Chittoor District Latest News
-
పిల్లల్ని అపహరించడానికి వచ్చిన వ్యక్తిపై దాడి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద టమాటాలు విక్రయిస్తున్న వ్యాపారికి, ఛత్తీస్ఘడ్కు చెందిన మరో వ్యక్తికి శుక్రవారం గొడవలు జరిగాయి. కట్టమంచి వద్ద టమాటాలు విక్రయిస్తున్న వ్యక్తికి, అటుగా వెళుతున్న ఛత్తీస్ఘడ్కు చెందిన మహేంద్రకు చిన్నపాటి వాగ్వా దం జరిగింది. దీంతో టమాటాలు విక్రయించే వ్యక్తి తన స్నేహితులను పిలిపించి మహేంద్రపై దాడి చేయగా, అతను కూడా తిరగబడి దాడి చేశాడు. కొందరు స్థానికులు ఇతడిని వెంబడించగా.. మల్లికార్జున వీధిలోకి వెళ్లి.. అక్కడున్న చిన్నపాపను పట్టుకున్నాడు. పిల్లిల్ని కిడ్నాప్ చేస్తు న్నాడని భావించి స్థానికులు మహేంద్రను చావబాధారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకో గా, అప్పటికే మహేంద్రకు రక్త గాయాలయ్యాయి. ఇతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడడంతో భయపడ్డ మహేంద్ర చికిత్సకు నిరాకరించి కుర్చీలు విసిరాడు. వైద్యులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని మహేంద్రకు సర్ది చెప్పి వైద్యం చేయించారు. అనంతరం భోజనం పెట్టించి, మహేంద్ర ఛత్తీస్ఘడ్కు వెళ్లడానికి రైలు టికెట్టు కొనిచి, రైలెక్కించారు. నాలుగు టిప్పర్ల సీజ్ పాలసముద్రం : మండలంలోని బలిజకండ్రిగ, వనదుర్గాపురం నుంచి అక్రమంగా తమిళనాడుకు మట్టి తరలిస్తున్న టిప్పర్లను తిరుపతి విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. సీఐ రవి మాట్లాడుతూ కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా సమీపంలోని గుట్టనుంచి ఎర్రమట్టిని తరలిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో దాడులు చేశామన్నారు. ఈ మేరకు నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో టిప్పర్లో 40 టన్నుల మట్టి ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీలో ఆకలి కేకలు పాలసముద్రం : మండలంలోని టీవీఎన్ఆర్ పురం అంగన్వాడీ కేంద్రంలో వంట గ్యాస్ లేదని శుక్రవారం పిల్లలకు భోజనం పెట్టకుండా పస్తులుంచారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహించి అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, మధ్యాహ్న భోజనం పెడతారని పిల్లలను పంపించామన్నారు. కూలి పనులకు వెళ్లి వచ్చేసరికి పిల్లలు ఆకలిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే గ్యాస్ లేకపోవడంతో ఆహారం తయారు చేయలేదన్న్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 69,609 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.11 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 16 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
తోతాపురి తిప్పలు!
గిట్టుబాటు కాని ధర ● పలుచోట్ల కిలో రూ.4 ● కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం రూ.5, రూ.6 ఇస్తున్న వైనం ● ఆరు నెలల తర్వాతే నగదు చెల్లింపు ● టోకన్ల కోసం అవస్థలు ● చోద్యం చూస్తున్న అధికారులు కాణిపాకం: తోతాపురి మామిడి రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాయల విక్రయానికి అవసరమైన టోకెన్ల కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని చేతులెత్తేశాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు అధికారుల ఒత్తిడిమీద కొనుగోలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మామిడి వ్యాపారులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలో రూ.4 అని పాట పాడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేస్తున్నాయి. అయితే నగదు చెల్లింపులు ఆరు నెలల తర్వాతేనని తేల్చిచెబుతున్నాయి. దిగుబడి అధికమే కారణమా? జిల్లాలో మామిడి సాగు 56 వేల హెక్టార్లలో విస్తరించింది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్ల వరకు ఉండగా.. ఈ సారి 49,9274 వరకు దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు దిగుబడి కూడా ఆశాజనకంగానే వచ్చింది. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంబరపడిపోయారు. తీరా ధరలు పతనమవడంతో డీలాపడ్డారు. టేబుల్ రకాల ధరలు కూడా ఈ సారి ఆశాజనకంగా లేవు. తోతాపురి రూ.4 జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గించేస్తున్నారు. తోతాపురి కేజీ రూ.4కే కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వరుసగా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుడిపాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ తొలుత కేజీ రూ.5కే కొనుగోలు చేసింది. అధికారులు ఆ ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవడంతో రూ.6కు ఫిక్స్ చేసింది. మిగిలిన ఫ్యాక్టరీలన్నీ అదేబాట పట్టాయి. దీనికితోడు తమిళనాడులోని క్రిష్ణగిరి నుంచి తోతాపురి కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలు అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ కేజీ రూ.4కే కొనుగోలు చేసి రూ.5కు ఫ్యాక్టరీకి అన్లోడ్ చేస్తున్నాయి. ఆరు నెలల తర్వాతే బిల్లులు తమిళనాడు నుంచి దిగుమతవుతున్న కాయలకు మాత్రం ఫ్యాక్టరీలు అప్పటికప్పుడు నగదు చెల్లిస్తుండగా.. తెలిసిన వ్యాపారులకు వారం, నెల రోజుల వ్యవధిలో పేమెంట్ చేస్తామని చెబుతున్నాయి. జిల్లాలోని రైతులకు మాత్రం కాయలు తరలించిన ఆరు నెలల తర్వాతే బిల్లులు ఇస్తామని తేల్చిచెబుతున్నాయి. కూటమి వెన్నుపోటు మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పది రోజుల క్రితమే ప్రకటించింది. ఆ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు గిట్టుబాటు ధర కల్పించిందని సంబరపడిపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఫ్యాక్టరీలు కచ్చితంగా కొనాల్సిందేనని ఊదరగొట్టారు. కొనలేదంటే చర్యలతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. అది కూడా కేజీ రూ.8కే కొనాలని, ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తుందని సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే వారంలోనే గిట్టుబాటు ధర ఫల్టీ కొట్టింది. ప్రస్తుతం రూ.5, రూ.6కే కొనుగోలు చేస్తున్నారు. సిఫార్సులకే టోకన్లు తోతాపురి విక్రయానికి మామిడి రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. టోకన్ల కోసం ఫ్యాక్టరీల వద్ద పడిగావులు కాస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టోకన్ కోసం నిరీక్షిస్తున్నారు. టోకన్లు జారీచేసే సమయానికి నీకా..నాకా అంటూ పోటీపడుతున్నారు. కొన్ని టోకన్లు మాత్రమే రైతులకు ఇచ్చినట్టే ఇచ్చి..మిగిలిన టోకన్లు అన్నీ కూడా సిఫార్సుల మేరకు వెళ్లిపోతున్నాయి. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే టోకన్లను ఇచ్చుకుంటున్నారు. పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి ప్రాంతాల్లో ఈ రకమైన సమస్యలు అధికంగా ఉన్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం టోకన్ల కోసం రైతులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అరుపులు, కేకలతో దద్దరిలింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు చొరవ తీసుకుని తోతాపురి కేజీ రూ.8కే కొనుగోలు చేయించేయాల చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దారుణం ఇంత దారుణం ఎప్పుడూ లేదు. మామిడి పంట బాగా వచ్చిందని అనుకుంటే ధరలు లేవు. ఫ్యాక్టరీ కాడికి వస్తే కొనేవాళ్లు లేరు. టోకన్లు ఉంటేనే కొనుక్కుంటున్నారు. ఈ బాధాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఏజూస్, ఆవలకొండ, జీడీనెల్లూరు ఆరు నెలల తర్వాత బిల్లులా? కాయలు అమ్ముకోవడానికి టోకన్ల కోసం వచ్చాం. టోకన్లు తీసుకోవ డానికి నానా పాట్లు పడుతున్నాం. టోకన్లు ఇవ్వడానికి ముందే ఆరు నె లల తర్వాతే డబ్బులు ఇస్తామంటున్నారు. తోతాపురి రూ.8 అన్నారు. ఇప్పుడు రూ.6 అంటున్నారు. – బాబునాయుడు, రంగాపురం, జీడీనెల్లూరు -
వలస జీవులపై మృత్యుపంజా!
మృతుల కుటుంబాలను ఆదుకోండి శ్రీరంగరాజపురం : కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సా యంగా రూ.50 లక్షలు అందించా లని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు అందించాలన్నారు. శుక్రవారం పుత్తూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మృతిచెందిన కుటుంబాలకు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కార్వేటినగరం: బెంగుళూరులో ఉపాధి కోసం వెళుతూ కాన రాని లోకాలకు చేరుకున్నారు. మరో 20 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకునే లోపే లారీ రూపంలో మృత్యువు కబళించింది. గాఢ నిద్రలోనే అనంతలోకాలకు పంపేసింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట్ వద్ద గురువారం వేకువ జాము 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. చిత్తూరు డిపోకు చెందిన బస్సును లారీ ఢీకొట్టడంతో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 45 రోజుల చిన్నారితో సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. మృతుల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. స్థానికుల కథనం.. గంగాధరనెల్లూరు మండలం, పాపిరెడ్డిపల్లె పంచాయతీ, మారేడుపల్లె గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి భార్య శారద(40) బెంగళూరులో నివాసముంటోంది. తన చిన్నాన్న కర్మక్రియల కోసం స్వగ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో అశువులు బాసింది. అలాగే తూంగుండ్రం గ్రామానికి చెందిన లక్ష్మీకరుణాకర్కుమార్ చిత్తూరు డిపో–2లో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత పనిమీద బెంగళూరు వెళ్తూ తీవ్రంగా గాయపడ్డారు. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కే.కేశవులురెడ్డి, అతని తమ్ముడు జానర్ధన్రెడ్డి, తల్లి పాపమ్మ, భార్య గిరిజ, ఇద్దరు పిల్లలు కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. సొంత పనిమీద స్వగ్రామానికి వచ్చి తిరుగుపయనమయ్యారు. హోస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో కేశవులురెడ్డి(45) మృతి చెందగా అతని తమ్ముడు జనార్ధన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి మృత్యువాతపడ్డాడు. మిగిలిన క్షతగాత్రులు హోస్కోట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నచ్చుకూరు గ్రామానికి చెందిన మదన్మోహన్రెడ్డి, భార్య ధనలక్ష్మి, కుమారుడు జస్వంత్ సొంత పనిమీద బెంగళూరుకు వెళ్తూ గాయపడ్డారు. ఇందులో ధనలక్ష్మికి రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీరంగరాజపురం మండలం, కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసీ(22) ఉద్యోగాన్వేషణలో భాగంగా బెంగళూరులో శిక్షణ తీసుకుంటూ.. గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ‘ప్రణతి’ రోదన! అలాగే తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతులు కుమార్తె ప్రణతి(4) మృతి చెందింది. హరిబాబు బెంగళూరులోని ఆర్మీలో పనిచేస్తున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అమ్మానాన్న పిలుపే కరువైంది గంగాధరనెల్లూరు మండలం, ఆళ్లమడుగు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన 45 రోజుల చిన్నారితో సహా వారి పెద్ద నాన్న కేశవులురెడ్డి మృతి చెందారు. ఎన్నో నోములు నోసి.. పుట్టిన పురిటి బిడ్డను ఆ దేవుడు అమ్మానాన్న అని పిలవకముందే దూరం చేశాడంటూ.. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆశల దీపం ఆరిపోయింది కొడుకులు లేరన్న బెంగలేకుండా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచి పోషించిన మా ఇంటి దీపం ఆరిపోయిందని మృతురాలు తులసీ తల్లిదండ్రులు విలపించడం కలచివేసింది. ఉష్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన తులసీ, ఉద్యోగాన్వేషణలో భాగంగా బెంగళూరు వెళ్లి శిక్షణ తీసుకుంటోంది. హోస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. చిన్నాన్న కర్మక్రియల కోసం వచ్చి.. జీడీనెల్లూరు మండలం, మారేడుపల్లె గ్రామంలో గురువారం జరిగిన చిన్నాన్న సుబ్రమణ్యంరెడ్డి కర్మక్రియలకు శారద హాజరైంది. తర్వాత బెంగళూరుకు బయలు దేరింది. ఆమె భర్త విశ్వనాథరెడ్డి బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శారద ఇంట్లో పనులతో పాటు పిల్లల సంరక్షణ చూసుకుంటోంది. హోస్కోట్ ఘటనలో శారద మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాలు హోస్కోట్ ప్రమాదంలో మృతి చెందిన ఆళ్లమడుగు గ్రామానికి చెందన కేశవులురెడ్డి(45), ఆయన తమ్ముడి కుమారుడు 45 రోజుల చిన్నారి మృత దేహాలు శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నాయి. చిన్నారిని చూసిన గ్రామస్తులు బరువెక్కిన గుండెతో రోదించారు. కర్ణాటక రాష్ట్రం హోస్కోట్ వద్ద ఘోర ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి మృతులు తిరుపతి, చిత్తూరు జిల్లా వాసులు కన్నీరుమున్నీరైన కుటుంబీకులు వలస జీవులపై మృతువు పంజా విసిరింది. అభంశుభం తెలియని పురిటిబిడ్డను పొట్టనబెట్టుకుంది. మాటలు కూడా రాని మరో చిన్నారిని చిదిమేసింది. కుటుంబానికి ఆదరువుగా ఉంటుందనుకున్న చదువుల తల్లిని దూరం చేసింది. చిన్నాన్న కర్మక్రియలకు వచ్చి వెళ్తున్న ఓ అభాగ్యురాలిని అనంతలోకాలకు పంపేసింది. ఆమె ఇద్దరు బిడ్డలను అనాథలను చేసింది. మరొకరు సొంత పనిమీద బెంగళూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే మింగేసింది. గురువారం రాత్రి కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
వయోవృద్ధులను పట్టించుకోకుంటే కేసులే
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని కుమారుడు, కుమార్తెల నుంచి సెక్షన్ 125 కింద భరణం వసూలు చేయనున్నట్టు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యం.ఎస్.భారతి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక తపోవనం వద్ద ఉన్న వయోవృద్ధుల ఆశ్రమాన్ని పరిశీలించారు. వారికి చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సంపాదించిన ఆస్తిని దానపత్రంతో కొడుకులు, కూతుళ్లుకు అప్పగించిన తర్వాత వారు తల్లిదండ్రుల బాగోగులను సరిగా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా పట్టించుకోని పక్షంలో 144 కింద కోర్టును ఆశ్రయిస్తే దాన పత్రాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ సమస్యపై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో కేసు వేస్తే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచితంగా న్యాయ సేవలు అందిస్తుందన్నారు. చోరీ కేసులో పురోగతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల ఓ బంగారు దుకాణంలో ఆభరణాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. జెండామాను వీధిలోని ఓ బంగారు దుకాణంలో 180 గ్రాముల నగలు, అయిదున్నర కిలోల వెండి వస్తువులు, పక్కనే ఉన్న స్టీల్ సామాన్ల దుకాణంలో రూ.3.50 లక్షల నగదు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు టెక్నాలజీ వినియోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో నిందితుడి అరెస్టు చూపించే అవకాశాలున్నట్లు తెలిసింది. -
విమాన ప్రమాద మృతులకు నివాళి
చిత్తూరు కార్పొరేషన్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు నివాళులర్పించారు. ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి నాయకులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులు చేతబట్టి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరగడం బాధకరమన్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్నవారు, మెడికల్ కళాశాలలో ఉన్నవారు 265 మందికి పైగా దుర్మరణం చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కేశవులురెడ్డి, కుటుంబ సభ్యులు మృతిచెందడం కలచివేసిందన్నారు. ఈ మేరకు వారికి సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ.శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సరళమేరీ, ట్రేడ్యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాన్బాషా, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అంజలిరెడ్డి, జెడ్పీటీసీ బాబునాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆను, రజనీకాంత్, మనోహర్రెడ్డి, మనోజ్రెడ్డి, ప్రకా ష్, కుమార్, త్యాగ, గిరిధర్రెడ్డి, స్లాండ్లీ, భాగ్యలక్ష్మి, మధురెడ్డి, లక్ష్మణస్వామి, చల్లాముత్తు, నారాయణ, ఉన్నికృష్ణ, అల్తాఫ్, పూంగొడి, జయగణేష్, కౌసర్, సెల్వ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎస్జీటీల బదిలీలు
చిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి చిత్తూరు పరిధిలోని ఎస్జీటీల బదిలీలు శుక్రవారం ప్రశాంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో సీరియల్ నం.1001 నుంచి 2000 వరకు ఎస్జీటీల బదిలీల కసరత్తు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు చిత్తూరు అబ్జర్వర్గా విచ్చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీఈవో కార్యాలయంలో పలువురు టీచర్ల అర్జీలను స్వీకరించి పరిష్కరించదగ్గ వాటిని పరిష్కరించారు. ఈ కౌన్సెలింగ్ కసరత్తులో చిత్తూరు డీఈవో వరలక్ష్మి, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్, డీవైఈవోలు పాల్గొన్నారు. నోషనల్ తేదీ బాధితులు ఫిర్యాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2008 డీఎస్సీలో ఉద్యోగాల్లో చేరిన టీచర్లు హామీ పత్రాల ప్రకారం పాఠశాలలో చేరారు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వేర్వేరు తేదీల్లో పాఠశాలల్లో చేరినప్పటికీ సీనియారిటీ, మానిటరీ బెనిఫిట్స్ అందరికీ ఒకే తేదీ రోజు వర్తించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సంబంధిత టీచర్లు నోషనల్ తేదీని, పాఠశాలల్లో విధుల్లో చేరిన తేదీని టీఐఎస్ (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం)లో నమోదు చేశారు. అయితే బదిలీలకు దరఖాస్తు చేసుకునే సమయంలో పాఠశాల విద్యాశాఖ సూచనల ప్రకారం నోషనల్ తేదీ కేవలం ఉద్యోగోన్నతులకు మాత్రమేనని, పాఠశాలల్లో విధుల్లో చేరిన రోజునే బదిలీలకు పరిగణిస్తామని స్పష్టంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు సైతం ఇచ్చారు. బదిలీల్లో నోషనల్ తేదీ విషయంలో నష్టపోయిన పలువురు టీచర్లు ఆర్జేడీ శామ్యూల్ను కలిసి న్యాయం చేయాలని అర్జీ అందజేశారు. ఇష్టానుసారంగా దరఖాస్తుల్లో నమోదు 2008 డీఎస్సీ టీచర్లు తమకు ఇష్టానుసారంగా నోషనల్ తేదీని బదిలీల దరఖాస్తుల్లో నమోదు చేసుకున్నారు. మరికొంత మంది పాఠశాలల్లో విధుల్లో చేరిన తేదీని నమోదు చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పదే పదే స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొంత ఎంఈవోలు అమలులో అలసత్వం వహించారు. దీని వల్ల కొంతమంది టీచర్లు బదిలీల్లో లబ్ధిపొందేందుకు ఉద్దేశపూర్వకంగా నోషనల్ తేదీనే కొనసాగించుకున్నారు. దీంతో నోషనల్ తేదీని నమోదు చేసుకున్న టీచర్లు బదిలీల సీనియారిటీ జాబితాల్లో ముందుకు వెళ్లిపోయారు. నిజంగా పాఠశాలల్లో విధుల్లో చేరిన తేదీని నమోదు చేసుకున్న టీచర్లు జాబితాలో వెనుకకు వచ్చేసి తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యను డీఈవోకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోని దుస్థితి. సీనియారిటీ జాబితాలో ఇక మార్పులు చేయడం జరగదని డీఈవో స్పష్టం చేశారు. నష్టపోయిన బాధిత 2008 డీఎస్సీ టీచర్ల సమస్యలను ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ ఆర్జేడీ శామ్యూల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై ప్రత్యేక అధికారితో విచారణ చేయిస్తామని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. ఈ విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 150 మంది టీచర్లు లబ్ధిపొందారని ఆర్జేడీకి జాబితా సమర్పించగా, ఆ జాబితా ప్రకారం విచారణకు ఆదేశించారు. -
గజరాజుల విధ్వంసం
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగులదాడులు ఆగడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున కమ్మపల్లె పంచాయతీకి చెందిన రైతు రవీంద్రనాథరెడ్డి మామిడి తోటను ధ్వంసం చేశాయి. డ్రిప్ పైపులను సైతం తొక్కి నాశనం చేశాయి. దాదాపు నాలుగు టన్నుల కాయలు ఆరగించాయి. పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతు కోరుతున్నాడు. చిత్తూరులో చైన్ స్నాచింగ్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కును పారిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని కట్టమంచి మల్లికార్జున వీధికి చెందిన స్వర్ణలత ప్రతీ రోజూ పక్కనే ఉన్న చెరువుకట్టపై వాకింగ్ చేస్తుంటారు. శుక్రవారం ఉదయం 5.15 గంటల ప్రాంతంలో చెరువుకట్టపై వాకింగ్ చేస్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అడ్రస్ అడిగినట్టు అడుగుతూ.. ఆమె మెడలో ఉన్న దాదాపు 35 గ్రాముల బరువు ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. మహిళ కేకలు పెట్టినా, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దొంగ దొరకలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్ చిత్తూరు అర్బన్: మద్యం మత్తులో తన తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు సోమశేఖర్రెడ్డి (21)ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టూటౌన్ ఇన్చార్జ్ సీఐ మహేశ్వర వివరాలను వెల్లడించారు. నగరంలోని ఓబనపల్లె లెనిన్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ వెంకటరెడ్డి తరచూ మద్యం తాగి వచ్చి తన భార్య సరస్వతిను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గురువారం కూడా సరస్వతిని ఇబ్బంది పెడుతుంటే, కుమారుడు సోమశేఖర్రెడ్డి మందలించాడు. దీంతో కత్తి తీసుకున్న కుమారుడిపై దాడికి ప్రయత్నించగా, అదే కత్తి లాక్కుని వెంకటరెడ్డిను నరికి చంపేశాడు. సరస్వతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన పోలీసులు, సోమశేఖర్రెడ్డిని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచారు. నిందితుడికి 14 రోజుల రిమాండు విధించడంతో, చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ గుడుపల్లె : కర్ణాట మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 కేసుల టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని కనమనపల్లెకు చెందిన సత్యవేలు శుక్రవారం కర్ణాటకలోని కెంపాపురం నుంచి గుడుపల్లెకు బైర్ మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
జీతాల్లేవ్
తోతాపురి తిప్పలు! జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తోతాపురి విక్రయానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గజరాజుల విధ్వంసం పులిచెర్ల మండలంలో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు. డాక్టర్ల కొరత వేధిస్తోంది. పీహెచ్సీల్లో ఇద్దరు డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా.. పలు చోట్ల ఒక్కో డాక్టర్తోనే నెట్టుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం 2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త పుంతాలు తొక్కింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 3,250 ఇబ్బులకు చికిత్స అందించేవారు. అయితే చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పడిన నాటి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. కుయ్యే..మొర్రో అంటున్న 108, 104 ఆపత్కాలంలో ఆదుకునే 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ షెడ్డులో పడ్డాయి. ఫోన్ చేసిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. కిడ్నీ బాధితులు..డయాలసిస్ కోసం 108 వాహన సేవలను వినియోగించుకునే వారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలో ఈ సేవలకు స్వస్తి పలికారు. ఇక 104 అంబులెన్సులను కూటమి ప్రభుత్వం రాగానే మూలనపడేసింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసే వారు. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. గతంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టేవి. ఇప్పుడు అవి కూడా మూగబోతున్నాయి. కంటికి కనిపించని వెలుగు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈఐ కేంద్రాల ద్వారా జిల్లా ఆస్పత్రి, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి వైద్య సేవలను అందించే ఏర్పాట్లు చేపట్టారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ, శస్త్ర చికిత్సలు చేసేవారు. ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థతో మమో రాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ గడువు గతేడాది ముగియడం.. కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం పేదలు రూ.వేలల్లో వెచ్చించి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మరమ్మతులకు గురైన 108 వాహనాలు ఈ తీర్పు జర్నలిస్టులకు వజ్రాయుధం నగరి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజాయితీపరులైన జర్నలిస్టులకు వజ్రాయుధం లాంటిదని మాజీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. కొమ్మినేని అరెస్టు అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తేల్చి చెప్పడంపై శుక్రవారం స్పందించారు. ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొమ్మినేని తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలివ్వడం, ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం జర్నలిస్టు విజయమన్నారు. సాక్షి టీవీపై విషప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిదన్నారు. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు చిత్తూరు అర్బన్ : ఏపీలో భారత రాజ్యాంగం అమ లు కావడం లేదు. సగటు పౌరుడు తన భావవ్యక్తీకరణ స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితులు తీసుకొచ్చా రని వైఎస్సా ర్సీపీ చిత్తూరు పార్లమెంట్ లీగల్ విభాగం అధ్యక్షుడు సూర్యప్రతాపరెడ్డి తెలిపారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టే దీనికి నిదర్శన మన్నారు. ఇలాంటి చర్యలపై సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించిదని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. 17న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభం చిత్తూరు రూరల్: బంగారుపాళ్య మండలం, నలగాంపల్లి వద్ద ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయినట్లు డీటీసీ నిరంజన్రెడ్డి తెలిపారు. ఈనెల 17న ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇకపై వాహన ఫిట్నెస్ పరీక్షలు అక్కడే జరుగుతాయన్నారు. మాన్యువల్గా కార్యాలయంలో ఫిట్నెస్ పరీక్షలు జరగవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బదిలీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బాలక్రిష్ణను తిరుపతికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడకు గుంటూరులో పనిచేస్తున్న లక్ష్మీని నియమించింది. ఈమేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. టీచర్ల శిక్షణ వాయిదా వేయండి చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల శిక్షణా తరగతులు వాయిదా వే యాలని రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న శిక్షణలను వాయిదా వేయాలన్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు టీచర్లు కృషి చేస్తున్నారని, ఇలాంటి సమయంలో శిక్షణలు ఇవ్వడం సరికాదని సూచించారు. అరొకర వైద్యం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామానికి వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం వచ్చారంటే మధ్యాహ్నం 2–3 గంటల వరకు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. – జ్యోతీశ్వర్,యాదమరి ప్రైవేటు ఆస్పత్రే దిక్కు గతంలో ఇంటికాడికి వచ్చి వైద్యం చే సేవారు. మంచిగా చూసి మందులు, మాత్రలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ వి ధంగా లేదు. జ్వరం వచ్చినా ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నాం. పేదలు వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది మోయలేని భారంగా మారుతోంది. – కుమార్, గుడిపాల గతంలో ఫోన్ చేస్తే చాలు.. శ్రీరంగరాజుపురం మండలం మెదవాడ వద్ద టాటాఏసీ బోల్తా పడితే అంబులెన్స్కు ఫోన్ చేశాం. సమయానికి రాలేదు. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించి కొంత మంది క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించాం. మరికొంత మందికి పీహెచ్సీ వైద్యులు రోడ్డుపైనే వైద్యం అందించారు. గతంలో ఇలా లేదు. ఫోన్ చేస్తే 108 కుయ్..కుయ్ మంటూ నిమిషాల్లో వచ్చేసేది. – కరుణకర్, పాతపాళ్యం గ్రామం వైద్యం అందించే వారే లేరు గత ప్రభుత్వంలో మా గ్రామంలోకి వచ్చి 104 వాహనం ద్వారా వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు చికిత్సలు అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనం వచ్చేది దేవుడెరుగు కనీసం గ్రామాలకు వైద్య సిబ్బంది కూడా రావడంలేదు. ప్రమాద సమయాలలో 108 వాహనం కోసం ఫోన్ చేస్తే ఎప్పుడో స్పందిస్తే ఏం లాభం. – లక్ష్మీదేవి, చౌడేపల్లి – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం పల్లెల్లో పడకేసిన వైద్యసేవలు అవస్థల్లో పేద రోగులు పట్టించుకోని కూటమి నేతలు గత ప్రభుత్వంలో ఇంటిముంగిటకే వైద్యం ఈ ఏడాది ఫ్రిబవరి 3వ తేదీన శ్రీరంగరాజుపురం మండలం, పాతపాళ్యం దళితవాడ గ్రామస్తులు 30 మంది ఎట్టేరి గ్రామంలో జరిగే ఓ పెళ్లి కార్యక్రమానికి టాటా ఏసీ వాహనంలో బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో మెదవాడ ఎస్టీ కాలనీ వద్ద వాహనం బోల్తాపడి ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. అంబులెన్స్ సకాలంలో రాక వైద్యం కోసం నానాతిప్పలు పడ్డారు. పీహెచ్సీ వైద్య బృందం ప్రాథమిక వైద్యం అందించింది. పాలసముద్రం మండల కేంద్రానికి చెందిన దేవానందంను గతనెల 10వ తేదీన ఇంట్లోనే పాము కాటు వేసింది. బంధువులు పాలసముద్రం పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది పాము కాటుకు మందులేదని చెప్పడానికి రెండు గంటల సమయం తీసుకుని టీటీ ఇంజక్షన్ ఇచ్చి చిత్తూరుకు రెఫర్చేశారు. వెంటనే అతన్ని 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దేవానందం మృతి చెందినట్లు జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. ఇవి మచ్చుకు రెండు ఘటనలు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయి. జబ్బున పడితే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా దాపురించాయి. 108, 104 సేవలు గాల్లో దీపంలా మారాయి. ఆరోగ్యశ్రీ సేవలు తూతూమంత్రంగా అందుతున్నాయి. మందులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. పేద రోగులు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రభుత్వ వైద్యసేవలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్టు.. 108 సేవల వివరాలు 108 వాహనాల సంఖ్య – 33 2024 మూడు నెలల్లో – 12,275 కేసులు 2025 మూడు నెలల్లో – 10,012 కేసులు ఆరోగ్య శ్రీ వివరాలు.. (2024 మే వరకు) ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సంఖ్య జిల్లా ఆస్పత్రి – 1 సీహెచ్సీలు – 5 ప్రైవేటు ఆస్పత్రులు – 12 ఏరియా ఆస్పత్రి – 3 పీహెచ్సీలు – 49 వైద్యులు – 49 సిబ్బంది – 246 కార్డుల వివరాలు డాక్టర్ ఆరోగ్యశ్రీ – 4,96,715 ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీం – 1,935 వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్స్కీం – 1,935 అమృత హెల్త్స్కీం – 1,044 ఆయుష్మాన్ భారత్ – 1,400 జిల్లా సమాచారం జిల్లా ఆస్పత్రి – 1 ఏరియా ఆస్పత్రి – 4 సీహెచ్సీ – 8 పీహెచ్సీ – 50 అర్బన్ హెల్త్ సెంటర్లు – 15 కూటమి ప్రభుత్వంలో వైద్య సిబ్బందికీ ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు జీతాలు అందించడంలేదు. టీడీపీ హయాంలో వీరికి నెలకు రూ.7,200 చొప్పున వేతనం చెల్లించేవారు. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాన్ని రూ.8,800కు పెంచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదు. 108 వాహన సిబ్బందికి కూడా సకాలంలో వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సర్జరీ వివరాలు సంవత్సరం సర్జరీల జమ చేసిన సంఖ్య మొత్తం రూ.కోట్లల్లో 2019–20 43,898 3.62 2020–21 51,173 90.01 2021–22 75,941 13,99 2022–23 83,816 20.01 2023–24 97,945 24.55 2024–25 131263 25.24 ఆరోగ్య శ్రీ ఆసరా సంవత్సరం లబ్ధిదారుల ఖర్చు రూ.కోట్లల్లో సంఖ్య 2019–20 5,282 2.95 2020–21 14,439 7.42 2021–22 25,247 11.60 2022–23 22,456 10.41ఆరోగ్య ఆసరాకు ఎసరు ఆరోగ్యశ్రీలో శ్రస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో గత ప్రభుత్వం జీవన భృతి అందజేసింది. రోజుకు రూ.275 చొప్పున లెక్కగట్టి అందిచేవారు. సాధారణ డెలివరీ, సిజేరియన్లకు రూ.5 వేలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విరిగిన ఎముకల సర్జరీకి రూ.10 వేలు, కాళ్లకు ఇన్ఫెక్షన్కు సంబంధించి సెల్యులైటీస్ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575.. ఇలా చికిత్సను బట్టి సాయాన్ని అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపును నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
విలీనం..వ్యతిరేక స్వరం!
– రోడ్డెక్కుతున్న కూటమి నేతలు యాదమరి: పాఠశాల విలీనంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే పెదవి విరిచేవారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాదమరి మండలం, చిన్నంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకుంటున్న 3, 4, 5 తరగతులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీనాటంపల్లి ఆదర్శ పాఠశాలలో విలీనం చేశారు. దీనిపై యాదమరి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు వినాయకం గౌండర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నపళంగా లోకజ్ఞానం ఎరుగని పసిబిడ్డలను వేరే పాఠశాలకు పంపాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడం సబబుకాదన్నారు. చిన్నంపల్లి నుంచి కీనాటంపల్లి మార్గ మధ్యంలో చెరువులు, వాగులు, బావులు ఉన్నాయని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. వీరికి సంఘీభావంగా వచ్చిన వినాయకంగౌండర్ ప్రజలకు ఆమోద యోగ్యం కాని నిర్ణయం తీసుకున్న తమ కూటమి ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానిక శాసనసభ్యులు ఈ వ్యవహారంపై నిర్లక్ష్యంగా ఉండడం సమంజసం కాదని హితవు పలికారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ రుక్మిణి తెలిపారు. వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ అమలనాథన్ పాల్గొన్నారు. -
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
జిల్లాలో మామిడి రైతుల తంటాలు
● పండిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు ● అమ్ముడుపోని తోతాపురి ● టోకన్ల పేరుతో నిబంధనలు ● అరకొరగా ఇస్తున్న ఫ్యాక్టరీలు ● పత్తా లేని అధికారులు కాణిపాకం: జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్పోన్సో 3,127, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగులో ఉంది. వీటిని కోత కోసి రైతులు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళ్యం ఇతరాత్ర మార్కెట్లకు తరలిస్తున్నారు. టేబుల్ రకం కాయల కోతలు చివరి దశకు చేరాయి. ప్రస్తుతం తోతాపురి కోతలు ఆరంభమయ్యాయి. గందరగోళం అధికారుల ఒత్తిడి మేరకు కొన్ని ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలుకు టోకన్లు పంపిణీ చేస్తున్నాయి. అవి కూడా అరకొరగా ఇస్తున్నాయి. చాలా వరకు టోకన్లు కూటమి నేతల సిఫార్సులతో అమ్ముడుబోతున్నాయి. కొన్ని చోట్ల అసలు టోకన్లే ఇవ్వడం లేదు. టోకన్ల పంపిణీని వాయిదా వేస్తూ బోర్డులు పెట్టేస్తున్నాయి. గుడిపాల మండలంలోని ఫ్యాక్టరీల వద్ద రైతులు గురువారం బారులు తీరారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కొంతవరకు టోకన్లు ఇచ్చి నిలుపుదల చేశారు. చిత్తూరు నగరంలోని ఓ ఫ్యాక్టరీలో టమాట గుజ్జు తయారీని కొనసాగిస్తున్నారు. మరో ఫ్యాక్టరీ టోకన్ల జారీని వాయిదా వేస్తూ బోర్డు పెట్టేసింది. టోకన్ల పంపిణీలో సరైనా స్పష్టత లేక రైతులను ఫ్యాక్టరీలు తిప్పించుకుంటున్నాయి. తోతాపురికి టోకన్లు జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90శాతం దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. టేబుల్ రకాలను మాత్రం రైతులు కోతకోసి మార్కెట్, ఫ్యాక్టరీలకు తరలించారు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో రైతులు రోడెక్కారు. స్పందించిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించింది. ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున్న ప్రోత్సాహక నిధి ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారుల పోరు పడకలేక కొన్ని ఫ్యాక్టరీలు కాయల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. టోకన్ల సిస్టమ్ను తీసుకొచ్చాయి. ఈ కారణంగా ఫ్యాక్టరీల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి లోడేత్తేస్తున్నాయి తమిళనాడులోని క్రిష్ణగిరి, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వచ్చే కాయలకు జిల్లాలోని ఫ్యాక్టరీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా తమిళనాడు కాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ తోతాపురి కిలో రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నాయి. అక్కడి వ్యాపారులు రూ.5కే ఫ్యాక్టరీకి డెలివరీ ఇస్తున్నారని జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. రూ.8 కాదు.. రూ.6కే! తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇది అమల్లోకి రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతికష్టం మీద ఫ్యాక్టరీలు రూ.6కు కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. ఇదీ కూడా కొన్ని రోజుల ముచ్చటేనన్ని రైతులు దిగాలు చెందుతున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా టోకన్లు ఎప్పుడు ఇచ్చారో తెలియడం లేదు. నాలుగు రోజులుగా ఫ్యాక్టరీల చుట్టూ తిరుతున్నా. గురువారం టోకన్ల కోసం ఫ్యాక్టరీ కాడికి వస్తే.. టోకన్లు ఇప్పుడు ఇచ్చేది లేదంటున్నారు. సోమవారం రమ్మని బోర్డు పెట్టేశారు. నేను 3.5 ఎకరాల్లో మామిడి సాగు చేశా. కాయలు రాలిపోతున్నాయి. – దశరథన్, మాపాక్షి, చిత్తూరు దొంగతనంగా తీసుకొచ్చేస్తున్నారు చిత్తూరు కాయలను వద్దని..దొంగతనంగా బయట కాయలను తీసుకొచ్చేస్తున్నారు. క్రిష్ణగిరి కాయలు దించుకుంటున్నారు. రాత్రికి...రాత్రి..ఆ కాయలను తీసుకొస్తుంటే అడ్డుకునే వారులేరు. అందుకే జిల్లా కాయలను వద్దంటున్నారు. ఈ టోకన్ల సిస్టం తీసేసి...కాయలు కొనుగోలు చేసేలా చూడాలి. – నాగరాజు, ఎల్బీపురం, చిత్తూరు పర్మిట్ల కోసం పడిగాపులు గుడిపాల: పర్మిట్ల కోసం మామిడి రైతులు తెల్లవారు జాము నుంచే పడిగాపులు కాశారు. గురువారం గుడిపాల మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్, తాసా జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. ఎవ్వరూ స్పందించకపోవడంతో ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. గుడిపాల తహసీల్దార్ జయంతి, ఎస్ఐ రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. 200 మందికి టోకెన్లు 200 మందికి టోకన్లు అందజేశారు. దీంతో వివాదం సర్దుమణిగింది. 17వ తేదీ వరకు టోకన్లు ఇవ్వడం కుదరదని ఫ్యాక్టరీ నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా తమిళనాడు నుంచి వస్తున్న మామిడి కాయలకే అధికంగా ఫ్యాక్టరీ వారు ప్రాధాన్యత చూపుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. లారీల ద్వారా లోడ్లు వచ్చిన వెంటనే టోకన్లు లేకుండానే అన్లోడ్ చేస్తున్నారని తెలిపారు. జిల్లా సమాచారం మామిడి రకం హెక్టార్లు దిగుబడి అంచనా తోతాపురి 39,895 49,9274 నీలం 5,818 64,991 అల్పోన్సో 3,127 26,404 బేనీషా 3,895 28,867 మల్లిక 1,740 13,919 ఇతర రకాలు 1,526 11,779జిల్లాలో మామిడి రైతులు నానాతంటాలు పడుతున్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి నరకం అనుభవిస్తున్నారు. తోతాపురి అమ్ముడుపోక విలవిల్లాడుతున్నారు. టోకన్ల పేరుతో ఫ్యాక్టరీ యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. దీనికితోడు తోతాపురి కిలో రూ.6కే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.8కే కొనుగోలు చేయాలని నిర్ణయించినా అవేవీ పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఇటు ఫ్యాక్టరీ యజమానులను ఒప్పించలేక.. రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడి ధరలు రకం ధర(కిలో) చందూర రూ.4 బేనీషా రూ.10–రూ.20 మల్లిక రూ.7–రూ.20 కాలేపాడు రూ.20– రూ.30 ఇమామ్ పసంద్ రూ.40–రూ.70 తోతాపురి (టేబుల్ రకం) రూ.10–రూ.13 అల్పోన్సో రూ.20– రూ.30ముఖం చాటేస్తున్న ఫ్యాక్టరీలు జిల్లాలో సాగయ్యే మామిడి ఫలాల్లో టేబుల్ రకాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. తోతాపురి కాయలు గుజ్జు తయారీకి తరలుతుంటాయి. ఈ కాయలన్నీ కూడా జిల్లాలోని 47 గుజ్జు పరిశ్రమలకు చేరుతుంటాయి. గతేడాది తయారీ చేసిన గుజ్జు నిల్వలు అలాగే ఉండడంతో ఈ సారి మామిడి కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా ఫ్యాక్టరీ యజమానులు ముఖం చాటేస్తున్నారు. -
కూటమి పాలనలో ఆలయాల విధ్వంసం
● హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం ● ఆలయ ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సాక్షి, టాస్క్ ఫోర్స్ : ‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు.. దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది.. అమ్మవారి విగ్రహానికి కాళ్లు, చేతులు నరకడం సనాతన ధర్మమా..? హిందువుల మనోభావాలను కూటమి సర్కారు దెబ్బతీస్తోంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసిన శిథిలాలను గురువారం ఆయన పార్టీ నాయకులు, హిందూ సంఘాలతో కలసి పరిశీలించారు. ఆలయం ధ్వంసం చేయడంతో పాటు విగ్రహాలను, శిథిలాలను కాలువలో పడేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల దాడుల్లో గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. అనంతరం అమ్మవారి ఆలయ ఉపచారకులు శ్రీ మహారుద్ర వారాహి స్వామివారిని ఓదార్చారు. అనంతరం కూటమి నేతలు చేసిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణం శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ఇసుక, మట్టి మాఫియా ముఠాలు నేలమట్టడం చేయడం దారుణమైన ఘటన అని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. శిథిలాలను ఒక మురుగు కుంటలో పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం వెనుక ఏ కుట్ర దాగుందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే అరాచకాలు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రోత్సాహంతోనే టీడీపీ నాయకులు ఇసుక, మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని నేలమట్టం చేసిన వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదంటే దాని వెనుక కూటమి నాయకుల హస్తం లేదంటారా అని మండిపడ్డారు. -
ఆ జాబితా సమర్పించండి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకం జాబితాలను సమర్పించాలని డీఆర్వో మోహన్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర కై ్లములకు సకాలంలో స్పందించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా మరణించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వారి పేర్లను జాబితాలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతోందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోలు పేర్లు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైమ్స్ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్లెవల్ ఏజెంట్ల నియామకానికి ఫారం 2 సమర్పించాలన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు 15,497 దరఖాస్తులు అందగా వాటిలో 1,598 పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో పలు పార్టీల ప్రతినిధులు ఉదయ్, సురేంద్ర, గంగరాజు, పరదేశి పాల్గొన్నారు. -
బలవంతపు బదిలీలు..!
