డి.ఉమామహేశ్వరి, జిల్లా సాంద్ర గొర్రెల అభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్.రజని తెలిపారు. జిల్లాలో మొత్తం 257 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయి. వాటి లో 40 మండలాల పరిధిలోని 119 సంఘాల పాలక వర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. మండల పశుసంవర్థకశాఖ అధికారు లే ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారని, నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత గొర్రెల పెంపకందారులందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. పీఎం సూర్యఘర్పై ప్రత్యేక దృష్టి చిత్తూరు కార్పొరేషన్: పీఎం సూర్యఘర్ ద్వారా లబ్ధిదారుల నివాసాల్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల ని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. ఆయన గురువారం ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనరల్ కేటగిరి లబ్ధిదారులకు వేగంగా సోలార్ కనెక్షన్స్ ఇవ్వాలన్నా రు. అలాగే ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు సోలార్ కనెక్షన్ ఇవ్వడానికి మరింత చొరవ చూపాలన్నా రు. సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగం పెంచాలన్నారు. వాణిజ్య సర్వీసులకు స్మార్ట్ మీటర్లు వందశాతం బిగించాలని, పెండింగ్ వర్క్ ఆర్డర్లను నెలఖరులోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అలాగే ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేసి మూడు నెలల్లో పూర్తి చేయాల ని ఆదేశించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు ప్రతి నెలా వందశాతం చేయాలన్నారు. వ్యవసాయ సర్వీసులను సకాలంలో మంజూరు చేయాల న్నారు. ట్రాన్స్ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేయాలని సూచించారు. విద్యుత్ బకాయిలు చెల్లించని సర్వీసులను తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు. పకడ్బందీగా ఆధార్ ప్రక్రియ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 238 ఆధార్ కిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. గత 30 రోజుల్లో 30,103 లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. 0–5 ఏళ్ల పిల్లల ఆధార్ నమోదు శాతాన్ని పెంచేందుకు అంగన్వాడీ, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. 5–15 ఏళ్లలోపు పిల్లలు, 15 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ నవీకరించుకోవాల ని తెలిపారు. ప్రతినెలా పిల్లల నమోదు, బయోమెట్రిక్ అప్డేట్లకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ నంబర్ అనుసంధానం, చిరునామా సవరణ వంటి సేవలను సమీపంలోని అధికారిక ఆధార్ కేంద్రాల్లో పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ షాను, డీఎల్డీఓ రవికుమార్, డీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించాలి తిరుపతి ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూళ్లల్లో నాణ్యమైన విద్యనందించాలని రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్.నరసింహారావు తెలిపారు. ఆయన గురువారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, ఓపెన్ స్కూల్ ఏఐ కో–ఆర్డినేటర్లు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో నాణ్యమైన బోధన అందించి, స్వయంగా అర్థం చేసుకుని పరీక్షలు రాసేలా అభ్యర్థుల్లో సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. డీఈఓ కేవీఎన్.కుమార్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ ప్రవేశాలకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలపారు. -
పోషకాలేవీ?
అంగన్వాడీల్లో చిత్తూరు అర్బన్: జిల్లాలోని 2420 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 19,860 మంది గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని నుంచి బియ్యం, పప్పు, వంటనూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, వేరుశనగ చిక్కీలు, ఎండు ఖర్జూరాలు అందజేయాలి. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న 56,131 మంది పిల్లలకు బాలామృతంతో పాటు కోడిగుడ్లు 25, పాలు 2.5 లీటర్లు, 3–5 ఏళ్ల వయస్సున్న 37,454 మంది పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం, రోజూ ఒక కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ లెక్కలు ఏమాత్రం సరిపోలడంలేదు. కొన్నిచోట్ల గర్భిణులకు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందడంలేదు. మరికొన్ని చోట్ల కోడిగుడ్ల బరువులో తేడా ఉండడం, పౌష్టికాహారంలో పోషకాలు లేకపోవడం సర్వసాధారణమైపోయింది. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా నెలల తరబడి చెడిపోయిన పాలే బాలింతలకు అందుతున్నా పట్టించుకునే దిక్కులేదు. దీంతో బాలింతలు, పిల్లలు, గర్భిణులు అనారోగ్యం బారిన పడుతున్న ట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేయని అధికారులు చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో జవాబుదారీతనం కొరవడింది. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఇస్తున్న ఆహార పదార్థాల్లో పోషకాల విలువలు కనిపించడం లేదు. కాలం చెల్లిన పదార్థాలు అందజేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చిత్తూరులో ఇటీవల గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసిన దాదాపు 30 లీటర్ల పాలు చెడిపోవడమే ఇందుకు నిదర్శనం. బాలింతలు, గర్భిణులు, పిల్లలకు అందుతున్న ఆహార పదార్థాల్లో నాణ్యత, పోషకాల పరిస్థితిని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలి. ఇది తూతూమంత్రంగా జరగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతను ఏ ఒక్కరూ తనిఖీలు చేయడంలేదనే విమర్శలున్నాయి. కొన్ని కేంద్రాల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నా ఎక్కువ మందిని చూపించి రేషన్ దిగమింగడం సర్వసాధారణమైపోయింది. -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం
కార్వేటినగరం: విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా నాణ్యమైన బోధనలు చేయాలని జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం కార్వేటినగరం మండలంలోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. పొన్నగల్లులో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కత్తెరపల్లి హెచ్డబ్ల్యూను సందర్శించి మనబడి– మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కత్తెరపల్లి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రగతిపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పీఎంశ్రీ నిధులతో అభివృద్ధి చేసిన కిచెన్గార్డెన్ను చక్కగా నిర్వహిస్తున్న వాచ్మెన్ను అభినందించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, ఆర్వో సిస్టం తదితరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠఽశాలకు మూడు అదనపు గదులు, బయాలజీ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని హెచ్ఎం చంగల్రాజు ప్రతిపాదనలు సమర్పించారు. జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత శాతం లక్ష్యంగా బోధనలు కొనసాగాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు విజయకుమార్, మనో జ్కుమార్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఉమాపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గడువులోగా పూర్తి చేయాలి ‘సర్’
చిత్తూరు కలెక్టరేట్ : సర్ ప్రక్రియను గడువులోపు పకడ్బందీగా పూర్తి చేయాలని రోల్ అబ్జర్వర్ మల్లికార్జున ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సర్ ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా, గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్న సుమారు 20 వేల నోటీసులను ఆగస్టు 22 నాటికి పూర్తి స్థాయిలో డెలివరీ చేయాలని ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంతో పాటు పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరులో ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఏఈఆర్ఓలు నోటీసులకు సంబంధించిన వివరాలను, హియరింగ్స్ను తప్పనిసరిగా పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఓటర్లు అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు నోటీసు ఇవ్వడం, వీడియో కాల్, వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు సాధ్యమైనంత వరకు ఒకే రోజు హియరింగ్ నిర్వహించాలని తెలిపారు. అలాగే ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఉంటే, ఫారం–8 ద్వారా దరఖాస్తు చేయించి ఒకే చోటకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్తో పాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫారం 6లు 8 వేలు, ఫారం 8 లు 6 వేలు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరుకూ ఇబ్బంది కలగకుండా, పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, డీఆర్వో మోహన్ కుమార్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
సైబర్ సెల్.. సోషల్ మీడియా సెల్ తనిఖీ
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని సైబర్ సెల్, సోషల్ మీడియా విభాగాల పనితీరును ఎస్పీ తుషార్ డూడీ గురువారం తనిఖీ చేశారు. చిత్తూరు నగరంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఆన్లైన్ మోసాలు, తప్పుడు మీడియా అకౌంట్లు, ఓటీపీ మోసా లపై ప్రజలు పోగొట్టుకున్న నగదును ఫ్రీజ్ చేయిండంపై అప్పటికప్పుడు దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఇక సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించాల్సిన బాధ్యత కూడా సిబ్బందిపై ఉందన్నారు. ఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, మురళి సిబ్బంది ఉన్నారు. -
ఎల్నినో ప్రచండం!
జిల్లాలో తగ్గని భానుడి భగభగలు చిత్తూరు నగరంలోని జీకేపురం వద్ద ఎండిపోయిన పశుగ్రాసంచిత్తూరు మండలం బంగారెడ్డిపల్లి వద్ద ఎండిపోయిన వేరుశనగ పంట కాణిపాకం: వర్షాభావ పరిస్థితులు జిల్లాలోని వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ఈ పాటికి 21 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు కావలసి ఉండగా, వర్షాలు లేక 93 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వాటిలో సుమారు 40 నుంచి 50 ఎకరాల్లోని పంట నీరులేక ఎండిపోయింది. మిగిలిన స్వల్ప విస్తీర్ణంలోని పంట బోరుబావుల నీటితో అరకొరగా ఊపిరి పీల్చుకుంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు పండ్ల రారాజుగా పేరుగాంచిన మామిడి తోటల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో మొత్తం 59 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా, నీటి ఎద్దడి కారణంగా ఇప్పటికే సుమారు 10 వేల హెక్టార్లలో చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయి. రెండు నెలల కాలంలో తోటల్లో చెట్లు ఎండిపోయే తీవ్రత పెరిగింది. మామిడి పంట దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇక్కడి రైతులతో పాటు బెంగళూరులో స్థిరపడిన స్థానిక రైతులు కూడా కొబ్బరి సాగు వైపు దృష్టి సారించారు. ఎల్నినో ధాటికి కొబ్బరి తోటలు కూడా తప్పించుకోలేకపోతున్నాయి. జిల్లాలో ఉన్న 4,361 హెక్టార్ల కొబ్బరి తోటల్లో వర్షాధారమైన 1,500 హెక్టార్ల తోటలు తీవ్ర నీటి ఎద్దడితో వాలిపోతున్నాయి. మట్టలన్నీ వాడిపోయి, పొలం గట్లపై ఉన్న చెట్లు నేలకొరిగే దయనీయ స్థితికి చేరాయి. తక్షణమే వర్షం కురవకపోతే కొబ్బరి రైతులకు తీవ్ర గడ్డుకాలం తప్పదని రైతులు కుమిలిపోతున్నారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోయి, చెరువులు అడుగంటినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా అధికారులను పంపలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎండిపోయిన పంటలకు, దెబ్బతిన్న తోటలకు ఎకరాకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎండిపోయిన 2 వేల చెరువులుచిత్తూరు మండలం బండపల్లి సమీపంలో ఎండుముఖం పడుతున్న కొబ్బరి చెట్లు చిత్తూరు మండలం కృష్ణాపురం వద్ద ఎండిపోయిన మామిడి చెట్లు ఎల్నినో రాకాసి ప్రభావంతో ఆకాశంలో మబ్బులు చాటేశాయి. వరుణుడు కనికరించనంటున్నాడు. ఎండలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు భూగర్భ జలమట్టం ఏకంగా 16 మీటర్ల లోతుకు పడిపోవడంతో సాగునీటికే కాకుండా తాగునీటికీ తిప్పలు తప్పడం లేదు. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకృతి ఇంతలా పగబట్టి రైతాంగాన్ని, ప్రజలను కష్టాల కడలిలోకి నెడుతున్నా అధికార యంత్రాంగంలో చలనం కనిపించడం లేదు. ప్రభుత్వం సాయం అందించే దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయకపోవడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. -
పుత్తూరులో మళ్లీ దొంగలు పడ్డారు
పుత్తూరు: పట్టణంలోని బెస్తవీధి, బండ్లదొడ్డి వీధిలో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. మొత్తం 5 ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బండ్లవీధిలోని జి.శేషాద్రి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి, పక్కనే ఉన్న మరో ఇంటిలో నిద్రించాడు. తాళం వేసిన ఇంటిలోకి చొరబడిన దుండగులు బీరువాలోని 8 గ్రాముల బంగారు నగలు, 3 పట్టుచీరలు చోరీ చేశారు. సమీపంలోని మంగమ్మ ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. మంగమ్మ ఊర్లో లేకపోవడం వల్ల ఆ ఇంట్లో ఏవస్తువులు చోరీకి గురయ్యాయో తెలియడం లేదు. బెస్తవీధిలోని మురళియమ్మ, ట్యూషన్ రఘు, దాము ఇళ్ల తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఈ మూడిళ్లలోనూ విలువైన వస్తువులు పోలేదు. శేషాద్రి తన ఇంట్లో జరిగిన దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగేంద్రబాబు సిబ్బందితో కలిసి అన్ని ఇళ్లలోనూ పరిశీలించారు. బెంబేలెత్తుతున్న జనం పుత్తూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న లక్ష్మీనగర్ కాలనీలో ఆర్.నిర్మల అనే మహిళ ఇంట్లో గత జూలై 17వ తేదీన దొంగలు పడి 124 గ్రాముల బంగారు నగలు, 1100 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.18 లక్షల నగదు కలిపి సుమారు రూ.20 లక్షల సోత్తును చోరీ చేశారు. అదే నెల 29వ తేదీన ఎస్బీఐ కాలనీలోని సుబ్రమణ్యం అనే టీచర్ ఇంటి తలుపులు తట్టి హల్చల్ చేశారు. గురువారం రెండు వీధుల్లోని ఐదు ఇళ్లలో దొంగలు పడడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని కోరుతున్నారు. బీరువాలోని నగలు దోచుకెళ్లారని చూపుతున్న శేషాద్రి -
కల్వర్టులో పడ్డ వ్యక్తి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద ఉన్న వ్యవసాయశాఖ కార్యాలయం (మామి డికాలయ మండీ) పక్కనున్న కల్వర్టులో గురువారం ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి ప్రమాదవసాత్తు పడిపోవడంతో స్థానికులు, పోలీసుల సాయంతో అతడిని బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక్కడున్న కల్వర్టుపై ఎలాంటి గేటు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ – ఒకరికి తీవ్రగాయాలు శ్రీరంగరాజపురం : మండలంలోని పొదలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి ఇకరికి తీవ్రగాయాలయ్యా యి. పోలీసుల కథనం మేరకు.. పొదలపల్లికి చెందిన శ్రీరాములు, జయరామయ్య కుటుంబ సభ్యుల మధ్య స్థలం విషయమై వివాదం నడుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. శ్రీరాములు తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్ఐ గోవిందరాజులు తెలిపారు. లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు బంగారుపాళెం:మండలంలోని నలగాంపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ప్రైవేట్ బస్సు లారీని ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వేలూరు నుంచి మదనపల్లె వెళుతున్న ప్రైవేట్ బస్సు నలగాంపల్లె వద్దకు రాగానే టైరు పగిలిపోయింది. దీంతో డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రకు చెందిన నీలేష్ (38) తీవ్రంగా గాయపడ్డాడు. పలువురికి స్వల్పగాయాలు తగిలాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నీలేష్ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వెబ్ ఆప్షన్లకు సర్వర్ సమస్య తిరుపతి సిటీ: జిల్లాలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో గురువారం నుంచి వెబ్ఆప్షన్లు నమోదు చేసు కోవాలని అధికారులు సూచించారు. ఓఏఎండీసీ వెబ్సైట్ సర్వర్ సమస్యతో ఓపెన్ కాకపోడంతో విద్యార్థులు ఉదయం నుంచి ఇంటర్ననెట్ సెంటర్లు, సచివాలయాల చుట్టూ చక్కర్లు కొట్టారు. వెబ్సైట్ ఓపెన్ కావడం లేదంటూ విద్యార్థులు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సంప్రదించంగా.. త్వరలో సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని, మరో గంటలోపు వెబ్ఆప్షన్లు ఓపెన్ అవుతా యని అధికారులు బదులిచ్చినట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 23వ తేదీ వరకు వెబ్ఆప్షన్లకు గుడువునిచ్చిన అధికారులు వెబ్సైట్ సమస్యపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 24 నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి ఎడ్యుకేషన్ : అమరావతి చాంపియన్షిప్–2026 రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 10 రకాల క్రీడల్లో అండర్–22 విభాగంలో క్రీడా పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది 12 క్రీడల్లో అండర్–17, 23 విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అమరావతి చాంపియన్షిప్–2026 వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. -
క్షేత్రస్థాయిలో పంటల వివరాలు పరిశీలన తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మామిడి పంట సాగు చేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 మద్దతు ధర అర్హులైన రైతులందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత కలిగిన రైతుల జాబితాను సెప్టెంబర్ 5వ తేదీ లోపు సిద్ధం చేయాలని సూచించారు. ఫ్యాక్టరీలు, ర్యాంపులు, రైతు భరోసా కేంద్రాల్లో సేకరించిన వివరాలను భూమి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాలతో సరిపోల్చాలని ఆదేశించారు. ఒకే ట్రాక్టర్ నంబరుతో ఒకే రోజులో మామిడి కాయలను తోలిన రికార్డులు, కొన్ని ర్యాంపుల్లో భారీ మొత్తంలో నమోదైన వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి గ్రామస్థాయిలో పరిశీలించి అనర్హులెవరైనా దరఖాస్తు చేసు కుని ఉంటే పరిశీలన చేపట్టాలన్నారు. ఈ– క్రాప్ నమోదుపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పంట వాస్తవంగా ఉందా లేదా అనేది నిర్ధారించాలని చెప్పారు. నమోదు లేకున్నా భౌతికంగా పంట ఉంటే నిబంధన ల ప్రకారం అర్హత కల్పించాలని స్పష్టం చేశా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధి కారి మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికా రి సతీష్, హార్టికల్చర్ అధికారి కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
● ఇకపై ఉపాధిహామీ కార్యాలయంలోనే కూర్చుంటా ● కూలీలు, రైతుల నుంచి ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు ● ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎంపీడీవో ఆగ్రహం
ఉపాధిలో అవినీతిపై కఠిన చర్యలు గుడిపాల: ఉపాధి హామీలో అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రతిరోజూ ఉపాధి కూలీలు, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఉపేక్షించేది లేదని ఎంపీడీవో శిరీష ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీలో అవినీతి పుట్ట అన్న శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఎంత అవినీతి జరిగి ఉంటే ప్రతిరోజూ పత్రికల్లో కథనాలు వస్తాయని మండిపడ్డారు. ఇకపై మీ ఆటలు సాగవని, తాను ఉపాధహామీ కార్యాలయంలోనే కూర్చోవాల్సి వస్తుందన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పంచాయతీలోనూ ఉపాధి కూలీలతో స్వయంగా మాట్లాడి రోజుకు సగటున ఎంత కూలి వస్తుంది అన్న వివరాలు తెలుసుకుంటానన్నారు. కొబ్బరి, మామిడి మొక్కల బిల్లులు పెట్టేటప్పుడు రైతులకు తెలియజేయాలని, వారికి తెలియకుండా మస్టర్లు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు కూడా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని, కూలీలు, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఏయే పనులకు ఎంత డబ్బులు జమ అయ్యిందో తెలియజేయాలని సూచించారు. ఉపాధిహామీ పనుల పై ఆకస్మిక తనిఖీలు చేస్తామని, చీలాపల్లె పంచాయతీలో రైతులు నాటుకున్న కొబ్బరి, మామిడి మొక్కల బిల్లులను స్వాహా చేసిన విషయంపై పూర్తి నివేదికలు అందజేయాలని ఏపీవో పుష్పలత, టెక్నికల్ అసిస్టెంట్ మునిరత్నంను ఆదేశించారు. -
శరవేగంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేశారు. ఆలయ ప్రాంగణంలో రంగులు వేయడం, అవసరమైన మరమ్మతు పనులను చేయిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమన్వయంతో బ్రహ్మోత్సవాల నిర్వహణ తిరుమల: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర తెలిపారు. ఆయన గురువారం అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను నిల్వ ఉంచాలని చెప్పారు. గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం సి.హెచ్.వెంకయ్యచౌదరి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. సమావేశంలో టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్ పాల్గొన్నారు. -
ఎన్నికలకు సిద్ధంకండి
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలోని ఎంపీడీఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అలాగే పంచాయతీలు, మండలాల వారీగా పోలింగ్ కేంద్రాలు జాబితాను తయారు చేయాలన్నారు. ఇప్పటికే పోలింగ్ బాక్స్లు జిల్లాకు చేరాయని, పంచాయతీల వారీగా ఉన్న రిజర్వేషన్ వివరాలతో పాటు సంబంధింత స్టేజ్–1 ఆఫీసర్(గెజిటెడ్ ఆఫీసర్) సంబంధించి మ్యాపింగ్ చేయాలన్నారు. మండలాలు, పంచాయతీల వారీగా జనాభా, కులాలవారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఒకే ఫార్మాట్ను సిద్ధం చేయాలని సూచించారు. 4–5 పంచాయతీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని, వారిని మానిటర్ చేయడానికి రూట్ ఆఫీసర్, మానిటర్ ఆఫీసర్లు ఉంటారని పేర్కొన్నారు. వీరంతా టీమ్గా ఏర్పడి ఎన్నికలను నిర్వహించాలన్నారు. రోజువారీ పనులతో పాటు ఎన్నికల పనులు కూడా చేయాలన్నారు. సెప్టెంబర్ 25 వరకు జెడ్పీ పాలకవర్గం సమయం ఉండడంతో ఆ తర్వాత జిల్లాల విభజన జరుగుతుందన్నారు. తదుపరి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఏఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేడి
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సమరానికి సన్నాహాలు షురూ అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. ఏప్రిల్ 4తో గ్రామ పంచాయతీల పాలకవర్గం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబర్ 25తో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడంతో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారం పూర్తయ్యాక అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఆ జాబితా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పంచాయతీల్లో వార్డుల విభజన, జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలను పంచాయతీలతో మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఉమ్మడి జిల్లాను విభజించి కొత్త జిల్లా పరిషత్లను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాలకు కసరత్తు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలు, 877 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత జెడ్పీ సమావేశాలకు జెడ్పీటీసీలు మూడు జిల్లాల నుంచి వస్తున్నారు. జెడ్పీటీసీల పదవీ కాలం సెప్టెంబర్ 25తో ముగియనుంది. ఆలోపు జెడ్పీని మూడుగా విభజన చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పరిశీలన, ఆన్లైన్ డేటా అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి, ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 24లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేసి, 23న ప్రచురించనున్నారు. దీనిపై అభ్యంతరాలు, వినతులను ఈనెల 26 వరకు స్వీకరిస్తారు. అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత ఆగస్టు 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈనెల 18 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇది 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నెల 25న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇస్తారు. 26 నుంచి 28 వరకు అభ్యంతరాల స్వీకరణ, తదుపరి సెప్టెంబర్ 2 వరకు అభ్యంతరాల పరిశీలన, 6న తుది జాబితా రూపొందించి 7వ తేదీన ప్రచురిస్తారు. మొదలైన జిల్లాలో 27 మండలాలు, 622 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 5,906 వార్డులు ఉన్నాయి. వీటిలోని 10,26,821 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధిక ఓట్లు మహిళలవే. పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది కాగా 11,388 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితా మేరకు పురుష ఓటర్ల ఆధిపత్యం 4 మండలాల్లో మాత్రమే ఉంది. జీడీనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పురుషులు 18,368 మంది, మహిళలు 18,232 మంది, కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లెలో పురుషులు 17,824 మంది, మహిళలు 17,714 మంది, కుప్పంలో పురుషులు 29,355 మంది, మహిళలు 29,000 మంది, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో పురుషులు 21,990 మంది, మహిళలు 21,964 మంది ఉన్నారు. మిగిలిన 23 మండలాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో ట్రాన్స్జెండర్ల సంఖ్య 27గా గుర్తించగా అందులో కుప్పంలో 8 మంది ఉన్నారు. బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, పులిచెర్ల, పూతలపట్టు, ఎస్ఆర్పురం, తవణంపల్లె, వెదురుకుప్పం, యాదమరి, గుడుపల్లె, రామకుప్పం, కార్వేటినగరంలో 1–2 మంది వరకు ఉండగా మిగిలిన మండలాల్లో ఒకరు కూడా ట్రాన్స్జెండర్లు లేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. గత సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలకు అవకాశం ఇవ్వడంతో మహిళా పక్షపాతిగా ముద్రపడ్డారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అతివలకు 50 శాతం దాకా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారు. అభివృద్ధి పనుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు. గత ఐదేళ్లలో స్థానిక పాలనలో మహిళలకు గౌరవం దక్కింది. జిల్లాలో 11,388పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియపై దృష్టిసారించారు. ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడం, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం చిత్తూరు జిల్లాలోని 27 మండలాల పరిధిలో 622 పంచాయతీలున్నాయి. మరో 10 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఒక గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకూ ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక పోలింగ్ కేంద్రానికి కనీసం 650 మంది ఓటర్లను కేటాయించాలని నిబంధన విధించారు. ఓటర్ల సంఖ్య పరిమితి దాటితే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల కోసం వీలైనంత వరకు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి సాధారణంగా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలని.. కొండ, అటవీ ప్రాంతాలకు ఇందులో మినహాయింపు ఉంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, మతపరమైన ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు, ప్రైవేట్ భవనాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఉండదు. పక్కాగా నమోదు పంచాయతీ ఎన్నికల ప్రకియలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి భవనం పేరు, గదుల వివరాలు, ఓటర్ల సంఖ్య, భవనం చాయచిత్రాలు, ఇతర వివరాలను ఎస్ఈసీ–ఈఎంఎస్ పోర్టల్లో పక్కాగా నమోదు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించం, వీటిపై కార్యదర్శులకు తగిన ఆదేశాలు జారీచేశాం. – సుధాకర్రావు, డీపీఓ -
చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు
– మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం వెదురుకుప్పం: పేదలకు సంక్షేమ పథకాలు అమలుచేయకుండా, గ్రామాలను అభివృద్ధి చేయకుండా మోసా లు, అబద్ధాలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు చరిత్ర హీనులుగా నిలిచిపోతారని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తా రు. ఆయన బుధవారం బందార్లపల్లెలో విలేకరులతో మాట్లాడు తూ వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తుడా పరిధి నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాలను అన్నివిధాలా చేయాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తుడా పరిధిలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని చంద్రబాబునాయు డు హామీ ఇచ్చారని, ఇప్పుడు దాన్ని నెరవేర్చకపోగా వాటిని తుడా పరిఽ ది నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే భవిష్యత్తులో పేదలను భిక్షగాళ్లుగా చేస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలుచేసిన నవరత్నాల పథకాల స్థానంలో రెండింతలు ఇస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకా లు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పేద వాడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కరువయ్యా యని తెలిపారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150కి పైగా పాఠశాలలు మూతపడినట్లు చెప్పారు. పెనుమూరు మండలంలో కలవకుంట జలాశయం అభివృద్ధి అటకెక్కిందని, వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం అతీగతీ లేదన్నారు. తుడా నుంచి తొలగించి దెబ్బతీశారు కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తుడా పరిధి నుంచి తొలగించి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేశ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఏ ఒక్క పనీ చేయలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను సైతం దూరం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్పార్సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాధవరాావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్రెడ్డి, ఎంపీటీసీ మునిచంద్రారెడ్డి, సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షుడు రవికుమార్రెడ్డి, ఎస్సీ విభాగం మండల కార్యదర్శి మురళి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మునికృష్ణారెడ్డి, సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు దేవరాజులు రెడ్డి, మాజీ ఎంపీటీసీ రోశిరెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, బొజ్జారెడ్డి పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్ల శిక్షణ తనిఖీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో కానిస్టేబుళ్లకు ఇస్తున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం తనిఖీ చేశారు. ఆయుధ వినియోగ నైపుణ్యాలు, పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులు అవుతున్నారు, శిక్షణ ఎలా పొందుతున్నారని అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పోలీసు విధుల్లో ఆయుధాల వినియోగం కీలకమని, క్రమశిక్షణ, అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆయుధాలు చేతబట్టిన ప్రతి సందర్భంలోనూ అప్రమత్తత అవసరమన్నారు. ప్రజలతో మంచిగా వ్యవహరిస్తూ పోలీసుశాఖ పట్ల గౌరవాన్ని పెంచాలని సూచించారు. ఎస్పీ వెంట డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఎంటీవో వీరేష్ సిబ్బంది ఉన్నారు. కమాండ్ కంట్రోల్ పరిశీలన చిత్తూరులోని పోలీసు కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ వ్యవస్థను ఎస్పీ పరిశీలించారు. అత్యవసర వేళల్లో ఫోన్కాల్స్ అందుకుంటున్న పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు? ఎంత సమయంలో బాధితులను చేరుకుంటున్నారు? సీసీ కెమెరాల పర్యవేక్షణ, ట్రాఫిక్ సమస్య పర్యవేక్షణ, శక్తియాప్పై ఎలా స్పందిస్తున్నా? లాంటి విషయాలను ఆరా తీశారు. అనంతరం విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ మోబీన్తాజ్ సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు. -
కాణిపాకంలో ‘కక్కుర్తి’ పెత్తనం
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో కొందరు పాలక మండలి సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ తమ వారికి దర్శనాలు కల్పిస్తున్నారు. సాధారణంగా ఒక భక్తుడు స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని వేదపండితుల ఆశీర్వచనం, కండువా, ప్రసాదం, చిత్రపటం పొందాలంటే రూ.1,000 టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు పాలక మండలి సభ్యులు ఈ ఆదాయానికి గండి కొడుతున్నారు. తమ కుటుంబ సభ్యులే కాకుండా చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులను కూడా ఉచిత దర్శనాలకు తీసుకెళ్తున్నారు. రూ.1,000 టిక్కెట్కు ఇచ్చే కండువాలు, లడ్డూలు, ఆశీర్వచనాలను ఉచితంగా ఇప్పిస్తున్నారు. దీనిపై పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది కూడా మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులు పాలకమండలి సభ్యుల విచ్ఛలవిడితనానికి అధికా ర పార్టీ అండదండలు తోడుకావడంతో ఆలయ సిబ్బంది కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఎవరైనా నిబంధనలు గుర్తుచేస్తే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఉద్యోగాలు ఊడదీయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నార ని ఆలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. గత పాలకమండలి ఆదర్శం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పాలకమండలి సభ్యులు ఆలయాభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారు. క్షేత్రానికి సరికొత్త శోభను తీసుకురావడంతో పాటు భక్తుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేశారు. దాతలను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. రాజకీయాలకు అతీతంగా సామాన్య భక్తులకు దర్శన సేవలు అందించగా, ముఖ్యమైన వ్యక్తులు, దాతలకు పరిమిత స్థాయిలో ప్రత్యేక సేవలు కేటాయించేవారు. కండువాలు, ఉచిత ప్రసాదాల పంపిణీలోనూ ఏనాడూ జోక్యం చేసుకోలేదని, నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని ప్రస్తుత అధికార పార్టీ నేతలు, ఆలయ సిబ్బందే బహిరంగంగా వ్యాక్యానిస్తుండడం గమనార్హం. భక్తుల విఘ్నాలు తొలగించే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దివ్యక్షేత్రం కొందరు పాలకమండలి సభ్యుల స్వార్థానికి, కక్కుర్తికి నిలయంగా మారుతోంది. సామాన్య భక్తులకు నిబంధనల పేరుతో తిప్పలు పెడుతున్న పెద్దలు.. తమ అనుచరులు, బంధుమిత్రుల కోసం ప్రోటోకాల్ను తుంగలో తొక్కుతూ నిబంధలనకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆశీర్వచనాలు ఇప్పిస్తూ ఆలయ ఆదాయానికి భారీ గండికొడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఆర్వో ఆఫీసులో ఇష్టానుసారం ఆలయ పీఆర్వో కార్యాలయంలో కూడా కొందరు దర్శనాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీగా దర్శనాలకు తీసుకొస్తున్న వ్యక్తులు ఎవరు? ఏ హోదాలో, ఏ ప్రోటోకాల్ ప్రకారం వస్తున్నారనే కనీస సమాచారం కూడా లేకుండానే లోపలికి పంపుతున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా వీరి తీరును చూసీచూడనట్లు వ్యవహరించడంపై ఆశ్చర్యం కలుగుతోంది. ఈ అక్రమాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, కాణిపాకం క్షేత్రంలో విచ్ఛలవిడి దర్శనాలకు చెక్ పెట్టి, పారదర్శకత పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. -
ఉపాధి హామీలో అవినీతి పుట్ట
గుడిపాల మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రైతులు ఎంపీడీవోకు ఫిర్యాద చేశారు. నేడు జిల్లాకు ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకుల రాక చిత్తూరు కలెక్టరేట్: ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి మల్లికార్జున్ గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఆయన ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లో అందుబాటులో ఉంటారని వివరించారు. డైట్ ప్రిన్సిపాల్గా విజయేంద్రరావు కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) కళాశాల ప్రిన్సిపాల్గా విజయేంద్రరావును నియమించినట్లు సమా చారం. గతంలో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమ ణ చేశారు. ఈ క్రమంలో సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా సి.విజయేంద్రరావును కార్వేటినగరం డైట్ కళాశాల ప్రిన్సిపాల్గా నియమించినట్టు తెలిసింది. విజయేంద్రరావు గతంలో చిత్తూరు జిల్లా విద్యా శాఖ అధికారిగా పనిచేశారు. -
ఉపాధి హామీలో అవినీతి పుట్ట
గుడిపాల: మండలంలో ఉపాధి హామీ (వీబీజీరామ్జి) పథకంలో రోజురోజుకూ అవినీతి పెచ్చుమీరుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల పేరుతో పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు స్వాహా చేస్తున్నారు. అంతటితో ఆగక పనులు చేసిన కూలీల నుంచి వారానికి రూ.200 వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వారికి పనులు కల్పించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చీలాపల్లె పంచాయతీకి చెందిన కొంతమంది రైతులు బుధవారం ఎంపీడీవో శిరీషకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లను పిలిపించి మాట్లాడారు. ఉపాధిహామీ పనులపైనే ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఫిర్యాదులు చేసేంతవరకు మీరు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విచారణ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. డబ్బులిస్తేనే రైతులకు బిల్లులు ప్రభుత్వం ఉపాధి హామీ కింద మామిడి, కొబ్బరి మొక్కలు నాటుకున్న రైతులకు మూడేళ్ల పాటు ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు మొక్కలు నాటుకున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత బిల్లులు మంజూరుకాగానే నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. తమకు మామూళ్లు ఇస్తేనే బిల్లులు పెడతామని, లేకుంటే పెట్టేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్ తమను వేధిస్తున్నాడని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతలకు రెండుచోట్ల ఓట్లు ‘సర్’..!
