breaking news
Chittoor District Latest News
-
సబ్సిడీ వివరాలు సరిచూసుకోండి
గుడిపాల: మామిడి సబ్సిడీకి సంబంధించి రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణా తెలిపారు. గురువారం బసవాపల్లెలో మామిడి సబ్సిడీకి సంబంధించి రైతులతో గ్రామసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫ్యా క్టరీలకు మామిడి కాయలు తోలిన రైతులు మరొకసారి వారి బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోవాలన్నారు. రైతుల సమక్షంలో వారి వివరాలను సచివాలయం వద్ద అతికించారు. అనంతరం పొలం పిలుస్తుందిలో భాగంగా చెరుకు, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వ్యవసాయాధికారి సంగీత, అగ్రికల్చర్ అసిస్టెంట్ యోగప్రియ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
డ్రోన్తో పేకాటరాయుళ్ల వేట!
– రూ.13,890 నగదు, సెల్ఫోన్లు, 2 బైక్లు సీజ్ రొంపిచెర్ల: పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రోన్ కెమెరాతో దాడి చేసి జూదరులను పట్టుకున్న సంఘటన కల్లూరు సర్కిల్ పరిధిలోని రొంపిచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ సీఐ సూర్యనారాయణ కథనం..గానుగచింత గ్రామ పంచాయతీలోని జగడంవారిపల్లె అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని స్థానిక పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ రంగంలోకి దిగారు. చిత్తూరు నుంచి పోలీసు సిబ్బంది పక్కా వ్యూహంతో వచ్చారు. అయితే అటవీప్రాంతం కావడంతో జూదరులను పట్టుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. దీంతో డ్రోన్ కెమెరా సాయంతో మామిడి తోటలో జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. దాడి చేసి గానుగచింత నగిరికి చెందిన ఎస్.మురళి(44), జి.రెడ్డి ప్రసాద్ (34) (జగడంవారిపల్లె), ఏ.విశ్వనాథ (45), (చంద్రగిరి), ఎన్.షౌకత్అలీ (44) (పెద్దమల్లెల కస్పా), ఏ.ఆనంద్(31) (కేవీపల్లె), కె.రమణారెడ్డి (63) (కాకులారంపల్లె), ముప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన కె.రెడ్డెప్ప (45)ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ13,890 నగదు, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. -
డైట్ కళశాలలో విద్యుత్ చౌర్యం
కార్వేటినగరం: డైట్ కళాశాలలో ఓ అధ్యాపకుడు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. డైట్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడికి ఎలక్ట్రిక్ కారు ఉంది. గత కొన్ని రోజులుగా అతను సమీపంలో ఉన్న వసతి గృహం నుంచి కారుకు చార్జింగ్ చేసేవాడు. గుర్తించిన విద్యార్థులు సదరు అధ్యాపకుడిని ప్రశ్నించగా.. ఆయన పట్టించుకునేవారు కాదు. పైగా ప్రాక్టికల్ మార్కులు తన దగ్గరే ఉన్నాయని, ఎవరికై నా చెబితే తగ్గించేస్థానని ఛాత్రోపాధ్యాయులను బెదిరించేవాడు. ఈ క్రమంలో తన కారుకు విద్యుత్ చార్జింగ్ చేస్తున్న వీడియో గురువారం హల్చల్ చేసింది. దీనిపై సంబంధిత విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పాలక మండలి పదవులకు 57 దరఖాస్తులు
చౌడేపల్లె: జిల్లాలో రెండవ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలక మండలి పదవుల నియామకానికి మొత్తం 57 మంది దరఖాస్తులు చేశారని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. గురువారం పుంగనూరు మండలం ఇటికినెల్లూరుకు చెందిన ఎస్కె. రమణారెడ్డి, ఆయన సతీమణి రతీదేవి, కుమారుడు రాజశేఖర్రెడ్డితోపాటు మరో 33 మంది సభ్యులు దరఖాస్తులను కూటమి నేతలతో కలిసి ఈఓకు అందజేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్కె రమణారెడ్డి, రతీదేవి గతంలో బోయకొండ ఆలయ పాలక మండలి చైర్మన్లుగా పనిచేశారు. మరోసారి చైర్మన్ బరిలో దిగారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్, సోమల సురేష్, యధుశేఖర్ నాయుడు, ఆసూరి బాలాజీ, కృష్ణంనాయుడు, కృష్ణానాయక్, బల్లాపురం నరేష్, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మామిడి బకాయిలు చెల్లించండి
పుత్తూరు: మామిడి రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని మామిడి రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి హేమలత డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మామిడి ఫ్యాక్టరీ యాజమాన్యాలు కేజీకి రూ.8, ప్రభుత్వం రూ.4తో కలిపి మొత్తం రూ.12 వంతున చెల్లించాలన్నారు. రోజులు గడిచిపోతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యాలుగానీ, ప్రభుత్వం గానీ నగదు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఐక్యంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు హరిబాబు, ఆనందనాయుడు, యువరాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి పుత్తూరు: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి నగరం రోడ్డు కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారం చేపట్టారు. యూనియన్ నాయకురాలు మునికుమారి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
రైల్వేస్టేషన్ అభివృద్ధి పను లు నెలల తరబడి చేస్తున్నారు. అంత మొత్తం నిధులు వచ్చినప్పుడు ఎంత వేగంగా పనులు చేయాలి..?. కానీ ఎప్పుడూ సాకు లు చెబుతూ..ఆలస్యం చేస్తున్నారు. ప్రయాణికులు, వారి కుటుంబీకులకు అసౌకర్యంగా ఉంది. – అశోక్కుమార్, మాజీ బ్యాంకు అధికారి, చిత్తూరు అన్ని రైళ్ల్లూ ఆగేలా చూడాలి పలు రైళ్లు ఆపకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్మీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వీటి పై ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఇటువైపు వచ్చే అన్ని రైళ్లు ఇక్కడ తప్పకుండా ఆగాలి. అప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. – సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చిత్తూరు స్మార్ట్సిటీ డెవలప్మెంట్ సొసైటీ -
హే..కృష్ణా!
అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి, ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా చెరువులు చాలావరకు ధ్వంసమయ్యాయి. వర్షాలు పడినా చెరువుల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ మీదుగా కుప్పం ఉప కాలువకు వస్తున్న కృష్ణా జలాలను పలమనేరు, కుప్పం ప్రాంతాల్లోని చెరువులుకు నింపాల్సి ఉంది. లేనిపక్షంలో జిల్లాలోని పడమటి మండలాలు ఎడారిగా మారే అవకాశం ఉంది.. ఈ క్రమంలో కూటమి నేతలు ఎలా స్పందిస్తారోనని రైతులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పలమనేరు: పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పలు చెరువులను కూటమి నేతలు చెరబట్టారు. చాలా చెరువుల్లో మట్టి, ఇసుక తవ్వేయడంతో గుంతలమయమయ్యాయి. వర్షాలొచ్చినా నీరు చేరక చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో భూగర్భజలాలు అడుగంటాయి. డివిజన్ పరిధిలో 80 వేల వ్యవసాయ బోర్లుండగా ఇప్పటికే 20 వేల బోర్లలో నీరు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు పడుతున్న వర్షాలతో వర్షపు నీరు చెరువుల్లోని గుంతలు కూడా నిండడం లేదు. నాలుగు రోజుల్లో కృష్ణా జలాలు కృష్ణా జలాలు చెర్లోపల్లి రిజర్వాయర్కు ఇప్పటికే చేరాయి. అక్కడి నుంచి పుంగనూరు, కుప్పం ఉపకాలువ మీదుగా మరో నాలుగైదు రోజుల్లో పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి(224.5కిమీ)కి చేరుకునే అవకాశం ఉంది. ఆపై ఇవి బైరెడ్డిపల్లి, వీకోట మీదుగా కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రంలోకి చేరుకోనున్నాయి. కూటమి నేతల దెబ్బకు ధ్వంసమైన చెరువులు ఇక్కడి చెరువుల అనుసంధానమే లక్ష్యం హంద్రీ–నీవా– సుజల స్రవంతి పథకంలో భాగంగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన(కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు) ల్లోని 6,025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగు నీటిని అందించడమే దీని లక్ష్యం. ఇందుకోసం కృష్ణా నది నుంచి 120 టీఎంసీల నీటిని ఇక్కడికి తరలిస్తున్నారు. పుంగనూరు ఉపకాలువ నుంచి 143.9 కి.మీ మేర ప్రయాణించి కుప్పం ఉపకాలువ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాలకు 4.02 లక్షల మందికి తాగునీరు, 110 చెరువులకు సాగునీటిని మళ్లించనున్నారు. ఇక్కడి చెరువుల పరిధిలోని 6,300 ఎకరాల భూములకు సాగునీటిని అందించాలన్నది దీని లక్ష్యంగా నిర్ధేశించారు. దీంతో కృష్ణా జలాలను ఇక్కడి ఎంఐ(మేజర్ ఇరిగేషన్ ట్యాంకులు) చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు. -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల స్కోర్ జాబితాలను ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన విషయం విధితమే. ఈ జాబితాల్లో పలువురు అభ్యర్థుల టెట్ ఫలితాలు తప్పుగా నమోదు కావడంతో సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రోస్టర్, మెరిట్ ఆధారంగా తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో ప్రచురించనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల కసరత్తు నిర్వహించనున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర స్థాయిలో శిక్షణ సైతం పూర్తి చేశారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. రెండు ఇంజినీరింగ్ కేంద్రాలు ఎంపిక చిత్తూరు జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉండే అపోలో యూనివర్సిటీ, ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలను సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో అర్హత సాధించే 1,473 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. పరిశీలను 30 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. -
యూరియా..లేదయ!