ఇచ్చిన మాట ప్రకారం మాన్యువల్ విధానంలో ఎస్జీటీల బదిలీలు నిర్వహించాలని అయ్యోర్లు ఇటీవల రొడ్డెక్కి ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసలు బండారం బయటపడుతుందని భావించిన కూటమి సర్కారు ఒక మెట్టు దిగింది. మాన్యువల్ బదిలీలకు అంగీకారం తెలిపింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని షర్మన్ పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. అధికారులు ఏదో ఒక సమస్యను చూపి అయ్యోర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి టీడీపీని నమ్మిన పాపానికి తగిన శాస్తి జరుగుతోందని అయ్యోర్లు లోలోపలే మదనపడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆపడం.. కొనసాగించడం చేస్తున్నారు. తాజాగా ఈ నెల 12వ తేదీన స్పౌజ్ కోటా విషయంలో అన్యాయం జరుగుతోందని బాధిత ఎస్జీటీ టీచర్లు గురువారం కౌన్సెలింగ్ను బహిష్కరించారు. కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. స్పౌజ్ విషయంలో జీవో 22కు వ్యతిరేకంగా విద్యాశాఖ అధికారులు బదిలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు పైగాకౌన్సెలింగ్ను ఆపేసారు. టీచర్ల ధోరణితో విస్తుపోయిన డీఈవో వరలక్ష్మి ఆగ్రహంతో కౌన్సెలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఆర్వో మోహన్కుమార్, పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత టీచర్లతో చర్చలు జరిపారు. రోజుకొక వింత ధోరణి వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు న్యాయం చేయాలని మొరపెట్టు కుంటున్నా పట్టించుకోని వైనం గురువారం మూడు గంటలకు పైగా ఆగిన కౌన్సెలింగ్ ప్రక్రియ కౌన్సెలింగ్ కేంద్రంలో ధర్నా చేసిన బాధిత ఎస్జీటీ టీచర్లు స్పౌజ్ సమస్యలే అధికం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్జీటీల కౌన్సిలింగ్ ప్రక్రియలో స్పౌజ్ సమస్య టీచర్లను నష్టపోయేలా చేస్తోంది. సీనియారిటీ నంబర్ 703కు ప్రక్రియ వచ్చేసరికి స్పౌజ్ సమస్యతో బాధిత మహిళా టీచర్ దీపిక న్యాయం చేయాలంటూ కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. మరికొందరు స్పౌజ్ బాధితులు ఆమెకు మద్దతు తెలిపారు. బాధిత టీచర్ దీపిక, ఆమె భర్త ఇద్దరూ ఎస్జీటీలే. ఆమె బుచ్చినాయుడుకండ్రిగలోను, ఆమె భర్త కేవీబీపురంలో పనిచేస్తున్నారు. వారు తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. బదిలీ జీవో ప్రకారం ఆమె ఉమ్మడి చిత్తూరులో ఎక్కడైనా కోరుకునే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు కేవీబీపురం మండలంలోనే కోరుకోవాలంటూ ఆమైపె తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో జీవో 22ను అమలుచేసి న్యాయం చేయాలని బాధిత టీచర్ పట్టుబట్టి మరికొంత మంది బాధిత టీచర్లతో ధర్నా చేపట్టింది. చివరికి డీఆర్వో మోహన్ కుమార్, పోలీసులు కౌన్సిలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. బాధిత టీచర్లతో చర్చలు జరిపారు. జీవో ప్రకారం బాధిత టీచర్ దీపికకు శ్రీకాళహాస్తి కోరుకునేలా అవకాశం కల్పించారు. సమస్య పరిష్కారం అయ్యాక విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించారు. -
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకి తవణంపల్లి మండలం, మైనగుండ్లపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి రూ.లక్ష నగదును విరాళంగా ఇచ్చారు. ఆలయ సిబ్బంది దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. వ్యవసాయశాఖా మంత్రి జిల్లా పర్యటన వాయిదా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పర్యటనకు శుక్రవారం విచ్చేయాల్సిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెంనాయుడు పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఆయన తదుపరి పర్యటన వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం చౌడేపల్లె( పుంగనూరు): పుంగనూరు పట్టణ సమీపంలోని నక్కబండలో వివాహిత అత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. నక్కబండకు చెందిన షాహీదా(28) తన అవసరాల కోసం కొంతమంది వద్ద అప్పు చేసింది. వారి నుంచి వేధింపులు అఽధికం కావడంతో ఇంట్లో నిద్ర మాత్రలు మింగి అపస్మార ిస్థితికి చేరింది. కుటుంబ సభ్యులు ఆమెను పుంగనూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కాణిపాకం–తిరుపతి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రాజేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుధవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో చెర్లోపల్లె నుంచి చిత్తూరు వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ, స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాజేష్, అతని భార్య పూర్ణిమ ఇద్దరి పరిస్థితి విషమించడంలో తమిళనాడు రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తుండగా గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో రాజేష్ చనిపోయాడు. పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉంది. పందెం రాయుళ్ల అరెస్ట్ చౌడేపల్లె(పుంగనూరు): పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులో గురువారం కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఎస్ఐ కథనం.. పుంగమ్మ చెరువు సమీపంలోని పాములకుంట వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి పది కోడి పుంజులు, రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
– చెరువులో మునిగి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి గంగవరం: ఈత సరదా సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. ఈ ఘటన మండలంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. బైరెడ్డిపల్లి మండలం, ఇళ్లూరిండ్లు గ్రామానికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి(26) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను బుధవారం గంగవరం మండలం, పత్తికొండ పంచాయతీ, అటుకురాళ్లపల్లి గ్రామంలో జరిగే గంగ జాతరకు అమ్మమ్మ ఇంటికి కుటుంబ సమేతంగా వచ్చాడు. పండుగలో అమ్మవారికి మొక్కులు చెల్లించిన అనంతరం శ్రీనివాసులురెడ్డి, అతని మిత్రులతో కలిసి అదే గ్రామంలోని ఈతల కుంటలో సరదాగా ఈత కొడదామని వెళ్లారు. అలా వెళ్లిన నలుగురిలో ముగ్గురు చెరువులోంచి బయటకు వచ్చేయగా శ్రీనివాసులురెడ్డి వెలుపలికి రాలేదు. చెరువు అడుగున బురదలో కూరుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులో ఎంత ఎదికినా కనిపించలేదు. మరుసటి రోజున మళ్లీ చెరువులో గాలింపు చేపట్టగా మృతుడి ఆచూకీ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి పది రోజుల క్రితమే పాప జన్మించింది. దీంతో అమ్మమ్మ గారి ఊరితో పాటు సొంత గ్రామం ఇళ్లూరిండ్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
డయేరియా నివారణపై అవగాహన
చిత్తూరు రూరల్(కాణిపాకం): డయేరియా నివారణ కార్యక్రమ ఉద్దేశంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. ఆమె గురువారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శిశుమరణాల నివారణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. క్షేత్ర స్థాయిలోని వైద్యబృందం ఇంటింటా సర్వే చేపట్టి 0–5 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించాలన్నారు. ఈ సర్వేను ఈ నెల 16 నుంచి జూలై 31వ తేదీ వరకు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. డయేరియా నివారణకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఓ హనుమంతరావు, డీఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.మద్యం వ్యాన్ బోల్తావడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం, తడుకు ఆర్ఎస్ కూడలి వద్ద మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడింది. రేణిగుంట నుంచి మద్యం లోడుతో వడమాలపేట మీదుగా విజయపురం వెళ్తున్న సమయంలో తడుకు ఆర్ఎస్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్లోని మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.గంగజాతరకు రానీయకుండా దాడులుపలమనేరు: తమ గ్రామంలో బుధవారం జరిగిన గంగ జాతరలో భాగంగా ఆలయంలో జరిగే పూజలకు తమను రావద్దని గ్రామ పెద్దలు అభ్యతరం తెలిపారని, దీనిపై ప్రశ్నించగా తమపై దాడులు చేసి గాయపరిచారని గంగవరం మండలం, గుండుగల్లు దళితులు వాపోయారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక డీఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో జాతరను అన్ని కులాలు కలిసి చేసుకుందామని చెప్పి తీరా ఆలయంలోకి తమను ప్రవేశించకుండా అడ్డుకున్నారన్నారు. దీనిపై అడిగినందుకే దాడి చేశారని తెలిపారు. డీఎస్పీకి విన్నవించిన వారిలో ఆ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, వెంకటరమణ, మునిరత్నం తదితరులున్నారు. -
అయ్యోర్లపై కక్ష సాధింపు
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో ఎస్జీటీలు బదిలీల బాధలతో నష్టపోతున్నారు. గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు పలు సమస్యలు ఎస్జీటీ టీచర్లను వేధిస్తున్నాయి. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లపై ఉన్నతాధికారులు, రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారులు కక్ష సాధింపు ధోరణితో అన్యాయం చేస్తున్నారని బాధిత టీచర్లు వాపోతున్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేసేలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరుకానివ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రం నుంచి భయాందోళనలు సృష్టించి తరిమేశారు. ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ పాయింట్ల విషయంలో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఎస్జీటీ టీచర్లు వాపోతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్న టీచర్ల పై చులకన భావనతో జిల్లా విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు ధర్నా స్పౌజ్ విషయంలో జీవో నెంబర్ 22 కు వ్యతిరేకంగా బదిలీలు నిర్వహిస్తూ అన్యాయం చేస్తుండడంతో బాధిత టీచర్లు గురువారం కౌన్సెలింగ్ను బహిష్కరించి కేంద్రంలో ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మ్యాన్యువల్ విధానంలో బదిలీలు నిర్వహించాలని చెప్పినందుకు విద్యాశాఖ అధికారులు కక్ష సాధింపులకు పాల్పడి అన్యాయం చేస్తున్నారని పలువురు బాధిత ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. బదిలీల నిర్వహణకు రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారిని అబ్జర్వర్ గా నియమించాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జిల్లాలో బదిలీల బాధలు కౌన్సెలింగ్ కేంద్రంలో ధర్నా జీవోకు వ్యతిరేకంగా బదిలీలు ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా చిత్తూరు విద్యాశాఖ అధికారులు బదిలీలు నిర్వహిస్తున్నారు. జీవో ప్రకారం స్పౌజ్ నమోదు చేసుకున్న టీచర్లు జిల్లాలో ఎక్కడైనా బదిలీ కోరుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం పనిచేస్తున్న మండలంలోనే కోరుకోవాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం అన్యాయం. ఎప్పుడూ ఒకే మండలంలో విధులు నిర్వహించాలా?. గతంలో ఎప్పుడూ ఇలాంటి అవకతవకల బదిలీలు జరగలేదు. కొత్త మండలాలకు వెళ్లాలని నిరీక్షించాం. కానీ ఫలితం లేకుండా పోతోంది. – దీపిక, ఎస్జీటీ ఉపాధ్యాయురాలు -
నేటి ‘ఫీజుపోరు’ వాయిదా
చిత్తూరు కార్పొరేషన్: అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న ఫీజుపోరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్న ఆ పార్టీ చిత్తూరు ని యోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి, వి ద్యార్థి విభాగం మాజీ చిత్తూరు నియోజకవర్గ అ ధ్యక్షుడు శశిదీప్రెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ నిర్ణ యం మేరకు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వా యిదా వేసినట్టు వెల్లడించారు. తదుపరి కార్యక్ర మ తేదీని త్వరలో పార్టీ ప్రకటిస్తుందన్నారు. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి నగరి : అహ్మదాబాద్ వి మాన ప్రమాదంపై మాజీ మంత్రి ఆర్కేరోజా ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. గు రువారం ఆమె విలేకరు లతో మాట్లాడుతూ ప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమన్నా రు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆ త్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్న ట్టు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరగాల్సిన నిరుద్యోగభృతి, ఫీజు పోరు నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు మరో 13 వేల క్వింటాళ్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాకు మరో 13వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు వస్తాయని జిల్లా వ్యవసాయశాఖఅధికారి మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు 26,349 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని, మళ్లీ ప్రతిపాదనలు పంపగా త్వరలో మరో 13వేల క్వింటాళ్ల కాయలు పంపిణీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాణిపాకం హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.2,18,93,556 ఆదాయం వచ్చింది. బంగారం 29 గ్రాములు, వెండి 2.350 కిలోలుగా లెక్కగట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.17,107, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.42,877 వచ్చింది. కార్యక్రమంలో ఏఈవోలు ఎస్వీ కష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, సుబ్రమణ్యనాయుడు పాల్గొన్నారు. ఉద్యోగాల పేరిట ఫోన్ కాల్స్ – పోలీసులకు ఫిర్యాదు చిత్తూరు అర్బన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి ఫోన్ చేసి మోసం చేసి వ్యక్తిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ వ్యక్తి వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టులు ఉన్నాయని లక్షల్లో ముట్ట చెబితే ఆ పోస్టులు ఇప్పిస్తామని ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఇలా చాలామందికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లు చేయడంతో విషయం డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి దృష్టికి వెళ్లిది. దీంతో ఆ వ్యక్తి చేసిన ఫోన్ నెంబర్(9062823086)ను పోలీసులకు తెలియజేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా వైద్యఆరోగ్య శాఖలో ఎటువంటి నోటిపికేషన్లు విడుదల చేయలేదన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్ను నమ్మొద్దని సూచించారు. నేడు 1001 నుంచి ఎస్జీటీల బదిలీలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీలకు 1001 సీరియల్ నెంబర్ నుంచి బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని షర్మన్ పాఠశాలలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు సీరియల్ నెంబర్ 1001 నుంచి 1500 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సీరియల్ నెంబర్ 1501 నుంచి 2000 వరకు బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పది సప్లిమెంటరీ ఫలితాల్లో 24వ స్థానం చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా బాలురు 4,080, బాలికలు 2,533 మొత్తం 6,613 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,275 మంది, బాలికలు 1,643 మొతం 3,918 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 55.76, బాలికలు 64.86 శాతం సాధించగా జిల్లా ఉత్తీర్ణత శాతం 59.25 నమోదైంది. -
చిత్తూరులో కుండపోత వర్షం
చిత్తూరులోని మామిడి కాయల మార్కెట్లో నిలిచిన వర్షపు నీరు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన బలమైన వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకాలకు ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా కట్టమంచిలోని మామిడికాయల మార్కెట్ వర్షపు నీటితో నిండిపోయింది. మార్కెట్ లోపలి భాగం మొత్తం చెరువును తలపించింది. వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధికారులు స్పందించి మార్కెట్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
విలీనం మా కొద్దు
బైరెడ్డిపల్లె: తమ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను విలీనం చేస్తూ పక్క గ్రామానికి తరలించడం స మంజసం కాదని మండలంలోని మూగనపల్లె గ్రామస్తులు గురువారం పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు 30 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారన్నారు. విద్యార్థుల శాతం తక్కువగా ఉందని సుమారు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచుకుప్పం పాఠశాలకు విలీనం చేస్తూ విద్యార్థులను తరలించడం భావ్యం కాదన్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు ప్రమాదాలు సంభవించడం ఖాయమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి విలీనాన్ని రద్దు చేయాలని కోరారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం కుప్పంరూరల్: ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమంలో భాగంగా కుప్పం మండలం, బలమందకొట్టం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి విలీనం చేస్తారనే సమాచారంతో గురువారం స్థానికులు ఆందోళనకు దిగారు. తరగతులు తొలగిస్తే పిల్లలు బైరప్పకొటాలుకు వెళ్లి రావాల్సి ఉంటుందని, అంతదూరం వెళ్లిరావడం కష్టతరమని వాపోయారు. విదాయశాఖ అధికారులు స్పందించి వెంటనే వినీనాన్ని రద్దు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మద్యం వ్యాన్ బోల్తా..
వడమాలపేట మండలం తడుకు ఆర్ఎస్ కూడలి వద్ద మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. టోకన్ల గోల అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా తయారైంది జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సర్కారు బడులు సమస్యలతో స్వాగతం పలికాయి. గత ఐదేళ్ల పాటు అధునాతన హంగులతో ఓ వెలుగు వెలిగిన బడులు ప్రస్తుతం ధీన స్థితికి చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,462 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 1,48,430 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందని విద్యార్థి మిత్ర కిట్లు తొలి రోజే ప్రతి విద్యార్థికీ డా.సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్ కిట్లను అందజేయాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థి మిత్ర కిట్లను అందజేలేదు. ఈ కిట్లలో విద్యార్థులకు బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, షూస్, డిక్షనరీ, వర్క్ బుక్స్ అందజేయాల్సి ఉంది. కానీ షూలు, బ్యాగులు, యూనిఫాం జిల్లాకు రాకపోవడంతో కేవలం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పత్తాలేని బడిబాట అడ్మిషన్లు పెంచుకునేందుకు ప్రతి ఏటా వేసవి సెలవుల్లో, బడులు తెరిచిన సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేవారు. జిల్లాలోని ప్రతి మండలంలో క్షేత్ర స్థాయిలో టీచర్లు ప్రచారం చేసి బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బడిబాటకు ఫుల్స్టాప్ పెట్టేశారు. మౌలిక వసతుల కల్పన, విద్యార్థి కిట్లుకు మంగళం పాడేశారు. ఈ క్రమంలోనే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. పుస్తకాలు మాత్రమే ఇచ్చారని చూపుతున్న యాదమరి మండలం పి.గొల్లపల్లి పాఠశాల విద్యార్థులు – 8లో– 8లో– 8లోన్యూస్రీల్విద్యార్థికి ‘మిత్ర ద్రోహం’! సమస్యల్లో సర్కారు బడులు పునఃప్రారంభమైనా పూర్తి స్థాయిలో అందని విద్యార్థి మిత్ర కిట్లు జాడలేని నూతన అడ్మిషన్లు పెదవి విరుస్తున్న తల్లిదండ్రులు గత ప్రభుత్వంలో పాఠశాల ప్రారంభం రోజే సకల వసతులు పేద పిల్లలు ఉన్నత చదువులు చదవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మరోసారి నిరూపితమైంది. జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమైనా విద్యార్థులకు అందించాల్సిన కిట్లను సైతం సక్రమంగా అందించక చేతులెత్తేసింది. ఉండలు కట్టిన నాసిరకం మధ్యాహ్న భోజనం వడ్డించి హాజరైన అరకొర విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందించకుండా గొంతు నొక్కేసింది. నూతన అడ్మిషన్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో కళకళలాడాల్సిన పాఠశాలలను నిర్వీర్యం చేసింది. దీంతో విధిలేక పలువురు పేద పిల్లలు ప్రయివేటు బడుల వైపు అడుగులు వేయడం కనిపించింది. జిల్లాలో తొలిరోజు పాఠశాలల పునఃప్రారంభంపై ‘సాక్షి’గౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ బడులు వెలవెల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిరోజు నూతన అడ్మిషన్ల జాడ కనిపించలేదు. గత ఐదేళ్లలో అమలు చేసిన నాడు–నేడు, విద్యాకానుక, అమ్మఒడి, గోరుముద్ద, ట్యాబుల పంపిణీ, సీబీఎస్ఈ సిలబస్తో కొత్త పుంతలు తొక్కించారు. దీంతో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యారు. కానీ నేడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఆయా పథకాలను నీరుగార్చడంతో విద్యార్థులు ప్రయివేటు బడుల వైపు అడుగులు వేస్తున్నారు. తొలి రోజే ప్రభుత్వ బడులన్నీ వెలవెలబోవడం కనిపించింది. జిల్లా సమాచారం పాఠశాలల పాఠశాలల విద్యార్థుల కేటగిరీ సంఖ్య సంఖ్య ప్రాథమిక 1,949 52,469 ప్రాథమికోన్నత 158 10,293 ఉన్నత 355 85,668 మొత్తం 2,462 1,48,430 నాసిరకం బియ్యంతో అన్నం నాసిరకం బియ్యంతో అన్నం పెడుతున్నారు. గతంలో గోరుముద్ద పథకాన్ని చాలాబాగా అమలు చేసేవారు. రోజుకొక మెనూ వడ్డించేవారు. ప్రస్తుతం తొలి రోజు నాసిరకం బియ్యంతో అన్నం పెట్టారు. ఇలాంటి మగ్గిన అన్నం పెడితే ఎలా..?. – సుజమ్మ, విద్యార్థి తల్లి, శ్రీరంగరాజపురం యూనిఫాం ఇవ్వలేదు ఇంతకుముందు బడి తెరిచిన తొలి రోజే యూనిఫాం, పుస్తకాలు, నోటుపుస్తకాలు, షూ లు, డిక్షనరీ, బ్యాగు ఒకేసారి ఇచ్చేవారు. ఇప్పుడు మా పా ఠశాలలో యూనిఫాం ఇవ్వనే లేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. పుస్తకాలు కొ న్నే ఇచ్చారు. – పౌర్ణమి, విద్యార్థిని, శ్రీరంగరాజపురం మండలం -
తోతాపురి కొనుగోలు
గుడిపాల : తోతాపు రి కాయలు మాకొద్ద ని మండలంలోని తాసా జ్యూస్ ఫ్యాక్ట రీ యాజమాన్యం చె ప్పడంతో బుధవా రం అధికారులు స్పందించారు. దీంతో రెవెన్యూ డివిజి నల్ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ జయంతి ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించి వారితో సంప్ర దింపులు జరిపారు. తోతాపురి మామిడి కాయల ను కొనుగోలు చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో ప్రతి రోజు 50 పర్మిట్లు తీసుకుంటామని వారికి తెలియజేశారు. వెంటనే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఫ్యాక్టరీలో నియమించి టోకెన్ల ప్రక్రియను ప్రారంభించారు. దశల వారీగా ఎక్కువగా పర్మిట్లు అందజేయనున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలియజేసింది. -
మద్దతు ధరతోనే మామిడిని కొనాలి
– పరిశ్రమల నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశాలు తవణంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను విధిగా రైతులకు అందించేలా గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు పనిచేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలోని జీసీఆర్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఎంఓఎఫ్పీఐ, ఫీల్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజ్జు ఫ్యాక్టరీని, సిద్ధార్ధ, ఎఫ్3 గుజ్జు ఫ్యాక్టరీలను కలెక్టర్ తనిఖీ చేశారు. బంగారుపాళ్యం హార్టికల్చర్ అధికారి సాగరిక ఫ్యాక్టరీ యజమానులు ధరను నిర్ణయించడంలేదని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్కుమార్ మాట్లాడుతూ.. తోతాపురి రకానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను విధిగా అమలు చేయాలని ఫ్యాక్టరీ యజమానులకు దిశానిర్దేశం చేశారు. ఫ్యాక్టరీ యజమానులు మామిడికి మద్దతు ధరను అమలు చేసి రైతులు, అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద విధులకు కేటాయించిన సిబ్బంది తోతాపురి మామిడి రైతుల పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్తో పాటు తవణంపల్లె తహసీల్దార్ సుధాకర్, అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి మండలానికి పీఎం ‘సూర్యఘర్’
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ప్రతి మండలానికి 500 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, పీఎం సూర్యఘర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అర్బన్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సెక్షన్ పరిధిలో రోజు 20 మంది వియోగదారులకు వీటిపై ప్రచారం చేయాలన్నారు. నెలకు 300 యూనిట్లు దాటిన ఓసీ, బీసీ వినియోగదారులపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. బీసీలకు ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు సబ్సీడీ ఇస్తోందని వీటిపై అవగాహన కల్పించాలన్నారు. సూర్యఘర్ నమోదును ఆన్లైన్లో చేయించి వెండర్లతో అనుసంధానం చేయించాలన్నారు. జిల్లాలో 3,200 వ్యవసాయ సర్వీసులను సకాలంలో విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, టెక్నికల్ ఈఈ జగదీష్, ఏఓ ప్రసన్న ఆంజనేయులు డీఈలు ప్రసాద్, ఆనంద్ పాల్గొన్నారు. -
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
కూటమి పాలనలో సర్కారు బడుల్లో చదువు గాల్లో దీపంలా మారింది. వేసవి సెలవులు అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత, బదిలీలు పూర్తి కాకపోవడంతో గందరగోళ పరిస్థితి, పునఃప్రారంభం రోజు అందజేసే విద్యా మిత్ర కిట్లు అరకొరగా చేరడం, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో వెలుగు వెలిగిన సర్కారు బడులు ప్రస్తుతం కూటమి పాలనలో అస్తవ్యస్తంగా మారాయి. నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కథనం.చిత్తూరు కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడులు కూటమి పాలనలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ సర్కారులో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత కూటమి పాలనలో ప్రశ్నార్థకంగా మారింది. నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటాడుతున్న సమస్యలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి.ఆరుబయటే చదువులుజిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో నాడు–నేడు పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో జిల్లాలోని వేలాది పాఠశాలల్లో మౌలిక వసతులు కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో మొదటి విడత నాడు–నేడులో 1533 పాఠశాలల్లో రూ.354 కోట్లతో, రెండో విడతలో 1183 పాఠశాలలు, 30 జూనియర్ కళాశాలల్లో రూ.424 కోట్లతో పనులు చేపట్టారు. రెండో విడతలో నిర్వహిస్తున్న పనులను కూటమి సర్కారు నిలిపివేయడంతో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో మాత్రమే పనులు నిర్వహిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పలు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేక ఆరుబయట చదువులకు స్వాగతం పలికే పరిస్థితి నెలకొంది.బదిలీలు పూర్తికాకముందే..ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత నెల రోజులుగా టీచర్లలో అన్ని కేడర్లకు బదిలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజుకు టీచర్ల కొరత లేకుండా చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆర్భాటంగా గొప్పలు చెప్పారు. అయితే ఆ మాటలు ఒట్టిమాటలేనని తేలిపోయింది. ఇప్పటి వరకు డీఎస్సీ పరీక్షలు, బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. జిల్లాలో ఇంకా 3 వేలకు పైగా ఎస్జీటీ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ టీచర్లు బదిలీ అయినప్పటికీ వారిని రిలీవ్ చేయని పరిస్థితి. మరికొన్ని పాఠశాలల్లో టీచర్లు బదిలీలు అయినప్పటికీ రిలీవర్ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని దుస్థితి. అదే విధంగా వేల మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభం రోజున పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేక బోసిపోవాల్సిన దుర్భర పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.పబ్లిసిటీ ఫుల్..సరఫరా అంతంతే..జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తొలిరోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో స్టూడెంట్స్ కిట్లు అందజేస్తామని కూటమి గొప్పలు చెప్పింది. అందుకు అవసరమైన పబ్లిసిటీని చేసుకుంది. అయితే ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆ కిట్లను చేర్చలేక విఫలం అయ్యింది. జిల్లాలోని 2462 పాఠశాలల్లో చదువుతున్న 148430 విద్యార్థులకు, నూతనంగా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో కిట్లను సరఫరా చేయకుండా అరకొరగా పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, బ్యాగులు, యూనిఫాం అరకొరగా వచ్చాయి. షూలు ఒక్కటీ అందలేదు.విద్యార్థులకు అందించే కిట్ వివరాలుకిట్లోని వస్తువులు పంపిణీ చేయాల్సినవి ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవిపాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్ 1587618 1571868 15750బ్యాగులు 144400 126604 17796యూనిఫాం 144400 67800 76600బెల్టులు 103563 103563 –షూస్ 144189 00 1441896 వ తరగతి డిక్షనరీలు 12771 12771 –1వ తరగతి డిక్షనరీలు 24728 24728 –నోటు పుస్తకాలు 836872 836872 –కార్పొరేట్కు అనుకూలంగా కూటమికూటమి సర్కారు సర్కారు బడులను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. గత ప్రభుత్వం సర్కారు బడులకు అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేట్ బడులను బలోపేతం చేస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభం రోజున పూర్తి స్థాయిలో విద్యార్థులకు కిట్లు ఇవ్వకపోవడం సర్కారు వైఫల్యమే. అదే విధంగా గత సర్కారు నిర్వహిస్తున్న నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాఠశాలల్లో మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. – సద్ధాం,స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్, చిత్తూరు జిల్లా -
సాక్షిని అణగదొక్కాలని కుట్ర
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాను అణగదొక్కాలని అధికార పార్టీ కుట్ర చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కేఎన్ఆర్పై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమన్నారు. ఎక్కడైన షో నిర్వహించిన జర్నలిస్టును అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సాకుతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. మాజీ సీఎం భార్యపై సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేసిన పోస్టుల పై చర్య లేదన్నారు..? జగనన్న పాలనలో పార్టీలకతీతంగా పథకాలు అందించారన్నారు. అప్పుడు లబ్ధి పొందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు చేత వైఎస్సార్సీపీ వారి మీద కూటమి నాయకత్వం దాడుల చేయిస్తోందన్నారు. బాబు ఏడాది పాలనలో విచ్చలవిడిగా మద్యం ఎరులై పారుతోందన్నారు. టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు వెళుతోందన్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ మహిళపై చులకనగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. -
అన్నదాతల అగచాట్లు
గంగాధర నెల్లూరు : మండలంలోని మామిడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ గేట్ల వద్ద ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు వేచి చూసినా టోకెన్లు దక్కని రైతుల ఆవేదన పట్టించుకునే వారేలేరు. కనీస సదుపాయాలు కూడా కల్పించని యాజమాన్యం ఎరట్రి ఎండలోనే నడి రోడ్లపైన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే లైన్లో ఉండగా 10 గంటల సమయంలో కొందరు సెక్యూరిటీ గార్డులు వచ్చి ఈ రోజు టోకెన్లు ఇవ్వడం కుదరదు అందరూ వెళ్లిపోండి అంటూ అక్కడ నుంచి పంపేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తర్వాత 80 మందికి టోకెన్లు ఇచ్చి మిగతా వారిని తరిమేశారు. కాగా ప్రభుత్వం తోతాపూరి రకం మామిడిని ఎనిమిది రూపాయలకు కొనమని మార్గదర్శకాలు విడుదల చేయగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం 6, 7 రూపాయలకే కొంటున్నారని సమాచారం. వే బ్రిడ్జి వద్ద తూకం అవ్వగానే ఆరు ,ఏడు రూపాయలకే కొంటున్నట్లు సంతకాలు సేకరించి ఆ తర్వాత రైతు పేరు మామిడి కాయల బరువు మాత్రం రసీదు ఇచ్చి పంపించడం పై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని రైతులు నిలదీశారు. కర్మాగారం యాజమాన్యం స్పందిస్తూ ఫాక్టరీ రోజుకు 70, 80 టోకెన్లు మాత్రం ఇవ్వగల సామర్థ్యం కలదని, వందలాది రైతులు వస్తుంటే తామేంచేయ్యాలిఅని అన్నారు. జిల్లా అధికారులు యాజమాన్యాలతో చర్చలు జరిపి మామిడి రైతులను ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. -
మండీల్లో మామిడి కొనుగోళ్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ర్యాంప్, మండీల నిర్వాహకులు ఇకపై మామిడిని కొనుగోలు చేసుకోవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ర్యాంప్, మండీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ర్యాంప్, మండీల నిర్వాహకులు తప్పనిసరిగా మార్కెటింగ్ శాఖ ఏడీ వద్ద ముందస్తుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే మామిడిని కొనుగోలు చేయాలన్నారు. రైతుల నుంచి ఎన్ని టన్నులు కొనుగోలు చేశారు..రైతుల పేర్లు, మామిడీ లారీలు ఏ కంపెనీకి, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనే అంశాలను తప్పనిసరిగా సేకరించాలన్నారు. ప్రాసెసింగ్ కంపెనీలు రూ.8 ప్రభుత్వం తరఫున రైతులకు ప్రోత్సాహకంగా రూ.4 తప్పనిసరిగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాంప్, మండీల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. సమావేశంలో జేసీ విద్యాధరి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పర్మిట్లకు అగచాట్లు
గుడిపాల : పర్మిట్ల కోసం రైతన్నలు పడిగాపులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా రైతులకు మాత్రం పర్మిట్లు అందడం లేదు. గుడిపాల మండలంలోని తాసా, పుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీలలో రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. మంగళవారం ఏకంగా కలెక్టర్ తనిఖీలు నిర్వహించగా రైతుల పర్మిట్లను కొంతసేపు ఇచ్చి ఆపేశారు. ఆ తరువాత ఇవ్వడానికి కుదరదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన పర్మిట్లకు మాత్రమే తీసుకొని తరువాత పర్మిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. తమిళనాడు ప్రాంతం వారికి ప్రాధాన్యం తమిళనాడు నుంచి వస్తున్న మామిడి కాయలకు ఫ్యాక్టరీ యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడి నుంచి తక్కువ రేటుకు మామిడి దిగుబడి చేసుకోవడంతో ఇక్కడ రైతులను పట్టించుకోవడం లేదు. ఇక్కడ కొనుగోలు చేస్తే రైతుల వద్ద నుంచి రూ.8 కి కొనుగోలు చేయాలి. తమిళనాడు నుంచి వచ్చినట్లయితే రూ. 6కే తమకు వస్తుందని ఫ్యాక్టరీ వారు చెబుతున్నారు. – రైతుల వద్ద నుంచి మామిడి కాయలను కొనుగోలు చేస్తామని ఉద్యానవనశాఖ ఏడీ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం గుడిపాలలోని పుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. యాజమాన్యంతో చర్చించి అధికంగా పర్మిట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందొద్దని ఆయన హామీ ఇచ్చారు. -
ఎస్జీటీ బదిలీల్లో రగడ
● స్పౌజ్ పాయింట్లపై రచ్చ ● అధికారుల ఎదుట ఓ టీచర్ ఆత్మహత్యాయత్నం ● డీఆర్ఓను చుట్టుముట్టిన టీచర్లు ● బందోబస్తు నడుమ కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్జీటీ కౌన్సెలింగ్లో స్పౌజ్ పాయింట్ల విషయంలో కొందరికి న్యాయం..మరికొందరికి అన్యాయం చేశారు. విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటూ టీచర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఎస్జీటీ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ పాయింట్ల విషయంలో వివాదం తలెత్తింది. మంగళవారం రాత్రి, బుధవారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్లో స్పౌజ్ పాయింట్ల విషయంలో 204 సీరియల్ నంబర్ లోపు ఉన్న చాలా మంది టీచర్లకు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో స్పౌజ్ పాయింట్ల విషయంలో నష్టం జరుగుతోందని ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుంటానని భయాందోళన సృష్టించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు ఆపివేశారు. ఇష్టానుసారం మార్పులు బదిలీల్లో స్పౌజ్ పాయింట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఇద్దరు భార్యభర్తలు ఎస్జీటీలుగా ఉండి తప్పనిసరి బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే స్పౌజ్ నిబంధనల కింద సీనియారిటీ జాబితాలో ముందు ఉన్న వ్యక్తి స్పౌజ్ కు అర్హులైతే తరువాత ఉన్న స్పౌజ్ ఎక్కడికి బదిలీ అవుతారో తెలియదు కాబట్టి జిల్లాలో ఎక్కడైనా కోరుకునే అవకాశం కల్పించాలి. అయితే 8 ఏళ్లు పూర్తి అయిన స్థానంనే పరిగణలోకి తీసుకుని తిరిగి అక్కడే కోరుకోవాలనే వింత నిబంధనను అమలు చేశారు. ఈ నిబంధనతో చాలా మంది టీచర్లు నిరాశ, ఆవేదనకు గురవుతున్నారు. కుప్పంలో పనిచేస్తున్న ఇద్దరు భార్యభర్తలను తిరిగీ కుప్పంలోనే కోరుకోవాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సబబు అని బాధితులు ప్రశ్నించారు. స్పౌజ్ పాయింట్లు తీసేయాలని.. ఎస్జీటీల కౌన్సెలింగ్ కేంద్రంలోకి ఉపాధ్యాయ సంఘం నేతలను అనుమతించకుండా పోలీసు బందోబస్తును పెట్టి భయాందోళన సృష్టిస్తున్నారు. జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే గొంతును నొక్కేసి బదిలీల ప్రక్రియను ఇష్టానుసారంగా, ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల తతంగంలో స్పౌజ్ పాయింట్లు రద్దు చేసుకునే అవకాశం కల్పించాలని ఎస్జీటీలు మొరపెట్టుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఇష్టముంటే బదిలీ కోరుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చాలా మంది టీచర్లు బదిలీలు కోరకుండానే వెనుదిరిగారు. కూటమి పాలనలో వింత ధోరణిలో నిర్వహిస్తున్న బదిలీల తతంగంపై టీచర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్ఓను చుట్టుముట్టిన నేతలు బుధవారం ఉదయం 10.30 గంటలకు తిరిగీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఘటన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో డీఆర్వో మోహన్ కుమార్ ను కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు పంపించారు. డీఆర్వో కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగానే యూటీఎఫ్, వైఎస్సార్టీఎఫ్, ఎస్టీయూ సంఘాల నేతలు, పలువురు బాధిత టీచర్లు న్యాయం చేయాలంటూ డీఆర్వోను చుట్టుముట్టారు. ఆ సమయంలో సంబంధిత టీచర్ల సమస్యలను డీఆర్వో స్పష్టంగా విన్న తర్వాత కలెక్టర్, విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాసేపు చర్చలు జరిపిన అనంతరం డీఆర్వో టీచర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
సోషల్ వెల్ఫేర్ డీడీగా విక్రమ్కుమార్రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులైన విక్రమ్కుమార్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ఆ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం డీడీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో అడ్మిషన్ల పెంపు, ఎస్సీ వసతి గృహాల బలోపేతానికి పటిష్ట చర్యలు చేపడుతామన్నారు. అనంతరం నూతన డీడీని ఆ శాఖ సూపరింటెండెంట్ మురుగేశ్, సూర్యప్రకాష్, అశోక్, గౌతమ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
దృఢత్వానికి ప్రతీక భారతి అల్ట్రాపాస్ట్ సిమెంట్
గుడిపాల : నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రాపాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్ధ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. బుధవారం గుడిపాల మండలంలోని బొమ్మసముద్రంలో కనక మహాలక్ష్మి ట్రేడర్స్ మనోజ్కుమార్, సునీల్, సుధీర్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి మాట్లాడుతూ.. జర్మనీ టెక్నాలజీ, రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతి అల్ట్రా పాస్ట్ సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంఫర్ ఫ్రూప్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంట్కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా పాస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతిచోటా అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తాఫీ మేస్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న ఐచర్
– రైతు మృతి, మరో వ్యక్తికి గాయాలుబంగారుపాళెం : మండలంలోని నలగాంపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ట్రాక్టర్ను ఐచర్ వాహనం ఢీకొన్న సంఘటనలో యాదమరి మండలానికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరోవ్యక్తి గాయపడినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి మండలం సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు మణిరెడ్డి తన సొంత ట్రాక్టర్లో మామిడి కాయలను బంగారుపాళెం మామిడి మార్కెట్కు తీసుకొచ్చాడు. మండిలో కాయలను అన్లోడ్ చేసి తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్పై బలిజపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్రెడ్డితో కలసి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను నలగాంపల్లె అండర్ బ్రిడ్జి సమీపంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు పోతున్న ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న మణిరెడ్డి (60) రోడ్డుపై పడిపోవడంతో ఐచర్ వాహనం తలపై దూసుకుపోయింది. ఈ ఘటనలో మణిరెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంకటేశ్వర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
చౌడేపల్లె : ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకొస్తే ఎవరూ ఉండరెందుకు ? ఆసుపత్రికి తాళం వేసి వెళ్లిపోండి అంటూ మండల సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు , సిబ్బంది తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ గాజుల రామ్మూర్తి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. గత నెల 16 వతేదీ పి.రెడ్డి ప్రసాద్ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొస్తే వైద్య సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో మదనపల్లెకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలించారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా పట్టించుకోవడంలేదంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెల్త్ కార్డుల కోసం ప్రజల నుంచి ఎంత మంది వద్ద ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి జారీ చేయించారో చెప్పాలని నిలదీశారు. వేరుశనగ విత్తన కాయలు ఒక్కో రైతుకు ఒక బస్తా ఇస్తే ఏమి చేయాలి , కొన్ని గ్రామాల్లో రైతులకు ఒక్కరికీ విత్తన కాయలు ఇవ్వకుండా పంపిణీ చేయడం ఏమిటని వ్యవసాయ శాఖ సిబ్బందిపై సభ్యులు మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు చూస్తే గుండె జల్లు మంటోందని ట్రాన్స్కో అధికారులకు సభ్యులు మొరపెట్టుకొన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. స్వచ్చాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆచరణలో పాటించడంలేదని, గత ప్రభుత్వంలో పంచాయతీల వారీగా కేటాయించిన చెత్త బుట్టలు, తడి పొడి చెత్త సేకరణకు వీలుగా మండలానికి సుమారు 16 వేలు బుట్టలు వచ్చాయని వాటిని పంపిణీ చేయకుండా కార్యాలయాల్లో నిల్వ ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. పందిళ్లపల్లె పంచాయతీలో ఒక్కరికీ కూడా బుట్టలు పంపిణీ చేయలేదని నిలదీశారు. కాగా సమావేశానికి ఇరిగేషన్, హార్టికల్చర్ , ఆర్టీసీ, సిరికల్చర్, మత్స్యశాఖ అధికారులు డుమ్మాకొట్టారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు నివేదిచాలని ఎంపీడీఓను సభ్యులు కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, ఎంపీడీఓ లీలామాధవి, తహసీల్దార్ హనుమంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