చిత్తూరు అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో టీడీపీ నేతలకు ప్రత్యేక వెలుసుబాటు కల్పిస్తున్నారు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచురించిన ‘సర్’ ముసాయిదాలో వాస్తవంగా ఉన్న ఓటర్ల పేర్లు వేలల్లో తొలగించారు. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి పేర్లను మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలకు మాత్రం రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం టీడీపీ నేత ఎన్.జయప్రకాష్ నాయుడు చిత్తూరులో మద్యం బార్, హోటళ్లు నడుపుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇతని భార్య బంగారుపాళ్యంలో టీడీపీ నుంచి జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరి ఆస్తులు చిత్తూరు, బంగారుపాళ్యంలో ఉన్నాయి. ఆస్తుల్లాగే ఓట్లు కూడా రెండు చోట్లా ఉండాలనుకుని శాసించినట్టు ఉన్నారు. అందుకేనేమో వారికి చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. చిత్తూరు సాయినగర్ కాలనీలో జయప్రకాష్నాయుడు, అతని భార్య సుచిత్రతో పాటు ఇతని బంధుగణం మొత్తం ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇదే సమయంలో పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలంలో కూడా ఓటర్లుగా ఉన్నారు. మ్యాపింగ్ కలవడం లేదనే సాకుతో సామాన్యుల ఓట్లు తొలగిస్తున్న అధికారులు టీడీపీ నేతలకు మాత్రం ప్రత్యేక వెసులుబాటు కల్పించడంపై ఏం పద్ధతి ‘సర్’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూతలపట్టులో ఉన్న ఓట్లు చిత్తూరు జాబితాలో జయప్రకాష్ నాయుడు కుటుంబం ఓట్లు -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఐరాల: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. మండలంలోని అగరంపల్లె జెడ్పీ హైస్కూల్లో బుధవారం యువజన దినోత్సవం– నెలవారీ కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ రక్షణ హక్కు ఉందని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా స్పందించాలని సూచించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే వన్ స్టాప్ సెంటర్ ద్వారా వైద్య, న్యాయ, పోలీసు, కౌన్సెలింగ్ సాయం ఒకే చోట ఉచితంగా అందిస్తామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థి దశ అనేది భవిష్యత్కు బంగారు బాట వంటిదని, విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం సతీష్కుమార్, ఎస్ఐ నరసింహులు, వన్స్టాప్ సెంటర్ ఏఓ చందురాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భయంతోనే మనిషిపై ఏనుగుల దాడి
పలమనేరు: జిల్లాలోని కౌండిన్య అభయరాణ్యంలో ఉన్న ఏనుగులు తరచూ అడవిని దాటి పంటపొలాలు, జనావాసాల్లోకి వచ్చి దాడులకు దిగుతున్నాయి. ఇప్పటి దాకా 20 మందికి పైగా మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అటవీశాఖ అధికారులు గతంలో సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగ్గాలేకపోవడంతో ఏనుగులు ఫెన్సింగ్ను తొక్కి బయటకు వచ్చేస్తున్నాయి. ఎలిఫెంట్ ఫ్రూప్ ట్రెంచిలను కొట్టించినా ఫలితం లేదు. ఆపై కర్ణాటక మోడల్ అంటూ సిల్వర్వైర్లను వేలాడే ఫెన్సింగ్ను పెట్టినా ఉపయోగం లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆరు కుంకీ ఏనుగులను తీసుకువచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ ప్రాంతంలోని అటవీ సమీప గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. బహిరంగ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రంలో ఏనుగుల సమస్యపై అనుభవం ఉన్న సెంటింస్ట్ రుద్రాదిత్య ద్వారా అటవీ సమీప గ్రామమైన టి.వడ్డూరులో బుధవారం ఏనుగుల దాడులను తప్పించుకునే మార్గాలపై మానవ–ఏనుగు సంఘర్షణ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏనుగులకు తెలుపు, ఎరుపంటే ఆగ్రహం ఏనుగులకు తెలుపు, ఎరుపు రంగులంటే చాలా కోపమని రుద్రాదిత్య తెలిపారు. అందుకే ఏనుగులు విద్యుత్ స్తంభాలు, తెల్లటి పీవీసీ పైపులు, డ్రిప్పు సిస్టం, ట్రాన్స్ఫార్మర్ బాక్సులను ధ్వంసం చేస్తాయన్నారు. ఎవరైనా తెలుపు, ఎరుపు దుస్తులు ధరిస్తే ఏనుగులు వారినే వెంటాడతాయన్నారు. భారీగా శబ్దాలు చేయడం, బాణసంచా పేల్చడం, టైర్లు కాల్చి వాటిపైకి విసరడం, రణగొణ ధ్వనులు చేయడం వంటి వాటిని ఏనుగులు సహించవన్నారు. ఏనుగు వచ్చినప్పుడు వేసుకున్న బట్టలు తీసేయాలి మనిషి చెమట వాసన ద్వారా ఏనుగు పసిగడుతుందన్నారు. వందమీటర్ల దూరంలో జరిగే విషయం కూడా ఏనుగు కళ్లకు సృష్టంగా కనిపిస్తుందని, దాని రెటీనా క్యూడీ కెమెరాకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని రుద్రాదిత్య పేర్కొన్నారు. ముందరి కాళ్లు సెన్సార్లలా పనిచేస్తాయని వివరించారు. అవి తమ ముందు కదలికలను కనిపెడతాయని తెలిపారు. ఉన్నట్టుండి ఏనుగు తరుముకోగానే మనం వేసుకున్న షర్టు, ప్యాంటు లేదా టోపీ, టవల్ లాంటివి కిందపడేసి వెళ్లాలని తెలిపారు. వాటిపై ఏనుగు దాడి చేస్తూ మనిషిని వదిలేస్తుందన్నారు. అసలు మనిషిని చంపాలనే ఆలోచన ఏనుగులకు ఉండదని, తనను ఏమో చేస్తారనే భయంతో సెల్ఫ్ డిఫెన్స్ కోసమే దాడి చేస్తాయని వివరించారు. ఏనుగులు పొలాల్లోకి రాకూడంటే... అడవికి ఆనుకుని ఉన్న రైతుల పొలాల్లోకి ఏనుగులు రాకూడదంటే మిరపకాయలను ఓ గోనె సంచిలో కట్టి దాన్ని కొయ్యకు కట్టి నిప్పు పెట్టాలని రుద్రాదిత్య తెలిపారు. ఆ మిరప కాయల ఘాటును ఏనుగులు ముందుగానే పసిగట్టి ఆ ప్రాంతానికి రావన్నారు. అంతేకాకుండా ఘీంకారాల ద్వారా మిగిలిన గుంపునకు సంకేతాలు ఇస్తాయని పేర్కొన్నారు. రైతులు సాయంత్రం వేళల్లో పొ లాల వద్ద మిరపకాయల పొగ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో విజయవంతమైందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎఫ్ఆర్వో చాంప్లానాయక్, ఎఫ్ఎస్వో సుకుమార్, బీట్ ఆఫీసర్ కిరణ్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఇసుక లారీ, టిప్పర్ స్వాధీనం
గుడిపాల: తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీ, టిప్పర్ను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్ఆర్పేట, జీడీనెల్లూరులోని ఇసుక రీచ్ల నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువచ్చి సీఎంఖండిగ మునీశ్వరస్వామి గుడివెనుక ఉన్న తాటికుంట చెరువు వద్ద డంప్ చేస్తున్నారని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై అందిన సమాచారంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాడి చేశామని తెలిపారు. లారీ, టిప్పర్లో ఇసుక లోడ్ చేసుకుని తమిళనాడుకు వెళుతుండగా ఆపి ఇద్దరు డ్రైవర్లను పట్టుకుని విచారించినట్టు తెలిపారు. వారు 20 రోజులుగా రాత్రి వేళల్లో తమిళనాడులోని వేలూరు, రాణిపేట, వాలాజా ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నామని అంగీకరించారని వెల్లడించారు. ఇసుకను నారగల్లుకు చెందిన టీడీపీ నాయకుడు ఉమాపతి అలియాస్ విక్కి డంప్చేసి అమ్ముతున్నాడని డ్రైవర్లు చెప్పారని తెలిపారు. దీంతో టిప్పర్ డ్రైవర్లు అజిత్కుమార్, అంబారసు, ఉమాపతి అలియాస్ విక్కీపై కేసునమోదు చేశామని తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. స్వయం సహాయక సభ్యులు ఆర్ధికంగా ఎదగాలి బంగారుపాళెం : స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వీవోఏలకు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా గ్రామ సంఘాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక పథకాలను సద్వినియోగం చేసుకుని తద్వారా అభివృద్ధి చెందాలని సూచించారు. తీసుకున్న రుణాలు, సంఘాల లావాదేవీలను మన డబ్బులు–మన లెక్కల యాప్లో సరి చూసుకోవాలన్నారు. లావాదేవీల పుస్తకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. హెల్త్ అండ్ న్యూట్రీషన్ ద్వారా కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. సీ్త్రనిధి, సీఐఎఫ్ రికవరీలు, బ్యాంక్ రుణాలు వంద శాతం రికవరీ చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో రవికుమార్, సుబ్బారెడ్డి, హరిప్రసాద్, మధుసూదన్, శ్రీహరి, వేణు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్ పాల్గొని జిల్లాలో చేపడుతున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని 622 గ్రామ పంచాయతీలు, 5,914 వార్డులతో పాటు పలమనేరు, నగరి, చిత్తూరు, కుప్పం మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, కనీస సౌకర్యాల కల్పన, మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నట్టు వెల్లడించారు. కులాల వారీగా ఓటర్ల వివరాల పరిశీలన ఇప్పటికే ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం మార్పులు–చేర్పులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి కోర్టు కేసుల ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది కొరతపై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్కు నివేదించామన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్లో డీఆర్వో మోహన్ కుమార్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
4,500 కేజీల తమిళ బియ్యం స్వాధీనం
గుడిపాల: తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 4500 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బొమ్మసముద్రం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన మినీ కంటైనర్ వ్యాన్ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయాడని తెలిపారు. వాహనంలో పరిశీలించగా అందులో 4500 కేజీల (90 బ్యాగులు) తమిళనాడు బియ్యం ఉందని తెలిపారు. తమిళనాడు బియ్యా న్ని రాణిపేటకు చెందిన లోకేష్ అను వ్యక్తి తీసుకుపోతున్నట్లు తెలిసిందన్నారు. తొందరలోనే అత న్ని పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. మిద్దైపె నుంచి పడి బాలుడు మృతి బైరెడ్డిపల్లె : మండల కేంద్రమైన బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో బుధవారం సాయంత్రం మిద్దైపె నుంచి బాలుడు పడి మృతి చెందాడు. మండలంలోని మేకలనాగిరెడ్డిపల్లెకు చెందిన లక్ష్మణరెడ్డి భార్య, పిల్లలతో కలిసి బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. బుధవారం సాయంత్రం లక్ష్మణ్రెడ్డి భార్య స్వప్న ఇంటి మిద్దైపెకి వెళ్లి సెల్ఫోన్లో లీనమైపోయింది. తల్లి వద్దకు వచ్చిన రెండో కుమారుడు భానురెడ్డి (3) మిద్దైపె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో బైరెడ్డి పల్లె పీహెచ్సీకి తరలించారు. అక్క డి నుంచి మెరుగైన చికిత్స కోసం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సీ యువతకు అర్హతలకు అనుగుణంగా అవకాశాలు చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు, తిరుపతి జిల్లాలో ని ఎస్సీ యువత తమ అర్హతలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న లబ్దిని పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ చిత్తూరు కార్యనిర్వహక సంచాలకులు శ్రీదేవి తెలిపారు. సంక్షేమ, స్వయం ఉపాధి పథకాలు, రుణ సదుపాయాలు, సబ్సి డీ పథకాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకా శాల వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు ఈవోపీ జ్యోతి 9550762919, ఏఈవో కే మేఘనాథ్ 9959403234, డీపీవోఎస్ గిరీష్ 8074437025, డీఈవోఎం శ్రీనాథ్ 8686149492, డీవోవోపీ ప్రశాంత్ 9966079699ను సంప్రదించాలన్నారు. అధికారిక వెబ్సైట్ aprccorporation.ap.gov.in ను చూడాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సీ, డీ గ్రేడ్ పిల్లలు మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గుడిపాల మండలంలోని కమ్మతిమ్మపల్లి ప్రాథ మిక పాఠశాలలో ఒక విద్యార్థి, ఒక టీచర్ ఉండటంతో వారిని సమీపంలోని 197 రామాపురం పాఠశాలకు మార్చామన్నారు. విద్యార్థికి ప్రభుత్వం తరఫున రవాణాభత్యం అందజేస్తామన్నారు. జిల్లాలోని గుడిపాల మండలం వెంగంవారిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వివరాలను అధికారికంగా సమీపంలోని ఏఎల్పురం మోడ ల్ ప్రైమరీ పాఠశాలకు మార్పు చేసినట్టు తెలిపా రు. కొన్ని సమస్యల వల్ల విద్యార్థులు వెంగంవారిపల్లి పాఠశాలలోనే తరగతులకు హాజరవుతారని డీఈవో వెల్లడించారు. తిరుమలలో బీడీ తాగిన వ్యక్తిపై కేసు తిరుమల : తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. తిరుమల వరాహస్వామి కార్ పార్కింగ్ ప్రాంతంలో బహిరంగంగా బీడీ తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పోలీసులు పరిశీలించారు. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం జిల్లా పళనిపేటకు చెందిన ఆర్.సంతోష్ (31)ను నిందితుడిగా గుర్తించారు. అతన్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, టీటీడీకి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో మద్యం, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగం నిషేధమని పోలీసులు తెలిపారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. -
సంస్కృతంతో వికసిత్ భారత్
తిరుపతి సిటీ : వికసిత్ భారత్కు దిశ, దశ చూపేది సంస్కృతమేనని కేంద్ర నాయ్యశాఖ మంత్రి అర్జున్ మేఘవాలే తెలిపారు. ఎన్ఎస్యూలో బుధవారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్కర్ష మహోత్సవం–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సంస్కృతంలోని జ్ఞానం అర్థం చేసుకుని, సామాజిక విలువలను కాపాడాలని కోరారు. ప్రపంచంలోని శ్లోకాలు, హితవాక్యాలు రచించడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పారు. సంస్కృతంలోని శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో పరిశోధనలు ముమ్మరం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్కు వేదాంత విధ్వన్మణి పురస్కారం ప్రదానం చేశారు. చక్కటి విద్వాంసుడిని తయారు చేసిన అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం దాయగుడేను శాస్త్ర విధ్వన్మణి బిరుదుతో సత్కరించారు. అలాగే అవధాని కేవీఎస్ఎస్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రతాప్ను అవార్డులతో సత్కరించారు. అనంతరం వర్సిటీ ప్రచురించిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీ మనోహర్ పాఠక్, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, కో–ఆర్డినేటర్ గణపతిభట్, ఆచార్యులు సత్యనారాయణ, శ్రీవాత్సవ, దక్షణమూర్తి శర్మ పాల్గొన్నారు -
వెబ్ డెవలపర్ శిక్షణకు దరఖాస్తులు
తిరుపతి సిటీ : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయా ప్రాంతాలలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్కిల్ హబ్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ హబ్గా ఎంపిక చేసినట్లు వివరించారు. రిజిస్ట్రేషన్తో పాటు ఇతర వివరాలకు 8143576866 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 22న తిరుపతి ఐఐటీ స్నాతకోత్సవం ఏర్పేడు : తిరుపతి ఐఐటీ 8వ స్నాతకోత్సవాన్ని ఈనెల 22వ తేదీన నిర్వహిచనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్య అతిథులుగా భారత వైమానికదళ టెస్ట్ పైలెట్, వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పాల్గొంటారని వివరించారు. స్నాతకోత్సవంలో మొత్తం 457 మంది విద్యార్థులు పట్టాలను అందుకోనున్నట్లు తెలిపారు. వీరిలో ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ను బీటెక్(సీఎస్ఈ)ని అత్యధిక మార్కులతో పూర్తి చేసిన టంగుటూరి మోక్షిత్రెడ్డి ఉన్నారని వెల్లడించారు. అలాగే గవర్నర్ మెడల్ను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శుభం మొహంతి, ప్రొఫెసర్ కమటం కృష్ణయ్య స్మారక అవార్డును బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థిని పాలక్ ఖండేల్వాల్, వివిధ అవార్డులను మరో 15 మంది విద్యార్థులు పొందనున్నట్లు వివరించారు. 22న ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్ తిరుపతి అర్బన్ : తిరుపతిలోని తిలక్రోడ్ ఎస్బీబీ మెడికేర్ వద్ద ఈ నెల 22వ తేదీన ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం బుధవారం తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్ల నుంచి 35ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, ఎంపీఏ చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు. ఎస్బీబీ మెడికేర్ పరిధిలో లోకల్ జాబ్స్ ఉంటాయని వెల్లడించారు. రూ.12,500 నుంచి రూ.25వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. అర్హులైనవారు నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9177508279, 9347508876, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నకిలీ మేతతో నష్టాలు
– పౌల్ట్రీ రైతుల ఆందోళన చిత్తూరు రూరల్ (కాణిపాకం): కోళ్లకు నకిలీ మేత సరఫరా చేస్తుండడంపై పౌల్ట్రీ రైతులు నిరసన తెలిపారు. మంగళవారం చిత్తూరులోని దాణా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కోళ్ల రైతులు సుధాకర్ రెడ్డి, శ్రీపతి మాట్లాడుతూ నకిలీ మేత కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రామాణికం లేని మేతను సరఫరా చేయడంతో నిత్యం వందలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయని, కంపెనీ ప్రతినిధుల బాధ్యతారాహిత్యంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దాదాపు 120 రోజుల వయసు, సుమారు 2 కేజీల బరువు ఉన్న కోళ్లకు కొన్ని రోజులుగా ఎస్కేఎం కంపెనీ(తమిళనాడులోని ఈ రోడ్) ఫీడ్ వా డామన్నా. అయితే, మేత వాడకం ప్రారంభించిన పది రోజుల నుంచే కోళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. కోళ్లలో జీర్ణకోశ, లివర్ వ్యాధులు రావడం, పేగుల్లో పుండ్లు పడటం వల్ల బరువు తగ్గిపోయి హఠాత్తుగా చనిపోతున్నాయని వాపోయారు. ప్రతిరోజూ వందలాది కోళ్లు ప్రాణా లు కోల్పోతుండటంతో రూ.లక్షల్లో నష్టం వాటి ల్లుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల మరణాల సంఖ్య పెరగడంతో కంపెనీ మార్కెటింగ్ మేనేజర్కు తక్షణమే ఫిర్యాదు చేశామన్నారు. అయితే, మూడు రోజుల ఆలస్యంగా వచ్చిన కంపెనీ ప్రతినిధి, కేవలం ఫొటోలు తీసుకుని వెళ్లడం మినహా నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయ చర్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించకపోతే అధికారులకు లీగల్గా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ దాణా సరఫరా చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోళ్ల కంపెనీ మేనేజర్ గిరిబాబుతో పాటు రైతులు వి.రమేష్ నాయుడు, స్వామినాథన్, దేవేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రామచంద్ర శెట్టి, లోకనాథరెడ్డి, చిన్నబ్బారెడ్డి పాల్గొన్నారు. -
నాడు అభివృద్ధి.. నేడు అధోగతి!
చిత్తూరు కార్పొరేషన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధి పథంలో పయనించిందని, చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత అధోగతి పాలవుతోందని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. ప్రధానంగా చిత్తూరు నుంచ అన్ని కార్యాలయాలను తిరుపతికి తరలించేస్తూ.. అదే అభివృద్ధి అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నగరలోని వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాణిజ్యపన్నులశాఖ జేసీ, డీసీ కార్యాలయాలను తిరుపతికి మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కార్యాలయ మార్పు వద్దని సంబంధితశాఖ ఉద్యోగులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు విన్నవిస్తే, ‘‘ఆర్థికశాఖ మంత్రి కేశవన్న నా ఫ్రెండ్ అవసరమైతే గొడవ పడి అయినా అపుతా’’ అని హామీ ఇచ్చి ఇప్పుడు ఏమయ్యాడని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సమస్యను ఎమ్మెల్యే అక్కడ ప్రస్తావించి కార్యాలయాల తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆశాఖ కార్యాలయం చిత్తూరు, తిరుపతి జిల్లాలకు దగ్గరగా ఉందన్నారు. వ్యాపారులకు పన్ను, జరిమానా చెల్లింపులు ఇతర సందేహాల నివృత్తి కోసం చిత్తూరుకు త్వరగా వచ్చేవారని చెప్పారు. కుప్పం నుంచి వ్యాపారులు తిరుపతి వెళ్లి రావాలంటే 370 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. 50 మంది ఉద్యోగులు తిరుపతి పోవాలంటే వారి పిల్లల చదువులు, ఇంటి అడ్వాన్స్లు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఎకై ్సజ్ డీసీ కార్యాలయాన్ని సైతం తిరుపతికి తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాలు తరలిపోకుండా సీపీఐ, సీపీఎం నేతలు, మేధావులు కలిసి వచ్చి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వాణిజ్య పన్నులశాఖ కార్యాలయం తిరుపతికి తరలిస్తే వ్యాపారులు ఇబ్బంది పడతారని మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ తెలిపారు. నిరసన ర్యాలీ వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం నుంచి వివేకానందుని విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం సాయంతోనే చిత్తూరు– తచ్చూరు, చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మంజూరు చేయించామన్నారు. సీఎంసీ ఆస్పత్రిని గుడిపాలలో అభివృద్ధి చేశామని వెల్లడించారు. చంద్రబాబు మూయించిన విజయ డెయిరీని అమూల్ సంస్థకు ఇచ్చిన జగనన్న పునఃప్రారంభించారన్నారు. చిత్తూరు–తిరుపతి రోడ్డు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, జిల్లా లీగల్ విభాగం అధ్యక్షుడు సూర్యప్రతాప్రెడ్డి, నేతలు ప్రకాష్, రజనీకాంత్, అప్పొజీ, రమణ, చాన్బాషా, అను, మధుసూదన్, త్యాగ, అమర్నాథరెడ్డి, రమణ, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, హరీషారెడ్డి, పూంగొడి, మనోహర్రెడ్డి, నారాయణ, మనోజ్రెడ్డి, సద్దాం, శివ, మురళీరెడ్డి, చక్రీ, రాజేష్రెడ్డి, శేఖర్, రూపేష్రెడ్డి, ప్రతిమారెడ్డి, సయ్యద్, డేవిడ్, అజిత్ పాల్గొన్నారు. -
ప్రశ్నించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు!
నగరి : రోడ్డుపై కంటైనర్ కారణంగా జరిగిన చిన్నపాటి ఘటనను ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ కారు డ్రైవర్ చివరకు అదే లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సోమవారం రాత్రి నగరి మండలంలో జరిగింది. లారీ డ్రైవ ర్ అతివేగం, నిర్లక్ష్యం, ఆపకుండా వెళ్లిపోవడం కారణంగా నారాయణ (36) అనే వ్యక్తి దుర్మరణం చెందడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. సోమవారం తిరుపతి జిల్లా కొర్లగుంట మారుతీనగర్కు చెందిన నారాయణ ఇన్నో వా కారుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరుగురు యాత్రికులను తీసుకుని తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి దర్శనం చేయించిన అనంతరం వేలూరు, కాంచీపురం ఆలయాలను సందర్శించి తిరిగి తిరుపతికి వస్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడు సరిహద్దులోని ఆర్టీ ఓ చెక్పోస్ట్ వద్ద ఇన్నోవాను తనిఖీ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ కారు కుడివైపును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో తన వాహనానికి జరిగిన నష్టంపై ప్రశ్నించేందుకు నారాయణ ఆ కంటైనర్ లారీని వెంబడించాడు. నగరి మండలం వీకేఆర్ పురం సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవే రింగ్ రోడ్డు వద్ద లారీని ఓవర్టేక్ చేసి కొంత దూరంలో ఇన్నోవాను నిలిపాడు. అనంతరం రోడ్డును దాటి లారీ డ్రైవర్ను ప్రశ్నించి వస్తానని కారులోని ప్రయాణికులతో చెప్పి వెళ్లాడు. నారాయణ చాలా సమయం వరకు రాకపోవడంతో ఇన్నోవాలోని యాత్రికులు ముందుకు వెళ్లి చూడగా రోడ్డుపై నుజ్జు నుజ్జుగా మారిన మృతదేహంగా కనిపించాడు. దీంతో వెంటనే నగరి పోలీసులకు సమాచారం అందించారు. హైవే మొబైల్ పోలీసులు, నగరి ఎస్ఐ ఘట నా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కంటైనర్ లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరు, ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లిపోయిన అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ను ప్రశ్నించేందుకు నారాయణ లారీలోకి ఎక్కే సమయంలో వాహనం ముందుకెళ్లడంతో అదుపు తప్పి టైర్ కింద పడిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమా దం జరిగిన తర్వాత కూడా లారీని ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం మాత్రమే కాకుండా ప్రమాదం జరిగిన అనంతరం బాధితుడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నారాయణ నడుపుతూ వచ్చిన కారురోడ్డుపై పడివున్న నారాయణ మృతదేహం ఇంతకీ ఆ కంటైనర్లో ఏముంది? ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఆ కంటైనర్లో ఏముంది? అనే సందేహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా రవాణా వాహనాలను తనిఖీ చేసే ప్రాంతంలో కంటైనర్ ఆగకపోవడం, అనంతరం జరిగిన ఘటనలోనూ ఆపకుండా వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్లో ఏ సరుకు ఉందో, దాని రవాణాకు సంబంధించిన పత్రాలు ఏంటో, వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో వంటి వివరాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. చెక్పోస్ట్ వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు, ఎక్స్ప్రెస్ హైవేలోని కెమెరా ఫుటేజీ, టోల్గేట్ రికార్డులు పరిశీలిస్తే కంటైనర్ ప్రయాణానికి సంబంధించిన కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. -
ఆప్షన్–3కి అడ్డంకులు
పోలీసులు సీజ్ చేసిన లారీ చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పర్శ్ విధానంతో ఆప్షన్్–3 పక్కా ఇళ్లకి సాంకేతిక గ్రహణం పట్టింది. జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకునే అవకాశం లేని వారికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్మించి ఇచ్చేందుకు లబ్ధిదారుల కు మూడో ఆప్షన్ను కేటాయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించేందు కు చర్యలు చేపట్టింది. అందులో పట్టణ ప్రాంతమైతే మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేలను ఉపాధిహామీ పథకం కింద చెల్లించేలా ప్రతిపాదించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనంగా వడ్డీ లేని రుణం కింద రూ.35 వేలు మంజూరు చేసింది. దీంతో యూనిట్కి రూ.2.15 లక్షల నగదును ఇంటి నిర్మా ణ దశల వారీగా లబ్ధిదారుల ఖాతాకు జమ చేసేలా కార్యాచరణ అమలు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్షన్–3 లక్ష్యాలను పూర్తిగా నీరుగారుస్తోంది. జిల్లాలో 1,225 గృహాలు ఆప్షన్–3లో జిల్లాలోని 1,225 గృహాల నిర్మాణ పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏజెన్సీ (కాంట్రాక్టర్)లకు అప్పగించింది. అందులో 326 గృహాలు పూర్తయిన తర్వాత చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చింది. దీంతో మిగిలిన ఇళ్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. పేరుకు అన్నీ పలు దశల్లో ఉన్నట్లు చూపించినా అందులో ఎక్కువ ఇళ్లు పునాదుల్లోనే ఉన్నాయి. కొన్ని శ్లాబ్ పూర్తయి, గోడలకు ప్లాస్టింగ్, తలుపులు, కిటికీలు అసంపూర్తిగా మిగిలాయి. లబ్ధిదారులు ముందుకు వస్తేనే.. స్పర్శ్ విధానంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నగదు నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాకే బదిలీ కావాలనేది ని బంధన. కాంట్రాక్టర్లు నిర్మించడానికి ముందుకొచ్చి నా వారికి నగదు ఇప్పించడం అధికారులకు తలనొప్పి గా మారనుంది. దీంతో బిల్లులు రావనే భావ నతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను అన్ని చోట్లా ఆపేశా రు. అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి ఎంత మంది లబ్ధిదారులు ముందుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
అనకొండలు
బాబు మాట.. నీటి మూట అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని వేదికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. చివరకు టీడీపీ నాయకులే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో యథేచ్ఛగా క్వారీలను అక్రమంగా నిర్వహిస్తున్నారు. కొండలు.. గుట్టలను పగులగొట్టి రాళ్లను అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా గ్రానైట్ను కొల్లగొట్టి రూ.కోట్ల పోగేసుకుంటున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా అత్యంత విలువైన నల్లబంగారం బ్లాక్లను సరిహద్దులు దాటించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కళ్లెదుటే కొండలు కరిగిపోతున్నప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. పూతలపట్టు మండలంలోని అక్రమ క్వారీసాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లాలో పచ్చనేతల దోపిడీ పరాకాష్టకు చేరింది. అధికారం అడ్డు పెట్టుకుని ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. కొండలు, గుట్టలను అప్పడాల్లా కరకరలాడించేస్తున్నారు. ఒకప్పుడు ఖాళీ జేబులతో తిరిగిన వాళ్లు కూడా చూస్తుండగానే రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికారులు మాత్రం అక్రమ రవాణాకు గప్చుప్గా కాపలా కాస్తున్నారు. యథేచ్ఛగా తవ్వకాలు జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గలో మూడు అక్రమ క్వారీలు పచ్చ నేతలకు ప్రధాన ఆదాయవనరుగా మారిపోయాయి. ఐరాల మండలంలోని బొమ్మసముద్రంతో పాటు యాదమరిలోని దాసరపల్లె, గొల్లపల్లె, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో దర్జాగా క్వారీలు నడుపుతున్నారు. బంగారుపాళ్యం మండలంలోని పాలేరు, కణతల చెరువు ప్రాంతాల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. చిత్తూరు మండలంలోని పెద్దిశెట్టిపల్లె, నాయనిచెరువులోని ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో అనధికారికంగా గ్రానైట్ మైనింగ్ సాగిస్తున్నారు. జీడీనెల్లూరు, ఎస్ఆర్ పురం, వెదురుకుప్పం మండలాల్లో బహిరంగంగానే కొండలను పిండి చేసేస్తున్నారు. కప్పం కడితేనే పనులు! జిల్లాలో మొత్తం 650 మైనింగ్ లీజులుండగా, వాటిలో 520 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారికంగా 260 చోట్ల తవ్వకాలు జరుగుతుంటే, 130కు పైగా అనధికారిక క్వారీలు మైనింగ్ సాగిస్తున్నాయి. గతంలో ఐరాల–పూతలపట్టు సరిహద్దుల్లోని ఒక క్వారీని కూటమికి చెందిన ఒక నాయకుడు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడంతో, అసలు లీజుదారుడు దిక్కుతోచక కన్నీరుమున్నీరవుతున్నాడు. రాయి కొట్టాలన్నా, లారీకి ఎత్తాలన్నా పచ్చ నేతలకు కప్పం కట్టాల్సిందే. మండలానికి ఒకరిని ఏజెంట్గా పెట్టుకుని నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. వినకపోతే రాజకీయ ఒత్తిడితో పనులు నిలిపివేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్ల ఖర్చుల పేరుతో మండలాల వారీగా క్వారీ యజమానుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇష్టారాజ్యంగా అక్రమ క్వారీలు -
తుడా నుంచి తొలగింపుపై ఆగ్రహం
వెదురుకుప్పం : జీడీనెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రత్యేక చొరవ తీసుకుని కార్వేటినగరం, వెదు రుకుప్పం మండలాలను తుడా పరిధిలోకి తీసుకువచ్చారని జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని ఈ రెండు మండలాలను కుట్రపూరితంగా కూటమి నేతలు తుడా పరిధి నుంచి తొలగింపజేశారని మండిపడ్డారు. మంగళవారం వారు మాట్లాడు తూ కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరు పతి జిల్లాలో కలుపుతామని చంద్ర బాబు హామీ ఇచ్చి అమలు చేయకపోగా తుడా నుంచి తొలగించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హ యాంలో తుడా నిధులతో పచ్చికాపల్లం, నల్లవెంగనపల్లె, బొమ్మయ్యపల్లె గ్రామాల్లో రూ. 35 లక్షల చొప్పున వెచ్చించి కమ్యూనిటీ హాళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. రూ.కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ, జనసేన నేతలు పని గట్టుకుని కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలంటూ ధర్నాలు, ఆందోళనలు చేపట్టి నాటకా లు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఈ ఆంశాన్నే ఆయుధంగా వాడుకున్న కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో నారాయణస్వామిపై బురదజల్లి ఓట్లు వేయించుకున్న కూట మి నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం మీ నైజమని, ఇప్పుడిప్పుడే మీ మో పాలు, అన్యాయాలు, అరాచకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ, సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు దేవరాజులు రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు జగదీష్రెడ్డి పాల్గొన్నారు. -
ముందుకు కదలదు!