జిల్లాలో యూరియా నోస్టాక్ పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మొన్నటి దాకా కాంప్లెక్స్ కొంటేనే యూరియాను అమ్మిన ఫర్టిలైజర్స్ యజమానులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్కా అందే జిల్లాలోని గ్రోమోర్ అవుట్లెట్లు, రైతు సమాఖ్య దుకాణాల్లో మాత్రం అప్పుడప్పుడు అందే లోడ్డు యూరియా కోసం వందలాది మంది రైతులు ఎగబడేవారు. వారిని నియంత్రించేందకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. చాలీ చాలకుండా వచ్చే స్టాకు గంటల వ్యవధిలోనే ఖాళీ అయ్యేది. పలమనేరులో ఓ రైతు సమాఖ్య వారు గురువారం ఓ లోడ్డు యూరియాను తెప్పించారు. రైతులు అక్కడికి వందలాది మంది చేరుకుని క్యూ కట్టారు. కర్ణాటకలోనూ నోస్టాక్ జిల్లాలో యూరియా లేక ఇప్పటిదాకా రైతులు పొరుగునే ఉన్న కర్ణాటక వెళ్లి యూరియాను తెచ్చుకొనేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. అమాంతం పెరిగిన ధరలు స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకకు చెందిన కొందరు వ్యాపారులు యూరియాను ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్థానికంగా యూరియా బస్తా ధర రూ.270 కాగా అది రూ.300 దాటింది. అంత ధర ఇస్తామన్నా యూరియా దొరడం లేదు. బస్తా రూ.400 నుంచి రూ.500 దాకా పెట్టి అమ్మకాలు చేస్తున్నా యూరియా నిమిషాల్లోనే అయిపోతోంది. క్యూకట్టిన రైతులు పలమనేరు ప్రాంతంలో ఇటీవల వర్షాలకు వరి నాట్లు వేశారు. ఇప్పుడు యూరియా వరికి చాలా అవసరం. దీంతోపాటు పశుగ్రాసానికి కూడా అవరసం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో స్థానికంగా యూరియా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతు సమాఖ్య వారు గురువారం ఓ లోడ్డు యూరియాను తెచ్చారు. దీనికోసం వందలాది మంది షాపు తెరవకముందే క్యూ కట్టారు. వీరిని అదుపు చేయలేక స్థానిక పోలీసులు బందోబస్తుకు రావాల్సి వచ్చింది. జిల్లా సమాచారం ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం – 1.70 లక్షల హెక్టార్లు ఇప్పటిదాకా సాగైన విస్తీర్ణం – 60వేల హెక్టార్లు ఈ దఫా వరిసాగు విస్తీర్ణం – 27వేల హెక్టార్లు ప్రస్తుతానికి కావాల్సిన యూరియా – 20వేల బస్తాలు అందుబాటులో ఉన్న యూరియా – 2వేల బస్తాలు గతంలో గ్రామాల్లోనే యూరియా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కూటమి పాలనలో యూరియా కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. బస్తా యూరియా కోసం పనీపాట వదలుకొని అవస్థలు పడాల్సి వస్తోంది. వాస్తవంగా బస్తా యూరియా రూ.270. ఇక్కడ లేకపోవడంతో కర్ణాటక నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఖర్చుతో కలిపి మొత్తం బస్తా రూ.350 దాకా ఖర్చుచేయాల్సి వస్తోంది. – నరసింహారెడ్డి, ఎగువ మారుమూరు, పలమనేరు మండలం వారంగా తిరుగుతున్నా ఈ మధ్య కురిసిన వానలతో కొంత పొలంలో వరి సాగుచేశా. ఆ పంట పసుపు రంగులోకి మారింది. ఓ బస్తా యూరియా చల్లాలని వారం రోజులుగా పలమనేరులోని దుకాణాల వద్దకు తిరుగుతున్నా. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అంటున్నా యూరియా దొరకడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం -
అది నెరవేరితే చాలు సామీ
హంద్రీ–నీవా జలాలు వస్తున్నాయంటున్నారు. వాటిని ఇక్కడి చెరువులకు నింపాలి. భూగర్భజలాలు పెరగాలి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పాలి. 6,300 ఎకరాల్లో చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణకు 0.5 టీఎంసీల సాగునీరు, 4.02 లక్షల మందికి 0.6టీఎంసీల తాగునీరు అందుతుందని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. – రామరాజ్, రామాపురం, రైతు, బైరెడ్డిపల్లి మండలం భూగర్భ జలాలు పెరుగుతాయి నాకు మూడెకరాల పొలం ఉంది. మా పొలం మధ్యలోనే హంద్రీ–నీవా కాలువ వచ్చింది. పొలం పోగొట్టుకున్నప్పుడు బాధ కలిగింది. గత ప్రభుత్వంలో కాలువలో నీరు వదిలినప్పుడు భూగర్భజలాలు పెరిగాయి. అందుకే ఈ ప్రాంతంలోని చెరువుల్లోకి కృష్ణా నీటిని నింపాలి. అప్పుడు ఇక్కడున్న బోర్లలో నీరు బాగా వస్తే దిగులుండదు. – శ్రీనివాసులు, గుండుగల్లు, గంగవరం మండలం చెరువులు నిండితే చాలు నాకు రెండెకరాల పొలం ఉంది. అందులో మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. ఎందుకంటే చెరువుల్లో నీరు లేదు. హంద్రీ–నీవా కాలువ ద్వారా వచ్చే నీటితో ఇక్కడి చెరువులను నింపాలి. అప్పుడే బీడు భూములుగా మారిన పొలాలు మళ్లీ పచ్చగా మారతాయి. – వెంకట్రమణ, బొమ్మరాజుపల్లె, గంగవరం మండలం -
వారి కడుపుకొట్టి ఏం సాధిస్తారు బాబూ?
చిత్తూరు కార్పొరేషన్: అడ్డగోలు నిబంధనలతో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని చిత్తూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ బాబు సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కుల మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పింఛన్ మంజూరైందన్నారు. తాము అధికారంలోకి వస్తే వారికి అదిక పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నమ్మి ఓట్లేసిన దివ్యాంగులకు ఇప్పుడు నోటీసులు జారీ చేసి పింఛన్ ఎత్తివేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లకు కోత పెడుతుండడంతో బాధితులకు దిక్కుతోచడం లేదన్నారు. ప్రస్తుతం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లు కోత విధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో దాదాపు 5వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు. వీరిని అనర్హులుగా తేలుస్తూ వచ్చే నెల నుంచి పింఛన్లు నిలిపివేయనున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రతినెలా ఆహారం, మందులు ఇతర ఖర్చులకు పింఛనే ఆధారమన్నారు. ఇప్పుడు పింఛన్ తొలగిస్తే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. అంతర్ జిల్లా బదిలీలకు కసరత్తు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారులు అంతర్ జిల్లా బదిలీలకు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి కసరత్తు చేపడుతున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ అంతర్ జిల్లా బదిలీలకు అర్హులైన టీచర్లు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ మహిళా జట్ల ఎంపిక రేపు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ మహిళల జట్ల ఎంపిక ఈ నెల 23న ఉంటుందని ఆ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి మహిళా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ ఎంపికయ్యే క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో పల్నాడు జిల్లా దూబిపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర సమాచారానికి 9581887409, 7013989059 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
కొత్త పంథా..ఇసుక దందా
సాక్షి టాస్క్ ఫోర్స్: గూడూరు వయా చిత్తూరు మండ లం మీదుగా తమిళనాడుకు పుష్ప రేంజ్లో ఇసుక దందా నడుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూట మి నేతలు రెచ్చిపోతున్నారు. ఈ ఆక్రమ వ్యవహారా న్ని స్థానికులు బట్టబయలు చేశారు. అయితే పోలీసు లు కేసు నమోదు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. సరిగ్గా మరో 5 నిమి షాల్లో జిల్లా సరిహద్దు దాటి తమిళనాడుకు వెళ్లిపోయే సమయంలో చిత్తూరు మండలం, అనంతాపురం గ్రా మం వద్ద గురువారం ఓ లారీ టైరు పేలి నిలిచిపోయింది. తీరా ఆ లారీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న బండేనని స్థానికులు నిర్థారణకు వచ్చి.. అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు స్పందించకపోవడంతో లారీ పైన కట్టిన పట్టను విప్పి చూడగా.. ఇసుకపై వరి పొట్టు బ్యాగులను నింపి ఉండడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్క డకు చేరుకున్న బీఎన్ఆర్ పేట ఎస్ఐ నాగసౌజన్య లా రీని అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనిపై పోలీసు లు కేసు నమోదు చేయలేదు. ఈ అక్రమ వ్యవహారం మొత్తం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా కూటమి నేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాన్ని వదిలిపెట్టేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఎస్ఐ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. స్థానికులు కూడా దీనిపై సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని ఆమె పేర్కొన్నారు. -
ఇదీ చెరువుల దుస్థితి
పలమనేరు ఇరిగేషన్ పరిధిలో మొత్తం 787 చెరువులున్నాయి. వీటిల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం గలవి) 57 దాకా ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 దాకా ఆక్రమణలకు గురై కనిపించకుండా పోయాయి. మిగిలిన వంద దాకా చెరువులు 10 నుంచి 30 శాతం ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పటికే కూటమి నేతల దెబ్బకు చెరువులు గుంతలమయయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వర్షపు నీరు ఈ గుంతల్లోకి సైతం రాని పరిస్థితి. ఎటూ వానలోచ్చినా చెరువుల్లోకి నీరురాదు కాబట్టి కృష్ణా జలాలతో వీటిని నింపడం మినహా మరో మార్గం లేదు. -
● ఆచార్య మోతోభవ!
మాతృదేవోభవ..పితృదేవోభవ.. అమ్మానాన్నలు దేవుళ్లతో సమానం.. ఆ తరువాతి స్థానం ఆచార్యుడిదే. అందుకే ఆచార్యదేవోభవ అని గురువులను వేనోళ్ల కీర్తిస్తారు. ఇదీ మన భారతీయ సంప్రదాయంలో గురువుకున్న విలువ. అలాంటి స్థానంలో నిలిచిన గురువులను కూటమి సర్కారు కూలీల కింద లెక్క కట్టింది. పుస్తకాలు మోత భారం ఉపాధ్యాయులపై మోపింది. విధిలేక.. ఉద్యోగం వదులుకోలేక.. కొందరు ఉపాధ్యాయులు పుస్తకాలను నెత్తిపై పెట్టుకుని మోశారు. తమది కానీ ధర్మం నెరవేర్చారు. ఈ చిత్రం చూస్తే కూటమి ప్రభుత్వం గురువులకు ఏ పాటి స్థానం ఇస్తుందన్న విషయం తేట తెల్లమవుతోంది. గత ఎన్నికల్లో టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. గౌరవ ప్రధమైన వృత్తిలో ఉండే ఉపాధ్యాయులు చంద్రబాబు జమానాలో దినసరి కూలీల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. టీచర్లపై ఈ సర్కారు ఎలాంటి ఒత్తిడి మోపుతుందనడానికి ఓ ఉపాధ్యాయుడు నెత్తిపై పుస్తకాల కట్ట, భుజం మీద, చేతిలో మరో పుస్తకాల కట్టలను మోస్తున్న చిత్రమే నిదర్శనం. ఈ చిత్రం సోషల్మీడియాలో వైరల్గా మారింది. – చిత్తూరు కలెక్టరేట్ -
వరసిద్ధుడికి రూ.1.67 కోట్ల ఆదాయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీ ద్వారా రూ.1,67,32,780 ఆదా యం ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధ వారం లెక్కించారు. ఈఓ పెంచల కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో బంగారం 50 గ్రాములు, వెండి 1.617 కిలోలు వచ్చిందని ఈఓ పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,236, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.41,450 వచ్చిందన్నారు. యూఎస్ఏ డాలర్లు 397, సింగపూర్ డాలర్లు 5, మలేషియా రింగిట్స్ 1, యూఏఈ దిర్హామ్స్ 230, కెనడా డాలర్లు 105, ఆస్ట్రేలియాడాలర్లు 70, యూరో దేశానికి చెందిన 325 యూరోలు, ఇంగ్లాడ్ 10 పౌండ్స్ వచ్చాయ న్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్బాబు, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, సుబ్రమణ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. డీవార్మింగ్ 99.81 శాతం పూర్తి చిత్తూరు అర్బన్(కాణిపాకం): నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ (డీవార్మింగ్ కార్యక్రమం) 99.81 శాతం పూర్తి చేసినట్లు ఇన్చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి మా త్రల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామన్నారు. జిల్లాలో 3,61,848 పిల్లలుంటే ఇప్పటి వరకు 3,61,848 మంది పిల్లలకు మాత్రలు అందజేశామని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్లు పరిమితికి మించితే చర్యలు తప్పవు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుంటే చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ డీఐఈఓ రఘుపతి హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కచ్చితంగా ఇంటర్మీడియ ట్ బోర్డు నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కళాశాలల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, ఎంసెట్ మెటీరియల్ను పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 31 ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం 3,970 అడ్మిషన్లు, 98 ప్రైవేట్ కళాశాలల్లో 11,042 మొత్తం 15,012 అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం కంటే అడ్మిషన్లు మెరుగుపడ్డాయన్నారు. ఈ నెల 31 వ తేదీ వరకు ఆన్టీసీ అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 వరకు మూతపడిన కళాశాలలున్నట్లు తెలిపారు. ఆ కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఐఈఓ వెల్లడించారు. -
వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు
పలమనేరు: కొన్నేళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. వీరికి బలవంతపు బదిలీలు, డిప్యూటేషన్లు తప్పడం లేదు. గత ఆరేళ్లలో నాలుగు దఫాలు వీరు బదిలీకే పరిమితమవుతున్నారు. పోనీ బదిలీతో ఆపుతారనుకుంటే అదీ లేదు. వీరిని డిప్యూటేషన్లపై వేరే బడికి పంపడం రివాజుగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న 164 మంది భాషోపాధ్యాయులు వలసపక్షుల్లాగా మారిపోయారు. కోర్టుమెట్లెక్కి అనుమతి తీసుకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పలువురు భాషోపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 2019లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులకు (తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, సంస్కృతం) జీవో నంబర్ 91 మేరకు ఉన్నతీకరణ జరిగింది. ఆ జీవో అమలు కాకుండా కొందరు కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిని పక్కనబెట్టి ఉన్నతీకరణలో ఎస్జీటీలకు చోటు కల్పించేలా ఆదేశాలను తెచ్చారు. దీంతో విద్యాశాఖ జీవో నంబర్77 ద్వారా ఎస్జీటీలకు మేలు కలిగేలా చేశారు. ఎల్పీ(ల్యాంగేజ్ పండిట్స్) కేడర్ లేకుండా చేశారు. ఈ క్రమంలో వీరికి ఎల్పీ వ్యవస్థా లేకుండా .. ఉన్నతీకరణ లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలు బేఖాతర్ తమకు జరిగిన అన్యాయంపై భాషోపాధ్యాయులు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టీస్ మన్మధరావు సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2019 నుంచి వీరికి అన్ని సదుపాయాలను కల్పించి, మూడు నెలల్లో ప్రమోషన్ అర్హతలున్నవారికి అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయాలని భాషోపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖను కోరింది. దీంతో వారు వేకన్సీలు లేవని సెలవుల్లో ఈ ప్రక్రియ ఉంటుందని దాట వేసింది. ఇది జరిగితే తమకు ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఎస్జీటీలు దీనిపై హైకోర్టులో స్టేటస్కో ఉత్తర్వులను పొందారు. ఫలితంగా వీరి సమస్య మరింత జఠిలంగా మారింది. అప్పట్లో విద్యాశాఖ చేసిన అలసత్వం వీరికి శాపంలా మారింది. బలవంతపు బదిలీలు తమపైనే కోర్టుకెళ్లారనే అక్కసుతో విద్యాశాఖ సైతం వీరితో చెలగాటమాడుతోంది. ఆ మేరకు గత ఆరేళ్ల లో వీరిని నాలుగు దఫాలు బదిలీలను చేసింది. బదిలీ చేసిన చోటా ఉంచకుండా వర్క్ అడ్జెస్ట్మెంట్ సాకుతో మూడు నెలలు, ఆరు నెలలు ఓ బడిలో పనిచేశాలా డిప్యూటేషన్లు వేస్తోంది. మళ్లీ అధికారికంగా బదిలీ అయిన బడికి ఆ విద్యాసంవత్సరంలో చివరి రోజు పంపుతోంది. చేతులెత్తేసిన డిప్యూటీ సీఎం తమ సమస్యను మీరైనా పరిష్కరించాలంటూ గత యేడు తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా పలువురు భాషోపాధ్యాయులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు మీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కానీ రెండేళ్లవుతున్నా దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.క్యాడర్ లేకుండా ఆరేళ్లుగా పనిచేస్తున్నా నేను ఆరేళ్లుగా క్యాడర్ లేకుండా పనిచేస్తున్నా. కనీసం మాకు జాబ్కార్డు కూడా లేదు. ప్రమోషన్లూ లేకుండా చేశారు. కోర్టు తీర్పునిచ్చినా విద్యాశాఖ వాటిని అమలు చేయడం లేదు. ఇంత దారుణం ఎక్కడా లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో..? – బెంగళూరు స్వామినాథుడు, తెలుగు పండిట్, గుడిపల్లి మండలంఆడుకుంటున్నారు మేమేం పాపంచేశామోగానీ విద్యాశాఖ మాకు ఎలాంటి క్యాడర్ లేకుండా, ప్రమోషన్లు లేకుండా చేసింది. దీంతోపాటు ఉన్నత పాఠశాలలో భోదించే మమ్మల్ని ప్రైమరీ బడులకు పంపుతోంది. అదీ ఓ చోట కాదు ఎక్కడిబడితే అక్కడికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మహిళలమైన మాకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. – భాగ్యలక్ష్మి, తెలుగు పండిట్, రామసముద్రంఇంత వివక్ష ఎందుకు? తెలుగు భాషోపాధ్యాయులపై విద్యాశాఖ ఎందుకింత వివక్ష చూపుతోందో అర్థం కావడం లేదు. మేము ఉన్నత పాఠశాలలో తెలుగును బోధించాలి. కానీ మమ్మల్ని ప్రైమరీ బడుల్లో టీచర్లు సెలవు పెట్టిన చోటుకు పంపుతున్నారు. జాబ్చార్ట్లేకుండా చేసి ఎక్కడిపడితే అక్కడికి పంపుతున్నారు. – హిమబిందు, జెడ్పీహెచ్ఎస్, కే.గొల్లపల్లి, యాదమరి మండలం -
సంవత్సరమంతా భూమిని కప్పి ఉంచండి
పెనుమూరు(కార్వేటినగరం): ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా సంవత్సరమంతా భూమిని కప్పి ఉంచాలని ఆర్ వైఎస్ఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ వాసు సూచించారు. బుధవారం కేసీ పల్లి, తిరివిరెడ్డిపల్లి, చార్వాకానిపల్లి పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కప్పి ఉంచడంతో భూసారం పెరగడమే కాకుండా భవిష్యత్తులో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. బహుళ పంటలు సాగు చేయడంతో ఒక పంట పోయినా మరో పంట ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. వర్షాలు బాగా కురవడంతో వేరుశనగలో అంతర పంటలు సాగు చేయాలని సూచించారు. అలాగే సెప్టెంబర్లో రాష్ట్రస్థాయి అధికారులు క్షేత్ర పరిశీలన చేయనున్నారని, ఈ లోపు సిబ్బంది రైతులు ఏ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్, బహుళ పంటలు, ఆర్డీస్ పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం వరిలో అంతర పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హనుమంతు, నవీన్, హరికృష్ణారెడ్డి, వెంకటేష్, అనిల్కుమారి, గౌతమి, మణెమ్మ, హేమలత, భాస్కర్, రామానాయుడు పాల్గొన్నారు. -
గుడిని కూల్చి.. ఆక్రమణకు యత్నం
● నకిలీ పత్రాలతో కూటమి నేతల కుట్ర ● ఆలయ భూమి కాపాడాలని కమిటీ సభ్యుల డిమాండ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): మురంకబట్టులోని శ్రీసుందర వెంకటేశ్వరస్వామి గుడిని కూటమి నేతలు కూల్చేసి స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆలయ కమిటీసభ్యులు కార్తీకేయన్, సహదేవన్, ఎల్ఐసీ గోపి ఆరోపించారు. బుధవారం చిత్తూరు నగరంలోని మురకంబట్టులో ఈ మేరకు నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయాన్ని ఆనుకుని 90 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆన్లైన్లో డ్రై ల్యాండ్గా చూపుతున్న ఈ భూమి ఆక్రమణకు గురువుతోందని తెలిపారు. ప్రజాపరిష్కారవేదికలో ఫిర్యాదు చేస్తే డ్రై ల్యాండ్ చూపిస్తూ అధికారులు బోర్డు పెట్టారన్నారు. ఇటీవల కూటమికి చెందిన పుండరీకాక్షయ్య, ఆనందయ్య, చిన్ని, రాజు తదితరులు జేసీబీలతో ఆలయాన్ని కూల్చేశారని మండిపడ్డారు. నకిలీ పత్రాలు చూపిస్తూ ఈప్రభుత్వ భూమి తమదేనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల నుంచి ఆలయ భూమిని విడిపించాలని కోరారు. కార్యక్రమంలో లోకేష్, గౌతమ్, శివ, విజయ్, ఇమాయరాజు, ప్రకాష్, హరి, అశోక్, కోటి, మురాజ్, శంకర్, కుప్పుస్వామి పాల్గొన్నారు. -
కలెక్టర్ సారూ.. కరుణచూపరా..!
బంగారుపాళ్యం/కాణిపాకం: పక్షవాతంతో ఓ దివ్యాంగుడికి కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోయాయి. బక్కచిక్కిపోయిన శరీరంతో ప్రాణం నిలబెట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు పింఛన్ సొమ్ముతో కాస్త ఆయుషు పోసుకుంటున్నాడు. అయితే రీ వెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఆ దివ్యాంగుడి పింఛన్కు ఎసురు పెట్టింది. తొలుత 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, కలెక్టర్ ఫిర్యాదుతో జీరో శాతం ఉందని మళ్లీ నోటీసులు ఇవ్వడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగారుపాళెం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతుల పెద్ద కుమారుడు హర్షద్. ఇతడు 8 నెలలకే జన్మించాడు. పుట్టుకతోనే పక్షవాతం బారిన పడ్డాడు. దీనికితోడు మెదడు సమస్య వచ్చింది. అప్పటి నుంచి హర్షద్ను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. నెలవారీ పింఛన్తో హర్షద్ ఆస్పత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ వెరిఫికేషన్లో హర్షద్ను అనర్హుడిగా తేల్చారు. 40 శాతం కంటే తక్కువగా ఉందని సచివాలయ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోడెక్కారు. సోమవారం కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ మళ్లీ వెరిఫికేషన్కు ఆదేశించారు. అయితే ఆ రిపోర్ట్ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పరిశీలన విభాగం కొట్టి పడేసింది. మళ్లీ జీరో శాతమని, హర్షద్ బాగుండాడని, ఎలాంటి సమస్యలు లేవని నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ను బుధవారం సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ నోటీసును చూసి వారు కంటతడిపెడుతున్నారు. కలెక్టర్కు విన్నమించుకున్న ఏమిటీ విచిత్రమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి చూసి...ఎలాంటి సమస్యలు లేనట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆగ్రహానికి గురవుతున్నారు. నిజంగానే అధికారులకు కళ్లుండి ఇలా చేస్తున్నారా.. లేక కక్షపూరితంగా చేస్తున్నారనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. కనికరం లేకుండా ఇలా చేయడం దారుణమని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ కల్పించుకుని న్యాయం చేస్తారా, లేదా చూడాలి మరీ. -
విద్యుత్ గ్రీవెన్స్కు 4 సమస్యలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని అర్బన్ డివిజన్ ట్రాన్స్కో కార్యాలయం ఆవరణలో బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు వినతులు అందజేశారు. వాటిని సకాలంలో పరిష్కారించాలని డీఈ ప్రసాద్ ఆ దేశించారు. వ్యవసాయ సర్వీసులకు డబ్బులు కట్టి వేచి చూస్తున్నమని వెంటనే సర్వీసు ఇ వ్వాలని రెడ్డిగుంట, కొత్తపల్లె సెక్షన్ పరిధిలోని రైతులు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లెలో నీటి సరఫరా కోసం మీటరు ఇవ్వాలని వినియోగదారుడు వినతిపత్రం సమర్పించారు. భూతగాదాలో ఉన్న సర్వీసు మీటర్ మార్చవద్దని చిత్తూరు రూరల్ పరిధిలోని ఓ వినియోగదారుడు తెలియజేశారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని డీఈ వివరించారు. టెక్నికల్ ఏఈ మాధురి పాల్గొన్నారు.ఎల్ఈడీ టీవీల సమర్పణకాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి బుధవారం ఓ దాత ఎల్ఈడీటీవీలను విరాళంగా సమర్పించారు. చిత్తూరు నగరానికి చెందిన విమ్సన్ అధినేతలు రవీంద్రనాథ్, రమణ రూ.1.20 లక్షలు విలువ చేసే 55 ఇంచెస్ రెండు టీవీలను ఈఓ పెంచలకిషోర్కు అందజేశారు. అనంతరం ఆయన వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు.రైలు ఢీకొని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి మృతిపుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి రైలు ఢీకొని ఎం.శ్రావణ్కుమార్(31) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక లక్ష్మీనగ ర్ కాలనీలో నివాసమున్న శ్రావణ్కుమార్ నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో నాదస్వర విద్వాన్గా కాంట్రాక్ట్ బేసిక్పై పనిచేస్తున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలిచిత్తూరు కలెక్టరేట్ : రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు కోదండన్ డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు సకాలంలో ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వీఆర్ఏల పై ఉండే శాఖాపరమైన చర్యలు త్వరతిగితిన విచారించి పరిష్కరించాలన్నారు. ఆ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరాజ్, నాయకులు పెరుమాల్, రూపాణి, ఉదయ్, నరేష్ పాల్గొన్నారు.శాస్త్రోక్తంగా ప్రదోషకాల పూజకాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనా మణికంఠేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రదోషకాల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్, నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. స్వామివారికి విశేషాలంకరణ చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. -