– దంపతులకు గాయాలు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ నిత్య బాబు కథనం మేరకు... ఐరాల మండలం మామిడి గుంట పల్లెకు చెందిన రాజేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య పూర్ణిమ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలకు పుస్తకాలు యూనిఫాం కొనడానికి చెర్లోపల్లి నుంచి చిత్తూరు వైపు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటర్ను ఢీకొట్టగా రాజేష్ పూర్ణిమతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో రాజేష్ దంపతుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరిని రాణి పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లలకు స్వల్ప గాయాలు తగలగా వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే స్కూటర్ పై నలుగురు ప్రయాణించడం డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. గ్రానైట్ లారీలు సీజ్ చౌడేపల్లె: అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా గ్రానైట్ను తరలిస్తున్న రెండు లారీలను రీజినల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్ బుధవారం సీజ్ చేశారు. చౌడేపల్లె వైపు నుంచి పుంగనూరు వైపునకు గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఇసుక లారీని సీజ్ చేసి జరిమానా విధించినట్లు సమాచారం. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీ్స్ స్టేషన్కు అప్పగించారు. గ్రానైట్, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సర్వర్ పరేషన్
● పది రోజులుగా పనిచేయని సర్వర్ ● రేషన్కార్డు దరఖాస్తుకు బ్రేకులు ● లక్షల్లో దరఖాస్తులు..అరకొరగా నమోదు ● విమర్శలతో కదిలిన ప్రభుత్వం ● దరఖాస్తుకు మళ్లీ అవకాశం పనిచేయని సర్వర్రేషన్కార్డు దరఖాస్తుకు వేచి ఉన్న లబ్ధిదారులు (ఫైల్) కాణిపాకం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలను ఊరిస్తూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దరఖాస్తు ప్రక్రియలో ఎదురువుతున్న ఇబ్బందులు చుక్కలు చూపుతున్నాయి. రేషన్ కార్డు దరఖాస్తు గడువు ఈనెల 9వ తేదీతో ముగిసింది. అయితే గడువును పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ నేటికీ సాఫ్ట్వేర్లో నిబంధనలు మార్చకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. సాఫ్ట్వేర్లో నిబంధనలు సరళతరం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.అతికష్టం మీదుగా దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఇచ్చిన కొద్ది రోజులకే సర్వర్ డౌన్తో అగచాట్లు తప్పలేదు. మళ్లీ రేషన్కార్డు దరఖాస్తుకు ప్రభుత్వం గడువు పొడిగించినా క్షేత్రస్థాయిలో సర్వర్ పనిచేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడంలేదు. గత నెల వరకు రేషన్ కార్డుల వివిధ సమస్యల నిమిత్తం మొత్తం 39791 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్ కార్డులో చిరునామా మార్పునకు 841, ఆధార్ అనుసంధానం సరి చేసుకునేందుకు 532, షాపు రెన్యూవల్ 14, సభ్యుల చేర్పునకు 30464, సభ్యుల తొలగింపు 672, కొత్త రేషన్ కార్డుకు 3926, స్ప్లిట్ కార్డు దరఖాస్తుకు 3301, సరెండర్ రేషన్కార్డు 41 దాకా వచ్చాయి. అయితే దరఖాస్తు ప్రక్రియలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సాఫ్ట్వేర్లో మార్చాల్సిన అవసరం ఉందని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్యలు ఇవీ.. ● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు ఉన్నప్పుడు కొడుకుకు పెళ్లయి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే మొదట భార్య పేరును ఈ కార్డులోకి మార్పించుకోవాలి. తరువాత 21 రోజులకు కొడుకు, కోడలకు ప్రత్యేకంగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరికి పిల్లలు పుడితే ఆ పిల్లలను వీరి కార్డులోకి ఎక్కించుకోవాలంటే మరో 21 రోజులు గడువు ఉంటుంది. ఈ విధంగా ఒక పేరు కార్డులో నమోదు కావాలంటే రోజుల తరబడి గడువు ఉంటే ఈ లోగా దరఖాస్తు గడువు ముగుస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఉంటే కూతురుకు పెళ్లయి వారికి వేరే కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నప్పుడు ఈ కార్డులో కార్డుదారుని కూతురు స్థానంలో కోడలు అని నమోదు అయినా, కోడలు స్థానంలో కూతురు అని నమోదైనా.. కార్డుదారుడికి సంబంధించి బంధుత్వంలో తేడాలు ఉంటే వారి పేరు తొలగించడానికి కుదరటం లేదు. ● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఉన్నప్పుడు ఉదాహరణకు రేషన్కార్డులో కార్డుదారుని కోడలుకు సంబంధించి కోడలు అని కాకుండా ఎన్ఏ అని ఉంటే కోడలు పేరు కార్డులో నుంచి తొలగించలేకపోతున్నారు. ● భార్యాభర్తకు కొత్త రేషన్కార్డు కావాలన్నప్పుడు వారి ఆధార్ కార్డులో స్థానికంగా కాకుండా వేరే అడ్రసు ఉంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంతేకాక ఇంటి మ్యాపింగ్ జరగడం లేదని లబ్ధిదారులు వాపో తున్నారు. ఆధార్ కార్డులో చిరునామాలు సక్రమంగా ఉంటేనే ఇంటి మ్యాపింగ్ అవుతుందని, ఇంటి మ్యాపింగ్ అయితేనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. ఆధార్లో చిరునామాల తేడా కారణంగా పాత కార్డు నుంచి వీరి పేర్లు తొలగించినా ఇంటి మ్యాపింగ్ కావడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ● రేషన్కార్డు దరఖాస్తులో కరెంటు బిల్లు అధికంగా వచ్చినా కొత్త కార్డుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ కరెంటు బిల్లులు తప్పులు వచ్చి విద్యుత్ శాఖ అధికారుల ద్వారా తప్పులు సరిచే సుకున్నా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు నెలరోజుల సమయం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● రేషన్ కార్డు ఎవరిపేరు మీద ఉంటుందో ఆ కార్డుదారుడు మళ్లీ కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. వీఆర్ఓల అందుబాటులో లేకపోవడం రేషన్ కార్డులు మంజూరులో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చాలా మండలాల్లో రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక రెవెన్యూ అధికారి ఉండటంతో అతని కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారి దరఖాస్తుపై సంతకం చేస్తేనే డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్లో మార్పులు చేయకపోవడం సాఫ్ట్వేర్ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి ఎటువంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాక కొత్త రేషన్కార్డుల నమో దుపై గ్రామ సచివాలయ అధికారులకు అవగాహన కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో చాలామంది దరఖాస్తు నమోదులో సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇతర అధికారులపై ఆధార పడాల్సి వస్తోంది. రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు.. సైట్లో కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అందుకే సర్వర్ డౌన్ అయింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు అనేది లేదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆందోళన వద్దు – శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు -
● కొనేలేమంటున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు ● అధికారులకు ఫిర్యాదుల వెల్లువ ● రూ.8కు కొనుగోలు చేయాలని అధికారుల ఆదేశం
చిత్తూరు రూరల్(కాణిపాకం) : కూటమి ప్రభుత్వం తోతాపురికి గిట్టుబాటు ధర కల్పించామని ఊదరగొడుతోంది. తోతాపురి కిలోల రూ.8కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పుకుంది. అయితే ఆచరణలో తోతాపురి నిర్ణయ ధర అమలుకు నోచుకోవడం లేదు. రూ. 8కే కొనుగోలు చేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు తోతాపురి కిలో రూ. 8కే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కిలోకు రూ.4 ఇస్తామని వెల్లడించింది. దీంతో కూటమికి చెందిన రైతు నాయకులు సంబరపడిపోయారు. మంగళవారం తోతాపురి కిలో రూ.5కు కొనుగోలు చేయడంతో రైతులు మండిపడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ. 5 కంటే ఎక్కువ కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తోంది. దీంతో కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఫ్యాక్టరీలు సిండికేట్? జిల్లాలోని ఫ్యాక్టరీలు సిండికేట్ అయిందనే వాదనలు గట్టిగా వినిపిస్తోంది. దీంతో తోతాపురి కాయలను ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ, విద్యాశాఖ మంత్రుల దృష్టికి ఈ వారంలో తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ఏకమయ్యారు. మార్కెట్కు 300 టన్నుల కాయలు చిత్తూరు నగరంలో మార్కెట్కు 300 టన్నుల మామిడి కాయలు వచ్చాయి. 200 బేనీషా రాగా మిగిలిన 100 టన్నులు వివిధ రకాల టేబుల్ రకాలు వచ్చినట్లు ట్రేడర్లు అంచనా వేశారు. అయితే బేనీషా ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. తోతాపురి (టేబుల్ రకం), చందూర, ఇమామ్ పసంద్, కాలేపాడు తదితర రకాల ధరలు సాధారణంగానే ఉన్నాయి. చిత్తూరు మామిడి కాయల మార్కెట్లో కాయలను ప్యాకింగ్చేస్తున్న కూలీలు మామిడి ధరలు ఇలా రకం కిలో ధర (రూ.లలో) తోతాపురి 5 బేనీషా 13–23 మల్లిక 12–25 తోతాపురి (టేబుల్రకం) 11–14 రకం కిలో ధర (రూ.లలో) అల్పోన్సో 20–25 కాలేపాడు 20–40 చందూర 5–13 చక్కెర గుత్తి 60–70 ఇమామ్ పసంద్ 40–70 -
అక్రమ గ్రా‘నైట్’ ..రైట్ రైట్
● పెద్దిశెట్టిపల్లిలో అక్రమ క్వారీ ● రోజుకు రూ.3 లక్షలు విలువ చేసే గ్రానైట్ తరలింపు ● యథేచ్ఛగా తమిళనాడుకు రవాణా ● అక్రమార్కులతో కుమ్మకై ్కన అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీ తవ్వకాలు జోరందుకున్నాయి. కూటమి నేతలు విలువైన గ్రానైట్ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారం మాదే..అడ్డుకునేది ఎవరంటూ..యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు చేపట్టారు. రెండు నెలలుగా ఈ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో జోగుతూ...అక్రమ గ్రానైట్కు రైట్..రైట్ చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకూ రూ. 3 లక్షలు విలువ చేసే గ్రానైట్ బండలు యథేచ్ఛగా పెద్దిశెట్టిపల్లి నుంచి గుడిపాల మీదుగా తమిళనాడుకు తరలుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అనుమతి లేకుండా ఎలా క్వారీ తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నిస్తే..నోరు మెదపడం లేదని వారు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నియంత్రించాలని వారు కోరుతున్నారు. -
‘అయ్యో’ర్ల పడిగాపులు
● రాత్రి 9.50 గంటలైనా ప్రారంభం కాని కౌన్సెలింగ్ ● ఉదయం నుంచి ఎదురుచూస్తున్న టీచర్లు ● రాత్రి 9.20 గంటలకు సీనియారిటీ జాబితా విడుదల ● కౌన్సెలింగ్ కేంద్రంలోకి సంఘం నేతలకు నో ఎంట్రీ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల నుంచి విచ్చేసిన ఎస్జీటీలు బదిలీల కౌన్సెలింగ్ కోసం జిల్లా కేంద్రంలో పడిగాపులు కాశారు. రా త్రి 9.50 గంటల సమయం అయినప్పటికీ కౌన్సెలింగ్ ను విద్యాశాఖ అధికారులు ప్రారంభించలేదు. ఈ కౌ న్సెలింగ్కు హాజరైన ఎస్జీటీ టీచర్ల సీనియారిటీ ప్రకా రం బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారు లు చర్యలు చేపట్టారు. పలు మండలాల నుంచి హాజరైన టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చీకటిలో కూర్చుని రాత్రంతా నిరీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాత్రి 9.20 గంటలకు ఎస్జీటీల సీనియారిటీ జాబితా ను విడుదల చేశారు. అయితే ఆ జాబితాలో సమగ్ర సీ నియారిటీ జాబితాను ప్రదర్శించాలని టీచర్లు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు 350 వరకు మాత్ర మే జాబితాను విడుదల చేసి మిన్నకుండి పోవడంతో ఎస్జీటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సీనియారిటీ జాబితాను విడుదల చేస్తే బదిలీల్లో న్యాయం జరుగుతుందని పలువురు ఎస్జీటీలు వెల్లడించారు. సంఘం నాయకులకు నో ఎంట్రీ కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో టీచర్ల తరపున సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ సంఘాలు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సంఘం నాయకులు హాల్లోకి రాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్నడూ లేని వింత విధానాలను చిత్తూరు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారని వివిధ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు ఇతర జిల్లాల్లో విచారించగా సంఘం నాయకులను అనుమతిస్తున్నారని తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన సంఘం నాయకులు ఉద్దేశపూర్వకంగా అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
అలమటించిన అన్నదాత
గంగాధర నెల్లూరు : మామిడిని రైతుల నుంచి కిలో రూ.12లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు బేఖాతర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జీడీనెల్లూరులోని జైన్ కంపెనీ ఎదుట మండుటెండలో కడపు మాడ్చుకుని మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి టోకెన్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు పట్టించుకోలేదని అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని వందలాది మంది మామిడి రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. మొత్తం 1,100 మంది రైతులు పంట విక్రయానికి దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే టోకెన్లు మంజూరు మిగిలిన వారిని వెనక్కి పంపించేశారు. ట్రాక్టర్లలో మామిడి లోడ్తో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొందరు సిఫార్సులతో టోకెన్ పొందారని, మండటెండలో ఎదురు చూసిన వారికి పక్కనపెట్టేశారని పలువురు ఆరోపించారు. అవస్థలు పడిన మామిడి రైతులు పట్టించుకోని ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు టోకెన్ల కోసం తప్పని సిఫార్సులు -
పర్మిట్లకు పడిగాపులు
●తవణంపల్లె : మండలంలోని మామిడి రైతులు జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర మామిడి కాయలు తరలించడానికి పర్మిట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. మండలంలో ఐదు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉండగా ఇప్పటి వరకు రెండు జ్యూస్ ఫ్యాక్టరీలు మాత్రం క్రషింగ్ ప్రారంభించారు. ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి ఫ్యాక్టరీ యజమానులు రైతులకు పర్మిట్లు ఇచ్చి మామిడి కాయలను కొనుగోలు చేస్తున్నారు. తోతాపురి (బెంగుళూరు రకం) ఫ్యాక్టరీ యజమానులు కిలో రూ.6 ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం మామిడి రైతులకు రూ.4 ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న మామిడి రైతులకు ప్రభుత్వం కిలోకు రూ.4 పరిహారం అందిస్తుంది. దీంతో రైతులు జ్యూస్ ప్యాక్టరీల దగ్గర మామిడి కాయలు తోలడానికి పర్మిట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. -
కూటమి సేవలో పోలీసులు
పలమనేరు : రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని కూటమి నేతల కోసం పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారని మంగళవారం పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆరోపించారు. సాక్షి టీవీలో అమరావతి అంశంపై డిబేట్లో మాట్లాడిన వారిని కాదని అక్కడున్న జర్నలిస్ట్పై నిందలు మోపి అరెస్ట్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఛానెళ్లు మరీ ఘోరంగా మాట్లాడినా అప్పట్లో ఇలాంటి అక్రమ అరెస్టులు జరిగాయా అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్సిక్స్తో పాటు 147 హామీలను అమలు చేయాల్సిందిపోయి డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను ఏ మార్చడం కుదరదన్నారు. జర్నలిస్ట్ కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని సాక్షాత్తు న్యాయస్థానమే తప్పు బట్టిదంటే పోలీసులు ఎంత అత్యుత్సాహంతో రెడ్బుక్ కోసం పాటు పడుతున్నారో సామాన్య ప్రజలకు సైతం బాగా అర్థమవుతోందన్నారు. -
‘తోతాపురి మామిడి మాకొద్దు’
గుడిపాల : తోతాపురి మామిడి కాయలు తమకు వద్దని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం తెగేసి చెప్పింది. గుడిపాల మండలంలోని తాసా జ్యూస్ ఫ్యాక్టరీకి వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించి అధికారులను మంగళవారం నియమించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.8, ప్రభుత్వం రూ.4 మామిడికి ధర ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. దీంతో అధికారులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం అక్కడికి చేరుకొని ప్రస్తుతానికి తోతాపురి మామిడి కాయలు మాకొద్దని అధికారులకే తెగేసి చెప్పారు. తమిళనాడు నుంచి రూ.6 కే డెలివరీ చేస్తున్నారని ఇక్కడ మామిడి కాయలు ఇంకా పక్వానికి రాలేదని అధికారులకు వివరించారు. యాజమాన్యం మాత్రం ప్రస్తుతానికి మేము తీసుకోలేమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతన్నలు ఫ్యాక్టరీ యాజమాన్య నిర్ణయాలపై మండిపడ్డారు. -
బదిలీలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి
● ఎన్జీవో హోం వద్ద ఐక్యవేదిక ఉపాధ్యాయుల నిరాహార దీక్ష చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐక్యవేదిక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎస్జీటీల బదిలీలను ఆన్లైన్లో కాకుండా ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలన్నారు. గతంలో మాట ఇచ్చి ప్రస్తుతం తప్పడం సబబు కాదన్నారు. టీచర్లు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడితే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. స్పందన లేకపోవడంతో నిరాహార దీక్ష నిర్వహించామన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు కొన్ని కేడర్లకు నిర్వహించిన ఆన్లైన్ బదిలీల్లో అనేక సమస్యలు వచ్చాయన్నారు. పాయింట్లు ఉన్న వారికి సైతం దూరప్రాంతాలను కేటాయించారని చెప్పారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు స్వామి కణ్ణన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో బదిలీ చేరడానికి అంగీకరిస్తూనే, మరోపక్క చాపకింద నీరు లాగా ఆన్లైన్ బదిలీలు చేపట్టేందుకు సిద్ధమవడం దారుణమన్నారు. కౌన్సెలింగ్ సమస్యలు పరిష్కరించని పక్షంలో మంగళవారం విజయవాడ మంగళగిరిలోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో ఉపాధ్యాయ సంఘ నేతలు ఎస్.ఎస్.నాయుడు, సోమశేఖర్నాయుడు, మణిగండన్, ముక్తార్ అహ్మద్, విజయభాస్కర్రెడ్డి, గోవిందస్వామి, మంజునాథగుప్తా, నాగరాజ, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
విత్తు.. చిత్తు
తవణంపల్లె: కూటమి ప్రభుత్వంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. విత్తన కాయలు దొరుకుతాయో లేదోనని రైతు సేవా కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచే క్యూ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక నిరీక్షిస్తున్నారు. మండలానికి గత ఏడాది 1,710 క్విటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం 1,110 క్వింటాళ్లు మాత్రమే అందజేశారు. సోమవారం మండలంలోని టి.పుత్తూరు, పుణ్యసముద్రం, పైమాఘం, సరకల్లు రైతు సేవా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ కోసం వ్యవసాయశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు.నీరసిస్తూ..నిరీక్షిస్తూ..రైతు సేవా కేంద్రాల్లో సోమవారం వేకువ జాము నుంచే రైతులు తమ ఆధార్, పట్టాదారు పుస్తకాలు చేతబట్టి క్యూకట్టారు. రైతులందరూ ఒకే సారి ఎగబడడంతో సిబ్బంది రిజిస్ట్రేషన్ చేయడానికి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య రిజిస్ట్రేషన్ చేయించారు. టి.పుత్తూరు రైతు సేవా కేంద్రంలో అయితే ఉదయం 5 గంటల నుంచే రిజిస్ట్రేషన్ కోసం రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి జోక్యం చేసుకొని రైతులను క్యూలో పంపి రిజిస్ట్రేషన్ చేయించారు. ఎండలో ఎండుతూ.. చమటలు కక్కుకుంటూ రిజిస్ట్రేషన్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది.అందుతాయో లేదో..మండలానికి గత ఏడాది కంటే కూటమి ప్రభుత్వం 600 క్వింటాళ్ల మేర తక్కువ విత్తనాలు అందజేసింది. సోమవారం 806 మంది రైతులకు 242 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తవణంపల్లె ఇన్చార్జి వ్యవసాయాధికారిణి వందన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న రైతులకు మరుసటి రోజు నుంచే విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. రైతులు ఆర్ఎస్కే సిబ్బందికి సహకరించాలని సూచించారు. -
భాషోపాధ్యాయులకు అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : భాషోపాధ్యాయుల అప్గ్రేడ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వినాయకం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్లు తెలిపారు. గత ఆరేళ్ల నుంచి డీఈవో పూల్లో ఉన్న అసంబంద్ధతను తొలగించాలన్నారు. 2017లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భాషోపాధ్యాయుల ఉన్నతీకరణకు జీవో 90ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత 2019 నవంబర్లో సవరించి జీవో నం.77 ప్రవేశపెట్టి అర్హతలేని 1,300 మంది భాషోపాధ్యాయులు కేడర్ లేక నష్టపోతున్నారన్నారు. వారందరినీ డీఈవో పూల్లో పెట్టి ఇబ్బందులకుగురిచేస్తున్నారన్నారు. బదిలీల మధ్యలో వర్క్అడ్జస్ట్మెంట్ ప్రక్రియ చేసి భాషోపాధ్యాయులను దూరప్రాంతాలకు వెళ్లి పనిచేయాలనడం దారుణమన్నారు. డీఈవో పూల్ లో ఉన్న టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు చందు, శ్రీరాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
నగరి : రోడ్డు ప్రమాదంలో బాలాజీ (39) అనే రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బుగ్గఅగ్రహారం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, దక్షిణపాలమంగళానికి చెందిన బాలాజీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం రాష్ట్ర సరిహద్దు తమిళనాడుకు చెందిన పుణ్యంకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పాలమంగళంకు నాగలాపురం రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బుగ్గ అగ్రహారం వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ట్రాక్టర్, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ విజయ్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతి చెందిన రైతు పాలమంగళం దక్షిణపు కండ్రిగ సర్పంచ్ కుమారుడు అని గుర్తించారు . -
రిజిస్ట్రేషన్ లక్ష్యం రూ.218.17 కోట్లు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్శాఖ ఈ ఏడాది ఆదాయ రూ.218.17 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. జిల్లాలోని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా లక్ష్యాలను ఇచ్చారన్నారు. చిత్తూరు ఆర్వో రూ.77.79 కోట్లు, పలమనేరుకు రూ.34.91 కోట్లు, పుంగనూరుకు రూ.30.79 కోట్లు, కుప్పంకు రూ.22.35 కోట్లు, చిత్తూరు రూరల్ రూ.15.57 కోట్లు, బంగారుపాళ్యంకు రూ.11.44 కోట్లు, కార్వేటినగరానికి రూ.10.88 కోట్లను లక్ష్యంగా కేటాయించినట్లు వివరించారు. ఇప్పటివరకు నెలవారి లక్ష్యంలో ఏప్రిల్లో రూ.17.45 కోట్లకు గాను రూ.12.24 కోట్లు, మేలో రూ.15.27 కోట్లకు, రూ.12.12 కోట్లు, జూన్కు రూ.17.45కోట్లకు గాను అదివారం వరకు రూ.3.54 కోట్లు రాబడి వచ్చిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన జిల్లా లక్ష్యం రూ.181.78 కోట్లకు గాను 77.49 శాతం ఆర్జించినట్టు తెలిపారు. గత ఏడాది కంటే రూ.36.39 కోట్లు అధికంగా వార్షిక లక్ష్యం నిర్దేశించిందన్నారు. వరసిద్ధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ హరీష్కుమార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించి స్వామి ప్రసాదం, స్వామి చిత్రపటం అందజేశారు. -
రమణీయం..రథోత్సవం
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్నాల వీధి, భేరివీధి, గాంధీరోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మణల నడుమ వైభవంగా కొనసాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిపించారు. రాత్రి అశ్వవాహన సేవ చేపట్టారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, ఎస్ఈ–2 జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రథోత్సవంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. -
విత్తుకున్న కష్టాలు!
వేరుశనగ విత్తనాల కోసం రైతులు ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. కాయల కోసం కుస్తీ పడుతున్నారు. రైతు సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. చివరకు పోలీసులను రగంలోకి దింపి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా రైతుల నోరు నొక్కేస్తున్నారు. కాణిపాకం: ఖరీఫ్ సీజన్ కింద జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల హెక్టార్ల దాకా వేరుశనగ సాగయ్యేది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. 2024–25లో 34వేల హెక్టార్ల వరకే పంట సాగైంది. వేసిన పంట కూడా చేతికందక మట్టిపాలైంది. గుడిపాల, యాదమరి, పెనుమూరు తదితర మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా ఇంతవరకు నష్టపహారం చేతికందనంటోంది. అయితే ఈసారి వర్షాలు సంమృద్ధిగా కురుస్తున్నాయి. వేరుశనగ సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం గతేడాది సాగు విస్తీర్ణాన్ని సాకుగా చూపి విత్తనాల సరఫరా విషయంలో కోత పెట్టింది. దీంతో రైతులు అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కాయల్లేవ్ గతంలో జిల్లాకు 40వేల క్వింటాళ్ల వరకు వేరుశనగ విత్తనాలు సరఫరా అయ్యేవి. ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు బ్యాగులు దాకా ఇచ్చేవారు. ఈసారి 25,560 క్వింటాళ్ల కాయలు మాత్రమే వచ్చాయి. రైతుకు ఒక బ్యాగు కూడా అందని పరిస్థితి నెలకొంది. టోకన్ల కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షించినా ఫలితం లేకుండా పోతోంది. టోకన్లు అందని వాళ్లు పంపిణీ కేంద్రాల వద్ద పడిగావులు కాస్తున్నారు. సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు సర్దిచెబుతున్నారు. మళ్లీ వస్తాయని కుంటి సాకులు కాయలు అరకొరగా రావడంతో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలుపట్టుకుంటున్నారు. అడిగిన వారికి సమాధానం చెప్పుకోలేక తికమక పడుతున్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు నోరు మెదపలేకపోతున్నారు. కొందరు కూటమి నేతలు సైతం కాయల కోసం సిబ్బందిని వేధిస్తున్నారు. ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ తరుణంలో వారి కోపతాపలను అణగ దొక్కి బాధ్యతలను గుర్తుచేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో జరిగే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ క్రమంలో వారు రైతులకు మాయమాటలు చెప్పాల్సి వస్తోంది. మళ్లీ కాయలు వస్తాయని, వస్తే పిలుస్తామని.. ఆధార్, పట్టాపాసు పుస్తకం జిరాక్స్ పత్రాలు తీసుకుని పంపించేస్తున్నారు. అయితే మళ్లీ కాయలు వచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఉన్నంతలోనే సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే అన్నదాత సుఖీభవలో కోతలు పడతాయంటూ భయపెడుతున్నారు. వేరుశనగ విత్తనాల కోసం ముప్పుతిప్పలు అరకొర విత్తనాలతో సర్దిపెడుతున్న అధికారులు విత్తనకాయల కోసం రైతుల కుస్తీ పట్టించుకోని అధికారులు, పాలకులు విత్తనాలు కూడా ఇవ్వకపోతే ఎలా? రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేసేది..ఒక్క వేరుశనగ విత్తనం మాత్రమే. ఆ విత్తనాలు కూడా ఇవ్వపోతే ఎలా..?. ఇప్పుడున్న రోజుల్లో రైతులను బతికిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రభుత్వం స్పందించి వేరుశనగ పంటకు కావాల్సిన మేర విత్తనాలు పంపిణీ చేయాలి. – సభాపతి, రైతు, చిత్తూరు మండలం -
సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : సమస్యలు పరిష్కరించండయ్యా..అంటూ జిల్లాలోని ప్రజలు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 235 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో కులశేఖర్ వెల్లడించారు. విచారించకుండానే.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన తమ వినతిపత్రాన్ని క్షేత్ర స్థాయిలో విచారించకుండా సమస్య పరిష్కరించేశామని క్లోజ్ చేసేశారని విజయపురం మండలానికి చెందిన వేలు, పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జేసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 19న చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. విజయపురం మండలం కోసలనగరం సొసైటీ బ్యాంక్లో పనిచేస్తున్న ఇన్చార్జి సీఈవో రాధా, మాజీ సీఈవో మురుగయ్య రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇందుకు తగిన ఆధారాలు సైతం వినతిపత్రం తో పాటు అందజేశామన్నారు. వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఎస్ఐ అని చెబుతూ ఓ వ్యక్తి తమకు కాల్ చేసి బెదిరింపులు చేస్తున్నారన్నారు. దీనిపై విచారించకుండా సమస్య పరిష్కరించామని చెప్పడం బాధాకరమన్నారు. రోడ్డు మార్గం కల్పించాలి గుడిపాల మండలం ఒంటిల్లు గ్రామానికి ఎటువంటి రోడ్డు మార్గం లేదని, అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డుమార్గం చూపించాలని గ్రామస్తులు రామదాసు, గోపి కోరారు. ఈ మేరకు వారు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. తమ గ్రామం వద్ద బెంగళూరు–చైన్నె ఎక్స్ప్రెస్ హైవే మార్గం వెళ్తోందన్నారు. విలేజ్ టర్న్ యాక్టివిటీ రోడ్డు ఆ హైవే వల్ల కోల్పోయిందన్నారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక అర్జీలు స్వీకరించిన జేసీ విద్యాధరి -
బదిలీల్లో కూటమి ఎత్తుగడ
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో కూటమి ప్రభుత్వం తన ఎత్తుగడను మానుకోవాలని వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్జీటీల ప్రత్యక్ష కౌన్సెలింగ్కు ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాలను విచ్ఛిన్నం చేస్తోందన్నారు. వెబ్ఆప్షన్లు పెట్టుకోవాలని ఎస్జీటీలను విద్యాశాఖ అధికారులు బెదిరించడం అన్యాయమన్నారు. వెబ్ల్యాండ్లో ఉన్న తప్పుల కారణంగా జిల్లాలో 70 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతున్న వైఎస్సార్టీఏ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి -
బతుకు‘బండి’ బస్టాండు
● రోడ్డున పడ్డ ఆపరేటర్లు ● రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ మొదలు ● ఇకపై వాహనాలకు డ్యూలు చెల్లించని ప్రభుత్వం ● ఆపరేటర్లే మిగిలిన అప్పును చెల్లించాలి ● మూడు డ్యూలు చెల్లించకుంటే వాహనం సీజ్ తప్పదు ● ఉపాధి కోల్పోయిన వాహన నిర్వాహకులు ప్రభుత్వం మోసం చేస్తుందని అనుకోలేదు.. ఇటీవల సంబంధిత మంత్రిని కలిసి మాట్లాడినా మీకెలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇకపై డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ అని ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై వాహనాలకు కంతులు ఎలా కట్టుకోవాలి. మా కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కావడంలేదు. – వేణు, ఎండీయూ వాహనాల ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు వాహనాన్నే నమ్ముకొని ఉన్నాం గత ప్రభుత్వంలో నుంచి ఆపరేటర్గా నిత్యావసరాలను అందిస్తూ ప్రభుత్వం అందించే వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇకపై రేషన్ పంపిణీకి వాహనాలు లేవని ఆదేశాలందాయి. ఆ ఉన్న పనిపోయింది. మళ్లీ ఇప్పుడు పనికోసం వెతుక్కోవాలి. బండికి డ్యూలు కట్టాలంటే అద్దెలు దొరికితేనే కదా. దీన్నే నమ్ముకుని ఉన్న మాలాంటి వాళ్ల బాధలు ఈ ప్రభుత్వానికి అర్థం కాలేదు. – బాబు, ఎండీయూ ఆపరేటర్, నక్కపల్లి ఉపాధి లేకుండా చేశారు ఏదో పని ఉందని దాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాళ్లం. ఉన్నట్టుండి మమ్మల్ని తీసేశారు. వాహనాలకు ఇంకా బ్యాంకు అప్పు పెండింగ్లో ఉంది. దాన్ని మేమే కట్టుకోవాలంట. ఏమి చేసేదో అర్థం కాలేదు. ఉన్న వాహనాన్ని బాడుగకు తిప్పదామన్నా బాడుగలు దొరకడంలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – ప్రసాద్రెడ్డి, ఆపరేటర్, గంటావూరు పలమనేరు : నిన్న మొన్నటి దాకా సంచార వాహనంలోనే రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఇకపై వాహనాలు వద్దని ఆయా డీలర్ల వద్దే సరుకులు పంపిణీ చేపడుతోంది. దీంతో ఇన్నాళ్లు దీన్నే నమ్ముకున్న ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో పాటు వారు బ్యాంకు రుణం ద్వారా వాహనం కోసం తీసుకున్న అప్పులో భాగంగా మిగిలిన కంతులు ఆపరేటర్లు చెల్లించాలి. మూడు నెలలు ఇన్స్టాల్మెంట్లు చెల్లించకుంటే బ్యాంకర్లు ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవడం ఖాయం. దీంతో ఎండీయూ (మొబైల్ డిస్పాచింగ్ యూనిట్స్) ఆపరేటర్లకు కష్టాలు తప్పేలా లేవు. వాహనాల నుంచే ఇప్పటి దాకా సరఫరా రేషన్ దుకాణ పరిధిలోని కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేసేవారు. పీడీఎస్ రైస్కు సంబంధించి ఐసీడీఎస్(అంగన్వాడీలు) స్కూళ్లు, హాస్టళ్లకు ఈ వాహనాల్లోనే సరఫరా చేసేవాళ్లు. రేషన్ దుకాణం ఉన్న గ్రామానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఆవాస గ్రామాల్లోని కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాహనాల ద్వారా సరుకులు ప్రతినెలా అందేవి. దీంతో అటవీ సమీప గ్రామాలు, వ్యవసాయ పొలాల వద్ద నివసాలుండే వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది. ఆపరేటర్ల పరిస్థితి ఏంటంటే.. రేషన్ షాపుల పరిధిలో ఆపరేటర్లను ఎంపిక చేశారు. యూనిట్ కాస్ట్ రూ.5,81,190 కాగా ఇందులో వేయింగ్ సామగ్రి కోసం రూ.9,260గా నిర్ణయించారు. వీరికి వాహనాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రుణాలను అందించారు. ఈ వ్యవహారాలను ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్( ఏపీఎసీసీఎల్) చేపట్టింది. ఈ సందర్భంగా ఆపరేటర్లు 10శాతం కాంట్రిబ్యూషన్,90శాతం లోనుగా ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి 2021 నుంచి జనవరి 2027 దాకా జరిగేలా అగ్రిమెంట్ ఉంది. ఇందులో ఆపరేటర్కు నెల జీతం రూ.21 వేలుగా నిర్ణయించారు. ఇందులో బ్యాంకుకు ప్రభుత్వం ద్వారా కంతుకు రూ.5879, ఆపరేటర్ రూ.3 వేలు చెల్లించాలి. రూ.21 వేలలో కంతు కోసం రూ.3 వేలు, ఇంధనానికి రూ.3 వేలు, అసిస్టెంట్కు రూ.5 వేలు పోగా నెలకు ఆపరేటర్కు రూ.10 వేలు మిగిలేది. రేషన్ డీలర్లకు మేలు చేసేందుకే... ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ డిజిటల్ తూకాల ద్వారా పక్కాగా ఇన్నాళ్లు సాగేది. ఇప్పుడు పంపిణీ ఆయా డీలర్లకు ఇవ్వడంతో చాలా చోట్ల త్రాసులు వాడి సరుకుల పంపిణీ సాగుతోంది. దీంతో అక్రమాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. కొందరు డీలర్లు అందుబాటులో ఉండక ప్రజలకు కష్టాలు తప్పవు. దీంతో పాటు రేషన్ సరుకుల్లో అక్రమాలు అప్పుడే మొదలైనట్లు ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మిగిలిన డ్యూలు కట్టుకోవాలి.. ఇప్పటి దాకా 72 నెలల్లో 53 నెలలు ప్రభుత్వం ప్రతి నెలా బ్యాంకు అప్పుగా రూ.5879 చెల్లించింది. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేయడంతో ఆపరేటర్లు నెలకు డ్యూ రూ.3 వేలు చొప్పున మిగిలిన 20 నెలలు కట్టాల్సిందే. మూడు నెలలు డ్యూ కట్టకుంటే వాహనాన్ని ఫైనాన్స్ ఇచ్చిన బ్యాంకు జప్తు చేస్తుంది. దీంతో ఆపరేటర్లు తమ వాహనాలను పాల ట్యాంకర్లు తోలేందుకు, ఇతర అద్దెలకు తిప్పాల్సి వస్తోంది. అద్దెలు లేకుంటే కంతు కట్టలేక వాహనాన్ని వదుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కుప్పం : కుప్పం రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం దిబ్రూనగర్ నుంచి బెంగళూరు వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తుండగా కుప్పం రైల్వేస్టేషన్ రాగానే ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. రైల్వే పోలీసులు గాయపడిన వ్యక్తిని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. బ్లూకలర్ టీ షర్ట్ దరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.కర్ణాటకలో కుప్పం మహిళా దొంగల అరెస్టురూ.6 లక్షల నగలు స్వాధీనందొడ్డబళ్లాపురం : రద్దీగా ఉన్న బస్సులు, బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నలుగురు మహిళా దొంగలు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నివాసులైన శశి (35), మాధవి (40), అఖిల (30), విద్య (29) అనేవారిని కర్ణాటకలోని హాసన్ జిల్లా హొళేనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.38 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. హొళెనరసీపుర బస్టాండులో ఒక మహిళ బంగారు గొలుసు చోరీకి గురైంది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగలని తేలడంతో అరెస్ట్ చేశారు. వీరి మీద బెంగళూరులోని పలు పోలీస్స్టేషన్లలో చోరీ కేసులు నమోదై ఉన్నాయి. నలుగురూ ముఠాగా ఏర్పడి ఊరూరూ తిరుగుతూ చోరీలు చేసి మళ్లీ కుప్పంకు వెళ్లిపోయేవారని పోలీసులు తెలిపారు. -
యువకుడి అదృశ్యం
చౌడేపల్లె : తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన యువకుడు విశ్వతేజ(17) ఆచూకీ తెలియజేయాలని తల్లిదండ్రులు అమరావతి, అమర్నాద్ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. చౌడేపల్లె బజారువీధిలో నివాసం ఉంటున్న వీరు తమ కుమారుడు విశ్వతేజను శనివారం మధ్యాహ్నం మందలించారు. అప్పటి నుంచి కనపడకపోవడంతో వెతికినా ఫలితం లేకపోయిందని, ఆచూకీ తెలిసినవారు చౌడేపల్లె పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. ఈతకు వెళ్లి యువకుడి మృతి బంగారుపాళెం : మండలంలోని తగ్గువారిపల్లెలో ఆదివారం బావిలో మునిగి కర్ణాటకకు చెందిన యువకుడు మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోలారు జిల్లా ముళబాగిల్ తాలూకా చాపరహళ్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మురళి(23) బంగారుపాళెం మామిడి మార్కెట్లో ఓ మండిలో పనులు చేసేందుకు వచ్చాడు. ఆదివారం పనులు లేక పోవడంతో తగ్గువారిపల్లె సమీపంలో ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు స్నేహితులు అమర్, అజయ్, విశ్వనాఽథ్, విజయ్, రాజశేఖర్, గణేష్, తేజతో కలసివెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మురళి నీటిలోపలికి వెళ్లడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. స్నేహితులు మురళిని బయటకు తీసే సరికి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారు పాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విత్తన నాణ్యతతో దిగుబడులు
పెనుమూరు(కార్వేటినగరం) : సాగులో నాణ్యమైన విత్తనం వినియోగించడం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చని రాస్ కృషి వి/్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రాస్ కృషి వి/్ఞాన కేంద్రం తిరుపతి, వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఆదివారం పెనుమూరు మండలంలోని గొబ్బిళ్లమిట్ట, వడ్లవానిమిట్ట, గాంధీపురం గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేతలు , వ్యవసాయశాఖ అధికారులు రైతులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు నూతన రకాలు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మొదలైన వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. అదే విధంగా పాడిపశువుల పోషణ, సమగ్ర వ్యవసాయ విధానం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ శాఖ నుంచి అందిస్తున్న వివిధ సేవలు, మొబైల్ యాప్ల ప్రాముఖ్యం, వినియోగం మొదలైన అంశాలను వివరించారు. అనంతరం గ్రామాల్లో రైతులు సాగు చేసిన పూల మొక్కల నర్సరీలో కృత్రిమ లైటింగ్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత డాక్టర్ ఎం.మంజునాథ్, పెనుమూరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, కేవీకే విస్తరణ శాస్త్రవేత శ్రీరామ్కుమార్, రైతు సేవా కేంద్రం సిబ్బంది , అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్ ఆప్షన్ విధానం రద్దు చేయాలంటూ ధర్నా ● రోడ్డుపై బైఠాయించి నిరసన ● మోకాళ్ల పై కూర్చొని నినాదాలు ● బారికేడ్లు పెట్టి మోహరించిన పోలీసులు
చిత్తూరు కార్పొరేషన్ : తమ సమస్యల పరిష్కారం కో సం ఉపాధ్యాయులు ఉద్యమించారు. బదిలీ కౌన్సెలింగ్ జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దాల్సిన ప్రభు త్వం పట్టనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయులు ఆదివారం ఉద యం జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. వారిని నిలువరిచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. వారిని కార్యాలయంలోకి పంపకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో అయ్యోర్లు రోడ్డు పై బైఠాయించారు. మండు టెండలో మోకాళ్ల పై నిల్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఓ ఉపాధ్యాయుడు తల కిందులుగా నిరసన తెలిపాడు. వెబ్ కౌన్సెలింగ్ విధానం రద్దు చేయాలని నినదించారు. కాని పక్షంలో సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు. రీ కౌన్సెలింగ్ జరిపి న్యాయం చేయాలి ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వద్దని మాన్యూవల్ కౌన్సెలింగ్ కావాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. వెబ్ ఆప్షన్లో వచ్చిన లోపాలను సవరించాలని నినాదాలు చేశారు. నష్టపోయిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రీ కౌన్సెలింగ్ జరిపి న్యాయం చేయాలని కోరారు. 20 రోజుల ముందు జరిగిన చర్చల్లో మాన్యువల్ కౌన్సెలింగ్కు విద్యాశాఖ అంగీకరం తెలిపిందన్నారు. కానీ మళ్లీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కోరడం ఏమిటన్నారు. దీంతో ఎస్జీటీలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ప్రధానంగా సీనియర్లకు అన్యాయం జరుగుతోందని అంతా గందరగోళంగా మారిందన్నారు. ఈ విధానం వల ఉపాధ్యాయులు నష్టపోతున్నారన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. టీచర్ల డిమాండ్లు ఇవీ.. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. క్లస్టర్ లెవల్ అకడమిక్ టీచర్ ఖాళీలతో కలిపి ముందుగా ఇచ్చిన ఆప్షన్ మేరకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలి. రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ బదిలీల వెబ్ సైట్లో తప్పనిసరిగా బదిలీగా చూపడం సరికాదు. ఫైనల్ సీనియర్ జాబితా విడుదల చేయకుండా ఉపాధ్యాయుల గ్రీవెన్స్ పరిషార్కం కాకుండానే ఆప్షన్ పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం అన్యాయం. ప్రధానోపాధ్యాయులు, ఉపాఽ ద్యాయులు ఎంపిక చేసుకున్న ఖాళీలను కేటాయించకపోవడంతో తర్వాత సదరు ఖాళీలను పదోన్నతుల్లో చూపడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. కొన్ని ఖాళీలను సీనియర్ ఉపాధ్యాయులు ముందుగా బదిలీ కోసం ఎంపిక చేసుకున్నప్పటికీ వారికి కేటాయించకుండా జూనియర్లకు ఇస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఒకే పోస్టును ఇద్దరికి కేటాయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు విజయభాస్కర్రెడ్డి, రెడ్డప్పనాయుడు, మణికంఠన్, చెంగల్రాయమందడి, మోహన్, ముత్యాలరెడ్డి, శేఖర్, సోమశేఖర్నాయుడు, భాస్కర్ పాల్గొన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలి గతంలో జరిగిన చర్చల్లో ఎస్జీటీలకు మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ఇప్పుడు అలా జరగడం లేదు . ఇచ్చిన మాటను తప్పారు. మ్యానువల్ కౌన్సెలింగ్ను తుంగలో తొక్కి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడుతున్నారు. ఇదిసరైన పద్ధతి కాదు. – రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ దౌర్జన్యంగా బదిలీలు అసంబద్ధంగా జరుగుతున్న బదిలీల ప్రక్రియ పై భవిష్యత్తు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. వీటిపై ఫిర్యాదు చేయడానికి గ్రీవె న్స్ ఏర్పాటు చేయలేదు. సీనియార్టీ ప్రకారం వివరాలు అందుబాటులో లేవు. దౌర్జన్యంగా బదిలీల ప్రక్రియ చేస్తున్నారు. – కన్నన్,జిల్లా అధ్యక్షుడు పీఆర్టీయూ పరిష్కార మార్గం చూపాలి గతంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సజావుగా సాగింది. అప్పుడు మా సమస్యలను విని వాటిని పరిష్కరించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అంతా అసంపూర్తిగా ఉంది. ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ఇకనైన వీటికి పరిష్కార మార్గం చూపాల్సి ఉంది. లేకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదు. – బాలాజీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఆపస్ విద్యాశాఖ మంత్రి స్పందించాలి విద్యాశాఖమంత్రి నారా లోకేష్ మా సమస్యల పై స్పందించాలి. ఉమ్మడి జి ల్లాలో 3,253 మంది బదిలీ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిమాండ్ల పరిష్కా రం కోసం అయ్యోర్లు రోడ్డు ఎక్కారు. అయిన ఇంత వరకు ఒక ప్రకటన లేదు. జిల్లావాసి చంద్రబాబుకు మా సమస్యలు పట్టడం లేదు. – మదన్ మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్టీయూ సీనియర్లు నష్టపోతున్నారు సీనియర్లు జూనియర్లుగా, జూనియర్లు సీనియర్లుగా బదిలీ ప్రక్రియ విధానం జరుగుతోంది. సీనియార్టీకి విలువ లేకుండా పోతోంది. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఉపాధ్యాయులు అయోమయంగా ఉన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – దీనవతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, యూటీఎఫ్ -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