మందు కొడితే.. పలమనేరు : మద్యం సేవించి బైక్ నడపడంతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది యువత, విద్యార్థులే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసు శాఖ ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా, భారీ జరిమానాలు విధించినా నియంత్రించడం కష్టంగానే మారింది. తరచూ పత్రికల్లో వచ్చే ఇలాంటి వార్తలను చూసి చలించిన పలమనేరులోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. మద్యం సేవించి మోటార్ సైకిల్ ఎక్కితే స్టార్ట్ కాని కొత్త సిస్టమ్ను కొనుగొన్నారు. ముగ్గురు విద్యార్థుల ప్రతిభ కళాశాలకు చెందిన శ్యాంప్రసాద్, జస్వంత్, నందశివకుమార్ అనే బీటెక్ (ఈసీ విభాగం)విద్యార్థులు ఈ డివైజ్ను కనుగొన్నారు. వాహనదారుడు మద్యం సేవించి హెల్మెట్ ధరించగానే సెన్సార్లు గుర్తించి బైక్ స్టార్ కాకుండా చేస్తాయి. అయితే హెల్మెట్ ధరించకుంటే బైక్ అసలు స్టార్ట్ కాదు. దీంతో హెల్మెట్ ధరించగానే లిక్కర్ స్మెల్ను డివైజ్ పసిగడుతుంది. మరోవైపు అన్నీ సక్రమంగా ఉన్నా ఏఐ ద్వారా బైక్ బల్బు ముందు మరో మైక్రో కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ముందున్న ప్రాంతాన్ని వీడియో తీస్తుంది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తిస్తుంది. దీంతో హిట్ అండ్ రన్ కేసులను సులభంగా గుర్తించవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా రూ.5వేలు మాత్రమే ఉంటుంది. కేవలం సామాజిక ప్రయోజనాల కోసమే దీన్ని తయారు చేసినట్టు విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ఈ డీవైజ్పై పేటెంట్ను పొందుతామని చెబుతున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. గతంలో మరో ఆవిష్కరణ గతంలో ఇదే కళాశాలకు చెందిన విద్యార్థి పెట్రోలుతో పనిలేకుండా కేవలం సోలార్, కరెంటు, డైనమోల సాయంతో నడిచే ఈ–బైక్ను రూ.15వేల వ్యయంతో తయారుచేశాడు. ప్రస్తుతం మార్కెట్లో ఈ–బైక్లు హల్చల్ చేస్తున్నా.. పదేళ్ల క్రితమే ఇదే కళాశాల విద్యార్థి ముజామిల్ ఆవిష్కరించాడు. తన తండ్రి అల్లాబక్ ్ష తోపుడుబండిపై అరటిపళ్లను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామాల్లో సైకిల్పై వచ్చే విద్యార్థుల బాధలను చూసి ఎలాగైనా ఈ –సైకిల్ను తయారు చేయాలని భావించాడు. ఇందుకోసం ఓ పాత సైకిల్ను రూ.1,500 కొన్నాడు. దీనికి సోలార్ పెనాల్, 12 వోల్టుల రెండు బ్యాటరీలు, 240 వోల్ట్స్ కలిగిన హబ్మోటార్, దానికి రెగ్యులేటర్, బ్యాటరీ ఇండికేటర్, స్టెప్పార్మోటార్, ఎక్స్లేటర్ కొన్ని కేబుళ్లను సైకిల్కు అమర్చాడు. దీనికోసం అయిన ఖర్చు రూ.13,500. మొత్తం రూ.15వేలతో దీన్ని తయారుచేశాడు. ఇది మూడు రకాల శక్తులతో పనిచేస్తోంది. పైన అమర్చిన సోలార్ ప్లేట్లలో సౌరశక్తి ఉత్పత్తి అయి బ్యాటరీకి చేరుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కరెంటును నింపుకోవడంతో కరెంటు బ్యాటరీకి చేరుతుంది. సైకిల్ చక్రాలు తిరిగినపుడు డైనమో ద్వారా ఉత్పయ్యే కరెంటు బ్యాటరీకి చేరుతుంది. ఇలా మూడు ఉత్పత్తులు ద్వారా శక్తిని తయారు చేసి దీనిద్వారా మోటారు సాయంతో ఇది నడిచేలా తయారు చేశాడు. ఓసారి బ్యాటరీ ఫుల్ అయితే 40 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. అప్పట్లో ఈ ప్రయాగం సంచలనంగా మారింది. నేడు ఈ–సైకిళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇక మద్యం సేవించి బైక్ ఎక్కితే స్టార్ట్ కాని బైక్లు భవిష్యత్తులో రావచ్చేమో. ముజామిల్ తయారు చేసిన త్రీ ఇన్ ఒన్ సైకిల్ మద్యం సేవిస్తే స్టార్ట్ కాని బైక్ ముందు విద్యార్థులు ఓ ఆలోచన అందరినీ కదిలిస్తుంది. ఓ ప్రయోగం సమాజానికి ఉపయోగపడుతుంది. ఓ ఆవిష్కరణ నవశకానికి నాంది పలుకుతుంది. నేటి ఆధునిక యుగంలో విపరీతమైన పోటీ వాతావరణం విద్యార్థులకు సవాల్ విసురుతోంది. నవీన ప్రయత్నాలతో ప్రతిభను ప్రదర్శించాల్సిన ఆవశ్యకతను కల్పిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యలకు చెక్ పెట్టేలా పలమనేరులోని మదర్థెరిస్సా కళాశాల విద్యార్థులు సరికొత్తగా ఓ డివైజ్ను కనిపెట్టారు. -
‘చెకుముకి’ పోస్టర్ ఆవిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్న్స్ పోటీల పోస్టర్ను డీఈఓ లక్ష్మీనారాయణ మంగళవారం ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు చెకుముకి సైన్స్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు హెచ్.అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈ నెల 27వ తేదీన, జిల్లా స్థాయిలో సెప్టెంబర్ 27వ తేదీ, రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన పోటీలు ఉంటాయని వివరించారు. పూర్తి వివరాలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జేవీవీ కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. జేవీవీ నగర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు జయంతి, విజయ్ కుమార్, బాలయ్య, ఉమాపతి, యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమణ, అధ్యక్ష కార్యదర్శులు రెడ్డెప్ప, మణిగండన్, నరేంద్ర, హరీష్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఐరాల : మండలంలోని అడపగుండ్లపల్లె వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాణిపాకం పోలీసుల కథనం మేరకు.. ముదిగోళం గ్రామానికి చెందిన ఢిల్లీ(32) సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో చిత్తూరుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నేమ్బోర్డును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢిల్లీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని 108 వాహ నంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఢిల్లీకి భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళల భద్రతకు శక్తి యాప్ చిత్తూరు అర్బన్: మహిళల భద్రత కోసం రూ పొందించిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆపద, అత్యవసర సమాయాల్లో ఈ యాప్ వినియోగిస్తే పోలీసులు సహాయ పడతారన్నారు. ప్రధానంగాయువత, ఉద్యోగినులు, వ్యాపారాలు చేసే వాళ్లు శక్తి యాప్ను ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. బోగస్ జీఎస్టీపై అసెంబ్లీలో చర్చ చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులో జరిగిన బోగ స్ జీఎస్టీ రిజిస్ట్రేషన్పై శాసనమండలిలో ఎమ్మె ల్సీ రామ్గోపాల్రెడ్డి మంగళవారం ప్రశ్నించా రు. రూ.వందల కోట్లు అక్రమాలు జరిగాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో నకిలీ కంపెనీల ద్వారా రూ.వేలకోట్లలో అక్రమ వ్యాపా రం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.40 వేల కోట్లు వాణి జ్య పన్నులశాఖకు పన్ను బకాయిలు ఉన్నా యని వెల్లడించారు. కూలీలు, దివ్యాంగుల పేర్లతో నకిలీ సంస్థలను నమోదు చేసి తద్వా రా రూ.వందల కోట్ల బిల్ ట్రేడింగ్ జరిగిందని స్పష్టం చేశారు. చిత్తూరులోనే రిజ్వన్ అనే స్క్రాప్ వ్యాపారి దాదాపు రూ.2వేల కోట్ల వర కు బిల్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాడని తెలిపారు. అతనిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. దాదాపు 15 ఏళ్లుగా రూ.వేల కోట్లు పన్నులను ఎగ్గొట్టాడని ఆరో పించారు. బోగస్ సంస్థల నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సైబర్నేరాల తరహాలో, జీఎస్టీ నిబంధనలను సడలింపు అవకాశాలను వినియోగించుకుని బోగస్ ఇన్వాయిస్లతో పన్ను లు ఎగవేస్తున్నారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని, బోగస్ ఇన్వాయిస్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొని రికవరీ చేపడతామని స్పష్టం చేశారు. కరెంట్ ఉచ్చు వేసిన వ్యక్తి అరెస్ట్ బంగారుపాళెం: అడవి జంతువుల కోసం కరెంట్ ఉచ్చు వేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడైన నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని గుంతూరులో ఈ నెల 15వ తేదీ రైతు నరసింహులు నాయుడుకు చెందిన మామిడి తోటలో ఏర్పాటు చేసిన కరెంట్ ఉచ్చులో చిక్కుకుని చిన్నస్వామి (40) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మార్కొండయ్యను పాలేరు అండర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. -
గడువులోపు లక్ష్యాల పూర్తి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు వంద శాతం పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీల వారీగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ను 100 శాతం పూర్తి చేయాలన్నారు. సంజీవిని, కేసీఆర్ అప్డేట్స్ను ఈ నెల 30లోగా, ఈఎస్ఆర్ డిజిటలైజేషన్ను సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా కుప్పంలో అప్డేట్స్ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఎన్ సీడీ స్క్రీనింగ్లో 90శాతం లక్ష్యం సాధించాలని, బీపీ, షుగర్ ఫాలోఅప్ పెండింగ్ జాబితా సమర్పించాలని స్పష్టం చేశారు. ఏఎన్ఎంలు ఆరోగ్యశ్రీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలన్నారు. అదనపు డీఎంహెచ్ఓ వెంకట ప్రసాద్, డాక్టర్లు అనిల్ కుమార్, ప్రవీణ, గిరి పాల్గొన్నారు. ‘హిందాల్కో’కు 60 ఎకరాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కుప్పం మండలం ఏకార్లపల్లెలో హిందాల్కో ప్రాజెక్ట్కు 60 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు కేబినెట్లో మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏకార్లపల్లెలో అల్యూమినియం ఎక్స్ట్రూషన్ (విస్తరణ) ప్రాజెక్ట్ ఏర్పాటు నిమిత్తం ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెస్సర్స్ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్కు 60 ఎకరాలను కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల పరిధిలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 మిగిలిన పనులను వేగవంతం చేసేందుకు రూ.1,323.75 కోట్ల అంచనా వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని నీవా బ్రాంచ్ కెనాల్ పనుల కోసం రూ.573.68 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. -
సృజనాత్మక నైపుణ్యాలు అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక, సృజనాత్మక నైపుణ్యాలు అవసరమని, ఆ మేరకు పెంపొందించుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ, ఓడీసీ (ఓసాట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఊస్పాట్ సంస్థల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడాలన్నారు. ఓడీసీ, గూగుల్ క్లాస్రూమ్ వంటి డిజిటల్ వేదికలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్న్స్ వంటి ప్రధాన సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేలా నైపుణ్యాలను పెంపొందించాలని ఆదేశించారు. డిజిటల్ వేదికలతో విద్యార్థుల్లో సాంకేతిక విజ్ఞానం, సృజనాత్మకత సులభంగా పెరుగుతాయని తెలిపారు. ఓడీసీ ప్రత్యేక అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ కేదార్ మాట్లాడుతూ ఎంపిక చేసిన పాఠశాలల్లో విధానాల అమలు తీరును హెచ్ఎంల ద్వారా అడిగి తెలుసుకున్నారు. డీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని 22 పాఠశాలలకు చెందిన 300 మంది టీచర్లు, 7 వేల మంది విద్యార్థులు ఓడీసీ ప్రోగ్రామ్లో భాగస్వాములవుతున్నారని వెల్లడించారు. వీరి కోసం ఇప్పటికే 131 ల్యాప్టాప్లు, 586 డిజిటల్ ట్యాబ్లు అందించామన్నారు. మరో 22 పాఠశాలల్లో ప్రత్యేక వైఫై కనెక్షన్ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. రాస్ వీడీ రమేష్రెడ్డి, ఏఎంఓ సుభాషిణి పాల్గొన్నారు. -
తల కొరివితో తీరిన రుణం
కార్వేటినగరం : తండ్రి అంత్యక్రియలకు కుమారుడు నిరాకరించడంతో కుమార్తె తల కొరివిపెట్టిన ఘటన మండలంలోని పొన్నగల్లులో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(65), శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెళ్లి చేసుకుని అత్తవారి ఇంట్లో ఉంటున్నారు. ,కుమారుడు చైన్నెలో ఉంటున్నాడు. 15 ఏళ్లక్రితం శాంతమ్మ మృతిచెందినప్పటి నుంచి వెంకటేశ్వర్లు కల్లుగీత పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఆలనపాలన లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతూ వెంకటేశ్వర్లు ఆధివారం మరణించాడు. తండ్రి మృతిపై కుమారుడికి సమాచారం అందించినా రాలేదు. తనకోసం ఏమీ ఆస్తులు కూడబెట్టలేదని, తలకొరివి కూడా పెట్టనని స్పష్టం చేశాడు. దీంతో పెద్దకుమార్తె నాగరత్నమ్మ తన తండ్రికి కొరివిపెట్టి జన్మనిచ్చిన రుణం తీర్చుకుంది. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 97,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,108 మంది భక్తులు తలనీలాలు అర్పించా రు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభి స్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగి న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
రెండిళ్లలో చోరీకి యత్నం
– ఇద్దరు నిందితుల పట్టివేత శ్రీరంగరాజపురం : మండలంలోని సీకేపురం, చిన్నతయ్యూరులోని రెండిళ్లలో ఆదివారం రాత్రి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించారు.స్థానికులు అప్రమత్తం కావడంతో బైక్పై పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కింద పడిపోవడంతో పట్టుబడ్డాడు. మరొకరిని స్థానికులు సురేష్, ప్రభాకర్ వెంటపడి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసు స్టేషన్ 9440900692 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. అలాగే బైక్పై నుంచి కిందపడిన నిందితుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తిరుమలలో ఘనంగా గరుడ పంచమి తిరుమల: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి పాల్గొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు పోలీసు అదుపులో మరో నిందితుడు -
23లోపు ఎల్పీజీ ఈకేవైసీ తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు ఈ నెల 23వ తేదీలోపు ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ వినియోగదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించామన్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలతో పాటు హోమ్ డెలివరీ సిబ్బంది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్లలో వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సర్వర్ లోపాలు, నెట్వర్క్ అంతరాయం, బయోమెట్రిక్ ధ్రువీకరణలో తలెత్తుతున్న ఆలస్యం కారణంగా కొందరు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఈకేవైసీకి అదనపు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులందరికీ ఏజెన్సీ నిర్వాహకులు సమాచారం అందించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. -
మెడికిల్ మాఫియా
చిత్తూరుజిల్లాలో జోరుగా నకిలీ మందుల విక్రయాలు 7మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026జిల్లాలో మెడికల్ మాఫియా పేట్రేగిపోతోంది. ఔషధాల మాటున యథేచ్ఛగా దందా నడిపిస్తోంది. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులను తయారు చేసి అమ్మేస్తున్నారు. అలాగే నాణ్యత లేని.. కాలం చెల్లినవాటిని సైతం ప్యాకింగ్ మార్చేసి విక్రయించేస్తున్నారు. చివరకు ప్రాణాలు కాపాడాల్సిన మందులను కాసుల కక్కుర్తితో విషతుల్యంగా మార్చేస్తున్నారు. లోగట్టు తెలియని సామాన్యులు కాస్త తలనొప్పి వచ్చినా.. జ్వరం సోకినట్లు అనిపించినా వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి చీటీ లేకుండానే మాత్రల పేరుతో అనార్యోగం కొని తెచ్చేసుకుంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన డ్రగ్స్ కంట్రోల్శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తనిఖీలను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
పుత్తూరు ఎంపీడీఓపై ఫిర్యాదు
పుత్తూరు: పుత్తూరు ఎంపీడీఓ శ్రీదేవి పనితీరు ఆమోదయోగ్యంగా లేదని, ఆమెను తక్షణం జెడ్పీకి సరెండ్ చేయాలని ఎంపీపీ మునివేలు కోరారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఎంపీ గురుమూర్తితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్కు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ఎంపీడీఓ ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం అందించడం లేదని, కనీసం ఆహ్వానించడం లేదని ఆరోపించారు. చివరకు ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టే శిక్షణ తరగతులు, సర్వసభ్య సమావేశాల సమాచారం సైతం తెలియజేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మండల సర్వసభ్య సమావేశంలో క్యూసీ అకౌంట్ ద్వారా రూ.2 లక్షలు విత్డ్రా చేశారని, దానికి సంబంధించి ఖర్చుల వివరాల అడిగినా వెల్లడించలేదన్నారు. వేపగుంట పంచాయతీ సెక్రటరీని లీవులో పంపించారని, అతడి స్థానంలో ఇన్చార్జి సెక్రటరీగా మరొకరిని నియమించారని, ఆయన విధులకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. గత జనరల్ బాడీ మీటింగ్లో వేపగుంట బీసీ కాలనీలో కొత్తగా డ్రైనేజీ ఏర్పాటు చేయడానికి సభ్యుల ఆమోదం పొందినా ఇంత వరకు వర్క్ ఆర్డర్ ఇవ్వలేదని మండిపడ్డారు. దాదాపు 14 పంచాయతీల్లో మౌలిక వసతుల పనులు ఆగిపోయాయని తెలిపారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ఎంపీపీ అయిన తన ద్వారా కాకుండా టీడీపీ నేతలతో చేయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీఓ విధులకు సైతం సక్రమంగా హాజరు కావడం లేదని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓను జెడ్పీకి సరెండ్ చేయాలని తీర్మానం చేశామని, ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కో–ఆప్షన్ మెంబర్ రాంబత్తయ్య, మాజీ సర్పంచులు గిరిజా ప్రసాద్, ఉదయ్కుమార్, మోహన్గాంధీ పాల్గొన్నారు. -
పరిష్కారానికి ప్రదక్షిణలు
‘‘ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం.. కాళ్లరిగిపోతున్నాయి కానీ, సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం.. అర్జీలు సమర్పిస్తున్నాం. ఫలితం శూన్యంగా ఉంది. మా గోడును పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.. కలెక్టర్ సర్.. మీరు ప్రత్యేక దృష్టి సారించాలి. మా కష్టాలు తీర్చేందుకు చొరవ తీసుకోవాలి’’ అంటూ బాధితులు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్)కు పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై మొత్తం 281 వినతులు అందించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ మోహన్ కుమార్ పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ పాస్బుక్ మంజూరుకు వినతి తవణంపల్లె మండలం మత్యం గ్రామానికి చెందిన కె.కృష్ణయ్య పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయా లని పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. సర్వే నంబర్ 32 లోని 0.60 సెంట్ల భూమి తాతల కా లం నుంచి తమ అనుభవంలో ఉందన్నారు. ఈ మేరకు పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాల ని కోరారు. మండల స్థాయిలో పలుమార్లు అర్జీ లు సమర్పించినా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతి అందజేసినట్లు తెలిపారు. ఐటీ స్టేటస్ తొలగించాలి శాంతిపురం మండలం కడపల్లెకు చెందిన దివ్యాంగు డు ఆర్.లోకేష్ తన ఆవేదనను అర్జీ రూ పంలో పీజీఆర్ఎస్ లో అందజేశారు. ఆయన మాట్లాడు తూ గతంలో జేసీబీ ఉన్నందున ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాడినన్నారు. ఆరేళ్ల క్రితం జేసీబీ విక్రయించినా ఆన్ లైన్ హౌస్హోల్డ్ డేటాలో ఇంకా ఇన్న్కమ్ ట్యాక్స్ పేయర్ గానే చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగింపునకు మండల అధికారులకు పలుమార్లు అర్జీలిచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆక్రమణలోని ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలని ఐరాల మండలం ఎస్సీ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు అర్జీ సమర్పించారు. వారు మాట్లాడుతూ ఐరాల మండలం ఎస్సీ కాలనీలో తాము నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఐరాల, నయనంపల్లి రహదారి పక్కన సర్వే నంబర్ 718లో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని వెల్లడించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.స్థలం, ఇల్లు మంజూరుకు వినతి జీడీ నెల్లూరు మండలం నర్సాకొత్తకాలనీ (కొత్త వెంకటాపురం ఎస్టీ గ్రామం)కి చెందిన ఏ. శ్రీవాణి పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ కాలనీలోని 10 నిరుపేద కుటుంబాలకు గత 8 ఏళ్లుగా సొంత ఇంటి స్థలం, ఇల్లు కానీ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మండల అధికారులకు ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా దయ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇల్లు, స్థలం మంజూరు చేయాలని కోరారు. -
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
నగరి : స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కన ఖాళీ షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఈ విష యం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు భిక్షాటన చేసుకునే వృద్ధుడని తెలుసుకున్నారు. పురపాలక సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి కుప్పంరూరల్ : కుప్పం మండలం కనుమపచ్చార్లపల్లెలో సోమవారం అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన చంద్రప్ప భార్య అమ్మణ్ణమ్మ (45) చిన్న ఒబ్బకు చెందిన వెంకటేష్ పూల తోటలో మృతదేహంగా కనిపించింది. చూసేందుకు హత్యకు గురైనట్లు తెలుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య ఐరాల: మండలంలోని బొమ్మసముద్రం దళితవాడలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాణిపాకం ఎస్ఐ నరసింహులు కథనం మేరకు.. దళితవాడలో మంజుల, రుద్రయ్య(42) దంపతు లు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వైఎస్ గేటు వద్ద అద్దె భవనంలో రుద్రయ్య మెకానిక్గా, భార్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రుద్రయ్య సొంత ఇల్లు నిర్మించడం కోసం కొంతమేర అప్పులు చేశాడు. అలాగే కుమార్తె మాన్విశ్రీ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వేలూరు సీఎంసీలో మరో రూ.5 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టాడు. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా వైఎస్ గేటులో ఉన్న రూమ్కు అద్దె చెల్లించలేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురికావడంతో మధ్యాహ్నం ఇంట్లోనే బాత్రూమ్లో ఉరివేసుకున్నాడు. భార్య మంజుల విధులు ముంగిచుకుని ఇంటికి వచ్చి వేలాడుతున్న భర్తను చూసి కేకలు వేసింది. స్థానికులు వెంటనే రుద్రయ్యను కిందకు దించి కొత్తపల్లె పీహెచ్సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో గుర్తు తెలియని మృతదేహం పుత్తూరు : వీరప్పరెడ్డిపాళెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమ వారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. మృతుడి వయసు సుమారు 55 ఏళ్లు ఉంటుంది. ఒంటిపై చుక్కల బ్లూ కలర్ షర్ట్ ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూడాల ఆందోళన ఉధృతం తిరుపతి తుడా: జూడాల ఆందోళన ఉధృతమైంది. స్టైఫండ్ను 30శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ జూడాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్వీ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలనూ బహిష్కరించారు. నిరసన దీక్ష శిబిరం నుంచి 680 మంది జూనియర్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్ష శిబిరంలో కూర్చుని నినాదాలు మిన్నంటించారు. తమ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని జూనియర్ డాక్టర్లు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్ను పెంచుతూ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గడిచిన ఐదు రోజులుగా ఓపీ సేవలను, తరగతులను బహిష్కరించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అత్యవసర వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణతో రుయా ఆస్పత్రిలో పేదల వైద్యానికి కొంత అంతరాయం ఏర్పడింది. వందలాదిమంది రోగులు అత్యవసర వైద్యం ఓపీ సేవలకు వస్తుంటారు. రోగులకు వైద్యం అందించడంలో జూనియర్ డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తుంటారు. సుమారు 680 మంది జూడాలు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రొఫెసర్లు, సివిల్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్సీ, యూహెచ్సీ వైద్యులు, బీహెచ్ఎంఎస్ వైద్యులు మొత్తం 165 మందిని రంగంలోకి దింపారు. -
విభజనకు అడుగులు
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు జిల్లా పరిషత్కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1959లో సమితులు, తాలూకా లు, జిల్లా బ్లాక్ బోర్డుల ఆధారంగా జెడ్పీ వ్యవస్థ ఆవిర్భవించింది. అనంతరం 1983లో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ వ్యవస్థకు రూపుదిద్దుకోగా, 1986 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 2021 సెప్టెంబర్ 25న జరిగిన జిల్లాపరిషత్ ఎన్నికల్లో గోవిందప్ప శ్రీనివాసులు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన నేతత్వంలోని పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. దీంతో ఉమ్మడి జిల్లాపరిషత్కు తెరపడనుండగా.. మూడు కొత్త జెడ్పీలు అధికారికంగా ఏర్పాటుకానున్నాయి. సీనియారిటీ జాబితా తయారీ జెడ్పీ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 650 మంది ఉదోగ్యులున్నారు. ఇందులో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు 130 మంది, ఏఓలు 79 మంది, సీనియర్ సహాయకులు 135 మంది, జూనియర్ సమాయకులు, టైపిస్టులు 350, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్మన్లు, డ్రెవర్లు 275 మంది ఉన్నారు. జిల్లాపరిషత్, మండల పరిషత్, ఇతర పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనుగుణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ, అర్హత లు, కేడర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసు కుని సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితాల ఆధారంగానే కొత్త జిల్లా పరిషత్లకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు చేపట్టనున్నారు. ఈమేరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా పరిషత్ను త్వరలోనే విభజించనున్నారు. గతంలో చేపట్టిన జిల్లాల డీలిమిటేషన్ ఆధారంగా జెడ్పీని మూడుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమల్లోకి రావడంతో.. సెప్టెంబర్ 25 తర్వాత మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందదులో భాగంగా జిల్లాపరిషత్, మండల పరిషత్ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికలకు సన్నాహాలు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థకీరణలో భాగంగా ఉమ్మడి జిల్లాను చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే అప్పట్లో జిల్లాపరిషత్ల విభజన జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో జెడ్పీల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం నిష్పత్తులను ఖరారు చేయనుంది. -
పోలీస్ గ్రీవెన్స్కు 46 వినతులు
చిత్తూరు అర్బన్ : నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై మొత్తం 46 వినతులు వచ్చినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోపు బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు. గదుల దళారీ ముఠా గుట్టురట్టు తిరుమల: తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది. ఆగస్టు 16న అప్పటికే ఒక గది పొందిన వ్యక్తి మరో గుర్తింపు కార్డుతో తిరిగి గది కోసం క్యూలో నిలబడడాన్ని సీఆర్వో కార్యాలయ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ (32)గా గుర్తించారు. అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్ఫోన్న్ను స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ అనే దళారి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు ఆషిక్ విచారణలో వెల్లడించాడు. ముఠాలోని ఇతర సభ్యులపై విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల–2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డుల ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు, సాంకేతిక ఆధారంగా ముఠా వ్యవహారాలపై పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఎవరైనా దళారి డబ్బు తీసుకుని గది ఇప్పిస్తానని సంప్రదిస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నం.9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నం.155257కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
దందా సాగుతోందిలా..
కంపెనీలు వైద్యులకు ఉచితంగా ఇవ్వాల్సిన శాంపిళ్లను కొందరు కేటుగాళ్లు బహిరంగంగానే మెడికల్ షాపుల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులు, సరిహద్దు గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యవసర సమయాల్లో డాక్టర్ చీటీ లేకుండా కొనే మాత్రలే ఈ అక్రమార్కులకు కామధేనువుగా మారాయి. విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండే తిరుపతి లాంటి విద్యాకేంద్రాల్లో కొన్ని షాపులు యథేచ్ఛగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తునిచ్చే మాత్రలను విక్రయిస్తూ వారి నాశనానికి కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రముఖ కంపెనీల రంగు, ఆకారం, సైజు, చివరికి ప్యాకింగ్ను కూడా అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ తయారు చేసిన నకిలీ ఔషధాలు మార్కెట్లోకి వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఆర్ఎంపీల పేరుతో విచ్చలవిడిగా మందులు, మాత్రలు అమ్మేస్తున్నారు. అధికంగా చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆర్ఎంపీల దందా జోరుగా సాగుతోంది. వీరి ఆగడాలను కట్టడి చేసే వారు లేకపోవడం గమనార్హం. -
రాష్ట్రస్థాయి పోటీలకు ‘కేడీసీ’ విద్యార్థులు
కుప్పంరూరల్ : రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్ షిప్ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు 10 మంది ఎంపికై నట్లు కళాశాల వైస్ చైర్మన్ సాగర్రాజ్ తెలిపారు. ఖోఖోలో కె.దర్శిని, ఎస్.పూజ, ఎం.రమ్య, వెయిట్ లిప్టింగ్లో వి.నరేంద్రదారి, వీఎం ఆదర్శ్, వాలీబాల్ విభాగంలో ఆర్. ఇందుశ్రీ ఎంపికై నట్లు చెప్పారు. అథ్లెటిక్ విభాగంలో వి.అర్చన, జీఎస్ మోనిష్, కె.సుదర్శన్, పీజే అరుణ్ ఎంపికై నట్లు వెల్లడించారు. సోమవారం ఈ మేరకు విద్యార్థుల, పీడీ సుధాకర్ను ప్రిన్సిపల్ డి.సుధారాణి అభినందించారు. టెంపో ఢీకొని యువకుడి దుర్మరణం వి.కోట: మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిపై నెర్నిపల్లె సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. యాలకల్లు పంచాయతీ వైసీ బండపల్లెకు చెందినఅబ్దుల్ రెహ్మన్ (27) బైక్పై పెట్రోల్ బంక్కు వెళ్లాడు. అదే సమయంలో డీజిల్ కోసం వచ్చిన టెంపో ఓ ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి రెహ్మాన్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెహ్మాన్ అక్కడికక్కడే మరణించాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన టెంపో సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. -
శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనుల పరిశీలన
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేది వరకు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను సోమవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్యచౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పుష్కరిణి లోతు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, ఈఈలు సుధాకర్, శ్రీనివాసరావు, డీఈ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబు మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే
కార్వేటినగరం: సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మహిళళలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు రెండు వేలు తీసు కుని ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు చెప్పడం బాధాకరమన్నారు. వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. పేదలకు సేవ లు చేసిన వారికి చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని, డబ్బులున్నవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన టీచర్లు, రెవెన్యూ అధికారులకు చంద్రబాబు తగిన గుణపాఠం నేర్పుతున్నారని మండిపడ్డారు. బాబు ప్రభుత్వం నిర్వాహకంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ముగ్గురు ఉపాధ్యా యులపై సస్పెన్షన్ వేటు వేయడం సబబు కాదన్నా రు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నిస్తున్నవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్బుక్ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. స్కిల్స్కాంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన జస్టీస్ మల్లికార్జునరావుకు ఈ రోజు చంద్రబాబు బహుమానంగా లోకాయుక్తలో నియమించడం దారుణమన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా కింద పేకాటరాయుళ్లకు ఉద్యోగాలు ఉచ్చారని, నిజమైన అర్హులకు ఉద్యోగాలు అందలేదని, దీనికి బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజు ల్లో మహిళలే చంద్రబాబుకు పంగనామాలు పెడ తారని హెచ్చరించారు. -
కొండారెడ్డికి కన్నీటి వీడ్కోలు
తిరుపతి ఎడ్యుకేషన్ : విద్యారంగానికి దశాబ్దాల పాటు దిశానిర్దేశం చేసి, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి అంతిమయాత్రకు అశేష ప్రజానీకం హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. రాయలసీమ ప్రాంత విద్యారంగంలో ఓ శకం ముగిసిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. లెక్చరర్గా పనిచేస్తూ పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందించాలనే సంకల్పంతో రాయలసీమ విద్యాసంస్థలను ఆయన ప్రారంభించారు. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించిన మహనీయుడు కొండారెడ్డి మృతి విద్యారంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఘనంగా నివాళులు తిరుపతి బైరాగిపట్టెడలోని రిమ్స్ విద్యాసంస్థల ప్రాంగణంలో కొండారెడ్డి పార్థివదేహా న్ని ఆదివారం ప్రజల సందర్శనార్థం ఉంచా రు. కడసారి చూసి నివాళులర్పించేందుకు రాయలసీమ వ్యాప్తంగా ఎందరో రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,విద్యాసంస్థల అధినేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రకు తరలివచ్చిన ప్రముఖులు రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి అంతిమయాత్రకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ చింతామోహన్, వైఎస్సార్సీపీ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సుబ్బారెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్ మనూజరెడ్డి, వైద్యులు బలరామరాజు, హాస్పిటల్ అధినేతలు మదన్మోహన్రెడ్డి హాజరై అంజలి ఘటించారు. కొండారెడ్డి అంతిమ సంస్కారాల్లో కుటుంబ సభ్యులు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి తనయుడు వై.ఆనందరెడ్డిని ఫోనులో పరామర్శించారు. కొండారెడ్డి మృతి విద్యారంగానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులకు తీరని లోటన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. తిరుపతిలో సాగుతున్న కొండారెడ్డి అంతిమయాత్ర -
అజ్ఞానజ్యోతి!
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల వికాసానికి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధనా నైపుణ్యాలు పెంచేందుకు ‘జ్ఞానజ్యోతి’ పేరుతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ ప్రచా ర ఆర్భాటానికే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో ఈ శిక్షణ శిబిరాలు అంగన్వాడీ కార్యకర్తలకు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. గొప్పలు చెప్పుకోవడానికే తప్ప, శిక్షణకు వచ్చే సిబ్బందికి కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, జిల్లా ఐసీడీఎస్ శాఖాధికారులు తీవ్రంగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోజనం మీరే తెచ్చుకోండి! జిల్లాలోని చిత్తూరు, జీడీనెల్లూరు, నగరి, పలమనేరు, కుప్పం ప్రాజెక్టుల పరిధిలో వందలాది మంది అంగన్న్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. నిబంధనల ప్రకారం శిక్షణకు హాజరైన వారికి మధ్యాహ్న భోజనం, తాగునీరు, స్నాక్స్, టీ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ‘నిధులు రాలేదు.. ఎవరి భోజనం వారే తెచ్చుకోండి అని ముందే చెప్పేయడం వారి అలసత్వానికి అద్దం పడుతోంది. శిక్షణ ప్రాంగణాల్లో కనీసం కూర్చోవడానికి సరిపడా బెంచీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సగం మందికి పైగా కార్యకర్తలు నేలపైనే కూర్చుని గంటల తరబడి శిక్షణ వినాల్సిన దుస్థితి ఏర్పడింది. తాగడానికి గానీ, అత్యవసరానికి మరుగుదొడ్ల వసతి గానీ లేక మహిళా కార్యకర్తలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పని తిప్పలు కేవలం కార్యకర్తలకే కాకుండా, క్లాసులు చెప్పడానికి వచ్చిన ప్రాజెక్ట్ శిక్షకులు, పర్యవేక్షకులకు (సూపర్వైజర్)లకు సైతం భోజన వసతి కల్పించకపోవడం గమనార్హం. ప్రభుత్వం జ్ఞానజ్యోతి అని పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ, శిక్షణ ప్రాంగణాల్లో కనీస బడ్జెట్ కేటాయింపులపై చూపకపోవడంపై అంగన్న్వాడీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా వివరాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2,318 మినీ అంగన్వాడీ కేంద్రాలు 102 7 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 50,809 మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 29,539 జిల్లాలోని మొత్తం ప్రాజెక్టులు 12క్షేత్ర స్థాయిలో అంగన్్వాడీలకు అవస్థలే! -
ఈ చావుకు బాధ్యులెవరు?