చిత్తూరులో గీత సామాజిక వర్గానికి మద్యం బార్
చిత్తూరు అర్బన్: కార్పొరేషన్ పరిధిలో ఓ మద్యం బారును కల్లు గీత సామాజిక వర్గానికి కేటాయిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.5.10 లక్షల ఆన్ రీఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించి మద్యం బారు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీసీ ఈడిగ సామాజిక వర్గం కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని.. లైసెన్స్ ఫీజును 50 శాతం రాయితీతో రూ.27.50 లక్షలుగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణం కేటాయిస్తామని పేర్కొన్నారు. పింఛన్ల తొలగింపు దుర్మార్గం ఐరాల : దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ రద్దు నోటీసు అందుకున్న 50 మంది బాధితులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ ధనలక్ష్మికి నోటీసులు చూపించి తామ ఏం పాపం చేశామని వాపోయారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే సదరం సర్టిఫికెట్ జారీ చేశారని వెల్లడించారు. దాదాపు 15 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న తమకు ఇప్పుడు తొలగిస్తూ నోటీసు జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. పింఛన్ల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంపీడీఓ స్పందిస్తూ.. పింఛన్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. -
కన్నీళ్లు తెప్పింఛన్
దివ్యాంగులకు ఆసరా అందించే పింఛన్కు కూటమి సర్కారు గండి కొట్టింది. రీ వెరిఫికేషన్ పేరుతో అర్హులైన పలువురికి పింఛన్ రద్దు చేయగా, మరెందరికో కోత విధించింది. ఫలితంగా దివ్యాంగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. సదరమ్ సర్టిఫికెట్లు, రీవెరిఫికేషన్ కోసం ఆస్పత్రులకు నడవలేక.. అధికారులు చుట్టు తిరగలేక ఇక్కట్లు పడుతున్నారు. వారికి పింఛన్ కన్నీళ్లు తెప్పిస్తోంది. బంగారుపాళెం: కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లలో కోత పెడుతోంది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వైకల్యం కలిగి ఉన్నప్పటికీ తమకు పింఛన్లను తొలగించారంటూ బుధవారం పలువురు దివ్యాంగులు బంగారుపాళెం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఇటీవల వికలాంగ పింఛన్ల రీ వెరిఫికేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మండలంలో 159 మంది అనర్హులుగా తేల్చి నోటీసులు అందజేశారు. తాము పుట్టుకతోనే వికలాంగులుగా ఉన్నామని, 90 శాతం వైకల్యం ఉందని డాక్టర్లు పరిశీలించి సర్టిఫికెట్లు సైతం జారీ చేశారన్నారు. రీ వెరిఫికేషన్లో తమకు 40 శాతం కంటే తక్కువ ఉందని పింఛన్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకల్యంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుపైనే ఆధారపడి కాలాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో పింఛన్ తొలగించడంతో దిక్కుతోచడంలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అందుతున్న పింఛన్లను అకారణంగా ఎందుకు తొలగించారో అర్థం కాక, ఏమి చేయాలో దిక్కు తోచక తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామన్నారు.రూ.6 వేలకు తగ్గించారు నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. 90 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది. వైకల్యం శాతం తగ్గించి రూ.15 వేలు వస్తున్న పింఛన్ను తగ్గించి రూ.6 వేలకు మార్చారు. ఇలా 48 మందికి పింఛన్లను తగ్గించారు. – ప్రభాకర్రెడ్డి, దివ్యాంగుడు, తగ్గువారిపల్లెనాకు పింఛన్ కట్ చేశారు నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. నాకు 95 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది. గతంలో రూ 15 వేలు పింఛన్ వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం వికలాంగుల పింఛన్ రీ వెరిఫికేషన్ చేసింది. తనకు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందంటూ నోటీసు ఇచ్చి పింఛన్ కట్ చేశారు. నడవలేని స్థితిలో ఉన్న మాలాంటి దివ్యాంగులకు పింఛన్లో కోత విధించడం ఎంతవరకు సమంజసం. తమకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. –గోపి, దివ్యాంగుడు, తంబుగానిపల్లె -
వి.కోటలో చైన్ స్నాచింగ్
వి.కోట: మహిళ మెడలోని బంగారుచైన్ను గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చి లాక్కెళ్లిన సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన అమరావతి అనే మహిళ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్గా విధులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్థానిక వేణుగోపాల స్వామి వీధిలోని ప్రాథమిక పాఠశాల వద్దకు నడుచుకుని వెళుతుండగా ఆమెను బైక్పై వెంబండించిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు చైన్ను లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులలో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించి,వెనక కూర్చున్న వ్యక్తి తలకు టోపీ, కళ్లాద్దాలు ధరించి ఉన్నారని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. -
ఐటీఐ మూడో విడత అడ్మిషన్లకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మూడో విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించారని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. www.iti.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు చేసుకున్న అనంతరం ప్రభుత్వ ఐటీఐ అడ్మిషన్ విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7799679351, 9440738121, 9182590869 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. మామిడి చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పోషించాలి తవణంపల్లె: రైతులు మామిడి చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పోషించాలని రియల్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామారావు, సంస్థ చైర్మన్ హనీషా తెలిపారు. తవణంపల్లెలో ఉపాధి హామీ కార్యాలయంలో రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామారావు మాట్లాడుతూ మండలంలోని సరకల్లు, అరగొండ, తడకర, ఈచనేరి, వడ్డిపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, గళ్లావాళ్లవూరు, దిగువ మత్యం గ్రామాల్లోని 20 మంది రైతులకు 35 ఎకరాల్లో 2,800 అన్ని రకాల మామిడి చెట్లు అందించినట్లు పేర్కొన్నారు. రైతులు చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో రైతులకు ఉచితంగా మామిడి చెట్లు అందించినట్లు తెలిపారు. రైతులు ఆర్గానిక్ పద్ధతిలోనే మొక్కలు పెంచాలన్నారు. తవణంపల్లె క్లస్టర్ కోఆర్డినేటర్ శ్యామల, నవీన్ పాల్గొన్నారు. చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో ఎంపిక చేసిన 10 మండలాల్లో గురువారం విధిగా ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలు నిర్వహించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ వెంకట ప్రసాద్ ఆదేశించారు. బుధవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్న గ్రామాల్లో ఆరోగ్య సంరక్ష ణ సేవలు నిర్వహించాలన్నారు. సచివాలయం, విలేజ్ హెల్త్ క్లీనిక్ల వద్ద శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటలకు శిబిరాల్లో వైద్యసేవలందించాలని స్పష్టం చేశారు. చిత్తూరు, విజయపురం, పెనుమూరు, నిండ్ర, కార్వేటినగరం, యాదమరి, గంగవరం, రాయల్పేట, పెద్ద ఉప్పరపల్లె, శాంతిపురం మండలాలను ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలకు ఎంపిక చేసినట్లు వివరించారు. కుమరేషన్కు తెలుగుతేజం అవార్డు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరుకు చెందిన అధ్యాపకులు కుమరేషన్ శ్రీశ్రీకళా వేదిక తెలుగు తేజం అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 31వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగే వేదికలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఈయనతో పాటు జిల్లాలో మరో 6 మంది కవులు ఎంపికయ్యారు. -
విద్యాశాఖకు రెండు బహుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రస్థాయిలో ఈ నెల 19న నిర్వహించిన వికసిత్ భారత్ సెమినార్లో చిత్తూరు జిల్లా విద్యాశాఖకు రెండు బహుమతులు లభించాయి. ఈ సెమినార్కు జిల్లా తరఫున డీఈఓ వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ తరఫున టీమ్గా ఏర్పడి ఇతర అధికారుల సమన్వయంతో డీఈఓ వరలక్ష్మి ఎఫ్ఎల్ఎన్ (ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) అనే అంశంపై సెమినార్ ఇచ్చారు. అలాగే జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ స్కూలింగ్.. బిల్డింగ్ బ్లాక్స్ అనే అంశంపై టీమ్గా ఏర్పడి సెమినార్ ఇచ్చారు. ఈ సెమినార్ టీమ్లలో పలు జిల్లాలకు చెందిన డీలో, ఏపీసీలు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన సెమినార్ నిర్వహించి నిర్ధేశించిన 10 థీమ్లపై చర్చించారు. ఈ సెమినార్లో జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ పాల్గొన్న సెమినార్లో ‘బాల్యం బాగుంటే భవిష్యత్ బాగుంటుంది’ అనే చర్చలో మొదటి బహుమతి సాధించారు. అలాగే ఎఫ్ఎల్ఎన్ టీమ్కు రెండో బహుమతి లభించింది. ఈ సెమినార్లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష శాఖ ఎస్పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా డీఈఓ, ఏపీసీలు బహుమతులు స్వీకరించారు. -
బాబూ..దివ్యాంగులపై ఎందుకంత కక్ష?
● వైఎస్సార్సీపీ పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్ యాదమరి: ‘ కూటమి సర్కారు దివ్యాంగులపై కనీసం మానవత్వం చూపలేదు. పైగా వారు పదేళ్లుగా తీసుకుంటున్న పింఛన్లు కోత పెట్టింది. వారిపై ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పాలి.?’ అని వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దుర్భర జీవితాలు అనుభవిస్తున్న దివ్యాంగులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. కూటమి సర్కారు దివ్యాంగులను మానవతా ధృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి, వారి బతుకులతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఇప్పటికే జిల్లాలో 4,732 మంది అర్హత కలిగిన ల బ్ధి దారుల పింఛన్లను తొలగించడం దారుణమన్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన మానసిక, శారీరక వైకల్యం కలిగిన నిజమైన పింఛనుదారులకు సైతం సెప్టెంబర్ నెల నుంచి తమకు పింఛన్ రాదని అధికారులతో నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అని అన్నారు. దివ్యాంగుల శోకం రాష్ట్రాభివృద్ధికి అంత శ్రేయస్సు కాదని చంద్రబాబుకు హితవు పలికారు. సదరం ధ్రువపత్రాల కోసం నడవలేని స్థితిలో ఉన్నవారి ఆస్పత్రుల చుట్టు తిప్పడం సమంజసం కాదన్నారు. ప్రజల ముంగిటికే ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న కూటమి నేతలు..వైద్య పరీక్షలు కూడా వికలాంగుల చెంతకే వెళ్లి చేయవచ్చు కదా? సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు సృష్టించాలన్నా.. వాటి ఫలాలు ప్రజలకు అందాలన్నా.. అది కేవలం వైఎస్ జగనన్నకే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల కోతలపై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ దివ్యాంగుల తరఫున పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. -
వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి
చిత్తూరు కార్పొరేషన్ : తపాలా ఉద్యోగుల వేతన సవరణకు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని తపాలా శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో నాయకులు భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవక్లు, పెన్షనర్లందరికీ వేతన సవరణతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో వేతన సవరణలో పెన్షనర్లకు సవరణ చేయబోమని ప్రకటించడం దారుణమన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ ధర్నాలో నాయకులు రామమూర్తి, అరుణ, మహదేవన్, దామోదర, హరిప్రసాద్, సురేంద్ర, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ పాటించరూ!