పలమనేరు : మండలంలోని జగమర్ల క్రాస్ వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఐచర్ వాహనం ఢీకొంది. ఐచర్ క్యాబిన్ ధ్వంసమై తీవ్ర గాయాలతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నుంచి క్యాబిన్ వేరై రోడ్డు పక్కనున్న పల్లంలోకి పడిపోయింది. మృతి చెందిన డ్రైవర్ బైరెడ్డిపల్లి మండలం కోట్రేపల్లికి చెందిన లోకేష్ (30)గా గుర్తించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీ ఐచర్ వాహనానికి డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. చైన్నెలో సరుకు అన్లోడ్ చేసి బెంగళూరుకు వస్తుండగా మొగిలి ఘాట్లో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాణిపాకం కిటకిటకాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి దాకా భక్తులు బారులు తీరారు. భక్తులతో ఆలయం రద్దీగా కనిపించింది. భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. -
సామూహిక అక్షరాభ్యాసం
విత్తన నాణ్యతతో దిగుబడులు సాగులో నాణ్యమైన విత్తనాలు వినియోగించడం ద్వారా మంచి దిగుబడులు సాధించ వచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.నేడు బోయకొండలో యోగాంధ్ర ● ఉదయం 7గంటలకే ప్రారంభం ● ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాక ● ఏర్పాట్ల నిర్వహణపై కలెక్టర్ ఆరా కాణిపాకం కిటకిట కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు.సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 116 డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు 14, ఐటీఐ, నర్సింగ్, పాలిటెక్నిక్, మెడకల్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 53 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 64,789 మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు 32 వేలకు పైగా ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో.. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అరకొర జీతంపై స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంటికొక ఉద్యోగమని నమ్మించి మోసం కూటమి ప్రభుత్వం యువశక్తికి వెన్నుపోటు పొడిచింది. దేశాభ్యున్నతికి అండగా నిలిచే యువతను నిర్వీర్యం చేస్తోంది. అధికారంలోకి రాగానే ఇంటికొక ఉద్యోగం ఇస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, పవన్న్కళ్యాణ్, లోకేష్ తమ హామీల అమలును గాలికొదిలేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం...20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం...ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం అంటూ ఎన్నికల ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలనను చేరువ చేసేందుకు వైఎస్సార్సీపీ సర్కారు తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. రాజకీయ కక్ష్లతో డ్వామా, డీఆర్డీఏ, విద్యాశాఖ, జిల్లా పరిషత్ పలు శాఖల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను వేల మందిని జిల్లాలో తొలగించారు. పట్టాలు చేతబట్టుకొని.. జిల్లా వ్యాప్తంగా ఏటా ఇంజినీరింగ్ చదువులు పూర్తి చేసి 32 వేల మంది వరకు యువత పట్టాలతో బయటకు వస్తున్నారు. డిగ్రీ, పీజీలు చేసిన మరో 35 వేల మంది వరకు చదువులు పూర్తి చేసుకుని పట్టాలు చేతబట్టి ఉపాధి కోసం వెతుకుతున్నారు. వీరుకాకుండా చదువులు మధ్యలో ఆపేసిన మరో 15 వేల మంది తమ అర్హతలను బట్టి ఉద్యోగాల కోసం రోడ్లపై తిరుగుతున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ వంటి ఇతర కోర్సులను పూర్తి చేసిన యువత తమ అర్హత పత్రాలతో ఉద్యోగాల వేటలో ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి అంతంతే.. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు దిగజారాయి. ఏ నెలకానెల జీఎస్టీ ఆదాయం దిగజారుతుండటం వ్యాపారాల దుస్థితికి అద్దం పడుతోంది. అటు ఉద్యోగాలు లేక, పరిశ్రమల స్థాపనకు అవకాశం లేక, అల్లాడుతున్న యువత ఏదైనా ప్రైవేట్ సంస్థలో జాబ్ చేసుకుని కుటుంబానికి అండగా ఉందామని భావిస్తే దానికి సైతం ఈ ప్రభుత్వ విధానాలు గండికొడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో గత ఏడాది 32 శాతానికి పైగా వ్యాపారాలు పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కనీసం 35 శాతం పెరుగుదల ఉండే రంగాల్లోనూ అంతమేర తగ్గుదల ఉండటంతో యువతకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. గత ఐదేళ్లల్లో ఉద్యోగాల జాతర వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎంగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభించాయి. గడిచిన ప్రభుత్వం దాదాపుగా 4.56 లక్షల ఉద్యోగాలు జిల్లాలో భర్తీ చేసింది. అందులో 2 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. ఆప్కాస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం భద్రత కల్పించింది. యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్ష వరకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కనున్న రిజర్వు (ఏఆర్)కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకనటలో తెలిపారు. ప్రజలకు సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చనన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. నేడు అర్ధగిరి క్షేత్రంలో హుండీ లెక్కింపు తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం 9 గంటలకు హుండీ లెక్కిస్తామని ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి హనుమంతురావు తెలిపారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీ కానుకలు లెక్కిస్తామని వివరించారు. గురుకులాల్లో ఎంపిక ప్రక్రియ చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు తమ సీటు ఖరారు చేసుకోవాలని డీసీఓ గీత తెలిపారు. ఇటీవల నిర్వహించిన 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు జరిగిన పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందిన వారికి ఎంపిక ప్రక్రియ జరుగుతోందన్నారు. ఎంపికై న విద్యార్థుల మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలు, కళాశాలకు వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని డీసీఓ కోరారు. మొదటి జాబితాలో అర్హత పొందినవారు వెంటనే ప్రవేశం పొందాలని, లేనిపక్షంలో వారికి ప్రవేశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాను వెంటనే విడుదల చేస్తామన్నారు. స్మార్ట్ మీటర్ల విధానం వద్దు చిత్తూరు కార్పొరేషన్ : అధికారంలో లేనప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుపై కూటమి నేతలు గగ్గోలు పెట్టిన కూటమి నేడు స్మార్టు మీటర్ల బిగింపు వేగవంతం చేయాలని అనడం విడ్డూరంగా ఉందని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య పేర్కొన్నారు. ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్మార్టు మీటర్ల విధానం లోపభూయిష్టంగా ఉందని, దీనిని రద్దు చేయాలని ఆయన డిమాండు చేశారు. ఆదానీ సంస్థకు కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టును కేంద్రం ఇచ్చిందన్నారు. వారికి ఎదురు చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వాణిజ్య, పరిశ్రమల బిగింపు అయ్యాక నివాసాలకు మీటర్లను బిగించనున్నారని, వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు సౌకత్, భాస్కర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీసెట్–2025 పరీక్ష ఉమ్మడి జిల్లాలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం జరగనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తొలి రోజు 366 మంది హాజరవుతారని చెప్పారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కంటే అర్ధగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పీజీ సెట్ పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు జరగనున్నట్టు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామివారిని దర్శించుకోగా 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. చౌడేపల్లె : మండలంలోని బోయకొండ వద్ద సోమవారం ఉదయం 7 గంటలకే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఆదివారం యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యోగా డే కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి, రవాణాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరవుతారన్నారు. అన్నిశాఖల సమన్వయంతో నిర్ణీత సమయానికి బోయకొండ గోశాల వద్దకు చేరుకోవాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసనాలు నిర్వహిస్తారన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సుమారు 2 వేల మందితో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రవాణా, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. తొలుత స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఆస్థాన మండపంలో శ్రీసరస్వతిదేవిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం చిన్నపిల్లల చేత ఈవో పెంచల కిషోర్ అక్షరాలు దిద్దించారు. అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమానికి 200 మంది పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఈవో రవీంద్రబాబు,సిబ్బంది కోదండపాణి, హరి, మాధవరెడ్డి, వాసు పాల్గొన్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ బాబూ జాబు ఎక్కడ అంటున్న నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ ఊరించిన కూటమి ఏడాదవుతున్నా ఒక్క ఉద్యోగమూ ఇవ్వని ప్రభుత్వం ఊసేలేని జాబ్ క్యాలెండర్ ప్రకటన అడ్డగోలుగా వేల మంది ఉద్యోగాలతొలగింపు జిల్లాలో ఏటా 32 వేల ఇంజినీరింగ్ పట్టభద్రులు కూటమి టీడీపీ ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించింది. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రగల్భాలు పలికింది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆర్బాటం చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాల ఊసే మరిచిపోయింది..భృతి కలగా మారిపోయింది. ఇక జాబ్ క్యాలెండర్పై చేతులెత్తేసింది. ఇలా యువతను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా నిలువునా ముంచేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 4.56 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం యువతకు వెన్నుపోటు పొడిచింది. జిల్లాలోని కళాశాలల సమాచారం డిగ్రీ కళాశాలలు 116 ఇంజినీరింగ్ కళాశాలలు 14 ఐటీఐ కళాశాలలు 18 నర్సింగ్ కళాశాలలు 07 పాలిటెక్నిక్ కళాశాలలు 08 మెడికల్ 02 బీఈడీ కళాశాలలు 07 ఎంబీఏ, ఎంసీఏ 11 మొత్తం కళాశాలలు 183 జాబ్ క్యాలెండర్ ..నాటకం ప్రస్తుత మంత్రి నారా లోకేష్ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ గతంలో పదే పదే ఉదరగొట్టారు. యువతతో ఎక్కడ సమావేశాలు నిర్వహించినా జాబ్ క్యాలెండర్ మాటే ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ సర్కార్ పై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసి యువతను ఏ మార్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లేకుండా చేతులెత్తేశారు. దీనికి తోడు తమకు నష్టం కలిగించే నిర్ణయాలనే అమలు చేస్తున్నారంటూ జిల్లాలోని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్కు ఎగనామం జిల్లా వ్యాప్తంగా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు పది నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధుల కోసం విద్యార్థులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమో తదితర కోర్సులకు సంబంధించి ఏడాది ఫీజును రీయింబర్స్మెంట్లో నాలుగు విడతలుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అయితే 2024–25 విద్యాసంవత్సరం పూర్తయినా...ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చిల్లిగవ్వ చేతికందలేదు. దీంతో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూటమి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలు ఫీజులు చెల్లించాలని ఒత్తిళ్లు చేస్తుండటంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. భృతి.. బూటకం టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతిని ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి మాటే జిల్లాలో వినిపించడం లేదు. చిత్తూరు జిల్లాలో లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నమ్మి కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు భృతి ఊసే ఎత్తకపోవడం దుర్మార్గం. జాబ్ క్యాలెండర్ ఆర్భాటమేనా.. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి మరిచిపోయారు. నిరుద్యోగులను కూటమి ప్రభు త్వం మోసం చేసింది. ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. ఉద్యోగం రాకపోవడంతో సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. నిరుద్యోగులు కూట మి ప్రభుత్వాన్ని నమ్మి మరోసారి మోసపోయారు. – రమేష్, వి.కోట మండలం, చిత్తూరు జిల్లా మోసపూరిత వాగ్దానాలు చంద్రబాబు 2014 ఎన్నికల్లో నూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మళ్లీ మొన్న ఎన్నికల్లోనూ ఈ హామీ ఇచ్చా రు. సూపర్సిక్స్ హామీలతో అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసం చేయడం సమంజసం కాదు. – సద్ధాం, విద్యార్థి సంఘ నాయకుడు,చిత్తూరు నగరం నోటిఫికేషన్లు లేవు.. భృతి లేదు.. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామన్నారు. ఇప్పుడేమో సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది ఏ వర్గానికి ఎలాంటి మేలు చేయలేదు. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్నాను. ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. – కిషోర్, నిరుద్యోగి, నగరి మండలం కుటుంబంపై మరింత భారం ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో వచ్చేది. గత ఐదేళ్లు ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం ఫీజు మొత్తం ఒక్కసారి కట్టలేక విద్యార్థులంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. – ముస్తా, విద్యార్థి, కార్వేటినగరం నాలుగు లక్షల మంది యువతకు మొండిచేయి జిల్లాలోని యువత చంద్రబాబు అండ్ కో చేతిలో మరోసారి మోసపోయారు. ఏడాదికి నాలుగు లక్షలు కాదు కదా కొత్తగా నాలుగు పదుల సంఖ్యలోనైనా ఉద్యోగాల భర్తీని కూటమి ప్రభుత్వం చేపట్టలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. రూ.5 వేలు కాదు కదా రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారి ఉద్యోగాలు తొలగించి కడుపులు కొట్టారు. ఇక నిరుద్యోగ భృతి హామీ టీడీపీ 2014–19 పాలనలో మాదిరిగానే ప్రస్తుతం ఎగనామం పెట్టేశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపించారు. -
గాంధీ స్వప్నం.. జగనన్న సంకల్పం
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ స్వరాజ్యం జాతిపిత మహాత్మా గాంధీజీ కల. ఆయన కలలను 2019కి ముందు వరకు ఎవ్వరూ నిజం చేయలేకపోయారు. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దాన్ని నిజం చేసి చూపించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పారు. అనేక రకాల సేవలు ప్రజల గుమ్మం ముందే అందించి జాతిపిత కలలు సాకారం చేశారు. వేల కోట్లను ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా శాశ్వత గ్రామ సచివాలయ భవనాలను నిర్మించారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వందలాది మంది గొప్ప నాయకులు ఉన్నా ఏ నాయకుడు తీసుకోని ఈ నిర్ణయాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేసి ఒకే ఒక్కడుగా ప్రజల గుండెల్లో నిలిచారు. జిల్లాలో సచివాలయాల వివరాలు నియోజకవర్గం సచివాలయ ఖర్చు చేసిన భవనాలు మొత్తం చిత్తూరు 26 9.45 పలమనేరు 94 35.69 పూతలపట్టు 100 36.35 గంగాధరనెల్లూరు 88 31.74 కుప్పం 81 24.57 పుంగనూరు 99 42.16 నగరి 58 21.46 మొత్తం 546 201.42 (రూ.కోట్లల్లో) -
మధురం..విఫలం
● ధరలు పతనంతో రైతులు విలవిల ● తోతాపురి కొనుగోలుకు ఆసక్తి చూపని జ్యూస్ఫ్యాక్టరీ యజమానులు బంగారుపాళెం: మండలంలో మామిడి రైతులు విలవిల్లాడుతున్నారు. 70 శాతం మంది ఉద్యాన పంటైన మామిడి సాగుపై జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి బాగానే వచ్చినా ధరలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో బంగారుపాళెం మార్కెట్ మామిడి ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేసి ఎగుమతి చేసేవారు. అదేవిధంగా గుజ్జు పరిశ్రమలకు చెందిన యజమానులు మామిడి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వ్యాపారులు లేక మార్కెట్ వెలవెలబోతోంది. తోతాపురి అమ్మడు పోయేనా? రైతులు అత్యధికంగా తోతాపురి(బెంగళూర) మామిడిని సాగుచేస్తున్నారు. ఈ సారి పంట దిగుబడి బాగానే వచ్చినప్పటికీ ధర ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం కిలో రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. తోతాపురికి కనీస గిట్టుబాటు ధర టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని రైతులు, రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం టన్ను రూ.12 వేలు నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరను అములు చేయాలని కలెక్టర్ జూస్ ఫ్యాక్టరీ యజమానులను ఆదేశించారు. బెంగళూర రకం మామిడి కొలుగోలు చేసేందుకు జూస్ ఫ్యాక్టరీ యజమానులు ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక నుంచి తక్కువ ధరకే ఫ్యాక్టరీలకు రవాణా చేస్తుండడంతో ధర ఎక్కువ పెట్టి కొలుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదు. గతంతో మార్కెట్ ప్రారంభంలో తోతాపురి (బెంగళూర)రకం ఆశాజనకంగా ఉండేదని, టన్ను రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పలికేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూర రకం మామిడికి ధర ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఇప్పటి వరకు తోతాపురి కాయలు కొతలు మొదలు పెట్ట లేదు.ఈ ఏడాది తగ్గిన మామిడి ధరలు రకం టన్ను ధర బెన్నీషా రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు కాలేపాడు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు మల్లిక రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు ఖాదర్ రూ.23 వేల నుంచి రూ.18 వేల వరకు తగ్గించేశారు పులేరా రూ.12 నుంచి రూ.6కు పడిపోయింది నాటీ రకాలు కిలో రూ.4 లెక్కన విక్రయిస్తున్నారు గతంలో మామిడి ధరలు రకం టన్ను ధర బెన్నీషా రూ.80 వేలు నుంచి రూ.లక్ష కాలేపాడు రూ.60 వేల నుంచి రూ.70 ఇమామ్ పసంద్ రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు మల్గూబ రూ.లక్ష వరకు నాటీ రకాలు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు -
బోయకొండలో యోగాంధ్ర రేపు
చౌడేపల్లె: మండలంలోని బోయకొండ వద్ద సోమవారం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యటకశాఖాధికారిణి గౌరి, సీఐ రాంభూపాల్, తహసీల్దార్ హనుమంతునాయక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఇదివరకే పులిగుండు, కాణిపాకం వద్ద విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు బోయకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముమ్మరంగా ఏర్పాట్లు యోగాంధ్ర నిర్వహణ ప్రదేశాన్ని వివిధ శాఖల అధికారులు సందర్శించారు. గోశాల వద్ద మట్టిని తోలి చదును చేసే పనులు చురుగ్గా చేపట్టారు. సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్పై కేసు చిత్తూరు అర్బన్: సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కే.చిన్నయ్య పై చిత్తూరు పోలీసులు శనివారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. సీఐ మహేశ్వర కథనం మేరకు... చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చిన్నయ్య కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడు. ఆ సమయంలో అందజేసిన పలు సర్టిఫికెట్లు తప్పుడువని, అలాగే హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్గా పదోన్నతులు పొందడానికి అందజేసిన ఇతర సర్టిఫికెట్లు తప్పుడువని .. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు చిన్నయ్యపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా చిన్నయ్య చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డిప్యూటేషన్ పై సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నియమితులై పనిచేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలుతిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 72,174 మంది స్వామివారిని దర్శించుకోగా 35,192 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీలో రూ.2.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
చిత్తూరోళ్లు బస్సు ఎక్కొద్దు
● తమిళనాడు వేలూరు బస్టాండులో చిత్తూరు ప్రయాణికులకు అవమానం ● ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి, చిత్తూరు ప్రయాణికులను ఎక్కించుకోని వైనం చిత్తూరు రూరల్(కాణిపాకం): తమిళనాడులోని వేలూరు బస్టాండులో శుక్రవారం అర్ధరాత్రి చిత్తూరు ప్రయాణికులకు అవమానం చోటు చేసుకుంటోంది. రాత్రి పూట తిరుపతి–వేలూరు బస్సుల్లో చిత్తూరు ప్రయాణికులను వేలూరు బస్టాండులో ఎక్కించలేదు. చాలామంది చైన్నె, బెంగళూరు నుంచి వేలూరు మీదుగా చిత్తూరుకు వస్తుంటారు. ఈ క్రమంలో చిత్తూరుకు వచ్చే ప్రయాణికులను ఆర్టీసీ బస్సు కండక్టర్లు, డ్రైవర్లు అక్కడ ఛీకొడుతున్నారు. వాళ్లను బస్సు ఎక్కినివ్వడం లేదు. బస్సు దిగేయండి అంటూ వారిని నిర్దాక్షిణ్యంగా దింపేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య గొడవ చోటు చేసుకుంటోంది. ఇదే మాదిరిగా తిరుపతి ప్రయాణికులను కూడా ఎక్కనివ్వకుండా ఓ బస్సు కండక్టర్ ఇబ్బందులకు గురిచేశాడు. తిరుమలకు వెళ్లే బస్సులో మాత్రమే ఎక్కనిచ్చి.. మిగిలిన వాళ్లను ఎక్కించుకోలేదు. దీంతో గంటల తరబడి బస్టాండులో నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఏడాది కాలంలో వేలూరు బస్టాండులో చిత్తూరు వాళ్లను ఎక్కించడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని చిత్తూరు వాసులు మండిపడుతున్నారు. ఆదాయం పేరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఇలా అత్యుత్సాహం చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే చిత్తూరు మీదుగా వేలూరుకు ఆర్టీసీ బస్సులను తిరగనివ్వమని స్పష్టం చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని అయ్యోర్లకు వేసవి సెలవుల ప్రారంభం నుంచే బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నా ఇంత వరకు పూర్తికాని దుస్థితి నెలకొంది. విద్యాశాఖ అధికారుల వద్ద ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితా సరిగా లేకపోవడం, ఆన్లైన్ విధానంలో నిర్వహించిన బదిలీల్లో దరఖాస్తుల నమోదు దగ్గర నుంచి బదిలీల ఉత్తర్వుల జారీ అయ్యే వరకు అన్నీ సమస్యలే ఎదురవడం అయ్యోర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు నిత్యం చిత్తూరు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. సమస్యలు విన్నవిస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులు బదిలీల్లో అవకతవకలు, సమస్యలు పరిష్కరించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు ‘రాష్ట్ర విద్యాశాఖ అధికారులను వెళ్లి అడగండి’.. అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నట్టు అయ్యోర్లు ఆరోపిస్తున్నారు. బదిలీలు ఆన్లైన్ విధానంలో జరిగాయి.. మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చేతులు పైకెత్తేస్తున్నట్టు సమాచారం. గట్టిగా అడిగితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో జరుగుతున్న ఈ తతంగంపై క్షేత్ర స్థాయిలో అయ్యోర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేందయ్యా లోకేశం! బదిలీల్లో అవకతవకలు, గందరగోళంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు, నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ సారూ.. ఇవేం బదిలీలయ్యా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఇచ్చిన నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఎస్జీటీల బదిలీలు మాన్యువల్ విధానంలో నిర్వహించాలని కోరుతున్నారు. మాట తప్పి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆదేశిస్తుండడంపై అయ్యోర్లు, నాయకులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 8న డీఈవో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. మరికొంత మంది డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.ముప్పుతిప్పలు పెడుతున్న కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ఉత్తర్వులు ఎస్జీటీలకు హ్యాండిచ్చిన వైనం రాష్ట్ర విద్యాశాఖ అధికారులను వెళ్లి అడగండంటూ నిర్లక్ష్య సమాధానం ఆప్షన్ల బాయ్కాట్కు పిలుపునిచ్చిన ఐక్య ఉపాధ్యాయ సంఘ నాయకులు ఇవిగో సమస్యలు ఉద్యోగోన్నతులు పొందలేక నష్టపోతున్న 610 జీవో బాధిత పీఈటీలకు న్యాయం చేయాలి. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ ఖాళీలతో కలిపి ముందుగా ఇచ్చిన ఆప్షన్న్ మేరకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలి. రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ బదిలీల వెబ్ సైట్లో తప్పనిసరి బదిలీగా చూపడం అన్యాయం. తుది సీనియారిటీ జాబితా విడుదల చేయకుండా, ఉపాధ్యాయుల గ్రీవెన్స్ పరిష్కారం కాకుండానే ఆప్షన్ పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం బాధాకరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్న ఖాళీలను కేటాయించకపోవడంతో తర్వాత సదరు ఖాళీలను పదోన్నతుల్లో చూపడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. కొన్ని ఖాళీలను సీనియర్ ఉపాధ్యాయులు ముందుగా బదిలీ కోసం ఎంపిక చేసుకున్నప్పటికీ వారికి కేటాయించకుండా జూనియర్లకు కేటాయించారు కొన్ని పాఠశాలల్లో ఒక పోస్టు ఖాళీగా ఉండగా సదరు ఖాళీ పోస్టును ఇద్దరు ఉపాధ్యాయులకు కేటాయించడం.. ప్రాధాన్యత కేటగిరి ఉపాధ్యాయులు వారి ప్రాధాన్యతను రద్దు చేసుకుని జనరల్ కేటగిరి కింద ఆప్షన్ ఇవ్వగా సదరు ఎంపిక చేసుకున్న స్థానాలను వారికి కేటాయించకుండా జూనియర్లకు కేటాయించడం..కూటమి ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్లో సీనియారిటీ జాబితాల్లో అవకతవకలు, బదిలీల కసరత్తులో నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు రావడం విమర్శలకు తావిస్తోంది. ఫ్రిపరెన్షియల్ కేటగిరీ నమోదు చేసుకున్న టీచర్లకు దూరంగా పోస్టింగ్లు ఇవ్వడం, కొందరికై తే బదిలీల ఉత్తర్వులు జారీచేయకపోవడం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉపాధ్యాయులకు ముచ్చెమటలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని అయ్యోర్లకు కూటమి ప్రభుత్వం ముచ్చెమటలు పట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బదిలీలు, ఉద్యోగోన్నతుల రూపంలో కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఈ బదిలీల కసరత్తులో చిత్ర విచిత్ర సమస్యలను సృష్టిస్తోంది. వాటిని పరిష్కరించకుండా ఏకపక్షంగా బదిలీల కసరత్తును ముందుకు సాగిస్తోంది. పేరుకే నిబంధనలు టీచర్ల బదిలీల కసరత్తుకు జారీచేసిన జీవోలు, నిబంధనలు పేరుకు మాత్రమేనని టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కసరత్తు మొత్తం విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారంగా, గందరగోళంగా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. బదిలీల్లో నిబంధనల ప్రకారం వారికి నమోదయ్యే పాయింట్ల ప్రకారం వెబ్ ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్నా ప్రయోజనం లేకపోతోందని వాపోతున్నారు. తీవ్రమైన అన్యాయం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని కచ్చితమైన బదిలీలు పొందే టీచర్లకు తీవ్రమైన అన్యాయం జరిగింది. నమోదు చేసుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. గవర్నమెంట్ మేనేజ్మెంట్ పరిధిలోని అన్ని సబ్జెక్టుల టీచర్లకు ఈ సమస్య ఉంది. విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి. – ఉజ్వల, స్కూల్ అసిస్టెంట్ -
నేడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
వెబ్ కౌన్సెలింగ్ వద్దు..మాన్యువల్గా చేపట్టాలని డిమాండ్ – వెల్లడించిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వద్దని..మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీయూఎస్ సంఘ రాష్ట్ర నేత బాలాజీ మాట్లాడుతూ ఇన్నాళ్ల పోరాటంలో తాము ఎదైతే డిమాండ్ చేశామో..ఆ డిమాండ్లకు విరుద్ధంగా ప్రస్తుతం కౌన్సెలింగ్ నడుస్తోందన్నారు. బదిలీలు, పదోన్నతులు, క్లస్టర్ల విభజన తదితర విషయాల్లో పాదర్శకత కనిపించడం లేదన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్తో ఎస్జీటీలు ఇబ్బంది పడాల్సి వస్తోందని, ఈ కౌన్సెలింగ్ను మాన్యవల్ చేపట్టాలని రాష్ట్ర విద్యశాఖ కార్యదర్శి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారు కూడా ఇందుకు అంగీకరించారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ఈ వెబ్ కౌన్సెలింగ్లో ప్రధానంగా సీనియర్లకు అన్యాయం జరుగుతోందని, సాంకేతిక సమస్యలతో కౌన్సెలింగ్ మొత్తం గందరగోళంగా మారిందన్నారు. దీనిపై ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ.రమణ మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి..మాన్యవల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే సమస్యలు ఉండవన్నారు. ఈ వెబ్ఆప్షన్ వల్ల జూనియర్లు..సీనియర్లుగా, సీనియర్లు..జూనియర్లుగా అవుతారని వాపోయారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలను పరిష్కారానికి ఐక్యవేదిక పిలుపు మేరకు ఆదివారం జిల్లా విద్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు గోవిందస్వామి, విజయభాస్కర్, మణికంఠ, నాగరాజు, నరేంద్రరెడ్డి, జయకాంత్, చంద్ర, కిషోర్ పాల్గొన్నారు. -
పోక్సో కేసు నమోదు
బంగారుపాళెం: బాలికను వేధించిన యువకునిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని తుంబపాళెం గ్రామంలో ఓ బాలికను అదే గ్రామానికి చెందిన మోహన్కుమారుడు వడ్డే డేగయ్య(29) కొంత కాలంగా వేధించేవాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు డేగయ్యపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి మృతి పలమనేరు: బక్రీద్ పండుగ వేళ ఓ మైనారిటీ వ్యక్తి ఇంట్లో విషాదం నెలకొంది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు కాలనీకి చెందిన ఇబ్రహీం కుమారుడు దాదాపీర్(34) ఇంట్లో ఉరేసుకుని ఉండడంతో కుటుంబీకులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో ఫోన్లు చోరీ చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం రెండు ముబైల్ ఫోన్లు చోరీకి గురైంది. మెడిసిన్ వార్డులో ఓ మహిళ ముబైల్ ఫోన్ చార్జీంగ్ పెడుతుండగా..ఫోన్ మాయమైంది. అలాగే మరో మహిళ అదే వార్డులో డిశ్చార్జ్ పత్రం కోసం వెళ్లగా ఫోన్ కొట్టేశారు. పరారయ్యే సమయంలో పేషెంట్ అడెంటర్లు గుర్తించి చోరీదారులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ముబైల్ ఫోన్లను వాళ్ల దగ్గర నుంచి లాక్కొని చితకబాదారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ చోరీదారులను పోలీసులకు అప్పగించారు. కరెంటు షాక్తో యువకుడి మృతి తవణంపల్లె: మండలంలోని ఉత్తరబ్రాహ్మణపల్లె దళితవాడలో కరెంటు షాక్కు గురై యువకుడు మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎస్ఐ కథనం.. ఉత్తరబ్రాహ్మణపల్లె దళితవాడకు చెందిన బి.గోవిందయ్య కుమారుడు బి.జి.త్రినాథ్(25) తమ ఇంటి దగ్గర ఉన్న రేకుల షెడ్డులో పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్ను రిపేరు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే అతను మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడి తండ్రి గోవిందయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునికంగా అలిపిరి టోల్ప్లాజా తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామల రావు ఆదేశించారు. శనివారం ఈఓ తన ఛాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్ కసరత్తు చేయాలన్నారు. -
ప్రజలకు బాబు సృష్టించిన సంపద అప్పులే
– మాజీ డెప్యూటీ సీఎం ధ్వజం పాలసముద్రం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రజలకు సృష్టించిన సంపద అప్పులేనని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం గంగమ్మంబపురం గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఓ కళాశాలలో బీటెక్ విద్యార్థి జేమ్స్ అనే దళిత యువకుడిని కులం పేరుతో అదే కళాశాలలో చదివే జూనియర్ విద్యార్థి యశ్వంత్ నాయుడు, రౌడీషీటర్లతో కలసి కొట్టడమే కాకుండా మూత్రం పోసి తాగించారని గుర్తుచేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచేశారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు రెండింతలు ఇస్తామంటూ ఆయన చేసిన హడావుడిని ఎవరూ మరిచిపోయి ఉండరన్నారు. రాష్ట్రంలో 18 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇసుక, మట్టి, మద్యం ఆదాయం ప్రభుత్వం నుంచి రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని వేల మంది రోడ్డున పడ్డారని వాపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కడుపు కోత మిగిల్చారని తెలిపారు. కూటమి ప్రభుతం ఏర్పడిన ఏడాదిలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒకే సారి రెండున్నర లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిదేనని గుర్తుచేశారు. కక్ష సాధింపులు మానుకుని రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు చందురాజు, కార్వేటినగరం మండల కన్వీనర్ శేఖర్రాజు, జెడ్పీటీసీ సభ్యుడు అన్బ్లగన్, సుందరరాజు, షణ్ముగరెడ్డి, కృష్ణయ్య, నరసింహ నాయుడు, గోపాల్, రవిరెడ్డి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, తిరుమళ, గోపి, పయణి, బాబు, తిరుమాల్, కే.పయణి, కేశవన్, మణి, మనోహన్, వాసు, షణ్ముగరెడ్డి, సుబ్రమణ్యరాజు, చిన్నప్పరాజు పాల్గొన్నారు. -
రాత్రి పూట కౌన్సెలింగ్
● 273 మంది ఎస్జీటీ ఉద్యోగోన్నతులు ● రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ● అవస్థల్లో ఉపాధ్యాయులు చిత్తూరు కలెక్టరేట్ : ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ పరిశీలన.. రాత్రి 7 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన టీచర్లు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. 273 మందికి ఉద్యోగోన్నతులు జిల్లాలోని ప్రభుత్వ, మున్సిపల్, జెడ్పీ, నగరపాలక యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 273 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శుక్రవారం రాత్రి మొత్తం కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. ఇష్టానుసారంగా బదిలీ ఉత్తర్వులు స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లకు శుక్రవారం బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచ ర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో మినహాయింపు కల్పించాలి. వారు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ప్రాంతాలకు బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లకు శ్రీకాళహస్తి నుంచి మదనపల్లికి, నాగలాపురం నుంచి పెద్దమండ్యం, శ్రీకాళహస్తి నుంచి చౌడేపల్లి ఇలా దూరప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ విషయం పై బాధితులు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్దకు వచ్చి సంప్రదిస్తుంటే తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. -
అల్లాహ్ అందరికీ అండగా ఉండాలి
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలోని ముస్లింలకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తికి ప్రతీక అయిన ఈ పవిత్రమైన రోజున అల్లాహ్ మీ ప్రార్థనలను అంగీకరించాలన్నారు. కుటుంబ సభ్యులకు శాంతి, సంతోషం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.సుఖసంతోషాలతో జరుపుకోవాలిచిత్తూరు అర్బన్: బక్రీద్ పండుగను ముస్లింలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చుని ఆయన సూచించారు.డీఎస్సీ పరీక్షకు 103 మంది గైర్హాజరుచిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన మొదటి రోజు డీఎస్సీ పరీక్షకు 103 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలోని 8 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు డీఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలను జరిపారు. ఈ పరీక్షలకు 8 పరీక్ష కేంద్రాల్లో 859 మంది అభ్యర్థులకు గాను 756 మంది హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరును పలువురు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించారు.రాహుకాల అభిషేకాలుచౌడేపల్లె: బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయంలో సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.రేపు కాణిపాకంలో సామూహిక అక్షరాభ్యాసంకాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, అక్షరాభ్యాసానికి ఉచిత ప్రవేశామని తెలిపారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.నకిలీ యూట్యూబర్ హల్చల్గంగవరం: పొలంలో చదును చేసుకుంటున్న రైతు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి తాను న్యూస్ యూట్యూబర్ అంటూ బెదిరించాడు. తనకు లంచం ఇవ్వాలంటూ రైతుతో వాగ్వాదానికి దిగాడు. తీరా ఆ రైతు తిరబడడంతో అతను కొంతసేపు రోడ్డుపై హల్చల్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన మండలంలో శుక్రువారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కీలపల్లి పంచాయతీ, బాలేపల్లి గ్రామానికి చెందిన రైతు బద్రినాథ్రెడ్డి గ్రామ సమీపంలోని హైవేలో ఉన్న సర్వే నం.407/1 లోని తన మూడెకరాల భూమిలో ముళ్ల పొదలను జేసీబీతో తొలగించి చదును చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి తాను యూట్యూబర్ అని, తనకు డబ్బు ఇవ్వకపోతే నీపై లేనిపోనివి యూట్యూబ్లో వేస్తానంటూ రైతును బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాదనలు జరిగాయి. అంతలో ఆ రైతు తన మొబైల్ ద్వారా వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. అంతవరకూ రోడ్డుపై హల్చల్ చేసిన నకిలీ యూట్యూబర్ అక్కడి నుంచి ఉడాయించాడు.శ్రీవారి దర్శనానికి 15 గంటలుతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 67,284 మంది స్వామి వారిని దర్శించుకోగా 31,268 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
● కలెక్టర్ చెప్పినా అమల్లోకిరాని గిట్టుబాటు ధర ● ఫ్యాక్టరీలు సిండికేటంటూ రైతుల కన్నీళ్లు ● పల్ప్ నిల్వలతో భారీగా నష్టపోయామంటున్న ఫ్యాక్టరీ యజమానులు ● పట్టనట్టు వ్యవహరిస్తున్న యంత్రాంగం
చిత్తూరు అర్బన్: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు తయారైంది జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. కలెక్టర్ ఓ మాట, ఫ్యాక్టరీ యజమానులు మరో మాట.. రైతుల ఆవేదన ఇంకోలా ఉంది. మామిడికి కనీస ధరను నిర్ణయించి, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారుల సమీక్షలు, రైతులతో సమావేశాలు, ఫ్యాక్టరీల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అరచేతిలో స్వర్గం అన్నట్లు అన్నదాతను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర జిల్లాలో ఏ ఒక్క ఫ్యాక్టరీ నిర్వాహకుడూ ఆమోదించడం లేదు. కలెక్టర్ ఎదుట తలాడించిన పల్ప్ ఫ్యాక్టరీ నిర్వాహకులు.. బయటకొచ్చి తమ బాధలు లక్ష ఉన్నాయని, వాటిని ఎవరు పట్టించుకుంటారని నిలదీస్తున్నారు. కష్టాలు తప్పవా? జిల్లాలో దాదాపు 50 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి (బెంగళూర) రకం 65 శాతం వరకు సాగవుతోంది. ఈ సీజన్కు 4లక్షల టన్నులకు పైగా తోతాపురి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ రైతులకు మాత్రం సగటున కిలోకు రూ.9 కంటే మించి గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం.. మామిడి పల్ప్ తయారీ ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి ప్రభుత్వం చర్చలు జరపకపోవడమే. పక్కనున్న తమిళనాడులో కిలో రూ.4 ఉంటే.. తమకు ఆర్డర్లు ఇచ్చే ఎగుమతి దారులు, తమిళనాడుకు వెళుతున్నారనే తప్ప, ఇక్కడి ధరలకు ఆర్డర్లు రావడం లేదని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. అసలు ఇది వాస్తవమా..? కాదా..? అనే విషయాన్ని కలెక్టర్ నుంచి వ్యవసాయశాఖ అధికారుల వరకు ధృవీకరించి, క్షేత్రస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్కరూ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఈ దఫా కన్నీళ్లే మిగలనున్నాయి. భారీ నిల్వలు కారణమే! ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా జిల్లా నుంచి ఎగుమతి కావాల్సిన పల్ప్ భారీ మొత్తంలో స్తంభించిపోయింది. ఈ ఏడాది మార్చి వరకు 2.75 లక్షల టన్నుల పల్ప్ జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిలిచిపోయింది. పల్ప్ చెడిపోకుండా ఉండే కాలపరిమితి రెండేళ్లు. ఇప్పటికే ఓ ఏడాది అమ్ముడు కాలేదు. సరుకు చెడిపోవడానికి మరో ఏడాది కాలపరిమితే ఉండడంతో కిలో రూ.70 వరకు అమ్మాల్సిన పల్ప్ను, రూ.33కు విక్రయించినట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న పల్ప్ను శ్రీవారి ఆలయంలో, కాణిపాకం, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో విక్రయించినట్లయితే గిట్టుబాటు ధర లభిస్తుందని చెబుతున్నారు. ఏడాదిగా ప్రభుత్వం పట్టిచుకోకుండా, ఇపుడు రైతులకు గిట్టబాటు ధర పేరిట డ్రామాలు ఆడడం వల్ల.. ఒత్తిడితో ఫ్యాక్టరీలను మూసివేసే పరిస్థితి వస్తోందని నిర్వాహకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తోతాపురి టన్ను రూ.12 చిత్తూరు కలెక్టరేట్ : తోతాపురి టన్ను రూ.12 వేలు నిర్ణయించామని, ఆ మేరకు పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరను అమలు చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ గిట్టుబాటు ధర అమలులో తగు పర్యవేక్షణ అవసరమన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడి సరఫరా కాకుండా చెక్పోస్ట్ల వద్ద గట్టి నిఘా పెంచాలన్నారు. పక్వానికి వచ్చిన కాయలనే కోయండి జిల్లాలో మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి ప్రొసెసింగ్ కంపెనీలకు తరలించాలని కలెక్టర్ తెలిపారు. -
సర్వేలు ఇలా..