పుత్తూరు: పట్టణంలో గత శుక్రవారం చోటు చేసుకొన్న గోకుల్, విఘ్నేష్ అనే విద్యార్థుల అకాల మరణంపై పెద్ద చర్చే జరుగుతోంది. అది ఒక ప్రమాదం కాదని, ఈ దుర్ఘటనను ఇద్దరు విద్యార్థులు విద్యుత్ తీగలు తగిలి మృతి అంటూ ఒక వార్తగా చదవరాదని పలువురు వాదనలు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ, సామాజిక ఒత్తిళ్లు ఒకవైపు, అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో యువకుల తొందరపాటు, తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం కూడా ఉందంటూ వివరిస్తున్నారు. ఫ్లెక్సీలు కట్టడం చిన్న పని కాదు పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్లు, జాతరలు, రాజకీయ నాయకుల పర్యటనలు అంటూ ప్రతి కార్యక్రమానికీ రోడ్డు పక్కన ఫ్లెక్సీల ఏర్పాటు సాధారణ విషయంగా మారిపోయింది. అయితే వీటిని ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఫోల్స్, రహదారి పక్కన ఉండే గోతులు, వాహనాల ఎత్తు వంటి పలు విధాలుగా మృత్యువు పొంచి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించి యువకులు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు నడుం బిగించాల్సి ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది. రాజకీయ నేతలు చేయాల్సింది ఏమిటీ? నాయకులు, ప్రజాప్రతినిదులు సైతం తమ అభిమానులు ప్రమాదకర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. పరిమిత పరిమాణం, పరిమిత సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలన్న సూచనలు చేయాలి. తమ స్వాగతం కోసం మరొకరి ప్రాణం పోకూడదన్న బాధ్యతగా రాజకీయ నేతలు వ్యవహరించాలి. అధికారుల బాధ్యత ఏదీ? పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫ్లెక్సీల నియంత్రణలో అధికారుల పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారుల బాద్యత ఎంతో కీలకం. అయితే వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రమాదాలకు పరోక్షంగా అవకాశం కల్పిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పండుగైనా, పుట్టిన రోజైనా, రాజకీయ నేతల పర్యటనలైనా ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. అభిమానం ముసుగులో మృత్యువుతో చెలగాటం ఆడుతున్నామన్న ఆలోచనను యువకులు విస్మరిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో కనీస భద్రతా ప్రమాణాలను పాట్టించడం లేదు. దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ తీగలు తగిలి గోకుల్, విఘ్నేష్ అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకొన్న తాజా దుర్ఘటనే ఇందుకు నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలి?.. ఆర్భాటాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలా?.. నిబంధనలు అమలు చేయని అధికారులా?.. అభిమానం పేరిట హద్దులు దాటుతున్న యువకులా?.. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులా? ఎవరు.. ఎవరు అన్న ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు పరిశీలించాల్సిన అంశాలు ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఫ్లెక్సీ ఏర్పాటుకు తగిన రుసుం వసూలు చేసి అనుమతివ్వాలి. అభిమాన ముసుగు.. మృత్యువుతో చెలగాటం! -
కూటికి గండం!
అమాంతం పెరిగిపోయిన బియ్యం ధరలు జిల్లాలో బియ్యం ధరలను అమాంతం పెంచేశారు. అంతర్జాతీయ యుద్ధాలు, ఎల్నినో కారణాలను సాకుగా చూపి బస్తాపై రూ.500 వరకు అధనంగా గుంజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనలేక కుమిలిపోతున్నారు. ధరలు నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుండగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా తమకెందుకులే అన్నట్టు మిన్నకుండిపోతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా దోచేస్తూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటికి గండం వచ్చిపడింది. భోజన పళ్లెంపై ధరల పిడుగు పడింది. గడిచిన మూడు నెలలుగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అడ్డుకోవాల్సిన ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండగా.. వ్యాపారులు ఇదే అదునుగా దోపిడీకి తెరదీస్తున్నారు. సిండికేట్? ఇతర జిల్లాలకు చెందిన వ్యాపార సిండికేట్ ఈ బియ్యం దందాను నడిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లోకి సరఫరాను కావాల నే తగ్గిస్తూ, ధరలను అమాంతం పెంచుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఇక ఎగుమతుల పేరుతో ఇక్క డ కొరత సృష్టిస్తూ..బియ్యం ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. మరోవైపు వరిధాన్యం పండించొద్దని కూటమి ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది. ఇటీవల ఒక సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసలు బియ్యం తినేవారే లేరన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ వైపు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, మరోవైపు వ్యాపారుల అక్రమ నిల్వలతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. నిఘా వ్యవస్థ ఏదీ? బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నా రెవెన్యూ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖలు తనిఖీల పేరిట కనీసం క్షేత్ర స్థాయికి రాకపోవడం వెనుక పెద్ద గూడు పుఠాణీ ఉందనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వ్యాపారులకు వరంగా మారింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి బియ్యం సిండికేట్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, రీటైల్ ధరలను అదుపులోకి తీసుకురావాలని వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాత బియ్యం మాయం జిల్లాలో 4వేల మందికి పైగా బియ్యం వ్యాపారులున్నారు. దీంతో పాటు పల్లెల్లో వ్యాపారాలు చేసుకునే వారు కూడా వేలల్లో ఉన్నారు. సాధారణంగా ప్రజలు అన్నం వండుకోవడానికి పాత బియ్యానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే, మార్కెట్లో పాత బియ్యం దొరక్కుండా కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు, ఆ సాకుతో కొత్త బియ్యం ధరలను కూడా అమాంతం పెంచేశారు. ధరల మంట నుంచి ఉపశమనం పొందేందుకు రైతు బజార్ వైపు వెళ్లిన ప్రజలకు అక్కడ కూడా తీవ్ర నిరాశే ఎదురవుతోంది. బహిరంగ మార్కెట్లోని ధరలకు, రైతు బజార్ లోని ధరలకు పెద్ద తేడా లేకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. -
మళ్లీ తమ్ముళ్లకే కిక్కు?
చిత్తూరు అర్బన్: మద్యం కిక్కు మరో రెండేళ్ల పాటు తెలుగు తమ్ముళ్లకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏర్పాటైన ఉప సంఘ కమిటీ మద్యం దుకాణాల లైసెన్సునులను ఇప్పుడున్న వ్యాపారులకు 2029 వరకు పొగిడిస్తే మంచిదని ప్రభుత్వానికి సూచించడంతో.. జిల్లాలో 113 మద్యం దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. దరఖాస్తు లేదు.. డిప్పు ఉండదు జిల్లాలో 2024 గతేడాది అక్టోబర్లో నిర్వహించిన మద్యం దుకాణాల లైసెన్సుల ప్రక్రియలో నాన్–రీఫండబుల్ దరఖాస్తు రుసుము కింద మాత్రమే ప్రభుత్వానికి రూ.45 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక నెలకు మద్యం విక్రయాల దాదాపు రూ.70 కోట్లు, లైసెన్సు ఫీజుల ద్వారా దాదాపు రూ.133 కోట్ల ఆదాయం లభించింది. పర్మిట్ గదుల పేరిట రూ.3 కోట్లు అధనపు ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం దరఖాస్తులే చేసుకోకుండా, లక్కీడిప్ వేయకుండా ఏకపక్షంగా దుకాణాలను పాత లైసెన్సులకే కట్టబెట్టడానికి నిర్ణయం తీసేసుకున్నారు. నష్టం లేని వ్యాపారం నష్టాలు చవిచూడని వ్యాపారం, వాస్తుతో అవసరం లేకుండా రూ.కోట్లు కుమ్మరించే వ్యాపారం ఏదైనా ఉందా..? అంటే ఒక్క మద్యం వ్యాపారం మాత్రమే. ఇందులో నష్టపోయామని ఏ ఒక్కరూ చెప్పే పరిస్థితేలేదు. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే లాభాలు 14 శాతం, ఇక ఎమ్మార్పీ ఉల్లంఘించడం, సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో ఏ ఒక్క వ్యాపారిని నష్టాల ఊబిలో పడేసినట్లు దాఖలులేదు. అయినా సరే వీళ్లకే మరో రెండేళ్ల పాటు లైసెన్సులు రెన్యూవల్ చేయడానికి రంగం సిద్ధమవడం. ఈ రంగంలోకి వెళ్లాలనుకునే వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే 2028 అక్టోబర్ వరకు కొత్త వ్యాపారులకు మద్యం దుకాణాల లైసెన్సులను తీసుకోవడంలో ప్రవేశం నిషిద్ధం అన్నమాట..! ప్రైవేటుకు దారులు గత ప్రభుత్వ హయంలో దుకాణాల నిర్వహణ మొత్తం అప్పటికే ప్రభుత్వమే చూసుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలకు తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఉపాధి చూపించే వనరులుగా మార్చేసి, మళ్లీ ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరతీసింది. 2024 అక్టోబర్లో జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సులను కేటాయించింది. ఆపై 50 శాతం లైసెన్సు రాయితీతో 9 దుకాణాలకు కల్లుగీత సామాజిక వర్గాలకు ఇచ్చింది. వీటన్నింటిని లైసెన్సులు వచ్చే నెలతో ముగియనున్నాయి. ఈ తరుణంలో 90 శా తం లైసెన్సులు దక్కించుకున్న అధికార పా ర్టీ నేతలకు లబ్ధి చేకూర్చేలా, రెన్యూవల్ పే రిట నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ లెక్కన ప్రభుత్వ ఆ దాయానికి భారీగా గండి పడగా.. తమ్ము ళ్ల కు మంచి ఆదాయ వనరుగా మారనుంది. -
అల్లుడే యముడయ్యాడు!
పూతలపట్టు(యాదమరి): బంధుత్వానికి విలువ ఇచ్చి, తన కుమార్తెను చేతి లో పెట్టాడు ఆ మామ. ఏడు అడుగులు వేయించి, బంధాన్ని ముడివేస్తే... చివరకు అదే చేతులతో తన ప్రాణాలు తీస్తాడని ఆ వృద్ధుడు ఊహించలేకపోయాడు. సీమంతం వేడుకకు వచ్చిన అల్లుడు ఆ ఇంట్లోనే యముడిలా మారి మామను కిరాతకంగా హతమార్చాడు. కన్న కూతురినిచ్చి..! పూతలపట్టు మండలం, రంగంపేటకు చెందిన దినసరి కూలీ సుబ్రమణ్యం (60) తన పెద్ద కుమార్తె బంధువైన అశోక్కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించాడు. బతుకుదెరువు కోసం దుబాయ్లో పనిచేస్తున్న అశోక్, రంగంపేటలోని బావమరిది భార్య సీమంతం వేడుక కోసం ఇటీవల ఊరికి వచ్చాడు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకు న్న సమయంలో ఆన్లైన్ రమ్మీ వ్యసనం వారి కొంపముంచింది. ఏడు అడుగులు వేయించిన చేతులే... ఆదివారం తెల్లవారుజామున 5 గంటలవుతున్నా నిద్రపోకుండా ఫోన్న్లో ఆన్న్లైన్ గేమింగ్ ఆడుతు న్న అశోక్ను మామ సుబ్రమణ్యం మందలించాడు. కన్న తండ్రిలా హితవు పలికిన మామ మాటలకు ఆవేశంతో రగిలిపోయిన అశోక్ విచక్షణ కోల్పోయా డు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అల్లుడే ఉన్మాదిలా మారాడు. వృద్ధుడని కూడా చూడకుండా సుబ్రమణ్యంపై దాడి చేసి కింద పడేశాడు. ఏ చేతులతోనైతే పవిత్ర బంధాన్ని ముడివేశాడో, అదే చేతులతో మామ గుండెలపై ఎక్కి కూర్చుని పిడుగుద్దులతో బలంగా బాదాడు. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్ర విషాదంలో కుటుంబం సీమంతం వేడుకతో మురిసిపోవాల్సిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కన్న తండ్రిని కోల్పోయిన కుమార్తెలు, కళ్లముందే భర్త రాక్షసత్వాన్ని చూసిన భార్య రోదనలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వెంకటగిరి సమీపంలో అరెస్ట్ చేశారు. పూతలపట్టు సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకం చిత్తూరు కలెక్టరేట్ : స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డీఆర్వో మోహన్కుమార్ కొనాయాడారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనంలో సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఆర్వో ముందుగా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహంతో పాటు స్వాతంత్య్రోద్యమంలో లచ్చన్న చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. పదవులు ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీ బాషా, జిల్లా మత్స్య శాఖాధికారి జి.జే.ప్రమోదమల్లె, విశ్రాంత ఎకై ్సజ్ సీఐ ఈశ్వరయ్య, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కా రం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారి పై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలపండి చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా విధులకు నల్ల రిబ్బన్లతో తమ నిరసన తెలుపాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టెట్ మినహాయింపు కోరుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. సస్పెన్స్లను ఎత్తివేసి వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వివరణ సైతం అడుగక ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టిన కడప డీఈఓ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వినూత్నంగా ఎఫ్ఏ–1 పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలను మరింత పకడ్బందీగా, వినూత్నంగా నిర్వహించేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 1.19 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 80 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. బుక్లెట్ విధానం ఈ ఏడాది ఎఫ్ఏ–1 పరీక్షల కోసం ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా బుక్లెట్ అందించనున్నారు. విద్యార్థి వ్యక్తిగత వివరాలు, సంభాషణ, వివేచనాత్మక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, అపాల్ ఐడీ, సృజనాత్మక ప్రాజెక్టులు, రాత అంశాలు, సాధించిన మార్కులు, గ్రేడింగ్ విధానం వంటివన్నీ ఈ బుక్లెట్లో ముద్రించి ఉంటాయి. ఉపాధ్యాయులకు సూచనలతో పాటు సమాధానాల మూల్యాంకనానికి ఓఎంఆర్ పత్రాన్ని పొందుపరిచారు. పరీక్షా సమయాలు, షెడ్యూల్ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు (ఆగస్టు 17 –19) ఉదయం సెక్షన్న్లో 9.30 నుంచి 10.45 గంటల వరకు, మధ్యాహ్నం సెక్షన్లో 1.15 నుంచి 2.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు (ఆగస్టు 17–20) మొదటి సెక్షన్ (ఉదయం) 9.30 నుంచి 10.45 గంటల వరకు, రెండో సెక్షన్ (ఉదయం) 11.00 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, మూడో సెక్షన్ (మధ్యాహ్నం) 1.15 నుంచి 2.30 గంటల వరకు, నాలుగో సెక్షన్ (సాయంత్రం)2.45 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. -
గంజాయి స్మగ్లర్పై పీడీ యాక్ట్
చిత్తూరు అర్బన్: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాత నేరస్తుడిపై చిత్తూరు పోలీసులు పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) నమోదు చేశారు. నగరంలోని అశోకపురం ప్రాంతానికి చెందిన అల్లా బకా ష్ అలియాస్ షేక్ బకాస్ (36)పై ఈ కఠిన చర్యలు తీసుకు న్నట్లు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. పోలీసుల కథనం ప్రకా రం... అల్లా బకాష్పై చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్లలో దాదాపు ఆరు గంజాయి విక్రయాల కేసులు నమోదై ఉన్నాయి. గతంలో పలుమార్లు ఇతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించినా, ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపో గా గంజాయి స్మగ్లింగ్ను కొనసాగించాడు. నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కోరుతూ పోలీసులు జిల్లా కలెక్టర్కు సమగ్ర నివేదికను సమర్పించారు. నివేదిక పరిశీలించిన కలెక్టర్ పీడీ యాక్ట్ నమోదుకు అనుమతించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమో దు చేసి, ఆదివారం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ...యువతచెడు సావాసాలు, మాదకద్రవ్యాల రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. -
ఎలా సాకేది దేవుడా!
బంగారుపాళెం: ‘మాటలు రాని కూతుర్ని అల్లారు ముద్దాగా చూసుకున్నావు.. పిల్లలపై చిన్న ఈగ వాలకుండా పెంచుకున్నా వు. ఇప్పుడు వాళ్లందర్నీ దూరం చేసి వెళ్లా వు. నువ్వులేకుండా వాళ్లు ఎలా బతుకుతా రు. నేను ఎలా సాకగలను దేవుడా..! అంటూ మృతుడు చిన్నస్వామి భార్య భారతి గుండెలు పగిలేలా రోదించడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. ఆవునువెతుక్కుంటూ వెళ్లిన ఓ కుటుంబ యజమాని వేట గాళ్ల ఉచ్చుకు బలవ్వగా.. అతని మృతితో నలు గురు బిడ్డలు, భార్య అనాథలై రోడ్డన పడ్డా రు. ఈ విషాద ఘటన మండలంలోని గుంతూరు అటవీ సరిహద్దులో గల ఓ మామిడితోటలో చోటు చేసుకుంది. వివరాలు.. గుంతూరు యానాది కాలనీకి చెందిన చిన్నస్వామి(40)కి భార్య భారతి, ఇద్దరు మగపిల్లలు ధనంజయ(12), హరికృష్ణ (11), ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) కావ్య (7), కావ్యశ్రీ(7) ఉన్నారు. కావ్యశ్రీ దివ్యంగురాలు. మాట లు రావు. చిన్నస్వామికి రెండు ఎకరాలు మెట్ట భూమి (డీకేటీ) ఉంది. అందులో నీటి వసతి లేకపోవడంతో పంటలు పండవు. మూడు పాడి ఆవులను మేపుకుంటూ.. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆవును వెతుక్కుంటూ వెళ్లి శనివారం పాడి ఆవుల్లో ఒకటి మేతకు తీసుకువెళ్లిన క్రమంతో తప్పిపోయింది. సాయంత్రం ఆవును వెతుక్కుంటూ నరసింహులునాయుడు మామిడితోట వైపు చిన్నస్వామి వెళ్లాడు. అక్కడ గుర్తుతెలియ ని వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన కరంటు తీగకు కాలు తగులుకుని చిన్నస్వామి మృతి చెందాడు. చిన్నస్వామి గ్రామంలో ఎవరు కూలి పనులకు పిలిచినా వెళ్లే వాడని, చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి అకాలంగా మృతి చెందడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. మృతి చెందిన చిన్నస్వామి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆవును వెతుక్కుంటూ.. అనంతలోకాలకు -
మహిళల్ని అవమానిస్తావా బాబూ?
నగరి: మహిళలు ఎవరు ఏమి ఇచ్చినా వెంపర్లాడే వారిలా, డబ్బుకు ఆశ పడేవారిలా చిత్రీకరిస్తూ, అమ్మా.. మీరు ఓటుకు రూ.2 వేలు తీసుకున్నారు!.. ఇచ్చిన వాడు లక్షలు సంపాదించుకోవాలనుకుంటాడు అని మహిళలను అవమానించిన సీఎం చంద్రబాబు తక్షణం వారికి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఆదివారం నగరిలోని తన నివాసంలో ఆమె మీడియా తో మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి డబ్బులిచ్చి ఓట్లు కొన్నామని మహిళలతోనే చెప్పడం సిగ్గు చేటన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలనే డబ్బుతో కొని, ఎన్టీఆర్పైనే చెప్పులు వేయించిన ఘటనను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నోటుకు ఓటు వీడియోతో అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అన్న కేసీఆర్ మాట నేడు అక్షర సత్యమన్నారు. డబ్బుతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ఎవరికై నా ఎప్పుడైన వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎన్నికల సమయంలో జగనన్న ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానంటూ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పచ్చ మీడియాకు అదే డబ్బు ఇచ్చి హామీలను నెరవేర్చినట్లు చూపించుకుంటున్నారని ఆరోపించారు. లక్ష కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రెండెకరాల చంద్రబాబు ఈరోజు లక్ష కోట్లకు అధిపతి ఎలా అయ్యారని రోజా ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ పిల్లికి భిక్షం పెట్టని వ్యక్తి, తన హక్కులా ఇక్కడి సహజ వనరులైన గ్రావెల్, ఇసుక, గ్రానేట్ను అక్రమంగా తరలిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. పీఆర్పీని ఎలా భూస్థాపితం చేసారో, జనసేనను ప్యాకేజీతో మేనేజ్ చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వీధికొక బెల్ట్ షాపు పెట్టడం ద్వారా మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. కుప్పంలో గంజాయి సాగు, హోంమంత్రి నివాస సమీపంలో గంజాయి సాగు నిజం కాదా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.2.4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 31 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. ఇక్కడ దోచుకొన్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేవారని, ఓటుకు డబ్బు తీసుకున్నారంటూ అవమానించిన చంద్రబాబు మహిళలకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవినీతి, ఆరాచకలాను గమనిస్తున్న ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యల పై వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన సూచించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చని, ఉదయం 10.30 నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ పేర్కొన్నారు. కళాకారులు దరఖాస్తు చేసుకోండి కాణిపాకం: శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం దేవస్థాన ఆస్థాన మండపంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలూ లేకుండా దిగ్విజయంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగస్వాములై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలనుకునే కళాకారులు తమ దరఖాస్తులను దేవస్థాన కార్యాలయానికి పంపాలని అధికారులు సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల ఆఖరి తేదీగా నిర్ణయించారు. తర్వాత వచ్చే ఎలాంటి దరఖాస్తులనూ స్వీకరించబోరని స్పష్టం చేశారు. గౌతు లచ్చన్నకు పోలీసుశాఖ నివాళి చిత్తూరు అర్బన్: దేశ స్వాతంత్య్రంతో పాటు రైతు–కూలీల సంక్షేమం కోసం పోరాటం చేసిన గౌతు లచ్చన్నను స్మరించుకోవడం అందరి బాధ్యత అని చిత్తూరు పోలీసుశాఖ ఏఆర్ డీఎస్పీ మహబూబ్బాషా తెలిపారు. లచ్చన్న 117వ జయంతి నేపథ్యంలో ఆదివారం చిత్తూరులోని పోలీసు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో గౌతు లచ్చన్న చిత్రపటానికి పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,699 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,884 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమ ర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్ర వేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది. సోలార్ విద్యుత్తుకు పెద్దపీట తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సోలార్ విద్యుత్కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల 2.07 లక్షల గృహాలపై 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 1.06 లక్షల గృహాల్లో 214 మెగావాట్ల మేర ఏర్పాటు చేసినట్లు తెలి పారు. కుప్పం నియోజకవర్గంలో 39,215 బీసీ గృహాలకు 78.43 మెగావాట్ల రూఫ్టాప్ సోలా ర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ద్వారా 1.35 లక్షల పంపు సెట్లకు 610 మెగావాట్ల సౌర విద్యుత్ అందించే పను లు జరుగుతున్నాయని చెప్పారు. వినియోగ దారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 62 నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, 13.20 లక్షల స్మార్ట్ మీటర్ల లక్ష్యంలో ఇప్పటికే 10.74 లక్షలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బెస్ట్ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ తదితర విభాగాల్లో సీఎండీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఎంపీ మిథున్రెడ్డి అయ్యప్ప మాల ధారణ తిరుపతి కల్చరల్: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి శనివారం అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. ఈ మేరకు శ్రీకపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని పుణ్యస్నానం ఆచరించి ఆలయ అర్చకుడిచేత అయ్యప్ప స్వామి వారి దీక్ష మాల స్వీకరించారు. అనంతరం శ్రీకపిలేశ్వరస్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
కలెక్టర్ ఆదేశాలకూ విలువ లేదా?
నగరి: మండలంలోని అడవికొత్తూరు గ్రామంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అడవికొత్తూరులో పర్యటించిన ఆమె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. వర్షం పడిన ప్రతిసారీ కొండ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు గ్రామంలోకి చేరి ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, తమ ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆమె వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డ్రైనేజీ, సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను ఎంపీపీ నిధులతో మంజూరు చేయించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే అధికారిక అనుమతులు ఉన్నప్పటికీ సంబంధిత ఏఈ హరి పనులను అడ్డుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పనులు ప్రారంభించిన తర్వాత కూడా వాటిని పూడ్చివేసి తిరిగి పనులు జరగకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. కలెక్టర్ ఆదేశాలే అమలు కాకపోతే ఇక అధికార వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని రోజా ప్రశ్నించారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పనులను అడ్డుకుంటున్న అధికారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వర్షాకాలం తీవ్రత పెరగకముందే డ్రైనేజీ, సీసీ రోడ్డు, కల్వర్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో పేద ప్రజల ఇళ్లలోకి వర్షపు నీరు చేరే పరిస్థితిని కొనసాగనివ్వబోమన్నారు. పేదల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదల సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని పనులను అడ్డుకుంటున్న అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. అడవికొత్తూరు ప్రజలకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్ఎంపీపీ కన్నియప్ప, స్థానిక నాయకులు భాస్కర్, వేలు, రోశమ్మ, యుగంధర్, గురురెడ్డి, ఏకాంబరం, తనికాచలం తదితరులు పాల్గొన్నారు. -
వేడుకలపై విమర్శ
కొత్తదనం లేని ప్రదర్శనలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. దేశ స్వాతంత్య్ర ఫలాలను, సాధించిన ప్రగతిని ప్రతిబింబించాల్సిన ఈ కార్యక్రమం కాస్త అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం, అరకొర ఏర్పాట్ల వల్ల ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ముందస్తు ప్రణాళిక కరువై, స్వార్థ ప్రయోజనాలు పడగ విప్పడంతో ఈ ఏడాది ఉత్సవాలు కేవలం యధాతథ కార్యక్రమంగా, అపహాస్యంగా ముగిశాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సిఫార్సులకే ప్రశంసా పత్రాలు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అందించే ప్రశంసాపత్రాల పంపిణీ ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారింది. నిజాయితీగా, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన సిబ్బందిని విస్మరించి, పాలకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే పలుకుబడి ఉన్న వ్యక్తులకే అవార్డులు కట్టబెట్టారు. మొత్తం 424 మందికి ప్రశంసాపత్రాలు అందజేయగా, ఇందులో అత్యధిక భాగం ముందస్తు సిఫార్సులు ఉన్నవారికే దక్కాయి. వేడుకలు జరుగుతున్న సమయంలోనూ మధ్యమధ్యలో కొత్త పేర్లను చేర్చుతూ అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఎంతోమంది అధికారులు శ్రమిస్తుంటే, కేవలం నలుగురు ఉన్నతాధికారులకే అవార్డులు పరిమితం చేయడంపై మిగిలిన అధికారులలో లోలోపలే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ తిష్ట... కేడర్ లేని నేతల హల్చల్! ప్రభుత్వ వేడుకగా జరగాల్సిన ఈ అధికారిక కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన పసుపు నేతల జోక్యం హద్దులు దాటింది. కేడర్, ఎలాంటి అధికారిక హోదా లేని నేతలు సైతం వీఐపీ గ్యాలరీల్లో తిష్ట వేసి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తమ అనుచరులకు అవార్డులు ఇప్పించుకోవడానికి చివరి నిమిషం వరకు సిఫారసులతో హడావుడి చేశారు. నిర్వహణ లోపం... అవమానంతో వెనుదిరిగిన ఉత్తమ ఉద్యోగులు! కలెక్టరేట్ అధికారుల పర్యవేక్షణా లోపం, సమన్వయలేమి పరేడ్ మైదానంలో స్పష్టంగా కనిపించాయి. ప్రశంసాపత్రాల అందజేతలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకరి పేరుకు మరొకరికి సర్టి ఫికెట్లు మార్చి ఇవ్వడం, పేర్లు తప్పుగా చదవడం వంటి ఘటనలతో అవార్డు గ్రహీతలు విస్తుపోయారు. జిల్లా స్థాయిలో దక్కే గుర్తింపు కోసం ఎంతో ఆశగా, కుటుంబ సమేతంగా వచ్చిన నిజమైన ఉత్తమ ఉద్యోగులకు తీవ్ర అవమానం ఎదురైంది. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిరసనగా కొందరు ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రశంసాపత్రాలను తీసుకోకుండానే వేదిక వద్ద నుంచి అసంతృప్తితో వెనుదిరిగారు. ప్రతి ఏడాదీ ఎంతో అట్టహాసంగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఏళ్లుగా చూస్తున్న పాటలు, అవే నృత్యాలు, అవే పాఠశాలల విద్యార్థులతో వేదికను కానిచ్చేశారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు వేదికపై అవకాశం దక్కలేదు. కళాత్మకత కంటే ప్రైవేట్ విద్యాసంస్థల పరోక్ష ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రయోజనాల కోసం సాంస్కృతిక విభాగాన్ని వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు, శాఖల ప్రగతిని చాటే శకటాల ప్రదర్శనలోనూ ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. గత ఏడాది ప్రదర్శించిన నమూనాలనే చిన్నపాటి మార్పులతో మళ్లీ తీసుకొచ్చి మమ అనిపించేశారు. -
అగ్నికి ఆహుతైన పూరిగుడిసె
● కాలి బూడిదైన వంట సామగ్రి ● సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం పెద్దపంజాణి: అప్పటివరకు కుటుంబానికి ఆశ్రయంగా ఉన్న ఆ పూరిగుడిసె.. ఒక్కసారిగా చెలరేగిన మంటలకు ఆహుతై ఆ కుటుంబాన్ని కట్టు బట్టలతో వీధిన పడేలా చేసింది. ఈ సంఘటన మండలంలోని రాయలపేట గ్రామం కరమలవీధిలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కరమలవీధికి చెందిన కే.సరస్వతమ్మ, కుమారుడు కుమారాచారితో కలసి కూలి పనులు చేసుకుంటూ పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. కుమారుడు పనుల నిమిత్తం బయట కు వెళ్లడంతో సరస్వతమ్మ ఇంటి ముందు నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం వేకువజాము న ఇంటిపై మంటలు ఒక్కసారిగా వేగంగా వ్యాపించడంతో గుడిసె పైకప్పు, దూలాలు, గోడలు పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఉన్న వంట సామగ్రి, పాత్రలు, ఇతర గృహోపకరణాలు సైతం మంటలో చిక్కుకుని కాలిబూడి దయ్యాయి. గుడిసె ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామాగ్రి కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గు రైంది. మంటలు ఎలా చెలరేగాయన్న విష యం తెలియాల్సి ఉండగా, ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆస్తి నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్స్ప్రెస్ హైవే పక్కన మంటలు గుడిపాల: చైన్నె–బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవే ఆనుకుని మంటలు చెలరేగాయి. హైవేని ఆనుకుని అధికారులు పచ్చిగడ్డిని పెంచారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో గడ్డి ఎండిపోయింది. 189కొత్తపల్లె సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవే ఆనుకొని ఆకతాయిలు అగ్గి పెట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం వాహనాలు పెద్దగా పోవకపోవడంతో ప్రమాదాలు తప్పింది. స్థానికులు గమనించి మంటలను అదుపు చేశారు. -
అంతర్జాతీయ కరాటే పొటీలకు ఎంపిక
గంగవరం: మండలంలోని మదర్థెరిసా డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యా ర్థిని పవిత్ర అంతర్జాతీయ కరాటే పొటీలకు ఎంపికై నట్టు కళాశాల కరస్పాండెంట్ రవీంద్రబాబు శనివారం తెలిపారు. గతంలో మైసూరులో జరిగిన జాతీయ పోటీలో పాల్గొని విజయం సాధించడంతో పాటు వచ్చే సెప్టెంబర్ నెలలో జపాన్లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. పుంగునూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న గణపతి కుమార్తె పవిత్ర తన 11వ ఏట నుంచి కరాటేలో ప్రతిభ కనబరుస్తూ అనేకసార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించి అనేక పథకాలు సొంతం చేసుకోవడం జరిగిందన్నారు. గత ఏడాదిలో జాతీయ స్థాయి చాంపియన్షిప్ సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు వీలు కాలేదన్నారు. దీంతో జపాన్లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనడం కోసం కళాశాల యాజమాన్యం తరఫున రూ.50వేలు విద్యార్థినికి అందించినట్టు తెలిపారు. ఈ విద్యార్థిని కళాశాల చైర్మన్ సునిల్, అకడమిక్ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన్రావు, అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు కలిసి అభినందించారు. -
వ్యక్తి అదృశ్యం
బంగారుపాళెం: మండలంలోని గాండ్లపల్లెకు చెందిన హేమచంద్రపిళ్లై గత మూడు రోజులుగా కనిపించడంలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. హేమచంద్రపిళ్లె మొగిలి శ్రీనిపుడ్స్ ఆవరణలోని వైవై న్యూడిల్స్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం పనికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లాడని తెలిపారు. మూడు రోజులైనా ఇంటింకి రాకపోవడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిని, బంధువులు, స్నేహితులను విచారించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హేంచంద్రపిళ్లె ఆచూకీ తెలిసిన వారు 9440796736 నంబరుకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. -
ఉత్తమ సేవలకు ప్రశంస
అనుపమ, ఆర్డీవో, నగరి ఉమామహేశ్వరి, జేడీ, పశుసంవర్ధకశాఖనరసింహప్రసాద్, చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్సూరిబాబు,జిల్లా పరిశ్రమల అధికారిశేషగిరిరావ్, తహసీల్ధార్, కలెక్టరేట్. సీతారామ్, తహసీల్ధార్, గుడుపల్లి రవికుమార్, తహసీల్ధార్, నగరిచంద్రశేఖర్,డీటీ, వెదురుకుప్పంరాజశేఖర్రాజు, నాన్ కేడర్ ఎస్పీశ్రీలక్ష్మీ, పలమనేరు ఆర్డీవో కార్యాలయంసాయిరాకేష్, కలెక్టర్ సీసీశ్రీనివాసరావ్, మహిళా స్టేషన్ డీఎస్పీ మహబుబ్భాషా, డీఎస్పీ ఏఆర్ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, చిత్తూరుమురళి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రభాకర్, ఎస్డీపీవో (పలమనేరు) మహబుబ్భాషా, ఏఎస్పీ(అడ్మిన్)షాను, ఏఎస్పీ (ఆపరేషన్స్)వెంకటనారాయణ, ఎస్డీపీవో(చిత్తూరు) చిత్తూరు కలెక్టరేట్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, సేవా పతకాలు అందించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషా ర్ డూడి, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 424 మందితో పాటు పబ్లిక్ అవార్డులు మరో 50 మందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. -
బాబును నమ్మిన టీచర్ల పరిస్థితి అగమ్యగోచరం
● రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిన సీఎం తిరుపతి మంగళం : చంద్రబాబు ఉద్దరిస్తాడని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి మారుతీ నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. టెట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు, ఉద్యోగుల తిరుగుబాటు మొదలైందన్నారు. డీఎస్సీ ఉద్యమం తీవ్ర తరం ఢిల్లీలో నీట్ లీకేజీపై చేపట్టిన ఉద్యమం తరహాలో రాష్ట్రంలో డీఎస్సీ అవినీతిపై తీవ్రతరం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కుమారుడు లోకేష్ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొంతమంది టీచర్లను ప్రేరేపించి తిరుగుబాటు ఉద్యమం చేయించడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారన్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి ఈశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బోరు లారీ – మహిళ మృతి, మరొకరికి తీవ్రగాయాలు బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంగారుపాళెం పంచాయతీ వడ్డూరు గ్రామానికి చెందిన రాజేష్ భార్య మల్లేశ్వరి, మల్లేశ్వరి అక్క కుమారుడు విజయకుమార్ ద్విచక్రవాహనంపై కర్ణాటకలోని నంగిలిలో బంధువుల కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మొగిలి ఘాట్ వద్ద పలమనేరు నుంచి రాగిమానుపెంట గ్రామానికి పోతున్న బోరు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేశ్వరి(35) సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన విజయకుమార్ను హైవే అంబులెన్స్ వాహనంతో సిబ్బంది చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. చికిత్సపొందుతున్న విజయకుమార్ ప్రమాదంలో మృతి చెందిన మల్లేశ్వరి -
ప్రేమించి.. వంచించి..
– బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు గంగవరం: ప్రేమించి మోసం చేయడంతో ఓ యువతి ఫిర్యాదు మేరకు మోసగించిన వ్యక్తిపై గంగవరం పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు మండలంలోని గండ్రాజుపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఆంజి అనే యువకుడు ఇద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆ యువకుడు తన ప్రేమను నిరాకరించి పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ బాధితురాలు పేర్కొన్నారు. దీంతో ఆమె గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి గుడిపాల: ట్రాక్టర్ ఢీకొని ఓవ్యక్తి మృతి చెందిన ట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. శనివారం అడవిచేను గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన పొలానికి చెరువులో మట్టిని తోలుకుని వెళుతుండగా చెరువు సమీపంలో ఓ ప్రాంతంలో మిట్టగా ఉండడంతో ట్రాక్టర్ ఎక్కలేక వెనక్కు వచ్చేసింది. ఇంతలో వెనుక ద్విచక్ర వాహనంలో అడవిచేను గ్రామానికి చెందిన ఆర్ముగం(65)తన పొలం వద్ద నుంచి వస్తుండగా వెనుకవైపు ఢీకొనడంతో ట్రాక్టర్ టైర్ అతని తల పై ఎక్కడంతో అక్కడే మృతిచెందాడు. కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన కేంద్రం ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన కేంద్రం శనివారం జిల్లా శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా రెడ్క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్, ఎంవీ కేశవరెడ్డి మెమెరియల్ పౌండేషన్ వ్యవస్థాపకులు ఎంవీ శ్రీధర్రెడ్డి రూ.1.30 లక్షలు విలువ చేసే ఎలక్ట్రికల్ బైకును కేంద్రానికి వితరణగా అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు తేజోమూర్తి, ఉపాధ్యక్షులు గోవర్థన్బాబి, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. తండ్రిని హత్యచేసిన తనయుడి అరెస్టు శ్రీరంగరాజపురం: మద్యం సేవించేందుకు డబ్బు లు ఇవ్వలేదని తండ్రిని హత్యచేసిన కుమారుడిని అరెస్టుచేసినట్లు కార్వేటినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ హనుమంతప్ప మాట్లాడుతూ 13వ తేదీ రాత్రి క్షీరసముద్రం గ్రామంలో ఉంటు న్న ఆనంద్నాయుడును అతని పెద్ద కుమారుడు జ్యోతీష్ మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కక్షతో ఇంట్లో ఉన్న కత్తితో దారుణంగా పొ డిచి చంపాడని తెలిపారు. అడ్డుకునేందుకు వచ్చి న మేనత్త గీత తలపై కూడా తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. దీంతో వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేయగా శనివారం జ్యోతీష్ను అరెస్టుచేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ సుమన్, సిబ్బంది ఉన్నారు. సంతాపం చిత్తూరు(కార్పొరేషన్): రాయలసీమ విద్యాసంస్థల అధినేత కొండారెడ్డి మృతిపట్ల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వారు ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. -
కొండారెడ్డి విద్యా సేవలు చిరస్మరణీయం
తిరుపతి ఎడ్యుకేషన్ : కొండారెడ్డి రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై.కొండారెడ్డి శనివారం కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మేధావులు, నగర ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆరు దశాబ్దాలకుపైగా తన జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అలాగే ఫీజులు చెల్లించలేని ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పించాని ప్రశంసించారు. భూమన నివాళి రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి శనివారం రాత్రి బైరాగిపట్టేడలోని తన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. కొండారెడ్డి తనయుడు ఆనందరెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
స్వేచ్ఛా గీతిక
జిల్లా అంతటా రెపరెపలాడిన త్రివర్ణపతాకం పట్టపగలు మూడు రంగుల వెన్నెల కురిసింది. వందేమాతరం అని విన్న ప్రతిసారీ జనం గుండె ఝల్లుమంది. జనగణమన జన గళమున సగర్వంగా పలికింది. జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. విద్యార్థుల ప్రదర్శనలు, శకటాల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుతో ఉత్సవం ఉత్సాహంగా సాగింది. చిత్తూరు కలెక్టరేట్ : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దళాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసు వాహనంపై మంత్రి, కలెక్టర్, ఎస్పీ కవాతు చేపట్టారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. ఎందరో నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ.. ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సత్యకుమార్యాద వ్ అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పీ4 కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలివీ.. ఆకట్టుకున్న డాగ్ షో పోలీస్ డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లూస్ టీంలో కీలక పాత్ర పోషించే డాగ్స్ తమ విన్యాసాలతో ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని రేకెత్తించాయి. చిన్నారుల నుంచి ఉన్నత పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడి, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, కడా పీడీ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డీఆర్వో మోహన్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జెండాకు వందనం
చిత్తూరు(కార్పొరేషన్): 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసులు శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సాధనకు ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో సీఈఓ రవికుమార్ నాయడు జెడ్పీటీసీ సభ్యురాలు భారతి పాల్గొన్నారు. అలాగే జిల్లా క్లాస్–4 ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి లోకనాధం, కోశాధికారి రామచంద్రయ్యలు పాల్గొన్నారు. అదేవిధంగా సీపీఐ, సీపీఎం కార్యాలయాల్లో జిల్లా కార్యదర్శి గంగరాజు, ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ అమర్బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ భవనంలో గురువారెడ్డి జెండాకు వందనం చేశారు. కాణిపాకం ఆలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఈవో కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్ జెండా ఎగురవేసి వందనం చేశారు. కార్యక్రమంలో ఏఈవో హరి మాధవరెడ్డి, సిబ్బంది వాసు, దివాకర్రెడ్డి, పండితులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో సీఈవో శంకరన్, చైర్మన్ అమాసరాజశేఖర్రెడ్డి మూడు రంగుల జెండాను ఎగురవేసి రెపరెపలాడించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మనోహర్గౌడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లల్లీ కేథరిన్, వెంకటాచలపతి, సురేష్బాబు పాల్గొన్నారు. జిల్లా న్యాయస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవం చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక జెండా ఎగురవేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర నాయుడు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులతో కలిసి అరుణ సారిక మొక్కలు నాటారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
పాడెక్కించావా తల్లీ..!
పటం కట్టడానికొస్తే.. ఇద్దరు మిత్రులను మింగేసిన కరెంటు తీగలు పుత్తూరు: పుత్తూరులో శ్రీద్రౌపదీదేవి సమేత ధర్మాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటు చూసినా రంగు రంగు బ్యానర్లతో మిత్రులంతా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు కడుతున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదివే ఇ.గోకుల్(19), ఎ.విఘ్నేష్(19) అనే ఇద్దరు ప్రాణమిత్రులకు మనమూ బ్యానర్ కట్టాలనే ఉత్సాహం కలిగింది. బ్యానర్ సిద్ధం చేసుకున్న వీరు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానిక కార్వేటినగరం రోడ్డులోని రెండంతస్తుల మిద్దైపెకి ఎక్కారు. బ్యానర్ కట్టే క్రమంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు బ్యానర్ ఫ్రేమ్కు తగిలాయి. విష్ణేష్కు ముందుగా కరెంట్ షాక్ కొట్టడంతో అతని కుడి కాలి వేళ్లు కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. అతన్ని రక్షించబోయిన గోకుల్కు షాక్ తగిలి ఎగిరి దూరంగా పడి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవికుమార్, సీఐ నెట్టికంఠయ్య సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి తండ్రి మిలటరీలో హెడ్ కానిస్టేబుల్ మరొకరి తండ్రి ఆటో డ్రైవర్ పుత్తూరు ఎస్బీఐ కాలనీలో ఉంటున్న గోకుల్ తండ్రి చిరంజీవి రాజస్తాన్ మిలటరీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తల్లి నీలమ్మ, అక్క దివ్యశ్రీతో కలిసి ఉంటున్నాడు. పుత్తూరు పట్టణం కళ్యాణపురంలో నివాసం ఉంటున్న విఘ్నేష్ తండ్రి గిరి ఆటో నడుపుతూ కొడుకును డిగ్రీ చదివిస్తున్నాడు. అమ్మ సాయిలక్ష్మి, తమ్ముడు ప్రణయ్(7)తో కలసి ఉంటున్నాడు. తమ బిడ్డల భవిష్యత్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండు కుటుంబాల్లో పండుగ వేళ తీరని విషాదాన్ని నింపింది. అధికారుల నిర్లక్ష్యం పట్టణంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చలవిడిగా బ్యానర్లు కడుతున్నా మున్సిపల్ అధికారు పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బ్యానర్ల ఏర్పాటుకు అనుమతి, స్థల పరిమితులు, విద్యుత్ తీగల సమీపంలో ఏర్పాటు చేయకూడదన్న నిబంధనల అమలులో మున్సిపల్ అధికారులు ఎలాంటి చొరవ చూపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కడుపు కొట్టొద్దు
బిల్లు కలెక్టర్ల ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగాలు 38 ఏళ్లుగా విద్యుత్శాఖలో పీసీఏలుగా విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్లకు సెప్టెంబర్ నుంచి పని లేదని ఆ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చి అప్పుడు రెన్యూవల్ చేస్తామని నమ్మించారు. తాజాగా ఆగస్టులో పనిలోకి రావద్దంటూ అధికారులు హుకుం జారీచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే విభాగంలో అయిన తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటల పాటు తిరుపతి సీఎండీ కార్యాలయం వద్ద రిలే నిరహార దీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు కార్పొరేషన్: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లు వసూళ్లు చేసి విద్యుత్ శాఖకు ఆ మొత్తాన్ని చెల్లిస్తున్న విద్యుత్ బిల్లు కలెక్టర్లు లేదా పీసీఏ(ప్రైవేటు కలెక్షన్ ఏజెంటు)ల కడుపుకొట్టొదని వారు వేడుకుంటున్నారు. సంస్థకు వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేస్తున్న వారిని ఇంటికి సాగనంపడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషిస్తున్నామని తమను రోడ్డుపై పడవేయవద్దని విన్నవిస్తున్నారు. గత 38 సంవత్సరాలుగా పీసీఎలుగా వీరు విద్యుత్శాఖలో పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్లో కాంట్రాక్ట్ను రెన్యూవల్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ పెంచే యోచ నతో వీరి కాంట్రాక్ట్ ఇక రెన్యూవల్ చేయడం లేదని నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో డిస్కం పరిధిలో దాదాపు 100 మంది కుటుంబాలు రోడ్డున పడునున్నాయని వారు బాధపడుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగాలు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1988 సంవత్సరంలో పీసీఏ విధానం ప్రవేశపెట్టారు. స్థానికంగా ఉన్న యువతకు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చారు. విద్యుత్ శాఖలో మొదటిగా కాంట్రాక్ట్ పద్ధతికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి వీరు సేవలు అందిస్తున్నారు. వీరి తర్వాత సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వారు దశలవారీగా రెగ్యులర్ అయ్యారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 1–మార్చి 30 వరకు కాంట్రాక్ట్ సమయం. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చి అప్పుడు రెన్యూవల్ చేస్తామని నమ్మించారు. ఇప్పుడు ఆగస్టులో పనిలోకి రావదంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లాగిన్లు ఇవ్వడం లేదు. సీఎండీ సమయం ఇచ్చిన స్థానిక అధికారులు ఏకపక్షంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తమకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ శాఖలో ఉపాధి చూపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో సోమవారం నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే ఈనెల 17, 18న 48 గంటల పాటు నిరహారదీక్ష ను తిరుపతిలోని సీఎండీ కార్యాలయం వద్ద ఉద్యోగులు కుటుంసభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. 100 కుటుంబాలు రోడ్డున ఇప్పుడు ఏకంగా డిజిటల్ పేమెంట్స్ పేరిట పీసీఎలను తొలగింపునకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులు విధుల్లో చేరేటప్పుడు వారి వద్ద నుంచి రూ.లక్ష బ్యాంక్ గ్యారెంటీ, రూ.10వేలు సెక్యూరిటి డిపాజిట్ తీసుకున్నారు. వీరికి ఒక బిల్లుకు రూ.4.19 పైసలు చొప్పున సంస్థ చెల్లిస్తుండగా అందులో కాంట్రాక్టర్, బిల్లు పేపర్, ఆన్లైన్ చార్జీలు, ఈపీఎఫ్, ఈఎస్ఐలకు రూ.1.32 పోగా వారికి వచ్చేది రూ.2.87 మాత్రమే. ఇందుకు వారు స్మార్ట్ ఫోన్, బిల్లు ప్రింటర్, బైక్కు పెట్రోల్, భోజనం ఖర్చులు పెట్టుకొని పల్లెల్లో పనిచేస్తున్నారు. మండలంలోని సర్వీసులను బట్టి నెలకు సుమారు రూ.20–40 వేల మధ్య వారికి వేతనంగా వస్తోంది. ప్రతి ఉద్యోగి ద్వారా నెలకు సంస్థకు దాదాపు రూ.40 లక్షలు బిల్లుల రూపేణా వసూలవుతోంది. ప్రతినెల 1,500 కిలోమీటర్లు తక్కువ లేకుండా ప్రయాణం చేసి పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర్లు లేకపోవడంతో చిల్లర దుకాణల వద్ద అదనపు మొత్తం చెల్లించి విద్యుత్ వినియోగదారుల కోసం తీసుకొని చిల్లర తీసుకుని వెళ్తున్నారు. ప్రత్యామ్నాయం చూపాలి డిస్కం పరిధిలోని పనిచేస్తున్న పీసీఎ(బిల్ కలెక్టర్లకు)కు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలి. సంస్థను నమ్ముకుని 100 మంది దాదాపు 38 సంవత్సరాలుగా జీవిస్తున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా పనికి రావద్దంటే ఎలా బతకాలి. సంస్థ పరిధిలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. – పీ.వీ. రమణ, రాష్ట్ర అధ్యక్షుడు బిల్లు కలెక్టర్స్ కమిటీ కార్మికులకు న్యాయం చేయాలి విద్యుత్శాఖలో పనిచేస్తున్న ప్రైవేటు బిల్లు కలెక్టర్లకు న్యాయం చేయాలి. కాలానుగుణంగా మార్పులు సహజం. డిజిటల్ పేమెంట్స్ పెంచడానికి కార్మికులను తీసివేయడం సరికాదు. వారికి అన్యాయం జరగకుండా సీఎండీ దృష్టి పెట్టాలి. – గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీఐటీయూ -
సురేష్కుమార్కు మెరిటోరియస్ మెడల్
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసుశాఖలో పనిచేస్తున్న ఏఆర్ఎస్ఐ ఎం.సురేష్కుమార్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు ఎంపికై నట్లు ఎస్పీ తుషార్డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసు సాయుధ దళంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి, ప్రస్తుతం ఏఆర్ఎస్ఐగా ఉన్న సురేష్కుమార్ విశిష్ట సేవలను గుర్తించి గత ఏడాది ఈ పతకానికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. శనివారం అమరావతిలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో సీఎం చేతులమీదుగా మెడల్ అందుకుంటారని తెలిపారు. న్యాయం కోసం రోడ్డెక్కిన బాధితులు పెద్దపంజాణి: మండలంలోని బసవరాజుకండ్రిగ గ్రామంలో సుమారు నెల రోజుల క్రితం సీతారాముడు(35) అనే వ్యక్తి ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు తమకు న్యాయం చేయలేదని బాధితులైన సీతారాముడు కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్టేషన్ ఎదుట బైటాయించి సుమా రు అరగంట సేపు ధర్నా చేశారు. సీతారాముడు ఆత్మహత్య చేసుకోలేదని కొందరు హత్య చేశారని ఆరోపిస్తూ హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. విష యం తెలుసుకున్న పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో చర్చించారు. సీతారాముడు హత్యకు గురైనట్లు సరైన ఆధారాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసు కుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం – దరఖాస్తుకు సెప్టెంబర్ 15 ఆఖరి తేదీ చిత్తూరు కలెక్టరేట్ : డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి, కోఆర్డినేటర్ గోపీనాయక్ తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2026–27 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సులకు ఆగస్టు 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దూరవిద్య విధానంలో డిగ్రీ చేయాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా పూర్తయిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబర్ 15 వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అందుబాటులో బీఏ(పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటకల్ సైన్స్), బీఎస్సీ (మ్యాథ మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సులకు అవకాశం ఉందన్నారు. వివరాలకు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ స్టడీ సెంటర్, 7382929664 నంబర్లో సంప్రదించాలన్నారు. -
బ్రహ్మోత్సవ శోభ
కాణిపాకం: శ్రీ స్వయంభ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్స వాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆల య ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా పెయింటింగ్ పనులు చేపట్టగా, ఆలయ విమాన గోపురం, రాజగోపురం, ప్రాకారాలకు నూతన శోభ చేకూరుస్తున్నారు. మరోవైపు ఉత్సవ రోజుల్లో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఎండ, వర్షం నుంచి రక్షణగా వాటర్ ప్రూఫ్ షెడ్లతో పాటు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. భక్తులకు తాగునీరు, ప్రసాదాల వితరణ, భద్రతా చర్యలపై దేవస్థానం అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పనులను పరుగులు తీస్తున్నారు. కాణిపాక క్షేత్రంలో జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత పారదర్శకంగా విజయవంతం చేసేందుకు ఆలయ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రంగులు వేస్తున్న దృశ్యాలు -
శిరస్త్రాణం.. నిలిపేను ప్రాణం
కార్వేటినగరం: రోడ్డు ప్రమాదాలను నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నింబందనలను పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీఽ సూచించారు. ‘సురక్షిత చిత్తూరు– మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మండల పరిధిలోని అమ్మపల్లి క్రాస్ వద్ద శుక్రవారం వెయ్యి మందికి ఉచి తంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం వెయ్యి మంది ద్విచక్రవానదారులతో అమ్మపల్లి క్రాస్ నుంచి కార్వేటినగరం పోలీస్టేషన్ వరకు మెగా హెల్మెట్,బై బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే థామస్ ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. పారిశ్రామిక వేత మాదిరాజు గణేష్రాజు వెయ్యి మందికి ఉచితంగా హెల్మెట్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల రోడ్డు ప్రమాద గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో ప్రతి ఏడాది సుమారు 350 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వీరిలో 150 నుంచి 170 మంది ద్విచక్రవాహనదారులే ఉన్నారని, అదనంగా ప్రతి ఏడాది 400 నుంచి 450 మంది ద్విచక్రవాహన దారులు తీవ్రంగా గాయపడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి విషాదం మాత్రమే కాదని, దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని అన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. మీ కుటుంభాన్ని కాపాడే రక్షణ కవచం జిల్లాఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని అన్నారు. ద్విచక్రవాహనదారులు ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించా లని సూచించారు. హెల్మెట్ కేవలం తలకు రక్షణ కల్పించే పరికరం మాత్రమే కాదని, అది వ్యక్తిని, కు టుంబాన్ని కాపాడే రక్షణ కవచమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ యువత ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు వేగంకంటే ప్రా ణం ముఖ్యమని గుర్తించాలన్నారు. ఈ క్రమంలో భా గంగా వెయ్యి మంది హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనాదారులతో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన పారిశ్రామిక వేత్త మా దిరాజు గణేష్రాజు, కుమార్ రాజును జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. నగరి ఇన్చార్జి డీఎస్పీ రాంబాబు, సీ.ఐ హనుమంతప్ప, ఎస్ బీ ఇన్స్పెక్టర్ మురళి, ఎస్ఐలు సుమన్, రాజశేఖర్రెడ్డి, తేజస్విని, నవీన్బాబు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ను అందిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ -
ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాజకీయమా?
కార్వేటినగరం: సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీదారునికి రాజకీయాలకు అతీతంగా న్యాయం జరిగే చూడాలని మాజీ ఉప ముఖ్యమఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి హితువు పలికారు. శుక్రవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రజల మనోభావాలను తెలుసుకుని పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో స్పందన కార్యక్రమాన్ని తీసుకొచ్చే పేద ప్రజల సమస్యలను రెండు మూడు రోజుల్లో పరిష్కరించి అండగా నిలిచారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమి ఒకే పార్టీ వారికి మాత్రమే న్యాయం జరిగేలా చేస్తున్నారని ఆరోపించారు. మండల స్థాయి అధికారుల తీరు దారుణం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలను మండలస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. ఒక్కో కలెక్టర్ ఒక ముఖ్యమంత్రితో సమానమని, ఐఏఎస్ అఽధికారులు ప్రజా ప్రతినిధులకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరిస్తే జిల్లా అధికారులకు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. పేద ప్రజలకు గతీమోక్షం దొరకని స్పందన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దు చేస్తే బాగుంటుందేమో అని చెప్పారు. ప్రజల మనో వేదనను చోడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
రెండు వాహనాలు ఢీ
– ఇద్దరికి గాయాలు గంగవరం: పలమనేరు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని బెంగళూరు వైపు వెళ్తున్న మరో బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి బొలేరో వాహనం పూల లోడుతో రాజమండ్రికి వెళ్తోంది. ఈ క్రమంలో పలమనేరు సమీపంలోని జీఎల్ఎస్ ఫారం బ్రిడ్జి వద్ద బెంగుళూరు వైపు వెళ్తున్న మరో బొలేరో వాహనం అతి వేగంగా వెళ్తూ రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటి అవతలి వైపు చింతామణికి పూల లోడుతో వెళ్తున్న బొలేరోను ఢీకొట్టింది. రెండు వాహనాలు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ముళబాగిల్కు చెందిన డ్రైవర్ ఉమేష్(30)కు స్వల గాయాలవగా, క్లీనర్ లక్ష్మీకాంత్(31) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి గాయపడ్డ వారిని బంధువులు కోలార్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలేరో డ్రైవర్ను అదుపులోకి తిసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ క్లీనర్ లక్ష్మీకాంత్ స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ఉమేష్ -
మరమ్మతు పనులు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు ట్రాన్స్కో అర్బన్ డివిజన్ పరిధిలో గుర్తించిన సమస్యలను శుక్రవారం సిబ్బంది పరిష్కరించారు. క్షేత్రస్థాయి పరిధిలో డీఈ, ఏఈ, ఓఅండ్ఎం సిబ్బంది గుర్తించిన సమస్యలను బాగుచేశారు. డివిజన్ పరిధిలోని మిట్టూరు, సంతపేట, గిరింపేట, కొంగారెడ్డిపల్లె, చిత్తూరు రూరల్స్, పూతలపట్టు, కల్లూరు, రొంపిచెర్ల, యాదమరి, పైపల్లె పరిధిలో మొత్తం 11 కేవీ ఫీడర్ల పరంగా 4 సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ పరంగా 29, ఎల్టీ లైన్ 15, సర్వీసు లైన్ పరంగా 36 సమస్యలు పరిష్కారించామని ఈఈ మునిచంద్ర వివరించారు. -
చివరి సమావేశం..తూతూ మంత్రం
చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ పాలకవర్గం చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు గైర్హజరవ్వడంతో పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు రాకపోతే ఇంకెవరికి సమస్యలు తెలపాలని, జెడ్పీటీసీ సభ్యులంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 1,2,4,7 స్థాయి సంఘాల సమావేశం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, 3, 6 స్థాయి సంఘాల సమావేశం వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, 5వ స్థాయి సంఘ సమావేశానికి సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ భారతి అధ్యక్షతన నిర్వహించారు. సీఈఓ రవికుమార్నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యు లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య రానివ్వద్దు : జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు. జెడ్పీ నిధులతో చేపడుతున్న పనులు 50 శాతానికిపైగా పూర్తయింటే వాటికి శిలాఫలకాలు ఏర్పాటు, సంబంధిత జెడ్పీటీసీ సభ్యుల పేర్లు వేసి ఈనెలలోపు ప్రారంభించాలన్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలన్నారు. జిల్లాలోని డ్వామా పరిధిలో రూ.84 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలవుతున్నా ఇస్సటికీ కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. సభ్యులు ఏమన్నారంటే ప్రతి సమావేశంలో మండలాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రావడం లేదని, మండలంలో అధికారులు కనీస గౌరవం ఇవ్వ డం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో నీటి సమస్య ఉందని తెలిపారు. పంచాయతీల్లో కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీవోల పనితీరు సక్రమంగా లేదని విమర్శించారు. గ్రీన్ అంబాసిడర్లను ఇష్టారాజ్యంగా పనిలో నుంచి తీసివేస్తున్నారని వాపోయారు. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు -
వేటగాళ్ల ఉచ్చులో పడి ఒకరికి తీవ్ర గాయాలు
పెద్దపంజాణి: వన్య ప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని గంకొండ అటవీ ప్రాంత సమీపంలోని కొత్తచెరువు వద్ద గురువారం వేకువజాము న చోటుచేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు.. పెద్దకాప్పల్లి పంచాయతీ గౌరీనగర్ గ్రామానికి చెందిన యానాది చిన్నస్వామి కుమారుడు నాగరాజ(45) అటవీ ఫలసాయాలు సేకరించి వాటిని విక్రయించగా వచ్చిన నగదుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం వేకువజామున భార్య, కుమారునితో కలసి గంకొండ అటవీ ప్రాంతానికి బయలుదేరా డు. మార్గం మధ్యలోని కొత్త చెరువు వద్ద వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలు చీకటిలో కనిపించక వాటిమీ ద పడడంతో తీవ్రంగా గాయపడ్డా డు. జరిగిన ప్రమాదాన్ని వెనుక వస్తున్న భార్య గుర్తించి గట్టిగా కేక లు వేయడంతో పరిసర ప్రాంతాల్లో ని రైతులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని 108 వాహనంలో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రాన్స్కో ఏఈ వెంకట్రమణ, పెద్దపంజాణి పోలీసులు పరిశీలించి విచారణ చేస్తున్నారు. -
అభయమేది?
ఆశాలకు ఆశావర్కర్లకు వైద్య సిబ్బంది వేధింపులు కూటమి నేతల వేధింపులు కూడా ఫిబ్రవరిలో డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లు కాణిపాకం: గ్రామీణ ప్రాంతాల్లో నిమిషం విరామం లేకుండా ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తూ, ఆరోగ్య వ్యవస్థకే వెన్నుముకలా నిలుస్తున్న ఆశా కార్యకర్తల జీవితాలు అభద్రతా నిలయాలుగా మారుతున్నా యి. ఓ వైపు మోయలేని పనిభారం, మరోవైపు క్షేత్రస్థాయి అధికారుల మానసిక వేధింపులతో జిల్లాలో ఆశా కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో కుమిలిపోతు న్నారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పెత్తందారీ అధికారుల వేధింపులు తాళలేక కడకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘోరా లు చూడాల్సి వస్తోంది. పెచ్చుమీరిన పెత్తనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆశా కార్యకర్తల విధులు ప్రధానంగా అవగాహన కల్పించడం, గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణ, ఇమ్యునైజేషన్, టీబీ–మలేరియా వంటి జాతీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికే పరిమితం. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏఎన్ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, హెల్త్ సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది వీరిపై తీవ్రమైన పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పరిధిలోని పనులను కూడా ఆశా వర్కర్తలో బలవంతంగా చేయిస్తూ, చేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ నిత్యం బెదిరింపులకు దిగుతున్నట్లు ఆశా వర్కర్ల సంఘాలు తీవ్రస్థాయిలో వాపోతున్నాయి. మాతృత్వ – శిశు సంరక్షణలో భాగంగా చెకప్లు, హోమ్ విజిట్లు (42 రోజుల్లో 6 నుండి 7 సార్లు). ఆన్లైన్ యాప్లు, 30 ఏళ్లు దాటిన వారికి స్క్రీనింగ్ ఫారాలు నింపడం, రోజూ ఆన్లైన్ డేటా ఎంట్రీలు చేయడం, జాతీయ కార్యక్రమాల నిర్వహణ, మలేరియా స్లైడ్ల సేకరణ, టీబీ రోగులకు సేవలు, సబ్ సెంటర్లో జనన మరణాల వివరాల నవీకరణ వంటి పలు రకాల బాధ్యతలు నెత్తినేసుకుని, సొంత ఖర్చులతో తిరుగుతున్నా కనీస గుర్తింపు లేకపోగా, పైఅధికారుల వేధింపులే సమాధానమవుతున్నాయి. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం, శెట్టిగుంట పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న ఒక ఆశా వర్కర్కు, ఇటీవల కూటమి నేతకు మధ్య గొడవ జరిగింది. ఈ కారణంగా స్థానిక ప్రజాప్రతినిధి, ఆ ఆశా వర్కర్ను నియోజకవర్గంలో లేకుండా చేయాలని సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, ఆ ఆశా వర్కర్ పనితీరు ‘భేష్’ అని నివేదిక ఇచ్చారు. అయినా సరే, ఆ ప్రజాప్రతినిధి తన ఒత్తిడిని వీడకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఓవైపు అధికారుల నరకం చాలదన్నట్లు, మరోవైపు స్థానిక కూటమి నేతల పెత్తనం కూడా తీవ్ర స్థాయికి చేరింది. వాళ్లను తొలగించాలని, వీళ్లను విధుల నుంచి తీసేయాలని అధికారులపై విపరీతమైన ఒత్తిడి తెస్తు న్నారు. ఈ రాజకీయ బెదిరింపులు కూడా ఆశా వర్క ర్లను మానసికంగా కోలుకోలేని విధంగా కుంగదీస్తున్నా యి. వీటి దృష్ట్యా ఇటీవల చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆశా కార్యకర్తలతో ప్రత్యేక జాయింట్ కమిటీ గ్రీవెన్స్ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ స్వయంగా ఆశా వర్కర్ల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెంచవద్దని గతనెల 27వతేదీ ఉత్వర్వులు జారీ చేశారు. అయినా పెత్తనం, వేధింపులు కొనసాగుతూనే ఉన్నా యని పలువురు ఆశావర్కర్లు వాపోతున్నారు. -
17 నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈనెల 17 వ తేదీ నుంచి ఫార్మెటివ్–1 (ఎఫ్ఏ–1) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలి పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన బుక్లెట్లు మండల కేంద్రాలకు వచ్చినట్లు చెప్పారు. వాటిని త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతామన్నారు. ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రతి పాఠ్యాంశానికి ఒకటి చొప్పున అసెస్మెంట్ బుక్లెట్ ఇస్తారన్నారు. ఏడాదిలో వివిధ దశల్లో ఎఫ్ఏ 1, 2, 3, 4 పరీక్షలను నిర్వహించడం జరు గుతుందన్నారు. పరీక్షల ప్రశ్నలకు సమాధానాలన్నీ బుక్లెట్లోనే రాయా ల్సి ఉంటుందన్నారు. 6 నుంచి 10 వ తరగతి ప్రశ్నాపత్రాలు ఎంఈవో కార్యాలయం నుంచి, 1 నుంచి 5 వ తరగతి ప్రశ్నాపత్రాలు ఆయా కాంప్లెక్స్ స్కూల్స్ నుంచి అందిస్తారని తెలిపారు. ఏ రోజు పేపర్లు ఆ రోజే అందజేయడం జరుగుతుందని డీఈవో వెల్లడించారు. -
డిసెంబర్లోపు పూర్తిచేయాలి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులు డిసెంబర్ లోపు పూర్తిచేయాలని ట్రాన్స్కో ప్రాజెక్ట్స్ సీజీఎం రమణదేవి ఆదేశించారు. గురువారం ఎస్ఈ కార్యాలయంలో ఆర్డీఎస్ఎస్ పనులపై ఆమె అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 421 ఫీడర్లు ఉండగా అందులో ఇప్పటివరకు 300 ఫీడర్లలో పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన 121 ఫీడర్ల పనులను నెలకు 30 ఫీడర్ల చొప్పున చేసి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పాడైన, పాతబడిన కరెంటు స్తంభాలను మార్పు చేయాలన్నారు. పల్లెల్లో విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజీ సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాత విద్యుత్ స్తంభాలు 8 మీటర్ల స్థానంలో కొత్తవి 9, 11 మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పనులు వేగంగా చేయాలని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్బాబు, ఈఈలు మునిచంద్ర, భాస్కర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ భరత్ పీఏ అరెస్ట్
శాంతిపురం: ఎమ్మెల్సీ, వైఎస్పార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త కెఆర్జె భరత్ వ్యక్తిగత సహాయకుడు జి.మురు గేష్ను రాళ్లబూదుగూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం మండలంలోని నంజంపేటలో దేవుడి ఉత్సవాల సందర్భంగా జరిగి న కబడ్డీ పోటీల్లో ఇద్దరి మధ్య రేగిన వివాదం ఇరు రాజకీయ పార్టీల ఘర్షణకు దారితీసింది. దీనికి సంబంధించి నమోదైన కేసులో మురుగేష్ ఏ6గా ఉన్నారు. సంఘటన జరిగిన సమయంలో తను నంజంపేటలో లేకున్నా ఉద్దేశపూర్వకంగా తనను కేసులో ఇరికించారని పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం మురుగేష్ ప్రయత్నించారు. గురువారం రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందానికి పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులు కుప్పం కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండుకు తరలించారు. రాజకీయ వేధింపుల్లో భాగమే కేవలం తన పీఏగా ఉన్నడన్న కారణంగానే రాజకీయ వేధింపుల్లో భాగంగా మురుగేష్పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. అక్రమ కేసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. గొడవ జరిగిన ప్రాంతంలో లేని వ్యక్తిపై కక్ష సాధింపు కోసమే కేసు నమోదు చేశారని చెప్పారు. గురువారం జరిగిన వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసిందన్నారు. అంతలోనే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. బాధితుడికి, అతని కుటుంబానికి పార్టీ, తాను పూర్తి అండగా ఉంటామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించిన ఎమ్మెల్సీ వీటికి బాధ్యులైన వారు భవిష్యత్తులో చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. -
31 లోపు నోటీసుల జారీ పూర్తి కావాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో చేపడుతున్న సర్ ప్రక్రియ నోటీసుల జారీ ఈనెల 31 వ తేదీలోపు పూర్తి కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. సర్ ప్రక్రియపై చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్యాదవ్ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వివరాలు వెల్లడించారు. మ్యాపింగ్ కాని ఓటర్లకు, మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. సర్ ప్రక్రియలో దాఖలైన క్లెయిమ్స్, అభ్యంతరాలు, ఫిర్యాదులను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం వేగంగా పరిష్కరించాలన్నారు. ఓటర్ల సౌకర్యార్థం ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో బీఎల్వోలు, రాజకీయ పార్టీల బీఎల్ఏలు అందుబాటులో ఉండి ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఫారాల సమర్పణలో సహాయపడతారన్నారు. జిల్లా లో 18–19 ఏళ్ల యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
డిగ్రీ అడ్మిషన్లకు 18 వరకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు ఈనెల 18 వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈనెల 11 వ తేదీతో సమయం ముగిసింది. కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆశించి న మేరకు అడ్మిషన్లు జరగకపోవడంతో గడువు పొడగించారు. ఈ నెల 18 వ తేదీ వరకు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రత్యేక విభాగం విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో మార్పు చేయలేదు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఈ కసరత్తుకు ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు కసరత్తు నిర్వహిస్తున్నారు. అవయవదానంపై చైతన్యం పెరగాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): సమాజంలో అవయవ, శరీర దానంపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని కాలేజీలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నీ మార్పిడి కోసం వేల సంఖ్యలో రోగులు ఎదురుచూస్తున్నారని, దానంచేసే వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం, సమాజానికి ఆదర్శంగా నిలిచి కుటుంబం మొత్తాన్ని శరీర దానానికి అంగీకరించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎస్.టి. రంగనాథన్ను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్ర దానం చేశారు. కార్యక్రమం అనంతరం అపో లో క్యాంపస్ నుంచి మురకంబట్టు సర్కిల్ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అపోలో వర్సిటీ వీసీ డాక్టర్ నితిన్ ఎం. అగార్కర్, ఇతర ప్రతినిధులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పొగాకు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ పుత్తూరు: రైలులో అక్రమంగా పొగాకును రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినటు్ల్ పుత్తూరు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.పి.సెబాస్టియన్ తెలిపారు. గురువారం తిరుపతి నుంచి చైన్నె వెళ్తున్న ఎంజీఆర్ చైన్నె ఎక్స్ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ రవిచంద్రన్ బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద ఉన్న సంచిని పరిశీలించి రూ.3 వేల విలు వైన 05.24 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తుల ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పొగా కును తిరుత్తణికి చెందిన ఆహార భద్రతాధికారికి స్వాధీనపరిచారు. ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారులు నిందితుడికి రూ.25 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. టెట్కు 85.66 శాతం హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన టెట్కు 85.66 శాతం మంది హాజరైనట్లు డీఈవో లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. టెట్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో గురువారం రెండు సెషన్లలో కలిపి 530 మంది అభ్యర్థులకు 454 మంది హాజరుకాగా 76 మంది గైర్హాజరైనట్లు డీఈవో వెల్లడించారు. ఏపీఎస్పీ కమాండెంట్కు ఇండియన్ పోలీస్ మెడల్ చిత్తూరు అర్బన్: చిత్తూరులోని 8వ బెటాలియన్ ఏపీ ఎస్పీ చిత్తూరు కమాండెంట్గా వ్యవహరిస్తున్న కె.రామచంద్ర మూర్తికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమరావతిలో సీఎం చేతుల మీదుగా ఈయన పతకాన్ని అందుకోనున్నారు. 1991లో ఆర్ఎస్ఐగా పోలీస్ శాఖలో నియమితులైన ఈయ న 35 ఏళ్ల పాటు సేవలు అందిస్తున్నారు. -
శిశు విహార్ ఆకస్మిక తనిఖీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో కార్యాలయానికి సమీపంలో ఉన్న శిశు విహార్ను కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, సేవలు, నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దత్తత రికార్డులను, మిషన్ వాత్సల్య పోర్టల్లో దత్తతకు సంబంధించిన డేటా నమోదు ప్రక్రియను కలెక్టర్ స్వ యంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ శిశు విహార్ భవనానికి రంగులు వేయడం, విద్యుత్ పనులు, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, ఓపెన్ కారిడార్ పైకప్పుపై ఇనుప గ్రిల్స్ ఏర్పాటు వంటి భద్రతా, అభివృద్ధి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల నిరంతర ఆరోగ్య పరీక్షలకు ప్రత్యేకంగా ఒక పీడియాట్రిషియన్ (పిల్లల వైద్య నిపుణుడు)ని ఏర్పాటు చేయాల ని డీఎంహెచ్వో డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డిని ఆదేశించారు. శిశు విహార్లోని పిల్లలకు పాల పౌడర్ ప్యాకెట్ల కొనుగోలుకు కలెక్టర్ నిధుల నుంచి రూ.25 వేలు మంజూరు చేశారు. పిల్లల సంరక్షణ, ఆరోగ్యం వారి సర్వతోముఖాభివృద్ధికి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, పీఆర్ ఎస్ఈ మల్లికార్జున మూర్తి, డీసీపీవో సుబ్రహ్మణ్యం, ప్రొటెక్షన్ ఆఫీసర్లు రాధ, శివశంకర్, శిశు విహార్ మేనేజర్ రమ్య పాల్గొన్నారు. -
బంగారు గొలుసు చోరీకి యత్నం
పుత్తూరు: మెడలోని బంగారు గొలుసును లాకెళ్లడానికి ప్రయత్నించిన యువకుడిని మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో పరారైన సంఘటన స్థానిక స్వర్ణ హౌసింగ్ కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకొంది. మహిళ తెలిపిన వివరాల మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న యువసంధ్య(30) గత రెండేళ్లుగా ప్రొవిజన్ స్టోర్ నడుపుకుంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో 25 ఏళ్ల వయసున్న యువకులు ముగ్గురు మోటర్ సైకిల్పై వచ్చారు. అందులోని ఓ యువకుడు షాపు వద్దకు వచ్చి కూల్డ్రింక్ కావాలని అడిగాడు. మహిళ ఇవ్వడానికి వెనక్కు తిరగడంతో మెడలోని గొలుసును లాగడానికి ప్రయత్నించగా వెంటనే మహిళ అతని చేతిని బలంగా పట్టుకుంది. మరో చేతిలోని కత్తితో బెదిరించగా ఆమె దొంగ దొంగ అంటూ అరవడంతో దుండగుడు వదిలించుకుని వెళ్లే పెనుగులాటలో మహిళ కిందపడిపోయింది. దీంతో మోటర్ సైకిల్పై సిద్ధంగా ఉన్న మరో ఇద్దరితో కలసి పరారయ్యాడు. ఈ పెనుగులాటలో బంగారు గొలుసు ఆమె డ్రస్ లోపలే పడిపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కిందపడ్డ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి వెళ్లారు. -
ఇసుక దోపిడీ
సాక్షి టాస్క్ఫోర్స్: పచ్చని చిత్తూరు నేలపై అక్రమార్కుల కన్ను పడింది. పరిమితులు లేవు.. భయమూ లేదు.. చిత్తూరు మండలం ముత్తుకూరు కేంద్రంగా ఇసుక దోపిడీకి కొత్త దందాలు పురుడు పోసుకుంటున్నాయి. పాత స్థలంలోనే మళ్లీ ఇసుక డంప్ను ఏర్పాటు చేసి, సరిహద్దు దాటించేందుకు కూటమి నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముత్తుకూరుకు చెందిన ముగ్గురు నేతలు చేతులు కలిపి ఈ అక్రమ వ్యాపారాన్ని దర్జాగా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నీకింత.. నాకింత.. ఈ ముగ్గురు నేతలు కలిసి నెలనెల నీకింత.. నాకింత.. అంటూ ముందస్తుగా సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైన ఉన్న పెద్ద నేతల పేర్లు, కింద ఉన్న అధికారుల పేర్లు చెబుతూ ముత్తుకూరు వద్ద ఉన్న తచ్చూరు హైవే రింగ్ రోడ్డుకు సమీపంలోని పాత డంప్ స్థలంలోనే ఇసుక కుప్పలు పోసేశారు. మంగళవారం సాయంత్రానికే అక్కడ సుమారు 70 లోడ్ల ఇసుకను పోసి ఉంచారు. లారీలకు సులభంగా లోడ్ చేసేందుకు వీలుగా ఏకంగా పెద్ద గుంతను కూడా తవ్వి సిద్ధం చేయడం వీరి తెగింపునకు నిదర్శనం. ఈ ఇసుకనంతా అర్ధరాత్రి వేళ సరిహద్దు దాటించి తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకోవడానికి పక్కా స్కెచ్ వేశారు.ముత్తుకూరు వద్ద ఇసుక డంప్ ఈ అక్రమ దందా వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి, అదే పార్టీలోని వ్యతిరేక వర్గం చెవిన పడింది. దోపిడీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ వర్గం నాయకులు వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థానిక అధికారులు స్పందించి ఈ అక్రమ డంప్పై చర్యలు తీసుకోకపోతే, ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదు చేసేందుకు ఆ తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. మరి ఈ దందాపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారో అని వారు ఎదురుచూస్తున్నారు.అధిష్టానానికి ఫిర్యాదుకు సొంత వర్గం సిద్ధం -
మాన్యువల్ రికార్డుల్లో బోగస్ ఎంట్రీలు
రెవెన్యూ కార్యాలయాల్లోని మాన్యువల్ రికార్డుల్లో అధికారులు ఇష్టానుసారంగా బోగస్ ఎంట్రీలు వేస్తున్నారు. హౌస్ సైట్ రిజిస్టర్లో జరిగే ఎంట్రీలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఎవరైనా అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వడం సర్వసాధారణం. ఇంటి పట్టా ఇచ్చే వ్యక్తి పేరుని మాన్యువల్ రికార్డు నమోదు చేస్తారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బోగస్ ఎంట్రీలను విచ్చలవిడిగా వేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలోనే తిరుపతి జిల్లా పరిధిలో విచ్చలవిడిగా బోగస్ ఎంట్రీలు జరిగినట్లు ఓ తహసీల్దార్ బయటి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. చెరువు, కాలువ, కుంట పోరంబోకు స్థలాలను రూ.లక్షలు తీసుకుని బోగస్ పేర్లు నమోదు చేసి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బోగస్ ఎంట్రీలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. -
ట్రాన్స్కో.. ఇదేం విడ్డూరం..?