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో ప్రొట్కాల్ ఉల్లఘించారని కాణిపాక వాసులు మండిపడుతున్నారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏటా ప్రొటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలు ముద్రించేవారు. ఈ ముద్రణ పార్టీలకతీతంగా ఉండేది. గత ఐదేళ్లలో కూడా ప్రొటోకాల్కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దొరబాబు ఫొటోతో సహా ముద్రిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రూల్స్ మారాయని కాణిపాకం వాసులు మండిపడుతున్నారు. కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ఫొటోలు మాత్రమే పత్రికలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, భరత్, చంద్రశేఖర్రెడ్డి ఫొటోలు లేకుండా పేర్లు మాత్రమే ముద్రించారని, ఇంతకీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటీకి ప్రొటోకాల్ ఉల్లంఘనే అంటూ ఉభయదారులు, కాణిపాక వాసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. కాగా 2024లో వారి ఫొటోలతో సహా ముద్రించడం గమనార్హం. -
ఎంపీకి బెయిల్ రావాలంటూ శ్రీవారికి మొక్కులు
చంద్రగిరి : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడంతో ఆయనకు త్వరగా బెయిల్ రావాలంటూ ఆయన అభిమానులు తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం వారిని పోలీసులు అక్రమంగా అడ్డుకుని, స్టేషన్లో నిర్భందించారు. రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచుకుని ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం బుధవారం ఉదయం హరిప్రసాద్ రెడ్డితో పాటు అభిమానులు శ్రీవారిమెట్టుకు చేరుకున్నారు. ముందుగా అక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు పాదయాత్రను కొనసాగించారు. తిరుమలకు చేరుకున్న వారు శ్రీవారిని దర్శించుకుని, తమ అభిమాన నేత ఎంపీ మిఽథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అక్రమంగా అడ్డుకుని, నిర్భదించడం దీనికి ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి కథల పోటీల్లో చిత్తూరు విద్యార్థిని ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి కథల పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని సాయిరెడ్డి ఉదితి ప్రతిభ చూపి, బహుమతి సాధించినట్లు దేవీబాలామందిర్ పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వురిమళ్ల ఫౌండేషన్ (ఖమ్మం) ఆధ్వర్యంలో జాతీయస్థాయి కథలు, కవితల పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఉదితి రాసిన మన భరతమాత (దేశభక్తి) కథ జాతీయ స్థాయిలో ఎంపికై ందన్నారు. ఈ కథను సంకలనంగా ముద్రిస్తారని వురిమళ్ల ఫౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం ఆ విద్యార్థినిని హెచ్ఎం సుజాత, టీచర్లు అభినందించారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
బంగారుపాళెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకురాలు, మండల ప్రత్యేక అధికారి పద్మమ్మ అన్నారు. బుధవారం బంగారుపాళెం, పాలేరు, తుంబకుప్పం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా? లేదా అని ఆరా తీశారు. అంగన్వాడీ పిల్లల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. తుంబకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీకి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారు.. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ముందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు షామీదాబేగం, కవిత తదితరులు పాల్గొన్నారు. -
దోమల నియంత్రణతో వ్యాధుల కట్టడి
చిత్తూరు అర్బన్: దోమలను నియంత్రణతోపాటు అవి కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో వ్యాధులను కట్టడి చేయవచ్చని జిల్లా ఇన్చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్తూరు నగరంలోని వెంగళరావు కాలనీలో కార్పొరేషన్ అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ, దోమల నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర విష జ్వరాలు చాలా వరకు దోమ కాటుతోనే వస్తాయన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూడడంతో దోమలను నియంత్రించవచ్చన్నారు. దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ వెంకటరామిరెడ్డి చెప్పారు. ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో దోమల నియంత్రణకు ఫాగింగ్, మొలాథియన్ పిచికారీ, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం మేజర్ కాలువలో ఆయిల్ బాల్స్ వేసి, మందు పిచికారీ చేయించారు. దోమల నియంత్రణపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా కాలువ పనుల పరిశీలన
కుప్పం: నియోజక వర్గంలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో పూర్తి చేసి నీరు తీసుకువస్తామన్నారు. నియోజక వర్గంలోని 430 చెరువులను హంద్రీనీవా జలాలతో నింపుతామన్నారు. చెరువుల సామర్థ్యం, చెక్డ్యాములు బాగు చేయడం, నీటి నిలువల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఈలను ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలోనే కుప్పంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన డిజిటల్ సర్వే సెంటర్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికను వినియోగించుకోవడంతో వ్యాధులను ముందుగానే గుర్తించే చికిత్సలు తీసుకోవచ్చన్నారు. కుప్పం నియోజక వర్గంలో 13 పీ హెచ్సీలు, 92 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రాలు చూస్తాయన్నారు. డిజిటల్ సర్వే సెంటర్లను పరిశీలించి, ఎంత మంది పేషంట్లు వస్తున్నారు.. డాక్టర్లు ఏ సమయానికి వస్తున్నారు.. ఎప్పుడు వెళుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీ ర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్, హెచ్ఎన్ఎస్ ఎస్ ఎస్ఈ విఠల్ప్రసాద్, కుప్పం ఎగ్జిక్వూటివ్ ఇంజినీర్ గోవర్ధన్ పాల్గొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి లీగల్ ఎయిడ్ క్లినిక్
చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భారతి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాలతో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించినట్లు తెలిపారు. దేశం కోసం పోరాడి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికుల సంక్షేమానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలోని మాజీ సైనికులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయ సలహాలు కావాలన్నా ఇక్కడ సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో పారా మిలిటరీ లీగల్ ఎయిడ్ అడ్వైజర్ నాగరాజరెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రజిని, మాజీ సైనికులు పాల్గొన్నారు. -
వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు
పలమనేరు: కొన్నేళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. వీరికి బలవంతపు బదిలీలు, డిప్యూటేషన్లు తప్పడం లేదు. గత ఆరేళ్లలో నాలుగు దఫాలు వీరు బదిలీకే పరిమితమవుతున్నారు. పోనీ బదిలీతో ఆపుతారనుకుంటే అదీ లేదు. వీరిని డిప్యూటేషన్లపై వేరే బడికి పంపడం రివాజుగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న 164 మంది భాషోపాధ్యాయులు వలసపక్షుల్లాగా మారిపోయారు. కోర్టుమెట్లెక్కి అనుమతి తీసుకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పలువురు భాషోపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 2019లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులకు (తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, సంస్కృతం) జీవో నం.91 మేరకు ఉన్నతీకరణ జరిగింది. ఆ జీవో అమలు కాకుండా కొందరు కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిని పక్కనబెట్టి ఉన్నతీకరణలో ఎస్జీటీలకు చోటు కల్పించేలా ఆదేశాలను తెచ్చారు. దీంతో విద్యాశాఖ జీవో నం.77 ద్వారా ఎస్జీటీలకు మేలు కలిగేలా చేశారు. ఎల్పీ(ల్యాంగేజ్ పండిట్స్) కేడర్ లేకుండా చేశారు. ఈ క్రమంలో వీరికి ఎల్పీ వ్యవస్థా లేకుండా .. ఉన్నతీకరణ లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలు బేఖాతర్ తమకు జరిగిన అన్యాయంపై భాషోపాధ్యాయులు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టీస్ మన్మధరావు సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2019 నుంచి వీరికి అన్ని సదుపాయాలను కల్పించి, మూడు నెలల్లో ప్రమోషన్ అర్హతలున్నవారికి అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయాలని భాషోపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖను కోరింది. దీంతో వారు వేకన్సీలు లేవని సెలవుల్లో ఈ ప్రక్రియ ఉంటుందని దాట వేసింది. ఇది జరిగితే తమకు ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఎస్జీటీలు దీనిపై హైకోర్టులో స్టేటస్కో ఉత్తర్వులను పొందారు. ఫలితంగా వీరి సమస్య మరింత జఠిలంగా మారింది. అప్పట్లో విద్యాశాఖ చేసిన అలసత్వం వీరికి శాపంలా మారింది. బలవంతపు బదిలీలు తమపైనే కోర్టుకెళ్లారనే అక్కసుతో విద్యాశాఖ సైతం వీరితో చెలగాటమాడుతోంది. ఆ మేరకు గత ఆరేళ్ల లో వీరిని నాలుగు దఫాలు బదిలీలను చేసింది. బదిలీ చేసిన చోటా ఉంచకుండా వర్క్ అడ్జెస్ట్మెంట్ సాకుతో మూడు నెలలు, ఆరు నెలలు ఓ బడిలో పనిచేశాలా డిప్యూటేషన్లు వేస్తోంది. మళ్లీ అధికారికంగా బదిలీ అయిన బడికి ఆ విద్యాసంవత్సరంలో చివరి రోజు పంపుతోంది. చేతులెత్తేసిన డిప్యూటీ సీఎం తమ సమస్యను మీరైనా పరిష్కరించాలంటూ గత యేడు తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా పలువురు భాషోపాధ్యాయులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు మీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కానీ రెండేళ్లవుతున్నా దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.క్యాడర్ లేకుండా ఆరేళ్లుగా పనిచేస్తున్నా నేను ఆరేళ్లుగా క్యాడర్ లేకుండా పనిచేస్తున్నా. కనీసం మాకు జాబ్కార్డు కూడా లేదు. ప్రమోషన్లూ లేకుండా చేశారు. కోర్టు తీర్పునిచ్చినా విద్యాశాఖ వాటిని అమలు చేయడం లేదు. ఇంత దారుణం ఎక్కడా లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో..? – బెంగళూరు స్వామినాథుడు, తెలుగు పండిట్, గుడిపల్లి మండలంఇంత వివక్ష ఎందుకు? తెలుగు భాషోపాధ్యాయులపై విద్యాశాఖ ఎందుకింత వివక్ష చూపుతోందో అర్థం కావడం లేదు. మేము ఉన్నత పాఠశాలలో తెలుగును బోధించాలి. కానీ మమ్మల్ని ప్రైమరీ బడుల్లో టీచర్లు సెలవు పెట్టిన చోటుకు పంపుతున్నారు. జాబ్చార్ట్లేకుండా చేసి ఎక్కడిపడితే అక్కడికి పంపుతున్నారు. – హిమబిందు, జెడ్పీహెచ్ఎస్, కే.గొల్లపల్లి, యాదమరి మండలం ఆడుకుంటున్నారు మేమేం పాపంచేశామోగానీ విద్యాశాఖ మాకు ఎలాంటి క్యాడర్ లేకుండా, ప్రమోషన్లు లేకుండా చేసింది. దీంతోపాటు ఉన్నత పాఠశాలలో భోదించే మమ్మల్ని ప్రైమరీ బడులకు పంపుతోంది. అదీ ఓ చోట కాదు ఎక్కడిబడితే అక్కడికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మహిళలమైన మాకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. – భాగ్యలక్ష్మి, తెలుగు పండిట్, రామసముద్రం -
కలెక్టర్ ఆగ్రహం
చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ లైన్మన్(జేఎల్ఎం గ్రేడ్–2) సంఘం నాయకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జేఎల్ఎం నాయకులు వెళ్లారు. ఉన్నత కొలువులు పొందడానికి శిక్షణ కోసం రాత్రి పూట శిక్షణకు అనుమతివ్వాలని కోరారు. అక్కడే ఉన్న జేసీ విద్యాధరి గతంలో సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారికి రాత్రివేళ్ల శిక్షణకు దీర్ఘకాలిక అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పామన్నారు. కావాలంటే సెలవు పెట్టుకొని శిక్షణ తీసుకోవచ్చని సూచించినట్టు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ కల్పించుకుని సంబంఽధిత అధికారులతో విషయం మాట్లాడినా కొత్తగా తిరిగి సమస్యను తనకు తెలపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అధికారులు అనుమతివ్వడం లేదని జెఎల్ఎంగ్రేడ్–2 సంఘం నాయకులు చెప్పడం పై అసహనం వ్యక్తం చేశారు. వారిని వెంటనే బయటకు పంపాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ని పిలిచి ఇక్కడకొచ్చేందుకు జేఎల్ఎంలు అనుమతి, లేదా సెలవు తీసుకున్నరా..? అని ప్రశ్నించారు. తీసుకోలేదని ఆయన చెప్పడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నలుగురి నాయకుల పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఎస్ఈ వివరించారు. ఎన్జీఓ కార్యవర్గం ఏకగ్రీవం చిత్తూరు కార్పొరేషన్: సిటీ(వాణిజ్య పన్నులు) శాఖ చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎన్జీఓ(నాన్ గెజిటెడ్ అధికారుల) సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన ఆ సంఘ సమావేశంలో కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. రెండు జిల్లాల అధ్యక్షుడిగా ఎ.రాజేష్, అసోసియేట్ అధ్యక్షుడుగా దశరథన్, ఉపాధ్యక్షులుగా బి.సురేష్కుమార్రెడ్డి, పి.గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీధర్, కార్యాలయ కార్యదర్శిగా వి.పురుషోత్తంనాయుడు, సహాయ కార్యదర్శులుగా కె.రెడ్డిప్రసాద్, సి.జ్యోష్ణ, కోశాధికారిగా జ్ఞానవేల్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఏపీ ఎన్టీఓ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు కేవీ రాఘవు పాల్గొన్నారు. వీరి పదవీ కాలం మూడేళ్లు ఉంటుందని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు వివరించారు. -