జిల్లా కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బంది(ఫైల్)కూటమి ప్రభుత్వం గత ఏడాదిగా సర్వేలతో సరిపెట్టేస్తోంది. సవాలక్ష ప్రశ్నలతో ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. ఇదేమని అడిగితే సంక్షేమ పథకాలకంటూ అధికారులు బుకాయించడం రివాజుగా మారుతోంది. సేకరించిన వ్యక్తి సమాచారాన్ని ఏం చేస్తున్నారో.. ఎక్కడ భద్రపరుస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేయగా.. నేటి కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్నీ సక్రమంగా అమలు చేయక సర్వేలతో కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వేలు.. వాటి వివరాలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్. హౌస్హోల్డ్ సర్వే, మనమిత్ర క్యాంపెయిన్, నాన్ రెసిడెంట్, అదర్ డిపార్ట్మెంట్ ఈకేవైసీ సొసైటీ బ్యాంక్ ఓటర్ల పేరుతో సర్వే చేపట్టారు. ఇవే కాకుండా పలు రకాల సర్వేలు చేపట్టి ప్రజలను భయాందోళలను గురిచేశారు. చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా సర్వేలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ సర్వేల వల్ల ప్రజలకేమైనా లాభం చేకూర్చారా..? అంటే అదీ లేకుండా పోయింది. సచివాలయ ఉద్యోగులను పలుమార్లు ఇంటింటికీ తిప్పి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ఇది ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తే సంక్షేమ పథకాల అమలు కోసమని మాయమాటలు చెప్పించారు. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో సచివాలయ సిబ్బంది నెలల తరబడి ఇంటింటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించారు. దానికి గోప్యత ఉందా? వివిధ రకాల సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలకు గోప్యత లేని దుస్థితి. 2019కు ముందు అప్పట్లో వివిధ సర్వేలు చేపట్టి ప్రజల సంక్షేమ పథకాలకు అప్పటి టీడీపీ లింక్ పెట్టిన విషయం విధితమే. ఇదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు వివిధ సర్వేలు చేపట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కూటమి చేపట్టిన సర్వేల్లో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే వాడుతున్నారా? ఇంకేమైనా కుట్రలు చేస్తున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో ఎలాంటి సర్వేలు లేకుండానే.. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి సర్వేలు నిర్వహించకుండానే సంక్షేమ పథకాలను అమలు చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పరిపాలనను అందించింది. అర్హులైన అన్ని కులాల ప్రజలకు ఎలాంటి తారతమ్యం లేకుండా సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే చేర్చింది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నవరత్నాల హామీల మేనిఫెస్టో ప్రకారం అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాదిగా సర్వేల పేరుతో చేస్తున్న కుట్రలపై ప్రజలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అమ్మో..పీ–4 కూటమి ఏడాది పాలనలో సర్వేల మీద సర్వేలు ఎందుకని అడిగితే సంక్షేమ పథకాల కోసమంటూ సమాధానం సర్వేలు చేశారే తప్ప పథకాలు అమలు చేయని వైనం సేకరించిన వ్యక్తిగత సమాచారానికి గోప్యత ఉందా? ఒరిగిందేమీ లేదు సచివాలయాలను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టింది. సచివాలయ సిబ్బందితో చేపట్టిన సర్వేల వల్ల ఒరిగిందేమీ లేదు. వారిని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సర్వేల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రజలకు సంబంధిన సమాచారాన్ని సేకరించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులొస్తాయో ఎవరికీ తెలియడం లేదు. ఎప్పుడూ లేని విధంగా 17 సార్లు సర్వే చేశారు. దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి. – పద్మనాభశెట్టి, సురేంద్రనగరం, కార్వేటినగరం మండలం కూటమి ప్రభుత్వం పీ4 పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడింది. ఇప్పటికే ఎన్నికల ముందు హామీలిచ్చి వంచనకు గురిచేసింది. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలో పబ్లిక్–ప్రయివేట్–పీపుల్ పార్టిసిపేషన్న్ (పీపీపీ) పేరిట సర్వే చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగుపరచడమే సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సర్వేపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువ భాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. -
రైతు‘కు’ భరోసా
● ఒకే ఒక్కడు జిల్లాలో రైతుభరోసా కేంద్రాలు నియోజకవర్గం రైతుభరోసా కేంద్రాల సంఖ్య చిత్తూరు 25 పలమనేరు 88 పూతలపట్టు 95 గంగాధరనెల్లూరు 86 కుప్పం 77 పుంగనూరు 99 నగరి 56 మొత్తం 526చిత్తూరు కలెక్టరేట్ : రైతన్నలకు తోడుగా ఉండేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఆరంభించింది. ఈ కేంద్రాలు గత ఐదేళ్ల పాటూ అన్నదాతకు తోడుగా నిలిచాయి. సాగుదారుల ప్రతి అవసరాన్నీ తీర్చాయి. పల్లెపట్టున విశేష సేవలందించాయి. తెల్లవారగానే మండల కేంద్రానికో.. జిల్లా కేంద్రానికో రైతులు పరుగులు తీయాల్సిన దుస్థితి తొలగిపోయింది. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవస్థలు తప్పిపోయాయి. రవాణా ఖర్చుతో పాటు సమయం ఆదా అయ్యింది. సాగు ఉత్పాదకాల కోసమే కాకుండా సలహాలు, సూచనల కోసం రైతన్నలు ఆర్బీకేల తలుపు తట్టేవారు. అలాంటి ఆర్బీకే కేంద్రాలను నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సేవలను జిల్లా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి పాలనలో రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. -
ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!
నగరి : చిన్ననాటి స్నేహితులందరూ తమ స్నేహితురాలి కుమారుని పెళ్లిలో కలుసుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా స్నేహితురాలు శంకరమ్మ కుమారుడు చంద్రారెడ్డి, మోక్షితకు శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్వీఎస్ఎస్ కల్యాణ మండపంలో వివాహమైంది. గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా, భాకరాపేట పాఠశాలలో 10వ తరగతి వరకు కలసి చదువుకున్న వారంతా ఆ వివాహ వేడుకలకు హాజరయ్యారు. వీరిలో కొందరు ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వారిలో ఒకరైన రోజా సినీ రంగంలోను, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా స్నేహమాధుర్యం మళ్లీ వారిని బడి ఈడు పిల్లలుగా మార్చేసింది. ఆ నాటి స్నేహం ఆనంద గీతమై ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. బాధలు తెలియని నవ్వులు, మౌనం తెలియని మాటలు, కల్మషమెరుగని ప్రేమలు, కష్టం ఎరుగని క్షణాలతో గడిపిన రోజులను తలచుకొని చిన్న పిల్లలైపోయారు. చదువులమ్మ బడిలో చేసిన అల్లరిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మనసులో మరపురాని బాల్యపు పుటలను తిరగవేశారు. అందులో నిండిన ఆనంద క్షణాలను ఆస్వాధించారు. బడిస్నేహం వారిని కొత్త బంగారు లోకానికి తీసుకెళ్లింది. చిన్ననాటి కథలు మధుర జ్ఞాపకాల తలుపులను తెరిచాయి. ఇకపై అందరూ టచ్లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మళ్లీ కలుసుకున్న తీపి క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఫొటోలు తీసుకుని భద్రపరుచుకున్నారు. స్నేహితులకు తమ పిల్లలను, కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనందాలు పంచుకోవడం మరువలేని క్షణాలని, తాను ఎంతో భావేద్వాగానికి గురయ్యానని ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వివాహ వేడుకల్లో చిన్ననాటి స్నేహితుల అపూర్వ కలయిక తలుపు తట్టిన మధురజ్ఞాపకాలు భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి ఆర్కే రోజా -
డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర
● వెల్లడించిన అధినేత నెల్లూరు (టౌన్): ఆదిశంకర గ్రూపు ఆఫ్ ఇన్స్టిట్యూట్కు డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించిందని ఆ విద్యాసంస్థల గ్రూపు చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్లో డీమ్డ్ యూనివర్సిటీ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జోన్లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది కేవలం ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల మాత్రమేనని చెప్పారు. 2001లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల నేడు 8వేల మంది విద్యార్థులతో ఉందన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం వద్ద కొత్తగా ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిందు మధ్వాచార్య, ప్రొఫెసర్లు వేణుమాధవ్, ధనుంజయ, ఏఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిద్రపుచ్చి.. కౌన్సెలింగ్ కొచ్చి!
గది నిండా గజిబిజీ. కౌన్సెలింగ్ ప్రక్రియలో అందరూ బీజీబిజీ. కానీ ఓ చంటి పిల్లాడు అవన్నీ పట్టించుకోలేదు. కౌన్సెలింగ్ గదిలోనే బల్లపై పడుకుని హాయిగా నిద్రపోతూ.. భవిష్యత్లో తనకూ ఇలాంటి రోజులొస్తాయేమోనని కలలు గంటున్నట్టు.. అప్పుడప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ ఘటన ఎక్కడో కాదండోయ్.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయానికి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో. ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్కు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఎస్జీటీ టీచర్లు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో పలువురు చంటి పిల్లల తల్లులు విచ్చేశారు. తల్లులు ఒక వైపు కౌన్సెలింగ్ టెన్షన్తో ఉండగా.. వారికి తోడుగా వచ్చిన బంధువులు పిల్లలను ఆడిస్తూ.. పాడిస్తూ.. నిద్రపుచ్చుతూ కనిపించారు. – చిత్తూరు కలెక్టరేట్ -
● నేడు తిరుపతి ఐఐటీలో ఓపెన్ హౌస్ సెషన్
ఉజ్వల భవితకు ఐఐటీ ఏర్పేడు : జేఈఈ అడ్వాన్సుడ్–2025 అర్హత సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు తిరుపతి ఐఐటీ శనివారం ఓపెన్హౌస్ పేరిట ఆహ్వానించినట్లు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఏర్పేడు సమీపంలో ఉన్న తిరుపతి ఐఐటీలో చేపడుతున్న విద్యా కార్యక్రమాలు, క్యాంపస్లో ఉన్న అధునాతన సౌకర్యాలు, అందుబాటులో ఉన్న కోర్సులు, అండర్ గ్రాడ్యుయేట్ కరికులం, డ్యూయల్ డిగ్రీ వెసులుబాటు, హాస్టల్ సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు, విద్యార్థులు తమ మేథస్సుతో నూతన ఆవిష్కరణ వైపు తీర్చిదిద్దేందుకు ఐఐటీలో ఉన్న అవకాశాలను గురించి ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే కార్యక్రమ అనంతరం విద్యార్థులు, వారి దల్లిదండ్రులతో క్యాంపస్ టూర్ ఏర్పాటు చేసి ఐఐటీలో ఉన్న అధునాతన సౌకర్యాలు, బోధనాభ్యసన విధానాలపై ప్రత్యక్ష అనుభవం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ సెషన్కు విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి స్వయంగా పాల్గొనవచ్చని, ఇక్కడకు వచ్చేందుకు వీలు కాని వారు ఆన్లైన్లోనూ హాజరు కావచ్చన్నారు. తిరుపతి ఐఐటీ అధికారిక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచి ఉన్నట్లు , ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుని ఓపెన్హౌస్ సెషన్లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఆరు టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం యాదమరి: అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల రేషన్ బియ్యం, ఒక బొలెరో వాహనం, టాటా వాహనం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మండల పరిధిలోని ఒరిగపల్లి సమీపంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో దాడులు చేసినట్టు వెల్లడించారు. పలమనేరు, బైరెడ్డిపల్లి, బంగారుపాళెం మండలాలకు చెందిన సద్దాం హుస్సేన్, బలరాంరెడ్డి, దేవేంద్రారెడ్డి, మోతీష్ అనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.78 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డీడీగా విక్రమ్కుమార్రెడ్డి చిత్తూరు కలెక్టరేట్: జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా విక్రమ్కుమార్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లా సోషల్ వెల్పేర్ డీడీగా పనిచేస్తున్న చెన్నయ్యను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. తిరుపతి జిల్లా డీఎస్డబ్ల్యూఓగా పనిచేస్తున్న విక్రమ్కుమార్రెడ్డిని చిత్తూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కన్నమేసి.. కాజేశాడా?
● చిత్తూరులో బంగారు నగల చోరీ ఘటనలో పురోగతి ● సరిహద్దు ప్రాంతానికి చెందిన నిందితుడి పనేని నిర్ధారణ చిత్తూరు అర్బన్: ఎంత పెద్ద భవనమైనా.. దాని టాప్లో కన్నం వేసి చోరీ చేయడంలో దిట్ట. తమిళనాడు–కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి చెందిన నిందితుడే.. చిత్తూరులోని బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడ్డట్లు పోలీసులకు క్లూ లభించింది. బుధవారం అర్ధరాత్రి చిత్తూరులోని ఓ బంగారు దుకాణం, మరో స్టీల్ సామాన్లు విక్రయించే దుకాణంలోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తి .. 180 గ్రాముల బంగారు ఆభరణాలు, అయిదున్నర కిలోల వెండి వస్తువులు, రూ.3 లక్షలకు పైగా నగదు చోరీ చేశాడు. కేసును విచారిస్తున్న పోలీసులు.. చోరికి పాల్పడింది ఒకే ఒక్కడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుడిపై గతంలో పలు స్టేషన్లలో పదికి పైగా చోరీ కేసులు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడిస్తే, అతను పారిపోయే ప్రమాదం ఉండడంతో ఆ వివరాలను దాచి ఉంచారు. ఇప్పటికే నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలు గాలిస్తున్నాయి. -
క్వారీ.. ఆక్రమణల సవారీ!
● మాదిగబండ క్వారీని ఆక్రమించిన టీడీపీ నేత! ● హైకోర్టులో కేసు నడుస్తున్నా బేఖాతర్ ● లీజుదారుని కాదని తానే పనులు చేపడుతున్న వైనం ● విచ్చలవిడిగా సాగుతున్న బ్లాస్టింగ్లు, జల్లి అమ్మకాలు ● పట్టించుకోని మైనింగ్ అధికారులు పలమనేరు: అధికారంలో ఉంటే చాలు చట్టాలు, కోర్టులను పట్టించుకోకుండా అక్రమాలకు దిగడం కూటమి నేతలకు కొత్తమీ కాదు. మొన్నటి దాకా మిన్నకుండి కర్ణాటకలో బీజేపీ నేతగా, ఇక్కడ టీడీపీ నేతగా చెలామని అవుతున్న ఓ నేత కూటమి అధికార బలం, మైనింగ్ అధికారుల అండతో అక్రమంగా క్వారీని స్వాధీనం చేసుకుని యథేచ్ఛగా స్టోన్ క్రషింగ్ పనులు చేపడుతున్నాడు. అసలైన లీజుదారులు హైకోర్టులో రిట్ఫిటిషన్ దాఖలు చేసి కేసు పెండింగ్లో ఉండగా క్వారీని ఆక్రమించుకొని పనులు చేసుకుంటున్న వ్యవహారం పలమనేరు మండలం, కొలమాసనపల్లి పంచాయతీ, మాదిగబండ వద్ద శుక్రవారం వెలుగు చూసింది. అసలైన లీజుదారుడు శరత్కుమార్ కథనం మేరకు.. మాదిగబండ క్వారీలో సర్వే నం.1375/3, 1376/4లో 1.170 హెక్టార్లలో రోడ్మెటల్, బిల్డింగ్ స్టోన్ లీజుదారుగా 2021 నుంచి జీ.మోహన్బాబు క్వారీ లీజుదారుగా ఉండేవారు. దీన్ని ఆయన వీ.కోట మండలం, కుంబార్లపల్లికి చెందిన శరత్కుమార్కు 22–10–2021న బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక మైనింగ్ శాఖలో అప్పటి ఏడీ వేణుగోపాల్ ప్రోసీడింగ్స్ నం.1059/టీక్యూఎల్/ఆర్ఎంబీఎస్/21 గా ఇచ్చారు. శరత్కుమార్ క్వారీకి సంబంధించి హెచ్టీ సర్వీస్ నం.2503 పేరిట తీసుకున్నాడు. ఇలా ఉండగా ఇదే క్వారీ ఇన్ ఎలిజిబుల్ జాబితాలో ఉందంటూ 2024 నవంబర్ 8న అప్పటి పలమనేరు మైనింగ్ ఏడీ లీజుదారుడైన శరత్కుమార్కు ప్రొసీడింగ్స్ నం.1059 మేర షోకాజ్ నోటీసు జారీచేసింది. దీంతో లీజుదారుడు పనులు ఆపేశాడు. అంతకుముందే 2024 జూన్ 6న స్థానిక ట్రాన్స్కో అధికారులకు అప్పటిదాకా ఉన్న బకాయిలను చెల్లించి సర్వీసును డీసీ చేయమని ట్రాన్స్కో ఎస్ఈ(ఆపరేషన్)కు అర్జీ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్థానిక మైనింగ్ అధికారులకు తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే.. ఇదిలావుండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్ణాటక, ఏపీ పాలిటిక్స్లో డబుల్రోల్ పోషిస్తున్న జనార్దన్నాయుడు అనే వ్యక్తి అక్రమంగా తన రౌడీలతో వచ్చి మాదిగబండ క్వారీని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడున్న జల్లిని సైతం కర్ణాటకకు తరలించుకుపోయాడు. దీనిపై లీజుదారుడైన శరత్కుమార్ అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినా పట్టించు కోలేదు. కలెక్టర్ ఆదేశాలతో అప్పటి తహసీల్దార్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఆ క్వారీకి లీజుదారుడు శరత్కుమారేనని, జనార్ధన్ నాయుడు ఆక్రమించుకొంది నిజమేనని నివేదిక పంపారు. కానీ బాధితునికి న్యాయం జరగ లేదు. ఇదే అదునుగా సదరు నేత క్వారీని ఆక్రమించుకుని యథేచ్ఛగా స్టోన్ క్రషింగ్ పనులు చేపట్టాడు. దీంతో బాధితుడు శరత్కుమార్ హైకోర్టులో గత ఏడాది సెప్టెంబర్ 3న రిట్పిటిషన్ ఫైల్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో నడుస్తోంది. అధికార బలంతో మళ్లీ పనులు క్వారీని పరిశీలించి చర్యలు తీసుకుంటాం మాదిగబండ క్వారీలో అక్రమంగా పనులు జరుగుతున్న విషయం నా దృష్టికి రాలేదు. ఈ క్వారీకి సంబంధించిన కేసు హైకోర్టులో ఉందనే విషయం తెలియదు. సంబంధిత క్వారీ ఫైల్ చూసి సోమవారం నేనే స్వయంగా వెళ్లి అక్కడి క్వారీని పరిశీలిస్తా. అనుమతులు లేకుండా, లీజుదారుగాని వ్యక్తులు అక్కడ పనులు చేస్తుంటే చర్యలు తప్పవు. – సత్యనారాయణ, మైనింగ్ ఏడీ, పలమనేరుమొన్నటిదాకా స్తబ్ధంగా ఉన్న ఆక్రమణదారుడు తనకున్న పలుకుబడితో ఆక్రమించుకున్న క్వారీలో పనులు మొదలు పెట్టాడు. ప్రస్తుతం కొందరు రౌడీలను అక్కడ ఉంచుకొని తమిళనాడు కూలీల ద్వారా బ్లాస్టింగ్ చేసి రోజుకు 500 టన్నుల దాకా గ్రావెల్ను విక్రయిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అక్కడ హిటాచీలు, టిప్పర్లు దర్శనమిస్తున్నాయి. లీజుదారుగా ఉన్న శరత్కుమార్కున్న లీజు గడువు ముగియడంతో తాము రెన్యూవల్ కోసం షోకాజ్ నోటీసులను పంపామని ఆయన రెస్పాండ్ కాలేదని, అక్కడ ఇతర వ్యక్తుల ఆక్రమణలు లేవని గతంలో ఉన్న పలమనేరు మైనింగ్ఏడీ బాలసుబ్రమణ్యం హైకోర్టుకు తన కౌంటర్లో తెలిపారు. -
వైఎస్సార్సీపీ పాలనలో మేనిఫెస్టో మొదటి సంవత్సరం అమలు చేసిన పథకాలు
పథకం లబ్ధి ఖర్చు చేసిన మొత్తం పేరు దారులు (రూ.కోట్లలో) వసతిదీవెన 41,313 80.25 విద్యాదీవెన 42,991 91.67 అమ్మఒడి 1,52,743 229.12 విద్యాకానుక 1,95,855 32.67 రైతుభ భరోసా 2,16,594 162.45 ఆరోగ్యశ్రీ 42,908 125.61 ఆరోగ్య ఆసరా 26,389 13.44 రూరల్లో సున్నావడ్డీ 95,994 196.98 పింఛన్కానుక 4,65,895 2065.07 చేయూత రూరల్లో 1,72,616 323.66 ఆసరా రూరల్లో 2,70,197 568.51 తోడు రూరల్లో 33,607 33.61 సున్నావడ్డి అర్బన్లో 12,933 19.90 చేయూత అర్బన్లో 19,144 35.90 కోవిడ్ ఆర్థిక సహాయం 16,79,923 56.33 -
నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు ● చిత్తూరు జిల్లాలో 4, చైన్నెలో 4 కేంద్రాలు ఏర్పాటు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం చైన్నెలో శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జిల్లా విద్యా శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలకు చిత్తూరు జిల్లాలో 4, తమిళనాడు రాష్ట్రం చైన్నెలో 4 మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహి ంచనున్నారు. 22,046 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు 22,046 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తమిళనాడు రాష్ట్రం చైన్నె లో 1484 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో సందేహాల నివృత్తి కోసం 90321 85001 నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ డీఎస్సీ పరీక్షలను ప్ర శాంత వాతావరణంలో నిర్వహించేలా ఏ ర్పా ట్లు చేయాలని వి ద్యాశా ఖ అధికారులనుకు ఆదేశించాం. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలని చెప్పడం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య చికిత్సల నిమిత్తం ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని ఆదేశించాం. డీఎస్సీ అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి టీచర్ కొలువులు సాధించాలి. – సుమిత్ కుమార్ గాంధీ, కలెక్టర్ -
ముక్కంటి సేవలో డీజీపీ కుటుంబ సభ్యులు
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని రాష్ట్ర డీజీపీ హరీష్గుప్తా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదలు అందజేశారు. ముక్కంటి సేవలో గవర్నర్ కార్యదర్శి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి డాక్టర్ హరిజవలాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. -
అలంకారప్రాయంగా కూటమి మేనిఫెస్టో
కూటమి టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది. ఆ మేరకు సూపర్ 6 హామీలు గుప్పించారు. ● యువతకు 20 లక్షల ఉద్యోగాలు/నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఏడాది పూర్తి కావొస్తున్నా జిల్లాలో ఉద్యోగాలు లేవు..భృతి కానరాదు. జిల్లాలో గత 12 నెలలుగా దాదాపు 75810 మంది నిరుద్యోగ యువత రూ.272.91 కోట్లు నష్టపోయారు. ● స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. ఏడాది పూర్తి అయినా ఏ ఒక్క విద్యార్థికీ ఆ నగదు అందలేదు. దీంతో ఈ ఏడాదిలో జిల్లాలో 1,52,879 మంది విద్యార్థులు రూ.229.32 కోట్లను నష్టపోయారు. ● ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఈ పథకం అమలు చేయకపోవడంతో వేల మంది రైతులు అప్పులపాలయ్యారు. దీంతో జిల్లాలోని 2,20,879 మంది రైతులకు రూ.441.76 కోట్లు ఇవ్వకుండా మోసగించారు. ● ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున అందజేస్తామన్నారు. ఈ పథకం అమలు కాకపోవడంతో జిల్లాలోని 9.33 లక్షల మంది మహిళలు నష్టపోయారు. వీరికి అందించాల్సిన రూ.1679.40 కోట్లను ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. ● మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు 2024 ఆగస్టులో అమలు చేయనున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే నగరంలో పెద్ద బ్యానర్లు వేయించి ప్రచారం చేశారు. తీరా ఏడాది పూర్తి అవుతున్నా ఉచిత బస్సు ప్రయాణం అమలు లేదు. -
● 143 హామీల్లో అయిదూ అమలు చేయని కూటమి సర్కారు ● పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందంటూ దాటవేత ● అన్నదాతలు, మహిళలకు వెన్నుపోటు ● వైఎస్సార్సీపీ పాలనలో మేనిఫెస్టోతో పాటు అదనపు హామీలు అమలు
ఎన్నికలకు ముందు అమలు కాని హామీలతో కూటమి మేనిఫెస్టోను సిద్ధం చేసి ఊరూరా ప్రచారం చేసింది. సూపర్– 6 సంక్షేమ పథకాలంటూ ప్రజలను బురిడీ కొట్టించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది పూర్తి అయినా హామీలను అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసగించింది. కూటమి పాలనపై విసిగిపోయిన ప్రజలు టీడీపీ మేనిఫెస్టో ఆ పార్టీకి టిష్యూ పేపరే అంటూ పెదవి విరుస్తున్నారు. ఏడాది పాలనలో కూటమి అమలు చేసిన మేనిఫెస్టో హామీల తీరుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కథనం. చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తమి కాదు. 1994 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం హామీలను తుంగలో తొక్కేశారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కి పెంచి ప్రజలను ఆ నాడే మోసం చేశారు. 1999 ఎన్నికల్లోనూ అదే కథ మళ్లీ అమలు చేశారు. ఇదే తంతు 2024 ఎన్నికల్లోనూ సూపర్ 6 అంటూ మేనిఫెస్టోలో పలు హామీలు పొందుపరిచారు. ఆ హామీలపై చంద్రబాబు, కుమారుడు నారా లోకేష్, దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ ఇక కూటమి బ్యాచ్ మరోవైపు ఊరూరా తిరిగి అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించారు. వారిని నమ్మి గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన ప్రజలను నమ్మించి మోసగించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా మేనిఫెస్టో హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి టీడీపీ మేనిఫెస్టోతో పాటు 143 హామీలు ఇచ్చారు. వాటిల్లో 5 హామీలను కూడా అమలు చేయకుండా ఘోరంగా విఫలమయ్యారు. -
ముగిసిన బాస్కెట్బాల్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో నిర్వహిస్తున్న అండర్– 23 రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల బాలురు, బాలికలు పాల్గొన్నారు. బాలురు విభాగంలో అనంతపురం, చిత్తూరు జిల్లాల మధ్య పోటీలు హోరా హోరీగా సాగాయి. ఇందులో అనంతపురం విన్నర్స్గా, చిత్తూరు రన్నర్స్గా, మూడో స్థానంలో తూర్పుగోదావరి జట్లు గెలుపొందాయి. అదే విధంగా బాలికల విభాగంలో ఫైనల్స్ కృష్ణా, తూర్పుగోదావరి జట్లు తలబడ్డాయి. ఇందులో కృష్ణా విన్నర్స్గా, తూర్పుగోదావరి రన్నర్స్గా, మూడవ స్థానంలో పశ్చిమ గోదావరి జట్లు గెలుపొందాయి. గెలుపొందిన క్రీడాకారుల జట్లకు ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు, తదితరులు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. -
పేదల సొంతింటి కల సాకారం
చిత్తూరు కలెక్టరేట్ : పేదల సొంతింటి కలను గత వైఎస్సార్సీపీ సర్కారు సాకారం చేసింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలోని పేద ప్రజలకు ఉచిత ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు విడుదల చేయడంతో పాటు అదనంగా హౌసింగ్ రుణాలను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను రాయితీపై అందజేసింది. అంతే కాకుండా ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుకను సరఫరా చేసింది. రాయితీ పై మార్కెట్ ధర కన్నా తక్కువకు 140 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్తో సహా ఇతర సామగ్రిని గత వైఎస్సార్సీపీ అందజేసింది. గత ఐదేళ్ల పాటు అమలు చేసిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం దేశ చరిత్రలోనే చారిత్రకంగా నిలిచింది. ఈ పథకాన్ని అమలు చేసిన పూర్వపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కడుగా నిలిచారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు అందజేసిన హౌసింగ్ రుణాల వివరాలు నియోజకవర్గం గృహాలు మంజూరైన హౌసింగ్ రుణాలు పొందిన ఖర్చు చేసిన లబ్ధిదారులు మహిళలు మొత్తం (రూ.లక్షల్లో)నగరి 2,006 1,847 578.77 చిత్తూరు 3,551 3,075 961.50 కుప్పం 4,307 3,515 1132.12 పూతలపట్టు 12,061 5,498 2008.52 పలమనేరు 8,863 7,007 2088.56 జీడీ నెల్లూరు 12,505 7,220 2520.01 పుంగనూరు 14,083 6,736 2615.07 -
సిఫార్సుల దందా!
● కాణిపాకంలో ఇష్టారాజ్యంగా సిఫార్సు దర్శనాలు ● మితిమీరుతున్న దళారుల పెత్తనం ● కొందరు అధికారులు, సిబ్బంది ప్రమేయం ● ఆలయ ఆదాయానికి భారీగా గండి ● సిఫార్సు దర్శనాలు నిలువరించేందుకు చర్యలు కాణిపాక దేవస్థానం కాణిపాకం : వరసిద్ధి క్షేత్రంలో కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. దళారులను పెంచి పోషిస్తున్నారు. వీరి కలయికతో సిఫార్సు దర్శనాలు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. ఆ లయ ఆదాయం క్షీణించడంతో ఆలయ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిఫార్సు దర్శనాల కు బ్రేక్ వేసేందుకు ముందడుగు వేస్తున్నారు. అ యితే సిఫార్సు దర్శనాలు కొనసాగించేందుకు కొందరు అధికారులు, సిబ్బంది కుట్ర పన్నుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం కూడా ఒకటిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి దేశ నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. అలాగే విదేశాల నుంచి వేల మంది వస్తారు. 2022లో ఆలయ జీర్ణోద్ధరణ తర్వాత భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య 10 వేలు దాటుతోంది. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య 30 వేలకుపైగా నమోదవుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో 80 వేలకు చేరుతోంది. ఇది అధికారికంగా నమోదయ్యే భక్తుల సంఖ్య. అనధికారికంగా వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజు వారీగా వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రోజు 3 వేల మంది దాకా.. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో కొందరు అధికారులు, సిబ్బంది సిఫార్సు దర్శనాలను ప్రోత్సాహిస్తున్నారు. అత్యవసరంగా, సులభంగా దర్శనం చేసుకోవాలని వచ్చే భక్తులను టార్గెట్ చేస్తున్నారు. కాపు కాచి వారికి అతిశీఘ్ర, ప్రత్యేక దర్శనం చేయిస్తామని వల వేస్తున్నారు. అలా వల వేసి స్వామి దర్శనాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల నుంచి భారీగా గుంజుతున్నారు. బంధువులు, తెలిసిన వ్యక్తులంటూ నమ్మించి ఈ సిఫార్సు దర్శనాలకు ఆజ్యం పోస్తున్నారు. అలాగే లాడ్జీలు, ట్రావెల్స్ వారితో చేతులు కలిపి సిఫార్సు దర్శనాలను తేలికగా మార్చేశారు. దళారులను పెంచి పోషిస్తున్నారు. వీరి ద్వారా వచ్చే సిఫార్సు దర్శనాలను నేరుగా అంతరాలయం వరకు తీసుకెళ్తున్నారంటే సిఫార్సు దర్శనాలు ఏ పాటివో ఇట్టే బోధ పడుతుంది. ఇందులో కొందరు ఆలయ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, సెక్యూరిటీ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. దళారులతో వచ్చే వారిని వీఐపీ గేటు నుంచి అంతరాలయం వరకు చకచకా తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారు. ఇలా ఒకరిద్దరూ కాదు.. పదుల సంఖ్యలో గ్రూపులుగా తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తున్నారు. రోజువారీగా సిఫార్సులతో దర్శనం చేసే వారు 3 వేల మంది వరకు ఉండవచ్చునని అధికారులు లెక్క గట్టారు. దర్శనానికి రూ.2 వేలు ఆలయ సిబ్బంది మాదిరిగానే దళారులు సైతం తెల్ల చొక్కా..పంచె కట్టుకుని పెద్ద మనుషులుగా తిరుగుతుంటారు. స్వామి దర్శనాలు చేయించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక్క దర్శనానికి రూ.1000 నుంచి రూ.2000 తీసుకుంటున్నారు. అలా వచ్చిన ఆదాయంలో వాటాలు పంచుకుంటున్నారు. ఇవన్నీ ఆలయ ఆవరణలో కళ్ల ఎదుటే కనిపిస్తుంటాయి. నిఘా నేత్రాన్ని కూడా వీళ్లు లెక్కచేయకుండా దర్జాగా వారి దందాను నడిపిస్తున్నారు. వీటిని కట్టడి చేయడానికి గత ప్రభుత్వంలో సిఫార్సులతో వచ్చే భక్తులకు అవగాహన కల్పించడం ప్రారంభించారు. రూ.150 టిక్కెట్లు తీసుకుని సులభతరంగా దర్శనం చేయించడానికి ప్రయత్నించారు. దళారులను నమ్మొదని తెలియజేసేవారు. గత 9 నెలలుగా ఆలయ దర్శనం గందరగోళంగా మారింది. చేతులు మారుతున్న తాళం అంతరాలయ దర్శన తాళాలు ఉండాల్సిన వారి చేతిలో కాకుండా చేతులు మారుతున్నాయి. అక్కడి అధికారులు, సిబ్బంది, ఇతర వ్యక్తులు ఎవరికి వారు తాళాలు తెరుకుని అంతరాలయ దర్శనానికి దర్జాగా తీసుకెళుతున్నారు. అడిగితే వాళ్ల పేరు..వీళ్ల పేరు చెప్పి తాళం ఉన్న సిబ్బందిని బెదిరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు మిన్నుకుండిపోతున్నారు. మనకెందుకొచ్చిన గొడవ అంటూ తాళాలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఆలయ నిబంధనలు గాడి తప్పుతున్నాయి. తేదీ భక్తుల విరాళం టిక్కెట్ల ద్వారా సంఖ్య (రూ.లలో) ఆదాయం (రూ.లక్షల్లో) 19–05–2025 12,964 11,566 6.11 20–05–2025 11,752 67,663 5.81 23–05–2025 17,638 3,96,571 8.42 24–05–2025 21,894 2,14,357 12.64 అందరూ సహకరించాలి సిఫార్సు దర్శనాలను కట్టడి చేసేందుకు చర్య లు తీసుకున్నాం. ఇది వరకే ఆలయ అధికారులు, సిబ్బందికి సమావేశం నిర్వహించి చె ప్పాం. సిఫార్సు దర్శనాలను ప్రోత్సహించవద్దని ఆదేశాలు ఇచ్చాం. కొంత వరకు మార్పు వచ్చింది. పూర్తి స్థాయిలో మార్పు తీసుకొచ్చే లా చర్యలు తీసుకుంటున్నాం. ఆలయ ఆదా యం పెంపునకు కృషి చేస్తున్నాం. అందరూ సహకరించాలి. ఏవైనా సమస్యలుంటే తీసుకొ స్తే కచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – పెంచల కిషోర్, ఈఓ, కాణిపాకం కట్టడికి అధికారుల ప్రయత్నం అధికారులు, సిబ్బంది వ్యవహర శైలి, దళారుల ప్రమేయంపై ఉన్నతాధికారులు కొన్ని రోజులుగా నిఘ పెట్టారు. ఇందులో అసలు విషయాలు బయటపడ్డాయి. ఆలయ అధికారులు, సిబ్బందిని పిలిచి సమావేశం నిర్వహించారు. సిఫార్సు దర్శనాలను ప్రోత్సాహించ వద్దని హెచ్చరించారు. కచ్చితంగా భక్తులు టిక్కెట్లు కొని దైవ దర్శనం చేయించుకునేలా చూడాలని ఆదేశాలిచ్చారు. దీంతో సిఫార్సు దర్శనాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. టిక్కెట్లు తీసుకుని వెళ్లాలని చెబుతున్నారు. పూర్థి స్థాయిలో సిఫార్సు దర్శనాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు సంసిద్ధమవుతున్నారు. దీనిపై కొందరు విష ప్రచారం మొదలు పెట్టారు. సిఫార్సు దర్శనాల బ్రేక్ వేసే ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారు. అయినా ఆలయ అధికారులు మాత్రం ఆలయ ఆదాయానికి డోకా లేకుండా చూడాలని భావిస్తున్నారు. ఇదీ ఏ మేర ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. -
వైఎస్సార్సీపీ పాలనలో పవిత్ర గ్రంథంగా..