చిత్తూరు అర్బన్: చిత్తూరులో విద్యుత్శాఖ (ట్రాన్స్కో) అధికారుల తీరుపై సామాన్యులు దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యుత్ బిల్లులను చెల్లించడానికి వెళుతున్న ప్రజల నుంచి అధికారులు, సిబ్బంది డబ్బులు కట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఓవైపు కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులు ఉచితం కాదని.. వీటికి రుసుములు వసూలు చేసుకునే హక్కు ఆయా సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో యూపీఐ లావాదేవీల ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని.. నగదు చెల్లింపులు తీసుకోమంటూ చిత్తూరులోని పలు విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాల వద్ద అధికారులు బోర్డులు ఏర్పాటుచేశారు. బిల్లులు చెల్లించడానికి వెళుతున్న ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడంలేదు. కొందరైతే తమ వద్ద స్మార్ట్ఫోన్ లేదని, కీ–ప్యాడ్ ఫోన్ ఉందని.. ఎందుకు డబ్బులు కట్టించుకోరంటూ సిబ్బందిని నిలదీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నగదు తీసుకోవడంలేదని సిబ్బంది చెబుతుండడంతో.. బిల్లుల వసూలు కేంద్రాల వద్ద వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందరూ యూపీఐ చెల్లింపులే చేస్తే, రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు మూతబడి.. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు దొరక్క రోడ్డున పడడం ఖాయంగా కనిపిస్తోంది. డిజిటలైజేషన్ ప్రక్రియ పేరిట అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. సామాన్యులను ఇబ్బందుల పాలుచేస్తున్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రతీ ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు, యూపీఐ చెల్లింపులు ఉండవనే వాస్తవాన్ని అధికారులు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మాన్యువల్గా సైతం నగదుతో విద్యుత్ బిల్లులు చెల్లింపులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కార్మికుడిపై ఏనుగు దాడి
బంగారుపాళెం: మండలంలోని మొగిలి పంచాయతీ గౌరీశంకరపుం వద్ద మంగళవారం రాత్రి ఎక్స్ప్రెస్ హైవే పనులు చేసే కార్మికుడిపై ఒంటరి ఏనుగు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గౌరీశంకరపురం సమీపంలో ఎక్స్ప్రెస్ హైవే ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే సంబంధించిన అధికారులు, కార్మికులు ఉంటున్నారు. రాత్రి ఉత్తరప్రదేశ్కు చెందిన మాన్సింగ్ ఫోన్ మాట్లాడుకుంటుండగా గౌనిచెరువు సమీపంలో నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు తొండంతో కొట్టి దాడిచేసింది. మాన్సింగ్కు తీవ్రగాయాలు తగిలాయి. కేకలు వేయడంతో తోటి కార్మికులు అక్కడికి చేరుకున్నారు. మనుషులు రావడంతో ఏనుగు అడవిలోకి పోయింది. ఏనుగు దాడిలో గాయపడిన వ్యక్తిని సహచరులు పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గత పది రోజులుగా ఏనుగులు గుంపు మొగిలి దేవరకొండ, గౌనిచెరువు, కౌండిన్య అటవీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పీఎం శ్రీ గ్రాంట్లపై అవగాహన ముఖ్యం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు విడుదలైన గ్రాంట్ల వినియోగంపై ప్రధానోపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన గ్రాంట్లను నిబంధనల ప్రకారం పారదర్శకంగా వినియోగించాలన్నారు. ఎస్ఎన్ఏ స్పర్శ్ పోర్టల్లో పీఎం శ్రీ పాఠశాలలకు విడుదలైన 9 రకాల గ్రాంట్లను ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రాంట్ల నిధులను వినియోగించే సమయంలో సంబంధిత వెండర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా సేకరించి నమోదు చేయాలన్నారు. గత విద్యాసంవత్సరంలో ఎస్ఎన్ఏ స్పర్శ్ నిధులతో చేపట్టిన పనులు, చేసిన ఖర్చుల వివరాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష శాఖ ఏఎంవో సుభాషిణి, రీసోర్స్ పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యభిచారం నిర్వాహకులపై కేసు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం వన్టౌన్ సీఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో కలిసి సుందరయ్య వీధిలోని పలు లాడ్జిల్లో దాడులు నిర్వహించారు. ఓ లాడ్జిలో రాజమండ్రికి చెందిన మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. బాధిత మహిళలను పునరావాస కేంద్రాలకు తరలించి, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదుచేశారు. -
యువతే దేశ భవిష్యత్తు
చిత్తూరు కలెక్టరేట్ : నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. బుధవారం నగర సరిహద్దులో ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి యువత తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలన్నారు. విద్య, సాంకేతికత, క్రీడలు, కళలు తదితర రంగాల్లో యువత దేశానికి వెన్నెముకలా నిలుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్ల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. సన్మార్గంలో పయనిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ జోలికి వెళ్లకూడదని, సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీసీఎస్ సీఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్స్కు యువత దూరంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ సెక్యూరిటీ సీఐ ప్రవీణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాను అనవసర విషయాలకు దుర్వినియోగం చేయకుండా, విజ్ఞానదాయకమైన మంచి కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ సభ్యులు గిరిబాబు, సీతమ్స్ కళాశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ నాగేశ్వర ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వెంకటాచలపతి పాల్గొన్నారు. -
ద్రవిడ వర్సిటీలో ఉన్నత విద్యామండలి
కుప్పంరూరల్: ద్రావిడ విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ది పనులు (రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ 2.0) రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయభాస్కరరావు, నోడల్ అధికారి ప్రొఫెసర్ భూపతినాయుడు, ఎస్వీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గురవారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్వూటివ్ ఇంజినీరు శంకరరావు, ఎఫ్ఏసీ తిరుపతి రావు, సభ్యురాలు ఉష బుధవారం ద్రవిడ వర్శిటీలో పర్యటించారు. వర్శిటీ వీసీ ఎల్సీ మల్లయ్య అధ్యక్షతన జరిగిన మానిటరింగ్ సమావేశంలో సభ్యులు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 20 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న జీ ఫ్లస్ 2 తరగతి గదుల సముదాయం, పురుషుల వసతి గృహం, హరప్ప భవనం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత, పారద్శకత ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రిజిస్ట్రార్ కిరణ్కుమార్ ఉన్నారు. -
రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం
కార్వేటినగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక మద్యం ఏరులై పారుతూ ప్రతి గ్రామంలోనూ నిత్యావసర సరుకుల్లా బెల్టుషాపులు వెలిశాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. బుధవారం పుత్తూరులోని తమ నివాశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని కుయుక్తులు, కుట్రలకై నా వెనుకాడడం లేదన్నారు. గతంలో ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం చేసి అధికారాన్ని చేపట్టి ప్రజల మన్ననలను పొందారని, ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికల్లో మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాక మద్యాన్ని ఏరులై పారించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాశిరకమైన మద్యం అందించి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని అసత్య ప్రచారాలు చేసి అధికారానికి వచ్చాక.. నేడు ప్రతి పల్లెల్లోను బెల్టుషాపులు పెట్టించి ఏరులై పారించడమే కాకుండా గ్రామాల్లో విచ్చల విడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులే బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలను ప్రోత్సాహిస్తూ తమ కార్యకర్తలతో అమ్మకాలు చేయించి దోచుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు గంజాయి, మద్యం మత్తులో మహిళలపై దాడులు, అత్యాచారాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం లేదని, మెడికల్ విద్యార్థిపై మొన్న జరిగిన హత్యే అందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఒకటిన్నర సెంటు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసి జగనన్న గ్రామాలను ఏర్పాటు చేస్తే అది కనీసం బాత్రూంకు సరిపోదని, తాను అధికారంలోకి వస్తే 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణం చేస్తానన్న చంద్రబాబు నేటికీ ఒక్క ఇల్లు ఇచ్చిన ధాఖలాలు లేవన్నారు. మాదిగల ఓట్ల కోసం ఎస్సీ వర్గీకరణ చేసి నేను పెద్దమాదిగను చెప్పిన చంద్రబాబు మాదిగలు హత్యకు గురవుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బదులేది? పరకాల ప్రభాకర్ తన సతీమణి కేంద్ర మంత్రిగా ఉన్నా తాను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నానని.. రాత్రి ఒంటి గంట వరకు ఎక్కడైనా ఓట్లు వేస్తారా అని ప్రశ్నిస్తే ఈవీఎంల ద్వారా అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోతోందని అన్నారు. -
రెవెన్యూ రికార్డుల్లో విచ్చలవిడిగా బోగస్ ఎంట్రీలు హౌస్ సైట్.. డైలీ రిజిస్టర్లతో అధికారుల ఇష్టారాజ్యం
● పేదల కోసం రూపొందించిన జీఓ దుర్వినియోగం ● తిరుపతి తహసీల్దార్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగి పెత్తనం ● టీడీపీ నేతలకు దాసోహమైన అధికారయంత్రాంగం ఖాళీ భూమి కనిపిస్తే కబళించేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారుల అండదండలతో రికార్డులను తారుమారు చేసేస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పి బోగస్ ఎంట్రీలు చేయించేస్తున్నారు. అనంతరం తాపీగా రిజిస్ట్రేషన్ తతంగం సైతం ముగించేస్తున్నారు. అక్రమార్కుల కారణంగా భూ యజమానులు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన స్థలాలను కొట్టేస్తుంటే లబోదిబోమంటున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొత్తం దందాలను టీడీపీ నేతలే వెనకుండి నడిపిస్తున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అలాగే కొందరు విశ్రాంత ఉద్యోగులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజలకు అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖలో అధికార పార్టీ దొంగలు పడ్డారు. ఇదే అదునుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేసే అనేక మంది రెవెన్యూ ఉద్యోగులు.. రికార్డులను తారుమారు చేసి, బోగస్ ఎంట్రీలు చేసి జేబులు నింపుకుంటున్నారు. దీంతో రూ.లక్షల ఇచ్చి పట్టాలు పొందిన వ్యక్తి కొన్నాళ్లకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరో వైపు అధికారుల అత్యాశతో మోసపోయి భూమి, స్థలాలు పొగొట్టుకున్న వారు లబోదిబో మంటున్నారు. ఇటీవల ఓ ముఠా నకిలీ ఆధార్లు సృష్టించి డబ్బులు కొట్టేసిన ఘటనే ఇందుకు నిదర్శనం. తిరుచానూరు పోలీస్టేషన్ పరిధిలోని చెన్నాయిగుంట శేషాచలం హిల్ వ్యూ లే అవుట్ హెచ్ఐజీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబర్ 14, 18 రూ.కోట్ల విలువైన స్థలాలను ఆకాష్ ముఠా ఆధార్ కార్డుల్లో ఫొటోలు, చిరునామా మార్చి రిజిస్ట్రేషన్లు చేసిన బాగోతం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు కారకులైన పది మందిని తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి అధికార పార్టీ నేతల పైరవీలే కారణం అనే ఆరోపణులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి రిజిస్ట్రేషన్లు దాదాపు పది జరిగినట్లు సమాచారం. డైలీ రిజిస్టర్లోనూ.. అర్హులకు మాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తే.. ఆ వివరాలను రెవెన్యూ అధికారులు డైలీ రిజిస్టర్లో నమోదు చేయాలి. అందులో ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్ ఒకటి. ఈ అవకాశాన్ని కొందరు రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా వినియోగించుకుంటూ రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, వెంకటగిరి, నాయుడుపేట, ఎస్ఆర్ పురం, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, బంగారుపాళెం పరిధిలో ఈ తరహా ఎంట్రీలు అధికంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోగస్ ఎంట్రీల కోసం కొందరు రెవెన్యూ అధికారులు రికార్డుల్లోని కొన్ని పేపర్లను చించి వేసిన ఘటనలు ఉన్నాయి. అసలైన పేపర్ని చించి వేసి బోగస్ ఎంట్రీలతో మరో పేపర్ను సిద్ధం చేసి రికార్డుల్లో చేర్చేస్తున్నారు. జీఓ దుర్వినియోగం పేదల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ నంబర్ 463 తీసుకువచ్చింది. అర్హులు ఎవరైనా కొన్నేళ్లుగా ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నా, గృహాలు నిర్మించుకుని నివస్తున్నవారి కోసం ఈ జీఓను రూపొందించారు. అటువంటి వంటి వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తుని తహసీల్దార్ పరిశీలించి ఆర్డీఓకి పంపుతారు. రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రొసీడింగ్స్ ఇచ్చాక తహసీల్దార్ నేరుగా రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించేలా గత ప్రభు త్వం చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీఓ పూర్తిగా దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైతే అడిగినంత డబ్బులు ముట్టజెపుతారో వారికి తహసీల్దార్ వెళ్లి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే స్తున్నారు. ఇటువంటి బోగస్ రిజిస్ట్రేషన్లు తిరుపతి పరిధిలో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన పేరుని బోగస్ అని రౌండప్ చేసిన దృశ్యం తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో విశ్రాంత వీఆర్ఓ బ్రహ్మయ్య చౌదరిఆయనే అంతా.. తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన వీఆర్ఓ బ్రహ్మయ్య చౌదరిదే పెత్తనం నడుస్తోందని పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు. ఏ ఫైల్ వచ్చినా ఆయన అనుమతి లేనిదే కదలదని చెబుతున్నారు. మ్యూటేషన్, ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్, హౌస్ సైట్, డైలీ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలంటే ఆయన అనుమతి తప్పనిసరని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది నుంచి తహసీల్దార్ కార్యాలయంలో అనధికారంగా పెత్తనం చెలాయిస్తున్నారని ఉద్యోగుఉ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆశాలంటే అందరికీ నిర్లక్ష్యమే
వి.కోట: మండలంలో ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆశావర్కర్ రాణి (27) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అధికారుల వేధింపులు, తీవ్ర ఒత్తిళ్లే తన భార్య మృతికి కారణమని రాణి భర్త కేశవులు ఆరోపించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని భారత్ నగర్ సచివాలయ పరిధిలో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్న రాణి ఈ నెల 4 వ తేదీ రాత్రి ఎలుకల మందును పాలలో కలిపి తాగింది. వాంతులు చేసుకుంటుండగా గమనించిన భర్త ఆమెను హుటాహుటిన పట్టణంలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆస్పత్రికి, అటు తర్వాత వేలూరు సీఎంసీకి తరలించారు. సీఎంసీలో చికిత్స పొందుతూ బుధవారం రాణి మృతి చెందింది. తన భార్య ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. రాణి, కేశవులది ప్రేమ వివాహం కాగా, వీరికి ఇద్దరు మగ పిల్లలు. 18 నెలలు ఉచిత సేవలు రాణి సేవా దృక్పథంతో గతంలో ఆశా వర్కర్గా చేరారు. అప్పటి రాజకీయ నేతల సిఫారసులతో ఆమెకు జీతం ఇవ్వకున్నా 18 నెలలు ఉచిత సేవలు చేశారని తెలిసింది. ఆపై రాజకీయ నేతల సిఫారసుతో వచ్చావని మెడికల్ ఆఫీసర్ రెండు నెలల జీతం ఇవ్వకుండా ఆపేశారని సమాచారం. ఈ నేపథ్యంలో రాణిపై వేధింపులు తప్పలేదు. ఆమెను ఎలాగైనా తొలగించాలనే విధంగా మొత్తం వ్యవహారం జరిగిందని సమాచారం. కాగా, ఈ అంశంపై ఓగు పీహెచ్సీ వైద్యాధికారి వివరణ కోరగా సెలవు మంజూరుకానప్పటికీ రాణి మూడు రోజులు విహారయాత్రకు వెళ్లి విధులకు గైర్హాజరయ్యారని, దీనిపై అధికారులు ప్రశ్నించారని తెలిపారు. ఆశా వర్కర్ రాణి సెల్ఫీ వీడియో ఆశా వర్కర్ రాణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ తనపై వేధింపులకు ఓగు పీహెచ్సీకి చెందిన ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) నిత్య, మెడికల్ ఆఫీసర్ డా.మాధవిలే కారణమని తెలిపారు. పలమనేరు: వైద్య శాఖకు సంబంధించిన అందరి పనులు ఆశా వర్కర్లకు అప్పగిస్తున్న తంతు గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. కానీ చిన్న ఉద్యోగులుగా ఉన్న వీరు వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనని భయపడి ఎన్ని పనులు చెప్పినా చేస్తూనే ఉన్నారు. దీంతో వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, 104 వాహనాల సిబ్బంది ఆశా వర్కర్లతో అన్ని సర్వేలు, సేవలు చేయించుకుని వారేమో దర్జాగా ఉండగా.. కష్టాలేమో ఆశా వర్కర్లు పడుతున్నారు. జిల్లాలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. ఎందరో ఇలాంటి ‘ఆశా’లు బైరెడ్డిపల్లి మండలంలోని రామనపల్లికి చెందిన ఓ ఆశా వర్కర్ గత పదేళ్లుగా ప్రజలకు సేవలందిస్తూ ఎంతో ఆదరాభిమానాలను చూరగొన్నారు. కానీ లక్కనపల్లికి చెందిన ఓ సూపర్వైజర్ ఆమెను టార్గెట్ చేసి తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆ ఆశావర్కర్ గుండెకు సంబంధించిన వ్యాధితో ఆస్పత్రికి చేరి లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆపై విధుల్లో చేరినా అదే సూపర్వైజర్ వేధింపులు తప్పలేదు. దీంతో కుటుంబ సభ్యుల సలహాతో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆపై అదే పంచాయతీలో ఆ ఆశావర్కరే కావాలనే ప్రజల డిమాండ్ నేపథ్యంలో మళ్లీ ఆమెకే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కానీ ఇందుకు కారణమైన సూపర్వైజర్పై అక్కడి మెడికల్ ఆఫీసర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న వినిపిస్తోంది. కాగా ఇదే అంశంపై జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయానికి ఈ పంచాయతీ చేరింది. అక్కడ కూడా మూర్తి అనే వ్యక్తి ఆశాలపై రాజకీయం చేస్తున్నాడనే ఆరోపణ వినిపిస్తోంది.పలమనేరు నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల జనాభా ఉంది. ప్రతి వెయ్యి మందికి ఓ ఆశావర్కర్ చొప్పున 300 మంది ఆశావర్కర్లు ఇక్కడ ఉండాల్సి ఉండగా 280 దాకా ఉన్నట్టు తెలిసింది. క్షేత్ర స్థాయిలో గర్భవతులు, బాలింతలు, జ్వరాలు, రకరకాల సర్వేలు, మొత్తం వైద్య విభాగానికి చెందిన పనులన్నీ వీరే చేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, 108, 104 ఇలా అందరి ఆన్లైన్ సర్వేలను ఆశా వర్కర్లే చేస్తున్నారు. ఈ కారణాలే ఆశా వర్కర్ల బాధలు, విరమణలు, చావులకు కారణమవుతోంది. ముఖ్యంగా సంబంధిత మండలాల మెడికల్ ఆఫీసర్లు వారి వైద్య సిబ్బందికి వత్తాసు పలుకుతూ ఆశా వర్కర్ల ద్వారా అన్ని పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కొత్తగా డీఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించిన నాగశశిభూషణ్ రెడ్డి పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఐరాల: విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన బుధవారం సాయంత్రం మండలంలోని 45 కొత్తపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని 45 కొత్తపల్లెకు చెందిన టి.భాస్కర్(48) ఉదయం రోజువారి మాదిరిగానే తమ పాడి ఆవుల మేతకోసం తీసుకెళ్లి, తిరిగి సాయంత్రం పాడి ఆవులతో ఇంటికి వచ్చాడు. స్నానం చేయడానికి వెళ్తూ ప్లగ్లో విద్యుత్ వైరు పెట్టుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా భూములను లాక్కోవద్దు
భూచోళ్లు రెవెన్యూ ఉద్యోగులు రికార్డులను తారుమారు చేసి, బోగస్ ఎంట్రీలు చేసి జేబులు నింపుకుంటున్నారు.శాంతిపురం: పరిశ్రమల కోసం తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కోవద్దని శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీలోని వెంకటాపురం గ్రామస్తులు తహసీల్దార్ తనూజను వేడుకున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తహసీల్దారును కార్యాలయంలో కలిసి తమ గోడును చెప్పుకుని, వినతి పత్రం అందించారు. గ్రామంలోని వడ్డెర కులానికి చెందిన 250 కుటుంబాల వారు ఐదు తరాలుగా ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామన్నారు. బంజరు, గుట్టలతో ఉన్న భూములను అతి కష్టం మీద సాగుకు అనువుగా అభివృద్ధి చేసుకుని బోర్లు వేసుకున్నామని చెప్పారు. దీనికోసం బ్యాంకుల్లో, బయట అప్పులు చేసి పెట్టుబడి పెట్టామన్నారు. అధికారులు తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెంకటాపురం వద్ద 150 ఎకరాలను పరిశ్రమల కోసం తీసుకుంటామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని చెప్పారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వారి నుంచి భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం అవుతాయన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ తనూజ గ్రామస్తుల అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. -
ముగిసిన చాంపియన్షిప్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ కప్ – 2026 జిల్లా స్థాయి పోటీలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో పోటీలు హోరా హోరీగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 667 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 20వ తేదీ నుంచి తిరుపతిలో జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగే ప్రధాన వేడుకలో సీఎం చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. -
ఉపాధిహామీలో పెరుగుతున్న అక్రమాలు
– పోస్టల్ ఉద్యోగి ఖాతాలో నిధుల జమ గుడిపాల: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఆర్టీసీ ఉద్యోగి, నర్సు పనిచేసినట్టు వారి ఖాతాలో నిధులు జమ చేశారు. తాజాగా గట్రాళ్లమిట్ట పంచాయతీలో పోస్టల్ ఉద్యోగి పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి వారి ఖాతాలో నిధులు జమ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. గుడిపాల మండలం గట్రాళ్లమిట్ట పంచాయతీ బొమ్మసముద్రం పోస్టుమాస్టర్గా ప్రశాంత్ పనిచేస్తున్నాడు. ఈ పంచాయతీకి ఆనుకుని నంగమంగళంలో గుడిపాల మండలానికి చెందిన హెడ్ పోస్టాఫీసు ఉంది. ఇక్కడ ఉన్న పోస్ట్మాస్టర్ను వదిలేసి దూర ప్రాంతంలో ఉన్న బొమ్మసముద్రం పోస్ట్మాస్టర్ను ఫీల్డ్ అసిస్టెంట్ తమ చెప్పచేతుల్లో పెట్టుకుని కూలీల నుంచి అకౌంట్లు తెరిపించారు. కూలీల కూలి డబ్బులన్నీ పోస్టాఫీస్ ఖాతాలో జమ అవుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ కొన్ని ప్రాంతాల్లో కూలీలు పని ప్రదేశంలో ఫొటోలు తీసేవారు. అలాగే వారిని మరో ప్రాంతంలోకి తీసుకెళ్లి మరోసారి ఫోటోలు తీసేవారు. ఇలా రెండు ప్రాంతాల్లో ఫొటోలు తీసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి పనులు చేసినట్టు బిల్లులు పెడుతున్నారు. పనులు చేసే రైతు సెల్ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా పోస్టాఫిసు నుంచి నగదు తీసుకునే వెసులుబాటు ఉండడంతో ఫీల్డ్ అసిస్టెంట్, పోస్ట్మాస్టర్ చేతవాటం చూపించడం మొదలుపెట్టారు. ఇందుకు గాను పోస్ట్మాస్టర్ పేరుతో జాబ్కార్డ్ మంజూరు చేయించారు. అతను కూడా పనులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి నగదు జమచేస్తున్నారు. ఈ తతంతం మూడేళ్లుగా సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రెండో దశ కౌన్సెలింగ్కు దరఖాస్తుల ఆహ్వానం కార్వేటినగరం: ఆంధ్ర ప్రదేశ్ డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీఈఈసెట్ 2026)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం అలాగే ప్రైవేట్ డీఎల్ ఏడ్ కళాశాలల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకోసం రెండో దశ కౌన్సెలింగ్ చేపడుతుందని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దామోదరం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో దశ కౌన్సెలింగ్లో అర్హత సాధించిన అభ్యర్థులు 13వచ తేదీ నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆధారిత ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపులు చేపడుతామని పేర్కొన్నారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. సీట్లు కేటాయించిన వారు ఈ నెల21 నుంచి 24వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫీకేట్లను సమర్పించి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలన్నారు. డీఎల్ఎడ్ మొదటి సంవత్సరం తరగతులు 27 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. జెడ్పీకి చేరిన పోలింగ్ బాక్స్లు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పోలింగ్ బాక్స్లు ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి పంపారు. ఇప్పుడు అవి తిరిగి జిల్లాకు చేరుకున్నాయి. వీటిని జెడ్పీ కార్యాలయంలోని గోడౌన్లో భద్రపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లాకు 2 వేల బాక్స్లు బుధవారం ప్రత్యేక వాహనంలో వచ్చాయి. వాటిని సీఈఓ రవికుమార్నాయుడు పరిశీలించి భద్రపరచాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు. హెచ్ఐవీ నివారణలో యువత పాత్ర కీలకం పూతలపట్టు(యాదమరి): ఆరోగ్యకరమైన జీవన విధానంతో హెచ్ఐవీ నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.నాగశశిభూషణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన మండల పరిధి ముత్తిరేవుల సమీపంలోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాలలోని విద్యార్థులకు హెచ్ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సలపై అవగాహన కల్పించారు. బాధితులపై వివక్ష చూపకుండా అండగా నిలవాలని, శాసీ్త్రయ అవగాహనతో భయాలను వీడాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ జి.వెంకటప్రసాద్ మాట్లాడుతూ కళాశాల స్థాయిలోనే ఇలాంటి అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
సాధ్యమేనా.?