అంగన్వాడీ కేంద్రం తనిఖీ
పెద్దపంజాణి: మండలంలోని రాజుపల్లి పంచాయతీ, కమ్మినాయునిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి, చిత్తూరు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, రికార్డులను పరిశీలించారు. తదుపరి రాజుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గత మూడేళ్ల మట్టి నమూనా ఫలితాలను పరిశీలిస్తే మన నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్నందున రైతులు తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను వేయాలన్నారు. యూరియా ఎక్కువగా వాడడం వల్ల కలిగే అనర్థాలు, నానో యూరియా వల్ల ఉపయోగాలను వివరించారు. అన్నదాత సుఖీశవ రాని రైతులు రైతు సేవా కేంద్రంలో 20వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేయాలన్నారు. తర్వాత గ్రామం సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఆయన వెంట పుంగనూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శివకుమార్, ఏఓ హేమలత, పంచాయతీ కార్యదర్శి రిజ్వానా, వీఆర్వో కృష్ణంరాజు ఉన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధం
పూతలపట్టు(యాదమరి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఫొటో స్టూడియోలోని ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భాదితుని కథనం.. మండల కేంద్రంలోని పంచాయతీ దుకాణ సముదాయంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం స్టూడియో యజమాని తన సిబ్బందితో కలిసి కాణిపాకంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లారు. పనులు ముగించుకుని స్టూడియోకి వచ్చిన సిబ్బందికి లోపల నుంచి పొగ రావడంతో వెంటనే యజమానికి సమాచారం అందించారు. అప్పటికే పలు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై చిత్తూరు ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ విచారం వ్యక్థం చేసింది. అక్రమ స్కానింగ్ పై విచారణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): అక్రమ స్కానింగ్ బాగోతంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా విచారణకు దిగారు. ఈ నెల 10న సాక్షి దినపత్రికలో అక్రమ స్కానింగ్ అంతేనా? శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. తిరుపతి, చిత్తూరులో అక్రమ స్కానింగ్ చేస్తూ పట్టుబడ్డ వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ రెండు కేసులలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉందా..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అలాగే పట్టుబడ్డ స్కానింగ్ మిషన్లు... వాటిని అక్రమార్కులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాల కోసం పట్టుబడుతున్నారు. ఈ విచారణ పూర్తయినా తర్వాత డీఎంఅండ్హెచ్ఓకు నివేదికలు సమర్పించనున్నారు. ఈ మేరకు అక్రమ స్కానింగ్కు సహకరించిన అధికారులు, సిబ్బందిపై వేటు పడే అవకాశాలున్నాయి. కాగా అక్రమ బాగోత కేసు వివరాలపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా వివరాలు కోరనున్నామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 35 మందికి జరిమానా చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 35 మందికి రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 35 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారని వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అవుతోందన్నారు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగ, పెన్షనర్, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల విషయం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: కాణిపాక వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఈవో పెంచలకిషోర్, ఏఎస్పీ నందకిషోర్ పిలుపునిచ్చారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ఆవరణలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని శాఖల అధికారులు కలిసి మాక్ డ్రిల్ చేపట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం లోపలి భాగంలో ఏదైనా జరిగితే... వారిని ఎలా ఆస్పత్రికి చేర్చాలి, అగ్నిప్రమాదం జరిగితే ఏవిధంగా స్పందించాలి, ఏ రకంగా మంటలను అదుపు చేయాలనే విషయంపై ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అధికారులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా వ్యహరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరసింహులు, కానిస్టేబుల్ మధు, అగ్నిమాపక, వైద్యాశాఖ, విద్యుత్శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
కార్వేటినగరం: కార్వేటినగరంలోని రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు మంగళవారం వైభవంగా అంకురార్పణ చేపట్టారు. స్వామివారిని వేకువ జామున మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉభయ దేవేరులతోపాటు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమానికి ముందే పవిత్రమైన పుట్టమట్టితో ఆలయ ఆవరణలో మేదినీ దేవిని ప్రతిష్టించి అత్యంత వైభవంగా పూజలు, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం సాయంత్రం సేనాధిపతి ఉత్సవ సమర్పణ, రాత్రి మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల, వైదిక కార్యక్రమాలు చేపట్టారు. విశ్వక్సేనుని ప్రత్యేక వాహనంలో ప్రతిష్టించి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షరాబ్ బాబుసురేష్, వేద పండితులు రమేష్, శభరీష్, గోపాలస్వామి పాల్గొన్నారు. నేడు పవిత్రాల సమర్పణ బుధవారం ఉదయం కోదండరామస్వామికి ఏకాంత తిరుమంజనం, యాగశాలలో మధ్యా హ్నం వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు ఆలయ ఆధికారి సురేష్కుమార్ తెలిపారు. తర్వాత పవిత్రాల సమర్పణ ఉంటుందన్నారు. -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవ పోస్టర్ను ఇన్చార్జ్ డీఎంఅండ్హెచ్ వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తారన్నారు. మండల వైద్యాధికారులు విధిగా పీహెచ్సీల పరిధిలో దోమల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. దోమల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం గెలుస్తుంది
● జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి చిత్తూరు కార్పొరేషన్: ఎప్పటికై నా న్యాయం గెలుస్తుందని వైఎస్ఆర్ సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి బెయిల్పై బయటకు వచ్చిన చిత్తూరు, జీడీనెల్లూరు, వి.కోటకు చెందిన కార్యకర్తలు చక్రవర్తి, వినోద్, మోహన్, శంకరాచారితో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా జైలు వద్ద వారితో మాట్లాడి, భరోసానిచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయంపై ప్రశ్నించిన వారిని కేసుల పెట్టి వేధిస్తోందన్నారు. ఆ దిశగానే తన సోదర సమానులైన పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. జరుగుతున్న అన్యాయాలను భగవంతుడు, ప్రజలు చూస్తున్నారన్నారు. భవిష్యత్లో చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, వారి కష్టాలను జగనన్న దృష్టికి ఎప్పటికప్పుడు నాయకులు తెలియజేస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడే పరిస్థితి లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి నాయకులు అంజలిరెడ్డి, హరీషారెడ్డి, మధురెడ్డి, రాజేష్రెడ్డి, మురళీరెడ్డి, అన్బు, ఆను, చామంతి, వెంకట్రెడ్డి, గురువారెడ్డి, గుణశేఖర్రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అధ్వాన్న రోడ్లు
వర్షాలొస్తే అంతే!పుంగనూరు: వర్షాలు వస్తే పుంగనూరు–శంకర్రాయలపేట రోడ్డులో ప్రయాణం నరకప్రాయమవుతోంది. పుంగనూరు నుంచి పుంగమ్మ చెరువు కట్టమీదుగా శంకర్రాయలపేట, బెంగళూరుకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రహదారి దుస్థితికి చేరినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కుప్పం: కుప్పం ప్రాంతంలో చిరుజల్లులకే గ్రామీణ రహదారులు బురదమయమయ్యాయి. మండలంలోని ఊరినాయనిపల్లె కొత్తూరుకు వెళ్లే మార్గం గుంతలమయంగా మారింది. 40 ఏళ్లుగా గ్రామస్తులు రోడ్డు కోసం పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పొలాల్లో ఉన్న రోడ్లు వర్షాలొస్తే రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నోసార్లు అధికారులు, నాయకులను కోరినా పట్టించుకున్న పాపానపోవడం లేదని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. గంగవరం: మండలంలో ప్రధానంగా శ్రీకోనేటిరాయస్వామి ఆలయం ఉన్న కీలపట్ల రోడ్డు అధ్వాన్నంగా మారింది. హైవే ఆనుకుని కీలపట్లకు ఉన్న అనుసంధాన రోడ్డు బురదమయమైంది. ఇక గంగవరం ఫ్లైఓవర్ వద్ద హైవేపై వర్షం కారణంగా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఫ్లైఓవర్ చుట్టూ ఇదే పరిస్థితి. గుంతలు పూడ్చండి మహాప్రభో! -
ఏనుగులున్నాయ్ జాగ్రత్త
పులిచెర్ల(కల్లూరు): కల్లూరు, పదిపుట్ల బైలు రిజర్వు ఫారెస్టులో ఒంటరి ఏనుగు సంచరిస్తోందని, రైతులు సమీప పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట పొలాలవద్దకు వెళ్లరాదని, అలాగే తెల్లటి దుస్తులు ధరించరాదని పేర్కొన్నారు. ఏనుగులు కనిపిస్తే తరమడం, అదిలించడం లాంటివి చేయరాదని, వెంటనే 9550067503 నంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.నేడు విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక గాంధీ రోడ్డులోని ట్రాన్స్కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.దరఖాస్తుల ఆహ్వానంచిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎంపీహెచ్డబ్ల్యూ ఉచిత కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఎంఅండ్హెచ్ఓ వెంకటప్రసాద్ తెలిపారు. ఈ కోర్సు శిక్షణ కాలం రెండేళ్ల పాటు ఉంటుందన్నారు. చిత్తూరులోని జిల్లా ప్రభ్తుత్వాస్పత్రి, తిరుపతి రుయా, తిరుపతిలోని రాస్, చిత్తూరులోని శ్రీనివాస, పుత్తూరులోని సెయింట్మేరిస్, లక్ష్మీనారాయణ శిక్షణ కేంద్రాల్లో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుకు శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను శిక్షణ కేంద్రానికి లేదా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, 17 ఏళ్లు పూర్తై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.కలెక్టర్ ఆదేశించినా చర్యలేవీ?చిత్తూరు రూరల్ (కాణిపాకం): అక్రమ స్కానింగ్ విషయంలో ఓ ఆశ వర్కర్ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బేఖాతార్ చేస్తున్నారు. మేలో చిత్తూరు నగరంలోని భరత్నగర్లో అక్రమ స్కానింగ్ సెంటర్ను కలెక్టర్ సుమిత్కుమార్ రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహరంలో 20 మందిపైగా కేసు నమోదైంది. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే సిబ్బంది హస్తం ఉందని తేలింది. కానీ ఆ సిబ్బందిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సిబ్బంది(ఆశ వర్కర్)ను తొలగించాలని ఆదేశించారు. దీంతో హడవిడి చేసిన ఆ శాఖ అధికారులు తొలగింపు చర్యను నొక్కిపెట్టేశారు. ప్రభుత్వ విధుల్లో పనిచేస్తూ..కేసు నమోదైతే నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ స్కానింగ్ విషయంలో ఆ శాఖలోని అధికారులతో ఏమైనా సంబంధాలున్నాయా... అందుకే ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీకాలు విధిగా వేయించాలిచిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లలకు రొటీన్ టీకాలు విధిగా వేయించాలని ఇన్చార్జ్ డీఎంఅండ్హెచ్ఓ వెంకటప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం వ్యాధి నిరోధక టీకాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులు చంటి బిడ్డలకు రాకుండా ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. 0–5 లోపు పిల్లలకు టీకాలు వేయించే విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. విధిగా పల్లెల్లోని పిల్లలకు టీకాలు వేయించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ మౌనిక స్టెపి తామస్ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు.నేడు హుండీ లెక్కింపుకాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు బుధవారం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆస్థాన మండపంలో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. -
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఏరువాక కేంద్ర కో–ఆర్డినేటర్ రామకృష్ణారావ్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా ఏరువాక కార్యక్రమంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ దృష్ట్యా జిల్లాలో మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమా న్ని నిర్వహిస్తామన్నారు. అలాగే తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. -
దివ్యాంగులంటే అలుసెందుకు?