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు పేరుతో పలు హామీలను ప్రకటించి మేనిఫెస్టోను ప్రకటించారు. 2019లో ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన మాట ప్రకారం ఆ మేనిఫెస్టోను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతి సచివాలయంలో పొందుపరిచారు. రెండున్నర సంవత్సర కాలంలో కరోనా విలయ తాండవం చేయడంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు. వైఎస్సార్ స్ఫూర్తిగా.... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ మేలు చేకూర్చేలా 2019వ సంవత్స రం నుంచి 2024 వరకు ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం నవరత్నాల సంక్షేమ పథకాలను ఏటా అమలు చేసి చూపించారు. ఏటా వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ ఆసరా, పింఛన్ల పెంపు, అమ్మఒడి, పేదలందరికీ ఇళ్లు, ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలను తప్పకుండా అమలు చేసి నిరూపించారు. -
ఘనంగా ఖరీఫ్ విత్తన దినోత్సవం
తిరుపతి సిటీ: తిరుపతిలోని ఎన్జీరంగా వర్సిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం ఖరీఫ్ విత్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ వి.సుమతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ నూతన విత్తనాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. క్రాప్ విభాగాధిపతి డాక్టర్ కే జాన్ మాట్లాడుతూ వేరుశనగ, అపరాలు, నువ్వులు, చిరుధాన్యాలలో ఖరీఫ్ పంట కాలానికి అనువైన నూతన రకాలు, వాటి గుణగణాలు, విత్తన శుద్ధి, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు పలు రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కీటక శస్త్ర విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భారతి, డాక్టర్ అమరావతి, శ్రీవల్లిదేవి, మహేశ్వరరెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్ఓ భరణి చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి 30 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం నీవా నగరవనంలోని పిల్లల పార్కులో మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని కోరారు. అలాగే, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడారు. అనంతరం వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. లయన్స్క్లబ్ సభ్యులు అందజేసిన సీడ్ బాల్స్ను నగరవనంలో వేశారు. కలెక్టర్ నిధులు రూ.10 లక్షలతో జరగుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఆటవస్తువులు, అడ్వెంచర్ గేమ్స్కు సంబంధించిన వస్తువుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో వీటిని కలెక్టర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి, ఎఫ్ఆర్వోలు బాలకృష్ణరెడ్డి, థామస్, డీఆర్వో ఆనంద్రెడ్డి, కరణ్సింగ్, ఎఫ్ఎస్వో ఉష, ఎఫ్బీఓలు రెడ్డెప్ప, ఢిలీరాణి, సతీష్, గౌస్బాషా, మధు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి అమ్మవారి తెప్పోత్సవాలు చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను శనివారం నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెప్పోత్సవాల వివరాలు శనివారం మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహించనున్నారు. ఆర్జితసేవలు రద్దు తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. -
కాయలొస్తే పిలుస్తాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : వేరుశనగ కాయలు మళ్లీ వస్తాయి..గమ్మనుండండి. ఇక్కడ గోల చేయొద్దు. కాయలు వచ్చింది తక్కువే. టోకెన్లు రాని వాళ్లు వివరాలు ఇచ్చి వెళ్లండి. మళ్లీ కాయలొస్తే..పిలుస్తాం. కాయలు తీసుకున్న వాళ్లు కచ్చితంగా విత్తు వేసి చూపించాలి. లేకుంటే ఒప్పుకోం. తీసుకుని విత్తనం వేయలేదంటే..సుఖీభవ డబ్బుల్లో కోతలు పడుతాయంటూ గుబులు పుట్టించారు. జిల్లాలో గురువారం వేరుశనగ విత్తన పంపిణీ కొనసాగింది. ముందుగానే మండల వ్యవసాయశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అరకొర కాయల విత్తనంపై రైతులకు వివరించారు. టోకెన్లు అందని వారి వివరాలను తీసుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇలా అరకొరగా వచ్చిన విత్తనాలను సర్ధుబాటు చేసేందుకు వ్యవసాయశాఖ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. అయితే కాయలు దక్కని రైతులు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అడిగినన్ని కాయలు ఇవ్వకుంటే విత్తు ఎలా పడుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పంపిణీ కేంద్రాల నుంచి తీవ్ర నిరాశతో వెను దిరుగుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 21,884 మంది రైతులకు గాను 7069 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొక్కలతోనే మనుగడ చిత్తూరు అర్బన్ : మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ద్వారానే మానవ మనుగడ ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చిత్తూరులోని న్యాయస్థానాల సముదాయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జీవితంలో మొక్కలను నాటి, సంరక్షించడం చేయాలన్నారు. అప్పుడే భావి తరాలకు మంచి వాతావరణం సాధ్యమవుతుందన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ.. పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పచ్చదనాన్ని పెంచాలన్నారు. అనంతరం జిల్లా జడ్జితో పాటు న్యాయమూర్తులు కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అధికారులు రాజశేఖర్, కుమార్, న్యాయమూర్తులు పాల్గొన్నారు. అటల్ ల్యాబ్కు అమెరికా బృందం ప్రశంస శాంతిపురం : పాఠశాల స్థాయిలో అటల్ ల్యాబ్ల ద్వారా బోధన సాగుతున్న తీరును అమెరికాకు చెందిన ప్రతినిధి బృందం ప్రశంసించింది. అమెరికాలోని లెహిఘ్, స్విన్బర్న్ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ఎరిక్ ఒబేసేరరే, జాసన్ సార్జెంట్ గురువారం శాంతిపురం మండలంలోని కూతేగౌనిపల్లి వద్ద ఉన్న శ్రీ పరమహంస యోగానంద పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉన్న అటల్ ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల లో సృజనాత్మకతను పెంచడానికి, ప్రాజెక్టు ఆధారిత బోధనతో అంశాలు నేర్చుకోవడానికి అటల్ ల్యాబ్లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కార్యక్రమంలో అమెరికా ప్రతినిధులు థియోడర్ స్పియర్, ఎమ్మానజారియా, లిలియాగనా, నాడ్జిలీ జిమెనెజ్, స్థానిక ప్రిన్సిపల్ ఆజాద్ హుస్సేన్ పాల్గొన్నారు. -
తప్పిన లక్ష్మీ కాసులు.. చివరకు హుండీలోకి..
కాణిపాకం : కాణిపాక శ్రీవరసిద్ధి వినాయస్వామి దర్శనార్థం వచ్చిన ఓ భక్తురాలు బుధవారం ఆలయంలో లక్ష్మీకాసులు(బంగారు) పొగొట్టుకున్నారు. వివరాలు ఇలా..హైదరాబాద్కు చెందిన ఓ భక్తురాలు బుధవారం స్వామి దర్శనార్థం వచ్చారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రెండు లక్ష్మీ కాసులు కింద పడిపోయాయి. ఇది గమనించిన ఓ హోంగార్డు ఆ రెండు కాసులను తీసి ఓ వ్యక్తి చేతికి ఇచ్చాడు. ఆ వ్యక్తి రెండు కాసుల్లో ఒకటి హుండీలో వేసి..మరో కాసును జేబులో వేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన ఆలయ అధికారులు విచారణ మొదలు పెట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ కాసుల చేతుల మార్పిడిని గుర్తించారు. చివరకు బాధితురాలికి ఆ ఒక్క కాసును అందించారు. ఆమె ఆ కాసు కూడా వద్దని...అది కూడా దేవునికే అంకితమని...హుండీలో వేసి సంతృప్తిగా వెళ్లిపోయారు. ఇక ఆ కాసులను ఆ హోంగార్డు..ఎందుకు ఆ వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గిరిజనులకు జీవనోపాధిపలమనేరు : గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా జిల్లాలో ఎంపికై న పలమనేరు మండలంలోని జగమర్ల పంచాయతీ దేవళంపేటలోని గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మూర్తి సూచించారు. బుధవారం జిల్లాలోని పలు శాఖల అధికారులతో దేవళంపేటలో గ్రామసభను నిర్వహించారు. ఇందులో జిల్లా భూగర్భజలశాఖ డీడీ గోవర్ధన్రెడ్డి, మత్స్యశాఖ ఏడీ రవీంద్రారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి గుణశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ.. గిరిజనులకు సమగ్ర , స్థిరమైన అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. ఈ గ్రామంలో మొత్తం 194 కుటుంబాలుండగా ఇందులో 110 కుటుంబాలు గిరిజనులే ఉన్నారన్నారు. గిరిజనులకు విద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధితో పాటు జీవనోపాధులను కల్పిస్తామన్నారు. ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై కలెక్టర్ ప్రతినెలా సమీక్షించనున్నట్లు తెలిపారు. మరోవైపు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ గ్రామస్తులతో మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, విధ్య, ఐసీడీఎస్, పీఆర్, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో పాటు అగ్రికల్చర్ ఏడీ శివకుమార్, ఏవో సంధ్య పాల్గొన్నారు. -
పకడ్బందీగా బదిలీలు
– పర్యవేక్షించిన ఆర్జేడి శామ్యూల్ చిత్తూరు కలెక్టరేట్ : బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆర్జేడీ శామ్యూల్ అన్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తును పర్యవేక్షించారు. అనంతరం విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు. ఆర్జేడీ మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా కసరత్తును నిర్వహిస్తున్నారని చెప్పారు. సమస్యలు ఇవీ బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియలో సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాల్లో పేర్లు లేకపోవడం, అభ్యర్థన బదిలీలను కచ్చితమైన బదిలీలుగా చూపించడం, ఉద్యోగోన్నతి పొందిన గ్రేడ్–2 హెచ్ఎం, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా మార్పు తీసుకున్న వారి ఖాళీలను వెబ్సైట్లో చూపకపోవడం, క్లస్టర్ పాఠశాలలను ఎవరు ఎంపిక చేసుకోవాలనే దానిపై స్పష్టత లేకపోవడం, ప్రాధాన్యత కేటగిరీలో రెండు పోస్టులుంటే ఒకటి తప్పనిసరి అనేది అన్ని మండలాల్లో చూపకపోవడం వంటి అవకతవకలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలపై వందకు పైగా టీచర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. బదిలీల కసరత్తులో చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు పెంచాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తప్పిదాలు సరిదిద్దాలి ఈనెల 3వ తేదీన విడుదలైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలో దొర్లిన పొరపాట్లను సవరించుకునేందుకు పెద్ద సంఖ్యలో టీచర్లు క్యూ కట్టారని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆర్జేడీ దృష్టికి టీచర్ల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వెబ్ ఆప్షన్లకు తక్కువ గడువు ఉన్న విషయాన్ని వివరించారు. డీఎస్సీ 2008 టీచర్లకు కామన్ జాయినింగ్ తేదీ ఉండే విధంగా చూడాలన్నారు. ప్రిఫరెన్షియల్ క్యాటగిరీల వారికి ఖాళీల కేటాయింపులో నిబంధనలు పాటించాలన్నారు. వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు రేపటి వరకు గడువు పొడిగించాలన్నారు. క్లస్టర్ రిసోర్స్ టీచర్ పోస్టుల విధి విధానాలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి, నాయకులు చంద్రన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
10న జాబ్మేళా
తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వరంలో ఈనెల 10న నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న జాబ్మేళా పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ మాట్లాడుతూ ఈ నెల 10న ఉదయం 8 గంటల నుంచి నాయుడుపేటలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఆ మేరకు ముందుగా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 919985056929, 9154449677, 9988853335 సంప్రదించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,631 మంది స్వామివారిని దర్శించుకోగా, 31,247 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.29 కోట్లు సమర్పించారు. టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటింటి చెత్త సేకరణ 100 శాతం చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సచివాలయ పరిధిలో చెత్త సేకరణ పై శానిటరీ ఇన్స్పెక్టర్ల సంతకంతో నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రదేశాల గోడలపై పోస్టర్లను అతికించకూడదని చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ఏరియా ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించాలన్నారు. వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు గురైన వీధి దీపాలను సరిచేయాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, తాగునీటిని క్లోరినేషన్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు కమిషనర్లు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ పై ప్రచారం జిల్లాలోని ప్రజలందరికీ పీఎం సూర్యఘర్ యోజన పథకం ఉపయోగాలను తెలిసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం పై మరింత అవగాహన కల్పించాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సంఘాల్లో మహిళలకు సీ్త్ర నిధి, ఉన్నతి, బ్యాంక్లతో రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రాన్స్ కో ఎస్ఈ ఇస్మాయిల్, నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ గయాజ్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు. -
విత్తన పంపిణీ ప్రారంభం
● తొలిరోజు 5220 రైతులు రిజిస్ట్రేషన్ ● బ్యాగుకు కొన్నిచోట్ల రూ.1,700 వసూలు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమైంది. అరకొర విత్తనాల రాకతో వ్యవసాయశాఖ అధికారులు ఎలా పంపిణీ చేయాలో తెలియక తికమకపడుతున్నారు. కూటమి నేతల ముందస్తు ఆర్డర్లతో రైతులకు ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నేను లీడర్....నేను చెప్పిన వాళ్లకే కాయలు ఇవ్వాలని ప్రతి పంచాయతీ నుంచి పది నుంచి ఇరవై మంది అధికారులను వేధిస్తున్నారు. పొలం లేకున్నా విత్తనం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో మండల అధికారులు, సిబ్బంది వణికిపోతున్నారు. తొలి రోజు ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు ఎమ్మెల్యేల నుంచి ముహూర్తం ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు పడ్డాయి. ఎమ్మెల్యేల ప్రారంభోత్సవం తర్వాతే విత్తన కాయల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని చాలా చోట్ల మెలిక పెట్టారు. ఇక కొన్ని మండలాల్లో ఆ అరకొర కాయలు వద్దని, ఇస్తే గొడవలు వస్తాయని నిలుపుదల చేశారు. దీంతో విత్తన పంపిణీ ప్రక్రియ గురువారం కూడా జోరుగా సాగేటట్లు కనిపించడం లేదు. కొన్ని చోట్ల మాత్రం లోలోపల రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వేరుశనగ విత్తన బ్యాగు (కే–6రకం..30 కేజీలు) రూ.1674 కాగా..కొన్ని చోట్ల రూ.1700 వసూలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. చిల్లర పేరుతో ఇలా దోపిడీ చేయడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. కాగా 1881 క్వింటాళ్లకు...5220 మంది రైతులు రిజిస్ట్రేషన్ అయ్యారని అధికారులు చెబుతున్నారు. -
రేషన్ దందా
పలమనేరు : కూటమి ప్రభుత్వ రాకతో ఇప్పటికే గంజాయి, గ్రానైట్, ఇసుక, మట్టి అక్రమ రవాణా జోరందుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇప్పుడు ఊపందుకుంది. చిత్తూరు సమీపంలోని పాలసముద్రం నుంచి నిత్యం కర్ణాటకకు నాలుగు వాహనాల్లో నలబై టన్నుల బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాలు పట్టపగలే పాలసముద్రం నుంచి చిత్తూరు, పలమనేరు మీదుగా బంగారుపేటకు ఎలాంటి తనిఖీ అధికారుల భయం లేకుండా యథేచ్ఛగా తరలిపోతున్నాయి. గతంలో బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన అక్రమార్కులు కూటమి నేతల అండతో మళ్లీ బియ్యం రవాణాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పాలసముద్రానికి చెందిన ఓ కీలక వ్యక్తి ఆ ప్రాంతంలోని ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి రహస్య గోదాంలో నిల్వ ఉంచుతున్నట్లు తెలిసింది. కాణిపాకం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రహస్యంగా బియ్యం స్టాకు పాయింట్ పెట్టినట్లు సమాచారం. వీరి నుంచి గంగవరం మండలం నాలుగు రోడ్లు, పలమనేరు పట్టణానికి చెందిన ముగ్గురి వాహనాల్లో నిత్యం పాలసముద్రం నుంచి సరుకును కర్ణాటకకు తరలిస్తున్నారు. టన్నుకు రూ.4 వేలు.. నెలకు రూ.42 లక్షల ఆదాయం పాలసముద్రంలో స్మగర్లు టన్ను బియ్యం రూ.21 వేలకు కొంటున్నారు. ఇదే బియ్యం కర్ణాటకలోని బంగారుపేటకు చేరితే అక్కడ టన్ను రూ.27 వేలకు అమ్ముతున్నారు. ఇందులో రూ.2 వేలు రవాణా ఖర్చులు పోనూ నికరంగా టన్నుకు రూ.4 వేలు మిగులుతుంది. రోజుకు నాలుగు వాహనాల్లో 40 టన్నులైతే రోజుకు రూ.1.60 లక్షల లాభం దక్కుతోంది. ఈ లెక్కన నెలకు రూ.42 లక్షల ఆదాయం వస్తుండడంతో అక్రమార్కులకు ఇదో మంచి వ్యాపారంలా మారింది. భారీ లాభాలు వస్తుండడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ పార్టీ, ఆ మార్గంలోని పోలీసులతో పాటు సంబంధం ఉన్న పలు శాఖలకు నెల నెలా మామూళ్లు అందుతుండడంతోనే వీరి వ్యాపారం సజావుగా సాగుతోందని విమర్శలున్నాయి. ఏదేమైనా దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎటూచూసినా బియ్యం బస్తాలే.... జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు మండలాల్లో పలుచోట్ల తమిళ బియ్యంతో పాటు, స్థానిక రేషన్ బియ్యాన్ని డీలర్ల ద్వారా స్మగర్లు కొంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం సైతం నగరి మండలంలోని కేవీఆర్పేట ఎంజీఆర్నగర్ ఈశ్వరుని ఆలయం సమీపంలో చౌక దుకాణం డీలర్లు ఐదు టన్నుల దాకా బియ్యాన్ని కర్ణాటకకు తరలించేందుకు సిద్ధంగా పెట్టినట్లు స్థానికులు గుర్తించారు. దీనిపై అదే ప్రాంతానికి చెందిన స్థానికులు డీఎస్వోకు సైతం ఫిర్యాదు చేసినా స్పందనలేదని తెలిసింది. ఇదే విధంగా పాలసముద్రం, కార్వేటినగరంతో పాటు తమిళనాడుకు ఆనుకొని ఉన్న పలు మండలాల్లో భారీగా బియ్యం అక్రమ నిల్వలున్నట్లు తెలుస్తోంది. ఊపందుకున్న బియ్యం అక్రమ రవాణా! పాలసముద్రం నుంచి బంగార్ పేటకు తరలింపు టన్ను రూ.27 వేలకు విక్రయాలు రూ.లక్షలు ఆర్జిస్తున్న అక్రమార్కులు స్మగ్లింగ్ కోసమే నాలుగు వాహనాలు నాలుగు వాహనాలు కేవలం బియ్యం అక్రమ రవాణా కోసమే వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాల వివరాలను ఆయా మార్గాల్లోని కొందరికి స్మగర్లు మందుగానే ఇచ్చి ఈ వాహనాలను ఆపకుండా ఉండేలా మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. -
వైద్యులు బాధ్యతగా విధులు నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పీహెచ్సీలలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణలో మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశాలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఆర్సీహెచ్ కార్యక్రమంలో గర్భిణుల నమోదు, వారికి అందించాల్సిన సేవలు కచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదన్నారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ వివరాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వారికి నిర్ధేశించిన సమయంలో వ్యాక్సినేషన్ అందించవచ్చన్నారు. ఈ విషయంలో ఏఎన్ఎంలు అలసత్వం వహించకూడదని తెలిపారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో డీఎంఅండ్హెచ్వో సుధారాణి, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో వెంకటప్రసాద్, డీఐవో హనుమంతరావు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ఎస్ పనులపై అసంతృప్తి
● ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పనులపై నిర్లక్ష్యం ఎందుకని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్మాణ, ఎంఆర్టీ విభాగాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలని ఉద్దేశంతో ఆర్డీఎస్ఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో పనితీరు మందగమనంలో ఉందన్నారు. అసలే పని జరుగుతుందా..? అనే సందేహాం వస్తోందన్నారు. ఇకనైన పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటే సకాలంలో వాటిని బాగు చేసి పంపాలని ఆదేశించారు. ఎస్పీఎంల చుట్టూ తిప్పించుకుంటూ రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పాడైన ట్రాన్స్ఫార్మర్ రవాణా ఉచితంగా చేయాలన్నారు. జిల్లాకు 15వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్స్ ఇవ్వాలని లక్ష్యంగా ఇచ్చారన్నారు. ప్రతి ఏఈ సెక్షన్ పరిధిలో నెలకు 300 యూనిట్లు వాడుతున్న 10 మంది వినియోగదారులను కలవాలన్నారు. బీసీలకు అదనంగా రూ.20 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ జగదీష్, నిర్మాణ, ఎంఆర్టీ విభాగాల ఈఈలు అమర్బాబు, బాబు, ఏఓ ప్రసన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
● మాజీ మంత్రి ఆర్కేరోజా నగరి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, నియోజకవర్గ, మున్సిపల్, పార్టీ మండల కమిటీల కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కోఆప్సన్ సభ్యులు, నాయకులతో సమావేశమైన ఆమె బుధవారం చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చి ఏడాది పూర్తయినా ఏదీ పాలక ప్రభుత్వం చెయ్యలేకపోయిందన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. గతంలో మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథంలా ఉంటే నేడు అది చిత్తు కాగితంలా మారిందన్నారు. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ, అనుబంధ కమిటీల సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
నేడు ఊరూరా వెన్నుపోటు దినం
చిత్తూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలను అబద్దపు హామీలతో మోసగించి, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంను నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసనలు చేపడుతున్నారు.నిరసనలు తెలిపే ప్రాంతాలు ఇవే..● చిత్తూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. వేలూరు రోడ్డుపై పాదయాత్రగా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తారు.● పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఉదయం 9 గంటలకు పట్టణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహిస్తారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందచేస్తారు.● నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి.. అక్కడి నుంచి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం ఇచ్చి, ఓంశక్తి ఆలయ కూడలి మీదుగా రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నారు.● గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో అయిదు మండలాల్లోని నాయకులు ఉదయం 9 గంటలకు కొత్తపల్లెమిట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి గంగాధర నెల్లూరులో అధికారులకు వినతిపత్రం ఇస్తారు.● పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యంలో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందజేస్తారు.● పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పట్టణ నడిబొడ్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం ఇస్తారు.● కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరుతారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని వినతిపత్రం ఇస్తారు.‘ఖాకీ’లపై ప్రభుత్వం ఒత్తిడివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినంకు ఆ పార్టీ నాయకులు, తటస్తులు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు అనధికారిక ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమల్లో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రధాన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, ర్యాలీలు చేయొద్దని పోలీసులు హుకు జారీ చేస్తున్నారు. అయినా సరే తమ పార్టీ నాయకుడు ఇచ్చిన పిలుపుతో నిరసనలో పాల్గొనే తీరుతామని కార్యకర్తలు పోలీసులకు తెగేసి చెబుతున్నారు. -
ప్రైవేటు ఆస్తి.. ప్రభుత్వ గుర్తింపు
ఒకే ఒక్కడుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న కోట్ల విలువైన ఆస్తికి వైఎస్సార్సీపీ సర్కారు అధికారిక ముద్ర వేసింది. గత ఐదేళ్ల పాటు జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం నిర్వహించి ఆస్తి యాజమాన్య ధ్రువపత్రాలను అందజేశారు. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టింది. గతంలో ఎవరైనా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషులు మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండేది కాదు. అన్నదమ్ములు ఆ ఆస్తిని పంచుకోవాలన్నా ఇబ్బంది ఉండేది. అటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న గత వైఎస్సార్సీపీ సర్కారు గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ క్యూఆర్ కోడ్ తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేసింది.జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారీగా అమలు చేసిన పథకం వివరాలు డివిజన్ మండలాలు లబ్ధి చేకూర్చిన పేరు భూమి వివరాలు (ఎకరాల్లో) చిత్తూరు 304 4,42,219.17 నగరి 107 1,41,125.65 పలమనేరు 201 5,01,855.98 కుప్పం 210 2,16,996.82 మొత్తం 822 13,02,224.62 -
విత్తనంపై పెత్తనం
వేరుశనగ విత్తన పంపిణీపై స్థానిక ప్రజాప్రతినిధులు పెత్తనం చేస్తుండడంపై సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. టీబీపై అప్రమత్తం టీబీపై అప్రమత్తంగా ఉండి , ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కోరారు.బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025ఎన్నికల ముందు టీడీపీ సూపర్సిక్స్ హామీలంటూ ప్రజలను బురిడీ కొట్టించింది. కూటమి ప్రభుతం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. సూపర్ సిక్స్లో ఏ ఒక్కటీ అమలు చేసి ఉంటే ఒట్టు..హామీల ముసుగులో గద్దెనెక్కిన చంద్రబాబు సూపర్–6 హామీలు నెరవేర్చాలంటే భయమేస్తోందంటూ ప్లేటు ఫిరాయించేశారు. దీంతో ప్రజలు మోసపోయాం బాబూ అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అమ్మ ఒడి నిధుల పంపిణీ కార్యక్రమంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)పంటల సాగుకు పెట్టుబడి ఇవ్వండి పంట సాగుకు పడే తి ప్పలు అన్ని ఇన్నీ కా వు. తొలకరి వర్షాలు పడుతున్నాయి. అప్పటి సీఎం జగన్ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా రై తు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అ న్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పైసా అందలేదు. – దాస్, చిన్నలూర్, నగరి మండలం ఇంటి స్థలాలు ఏవీ.. ఓట్ల కోసం ఎన్నికల సమయంలో అమలు కు నోచుకోని హామీలు ఇచ్చి ఏమి లాభం. ప్ర జలను మభ్యపెట్టేందు కు ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు సరికా దు. మూడు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామంటూ పేద ప్రజలను నిలువునా మోసం చేశారు. – శోభన్ బాబు, కత్తెరపల్లి, కార్వేటినగరం మండలం ఉచిత బస్సు ఇంకెప్పుడిస్తారు.. అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఎన్నికల ప్రచారంలో చెప్పా రు. ఇప్పుడేమో ఆ ఉచి త ప్రయాణం ఎప్పుడో చెప్పే నాథుడే లేరు. ఇలాంటి అమలు కాని హామీలు ఎందుకు ఇవ్వాలి. మోసం చేసే విధంగా హామీలు ఇవ్వడం సరైంది కాదు. – దీప, పాలసముద్రం మండలం చిత్తూరు కలెక్టరేట్ : హామీల ముసుగులో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చడంలో విఫలమైంది. సూపర్–6 హామీలు నెరవేర్చాలంటే ఖజానాలో డబ్బులు లేవంటూ చంద్రబాబు ప్లేట్ ిఫిరాయించేసరికి ప్రజ లు అవాక్కయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ బుధవారం వెన్నుపోటు దినం గా ప్రకటించింది. వెన్నుపోటు దినం కార్యక్రమంలో కూటమి పాలనలో మోసానికి గురైన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు వచ్చాయంటే గాల్లో మేడలు.. ఎన్నికలు వచ్చాయంటే చాలు చంద్రబాబు గాల్లో అద్దాల మేడలు కట్టేస్తారు. తీరా అధికారంలోకి వచ్చాక ఓట్లేసి గెలిపించిన ప్రజలను పక్కన పెట్టి తన నిజ స్వరూపం చూపిస్తారు. ఈసారి అధికారంలోకి వచ్చిన కూటమి టీడీపీ గతం లానే ప్రజలను నయవంచనకు గురి చేసింది. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ అంటూ ఊరూరా తిరిగి ఉదరగొట్టారు. ఆ పార్టీ నాయకులను ఇంటింటికీ పంపించి కరపత్రాలను పంచారు. అంతే కూటమి టీడీపీ గద్దెనెక్కాక ఆ పార్టీ మేనిఫెస్టో మాయమై పోయింది. గొప్పలు చెప్పారు.. గొయ్యితీసి పాతి పెట్టారు.. ● జిల్లాలో గత ఏడాది మే నెలలో పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు కావాలంటే టీడీపీకే ఓటెయ్యాలి. కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి చిత్తూరు అభివృద్ధికి కృషి చేస్తా. టీడీపీ అధికారంలోకి వస్తే వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని స్వయాన ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీలు ఇచ్చి గొప్పలు చెప్పారు. హామీలు ఇచ్చి ఇప్పటికి ఏడాది అవుతున్నా ఆ హామీలు ఏమయ్యాయో ఆయనకే తెలియాలి. ● పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లెల్లో పర్యటించారు. ఆ పర్యటనలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా సరే వారందరికీ తల్లికి వందనం పథకం నగదు అందజేస్తాం. నమ్మి ఓట్లు వేయండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఏడాది పూర్తి అవుతున్నా తల్లికి వందనం పథకం ఎక్కడ అని ఆ నియోజకవర్గ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ● గత ఏడాది ఏప్రిల్ 26 వ తేదీన గుడిపాల మండలం ఎన్నికల ప్రచారంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఆ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి రూ.20 వేలు సాయం అందజేస్తామన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు కాక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూటమి రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. ● గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో సూపర్ 6 పథకాల పై ఎమ్మెల్యే థామస్ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తారంటూ గొప్పలు చెప్పారు. ఏడాది పూర్తి అవుతుండడంతో ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు ఏమయ్యాయి సారూ అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ● గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ఉదరగొట్టారు. ఇప్పటికీ ఏడాది పూర్తి అవుతున్నా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఊసే లేకపోవడంతో ఆ నియోజకవర్గంలో మహిళలు పెదవి విరుస్తున్నారు. ● నగరి నియోజకవర్గం నిండ్ర మండలం లో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొని నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అప్పటి వరకు ఉన్నత చదువు చదివిన ప్రతి యువకుడికి ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏడాది పూర్తవుతున్నా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి జాడే లేదు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ కూటమి ఏడాది పాలనలో హామీలు గాలికి ప్రజాసంక్షేమం గాలికొదిలేసిన సర్కారు అవినీతి, మోసం, కుట్రతో కూటమి పాలన నేడు వెన్నుపోటు దినంకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ -
వెన్నుపోటు దినంకు వెళ్లొద్దని బెదిరింపులు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో బుధవారం వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వెన్నుపోటు దినంకు వెళ్లొద్దని టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో ప్రజలను కార్యక్రమానికి వెళితే పరిణామాలు వేరేలా ఉంటుందని భయబాంత్రులకు గురిచేశారు. ప్రధానంగా మహిళలు, యువకులను టార్గెట్ చేశారు. అలాగే గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల్లో కూడా బెదిరింపు దోరణిని అవలంబించారు. వెన్నుపోటు దినానికి వెళ్లే వారికి పథకాల్లో కోతలు పెడుతామని, రేషన్, పింఛన్ ఆపేస్తామని భయపెట్టారు. నేడు, రేపు బాస్కెట్ బాల్ పోటీలు చిత్తూరు కార్పొరేషన్ : బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి అండర్–23 చాంపియన్షిప్ పోటీలు బుధ, గురువారాల్లో నిర్వహించనున్నట్లు ఏపీ బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు తెలిపారు. నగరంలో మంగళవారం వివరాలను విలేకరులకు తెలియజేశారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఈ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈసారి చిత్తూరులో నిర్వహిస్తున్నారన్నారు. టోర్నీ విజేతలకు చిత్తూరులోనే శిబిరం ఏర్పాటు చేసి జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం రాష్ట్ర జట్లు కేరళ రాష్ట్రం కొచ్చిలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి పాల్గొన్నారు. రేపు మొక్కలు నాటే కార్యక్రమం చిత్తూరు కార్పొరేషన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ ప్రాంతంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా కలెక్టర్ సుమిత్కుమార్, డీఎఫ్ ఓ భరణి, ప్రజాప్రతినిధులు వస్తారని ఎఫ్ఆర్వోలు బాలకృష్ణారెడ్డి, థామస్ తెలిపారు. పెనుమూరు క్రాస్ వద్ద గల నీవానగర వనంలో 9.30 గంటలకు మొక్కలు నాటుతారన్నా రు. పలు అంశాల పై విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేస్తారని తెలిపారు. అనంతరం నగరంలోని పిల్లల పార్కు లో కలెక్టర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆట వస్తువులను ప్రారంభించి, మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఐజీ పేరిట నకిలీ మెయిల్ చిత్తూరు అర్బన్ : రాష్ట్ర హోంగార్డు ఐజీ పేరిట నకిలీ మెయిల్ పంపిన ముబారక్ అనే వ్యక్తిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన ముబారక్ అనే వ్యక్తి తాను హోంగార్డుగా పని చేస్తున్నట్లు ఓ నకిలీ సర్టిఫికెట్ను తయారు చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్నట్లు.. అతనికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి ఐజీ పేరిట ఓ మెయిల్ వచ్చింది. దీన్ని తనిఖీ చేసిన అధికారులు ఐజీ పేరిట వచ్చిన మెయిల్ నకిలీదని నిర్ధారించుకున్నారు. చిత్తూ రు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ దేవప్రసాద్ ఫిర్యా దు మేరకు ముబారక్ తదితరులపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట రమణ తెలిపారు. మూడు రోజుల పాటు హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరింపేట నగరపాలక పాఠశాలలో ప్రారంభించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీసీ మాట్లాడుతూ.. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నామన్నారు. విద్యార్థుల స్వయం మూల్యాంకన ప్రక్రియ, టీచర్ల హ్యాండ్బుక్స్, లీవ్ యాప్ అమలు విధానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎస్సీఈఆర్టీ అబ్జర్వర్ నరసింహులు, డైట్ అబ్జర్వర్ మోహన్రెడ్డి, ఎంఈవోలు, కోర్స్ ఇంచార్జి, డీసీఈబీ సెక్రటరీ హేమాద్రి, హెచ్ఎంలు, ఎస్ఆర్పీ, డీఆర్పీలు పాల్గొన్నారు. -
అవినీతి..అక్రమాలే ప్రాధాన్యం
● కూటమి పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మేలు చేయాల్సింది పోయి అధికారంలోకి రాగానే రాజకీయ కక్షకు తెరలేపారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగించారు. ● సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఈ కూటమి పాలనలో టీడీపీ నేతల స్మగ్లింగ్కు అడ్డాగా మారింది. అక్కడ టీడీపీ శ్రేణులు చేస్తున్న దందాలకు అడ్డూ అదుపే లేకుండా పోతోంది. గ్రానైట్, కృత్రిమ ఇసుక, తమిళ బియ్యం, జల్లికట్టు పందేలు, పలు అక్రమ వ్యాపారాలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ● గత ప్రభుత్వంలో పలమనేరు వద్ద మొత్తం 2,088 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కారిడార్ను నిలిపేశారు. ● ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేసి జిల్లాలో దాదాపు 500 మంది చిరుద్యోగులు పొట్టకొట్టింది. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ వద్ద రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసేందుకు కూటమి నేతలు కన్ను వేసి కబ్జాకు యత్నించారు. అదే విధంగా కొత్తబస్టాండ్ వద్ద ఉన్న రూ.40 కోట్ల విలువ చేసే మత్స్యకార ప్రభుత్వ భవనానికి చెందిన స్థలాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ● అన్న క్యాంటీన్ భవనాల రిపేర్ల పేరుతో తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి ప్రభుత్వ నిధులను వేసుకున్నారు. రూ.3 లక్షలయ్యే రిపేర్లకు రూ.13 లక్షలు నుంచి రూ.20 లక్షలు చూపించి అక్రమంగా ప్రభుత్వ నిధులు కొట్టేశారు. ఈ అన్నా క్యాంటిన్ల అక్రమ తంతు జిల్లాలోని 16 క్యాంటిన్లలో సాగించారు. -
‘వెన్నుపోటు’ ప్లకార్డుల ఆవిష్కరణ
ప్లకార్డును ఆవిష్కరిస్తున్న భూమన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ బుధవారం చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ప్లకార్డులను వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలో నివాసంలో ఆయన మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు. చిత్తూరు మార్కెట్లో మామిడి కాయలు మామిడి మార్కెట్కు కళ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్లో మంగళవారం సందడి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు మార్కెట్కు కాయలు క్యూ కట్టాయి. సుమారు 35 టన్నుల వరకు కాయలు వచ్చాయని ట్రేడర్ల అంచనా. అధికంగా బేనీషా, తోతాపురి (టేబుల్రకం) భారీగా వచ్చాయి. అలాగే చందూర, ఇమామ్ పసంద్, అల్పోన్సో, కాలేపాడు వంటి రకాలు అధికంగా చేరాయి. అయితే ధరలు మాత్రం రైతులను నిరాశ పరిచాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మామిడిపై ఆశలు వదులుకున్నారు. ఇక ట్రేడర్లు కొనుగోలు చేసిన మామిడి అన్ని కూడా ఫ్యాక్టరీలకు కాకుండా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అమ్ముడుబోయాయి. -
విత్తనంపై పెత్తనం
● టోకెన్లు ఇవ్వాలని కూటమి నేతల హుకుం జారీ ● జిల్లాకు అరకొరగా వేరుశనగ విత్తన కాయలు ● నేటి నుంచి రిజిస్ట్రేషన్లు, పంపిణీ ప్రారంభం ● ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం ● నిజమైన రైతులకు మొండిచేయి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. విత్తన పంపిణీలో కూటమి పెత్తనం అలుముకుంది. ప్రారంభానికి ముందే టోకెన్ల గోల మొదలైంది. కూటమి నేతలు టోకెన్లు తమ చేతిలో పెట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నిజమైన రైతులకు వేరుశనగ కాయలు అందని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు కొన్ని చోట్ల కూటమి నేతలు, ఎమ్మెల్యే అరకొర విత్తనాలు మాకొద్దని తిరస్కరించారని అధికార వర్గాలు కోడైకూస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో వర్షాధార పంటగా వేరుశనగ పంటను సాగు చేస్తారు. ఈసారి సాధారణ విస్తీర్ణం 35,228 హెక్టార్లు ఉండగా...90 వేల మంది రైతులు వేరుశనగ సాగు చేస్తారని అధికారుల అంచనా. ఇందుకు గాను ప్రభుత్వం జిల్లాకు 25,643 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కేటాయించింది. ఏటా రైతులకు అవసరమైనంత మేర..అంటే 40 వేల క్వింటాళ్ల మేర సరఫరా అయ్యేది. ఈ సారి చాలీచాలినంత విత్తనాలు సరఫరా చేసి ప్రభుత్వం ఖరీఫ్ రైతుల కాడికి సంకెళ్లు వేసింది. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీకి సంబంధించి బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల చేతుల మీదుగా కాయలు పంపిణీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పది మంది రైతులకు కాయలు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈనెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు కాయలు పంపిణీ చేసే క్రమంలో ఎక్కడా గొడవలు ఉండకూడదని..ఇలా ప్లాన్ చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల అరకొర విత్తనాల తిరస్కరణ? అరకొరగా వచ్చిన వేరుశనగ విత్తనాలు మాకొద్దంటూ కొన్నిచోట్ల కూటమి నేతలు, ఎమ్మెల్యేలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అరకొరగా ఇస్తే మా పరువు పోతుందని అధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాయలు ఇస్తే ఇవ్వండి...లేకుంటే వద్దని చెప్పినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వైపు వారి వద్ద కాయలు పంపిణీకి, పంట సాగుకు పొంతన లేదంటూ అధికారులు వాదిస్తున్నారు. చాలా మంది కాయలను వంటనూనె కోసం తీసుకుంటున్నారని జవాబు ఇస్తున్నారు. ఈసారి కాయలు తీసుకునే వ్యక్తులు విత్తు వేసేలా చూస్తామని, లేనిపక్షంలో అన్నదాత సుఖీభవలో కోత పెడతామని గట్టిగా ప్రచారం చేయిస్తున్నారు. అయోమయంలో అధికారులు ఈసారి వర్షాలు బాగానే కురుస్తున్నాయి. అధిక వర్షపాతం ఉందని వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వేరుశనగ పంటను విస్తరంగా పండించాలని చూస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టు కూటమి ప్రభుత్వం వేరుశనగ విత్తన కేటాయింపు చేయలేదు. ఇక వచ్చిన కాయలను కూటమి నేతలు ముందస్తుగానే ఆర్డర్లు పెట్టుకున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఒక్కో సచివాలయానికి 200 నుంచి 260 బ్యాగుల వరకు పంచి పెట్టారు. గతంలో ఒక్కో సచివాలయానికి 400 నుంచి 500 బ్యాగుల వరకు కాయలు ఇచ్చారు. ఈసారి అరకొరగా కాయలు రావడంతో క్షేత్ర స్థాయి సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఈ తరుణంలో స్థానిక కూటమి నేతలు 100 నుంచి 150 బ్యాగుల వరకు టోకెన్లు ముందుగానే తమ చేతిల్లో పెట్టాలని హుకుం జారీ చేశారు. కొన్ని చోట్ల అప్పుడే కూటమి నేతలకు ఆర్డర్లు బుక్కయ్యాయి. సిబ్బంది భయపడి నేతల చేతికి టోకెన్లు ఇచ్చేశారని సమాచారం. కొన్ని చోట్ల మండల స్థాయి అధికారులు నేతలకు కొమ్ముకాస్తున్నారు. దీంతో కాయలు నిజమైన రైతులకు అందేలా కనిపించడం లేదు. -
కూటమి ప్రభుత్వం.. చేసింది శూన్యం
తిరుపతి మంగళం : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డితో కలిసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం వెన్నుపోటు దినం పాటిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఏడాది పాలనలో 800 మందికిపైగా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు దినంగా నామకరణం చేశారని, ఆ మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల నిరసనలు తెలిపి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరలు
చిత్తూరు కలెక్టరేట్ : రెండు నెలలుగా మామిడి గిట్టుబాటు ధరపై కొనసాగుతున్న చర్చలకు మంగళవారం ధరను నిర్ణయించారు. కలెక్టరేట్లో మామిడి రైతులు, మామిడి పరిశ్రమల నిర్వాహకులతో సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల యా జమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన తర్వాత గిట్టుబాటు ధర నిర్ణయించామన్నారు. తోతాపురి మామిడికి టన్నుకు రూ.12 వేలు గిట్టుబాటు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తోతాపురి మామిడి పంట పండుతోందన్నారు. మామిడి రైతులకు, పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిట్టుబాటు ధర నిర్ణయించినట్లు చెప్పారు. తప్పనిసరిగా అన్ని పరిశ్రమల్లో గిట్టుబాటు ధరను అమలు చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీ మోహన్, మామిడి పరిశ్రమల నిర్వాహకులు, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఖాళీలు పకడ్బందీగా నమోదు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని ఆర్జేడీ శామ్యూల్ అధికారుల ను ఆదేశించారు. స్థానిక డీఈవో కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న ఉపాధ్యా య బదిలీల ప్రక్రియలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాల నమోదును ఆయన మంగళవారం పరిశీలించారు. క్లస్టర్ పాఠశాలలు, ఇతర ఉన్నత పాఠ శాలల్లో ఖాళీలను నమోదు చేసేటప్పుడు సంబంధింత ఉపాధ్యాయుల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్జ్టీటీల కౌన్సెలింగ్ నిర్వహణ తదితర బదిలీ అంశాలపై ఆయన డీఈవో వరలక్ష్మి, ఏడీ–2 వెంకటేశ్వరరావు, చిత్తూరు, తిరుపతి డీవైఈఓలు ఇందిర, బాలాజీ, తదితర అధికారులతో చర్చించారు. జాబితాలో జాప్యం నివారించండి ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించి సీనియారిటీ, ఖాళీల జాబితాలను ప్రదర్శించడంలో జాప్యం జరుగుతోందని ఆర్జేడీ శామ్యూల్కు ఎస్టీ యూ నాయకులు విజ్ఞప్తి చేశారు. వెబ్ ఆప్షన్ల నమో దుకు సమయం చాలా తక్కువగా ఉందన్నారు. జాబి తాల ప్రదర్శనలో జాప్యం కారణంగా ఉపాధ్యాయు ల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. డీఎస్సీ–2008 ఉపాధ్యాయులకు కామన్ సీనియారిటీ తేదీని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని తెలిపారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీల ఖాళీల ఎంపికపై స్పష్టత ఇవ్వాలని ఆర్జేడీకి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘనేతలు పలు సమస్యలను ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు గంటా మోహన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్రెడ్డి, మోహన్, నాయకులు లింగమూర్తి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
దళితులపై దాడులు అమానుషం
● హత్యా రాజకీయాలకు కేరాఫ్ కూటమి ప్రభుత్వం ● అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కరువు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం కార్వేటినగరం : కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక దళితులపై దాడులు పెరగడం అమానుషమని మాజీ ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మంగళవారం పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెనాలిలో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై నడి రోడ్డుపై పోలీసులే విచక్షణా రహితంగా దాడులు చేయడం దారుణమన్నారు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందు నుంచి దళితులంటే చిన్న చూపని, ఐక్యంగా ఉన్న మాల మాదిగలను కుల వర్గీకరణ పేరుతో రెండుగా చీల్చి వారిలోని వర్గ పోరును పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. దళిత ప్రజాప్రతినిధులు బాబు చేతిలో కీలుబొమ్మలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి దళితులపై కక్ష సాధింపు దోరణితో వ్యహరిస్తారని, దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బహిరంగా విమర్శించిన చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న కొంత మంది దళితులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నియోజకవర్గంలో పిఠాపురంలోని ఓ దళిత గ్రామాన్ని అగ్రవర్ణాలు బహిష్కరించడం, అలాగే మంత్రి సొంత గ్రామంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని అడ్డుకున్నప్పుడు దళిత ప్రజా ప్రతినిధులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికై న వారు నేడు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. దళితులకు సమానత్వం కావాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా జగనన్న అండగా నిలుస్తున్నారన్నారు. హోం మంత్రి హోదాలో ఉంటున్న దళిత మహిళ అనిత చంద్రబాబు భజన చేస్తున్నారు తప్ప, దళితులపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. -
సైక్లింగ్తో ఆరోగ్యం
చిత్తూరు కలెక్టరేట్ : ఆరోగ్యానికి అసలైన టానిక్ సైక్లింగ్ అని ఎస్పీ సతీమణి హర్షిత అన్నారు. నేచర్ లవర్స్ అసోసియేషన్, సైక్లింగ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ సతీమణి హర్షిత జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానమన్నారు. అదే విధంగా సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్లో చాలా మంది వ్యాయమానికి దూరమవుతున్నారన్నారు. ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తక్కువ కావడం, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వంటివి అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. రోజులో గంటల తరబడి వ్యాయామం చేయకపోయినా ప్రతి రోజు కొద్ది సేపు సైక్లింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. అనంతరం కొంగారెడ్డిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సైక్లింగ్ పాల్గొన్న సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో నేచర్ లవర్స్ అసోసియేషన్ సభ్యులు మురళి, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు వినోద్, డాక్టర్ భరత్రెడ్డి, డాక్టర్ జయంత్, సురేంద్రరెడ్డి, ఏలుమలై, సునీల్ పాల్గొన్నారు. ● నగరంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం -
ఆకస్మిక తనిఖీలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆకస్మికంగా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని రాష్ట్ర సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఆదేశించారు. జిల్లా పర్యటనకు సోమవారం విచ్చేసిన ఆమె కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలకు అప్రోచ్ రోడ్డును వేయాలన్నారు. బాల్య వివాహాల కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడంతో ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయంతో బాల్యవివాహాలు కట్టడి చేయాలన్నారు. మండలాల వారీగా వివరాలు పంపండి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల వివరాలను మండలాల వారీగా పంపాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల, ఎత్తు బరువులను కచ్చితత్వంతో కొలవాలన్నారు. జిల్లాలో పురుషులతో పోలిస్తే సీ్త్ర జనాభా తక్కువ ఉందన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరీ, డీఎంహెచ్వో సుధారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మా పరిస్థితేంటి సారూ!