పురపాలక ఎన్నికల నిర్వహణకు ఆయా మునిసిపాలిటీలు ఇప్పటికే అన్ని రకాల డేటాతో కొలిక్కి వచ్చి ఉండాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. చిత్తూరు కార్పొరేషన్లో అప్పటివరకు ఉన్న 50 డివిజన్ల స్థానంలో ప్రభుత్వ ఆదేశాలతో పునర్విభజన చేసిన అధికారులు 60 డివిజన్లుగా రూపొందించి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇది ఏమాత్రం హేతుబద్ధకంగా లేదంటూ వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో.. వార్డుల పునర్విభజనకు బ్రేకులు పడ్డాయి. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కేసు కొట్టేయకుండా ఎన్నికలకు వెళ్లడం సాధ్యపడదు.● పలమనేరులో 26 వార్డుల స్థానంలో 40, నగరిలో 29 వార్డుల స్థానంలో 40 వార్డులను రూపొందించిన అధికారులు నోటిఫికేషన్ కూడా పూర్తిచేశారు. కానీ ఇప్పటివరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా లేదు. ● మునిసిపల్ ఎన్నికల పోలింగ్ తేదీకి ముందే, అంటే 30–45 రోజులకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అలాంటి సంకేతాలు ఏవీ వెలువడలేదు. ● మునిసిపల్ ఎన్నికలకు వార్డుల రిజర్వేషన్ కీలకం. అందులోనూ బీసీ ఓటర్ల లెక్క తేలాలి. ఇవేమీ అధికారుల వద్ద లేవు. -
పరిశ్రమలకు హంద్రీ–నీవా నీరు
కుప్పం రూరల్ : కుప్పం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు హంద్రీ–నీవా నీరు ఇచ్చి, మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చేస్తామని కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఆయన మంగళవారం పారిశ్రామికవాడలో నిర్మిస్తున్న మదర్ డెయిరీ పనులను పరిశీలించారు. మదర్ డెయిర్ ప్రతినిధులు నీటి సదుపాయం కల్పించాలని పీడీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. హంద్రీ–నీవా ద్వారా పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. పనుల్లో వేగం పెంచి పరిశ్రమ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం ఆయన రాళ్లబూదుగూరు ప్రభుత్వ బాలికల వసతి గృహం, విజలాపురం ఆశ్రమ గిరిజన సంక్షేమ పాఠశాల, కడపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాల, రాళ్లబూదుగూరు పీహెచ్సీలను తనిఖీ చేశారు. విద్యార్థులకు వసతుల కల్పనలో అలసత్వం వద్దని, ఏదైనా అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. గోడలపై పిచ్చి రాతలను చూసిన ఆయన పెయింటింగ్ వేయించాలని సూచించారు. కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ (పీపీపీ) స్థాయిలో హాస్టళ్లు ఉండాలన్నారు. -
భూ వివాదంతోనే హత్య
పలమనేరు: పెద్దపంజాణి మండలం మారప్పల్లిలో భూ వివాదంతోనే వ్యక్తిని హత్య చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఆయన మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న మారప్పల్లికి చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని బండపై నాటు తుపాకి కాల్పులతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పెద్దపంజాణి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా రాయలపేట సమీపంలో చెన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం తెలిసింది. భూ వివాదం కారణంగానే శ్రీనివాసులును వరుసకు తమ్ముడైన రామలింగం పథకం ప్రకారం హత్య చేసినట్టు గుర్తించారు. ఇందులో రామలింగంతో పాటు అతని స్నేహితులు, బంధువులైన తోటి నాగరాజు, రాజశేఖర్ అలియాస్ శేఖర్, భాను ప్రకాష్, మునిరాజ్ను నిందితులుగా చేర్చారు. హత్య జరిగిన రోజు శ్రీనివాసులుతో పాటు నిందుతుల్లో ఒకడైన భాను ప్రకాష్తో కలిసి బండపై మద్యం సేవిస్తూ ఇచ్చిన సమాచారంతో రామలింగం అక్కడికి చేరుకుని నాటుతుపాకీతో శ్రీనివాసులుపై కాల్చినట్టు తేలింది. సంఘటనా స్థలంలోని నాటు తుపాకీ, కుంటలోని మద్యం బాటిల్, జర్కిన్, మృతుని సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన గంగవరం సీఐ పరశురాముడు, పెద్దపంజాణి ఎస్ఐ సురేష్బాబును డీఎస్పీ అభినందించారు. -
ఉద్యోగులకు ఐగాట్ కర్మయోగి కోర్సులు తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ కచ్చితంగా ఐగాట్ కర్మయోగి కోర్సు లు పూర్తి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించేందుకు ఐగాట్ కర్మయోగి శిక్షణా కోర్సులు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని ఉద్యోగులందరూ కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 19,970 మంది ఉద్యోగులు పోర్టల్లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వారిలో 13,940 మంది యాక్టివ్గా ఉన్నారని తెలిపారు. 6,029 మంది ఇప్ప టి వరకు ఒక్కసారి కూడా లాగిన్ కాకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 2,423 మంది, పాఠశాల విద్యాశాఖలో 1,620 మంది, ప్రజారవాణా శాఖలో 959 మంది, రెవెన్యూ శాఖలో 645 మంది ఉద్యోగులు జీరో లాగిన్లో ఉన్నారని తెలిపారు. వారి ని పోర్టల్లో యాక్టివేట్ చేయించాలని అధికారుల ను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నెలకు కనీసం మూడు శిక్షణా కోర్సులను పూర్తి చేయాల ని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికే ఒకటి లేదా రెండు కోర్సులు పూర్తి చేసిన 1,640 మంది ఉద్యోగులు మూడో కోర్సును పూర్తి చేస్తే జిల్లా నిర్దేశిత లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకుంటుందని తెలిపారు. ప్రతి శుక్ర వారం ఐగాట్ కర్మయోగి పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామ ని తెలిపారు. నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణతో జిల్లా స్థానాన్ని మెరుగుపరిచి, రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా ర్యాంకును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. -
యువకుడి మృతిపై వీడని మిస్టరీ
బంగారుపాళెం: మండలంలోని గుంతూరు పంచాయతీ కురప్పల్లెకు చెందిన దేవేంద్ర, హేమలత దంపతుల కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయదీప్(24) మృతిపై మిస్టరీ వీడడం లేదు. తమ బిడ్డను తీసుకువెళ్లి చంపేశారని, వారిపై గంగవరం పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ కుమారుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. స్వగ్రామానికి చెందిన యువతిని రేండేళ్ల క్రితం నుంచి ప్రేమిస్తున్నాడని, ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు యువతిని దండపల్లె, కురప్పల్లె లోని బంధువు లింగ య్య ఇంటిలో ఉంచారని పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ రాత్రి ప్రేమించిన అమ్మాయి రమ్మని చెప్పిందని పేర్కొంటూ జయదీప్ను తన స్నేహితులైన వినీత్, కళ్యాణ్ తీసుకెళ్లారని తెలిపారు. మరుసటి రోజు తెల్లవారు జామున జయదీప్కు ప్రమాదం జరిగిందని, పలమనేరు తీసుకెళుతున్నామని ముని రాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సీఎంసీకి తీసుకువస్తున్నట్టు చెప్పడంతో తాము మొగిలివెంకటగిరి వద్ద వారిని కలిసి రాణిపేట సీఎంసీకి వెళ్లామన్నారు. వారంరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూన్ 12న మృతి చెందాడన్నారు. తీవ్రంగా తీవ్రంగా కొట్టడం వల్లే మృతి డి కురప్పల్లెలో లింగయ్య కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా కొట్టారని జయదీప్ తనకు చెప్పాడని అతని మామ విజయకుమార్ తెలిపారు. జయదీప్ మృతిపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని, సీఐ న్యాయం చేస్తామని తెలిపారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై రెండుసార్లు పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని వాపోయారు. రాజకీయ జోక్యంతో కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు. డి కురప్పల్లెకు చెందిన వసంత్, సోమశేఖర్ పలమనేరు ఎమ్మెల్యే అమరనాఽథరెడ్డి పేరు చెప్పుకుని కేసును తప్పుదోవపట్టిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బంగారుపాళెంలోని కురప్పల్లెకు వచ్చిన లింగయ్య.. కేసును రాజీ చేసుకోకపోతే జయదీప్కు పట్టిన గతే మీకు పడుతుందని బెదిరించాడని బాధితులు తెలిపారు. జయదీప్ మృతిపై న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు పేర్కొన్నారు. -
యువకుడి మృతిపై వీడని మిస్టరీ
యువకుడి మృతిలో మిస్టరీ వీడలేదు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు.విజ్ఞాన నిధిగా జిల్లా సైన్స్ మ్యూజియం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సైన్స్ మ్యూజియంను విజ్ఞాన నిధిగా తీర్చిదిద్దాలని డీఈవో లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం చిత్తూరులోని సైన్స్ మ్యూజియాన్ని తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా ఆసక్తిని పెంపొందించడంలో జిల్లా సైన్స్ మ్యూజియం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సైన్స్ నమూనాల ప్రదర్శన, గదుల అలంకరణతో పాటు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని వినూత్న ప్రదర్శనలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఈ మ్యూజియం విద్యార్థులు ఉపాధ్యాయులకు విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అందించే ఒక ఆదర్శ ప్రయోగశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా సైన్స్ అధికారి మోహన్సింగ్ మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ఇప్పటి వరకు పూర్తయిన పనులు, భవిష్యత్ కార్యాచరణను డీఈవోకు వివరించారు. క్యూరేటర్ జయంతి మ్యూజియంలోని వివిధ ప్రదర్శనలు, వాటి ప్రాముఖ్యత, ప్రత్యేకతలను వివరించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమరభేరి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఐక్యవేదికగా ఏర్పడి సమర శంఖం పూరించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలు అందించిన తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 260 మంది స్టాఫ్ నర్సులు, 76 మంది ఫార్మసిస్టులు, 61 మంది ల్యాబ్ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. వీరు రెండేళ్లుగా విధుల్లో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సకాలంలో వేతనం రాక అవస్థలు పడు తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వైద్యసేవలు లేక విలవిలలాడుతున్నారు. నిబంధన ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏకమయ్యారు. ప్రభుత్వం నుంచి కరువైన స్పందన వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు జూన్ 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. జూలై 6న ముఖ్యమంత్రి పేషీ అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, శాఖాధిపతులకు 45 రోజుల గడువుతో కూడిన సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ గడువు ఆగస్టు 20 నాటి తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విధులను బహిష్కరించి దశలవారీగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మె నోటీసులో భాగంగా జిల్లా కలెక్టర్, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రుల అధికారులు, మెడికల్ సూప రింటెండెంట్లకు నోటీసులు అందజేశారు. అంతేకాకుండా తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ప్రజాప్రతినిధులకు సమర్పించారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆగస్టు 20 నుంచి విధులను బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రధాన డిమాండ్లు -
దగా డీఎస్సీపై దండయాత్ర
పుత్తూరు: కఠోర శ్రమతో డీఎస్సీ పరీక్షకు హాజరైన విద్యార్థులను దగా చేస్తూ లీకేజీలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వం దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మంగళవారం పుత్తూరులో రోజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగింది. ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు నిందలు మోపారని తెలిపారు. అప్పుడు వైఎస్సార్ తన బిడ్డ తప్పు చేసి ఉంటే ఉరిశిక్ష వేయండి అని సీబీఐ విచారణకు వెళ్లి తమ నిజాయితీని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబుకు తన కొడుకుపై నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. తొడగొట్టే లోకేష్ నిజంగా దమ్ముంటే డీఎస్సీ లీకేజీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చేపట్టిన డీఎస్సీ నిర్వహణలో పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్ల విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రశ్నాపత్రం లీక్ కాకుంటే ఫస్ట్ ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నెలకు రూ.3 వేలను బకాయిలతో సహా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తంరెడ్డి, నగరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు రాహుల్ రాజారెడ్డి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
పలమనేరు: గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన శంకర కుమారుడు యుగంధర్(24) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరులో కూరగాయల వ్యాపారి వద్ద పనిచేసేవాడు. మదనపల్లి సమీపంలోని కొండమీదపల్లికి చెందిన ఒక యువతి, యుగంధర్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ఈ మధ్య యువతి అతన్ని దూరం పెట్టింది. వాట్సాప్ ద్వారా మెసేజ్లు, కాల్స్ చేసినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకున్నట్టు తెలిసింది. గంగవరం పోలీసులు గ్రామానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసును విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సహా 25 మందిపై అక్రమ కేసులు పూతలపట్టు(యాదమరి): డీఎస్సీలో అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజాపోరాటాన్ని చూసి ప్రభుత్వం వణికిపోతోంది. పూతలపట్టు నియోజకవర్గంలో నిరుద్యోగుల పక్షాన నిలిచి సోమవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీపై పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయించింది. ర్యాలీకి అనుమతి లేదనే సాకుతో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, లలితకుమారితో పాటు ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు సహా మొత్తం 25 మందిపైలు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కేసులు పెడతారా అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీని ఢీకొన్న ఐచర్ వాహనం పలమనేరు: పట్టణ సమీపంలోని జగమర్ల క్రాస్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఐచర్ వాహనం ఢీకొంది. దీంతో ఐచర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. అతన్ని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు విచారిస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈఓ పెంచల కిషోర్ మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అన్నదానం, కౌంటర్ల నిర్వహణ, లడ్డూ పోటులో ప్రసాదాల తయారీ వేగం పెంపు, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ఆర్జిత సేవల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఉత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, డీఈఓ సాగర్ బాబు, ఏఈలు, పలువురు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణాచిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రసూతి, శిశు మరణాలను తగ్గించి గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం కొత్తగా తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో కలి సి తల్లీబిడ్డ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 11 వాహనాల్లో చిత్తూరు నియో జకవర్గానికి ఆరు వాహనాలు వచ్చాయని తెలిపారు. గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ప్రసవం అనంతరం ఇంటికి ఉచితంగా చేర్చే సేవలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద, డీఎంహెచ్వో నాగభూషణ్ రెడ్డి, డీసీసిహెచ్ఎస్ పద్మాంజలి దేవి పాల్గొన్నారు. -
హత్య కేసులో వీడని చిక్కుముడులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ మంగాపురంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టాభినాయుడు ఇంట్లో పనిచేస్తున్న ఆనందరావు (50) శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగులను పట్టుకునేందుకు గత నాలుగు రోజులుగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ మహబూబ్బాషా మంగళవారం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రామచంద్ర, ఎస్ఐ మణికంఠేశ్వరెడ్డితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమానితో పాటు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ లభించలేదని, ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ హత్య కేసు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దొంగతనానికి వచ్చిన దుండగులు ఇంటి యజమానులను వదిలి, పనిమనిషిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అసలు అక్కడ బాంబు పెట్టి పరారవ్వాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో రేకెత్తిస్తున్నాయి. పోలీసులు ఈ చిక్కుముడులను ఛేదించి అసలు నిందితులను ఎప్పుడు బోనులో నిలబెడతారో వేచి చూడాల్సి ఉంది. -
హోరా హోరీగా పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని మెసానిక్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్ షిప్ కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు రెండో రోజు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణలో కొనసాగాయి. కబడ్డీ, బాస్కెట్బాల్, ఆర్చరీ, చెస్ తదితర పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 498 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ కోర్టులో క్రీడాకారులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పాయింట్ల కోసం తలపడ్డారు. బాస్కెట్ను టార్గెట్ చేస్తూ క్రీడాకారులు ప్రదర్శించిన సమన్వయం, వేగం వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఆర్చరీ విభాగంలో క్రీడాకారులు పూర్తి ఏకాగ్రతతో లక్ష్యం వైపు బాణాలు గురిపెట్టి సత్తా చాటారు. చదరంగం బోర్డులపై క్రీడాకారులు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ చతురతతో కూ డిన ఎత్తుగడలతో ముందుకు సాగారు. ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ పర్యవేక్షించారు. పలువురు పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. బాస్కెట్ వైపు దూసుకెళ్తూ.. లక్ష్యమే ధ్యేయంగా ఆర్చరీలో గురి -
ఆన్లైన్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పారామెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేశామని డీసీహెచ్ఎస్ పద్మాంజలీదేవి తెలిపారు. ఈ మెరిట్ జాబితా అధికారిక వెబ్సైట్లో మంగళవారం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎలక్ట్రీషియన్ (1), థియేటర్ అసిస్టెంట్ (4), ల్యాబ్ అసిస్టెంట్ (1), ప్లంబర్ (1), జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (6), పోస్ట్మార్టమ్ అసిస్టెంట్ (3), ఆఫీస్ సబ్ఆర్డినేట్ (2) కలిపి మొత్తం 18 పోస్టులకు జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తమ వినతులను సమర్పించాలని, పరిశీలన అనంతరం త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రంథాలయాల సెస్ బకాయిలు వసూలు చేయండి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న గ్రంథాలయాల సెస్ బకాయిలను వసూలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్ బకాయిల వసూల అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులు, నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే అద్భుతమైన వ్యవస్థ అని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ బకాయిల వసూలుకు మూడు నెలల కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 71 ప్రధాన గ్రంథాలయాలు, 102 బుక్ డిపాజిట్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల నుంచి రూ.33 కోట్ల సెస్ బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉన్న గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లావణ్య, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా సర్ ప్రక్రియ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఆయన మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నో మ్యా పింగ్ కేటగిరిలో ఉన్న 23,881 మంది, మ్యాపింగ్లో లాజికల్ వ్యత్యాసాలు (అనామలీస్) కేట గిరిలో ఉన్న 1,10,429 మంది ఓటర్లకు నోటీసు లు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు సమయం ఉందన్నారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3న విడుదల చేస్తారన్నారు. -
టమాట ధరలకు రెక్కలు
పలమనేరు: టమాట ధరలు పెరిగాయి. పలమనేరు మార్కెట్లో మంగళవారం బాక్సు ధర రూ.350 పలికింది. పంటలకు తెగుళ్లు సోకడం, దిగుబడి తగ్గడంతోనే ధరలు పెరిగినట్టు మండీ వ్యాపారులు చెబుతున్నారు. పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో టమాట ధరలు ఇన్నాళ్లు తగ్గుముఖం పట్టాయి. కోత కూలీలు, రవాణా చార్జీలు కూడా అందడం లేదని చాలామంది రైతులు కాయలను తోటల్లోనే వదిలేశారు. మరికొందరు తోటల నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపకుండా వదిలేశారు. దీంతో తోటలకు వైరస్ తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. అందువల్లే డిమాండ్ పెరిగి ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. టమాట పంట సాగు వివరాలు టమాట సాధారణ సాగు 5 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 2 వేల హెక్టార్లు కోతదశలో ఉన్న తోటలు 880 హెక్టార్లు -
మా తల్లిని దూషించడం కలచివేసింది
కుప్పం రూరల్: ‘టీడీపీ నాయకులు మా తల్లిని దూ షించడం నన్ను తీవ్రంగా కలచి వేసింది. టీడీపీ శ్రేణు లు నా ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. నా తల్లిన అనరాని మాటలు అన్నారు’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ వాపోయారు. ఆయన మంగళవా రం కుప్పంలో మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు కుప్పంలోనూ నిరసన చేపట్టాం. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మేం చేపట్టిన నిరసనల్ని నిలువరించింది. మేం ఇంట్లో ఉండగా టీడీపీ కూటమి నేతలు ర్యాలీ పేరిట మా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. చెప్పలేని తరహాలో మా తల్లిని దూషించి మనస్తాపానికి గురిచేశారు. నేను బ్యూరోక్రాట్ కుటుంబం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులది చీమకు కూడా హానిచేసే స్వభావం కాదు. ఎన్నికల సమయంలో నా బిడ్డను గెలిపించండి.. మీకు మేలు చేస్తాడని ఎన్నికల్లో నా తల్లి ప్రచారం చేశారే తప్ప ఎక్కడా ఎవరిని దూషించలేదు. అలాంటి మా తల్లిపై టీడీపీ మూకలు బూతులు మాట్లాడడం దారుణం. నీతులు బోధించే చంద్రబాబు ఇప్పుడు తన పార్టీ శ్రేణులతో బూతులు తిట్టించడం ఎంతవరకు న్యా యం? తన తల్లిని దూషించారని నానాయాగీ చేసిన లోకేశ్కు ఇతరుల తల్లి ఒక తల్లే అని గుర్తుకు రాలేదా?. హిందూ ధర్మాన్ని బోధించే బీజేపీ, హైందవ వాదాన్ని జపించే పవన్కల్యాణ్ క్యాడర్కు నేర్పిన బుద్ది ఇదేనా? మేం పదేళ్లుగా కుప్పంలో రాజకీయాలే చేశాం. ఎవరి వ్యక్తిగత విషయాలు, ఆడవాళ్ల గురించి మాట్లాడలేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు నిజాయితీతో కూడిన రాజకీయాలు నేర్పారు. ఆయన బాటలో నడుస్తాం. ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం. దాడులు చేస్తే పిరికిపందల్లా పారిపోయే మనస్తత్వం నాది కాదు. అంతిమంగా కుప్పం ప్రజల సంక్షేమమే మా లక్ష్యం’ అని ఎమ్మెల్సీ భరత్ చెప్పారు. డీఎస్పీకి ఫిర్యాదు తన ఇంటిపై దాడి చేసి, తన తల్లిని దూషించిన టీడీపీ కూటమి నేతలను శిక్షించాలని కోరుతూ ఎమ్మెల్సీ భరత్ మంగళవారం డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు హెచ్ఎం మురుగేష్, బుల్లెట్ దండపాణి, రామకృష్ణ, బాబురెడ్డి, చంద్రారెడ్డి, చెంగప్ప, కృష్ణమూర్తి, మునిరాజు, మోహన్రామ్, కె.మూర్తి, జీవీఆర్, పీఏ నారాయణరెడ్డి, అయ్యవారప్ప పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం మాతా, శిశు మరణాలకు గల కారణాలు, వాటి నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత (ఎనీమియా), అధిక బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమ స్యలు ఉన్న హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించాలన్నారు. ప్రసవం వరకు వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పీహెచ్సీల పరిధిలోనే గర్భిణులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు చేయాలన్నారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో రవాణా ఇబ్బందులు లేకుండా సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో డీఎంహెచ్వో నాగశశిభూషన్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
లోకల్ మార్కెట్లకు వ్యాపారులు
పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో పలమనేరు, వీకోట, ఏడోమైలులో టమాట మార్కెట్లు ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభానికి ఇక్కడి మార్కెట్లకు వంద లోడ్లు టమాట కాయలు రావాల్సి ఉండగా ఇప్పుడు 60 లోడ్లు మాత్రమే వస్తున్నాయి. స్థానికంగానూ సీజన్ ముగుస్తున్న దశలో ఉంది. గతంలో ఆలస్యంగా నాటిన తోటలు ఇప్పుడు కాపుకొచ్చాయి. ఇక అనంతపురం జిల్లాలోనూ సరుకు తగ్గింది. దీంతో బయటి రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి మార్కెట్లకు వస్తున్నారు. కావాల్సినంత సరుకు సరఫరా లేకపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరుగుదలకు కారణమైంది. ఇక్కడి టమాటాలకు ధరలు రావాలంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, సౌత్ ఆఫ్రికా దేశాలకు టమాట ఎగుమతులు పెరగాలి. అప్పుడే మరింతగా ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో పొరుగునే ఉన్న కోలారు మార్కెట్లో క్వాలిటీ టమాట బాక్సు రూ.450 పలకడం గమనార్హం. ఏది ఏమైనా మంగళవారం పలికిన ధరలు నిలకడగా ఉంటే నష్టాల నుంచి గట్టెక్క వచ్చిని రైతులు చెబుతున్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,179 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,256 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
వర్షాల కోసం విశేష పూజలు
కాణిపాకం : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మణికంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం, విశేష పారాయణాలు చేపట్టారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఆనందంతో తులతూగాలని యజ్ఞక్రతువును శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఈఓ పెంచల కిషోర్, ఆలయ కమిటీ చైర్మన్ మణి నాయుడు, సభ్యు లు అనసూయ, కృష్ణవేణి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు. మన చేతిలోనే మన ఆరోగ్యం వి.కోట : ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అందరి జీవితాల్లోకి తీసుకురావాలన్నదే ప్రధాన ధ్యే యమని మిల్లెట్మన్ డాక్టర్ ఖాదర్వలీ తెలిపారు. సోమవారం స్థానిక విద్యానికేతన్ కాలే జీ ఆవరణలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఖాదర్వలీ ఉపన్యాసం చేపట్టారు. ఖాదర్వలీ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని, స్థానిక పంటలను ప్రోత్సహించా లని, చిరుధాన్యాలను ఆహారంగా ప్రతి ఒక్క రూ తీసుకోవాలని సూచించారు. కొర్రలు, సా మలు,అరికెలు, ఊదలు, అండుకొర్రలు, రాగు లు, జొన్నలను తీసుకోవాలని కోరారు. వీటిలో పీజు పదార్ధారాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు. జిల్లా మలేరియా అధికారిగా అనిల్ కుమార్ చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లా మలేరి యా అధికారిగా కె.అనిల్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఈ బా ధ్యతలతో పాటు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అధికారాలను కూడా బదిలీ చేశారు. ఇప్పటివరకు మలేరియా అధికారిగా ఉన్న నవీన్ తేజ్ రాయల్ అన్నమయ్య జిల్లా లద్ధిగం పీహెచ్సీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. 15లోపు వంట గ్యాస్కు ఈకేవైసీ తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులు ఈ నెల 15వ తేదీలోపు ఈకేవైసీని (బయోమెట్రిక్ ధ్రువీకరణ) తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ కనెక్షన్లు దుర్వినియోగం కాకుండా చూడడంతో పాటు, అర్హులైన వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయాలన్నదే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వివరించారు. నిర్ణీత గడువులోపు ఈకేవైసీ చేయించుకోని వినియోగదారుల గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. సిలిండర్ సరఫరా కోసం ఇంటి వద్దకు వచ్చే డెలివరీ బాయ్స్ ద్వారా కూడా బయోమెట్రిక్ యంత్రాల సహాయంతో సులభంగా ఈకేవైసీ చేయించుకోవచ్చని వెల్లడించారు. రోయింగ్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చిత్తూరు కలెక్టరేట్: జాతీయ స్థాయి రోయింగ్ పోటీలలో జీడీ నెల్లూరు మండలం పాచిగుంటకు చెందిన తనీ ష్ స్వర్ణ పతకం సాధించారు. 14 ఏళ్ల తనీష్ పూణే లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఖడ్కీ)లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రవీంద్ర సరోబర్ లేక్లో 27వ సబ్–జూనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్షిప్ పోటీలు పెట్టారు. ఇందులో తనీష్ బృందం మణిపూర్ బృందంపై గెలిచి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. -
అడ్డంకులు
అడుగడుగునా పలమనేరులో చేపట్టిన ర్యాలీకి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలుచిత్తూరు అర్బన్ : డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదంగా.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేశారు. పోస్టింగులు కాపాడుకోవడానికి కొందరు., స్వామి భక్తి నిరూపించుకోవడానికి మరికొందరు పోటీ పడ్డారు. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపాలని చూసి నవ్వులపాలయ్యారు. నాయకులను అరెస్టుచేస్తే కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ పోలీసుల నీతిమాలిన చర్యను రోడ్డుపైనే కడిగేశారు. పోలీసులు ర్యాలీలైతే అడ్డుకున్నారు కానీ, ప్రజల్లో వెళ్లాల్సిన వాస్తవాలను మాత్రం దాచలేకపోయారు. ప్రతిపక్షం గొంతుకను నొక్కలేకపోయారు. పోలీసులు తరలిస్తున్న వాహనం నుంచి అభివాదం చేస్తున్న నారాయణస్వామిచిత్తూరులో విజయానందరెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులువైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలపై రెడ్బుక్ రాజ్యాంగం -
నువ్వా నేనా సై..!
సంక్లిష్టమైన యోగాసనాలు వేస్తూ.. అథ్లెటిక్స్లో దూసుకెళుతున్న క్రీడాకారులుచిత్తూరు మెసానిక్ మైదానంలో అమరావతి చాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు నువ్వా, నేనా? సై అనే లెవెల్లో పోటీపడ్డారు. పరుగు పందేల్లో క్రీడాకారులు చిరుతల్లా పరుగులు తీశారు.. హాకీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇక, బాక్సింగ్ రింగ్లో అయితే క్రీడాకారులు తమ పంచ్లు విసురుతూ, హుక్లతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు శ్రమించారు. యోగా పోటీల్లో విభిన్నమైన ఆసనాలతో ఆకట్టుకున్నారు. – చిత్తూరు కలెక్టరేట్ -
రిజిస్ట్రేషన్లు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగానే ఏటా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పేరిట విద్యార్థుల్లో విజ్ఞాన ప్రతిభను వెలికితీస్తున్నారు. ఈ ఏడాది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ‘32వ జాతీయ బాలల సైన్న్స్ కాంగ్రెస్–2026’లో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల ఏపీ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నోటిఫికేషనన్ విడుదల చేసింది. 15వ తేదీ లోగా రిజిస్ట్రేషన్న్ చేసుకోవాలి ‘సుస్థిరత కోసం సైన్న్స్ ఆవిష్కరణలు’ అనే అంశంపై నిర్వహించే ‘32వ జాతీయ బాలల సైన్న్స్ కాంగ్రెస్–2026’లో పాల్గొనే విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఈ నెల 15వ తేదీలోగా రిజిస్ట్రేషన్న్ చేసుకోవాలి. వ్యర్థాల నిర్వహణ, శక్తి–అన్వేషణ, వర్షపు నీటి సంరక్షణ, ఆహారం–వ్యవసాయం, స్థిరమైన అభివృద్ధి–సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు అనే ఐదు అంశాలపై సమస్యలను గుర్తించి సమాజానికి ఉపయోగపడేలా పరిష్కారం చూపిస్తూ ప్రాజెక్టులు తయారు చేయాలి. అర్హులు వీరే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్థాయి పోటీలు అక్టోబరు, నవంబరులో జరుగుతాయి. డిసెంబర్లో రాష్ట్ర స్థాయి, వచ్చే ఏడాది జనవరిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాలు ఇస్తారు. విద్యార్థులు www. ncrc.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారేందుకు ఇది చక్కని అవకాశం. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చిన్న పరిశోధన గొప్ప ఆవిష్కరణ కావొచ్చు. – లక్ష్మీనారాయణ, డీఈవో -
ఐరాల ఎస్ఐ సస్పెన్షన్కు డిమాండ్
చిత్తూరు అర్బన్: దివ్యాంగుల సమస్యలు పట్టించుకోకుండా.. వాళ్లపై దాడులకు కారణమైన ఐరాల ఎస్ఐను సస్పెండ్ చేయాలని వికలాంగుల జేఏసీ నేతలు చంద్రశేఖర్, సుమతి డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో నిర్వహించిన పోలీసు గ్రీవెన్సులో అధికారులకు రాత పూర్వక ఫిర్యాదు అందచేశారు. వారు మాట్లాడుతూ జూలై 8వ తేదీన దివ్యాంగురాలు విజయ ఇంటి స్థలం విషయంలో న్యా యం చేయాలని ఎస్ఐను కోరితే పట్టించుకోలేదన్నారు. పైగా తమపై దాడి చేయించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ నేతలు మురళి, బాలాజీ నాయుడు, భూపాల్ పాల్గొన్నారు. సకాలంలో సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. సోమవారం నిర్వ హించిన డయల్ యువర్ ఎస్ఈలో ఆయన మాట్లాడారు. స్థానిక ముత్తిరేవులలో తమ ఇంటి పరిసరాల్లోనే అనుమతి లేకుండా ట్రాన్స్ఫార్మర్ పెట్టారని వినియోగదారుడు రాజాగోపాల్రెడ్డి ఫిర్యాదు చేశారు. నగరంలోని సంతపేటలో రామచంద్ర ఆశ్రమం వద్ద లూజ్లైన్ను బాగుచేయాలని స్థానికుడు జగదీష్ కోరారు. అలాగే పలమనేరులోని పలమాకులపల్లె రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా కరెంటు స్తంభం నాటినట్లు సుబ్రమణ్యంరెడ్డి ఫిర్యాదు చేశారు. అన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం యాదమరి: మండలంలోని పెరుమాళ్లపల్లె సమీపంలోని ఆరు వరుసల జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం పడి ఉందని ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. సోమవారం ఈ మేరకు రాంప్రసాద్ అనే వ్యక్తి అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామన్నాఉ. మృతుడి వద్ద ఆధారాలు లేకపోవడంతో గ్రామంలో విచారించామని వెల్లడించారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిగా తెలిసిందని చెప్పారు. అనారోగ్య కారణాలతో మరణించి ఉంటాడని గుర్తించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య రేణిగుంట: మండలంలోని వెంకటాపురం సమీపంలోని ఇటుకుల తయారీ కేంద్రంలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తున్న కె.చిరంజీవి (24) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తవణంపల్లి మండలం, ముత్తరపల్లికు చెందిన చిరంజీవి వివాహ సమయంలో చేసిన రూ.4 లక్షల అప్పును తీర్చేందుకు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 9వ తేదీ రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా, చిరంజీవి నివాసముంటున్న రేకుల షెడ్డు పైకప్పులోని ఐరన్ రాడ్కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేనిగుంట పోలీసులు తెలిపారు. -
వృద్ధులకు ఆసరాగా ‘హెల్ప్లైన్’
– అందుబాటులో 14567 టోల్ ఫ్రీ చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల (సీనియర్ సిటిజన్లు) సంక్షేమం, రక్షణ కోసం 14567 ప్రత్యేక హెల్ప్లైన్ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే వృద్ధులకు ఉచితంగా నాలుగు రకాల సేవలను అందిస్తారు. ఈ హెల్ప్లైన్ సేవలు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అవసరమైన సమాచారంతో పాటు మార్గదర్శకత్వాన్ని ఈ వేదిక ద్వారా అందిస్తారు. సేవలు ఇవే.. -
డయల్ యువర్ సీఎండీకి 58 వినతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 9 జిల్లాల నుంచి 58 వినతులు అందినట్లు సంస్థ సంస్థ డైరెక్టర్ పి.అయూబ్ఖాన్ తెలిపారు. విద్యుత్ వ్యవసాయ సర్వీసుల మంజూరు, విద్యుత్ స్తంభాల మార్పు, వోల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, 1912, 1800 425 155333 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయవచ్చని, 91333 31912 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు తెలియజేయ వచ్చని సూచించారు. డైరెక్టర్లు కె.గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సీహెచ్.రామచంద్రరావు, కె.సంపత్కుమార్, ఎస్.రమణ పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 43 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 43 వినతులు అందాయి. సోమవారం చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఏఎస్పీలు మహబూబ్బాషా, షాను హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ బంగారుపాళెం: మండలంలోని టేకుమంద సమీపంలో సోమవారం రాత్రి పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురుని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
ఔరా.. ఔషధి!