● పరిశీలన పేరుతో జిల్లాలో 4,732 దివ్యాంగ పింఛన్లు కోత ● మేమంతా నిజమైన దివ్యాంగులమేనంటూ ఆందోళన ● సోమవారం కలెక్టరేట్ ఎదుటబైఠాయించిన దివ్యాంగులు చిత్తూరు కలెక్టరేట్ : తామంటే అలుసెందుకంటూ దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క నూతన పింఛన్ ఇవ్వకపోగా...ఉన్న పింఛన్లలో కోతలు విధిస్తోంది. ప్రతి సోమవారం చిత్తూరు కలెక్టరేట్కు వందల సంఖ్యలో నూతన పింఛన్ల మంజూరు కోసం అర్జీలు ఇస్తున్నారు. ఆ అర్జీలను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప న్యాయం చేయడం లేదు. అసలే వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులపై కూడా కూటమి సర్కారు కన్నెర్ర చేసింది. తాజాగా ఆగస్టు నెలలో చిత్తూరు జిల్లాలోని 4,732 దివ్యాంగ పింఛన్లను తొలగించింది. దీంతో పింఛన్ తొలగించిన దివ్యాంగ లబ్ధిదారులు వందలాది మంది చిత్తూరు కలెక్టరేట్కు విచ్చేశారు. తమ సదరం సర్టిఫికెట్లను చేతపట్టుకుని కలెక్టరేట్లోని ప్రజాసమస్యల పరిష్కార వేదిక భవనం ముందు బైఠాయించి, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దివ్యాంగులని అనిపించడం లేదా? చూడగానే వైకల్యం కనిపిస్తున్నా దివ్యాంగులు...నిజమైన దివ్యాంగులనిపించడం లేదా అని దివ్యాంగుల ఐక్యకార్యచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీ అసెస్మెంట్ పేరుతో దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు ప్రాధాన్యమిచ్చిందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వేలాది మంది అనర్హులంటూ పింఛన్లు తొలగించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో వైద్యుల బృందం నిర్ధారించి సర్టిఫికెట్లు అందజేసి పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు తాజాగా నోటీసులు జారీ చేసి పింఛన్ తొలగించడం దారుణమన్నారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం తొలగించిన పింఛన్లను తిరిగి కొనసాగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని దివ్యాంగుల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై వ్యవహరిస్తున్న అలసత్వ ధోరణి అన్యాయమన్నారు. దివ్యాంగులపై చిన్నచూపు చూస్తే దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పింఛన్లపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది దివ్యాంగులు పొట్టకొట్టడం సబబు కాదన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ దివ్యాంగుల ధర్నా వద్దకు విచ్చేసి వారి సమస్యలను అరగంట సేపు ఓపికగా విని, పరిశీలించారు. పింఛన్లు కోల్పోయిన వందలాది మంది దివ్యాంగులు కన్నీటితో కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. గతంలో వారికి అందజేసిన సర్టిఫికెట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలన చేశారు. తప్పనిసరిగా పునఃపరిశీలన చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని జిల్లా నోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ఇంటర్ ఉ త్తీర్ణత చెందిన విద్యార్థులు ఈ అడ్మిషన్ల ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలన్నారు. సందేహాల నివృత్తికి బీఏ(9494368020), బీకాం (9849959423), బీఎస్సీ (9985165051) నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. -
వింత పోకడలతో కూటమి పాలన
చిత్తూరు కార్పొరేషన్: వింత పోకడలతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ నా యకులు తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, మాట్లాడారు. సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్యాణ్భరత్ మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు తప్ప ఇతరులు వెళ్లకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. నెలరోజులుగా విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హాస్టళ్లు, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తున్నారన్నారు. అది గిట్టని సర్కారు ఇటువంటి ప్రొసిడింగ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్లు మాట్లాడారు. విద్యార్థులకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన బ్యాగుల నందు నాణ్యత లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా విద్యార్థి జేఏసీ ఛైర్మన్ సద్దాం, స్టాండ్లీ, సిరాజ్, కరీమ్, జస్టిన్, రవి, మహేష్, వెంకటేష్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడీలక్స్లు శూన్యం ● పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ కోతలే ● అరకొర సేవలతోనే ఉచిత బస్సు పథకం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో కోతలు పెడుతోంది. నాలుగు రకాల సర్వీసుల్లో ఉచితమని చెప్పి, తీరా షరతులు విధిస్తోంది. జిల్లాలో సిటీ బస్సులు, అల్ట్రా డీలక్స్ సర్వీసులు లేవు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ అంత రాష్ట్ర సర్వీసుల పేరుతో కోతలు పెట్టింది. సరిహద్దుల్లో ఉచిత బస్సు తుస్స్మంటోంది. రాయితీ పేరుతో టికెట్ వసూలు చేస్తోంది. సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. కండక్టర్లు ఉచితమంటే మహిళలపై చిర్రెత్తిపోతున్నారు. ఊరించిన ఉచిత బస్సు పథకం ఉసురుమనిపిస్తోంది. అరకొరగా సీ్త్రశక్తి జిల్లాలోని 5 డిపోల పరిధిలో మొత్తం 461 బస్సు లున్నాయి. ఇందులో పల్లె వెలుగు బస్సులు 246, ఎక్స్ప్రెస్ 73, ఏసీ బస్సులు 4, సూపర్ లగ్జరీ 32, సప్తగిరి ఎక్స్ప్రెస్ 35, అద్దె బస్సులు 71 వరకు ఉన్నాయి. వీటిలో నిత్యం సుమారు 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చింది. దీంతో చాలావరకు బస్సులు తారుమారు అయ్యాయి. ఎక్స్ప్రెస్ బస్సులు వెళుతున్న మార్గాల్లో సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులను తిప్పుతున్నారు. పలు ఎక్స్ప్రెస్ బస్సులపై అంతరాష్ట్ర సర్వీసు అనే బోర్డు పెట్టేశారు. దీంతో ఉన్న బస్సుల్లో కోత పెట్టారు. పల్లె వెలుగు బస్సులను సైతం అంతరాష్ట్ర సర్వీసులుగా తిప్పుతూ, వాటిలో చాలా వరకు షరతులు పెట్టేశారు. దీంతో జిల్లాలో సీ్త్ర శక్తి పథకం అరకొరగా అమలవుతోంది. బస్సులు అరకొరే.. కూటమి ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన సాయంత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం శనివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే ఆ పథకంలో పెట్టిన షరతులతో మహిళా ప్రయాణికులు ఆయోమయంలో పడుతున్నారు. జిల్లాలోని 5 ఆర్టీసీ డిపోల్లో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు మొత్తం 319 ఉండగా.. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 246 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లెవెలుగు 27 బస్సులు, ఎక్స్ప్రెస్ 45 బస్సులు మొత్తం 73 బస్సులు అంతరాష్ట్ర సర్వీసుల పేరుతో తిప్పుతున్నారు. బెంగళూరు, తమిళనాడులోని వేలూరు, తిరుత్తణి, పొన్నై, కృష్ణగిరి, చెన్నె, తిరువణ్ణామలై తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. సరిహద్దులో ఉచితం లేదా..? సరిహద్దు ప్రాంతాల్లోని ప్రయాణికులు ఉచితానికి దూరమవుతున్నాయి. కార్వేటినగరం, ఎస్ఆర్పురం, నగరి, పుత్తూరు, చిత్తూరు, గుడిపాల, యాదమరి, కుప్పం, వి.కోట, రామకుప్పం, పలమనేరు, శాంతిపురం, తదితర ప్రాంతాల్లో ఉచితానికి బదులు రాయితీలు ఇస్తున్నారు. దీంతో మహిళలు ఉచిత పథకంపై విరుచుకుపడుతున్నారు. టికెట్ తీసుకో.. బస్సెక్కు.. టికెట్లు తీసుకుంటేనే ఈ బస్సులో ఎక్కాలని కండక్టర్లు చెప్పడంతో మహిళలు బస్సు దిగేస్తూ.. కూటమి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. వెంటనే అదే మార్గంలో నడిచే మరో ఎక్స్ప్రెస్ బస్సును ప్లాట్ఫాంపైకి తెచ్చారు. ప్రయాణికులు అందులో ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ బస్సులో మహిళలు టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇది ఎక్స్ప్రెస్.. అది ఎక్స్ప్రెస్ కదా? అని బస్సు సిబ్బందిని అడిగితే మాకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. ప్రధాన స్టాపింగ్లో దిగేందుకు కూడా సీ్త్రశక్తి పథకం వర్తించదంటున్నారు. సాయంత్రం వేళ్లల్లో మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కండక్టర్లు బస్సు ఎక్కనివ్వడం లేదు. టికెట్లు తీసుకోవాలని చెబుతున్నారు. మహిళలను ఛీకొడుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఫుల్ అయితే డొక్కు బండమ్మా..తట్టుకోలేదంటూ వెళ్లిపోతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ బస్సులో రోజువారీగా సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే.. ఇందులో అత్యధికంగా మహిళలే ఉన్నారు. 50నుంచి 60 శాతం మంది మహిళలు, 30నుంచి 40 శాతం పురుషులు, 10నుంచి 20 శాతం విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు లెక్క లు చెబుతున్నారు. ప్రధానంగా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సప్తగిరి సర్వీసులనే ప్రయాణం సాగిస్తున్నారని పరిశీలనలో గుర్తించినట్లు చెబుతున్నారు. అయినా మహిళలకు ఉచిత పథకం పథకం అరకొరగానే అందుతోంది. ప్రయాణంలో మహిళలే అధికం సప్తగిరి పేరుతో గోల్మాల్ కాణిపాకం నుంచి తిరుపతికి గతంలో ఎక్స్ప్రెస్ నడిచేది. ఉచిత బస్సు పథకం అమలుతో దాని స్థానంలో సప్తగిరి ఎక్స్ప్రెస్ నడుపుతున్నారని కాణిపాకం వాసులు మండిపడుతున్నారు. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ అన్పిట్ కావడంతో వాటిని పల్లె వెలుగు కింద మార్చేశారు. కానీ వాటికి పల్లె వెలుగు పెయింటింగ్ వేయకుండా అలానే తిప్పుతున్నారు. ఈ బస్సుల్లో ఉచితం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్ఫిట్ అయిన బస్సులు 9 వరకు కుప్పంలో తిప్పుతున్నారు. -
బాబుపాలనలో మోసం గ్యారెంటీ
పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసగించడం మాత్రం గ్యారెంటీ అని, అలాంటి చంద్రబాబును నమ్మవద్దని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ప్రజలను కోరారు. సోమవారం పట్టణంలోని కట్టకిందపాళెంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణంతో కలసి బాబు షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విడుదల చేసిన స్కానర్లు, క్యూఆర్కోడ్ పోస్టర్లను ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్షరీఫ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్లు కాంతమ్మ, గంగులమ్మ, భారతి, పూలత్యాగరాజు, రెడ్డెమ్మ, రేష్మా, భారతి, నూర్జహాన్, సాజిదాబేగం, నటరాజ, కాళిదాసు, కిజర్ఖాన్, జెపి.యాదవ్, నాయకులు ఎస్వీటీ.సోము, ఎస్వీటీ కిషోర్, రాజేష్, అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు. -
దారి దోపిడీ దొంగల అరెస్టు
● రూ. 2 లక్షల విలువైన సొత్తులు స్వాధీనం ● ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులునగరి : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు పి.సతీష్ (19), ఆర్.శంకర్ అలియాస్ అజిత్ (20), ఎంఎస్ విజయకుమార్ (20)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ కథనం మేరకు.. మోటార్ సైకిల్లో ఒంటరిగా వెళుతున్న వృద్ధులను టార్గెట్ చేసి వారి వద్ద నగదు, మొబైలు ఫోన్లు బలవంతంగా తీసుకోవడం, నగదు ఇవ్వకుంటే వారిపై దాడి చేసి గాయపరచడం తదితర దారి దోపీడీ సంఘటనలపై గత రెండు నెలలుగా నగరి పోలీస్ స్టేషన్ మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిని నివారించేందుకు డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు అందిన సమాచారం మేరకు, ఇన్స్పెక్టర్తో పాటు, నగరి ఎస్ఐ విజయనాయక్, ట్రైనీ ఎస్ఐ మారెప్ప, సిబ్బందితో వెళ్లి నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు కీళపట్టు ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ సైకిల్పై వస్తున్న నిందితులు నగరి కాలనీకి చెందిన సతీష్, వేలావడికి చెందిన శంకర్ అలియాస్ అజిత్, కరకంఠాపురం కాలనీకి చెందిన విజయ్ను అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు చోరీల్లో వారు ముద్దాయిలుగా తేలింది. దీంతో వారి వద్ద నుంచి ల్యాప్టాప్, ఫ్యాన్, గ్యాస్ సిలిండర్, బైకు, నోకియా సెల్ఫోన్, రూ.37570 నగదు తదితర రూ. 2 లక్షల మేర సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. దారిదోపిడీ దొంగల అరెస్టులో ప్రతిభ చూపిన పోలీసులు లోకనాథం, ఇంద్ర కుమార్, గజేంద్ర, సురేష్, నవీన్, సత్య, గోపి, రవి, కదిర్ వేలుకు డీఎస్పీ ప్రశంసించారు. -
రాష్ట్ర వాలీబాల్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ సాధించి ఎంపికయ్యారు. సోమవారం వాలీబాల్ కోచ్, పీఈటీ ఉమాపతి మాట్లాడుతూ వరల్డ్ స్కూల్ వాలీబాల్ చాంపియన్షిప్ అండర్–15 బాల, బాలికలకు డిసెంబర్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు చైనా దేశం షాంగ్లూవో నగరంలో పోటీలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయి నుంచి ఎంపికలు జరిగాయన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పడమట జెడ్పీ హైస్కూల్లో ఎంపికలు నిర్వహించారన్నారు. ఈ ఎంపికల్లో ఎంపికై న ఏపీ టీంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ప్రతిభ చూపి, స్థానం సంపాదించారని తెలిపారు. బాలుర విభాగంలో చౌడేపల్లికి చెందిన నిరంజన్, సోమ లకు చెందిన దస్తగిరిబాషా, బాలికల విభాగంలో తిరుపతికి చెందిన కుమారి, దేవి శ్రీ అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. అనంతరం ఆ విద్యార్థులను పలువురు అభినందించారు. -
హత్యకేసులో నిందితుల అరెస్టు