బాబుగారి భవంతి సరే..● అప్పట్లో కొత్త ఊర్లు, ఇప్పుడు ఊరికో ఇల్లు లేదే! ● జిల్లాలో గత ప్రభుత్వంలో మంజూరైన మొత్తం ఇళ్లు 77,366 ● కూటమి పాలనలో ఒక్క ఇల్లు పునాదులేసింటే ఒట్టు ● జిల్లాలో స్తంభించిన పక్కా ఇళ్ల నిర్మాణ పనులు పలమనేరు: సీఎం చంద్రబాబు కుప్పంలో మాత్రం కొత్త ఇల్లు కట్టుకొని కొత్త హెలీక్యాప్టర్లో సకుటుంబ సమేతంగా వచ్చి గృహప్రవేశం చేసుకొని సంతోషంగా వెళ్లిపోతే ఇంటి బిల్లులందక మాలాంటి పేద లు ఎప్పుడు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేదని గత ప్రభుత్వంలో పక్కా ఇళ్లను పొందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఏడాది పాలనలో ఇప్పటిదాకా ఓ ఇంటి పునాదికూడా మొదలుకా లేదని కూటమి పార్టీకి చెందినవారు మదన పడితున్నారు. కూటమి పాలనలో జిల్లాలోని హౌసింగ్ కార్యాలయాల్లో ఎలాంటి పనులు ముందుకు సాగక నిర్మానుష్యంగా మారాయి. గత ప్రభుత్వంలో కొత్త ఊర్లు నిర్మించగా ఈ కూటమి హయాంలో ఊరికో ఇల్లు కూడా మంజూరు కాలేదు. గత ప్రభుత్వంలో ఇలా.... సొంతిల్లు కట్టుకోవాలన్నదే పేద వాడి కలను నిజం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలమనేరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలను మంజూరు చేసింది. జిల్లాలో 77,365 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 609 జగనన్న లేఅవుట్లున్నాయి. మొత్తంగా జిల్లాలో 46,163 వేల ఇళ్లు పూర్తికాగా 31,203 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 2,389 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,330 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. జిల్లాలో వీటి నిర్మాణాలకోసం గత ప్రభుత్వం రూ.1000.687 కోట్లను ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వంలోనూ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులిస్తామని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. లబ్ధిదారులతో అధికారులు సమావేశాలను నిర్వహించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో హౌసింగ్ అధికారులు నిర్మాణాలను ఎలా వేగవంతం చేయాలో అర్థంకావడం లేదు. పలమనేరులో జగనన్న కాలనీని చూద్దాం పట్టణ సమీపంలోని బొమ్మిదొడ్డి కాలనీలో మొత్తం 3031 ఇళ్లు మంజూరైతే ఇందులో వీటిల్లో 1721 మాత్రం పూర్తయ్యాయి. మిగిలిన 1310 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 14 ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. నియోజకవర్గంలో 12 లేఅవుట్లున్నాయి. ఈ విషయమై స్థానిక హౌసింగ్ డీఈ దాస్ను వివరణ కోరగా డివిజన్ పరిధిలో గత కొన్నాళ్లుగా పక్కాగృహాల నిర్మాణ పనులు వేగంగా సాగడం లేదని చెప్పారు. ఇంటి పనులు చేసిన వారికి బిల్లులిస్తామని లభ్ధిదారులతో అవగాహన సమావేశాలను సైతం నిర్వహించామన్నారు. కొత్త గృహాల ఊసేలేదు గత ప్రభుత్వంకంటే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణాలు చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఊదరగొట్టింది. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఓ ఇంటి పునాదికూడా పడలేదు. ఆరునెలల క్రితం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పంచాయతీలవారీగా కూటమి నేతల ద్వారా పక్కా ఇళ్లకు అర్జీలను తీసుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు కాకుండా కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్ అధికారులకు వాటిని పంపారు. వీరి లెక్కమేరకు జిల్లాలో సుమారు 30వేల మంది లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాకపోవడం కొసమెరుపు. ఈ విషయమై పలమనేరు హౌసింగ్ డీఈ దాస్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కార్యాలయంలోని సిబ్బందిని అడగ్గా మీకు తెలియందేముంది సార్ ముందులాగా ఇప్పుడు లేదు పాత ఇళ్లే ఇంకా పూర్తిగాక ఇబ్బంది పడుతుంటే మళ్లీ కొత్త ఇళ్లు ఎప్పుడొస్తాయో ఎలా చెప్పేదన్నారు. -
అయ్యా..మా మొర ఆలకించండి సారూ!
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ ● పలు సమస్యలపై 275 అర్జీల స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ : అయ్యా.. మా మొర ఆలకించి న్యాయం చేయండంటూ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు విచ్చేసి తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గ్రామకంఠంగా మార్చండి తమ గ్రామంలోని పలు సర్వే నంబర్లను గ్రామ కంఠంగా మార్చాలని చౌడేపల్లె మండలం తమినిగుంట గ్రామానికి చెందిన అర్జీదారులు నల్లప్పరెడ్డి, వేణుగోపాలు కోరారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని 9 ఎకరాల్లో 182 కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. సర్వే నెంబర్లు 170/1,744,778,757 ను గ్రామకంఠంగా మార్చాలని కోరారు. -
నాటు బాంబు ఉండను తొక్కి వ్యక్తికి తీవ్రగాయాలు
బంగారుపాళెం: తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందాన తాను దాచిపెట్టిన నాటు బాంబు ఉండను తొక్కి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సోమవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు, వెలుతురుచేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన బాలకృష్ణ కుమారుడు వినాయకం(35) తమిళనాడు నుంచి నాటు బాంబు ఉండలు తెప్పించి వాటితో అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని అమ్మేవాడు. ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలోని మల్లెపూల చెట్టు పొదలో నాటు బాంబు ఉండలను దాచిపెట్టాడు. మల్లె పొద వద్ద కుక్క ఉండడంతో తరమడానికి పరుగెత్తాడు. ఈ క్రమంలో నాటు బాంబు ఉండపై కాలు వేయడంతో అది పేలి కుడిపాదం ఛిద్రమైంది. కుటుంబ సభ్యులు వినాయకంను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇన్చార్జి వీఆర్ఓ హేమచంద్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు బైక్ ఢీ: ఒకరి దుర్మరణం పులిచెర్ల(కల్లూరు): కారు బైక్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసు ల కథనం మేరకు, చింతలవారిపల్లెకు చెందిన వెంకటస్వామి(62), నారాయణమ్మ(60) దంపతులు పూరేడివారిపల్లెలో ఉన్న అల్లుడు వాసు (40) ఇంటికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి అల్లుడు వాసుతో కలిసి ద్విచక్రవాహనంపై వీరు ముగ్గురూ బయల్దేరారు. మార్గమధ్యంలో పీలేరు రోడ్డులోని తాజ్ హోటల్ వద్ద తెలంగాణ నుంచి తిరువణ్ణామలైకి వెళుతున్న కారు ఈ బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటస్వామి మృతి చెందారు. మరో ఇద్దరిని తమిళనాడులోని రాణిపేటలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి వెదురుకుప్పం: మండలంలోని పాతగుంటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ వెంకటసుబ్బయ్య కథనం మేరకు, మండలంలోని ఏపేరి గ్రామానికి చెందిన నాగూర్ శెట్టి కుమారుడు ఎం.గోపి(25) పుట్టుకతో మూగవాడు. సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెదురుకుప్పం బయలుదేరాడు. మార్గమధ్యంలోని పాతగుంట గ్రామంలో పెనుమూరుకు వెళ్తున్న పుత్తూరు డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు మృత దేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారస్పీ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని తల్లిదండ్రులు వైకల్యంతో అవస్థలు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆస్తి వివాదంలో మహిళలపై దాడి శాంతిపురం: మఠం పంచాయతీలోని వెంకటేష్పురంలో ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన మహిళలు, పిల్లలపై మరో వర్గం వారు దాడి చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలు పార్వతమ్మ రాళ్లబూదుగూరు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు. గ్రామానికి చెందిన అనసూయమ్మ, ఆమె బావ నారాయణప్ప కుటుంబానికి గత దశాబ్ద కాలంగా ఆస్తి పంపకాల్లో వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 31న అనసూయమ్మకు మద్దతుగా కావర్లపల్లి సల్లాపురి వర్గీయులు వచ్చి తనతో సహా మరో ఇద్దరు మహిళలు, తన మనుమరాళ్లైన ముగ్గురు బాలికలపై దాడి చేసి కొట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ చెప్పారు. రెండో రోజూ సర్వర్ మొరాయింపే! చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా రెండు రోజు కూడా రేషన్ పంపిణీకి సర్వార్ మొరాయించింది. ఉదయం నుంచి రాత్రి వర సర్వర్ పని చేసినప్పుడల్లా కార్డుదారులకు రేషన్ ఇచ్చేందుకు డీలర్లు ముప్పుతిప్పలు పడ్డారు. బియ్యం సంచికి వచ్చేంత వరకు కార్డుదారులు పడిగావులు కాశారు. చాలా చోట్ల డీలర్లు వారి ఇష్టానుసారంగా రేషన్ దుకాణం తలుపులు తీశారు. 8 గంటలు పనివేళలు నామమాత్రంగానే కనిపించింది. నిరీక్షణతో కార్డుదారులు విసిగిపోయారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అవస్థల నడుమ రేషన్ పట్టుకెళ్లారు. జిల్లాలో ఇప్పటి వరకు 37.58 శాతం పంపిణీ పూర్తయిందని డీఎస్ఓ శంకరన్ వెల్లడించారు. -
పోలీసు గ్రీవెన్స్కు 53 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 53 ఫిర్యాదులు అందాయి. చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, డబ్బు తగాదాలు, భూ తగాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటిని ఆన్లైన్లో సైతం నమోదు చేయాలన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి బంగారుపాళెం: మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తోతాపురి రకం మామిడి ప్రస్తుతం కిలో రూ.4 నుంచి రూ.5కు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు పెట్టిన ఖర్చులు సైతం రాకపోవడంతో దిక్కుతోచని స్ధితిలో కొట్టుమిట్టులాడుతున్నారని పేర్కొన్నారు. గుజ్జు పరిశ్రమ యజమానులతో సంప్రదించి మామిడికి కనీస ధర కిలో రూ.25గా నిర్ణయించాలన్నారు. అనంతరం నాయకులతో కలసి గ్రామాల్లోని మామిడి తోటలను పరిశీలించారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి శంకరన్, జిల్లా ఉపాధ్యక్షుడు వాడా గంగరాజు, రైతు సంఘ నాయకులు సుబ్రమణ్యం, లోకేష్, రాజన్న పాల్గొన్నారు. -
బోరు మోటార్ కేబుల్ చోరీ
పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలం మతుకువారిపల్లెలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రైతు ఎం.చంద్రశేఖరరెడ్డి పొలంలో వేసిన రెండు బోర్లకు ఉన్న కేబుల్ వైర్లను కత్తిరించుకుని పోయారు. ఉదయం లేచి బోరు వద్దకు వెళ్లి చూడగా వైర్లు చోరీకి గురైనట్టు గుర్తించారు. మండలంలో ఎక్కడో ఒకచోట ఈ వైర్ల చోరీలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మతుకువారిపల్లె చుట్టు పక్కల నెల రోజుల్లో దాదాపు 15 మంది రైతులకు చెందిన బోర్ కేబుల్వైర్లు కత్తిరించుకుపోయారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 78, 031 మంది స్వామివారిని దర్శించుకోగా 32,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. -
తప్పు చేస్తే వేటు తప్పదు: ఆర్జేడీ
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల పాయింట్ల విషయంలో అలసత్వం వద్దని తప్పులు చేసే వేటు ఖాయమని వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన సోమవారం డీఈవో కార్యాలయం పక్కనున్న పాఠశాలలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తును పరిశీలించారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బదిలీల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బదిలీల పాయింట్ల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. కొందరి ఎంఈవోలపై ఫిర్యాదులు అందుతున్నాయని, తీరు మార్చుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఈవో వరలక్ష్మి, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్, పలు మండలాల ఎంఈవోలు పాల్గొన్నారు. టీచర్లకు న్యాయం చేయాలి పీఎస్ హెచ్ఎం బదిలీల్లో నష్టపోయిన నలుగురు టీచర్లకు న్యాయం చేయాలని ఆర్జేడీని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ కోరారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆర్జేడీకి వినతిపత్రం అందజేశారు. ఆయన ఆర్జేడీతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు స్పౌజ్ ఉన్న వారికి స్పౌజ్ పాయింట్లు వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్, ఇతర నాయకులు సుధాకర్రెడ్డి, ఎస్పీ భాషా, రెడ్డెప్ప, శేఖర్ పాల్గొన్నారు. -
పేదల కల సాకారం చేసిన నాయకుడు
చిత్తూరు కలెక్టరేట్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలకు గత వైఎస్సార్సీపీ సర్కారులో ఇళ్ల పట్టాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశారు. గత ప్రభుత్వ పాలన చక్కటి ప్రణాళికతో లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించారు. ఈ పథకానికి గత వైఎస్సార్సీపీ సర్కారు కోట్ల నిధులను ఖర్చు చేసింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ గత ఐదేళ్ల పాటు పక్కాగృహాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. అర్హులైన పేదలందరికీ కులం, మతం, వర్గం, పార్టీలు అనే తేడా లేకుండా బృహత్తర లక్ష్య సాధనతో పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2019వ సంవత్సరానికి ముందు పేద ప్రజలు అద్దె గృహాల్లో ఉంటూ నెలవారీ వేల కొద్దీ అద్దెలు చెల్లించేవారు. కూలీ పనులు, చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే పేద ప్రజలు సంపాదించే అతి కొద్ది సంపాదనలో సగానికిపైగా నగదు అద్దె కోసమే చెల్లించేవారు. అలాంటి పరిస్థితుల నుంచి గత ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ సర్కారు అమలు చేసిన ఉచిత ఇళ్ల పట్టాలు, పక్కాగృహాలతో జిల్లాలోని పేద ప్రజలు లబ్ధిపొందారు. ఈ పథకంలో లబ్ధిపొందిన పేదలు పక్కా ఇళ్ల గృహాలు నిర్మించుకుని ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. గత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చేసిన మేలు వల్లే సొంత గృహాలను నిర్మించుకున్నామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత ఐదేళ్లలో మంజూరు చేసిన పక్కా గృహాల వివరాలు నియోజక మంజూరైన ఖర్చు చేసిన మొత్తం వర్గం గృహాలు రూ.కోట్లలో చిత్తూరు 9748 రూ.175.48 కుప్పం 5562 రూ.100.11 పుంగనూరు 15665 రూ.281.97 నగరి 4599 రూ.82.78 జీడీ నెల్లూరు 12505 రూ.225.09 పూతలపట్టు 12061 రూ.217.09 పలమనేరు 12131 రూ.218.35 మొత్తం 72272 రూ.1300.87 -
9న హుండీ లెక్కింపు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ కానుకలను ఈ నెల 9వ తేదీన లెక్కించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థా న మండపంలో లెక్కింపు ఉంటుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. బదిలీలకు కౌన్సెలింగ్ చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ల వారీగా ఈ ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్–1లో 10 మంది, గ్రేడ్–2లో 29 మంది, గ్రేడ్–3లో 66 మందిని బదిలీ చేశారు. ఐదేళ్లు ఒకే చోట పనిచేసినవారు, విజ్ఞప్తి బదిలీలు కలి పి మొత్తం 105 మందికి స్థానచలనం కల్పించినట్లు డీపీఓ సుధాకర్రావు తెలిపారు. గ్రేడ్–4 కార్యదర్శులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. సెక్టోరల్ అధికారుల నియామకం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని సమగ్రశిక్ష శాఖకు నూతన సెక్టోరల్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు డీఈవో వరలక్ష్మీ, ఏపీసీ వెంకటరమణ ఉత్తర్వులు జారీచేశారు. యాదమరి జెడ్పీ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్ జే.మధును ఐఈ కో–ఆర్డినేటర్గా, రామకుప్పం మండలం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు ఈ.ఇంద్రాణిని ప్లానింగ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్గా, మాపాక్షి హైస్కూల్ ఉపాధ్యాయులు మధుసూధననాయుడు ను అసిస్టెంట్ సీఎంవోగా, రామకుప్పం మండలం జెడ్పీ ముద్దనపల్లిలో పనిచేస్తున్న నందకుమార్ను ఏఎస్వో–1 గా, శాంతిపురం మండలం బండపల్లిలో పనిచేస్తున్న చాన్బాషాను ఏఎస్వో–2గా నియమించారు. నియమితులైన నూతన సెక్టోరల్ అధికారులకు ఉపాధ్యాయ సంఘ నాయకులు మునీర్, ముక్తార్, ఈశ్వరయ్య శుభాకాంక్షలు తెలిపారు. -
● అప్పడు సంపద వరాలు.. ఇప్పుడు బీద అరుపులు ● ఊరికో హామీ.. హామీకో సమాధి ● వర్సిటీలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు .. ● ఒక్కటంటే ఒక్కటీ కార్యరూపం దాల్చని వైనం
ఏ రైతూ సంతోషంగా లేడు ఎన్నికలపుడు పలమనేరులో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ రైతు అయినా సంతోషంగా ఉన్నాడా? ఏ పంటకైనా ధరలున్నాయా? టమాటా సాగు చేసి ఇప్పటికే రూ.నాలుగున్నర లక్షలు నష్టపోయాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే టమా టాను కొనుగోలు చేసింది. తప్పుడు హామీలిచ్చిన కూటమి నేతలను మా ముందుకు రమ్మనండి మా బాధలు చూసైనా న్యాయంచేస్తారేమో. – గోవిందురెడ్డి, ఆదర్శరైతు, బేరుపల్లి, పలమనేరు మండలం మాట తప్పిన లోకేష్ మా ఊర్లో లోకేష్ పాదయాత్రకు గుర్తుగా 200 కి.మీ శిలాఫలకం వేసి, ఏడాదిలో కాలేజీ పెడతామన్నారు. శిలాఫలకమైతే అట్లాగే ఉంది కానీ కాలేజీకి మాత్రం కనీసం పునాదిరాయి కూడా వేయలేదు. రాజకీయాల్లో మాట ముఖ్యం. నాయకులే ఇచ్చిన మాట తప్పితే ఎట్లా చెప్పండి..? – మురగయ్య, కార్వేటినగరం జిల్లా కేంద్రమైన చిత్తూరుకు గతేడాది మే 11న వచ్చిన చంద్రబాబు బహిరంగ ప్రసంగంలో ఇచ్చిన హామీలు.. ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం, జిల్లా కేంద్రాన్ని విద్యాహబ్గా మారుస్తాం, ఐటీ టవర్, పరిశ్రమల ఏర్పాటు, చిత్తూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కానీ వీటిలో ఒక్క హామీను కూడా నెరవేర్చడానికి బీజం పడలేదు. గతేడాది ఫిబ్రవరి 6, 7 తేదీల్లో చిత్తూరు నియోజకవర్గంలో యువగళంలో పర్యటించిన నారా లోకేష్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ సబ్ప్లాన్ను కొనసాగిస్తామని, ఎస్సీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. చెప్పిందానికి పూర్తి భిన్నంగా పథకాన్ని రద్దు చేశారు. ఇక చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మానుఫాక్చర్ ఫ్యాక్టరీ ఏర్పాటు లాంటి హామీలు లెక్కేలేదు. ● గంగాధరనెల్లూరులోని కత్తెరపల్లె గ్రామంలో... 2023లో జనవరి 11న యువగళం పాద యాత్రలో భాగంగా 200 కి.మీ పూర్తిచేసుకున్న నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ ఆచరణకు నోచుకోలేదు. కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చే బాధ్యత తనదనిచెప్పి, ఇప్పుడు పక్కకు తప్పుకున్నారు. ● పలమనేరులో ఎన్నికల నేపథ్యంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గతేడాది మార్చి 27న నిర్వహించిన బహిరంగ సభలో హామీల వరాలు గుప్పించారు. ప్రపంచంలోని అన్ని కంపెనీల్లో పలమనేరువాసులు ఉండేలా, ఇంట్లో కూర్చుని ఉద్యోగాలు చేసేలా చూస్తామన్నారు. కృష్ణా జలాలనే కాదు గోదావరి జలాలను సైతం తీసుకొస్తామన్నారు. వ్యవసాయానికి గుండెకాయలాంటి పలమనేరు ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తామని, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, గంజాయి, డ్రగ్స్ కనిపించకుండా చేస్తామన్నారు. కానీ ఏపీ నుంచి బెంగళూరుకు తరలే గంజాయి మొత్తం పలమనేరు మీదుగానే వెళుతోంది. ● యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఫిబ్రవరి 13వ తేదీన పుత్తూరు బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేష్.. విజయపురం కోసలనగరంలో ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని, గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తిచేస్తామని, నగరిలో టెక్స్టైల్స్ పార్కు, పవర్లూమ్ పరిశ్రమలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, అగ్నికుల క్షత్రియులకు బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. వీటన్నింటినీ తాము అధికారంలోకి ఇచ్చిన తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పిన చినబాబు.. ఒక్క హామీ నెరవేరిస్తే ఒట్టు. చేనేతలకు 500 యూనిట్లకు ఉచిత విద్యుత్పై జీఓ విడుదల చేశారేతప్ప.. కార్యాచరణకు నోచుకోలేదు. ● పుంగనూరును సింగపూర్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అభివృద్ధి సమావేశాలు, జెడ్పీ సమావేశాల్లో గత ప్రభుత్వం పుంగనూరులో ఎందుకు అన్ని రూ.కోట్లు ఖర్చు చేసిందని..? ఎందుకు పరిశ్రమలు వచ్చాయని ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కుప్పానికి ఇచ్చిన వరాలు ఇవే.. ఎన్నికల ముందు కుప్పంవాసులకు చంద్రబాబు కురిపించిన వరాల జల్లులు అన్నీ ఇన్నీ కావు. టెకీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవడానికి ప్రతి మండలానికి వర్క్ స్టేషన్ నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం పొలాలకు రోడ్లు, బెంగళూరు నుంచి సజ్జాపురం మీదుగా కుప్పంకు ఫోర్లేన్ రోడ్డు, రూ.100 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు బెంగళూరు సిటీతో కుప్పానికి అనుసంధానం వంద ఎకరాల్లో గ్రానైట్ పరిశ్రమ లాయర్లు, జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు ఇస్తాం. ఒక్కో పంచాయతీకి రూ.కోటి–రూ.2 కోట్ల నిధుల కేటాయింపు, హంద్రీ–నీవా కాలువ పనులు పూర్తి చేసి కుప్పానికి నీళ్లు తీసుకొస్తాం మల్లానూరు, రాళ్లబూదుగూరును ప్రత్యేక మండలాలుగా గుర్తిస్తాం కుప్పం–పలమనేరు ఫోర్లేన్ రోడ్డుగా మారుస్తాం నారా లోకేష్ 2023లో యువగళాన్ని కుప్పంలో ప్రారంభించి ఇచ్చిన హామీలు.. యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొస్తాం ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం రాయలసీమ రైతులకు ఉచితంగా డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తాం. కుప్పంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం విద్యుత్ చార్జీలు, ఉప్పు–పప్పు, గ్యాస్, వంట నూనెల ధరలు తగ్గిస్తాం. కుప్పంలో పరిశ్రమలు తీసుకొస్తాం ప్రజలకు ఉపాధి కల్పించి వలసల నివారిస్తాం ఇచ్చిన హామీల్లో ఈ ఏడాదిలో ఒక్కటంటే కార్యరూపం దాల్చలేదు. అందుకే ఇప్పటికే పుష్–పుల్ రైల్లో ఉదయం 6.30 గంటలకు ప్రతిరోజూ పనుల కోసం కుప్పంవాసులు బెంగళూరుకు వలసలు వెళుతూనే ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళెంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చే ట్రెంచ్లు తవ్వించి సోలార్ ఫెన్సింగ్ వేయిస్తామని హామీ ఇచ్చారు. దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. -
ఉత్సాహంగా యోగాంధ్ర
యోగాసనాలు వేస్తున్న కలెక్టర్సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ●పెనుమూరు(కార్వేటినగరం): యోగాను రోజువారీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. మండలంలోని పులిగుండు వద్ద సోమవారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. దీనికి హాజరైన కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర–2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2300 మంది భాగస్వాములు కావడంతో విజయవంతమైందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరి, డీఆర్డీఏ పీడీ తులసి, డీఎస్టీ బాలాజీ, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, అధికారులు, ఎస్వీసెట్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రి అలర్ట్
జిల్లా ఆస్పత్రి అలర్ట్ అయింది. ఆస్పత్రికి రాష్ట్ర స్థాయి అధికారులు మంగళవారం విచారణకు రానున్నారని ముందస్తుగానే సంసిద్ధమైంది. ఈ తరుణంలో ఆస్పత్రి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆస్పత్రి సమస్యలు పట్టించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వసూళ్ల పర్వానికి, వేధింపులకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం రాష్ట్ర స్థాయి నుంచి విచారణ కమిటీ రానుంది. ఇటీవల వచ్చిన పలు ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం ఆస్పత్రిపై విచారణ కమిటీని నియమించింది. కమిటీలో రాష్ట్ర డీఎస్హెచ్ రమేష్ నాథ్, డిప్యూటీ కమిషనర్ రమేష్ కిషోర్, రాష్ట్ర వైద్యవిధాన కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర డీఎస్హెచ్ ఈఈ విజయ భాస్కర్, రాష్ట్ర డీఎస్హెచ్ బయో మెడికల్ ఇంజినీర్ సందీప్ రెడ్డిని నియమించింది. వీరు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ కమిటీతో అయినా జిల్లా ఆస్పత్రి బాగుపడేనా అన్న ఆశ ప్రజల్లో మొదలైంది. ఇవీ సమస్యలు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి– అపోలో మధ్య సమన్వయ లోపం కారణంగా వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. బదిలీల విషయంలో ఇన్ –అవుట్ ఉండాలి. పోస్టుమార్టంకు నలుగురు డాక్టర్లు కావాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, డాక్టర్లు, ఎఫ్ఎంఓ, ఎంఎన్ఓ ఇలా పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. చాలా వరకు కిట్లు అందుబాటులో లేవు. రెఫర్ కేసులు పెరుగుతున్నాయి. వార్డులకు తాగునీటి సౌకర్యం లేదు. జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఎస్ఆర్కు రూ.5 వేలు, ప్రమోషన్ తదితర వాటికి సంబంధించి రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ అధికారి శాఖ కమిషనర్ తెలుసంటూ ఈ దందాలకు పాల్పడుతున్నట్లు కొందరు వైద్యులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆ పనులు జరగడం లేదని చర్చించుకుంటున్నారు. పైసలు ఇస్తే తప్ప పనులు జరగడం లేదన్న విషయం బహిరంగ రహస్యం. ఇష్టానుసారంగా శాశ్వత బదిలీలు చేయిస్తున్నారు. ఇందుకు రూ.50 వేలు తీసుకున్నారని పలువురు బహిరంగంగా చెబుతున్నారు. కమిషనర్, కలెక్టర్ ఇచ్చిన డిప్యుటేషన్లను జిల్లా అధికారులకే తెలియకుండా కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారి డిప్యుటేషన్లను ఇటీవల రద్దు చేశారు. అతని స్వార్థ రాజకీయాలకు ఆస్పత్రిలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది బలవుతున్నారు. బదిలీల నేపథ్యంలో ఇక్కడే పాతుకుపోవడానికి కమిటీల పేరుతో కుయుక్తులు పన్నుతున్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో పని చేస్తున్న సూపరింటెండెంట్లను శాసిస్తున్నారు. ప్రశ్నిస్తే రూల్స్ పేరుతో వారిని శాసిస్తున్నారు. ఇప్పుడే రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి ఫోన్ చేశానని, వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. తిరగబడే వారిపై, సహచర ఉద్యోగుల ద్వారా డ్యూటీలో వేధింపులకు గురి చేస్తున్నారు. కొందరు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. వీటిలో కొన్ని మార్పులైనా తీసుకొస్తే ఆస్పత్రికి పట్టుకున్న జబ్బు నయమవుతుంది. అక్రమాలు, వేధింపులు లేకుంటే పారదర్శకమైన సేవలను చూడవచ్చు. నేడు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి విచారణ కమిటీ రాక సన్నద్ధమైన ఆస్పత్రి అధికారులు వసూళ్ల పర్వానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
రేషన్ కోసం కష్టాలు మొదలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి పాలనలో సేవలు ఒక్కొక్కటిగా రద్దవుతుండడంతో జనం వీధినపడుతున్నారు. నాడు ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ల వ్యవస్థకు నేడు మంగళం పాడారు. గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలు నేడు అందకపోవటంతో జనం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదు. తాజాగా ఇంటింటికీ రేషన్ చేరవేసే వాహనాలను రద్దు చేసి లబ్ధిదారులంతా దుకాణాల వద్దకు వెళ్లి బియ్యం, చక్కెర ఇతరత్రా సరుకులు తీసుకోవాలని ఆదేశించారు. కూట మి సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆదివారం రేషన్ లబ్ధిదారులంతా వీధినపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. డీలర్లు వాహనాల్లో రేషన్ తీసు కుని లబ్ధిదారుని నివాసానికి వెళ్లి సరుకులు పంపిణీ చేసేవారు. కూటమి పాలన వచ్చిన వెంటనే రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడేశారు. లబ్ధిదారులంతా రేషన్ దుకాణానికే వెళ్లి సరుకులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.అట్టహాసంగా ప్రారంభోత్సవాలుతిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం రేషన్ దుకాణాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. పాత రేషన్ దుకాణాలకు మామిడి తోరణాలు, పూలు అలంకరించి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కూటమి నేతల ద్వారా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రారంభోత్సవాలకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లను ఆహ్వానించవద్దని అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులే ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆలస్యమైనా కూటమి నేతలు వచ్చే వరకు రేషన్ పంపిణీ చేయడానికి వీల్లేదని అనేక చోట్ల డీలర్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.గంటల తరబడి ఎండలో నిల్చొని..రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయటంతో చేసేది లేక లబ్ధిదారులంతా ఆదివారం ఉదయమే దుకాణాల వద్దకు చేరుకున్నారు. అయితే కూటమి ఎమ్మెల్యే, స్థానిక నాయకులు వచ్చే వరకు రేషన్ వేయద్దని చెప్పడంతో లబ్ధిదారులంతా ఎండలో బారులు తీరక తప్పలేదు. కొన్ని చోట్ల కూటమి నేతలు వచ్చి ప్రారంభించి వెళ్లిపోయాక డీలర్లు ఇద్దరు, ముగ్గురికి సరుకులు పంపిణీ చేసి సోమవారం రండి అని వెనక్కు పంపించి వేశారు. చిత్తూరు నగరంలోనే కాకుండా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరో వైపు అనేక ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించటంతో గంటల తరబడి ఎండలో వేచి ఉండక తప్పలేదు. డోర్ డెలివరీ లేకపోవటంతో రెండు, మూడు కిలోమీటర్ల నుంచి లబ్దిదారులు రేషన్ దుకాణాలకు తరలిరావడం కనిపించింది. గంటల తరబడి వేచి ఉండి రేషన్ తీసుకుని నెత్తిన మోసుకుని ఎండలోనే సొంత ఊర్లకు తిరిగి వెళ్తూ కనిపించారు. మరి కొన్ని చోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోకపోవటంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంకొన్ని చోట్ల దుకాణాలు ఆలస్యంగా తెరుచుకోవడంతో అప్పటి వరకు లబ్ధిదారులు పడిగాపులు గాశారు.ఐదు కేజీలకు పది కిలోమీటర్లునాకు 85 సంవత్సరాలు. నా కు తోడు ఎవరూ లేరు. ప్రభు త్వం అందించే ఐదు కేజీల బియ్యానికి సుమారు మూడు కిలోమీటర్లు అడవి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లాలి. రోడ్డుపై వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో వాహనం ద్వారా ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేసేవారు. నేడు కిలోమీటర్ల దూరం నడక తప్పడం లేదు.– బొజ్జమ్మ, జగన్నాథపురం ఎస్టీ కాలనీ, కార్వేటినగరం మండలంకూలి పనులు వదులుకుని..రేషన్ కోసం పేదవాడి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కూటమి పాలన వచ్చాక రేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డోర్ డెలివరీ రద్దు చేయటంతో ఆ రేషన్ కోసం కూలీ నాలీ చేసుకుని బతికేటోళ్లు అనేక మంది ఆదివారం పనులన్నీ మానేశారు. ఒకటో తేదీ ప్రారంభిస్తారు కనుక కచ్చితంగా రేషన్ తీసుకోవచ్చని భావించి అనేక మంది కూలీ పనులు మానేసి దుకాణాలకు చేరుకున్నారు. ఇదే విషయం అక్కడున్న వారు చర్చించుకోవటం కనిపించింది. చేసేది లేక కూటమి పాలకులను తిట్టుకుంటూ లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లిపోవటం కనిపించింది.జాడలేని కంది పప్పుకూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. ఆదివారం ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ దుకాణాల్లోనూ కందిపప్పు పూర్తిగా సరఫరా చేయలేదు. చక్కెర అరకొరగానే ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,339 చౌకదుకాణాలు ఉన్నాయి. ఈ చౌక దుకాణాల పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డు దారులు ఉన్నారు. ఈ నెల కోటా కింద 8,320 మెట్రిక్ టన్నుల బియ్యం, 256 మెట్రిక్ టన్నుల చక్కెర సరఫరా చేశారు. కందిపప్పు మాత్రం సరఫరా చేయలేదని తెలిసింది. కార్డు దారులకు బియ్యం, అరకొర చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సర్కా రు బడుల్లో చదువుతున్న పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు సాధించేలా చర్యలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే దక్కింది. ప్రతి పేద విద్యార్థి అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ఆశయంతో మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేశారు. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ చేసే ఒక్కొక్క ట్యాబ్, రూ.15,500 విలువ చేసే బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి విద్యార్థికి రూ.33 వేల విలువ చేసే లబ్ధిని చేకూర్చారు. పాఠాలు బోధించే అన్ని సబ్జెక్టుల టీచర్లకు సైతం ట్యాబులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆ ట్యాబుల్లో 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ను సైతం లోడ్ చేసి అందజేశారు. ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి పంపిణీ చేశారు. ఈ ట్యాబ్లను అందుకున్న విద్యార్థులు తమ విద్యాసామర్థ్యాలను పెంచుకుని ప్రస్తుతం విద్యలో ముందడుగు వేస్తున్నారు.గత వైఎస్సార్సీపీ సర్కారులో ఉచితంగా అందజేసిన ట్యాబ్ల వివరాలు.. -
బదిలీల్లో ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో అధికారుల ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్టీఏ ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలకు చేసిన చట్టం అధికారులకు చుట్టం అయ్యిందే తప్ప ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న ప్రతి పూటకో నిర్ణయం వివాదంగా ఉందన్నారు. గత మూడేళ్లుగా ఉద్యోగోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్స్ 196 మంది బదిలీకి దరఖాస్తు చేసుకుని పీఎస్హెచ్ఎంగా వెళ్లాలని, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, విడో, విడాకులు తీసుకున్న మహిళలపై దుర్మార్గ నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతర తెలుగు మాధ్యమం లేకుండా చేయడం అన్యాయమన్నారు. విద్యార్థి నిష్పత్తి 1:40 కాకుండా 1:49 చేసి మిగులు టీచర్లను ప్రాథమిక బడులకు తరలించడం పద్ధతి కాదని విమర్శించారు. చట్టంలోని నియమ, నిబంధనలను పాటించకుండా టీచర్ల వ్యతిరేక విధానాలతో 6304 మంది ఎస్జీటీలు ఉద్యోగోన్నతికి నోచుకోక నష్టపోయారన్నారు. -
ఇంటర్ అడ్మిషన్ల సంగతేంటి?