కాణిపాకం: తిరుపతి జిల్లాలో దాదాపు 2,600 మెడికల్ షాపులు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 14 మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన జనరిక్ దుకాణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పరిధిలో సుమారు 900 మెడికల్ షాపులు నడుస్తుండగా, వీటిలో కేవలం 9 జనరిక్ షాపులు మాత్రమే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. లాభాలన్నీ వారి ఖాతాలోకే... సాధారణంగా బ్రాండెడ్ మందులన్నీ కంపెనీ ప్రతినిధులు, సీ అండ్ ఎఫ్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ తర్వాత రిటైలర్ల ద్వారా సుదీర్ఘమైన సరఫరా వ్యవస్థ దాటుకుని వినియోగదారుడికి చేరుతాయి. కానీ, జనరిక్ మందులు నేరుగా డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్ల చేతికే అందుతాయి. ఈ ప్రక్రియలో లభించే భారీ లాభాల మార్జిన్ను వినియోగదారుడికి డిస్కౌంట్ రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. ఆ ప్రయోజనాలను మెడికల్ షాపుల యజమానులే నొక్కేస్తున్నారు. జేబుకు చిల్లు! ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో మాత్రమే అసలైన జనరిక్ మందులు, అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయనేది అధికారుల వాదన. అయితే అలాంటి పలు షాపుల్లో కూడా ప్రజలకు నిర్ణీత ధరలకు మందులు దొరకడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక సాధారణ ప్రైవేట్ షాపుల్లో మాత్రం జనరిక్ పేరుతో నాణ్యత లేని మందులను అంటగడుతూ సామాన్యుల జేబుకు చిల్లులు పొడుస్తున్నారు. ఇక అనుమతులు లేని షాపులు కూడా విచ్చలవిడిగా వ్యాపారం సాగిస్తుండడం గమనార్హం. కొందరు ఈ గోల్మాల్ను పసిగడుతున్నప్పటికీ ప్రశ్నించే నాథుడు కరువయ్యాడు. ఇదిగో సాక్ష్యం తిరుపతి నగరానికి చెందిన రెహమాన్ అనే ఓ వ్యక్తి ఎదుర్కొన్న అనుభవమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన క్రమం తప్పకుండా వాడే రాబేసిక్ డీఎస్ఆర్ అనే మాత్రల షీట్ను ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో కేవలం రూ.35లకే కొనుగోలు చేసేవాడు. అయితే, ఇటీవల తిరుపతిలోని ఒక ప్రైవేట్ జనరిక్ షాపునకు వెళ్లగా.. అదే మాత్రల షీట్కు ఏకంగా రూ.175 వసూలు చేశారు. ఇతర ప్రాంతాల్లో రూ.35లకే లభించే మందులకు ఇక్కడంత రేటు ఏంటని నిలదీయగా.. కవర్ మీద రూ.177.15 ఉంది.. ధర అంతే ఉంటుంది అని షాపు నిర్వాహకుడు దురుసుగా సమాధానమిచ్చాడు. బాధితుడు గొడవకు దిగడంతో నీ వల్ల అయింది చేసుకోపో అంటూ సదరు వ్యాపారి బెదిరింపులకు తెగబడ్డాడు. కేవలం రెహమాన్ ఒక్కడే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా రోజువారీగా ఇలాంటి దగాకు గురవుతున్న బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల్లోనూ అంతే రాబేసిక్ డీఎస్ఆర్ అనే మాత్రల షీట్ను కొత్తగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో అడిగితే ఒక షాపులో రూ.88 చెప్పారు. మరో దుకాణంలో రూ.85 చెబుతున్నారు. అధికారులు స్పందించేనా? జిల్లా వ్యాప్తంగా వందలాది మెడికల్ షాపుల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి, షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీనిపై సంబంధిత శాఖ ఏడీ హరిప్రసాద్ను వివరణ కోరగా.. ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోగానికి మందు వేసుకుంటే నయమవుతుందని వచ్చే సామాన్యుడికి మెడికల్ షాపుల నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. మందుల బిల్లులతో చెమటలు పట్టిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ప్రాణభయాన్ని ఆసరాగా చేసుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రైవేట్ మందుల షాపుల యజమానులు దోపిడీకి తెరతీస్తున్నారు. నిబంధనలను నడిరోడ్డుపై పాతిపెడుతూ, వ్యాపారమే పరమావధిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘జనరిక్’ ఆశయానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. బ్రాండెడ్ పేరుతో దోపిడీ.... చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు జనరిక్ మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నట్లు రోగులు, వారి సహాయకులు మండిపడుతున్నారు. ఇక రిటైల్ మెడికల్ షాపుల్లో జనరిక్ మందులను కూడా బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తూ అమాయక ప్రజలను నిలువునా దగా చేస్తున్నారు. ప్రైవేట్ షాపుల్లో అమ్మే జనరిక్ మందులపై స్పష్టమైన డిస్కౌంట్ నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ నిబంధనల ప్రకారం గరిష్ట ధర కంటే ఎక్కువకు అమ్మకూడదనే కనీస సూత్రాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు. -
పరిశీలించి.. పరిష్కారం
శ్రీరంగరాజపురం : ఎస్ఆర్పురం మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జిల్లా అధికారులకు వినతులు సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ అన్ని వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. అందుబాటులో ‘క్యూఆర్ కోడ్’ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన సోమవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారిక వెబ్సైట్ www.meekosam.ap.gov.inలో నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి, ఇతర వివరాల కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో ప్రదర్శించిన ‘సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్’ను స్కాన్ చేసి అర్జీదారులు తమ ఫిర్యాదు పరిష్కారంపై ఫీడ్బ్యాక్ నమోదు చేయవచ్చని వివరించారు. బ్యాటరీ సైకిల్ కావాలి -
నేడు కుప్పంలో ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు కుప్పంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. స్థానిక వాల్మీకి కల్యాణ మండపంలో నిర్వహించనున్న సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. గిరిజనుల వినతులు స్వీకరించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు కుప్పం నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం బయలుదేరి వెళతారని వివరించారు. వైభవంగా ప్రదోషకాల పూజలు కాణిపాకం: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధమైన శ్రీమణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో సోమ వా రం సాయంత్రం ప్రదోషకాల పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ప్రదోష వేళ నందీశ్వర స్వామివారికి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేపట్టారు. అనంతరం నందీశ్వరుడిని వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. -
నేను చనిపోయినా మెదడు బతికుంటుందిగా.. ఆ 7 నిమిషాలు నీ గురించే..
ఆంధ్రప్రదేశ్: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్..జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
డీఎస్సీ ర్యాలీపై పచ్చ కుట్రలు
సాక్షి టాస్క్పోర్స్: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ, తప్పులకు నైతిక బాధ్యతగా విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ బాధితులతో కలిసి వైఎస్ఆర్సీపీ నిరసనలకు దిగడం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండు కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 30 యాక్టు పేరుతో అనుమతులు లేవని ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగుతున్న నిరసనను ఇక్కడ కూడా చేపడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరగకుండా చేసేందుకు అకస్మాత్తుగా విజయోత్సవ ర్యాలీకి రూపకల్పన చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 50 మందిని తీసుకురావాలని స్థానిక నాయకులను పురమాయించారు. తమకు కంచుకోటగా టీడీపీ నాయకులు చెప్పుకునే కుప్పం నియోజకవర్గంలోనూ విపక్షానికి పెరుగుతున్న ఆధరణను చూసి అధికార పార్టీ జడుసుకుంటోందా?.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే కనీస హక్కును సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందా ?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. పోలీసుల పచ్చ పాతం నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కుప్పం పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పది రోజుల ముందే పార్టీ ప్రకటించిన ర్యాలీని ఓ వైపు అడ్డుకొంటూ మరో వైపున టీడీపీ మెరుపు ర్యాలీకి మాత్రం పచ్చ కార్పెట్ పరిచారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి మాత్రం ఎవరూ రాకూడదని సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టారు. ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని భావించిన నాయకులకు నేరుగా ఫోన్లు చేసి బెదిరింపులకు పూనుకున్నారు. ఒక్క రోజు ముందుగా తెర మీదికి వచ్చిన టీడీపీ ర్యాలీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా సహకారం అందిస్తున్నారు. ఇరు పార్టీల ర్యాలీలతో కుప్పం నియోజకవర్గంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
– 11 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం పుత్తూరు: ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి పుత్తూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న గంజాయి ముఠాలోని ఆరుగురుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.67 లక్షల విలువైన 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జి.రవికుమార్ తెలిపారు. డీఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాలు.. విశ్వసనీయ సమాచారంతో సీఐ నెట్టి కంఠయ్య, ఎస్ఐలు నాగేంద్రబాబు, వెంకటలక్ష్మి బృందం పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగ చెరువు సమీపంలో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అరెస్ట్ అయిన వారిలో టీఆర్కండ్రిగ కాలనీకి చెందిన కె.నవీన్కుమార్(36), గేట్పుత్తూరుకు చెందిన వి.జయప్రకాష్(25), ఎం.ఆర్.దేవరాజ్(24), సి.ఎస్.మూర్తి(24), గొల్లపల్లికి చెందిన బి.బాబునాయుడు(50), తాయిమాంబాపురానికి చెందిన రోహిత్(23) ఉన్నారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మోటార్ సైకిళ్లు, 6 సెల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. టీఆర్కండ్రిగ కాలనీకే చెందిన మరో ఇద్దరు నిందితులు రాజేష్, శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. -
వసతి గృహాల్లోకి అనుమతించాలి
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాలను, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ డిమాండ్ చేశారు. నగరంలో విద్యార్థి సంఘాలను హాస్టల్స్లోకి అనుమతించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశం, సమావేశాలను నిషేధించడం అత్యంత అప్రజాస్వామికమైన చర్య అన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. నాయకులు శామ్యూల్, రెడ్డిప్రసన్న, రెడ్డెయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం శాంతిపురం: ఆహారంలో చిరుధాన్యాలను పెంచుకొంటూ ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ మిల్లెట్ మ్యాన్, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్వలి చెప్పారు. శాంతిపురంలోని బాలాజీ కల్యాణ మండపంలో ఆదివరం సాయంత్రం జరిగిన చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మిల్లెట్స్ తింటూ జీవన శైలిలో మార్పులతో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జబ్బులను నియంత్రించవచ్చని అన్నారు. మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం వారు ఆహారంగా తీసుకున్న చిరుధాన్యాలలోనే ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుప్పం మిల్లెట్ రివైవల్ ప్రాజెక్టు ద్వారా చిరుధాన్య ఆధారిత నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు పాల్గొన్నారు. అప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తా! జీడీనెల్లూరులో చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి గంగాధర నెల్లూరు : ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్ జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది. -
ఎకై ్సజ్ చేయలేక!
అబ్కారీ మద్య నియంత్రణ శాఖ (ఎకై ్సజ్) పనితీరు ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రతి నెలా మద్యం ప్రియులకు రూ.కోట్ల విలువైన మద్యం తాగిస్తున్న ఎకై ్సజ్ అధికారులకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా రవాణా భత్యం, ఏడాదిగా అద్దె వాహన బిల్లులు మంజూరు చేయలేదు. ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తుంటే ఉద్యోగుల సర్దుబాటు పేరిట.. మరికొందరిని పక్క జిల్లాలకు పంపించే ఏర్పాట్లు జరగుతున్నాయి. పర్యవసనం.. ఈ విభాగంలో ఎకై ్సజ్ చేయలేక అధికారులు–సిబ్బంది నలిగిపోతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత మరోవైపు స్టేషన్లలో సిబ్బంది కొరత ఎకై ్సజ్శాఖను వేధిస్తోంది. ఎనిమిది స్టేషన్లలో ఇప్పటికే దాదాపు 200 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన నియామకాలు తప్ప.. మళ్లీ ఇప్పటి వరకు ఎకై ్సజ్ శాఖలో ఖాళీల భర్తీకి నోచుకోలేదు. ఇక ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో జిల్లాలో ఉన్న 130 మందికి పైగా సిబ్బందిని ఇతర జిల్లాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఎకై ్సజ్ పరిపాలన పూర్తిగా నిర్వీర్యం కావడం ఖాయం. చిత్తూరులోని ఎకై ్సజ్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఓవైపు ఊరూరా బెల్టు దుకాణాలు.. అక్రమ మద్యం చిత్తూరు అర్బన్: జిల్లాలో చిత్తూరు అర్బన్, చిత్తూ రు రూరల్, కార్వేటినగరం, నగరి, పుంగనూరు (నాలుగు మండలాలు), పలమనేరు, కుప్పం, పులిచెర్ల (మూడు మండలాలు)ల్లో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 31 మండలాల పరిధిలో ప్రభుత్వం విధించే ప్రతి నెలా లక్ష్యాన్ని ఎకై ్సజ్ అధికారులు చేరుకోవాల్సిందే. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు. నెలకు దాదాపు రూ.50 కోట్ల విలువైన మద్యాన్ని తాగించడంలో లక్ష్యాలు కేటాయిచి మరీ ప్రభుత్వం, అధికారులకు బాధ్యతలను అప్పగిస్తోంది. వీటిని వంద శాతం అమలు చేయాల్సిందే. ఇక పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా చేయడం, నాటు సారా నియంత్రించడం, బెల్టు దుకాణాలు ఉండకుండా చేయాలనే విధులు సైతం అబ్కారీ శాఖ చూస్తోంది. బిల్లులు ఇవ్వరా? జిల్లాలోని ఎనిమిది అబ్కారీ శాఖ పోలీస్ స్టేషన్లతో పాటు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ పేరిట ఉన్న రెండు విభాగాలు తప్పనిసరిగా గ్రామాల్లో ప్రతి రోజూ తిరగాల్సిందే. నాటు సారా తయారీని నిర్మూలించడంతో పాటు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)ను అరికట్టడానికి స్టేషన్ ఎస్హెచ్వోలకు నెలకు రూ.33 వేలు చెల్లించేలా అద్దె జీపులు ఉన్నాయి. కానీ ఏడాదిగా రూపాయి కూడా వాహన అద్దె బిల్లులు విదల్చలేదు. జేబులో ఉన్న డబ్బులు పెట్టుకుని ఇంధనం నింపుకున్నా.. ఏళ్ల తరబడిగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఖాకీ దుస్తు లు ధరించిన అధికారుల్లో కొందరు మద్యం వ్యాపారుల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. దాదాపు రూ.5 లక్షల అద్దె వాహన బిల్లులు, రెండేళ్లుగా రవాణా భత్యం ఇవ్వకపోవడంతో రూ.6 లక్షలకు పైగా బకాయిలు పేరుకున్నాయి. -
● పిల్లల్లో మేధో వికాసానికి దోహదం ● లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ప్రభాకర్రాజు
చదరంగం జీవితానికి ప్రతిబింబం నగరి: చదరంగం క్రీడ మాత్రమే కాదని, అది మనిషి జీవితాన్ని ప్రతిబింబించే మేధో క్రీడ అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, రిటైర్డ్ డిప్యూటీ డీఈవో ప్రభాకర్రాజు తెలిపారు. నగరి మండలంలోని వీకేఆర్పురం గ్రాండ్ వరల్డ్లో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నగరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల చెస్ పోటీల ఫైనల్స్, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో మొత్తం 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో టి.హేమాద్రి, (నగరి), డి.శ్యామ్కుమార్ (శ్రీకాళహస్తి), ఎన్.సహస్ర (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జూనియర్స్ విభా గంలో టీ.చైతన్య (నగరి), సాయిచరణ్ (తిరుపతి), ఆషిక్ ఇల్లాహి (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. అండర్ 9 విభాగంలో పి.పవన్కిరీటిరెడ్డి (తిరుపతి), తేజ సూర్యనారాయణ (నగరి), పీవీఎం.సాత్విక్ (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. సీనియర్స్ విభాగంలో ముగ్గురికి, జూనియర్స్ విభాగంలో 22 మందికి, అండర్–9 విభాగంలో 10 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న మహిళలు, దివ్యాంగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్రాజు మాట్లాడుతూ చదరంగంలో ప్రత్యర్థి వేసే ఎత్తును ముందుగానే ఊహించి తదుపరి అడు గు వేయాలన్నారు. మరో అతిథిగా పాల్గొన్న పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ చదరంగం చిన్నారుల్లో చదువుపై ఏకాగ్రతను పెంచడంతో పాటు, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రతి ఎత్తు ఒక పాఠాన్ని నేర్పుతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గజేంద్ర, డైరెక్టర్లు రవిబాబు, ఆర్ఎన్ దేవన్, చదరంగ నిపుణులు నవీన్కుమార్, జీవన్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్కుమార్, కోశాధికారి శక్తివేలు పాల్గొన్నారు. -
చేయి తడపందే సర్టిఫికెట్ రాదు!
గుడిపాల : గుడిపాల మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇంటిపై లోన్ తీసుకునేందుకు పొజెషన్ సర్టిఫికెట్ కావాలంటే ఏకంగా రూ.20 వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ తతంగం అంతా ఓ వీఆర్వో కనుసన్నల్లోనే సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. మండలంలోని పాపసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ వీర్ఓకు రూ.20 వేలు లంచం ఇచ్చి మరీ పొజెషన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా మండలంలో వందలాది మంది బ్యాంక్ రుణం తీసుకునేందుకు లంచాలు ఇచ్చి పొజెషన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ లాగిన్లన్నీ ప్రైవేట్ వ్యక్తికి గుడిపాల మండలంలో వీఆర్ఓలు, ఆర్ఐలు, తహసీల్దార్కు సంబంధించిన లాగిన్లన్నీ ఓ ప్రైవేట్ వ్యక్తి చేతికి అందినట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వీటన్నింటికీ సూత్రధారి, పాత్రధారి ఆ వీఆర్ఓనే. ఆ వీఆర్ఓ ఏం చెబితే అందుకు తహసీల్దార్ తలూపాల్సిందే. అందుకు తహసీల్దార్ ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు సమాచారం. తహసీల్దార్ ఖర్చు రోజుకు రూ.3 వేలు స్థానిక తహసీల్దార్కు రోజుకు ఖర్చు రూ.3 వేలు అవుతుందని.. ఆ వీఆర్ఓ మిగతా వీఆర్ఓలకు బాహాటంగా చెబుతున్నాడు. రోజూ తిరుపతి నుంచి కారులో తహసీల్దార్ వస్తున్నాడని, ఖర్చు రూ.3 వేలుదాకా అవుతోందని, అందుకు అనుగుణంగా మీరు కుడా వసూళ్లు చేయాలని చెబుతున్నట్టు సమాచారం. కొత్త పాస్ పుస్తకాలు, మ్యుటేషన్స్, పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్లు చేర్చడం వంటి వాటికి రేటును అధనంగా పెంచుకోవాలని మిగతా వీఆర్ఓలకు కూడా సూచిస్తున్నట్టు చర్చ సాగుతోంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తనకు చెప్పాలని ఆయన బాహాటంగానే చెబుతున్నట్టు సమాచారం. రీసర్వే గ్రామాల రైతులకు చుక్కలు గుడిపాల మండలంలో రీసర్వే చేస్తున్న రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. కొంతమంది రైతులకు అనువంశికంగా వస్తున్న భూములకు సంబంధించి పంటలు చేసుకుంటున్నా ఎటువంటి రికార్డులు మాత్రం లేవు. అటువంటి వాటిని గమనించి వేలాది రూపాయలు రైతుల వద్ద నుంచి గుంజుకుంటున్నారు. ఓ రైతు తనవద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేవని, భూమి మాత్రం తనదేనని చెప్పడంతో ఆ రైతును మాయ చేసి అతని వద్ద నుంచి రూ.30వేలు వసూలు చేసినట్టు స్థానికంగా చర్చసాగుతోంది. రికార్డులు మొత్తం తామే చూసుకుంటామని తహసీల్దార్ కార్యాలయానికి రూ.20 వేలు, ఆర్డీఓ కార్యాలయాలనికి రూ.5 వేలు, జేసీ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి రూ.5 వేలు చొప్పున రూ.30 వేలు వసూలు చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా తహసీల్దార్ కార్యాలయం లాగిన్లో పంచాయతీల వారీగా చూస్తూ సంబంధిత వీఆర్వో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు సమాచారం. తహసీల్దార్ డ్రైవర్ ఆ వీఆర్ఓనే గుడిపాల తహసీల్దార్ డ్రైవర్గా ఆ వీఆర్ఓ వ్యవహరిస్తూ కార్యకలాపాలన్నీ చూస్తున్నట్టు తెలుస్తోంది. తానే తహసీల్దార్ డ్రైవర్గా ఉన్నానని.. ఏది ఏమైననా తానే కార్యకలాపాలన్నీ చూసుకుంటూ ఉంటానని చెబుతున్నట్టు తెలుస్తోంది. -
కృషి ఒకరిది.. ప్రచారం మరొకరిది!
పుత్తూరు: మాజీ మంత్రి ఆర్కే రోజా అలుపెరగని పో రాట ఫలితంగా పుత్తూరు పట్టణంలోని శ్రీధర్మరాజుల ఆలయ సమీపంలో రైల్వే అండర్ సబ్వే నిర్మాణానికి రైల్వేశాఖ రూ.2.47 కోట్లు మంజూరు చేసింది. ఫలితంగా గేట్పుత్తూరు వాసులతో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. దశాబ్దాల తమకల నిజమవుతోందని స్థా నికులు రోజమ్మకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు. అయితే దీనిని స్థానిక టీడీపీ నేతలు తమ అధినేత, సీ ఎం చంద్రబాబునాయుడు వారసత్వంగా క్రెడిట్ చోరీ కి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు నవ్వుకొంటున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మాజీ మంత్రి రోజా పోరాట గురుతులు కళ్ల ముందు కనిపిస్తుంటే, తామే సాధించినట్లు స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్ర చారం చేసుకోవడం పట్ల చెవులు కొరుక్కుంటున్నారు. ప్రజల కోసం రోజమ్మ పోరాటం ఇలా.. పుత్తూరు పట్టణాన్ని రెండుగా చీల్చుతూ ఉన్న రైల్వేట్రాక్ను దాటుతూ రోజువారి పనులకు పరుగులు పెట్టే స్థానిక ప్రజలకు భద్రత కల్పించాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా అధికారంలో ఉన్నా లేకున్నా గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 2023 ఆగస్టు 16న నాటి పర్యాటక శాఖ మంత్రి హోదాలో అర్కే రోజా అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలసి అభ్యర్థించారు. గత ఏడాది నవంబర్ 28న తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు మరోదఫా వినతి పత్రం ఇప్పించారు. ఇటీవలే ఢిల్లీలో మరోమారు రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇలా పట్టువదలని విక్రమార్కుడిలా రైల్వే మంత్రి వెంటబడడంతో పుత్తూరులో రైల్వే సబ్వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 29న పుత్తూరుకు వచ్చిన డివిజినల్ రైల్వే మేనేజర్ శైలేంద్రసింగ్ మాజీ మంత్రి రోజాతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోజా అభ్యర్థన మేరకు శ్రీధర్మరాజుల ఆల యం ఎదురు గా రైల్వే సబ్వే నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ఆ మేరకు రైల్వే శాఖ నిదులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
గిరిజనులు ఆర్థిక సాధికారత సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన కలెక్టర్కు విద్యార్థులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజనులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను సమీక్షించి భర్తీ కి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతా ల్లో గుర్తించిన ఆరు ప్రధాన రోడ్ల నిర్మాణానికి నిధు లు మంజూరు చేయిస్తామన్నారు. వచ్చే ఆరు నెల ల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,907 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.6.52 కోట్ల విలువైన పథకాలను అందించామన్నారు. ఆర్వోఎఫ్ఆర్లో 22 మంది గిరిజన రైతులకు 19.99 ఎకరాలకు వ్యక్తి గత పట్టాలు, సామాజిక క్లెయిమ్లో 50 మందికి 41 ఎకరాలకు హక్కులు కల్పించామని వివరించారు. అర్హులైన రైతులకు పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఏడాదికి రూ.20 వేల సాయం అందుతోందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని మూడు గిరిజన విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులకు రూ.2.64 కోట్లు, ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.17.7 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ప్రద ర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నా యి. ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, గిరిజన సంఘాల నాయకులు చిరంజీవులు, జీవీ రమణ,రాజశేఖర్, రవినాయక్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మునస్వామి, రాజ్కుమార్, రఘురాం పాల్గొన్నారు. -
నాటుకుంటున్న నేర సామ్రాజ్యం!
చిత్తూరు అర్బన్: జిల్లాలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. నాటు తుపాకుల మోత మోగుతోంది. సొంతంగా నాటు బాంబులు తయారు చేస్తూ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మనుషులను సైతం చంపేస్తున్నారు. దీన్ని ఆదిలోనే తుంచేయకపోతే పోలీసులకు కొరకరానికొయ్యగా మారడం ఖాయం. చిల్లర కొట్టులో దొరికినట్టు జిల్లాలో చిత్తూరు దాటుకున్న తరువాత బంగారుపాళ్యం, మొగిలి, పలమనేరు, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ వేల హెక్టార్లలో కౌండిన్య అడవులు ఉండడంతో ఇక్కడి వన్యప్రాణులను వేటాడడానికి నాటు తుపాకులు విరివిగా ఉపయోగిస్తున్నారు. సొంతంగా తయారు చేసుకునేవాళ్లు కొందరైతే, ఉత్తరాధి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు రహస్యంగా తెప్పించుకుంటున్న వాళ్లు మరికొందరు. ఎటుచేరి ఈ నాటు తుపాకులు అడవి జంతువులతో పాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం పెద్దపంజాణి మండలం, మారెప్పపల్లెలో మేకల శ్రీనివాసులు నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు, అరెస్టు చేయడానికి చర్యలు చేపట్టారు. పోలీసులు నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. బాంబుల మోత చిత్తూరులో మూడు రోజుల క్రితం ఓ ఇంటి కాపలాదారుడిని హత్య చేసిన ముఠా.. నాటు బాంబు విసిరి, ఇంటి కిటికీలు ధ్వంసంచేసి దోపిడీకి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికులను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. చోరీలు, దోపిడీలకు వస్తున్న ముఠాలు మనుషుల ప్రాణాలను ఏ మాత్రం లెక్కపెట్టకుండా నాటు బాంబులు విసురుతున్నారంటే.. అది వాళ్ల ధైర్యమా..? పోలీసుల నిఘా వైఫల్యమా..? అర్థం కావడం లేదు. ప్రశాంతతకు మారుపేరైన చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు, నాటు బాంబుల వాడకం క్రమంగా పెరుగు తుండడం నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంగా భావించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దపంజాణిలో హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీ చిత్తూరులో నాటు బాంబు వేయడంతో ధ్వంసమైన ఇల్లు నిఘా ఏమైనట్టు? పల్లెల్లో ఎవరెవరి వద్ద నాటు తుపాకులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలంటే అది పెద్ద పనేమీ కాదు. ఊర్లో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, ఆయా స్టేషన్లో ఉద్యోగాలు చేసే పోలీసులకు మాత్రం నాటు తుపాకులు ఎవరి వద్ద ఉన్నాయి? బాంబులు ఎవరు చుడుతున్నారు..? అనే సమాచారం లేకపోవడం నమ్మశక్యంగా లేదు. లేకుంటే ఆయా నిఘా సంస్థలు సరిగా పనిచేయడంలేదనే చెప్పాలి. నేరం జరిగిన తరువాత తీరిగ్గా మాత్రం పోలీసులు వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ చెబుతున్నారు. జిల్లా పోలీసు బాసు కల్పించుకుని ప్రత్యేక డ్రైవ్ లాంటివి నిర్వహిస్తే తప్ప, ఈ నాటు విష సంస్కృతికి తెరపడేలా కనిపించడం లేదు. -
డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడిచిన తర్వాత ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ, 42 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్కు సంబంధించి దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అధికారుల అలసత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధునాతన ల్యాబ్లు, అర్హత కలిగిన అధ్యాపకులు, నామమాత్రపు ఫీజులే అయినప్పటికీ విద్యార్థుల అడ్మిషన్ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. ఏటా అడ్మిషన్ల సంఖ్య పడిపోతున్నా కళాశాలల అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు ఇంటర్ విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఆకర్షణీయమైన ఆఫర్లతో అడ్మిషన్లు పెంచుకుంటున్నారు., ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సిబ్బంది మాత్రం నామమాత్రంగా ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. తీరు మారుతుందా..? ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రూ.లక్షల వేతనాలు పొందుతున్న ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కనీస మాత్రం అడ్మిషన్ల ప్రక్రియను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వారు తీరు మార్చుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కావాల్సిన సర్టిఫికెట్లు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ దరఖాస్తుకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు,6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ కింద అయితే పీహెచ్, ఎన్సీ సీ, స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. షెడ్యూల్ వివరాలు ఇలా.. అధికారిక వెబ్సైట్ www.oamdcaprche. apcfrr.in వెబ్సైట్లో అడ్మిషన్ దరఖాస్తుకుఅవకాశం కల్పించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 12,13 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల పరిశీలన, ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు, 20వ తేదీన ఆప్షన్ల సవరణ, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 26న సీట్ల కేటాయింపు, 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షుడు రఘురామ్ నాయుడు వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొత్తం 21 పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. సంఘం అధ్యక్షుడిగా శివయ్య, కార్యదర్శిగా నరేష్బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా దేవకుమార్, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, గౌరీశంకర్, గిరిధర్రెడ్డి, వివేక్, కుమార్స్వామియాదవ్, వరలక్ష్మీదేవి, వేణుగోపాలరావు, ధరణికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోహన్, జాయింట్ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్, బాలు విజయ్కుమార్, కిషోర్, ఉమా, రుక్మాంద, భాను ప్రసాద్, ప్రమీల, అనిత, వెంకట చలపతి ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. -
ఉపాధికి ఉచిత శిక్షణ
చంద్రగిరి : గ్రామీణ ప్రాంతాల పురుషులకు చంద్రగిరిలో ఈ నెల 13వ తేదీ నుంచి 14 రోజుల పాటు సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్పై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పురుషులు శిక్షణకు అర్హులని వెల్లడించారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్కి ఉచిత భోజనంతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ ధ్రువీకరణపత్రం జిరాక్స్లతోపాటు 4 పాస్దృవీకరణ పత్రం జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లతో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆక్రమణపై ఆవేదన చిత్తూరు రూరల్ (కాణిపాకం): మా ప్రభుత్వం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన గాయత్రి ఆరోపించారు. శనివారం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడుతూ తమ స్థలం ఆక్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన దీనయ్య, మంజుల, హేమావతి, రాజేశ్వరి, మోహన్ కబ్జా చేశారని వాపోయారు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని కులం పేరుతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆక్రమణదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
సచివాలయంలో చోరీ
గుడిపాల : మండలంలోని వసంతాపురం సచివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సచివాలయం తలుపులు పగులగొట్టి రెండు సీసీ కెమెరాలను అపహరించారు. దీంతో మూడు బీరువాలను తెరిచి రికార్డులను చెల్లా చెదురు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఎదుటే ఉన్న చికెన్ సెంటర్కు వెళ్లి మూడు లింగాపురం కోళ్లతో పాటు సిలిండర్ను చోరీ చేశారు. ఇదే సచివాలయంలో 2026 ఫిబ్రవరి 10వ తేదీన ప్రింటర్లను అపహరించారు. సమీపంలోని మహాభారతం గుడి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అయితే అక్కడ ఏమీ లేకపోవడంతో వెళ్లిపోయారు. పోలీస్స్టేషన్ దగ్గరే వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం సెలవు రోజు కావడంతో వేకువ నుంచే పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలు కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ అధికారులు, పోలీ సులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కత్తితో దాడిపై కేసు నమోదు గంగవరం : మండలంలోని బొమ్మనపల్లెలో కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. గ్రామానికి చెందిన గట్టప్ప, ముని వెంకటప్పకు మధ్య వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిని పోలీసులు మందలించి పంపించారు. దీనిపై కక్ష పెంచుకున్న గట్టప్ప శుక్రవారం రాత్రి మునివెంకటప్ప(63)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో మునివెంకటప్ప తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాల్లో చోరీ కుప్పం : మండలంలోని గోనుగూరు, పరమసముద్రం, పలార్లపల్లెలోని ఆలయాల్లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పరమసముద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో హుండీ పగులగొట్టి 4 కేజీల వెండి 10 గ్రాముల బంగారు నగలు అపహరించినట్లు పూజారి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు ఆలయాల్లో ఏం చోరీ చేశారో తెలియాల్సి ఉంది. గంజాయి ముఠా అరెస్ట్ పుత్తూరు: పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
షాపింగ్ కాంప్లెక్స్ గదుల కూల్చివేత
పుత్తూరు: పట్టణంలోని కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి వద్ద షాపింగ్ కాంప్లెక్స్లోని రెండు గదులను శుక్రవారం రాత్రి కూల్చి వేశారు. దీనిపై దేవదాయ శాఖ అధికారులు మా ట్లాడుతూ పుష్కరిణి ముందు సిమెంట్ రోడ్డు, డ్రైనే జీ నిర్మాణం కోసం ఒక గదిని తొలగించాలనుకున్నామని, దీనిపై మరో గది ఉండడంతో రెండింటినీ పడగొట్టామని వెల్లడించారు. పైగా షాపింగ్ కాంప్లెక్స్ ఆర్అండ్బీ స్థలంలో ఉందని తెలిపారు. వాస్తవం ఏమిటంటే..! కామాక్షీ సమేత సదాశివేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా పట్టణ నడిబొడ్డున కోనేరు (పుష్కరిణి) ఉంది. దీనికి నాలుగు వైపులా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. 2006లో అప్పటి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు కోనేరుతో పాటు వ్యాపార సముదాయాలను తొలగింపునకు చర్యలు చేపట్టారు. 2016లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. కోనేరును పునర్నిర్మించాలని 2023లో అప్పటి మంత్రి ఆర్కే రోజా పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం దేవదాయ శాఖ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించారు. రూ.5 లక్షల విరాళాలను సేకరించారు. మొత్తం నిధులతో పుష్కరిణి నిర్మాణ పనులను నాటి మంత్రి రోజా ప్రారంభించారు. అలాగే గతంలో వ్యాపా ర గదులు పోగొట్టుకున్న వారి కోసం కోనేరు చుట్టూ ఎల్ షేప్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రూ.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు. దీనికి పలువురు ముందుకు రావడంతో జీప్లస్ వన్తో మొత్తం 40 గదులకు పనులు పెరిగాయి. పుష్కరిణితో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టు ద్వారా స్టే తెచ్చి పనులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా పుష్కరిణి పనులు పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పేరిట షాపింగ్ కాంప్లెక్స్లోని గదులను కూల్చి వేశారు. నిర్మాణాలు చేపట్టలేరు కానీ, కూల్చడానికి మాత్రం సిద్ధం ఉంటారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.