● మండలాలకు చేరిన పాఠ్యపుస్తకాలు ● అడ్మిషన్ల ఊసే ఎత్తని ఇంటర్మీడియట్ అధికారులు ● నేడు జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం ● వైఎస్సార్సీపీ సర్కారులో మెరుగుపడ్డ విద్యాసంస్థలు చిత్తూరు కలెక్టరేట్ : జూనియర్ కళాశాలలకు ఈ నెల 1వ తేదీతో వేసవి సెలవులు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందే మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను ఇంటర్మీడియట్ అధికారులు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చేరవేశారు. సోమవారం నుంచి కళాశాలలు పున: ప్రారంభం కానుండడంతో నూతన అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టారు. ఇటీవల జూనియర్ కళాశాలల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన లెక్చరర్లు కొత్త కళాశాలల్లో విధుల్లో చేరనున్నారు. 74 కళాశాలలకు పాఠ్యపుస్తకాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 ప్రభుత్వ కళాశాలలకు ఇంటర్మీడియట్ అధికారులు ముందస్తుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయా కళాశాలలు శుభ్రం చేయించి పున:ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 31 ప్రభుత్వ, కేజీబీవీ 8, హైస్కూల్ ప్లస్ 28, ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలు 7 ఉన్నాయి. ఈ కళాశాలలకు మొదటి సంవత్సరానికి సంబంధించి 28,807, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,464 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. కానరాని ముందస్తు ప్రణాళిక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గత విద్యాసంవత్సరం అధిక శాతం పరీక్షల్లో ఫెయిలయ్యారు. గత విద్యా సంవత్సరంలో పటిష్ట ప్రణాళిక, తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. అడ్మిషన్ల మాటే మరిచారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు గతంలో పటిష్ట ప్రణాళిను అమలు చేసేవారు. ఊరూరా ప్రచారం నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా అడ్మిషన్ల ప్రచారం ఊసే కనిపించలేదు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ముందస్తుగా అడ్మిషన్ల వేటలో ఉంటే ప్రభుత్వ కళాశాలలు మాత్రం తమకెందుకులే అన్న ధోరణిలో ఉన్నాయి. ప్రతి ఏటా గతం కంటే అడ్మిషన్లను పెంచేలా చర్యలు చేపట్టేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం అలాంటి చర్యలేమీ జిల్లాలో జాడలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు అంతంతమాత్రమే జరుగుతాయని పలువురు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సర్కారులో మెరుగు గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగుపడ్డాయి. 2019వ సంవత్సరానికి ముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌళిక వసతులు అరకొరగా ఉండేవి. వాటిని మెరుగుపరిచేందుకు అప్పటి టీడీపీ సర్కారు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నాడు నేడు పథకంతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు చేసింది. ప్రస్తుత కూటమి టీడీపీ సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి మాటే మరిచింది. జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31 కేజీబీవీ 08 హైస్కూల్ ప్లస్ 28 ఏపీ మోడల్ కళాశాలలు 07 మొత్తం కళాశాలలు 74 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,464 -
కిటకిటలాడిన బోయకొండ
జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు ఆదివారం భక్తులు తరలిరావడంతో కిటకిటలాడింది. ● చిత్తూరు నగరం సత్యనారాయణపురం ప్రాంతంలోని 60వ షాపులో ఉదయం 10 గంటలకు సర్వర్ మొరాయించింది. దీంతో డీలర్ బయోమెట్రిక్ మిషన్ను కార్యాలయానికి ఇచ్చి పంపారు. అక్కడికెళ్లి చూస్తే నగరమంతా సర్వర్ సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో కార్డుదారులు గంటలకొద్దీ పడిగాపులు కాశా రు. మధ్యాహ్నం వరకు రేషన్కోసం నిరీక్షించి నీరసించి పోయారు. ఈ పక్కన ఉన్న షాపులో కార్డుదారులను గదమాయిస్తూ బెదిరింపులకు గురిచేశారు. అన్ని చోట్ల నీడ కల్పించాలని చెప్పినా అలాంటివేవీ కనిపించలేదు. – 8లో– 8లో -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీన సోమవా రం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. పోలీసు కార్యాలయంలో.. చిత్తూరు అర్బన్: నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. నేడు పులిగుండు వద్ద యోగాంధ్ర చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద ఈ నెల 2వ తేదీన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం క్షేత్రస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పులిగుండు వద్ద నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్రను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇది వరకే కాణిపాకంలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 2వ తేదీన పులిగుండు వద్ద దాదాపు 2 వేల మందితో కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. డీఈవో కార్యాలయంలో ప్రక్షాళనచిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కీలక శాఖల్లో ఒకటైన విద్యాశాఖ(డీఈవో) కార్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. ఈ మేరకు ఆ కార్యాలయంలో ఏళ్ల తరబడి కొందరు సూపరింటెండెంట్లు ఒకే చోట పాతుకుపోయారు. వారందరికీ ఈ బదిలీల్లో స్థానచలనం కల్పించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీచేశారు. రాయలసీమ జోన్ పరిధిలో నిర్వహించిన బదిలీల్లో పలువురు సూపరింటెండెంట్లకు బదిలీలు నిర్వహించారు. ఇందులో చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు వీజీ రమణ, సత్యనారాయణను వైఎస్సార్ కడప జిల్లా (డీఈవో కార్యాలయం)కు బదిలీ చేశారు. చిత్తూరు డీఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్లు ప్రేమకుమారిని వైఎస్సార్ కడప జిల్లా సమగ్రశిక్ష శాఖకు, రామ్కుమార్ను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు సూపరింటెండెంట్లకు స్థానచలనం కల్పించారు. నూతన సూపరింటెండెంట్లు వీరే ప్రస్తుత బదిలీల్లో ఇతర జిల్లాల నుంచి పలువురు సూపరింటెండెంట్లు చిత్తూరు డీఈవో కార్యాలయానికి విచ్చేయనున్నారు. తిరుపతి జిల్లా పాఠ్యపుస్తకాల గోడౌన్ సూపరింటెండెంట్ గా ఉన్న రమేష్, కర్నూలు జిల్లా డీఈవో కార్యాలయంలో ఉన్న రవికుమార్కు చిత్తూరు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నందకుమార్, చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణకుమారికి ఉద్యోగోన్నతులు కల్పించారు. ఆ ఇద్దరినీ చిత్తూరు డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్లు నియమిస్తున్నట్లు ఆర్జేడీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మరో రెండు కుంకీలు
పలమనేరు: మండలంలోని మొసలిమడుగు ఏనుగుల శిబిరానికి ఆదివారం మరో రెండు ఏనుగులను స్థానిక అటవీ అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడి క్యాంపునకు ఇప్పటికే కర్ణాటకలోని మైసూరునుంచి శిక్షణ పొందిన నాలుగు కుంకీ ఏనుగులను తరలించారు. దీంతోపాటు కుప్పం ఫారెస్ట్ పరిధిలోని రామకుప్పం మండలం ననియాల క్యాంపులోని వినాయక, జయంత్ అని పిలిచే రెండు కుంకీ ఏనుగులను అధికారులు ఇక్కడికి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. దీంతో ఇక్కడి క్యాంపులో మొత్తం ఆరు కుంకీలు ఉన్నాయి. వీటికి అవసరమైన మేతను అధికారులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు స్థానిక ఎఫ్ఆర్వో నారాయణ తెలిపారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో ఏనుగులను అదుపు చేయనున్నారు. -
కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబుచేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలన్నీ నిండి కిటకిటలాడాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు
ఉత్సవాల ఆరంభం సందర్భంగా సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులుతిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈనెల 2వ తేదీ సోమవారం నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ వీఆర్.శాంతి, ఏఈఓ కె.మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ ధనుంజయరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7.02 నుంచి 7.20 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగనున్నాయి. -
రాష్ట్ర ప్రజలకూ తప్పని వెన్నుపోటు
కార్వేటినగరం: పిల్లనిచ్చిన సొంత మామనే కాదు.. అధికారం కోసం యావత్తు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం చంద్రబాబుదే అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. ఆయన ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో వెన్నుపోటు దినం పోస్టర్ను నాయకులతో కలసి ఆవిష్కరించారు. నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగనన్న గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నేడు వాటిని నెరవ్చేకుండా ప్రజలను మభ్యపట్టే కార్యక్రమం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్ మణి, నాయకులు జనార్దన్, రాజశేఖర్రెడ్డి, హరిరెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కుప్పయ్య, నియోజకవర్గ యువత అధ్యక్షుడు కిషోర్రెడ్డి, యువనాయకుడు శ్యామ్, కాళప్ప, మణి పాల్గొన్నారు. -
జేఎల్ఎంల ఇష్టారాజ్యం!
పలమనేరు: గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలొచ్చినా వెంటనే బాగు చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ సేవల్లో భాగంగా జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) విధానాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఇందులోని ఉద్యోగులు పలు రకాల సర్వేల్లో మునిగిపోయారు. ఫలితంగా సచివాలయాల్లో ఎలాంటి సేవలు లేకుండా బోసిపోయింది. ఈ నేపత్యంలో అత్యవసర సేవలంటూ హాజరు నుంచి వెసులుబాటు ఉన్న జూనియర్ లైన్మన్లు అటు సచివాలయాలకు రాకుండా ఇలా ప్రజలకు అవసరమైన సేవలు చేయకుండా నెల నెలా జీతాలు మాత్రం తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిని పర్యవేక్షించాల్సిన సంబంధిత మండలాల ట్రాన్స్కో అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఇక సచివాలయాలకు బాధ్యులైన ఎంపీడీవోలకు వీరిపై ఆజమాయిషీ లేదు. జేఎల్ఎం విధులు ఆయా పంచాయతీలోని సీనియర్ లైన్మన్కు సహాయకులుగా ఉంటూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పంచాయతీలో నూతన విద్యుత్ స్తంభాలు, లైన్ల ఏర్పాటు చేపట్టాలి. ఏదేని మరమ్మతలు వస్తే వెంటనే స్పందించాలి. ప్రజలకు అవసరమైన విద్యుత్ సమస్యలను వెంటనే బాగుచేయాలి. ఎందుకంటే మండల స్థాయిలో ట్రాన్స్కోలో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతుందనే గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీరిని నియమించి సచివాలయాలకు అనుసంధానం చేసింది. జరుగుతున్నదేమిటంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయంలో పదిశాఖల చెందిన వారికి పలు రకాల సర్వేలను అంటగట్టింది. అయితే వీరు ఉదయం, సాయంత్రం విధిగా సచివాయలాల వద్దకెళ్లి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అత్యవసర సేవల్లో ఉన్నందున జేఎల్ఎంలు మాత్రం ఏ సచివాలయం వద్దనైనా హాజరు వేసుకునే వెసులుబాటు ఉంది. దీంతోపాటు వీరికి ఎలాంటి సర్వేలు లేవు. దీన్ని ఆసరాగా చేసుకొని 80శాతం మంది జేఎల్ఎంలు అసలు విధులకు హాజరు కావడంలేదు. కనీసం సంబంధిత ట్రాన్స్కో ఏఈలు చెప్పిన పనులు చేయడం లేదు. ప్రజలకు సంబంధించిన సేవలు చేయాలన్నా ఎంతో కొంత చేతిలో పెడితేగానీ పనులకు రావడంలేదు. ఎందుకంటే వీరిపై అజమాయిషీ ఎంపీడీవోలకు లేదు. జేఎల్ఎంలపై ఎంపీడీవో ఫిర్యాదు జిల్లాలో మొత్తంగా వీరి పనితీరు సరిగ్గాలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బైరెడ్డిపల్లి ఎంపీడీవో రాజేంద్రబాలాజీ తాజాగా ఆ మండలంలోని పదిమంది జేఎల్ఎంలు విధులకు రావడంలేదని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. వీరికి జీతాలను ఆపేయాలని సూచించారు. కానీ ట్రాన్స్కో దీనిపై అసలు పట్టించుకోలేదు. దీంతో జేఎల్ఎంలు ఇప్పుడు ఎవరిమాట వినే పరిస్థితి లేదని తెలిసింది. నెలకు జీతం రూ.35వేలు వృథానేనా? సచివాలయాల్లోని జేఎల్ఎంలకు నెలకు వేతనం రూ.35వేలుగా ఉంది. అంటే రోజుకి వెయ్యికిపైగానే. కానీ వీరు చేసేందుకు ఎలాంటి పనిలేకుండా పోయింది. అసలు వీరిని పట్టించుకోవడం లేదు. వీరిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరిని ఆయా శాఖలకు అనుసంధానం చేస్తామన్నారు. మళ్లీ సచివాలయాలను బలోపేతం చేస్తామన్నారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోక సచివాలయ వ్యవస్థ రోజు రోజుకూ నిర్వీర్యమవుతోంది. విధులకు డుమ్మా కొట్టి జీతాలు పొందుతున్నవైనం పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు అత్యవసర సేవల పేరిట ఆడింది ఆట పాడిందేపాట జేఎల్ఎంల సమాచారం జిల్లాలో మొత్తం మండలాలు : 31 గ్రామపంచాయతీలు : 797 మొత్తం గ్రామాలు : 822 సచివాలయాలు : 11,158 వీటిలో జూనియర్ లైన్మన్లు : 11వేలమంది -
ఆగని గజరాజుల దాడులు
పెద్దపంజాణి: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఏనుగుల నుంచి రక్షణ లేకుండా పోతోంది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాపల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్, ఆకులవారిపల్లి, బేరుపల్లి, రాగిమాకులపల్లి, గౌదమాకులపల్లి, కమ్మపాళ్యం, గంకొండ, చీకలదిన్నేపల్లి తదితర గ్రామాలు అటవీ సరిహద్దులు కలిగి ఉన్నాయి. తరచూ ఏదో ఒక గ్రామంలో పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చింది. అయినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఆదివారం వేకువజామున పలమనేరు రేంజ్ కీలపట్ల ఫారెస్టు బీటు నుంచి వచ్చిన ఏనుగుల గుంపు తిప్పిరెడ్డిపల్లెకు చెందిన చంద్రారెడ్డి, అమరారెడ్డి, బాబు రెడ్డి తదితరుల మామిడి తోటలపై విరుచుకుపడ్డాయి. మామిడికొమ్మలను విరిచేసి సుమారు ఒక టన్ను కవర్లు కట్టిన బేనీషా, ఖాదర్, ఇమామ్పసంద్ మామడి కాయలను నెమరువేశాయి. ఈ దాడుల్లో దాదాపు రూ.50 వేల నష్టం జరిగినట్లు అంచనా. ఉదయం తోటలోకి వెళ్లిన రైతులు ఏనుగుల విధ్వంసాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధిత రైతులు వెంటనే జిల్లా అటవీశాఖ అధికారిణికి సమాచారం చేరవేశారు. స్పందించిన ఆమె క్షేత్రస్థాయి అధికారులను సంఘటనా స్థలానికి పంపించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తన కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. -
తమిళనాడు, ఏపీ ఉద్యాన అధికారుల చర్చలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పండ్ల గుజ్జు పరిశ్రమల ప్రలోభాలకు రైతులు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మామిడి ధరలపై క్రిష్ణగిరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సమన్వయ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెరెక్టర్ మోహన్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం ఆదివారం చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ కార్యాలయం చేరుకుంది. ఉద్యానశాఖాధికారి మధుసూదన్రెడ్డి, ఏడీ కోటేశ్వర్రావుతో మామిడి ధరలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. క్రిష్ణగిరి, చిత్తూరు జిల్లాలో మామిడి ధరల్లో తేడా లేకుండా చూసుకోవాలని తీర్మానించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు రెండు జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. -
చట్టం పకడ్బందీగా అమలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాల, కౌమార కార్మిక వ్యవస్థ (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 (సవరణ చట్టం 2016)ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..14 ఏళ్లలోపు బాలలను పనిలోకి అనుమతించకూడదన్నారు. 18 ఏళ్లలోపు వారిని పనుల్లోకి తీసుకోవడం నేరమన్నారు. బాల కార్మికులకు సంబంధించి ఫిర్యాదులుంటే 1098 నంబర్లో సంప్రదించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇటుక బట్టీలు, మైనింగ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డెయిరీ పరిశ్రమల్లో బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం గోడ పత్రికలను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఓంకార్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, రియల్ ఎడ్యుకేషన్ , లిటరసీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో భరోసా
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,52,743 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఏటా రూ.229.11 కోట్లు ఖర్చు చేసింది. అంతే కాకుండా జిల్లాలోని రూరల్లో ఉన్న 95,994 స్వయం సహాయక గ్రూపులకు గాను రూ.196.98 కోట్లు, అర్బన్లోని 12933 స్వయం సహాయక గ్రూపులకు గాను రూ.19.90 కోట్లు చొప్పున సున్నా వడ్డీ అందించి ఆదుకుంది. వైఎస్సార్ చేయూత ద్వారా రూరల్లో 172616 మందికి రూ.323.66 కోట్లు, అర్బన్ లో 19144 మందికి రూ.35.9 కోట్లు, కాపు నేస్తం పథకంలో 6656 మందికి రూ.10 కోట్లు, వైఎస్సార్ ఆసరా పథకంలో రూరల్లో 270197 మందికి రూ.568.51 కోట్లు, అర్బన్లో 47026 మందికి రూ.47.70 కోట్లు చొప్పున అందించి మహిళల మనస్సుల్లో గత సీఎం వైఎస్ జగన్ సర్కార్ చెరగని ముద్ర వేసింది. వైఎస్సార్ సీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాభిషేకం గత వైఎస్సార్సీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో 1,67,308 మందికి ఉచిత ఇళ్ల పట్టాలను అందజేసి పేదవాడి సొంతింటి కల ను నెరవేర్చింది. వారందరికీ ఉచితంగా గృహాలు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేశారు. కులం,మతం, ప్రాంతం, పార్టీలు ఏవీ చూడకుండా ఇంటి పట్టాలను మంజూరు చేసి మహిళల పేరుతో ఉచితంగా రిజిస్టర్ చేయించారు. గతంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 1039 లే అవుట్లో పక్కాగృహాలతో కళకళలాడుతున్నాయి. -
తమ్ముళ్ల వాగ్వాదం
జీడీనెల్లూరు మండలంలో టీడీపీ ఇరు వర్గాలు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మాట నిలబెట్టుకున్నారు గత ఐదేళ్ల పాటు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలు అమలు చేసి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారు. నాలుగు సంవత్సరాలు చేయూత ఆర్థిక సహాయంతో పాటు నా పిల్లలకు అమ్మఒడి పథకం లబ్ధి చేకూరింది. ప్రస్తుత కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. – సలోమీ, గుడిపాల మండలం ఆడబిడ్డ నిధి ఇవ్వాలి ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకం అ మలు చేసి ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్నా రు. ఇంత వరకు ఆ పథ కం అమలు గురించే పట్టించుకోలేదు. గతంలో ఏటా నా ఖాతాలోకి ఈబీసీ నేస్తం పథకం డబ్బులను జమచేశారు. గత సర్కారు పాలనలో అందిన సంక్షేమ పథకాల ఆర్థిక సాయంతో కిరాణం పెట్టుకున్నాను. ఆడబిడ్డ నిధి అమలు చేయాలి. – సరసమ్మ, లబ్దిదారురాలు, చిత్తూరు మండలం కిరాణా కొట్టు నడుపుతున్నా గత సర్కారు పాలనలో కాపునేస్తం ద్వారా నాకు రూ.60 వేలు ఆర్ధికసా య ం అందింది. ఆ సాయంతో దుకాణం నడుపుతూ కుటుంబానికి అండగా ఉన్నా. ప్రస్తుతం ఇలాంటి సాయం అందలేదు. ప్రస్తుత ప్రభు త్వం కాపులకు ప్రత్యేకంగా ఎలాంటి ఆర్ధిక సాయం అందించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏ హామీ అమలు చేయ లేదు. – కాటమ్మ, అత్తూరు, నిండ్రమండలం చిత్తూరు జిల్లా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు ప్రస్తుత కూటమి ప్రభు త్వం సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియడం లే దు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇంత వరకు ఊసేలేదు. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో ఈబీసీ నేస్తం నగదు అందుకున్నాను. ఆ నగదుతో కుట్టుమిషన్ కొనుగోలు చేసుకుని అభివృద్ధి చెందా. – వనమ్మ, లబ్ధిదారురాలు, చిత్తూరు మండలం – 8లో -
ఆడబిడ్డకు అగచాట్లు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన జూన్ 12కు ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై మహిళలు మండి పడుతున్నారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 అందజేస్తామని చెప్పినా ఆ ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నా ఇప్పటికీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటి వరకు సొమ్ము అందించలేదు. అదే వైఎస్ జగనన్్ సర్కార్ హయాంలో రెండేళ్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెనుకంజ వేయకుండా ప్రజలను ఆదుకున్న పరిస్థితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. -
● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే
తమ్ముళ్ల వాగ్వాదం గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పంచాయతీలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్ థామస్ ఎదుటే తమ్ముళ్ల వాగ్వాదం చోటుచేసుకుంది. వింజం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛను అందించారు. అనంతరం వింజం పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలి అంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించగా అదే గ్రామంలోని మరొక వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని మరో మండిపడింది. దీంతో ప్రారంభోత్సవం చేయకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ తతంగం అంతా నడిరోడ్డుపై జరగడంతో ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవకతవకలపై విచారణ చిత్తూరు రూర ల్(కాణిపాకం): ఏపీ హంస అసోసియేషన్ అవకతవకలపై రాష్ట్ర వైద్య శాఖ విచారణకు ఆదేశించింది. ఈ నెల 3వ తేదిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ ముందు హాజరు కావాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యకుడికి నోటీసులు జారీ చేసింది. ఏపీ హంస సంఘం బోగస్ సభ్యులను చూపుతున్నారని, బోగస్ ఎన్నికల నిర్వహిస్తున్నారని, డబ్బులకు ఆఫీస్ బేరర్ల పోస్టులు అమ్ముకుంటున్నారని, ఆ పోస్టుల ద్వారా బదిలీల నుంచి తప్పించేలా చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అందుకే విచారణకు ఆదేశించింది. -
ఒంటరి ఏనుగు హల్చల్
రొంపిచెర్ల : మండలంలోని బండ కిందపల్లె, పెద్దగొట్టిగల్లు పంచాయతీలో శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం పూట్టావారిపల్లె నుంచి రాత్రి బయలుదేరి కమోళ్లపల్లె, మటోళ్లపల్లె, బండకిందపల్లె దళిత వా డ రామిరెడ్డిగారిపల్లె వైపు వెళ్లింది. మటోళ్లపల్లె సమీపంలోని గాలి చెరువు వద్ద అర్ధరాత్రి పెద్దగా శబ్దాలు చేసుకుంటూ రావడంతో మామిడి తోటల వద్ద కాపలాగా ఉన్న రెడ్డెప్ప దంపతులు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హరికృష్ణారెడ్డి మామిడి తోటలో టెంకాయ చెట్టును పెకలించింది. భాస్కర్ రెడ్డి పొలం వద్ద ఉన్న ముళ్ల కంచెను విరిచి బండకిందపల్లె వైపు వెళ్లింది. రొంపిచెర్ల మండల సరిహద్దులోని మామిడి తోటల్లో ఒంటరి ఏనుగు ఉండడంతో రైతులు పరుగులు తీశారు. హరికృష్ణారెడ్డి మామిడి తోటలో టెంకాయ చెట్టును పెకిలించిన ఏనుగు -
మారిన సర్కారు బడుల రూపురేఖలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో పూర్తిగా రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతులు సమకూరాయి. పూర్వపు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థపై గత ఐదేళ్లు ప్రత్యేక దృష్టి పెట్టడంతో విద్యాభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో నాడు నేడు పథకానికి వేల కోట్లు ఖర్చు చేశారు. 2019కు ముందు టీడీపీ పాలనలో సర్కారు బడుల్లో చెట్ల కింద చదువులు .. వానొస్తే బడులకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి. రంగులు వెలిసిపోయి...బూజు పట్టిన గోడలతో సర్కారు బడులు దర్శనమిచ్చేవి. అలాంటి పరిస్థితులను గత ఐదేళ్లల్లో రూపుమాపారు. ఒకే ఒక్కడు గత ఐదేళ్లల్లో నాడు– నేడు పథకం అమలు వివరాలునియోజక మొత్తం ఖర్చు చేసిన వర్గం పాఠశాలలు బడ్జెట్ (రూ.కోట్లలో) చిత్తూరు 130 41.63 జీడీ నెల్లూరు 273 80.94 కుప్పం 439 152.64 నగరి 138 43.95 పలమనేరు 484 178.99 పుంగనూరు 317 93.90 పూతలపట్టు 215 58.27 మొత్తం 1996 650.32 -
ఇక చౌక దోపిడీ!
● మళ్లీ పాత పద్ధతుల్లో రేషన్ పంపిణీ ● డీలర్ల చేతికి పంపిణీ పగ్గాలు ● దండుకోవడానికి ప్రభుత్వం సహకారం ● దాచుకున్న డబ్బాలు, గోనెసంచులు మళ్లీ తెరపైకి ● అక్రమాలకు అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు ● నేటి నుంచి చౌక దుకాణాల నుంచి పంపిణీ జిల్లా సమాచారం షాపుల సంఖ్య : 1339 కార్డుదారులసంఖ్య : 5.40 లక్షలు బియ్యం సరఫరా ప్రతినెలా : 9వేల టన్నులు చక్కెర : 256 టన్నులు తొలగించిన డీలర్ల సంఖ్య : 300 మంది తొలగించిన ఎండీయూ ఆపరేటర్ల సంఖ్య : 336 కాణిపాకం : జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. దీనికి కూటమి ప్రభుత్వం తోడవుతోంది. మళ్లీ పాత పద్ధతులకు శ్రీకారం చుట్టింది. దండుకోవడానికి దగ్గరుండి సహకరిస్తోంది. దీంతో రేషన్ పక్కదారి పట్టనుంది. డీలర్లు పాత డబ్బాలు, గోనె సంచులు బయటకు తీసి పూజలు చేస్తున్నారు. సరుకులు అమ్మకానికి తలుపులు తెరిచిపెట్టారు. అక్రమాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. నేటి నుంచి రేషన్ దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జిల్లాలో 1390 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా ప్రభుత్వం 9 టన్నుల వరకు బియ్యం , 250 టన్నుల వరకు చక్కెర మాత్రమే పంపిణీ చేస్తోంది. ఈ సరుకుల ఆధారంగానే చాలా మంది కార్డుదారులు జీవనం సాగిస్తున్నారు. ప్రతినెలా సరుకుల అందక, డీలర్లతో పోరాటం చేయలేక పస్తులతో గడిపిన క్షణాలను కార్డుదారులు మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నారు. పాత పద్ధతి రేషన్ పంపిణీపై భయపడుతున్నారు. 2019 ముందు రేషన్ పంపిణీ ఇలా.. 2019 ముందు రేషన్ పంపిణీ కోసం కార్డుదారులు పడిగాపులు కాసేవారు. అప్పట్లో ప్రజలకు సకాలంలో సరుకులు అందేవి కావు. కాస్త ఆలస్యమైతే రేషన్ లేదని వెనక్కి పంపించేసే వారు. ఇచ్చిన సరుకుల్లో కోతలు కనిపించేవి. గోనె సంచి, డబ్బాలతో తూక మేసి.. రేషన్మేసేసేవాళ్లు. ఇలా భారీగా రేషన్ల్లో కోతలు పడేవి. 2019 తర్వాత రేషన్ సరఫరా ఇలా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు మేలు చేసేలా చేసింది. ప్రధానంగా రేషన్ పంపిణీలో పారదర్శకతను తీసుకొచ్చింది. ఇంటింటికీ రేషన్ విధానాన్ని అమలు చేసింది. వాహనం కేటాయింపుతో పాటు ఎండీయూ ఆపరేటర్లను నియమించింది. ఈ విధానంతో ప్రతి నెలా 1వతేది నుంచి 17 తేదీ వరకు వీధి వీధికి వెళ్లి కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసేది. లేవలేని వృద్ధులు, నడవలేని వృద్ధులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇక పాత పద్ధతిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడింది. డీలర్ల ఆటలకు తాళం పడింది. ప్రసుత్తం కూటమి ప్రభుత్వం వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియాకు ఊపిరొచ్చింది. ప్రతినెలా లక్షల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు జోరందుకుంది. టన్నుల కొద్ది బియ్యం పోలీసుల కంటపడి వెలుగులోకి రావడంతో కూటమి నేతల అక్రమ వ్యాపారం బట్ట బయలైంది. అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తిన కూటమి నేతలు పలు రేషన్ డీలర్లతో చేతులు కలిపి ఈ దందాను నడిపిస్తున్నారు. అక్రమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న డీలర్లను తొలగించి వారికి అనుకూలంగా ఉన్న కూటమి నేతలకు డీలర్లుగా నియమించుకున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో 300 మంది డీలర్లను కొత్తగా నియమించారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న మహిళ పేరిట కూడా రేషన్ షాపు కేటాయించారంటే...దీని బట్టే రేషన్ బోగస్ను అంచనా వేయవచ్చు. అలాగే అక్రమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న 336 మంది ఎండీయూ ఆఫరేటర్లను తొలగించింది. దీంతో ఇంటింటా రేషన్ పంపిణీ వ్యవస్థ రోడ్డున పడింది. రాగులు, కందిపప్పునకు రాంరాం కందిపప్పునకు ప్రభుత్వం మంగళం పాడింది. రాగులు పంపిణీ ఆపేసింది. నేటి నుంచి మళ్లీ పాత పద్ధతులు రానున్నాయి. రోజుకు 8 గంటలు రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. డీలర్లు వారి వద్ద కార్డుదారులను క్యూ కట్టించనున్నారు. అప్పుడే కొన్ని చోట్ల డబ్బాలు, గోనె సంచులు సిద్ధం చేసి ఉంచారు. అన్ని రకాలుగా కోతలు పెట్టేందుకు సంసిద్ధమయ్యారు. రేషన్ పండగ పేరుతో కార్డుదారుల నుంచి పిండుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పాత పద్ధతి రేషన్ పంపిణీపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏడాది కాలంలో పట్టుకున్న రేషన్ వివరాలు ఇలా.. నెల 6ఏ పట్టుబడ్డ బియ్యం కేసులు (క్వింటాళ్లల్లో) జూన్–2024 1 6.16 ఆగష్టు 8 131.9 సెప్టంబర్ 6 93.98 అక్టోబర్ 1 24.1 నవంబర్ 3 18.65 డిసెంబర్ 4 316.56 ఫిబ్రవరి–25 3 110.99 మార్చి 2 104.57 తూకంలో తేడాలొస్తే చర్యలు రేషన్ పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూస్తాం. అందుకే కొంత మందితో కూడిన ఓ టీంను ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాం. మళ్లీ ఐదు రోజులపాటు జిల్లాలోనే ఉంటాం. రేషన్ పంపిణీలో ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తాం. కోతలుంటే చర్యలు ఉంటాయి. కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – రాజేంద్ర ప్రసాద్, ప్రత్యేక అధికారి, చిత్తూరు -
ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం తిరుపతి– చైన్నె జాతీయ రహదారిపై కదిరి మంగళం బైపాస్ వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో చంద్రశేఖర్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసు కథనం మేరకు వివరాలు ఇలా.. వడమాలపేట కట్టకింద ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ కదిరి మంగళం బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సుభాషిణి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మారెడ్డి తెలిపారు. -
మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ పోటీలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా తరపున మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొని ప్రతిభ చాటారు. బడి పిల్లలకు శుభ్రత, ప్రకృతి వైపరీత్యాలు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, అగ్నిప్రమాద సమయంలో ఎలా తప్పించుకోవాలనే అంశాలపై వంట కార్మికులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బందికి పోటీలు నిర్వహించగా ఇందులో చిత్తూరు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం లభించింది. ఈ అవార్డు పొందిన, గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను డీఈవో వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఆదర్శ గ్రామాల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఎంపిక చేసిన 5 ఆదర్శ గ్రామాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 5 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల్లో వందశాతం సోలార్ విధానం ప్రవేశపెట్టాలన్నారు. ఇందులో ఒక పంచాయతీని ఎంపిక చేసి మొదట శతశాతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. పెనుమూరు, గుడిపాలలోని బొమ్మసముద్రం, విజయపురంలోని పల్లూరు, చౌడేపల్లె, కల్లూరు పంచాయతీలను ఎంపిక చేశారన్నారు. వీటికి సంబంధించి సంబంధిత ఈఈలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అక్కడ వసతులు, సోలార్ విధానం పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారు ఎంత మంది ఉన్నవారు, ఇతర కేటగిరీ సర్వీసుల వివరాలు, మొత్తం సర్వీసుల సంఖ్య వివరాలు తీసుకుంటున్నామన్నారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తే కేంద్రం సంబంధిత పంచాయతీ అభివృద్ధి పనులకు రూ.కోటి నిధులు విడుదల చేస్తుందన్నారు. దుప్పిని కాల్చి చంపిన కేసులో జైలు కుప్పం : కుప్పం అటవీ రేంజ్ పరిధిలోని మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిను కాల్చిన కేసులో నిందితుడిని రిమాండుకు పంపినట్లు అటవీ శాఖ అధికారి జయశంకర్ తెలిపారు. కుప్పం మండలం వాలూరు గ్రామానికి చెందినా కనకరాజ్ గుడుపల్లె మండలం మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వెటాడి నాటు తుపాకితో కాల్చి చంపినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు వచ్చినా సమాచారం మేరుకు మల్లప్పకొండ ప్రాంతంలో పర్యవేక్షించగా కనకరాజ్ దుప్పి చర్మంతో ద్విచక్ర వాహనంలో వెళుతుండగా అదపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడితో పాటు నాటు తుపాకి , ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఆయన తెలిపారు. -
వర్షానికి నేలకూలిన వృక్షం
– ముగ్గురికి తీవ్ర గాయాలు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ముగ్గురిని ఆసుపత్రి పాలు చేసింది. నగరంలో రాత్రి 45 నిమిషాల పాటు వర్షం కురిసింది. పలమనేరు రోడ్డులో చెట్టు కింద ఉండగా ఉన్నపలంగా చెట్టు రోడ్డుపై కూలిపోయింది. ఆ సమయంలో కింద పడ్డ చెట్టు కొమ్మ తగిలి చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లికి చెందిన రత్నవేలు, నగరంలోని మిట్టూరుకు చెందిన యశ్వంత్, తమిళనాడులోని వేలూరుకు చెందిన గోవిందస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు స్థానికులు రోడ్డుపై చెట్టును తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులేకుండా చేశారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
యాదమరి : ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చిత్తూరు మండలం తుమ్మిండపాల్యంకు చెందిన సదా కుమారుడు సిద్దు(11), తమిళనాడు రాష్ట్రం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజ్కుమార్ కుమారుడు అవినాష్ (13) మండల పరిధి కీనాటంపల్లి పంచాయతీ కోయూరులోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చారు. శుక్రవారం గ్రామానికి సమీపంలో ఉన్న కొత్తచెరువు కుంట వద్ద సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. ముందుగా కుంటలోకి దిగి ఆడుకుంటున్న చిన్నారి సిద్దు మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న అవినాష్ సిద్దుని కాపాడే యత్నంలో బురదలో కూరుకుపోయి మత్యువాత పడ్డారు. ఇది గమనించిన అటువైపుగా వెళ్తున్న కొందరు స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వస్తే ఇలా మృత్యుఒడికి చేరుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.ఒక రోజు హెడ్మాస్టర్లుచిత్తూరు కలెక్టరేట్ : సర్వీస్లో చేరినప్పటి నుంచి హెడ్మాస్టర్ కావలన్నది ప్రతి టీచర్ కల. అలాంటి కల ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరు టీచర్లకు నెరవేరింది. కానీ ఆ కల ఒక రోజుకు మాత్రమే మిగిలింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం ఓల్డ్ పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న శ్రీదేవి, తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్ మండలం జెడ్పీ పద్మావతిపురం హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా విధులు నిర్వహిస్తున్న తిమ్మసముద్రం సుధారాణి ఒక రోజు హైస్కూల్ హెచ్ఎంలుగా విధులు నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు టీచర్లు ఈ నెల 31 వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వీరికి ఈ నెల 29 న హైస్కూల్ హెచ్ఎం గా ఉద్యోగోన్నతి లభించింది.