యాదమరి: హత్యకేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పచ్చిమ విభాగ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు.. తొట్టిగానిఇండ్లకు చెందిన విజయ్కుమార్(26) తమిళనాడు రాష్ట్రం పరదరామిలో ఆవులు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాల కోసం సన్నిహితుల నుంచి రూ.5 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో కుటుంబసభ్యులను తన అప్పులను తీర్చమని వేధించసాగాడు. ఈ క్రమంలోనే ఈనెల పదో తేదీన తాను చేసిన అప్పులు చెల్లించడానికి అవసరమైన రూ.5లక్షలు ఇవ్వకపోతే ఇంటిల్లిపాదిని హతమారుస్తానని మద్యం మత్తులో బెదిరించాడు. ఈ క్రమంలో ఘర్షణ పడ్డారు. అప్పటికే హతుడు ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉండడంతో గ్రామంలో అవమానంగా భావించిన కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి జరిగిన అగౌరవానికి భంగపడ్డారు. దీంతో హతుని తండ్రి సదాశివం, పెద్ద కుమారుడు శివకుమార్తో కలిసి పొలం దగ్గర నిద్రిస్తున్న విజయ్కుమార్పై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని తాడుతో గొంతుకు బిగించి హతమార్చారు. అయితే ఎక్కడ తమపై అనుమానం వస్తుందోనని, పొలంలోని ఓ చెట్టుకు ఉరి వేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మృతుని తల్లి పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. హతునితోపాటు అతడి తండ్రి, సోదరుని శరీరంపై గాయాలుండంతో వారి ఇద్దరితోపాటూ మృతుని తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ఈశ్వర్ తనదైన పందాలో విచారించగా హత్యను తామే చేసినట్లుగా సదాశివం, శివకుమార్ నేరాన్ని అంగీకరించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ ఈశ్వర్ చెప్పారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
బంగారుపాళెం: భార్యను హత్య చేసిన సంఘటనలో సోమవారం భర్తను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కొదలమడుగు గ్రామం బీసీ కాలనీకి చెందిన హరిబాబు ఈ నెల 16 వతేదీన తన భార్య ప్రియాంకను హత్య చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసుకు సంబంధించి హరిబాబును మొగిలి గ్రామం వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు. శ్రీగంధం చెక్కల పట్టివేత గుడుపల్లె: తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు గుడివంక అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుడుపల్లె జెడ్పీ హైస్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు వాహనాల్లో వస్తుండగా పట్టుకున్నారు. వారివద్ద 6.5 కిలోల శ్రీగంధపు దిమ్మెలు ఉండగా గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోవిందరాజులు, తిరుపతి, రామలింగం, శివశక్తి అని తెలిసింది. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి కుప్పంరూరల్: ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన కుప్పం మండలం, తంబిగానిపల్లిలో సోమవారం చోటు చే సుకుంది. కుప్పం సీఐ శంకరయ్య కథనం మేరకు.. తంబిగానిపల్లికు చెందిన సింగారవేలు, కంగుంది గ్రామానికి చెందిన దుర్గా (27)తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. కొంత కా లంగా దుర్గ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం దుర్గ ఇంట్లో పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మె ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నా యని దుర్గ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం సీఐ శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలని తిరుమల పాదయాత్ర
రొంపిచెర్ల: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ అన్నమ్మయ్య జిల్లా పీలేరు నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పాద యాత్ర చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా రొంపిచెర్ల జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్ రెడ్డి వారికి స్వాగతం పలికి, తన మద్దతు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లడుతూ సూపర్సిక్స్ పథకాలను బయట పెడుతున్నారనే వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఈ పాదయాత్రలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి, అధికార ప్రతినిధి సుంకర చక్రధర్, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లీశ్వరి, మైనార్టీ మహిళా విభాగం నియోజక వర్గం కార్యదర్శి శాన్వాస్ బేగం, నేతలు లోకనాథరెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, కాలనీ చిన్ని, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, షాకీర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల పూజలు రొంపిచెర్ల: అక్రమ మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ రొంపిచెర్ల మండలం మోటుమల్లెల శివాలయంలో అయ్యప్ప స్వాములు సోమవారం పూజ లు చేసి, కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్రెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీతో పని చేస్తున్న ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమంగా మద్యం కేసు పెట్టి, అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, అమరనాథరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. -
ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కార్వేటినగరం: ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారి, పోలింగ్ వ్యవస్థను తారమారు చేసి ఆ పార్టీకి వంత పాడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం నారాయణస్వామి పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ బీజేపీకి వంత పాడుతూ ప్రజల ఓటుహక్కును కాలరాసిందని ఆరోపించారు. పోలింగ్ బూత్లో ప్రజలు వేసిన ఓట్లు ఏమయ్యాయని, దీనికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని డిమాండ్ఽ చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా బీజేపీ ఎన్నికల కమిషన్ను గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికలు జరిపిస్తోందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ బేజేపీ కలసి చేసిన ఓట్ల చోరీ నిర్వాహకంపై దేశవ్యాప్తంగా చర్చించుకుంటోందన్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్నారు. దివ్యాంగులపై కూటమి క్రూరత్వం వెదురుకుప్పం: సూపర్సిక్స్ అమలు చేస్తున్నామని చెబుతూ మరో పక్క దివ్యాంగులు, పేదలు, ఆటో కార్మికుల కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం మండలంలోని ధర్మాచెరువు గ్రామంలో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలోనే సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. సమాజంలో పేదరికంతో మగ్గిపోతున్న బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలికొదిలేసినట్లు విమర్శించారు. వికలాంగులకు అందించే పింఛన్లలో కోతలు విధించి, వారిని రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మురగయ్య, రాజా రెడ్డి పాల్గొన్నారు. -
బోయకొండ పాలకమండలికి 13 దరఖాస్తులు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలకమండలి సభ్యత్వానికి 13 మంది సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఈ నెల7వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చౌడేపల్లె మండలం ఎర్రగానిపల్లెకు చెందిన ఎం.లక్ష్మణ్రాజు(పతిరాజు), పాలక మండలి సభ్యత్వానికి మరో 12 మంది టీడీపీ నేతలతో కలిసి దరఖాస్తులను ఆలయ పరిపాలన కార్యాలయంలో ఈఓకు అందజేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని, ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణరాజు, ప్రదీప్రాజు, సీవీ రెడ్డి, మాధవరెడ్డి, హరిప్రసాద్, కార్తీక్, ప్రహ్లద, రెడ్డిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు గంగమ్మగుడి విద్యార్థి
శ్రీరంగరాజపురం: జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు మండలంలోని గంగమ్మగుడి జెడ్పీ హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థి ఎన్.మధు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి సోమవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మధు పాల్గొని, ఉత్తమ ప్రతిభను కనబరచడంతో జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా ఈనెల 22 నుంచి 24 వరకు బిహార్లోని బుద్ధగయాలో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మధును ఉపాధ్యాయులు లోకనాథం, బాలాజీ, చంద్రశేఖర్, బాబు, పద్మశ్రీ, సత్య, జానకి, సరోజమ్మ, ప్రసన్నకుమారి, అరుణ అభినందించారు. -
అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి
● సమస్యలు పరిష్కరించాలని అర్జీదారుల మొర ● వివిధ సమస్యలపై 324 అర్జీలు నమోదు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : అయ్యా దండం పెట్టి మొరపెట్టుకుంటున్నాం.. తమ సమస్యలను పరిష్కరించండని అర్జీదారులు ఉన్నతాధికారుల ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఓ వాసుదేవన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 324 అర్జీలు నమోదయ్యాయి. ఇంటి పట్టా ఇప్పించడయ్యా చాలా ఏళ్లుగా సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నామని, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని గుడిపాల మండలంలోని మండికృష్ణాపురం, మాదిగపల్లి, పెరుమాళ్లకుప్పం గ్రామాలకు చెందిన ప్రజలు కోరారు. ఆయా గ్రామస్తులు ధనంజయ, రాజేంద్ర మాట్లాడుతూ ఎస్సీలైన తమకు సొంత ఇళ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, తమ గ్రామంలో సర్వే నంబర్ 141లో 36 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని పరిశీలించి ఇళ్లు లేని తమకు కేటాయించాలని కోరారు. వితంతు పింఛన్ ఇప్పించడయ్యా తనకు వితంతు పింఛన్ ఇప్పించడయ్యా అని గంగవరం మండలం పత్తికొండగ్రామానికి చెందిన నాగమ్మ వాపోయారు. ఆమె మాట్లాడుతూ తనకు ఎలాంటి జీవనాధారం లేదన్నారు. వితంతు పింఛన్ కోసం సచివాలయం, మండల కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేదన్నారు. దయతో వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. గ్రానైట్ బండగా చూపిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఎద్దులబండపై తాము పండించుకునే పంటలను ఆరబెట్టుకుంటున్నామని, అయితే ప్రస్తుతం ఆ బండను గ్రానైట్ బండగా చూపిస్తున్నారని వెదురుకుప్పం మండలం కొమ్మరగుంట వాసులు వాపోయారు. ఆ గ్రామస్తులు నారాయణరెడ్డి, శాంతమ్మ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తమ గ్రామంలోని రైతులు సమీపంలో ఎద్దులబండపై తమ గ్రామంలో పండించే రాగులు, వరి, వేరుశనగ ఉత్పత్తులను ఆరబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బండను గ్రానైట్ బండగా చూపించి కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. న్యాయం చేయాలని కోరారు. దారి సమస్య పరిష్కరించాలి దారి సమస్య పరిష్కరించాలని బంగారుపాళెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన కేశవయ్య కోరారు. ఆ గ్రామస్తులు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన రాజమ్మ గ్రామ ఖాతా నంబర్ 119/4 ఏ లో తన పేరుపై 35 సెంట్లు, ఖాతా నంబర్ 118/ఏ లో 1.02 ఎకరాల భూమి ఉందన్నారు. తమ పొలానికి వెళ్లడానికి దారి లేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి తమకు దారి సమస్య కల్పించాలని కోరారు. -
ఎవరూ అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
చౌడేపల్లె: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నేతలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం భాగేపల్లెలో కాగతి సర్పంచ్ షంషీర్, కోఆప్షన్ మెంబరు సాధిక్ బాషా, నేతలు బ్రహ్మానందరెడ్డి, నారాయణరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎవరూ అధైర్య పడొద్దని.. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ పటిష్టత కోసం కష్టపడి చురుగ్గా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చి కమిటీలో స్థానం కేటాయించాలన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ, రైతు, యువత, మహిళా కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో ఇంటింటా ప్రచారం నిర్వహించి కూటమి మోసాలు, దౌర్జన్యాలను తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఆయన వెంట బాబాజాన్, షేర్ఖాన్, నరేష్ తదితరులు ఉన్నారు. -
తెప్పపై సుబ్రహ్మణ్యస్వామి విహారం
కార్వేటినగరం: ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజు ఆదివారం స్కంధ పుష్కరిణి సమీపంలోని కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారు శనివారం పురవీధుల్లో విహరించారు. ముందుగా స్వామివారిని పట్టువస్త్ర, సుగంధ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.వేడుకగా సారె సమర్పణచాకలివానిగుంట ఎస్టీకాలనీకి చెందిన వారు వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ఆనవాయితీ ప్రకారం పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలికలను ప్రత్యేక వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.కనుల పండువగా కల్యాణోత్సవంవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారి శిరస్సుపై ముత్యాల తలంబ్రాలు పోసి నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారి కల్యాణానికి ఉభయదారులుగా ఎంపీపీ లతాబాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రాత్రి స్వామివారిని స్కంధపుష్కరిణిలో తెప్పపై ప్రతిష్టించారు. తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కృష్ణనాయక్, రవియాదవు, రాజశేఖర్, భక్తులు పాల్గొన్నారు. -
రాజనాలబండలో ముగిసిన తిరుణాల
● ప్రత్యేక పూజలందుకున్న వీరాంజనేయస్వామి ● తిరుణాలకు పోటెత్తిన భక్తులు చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ తిరుణాల అట్టహాసంగా ముగిసింది. తొలుత రాజనాలబండకు సమీపంలోని కొత్తగూబలవారిపల్లె, దాసరయ్యగారిపల్లె, పెద్దూరు, ఉటూరు గ్రామాలకు చెందిన దేవరెద్దులతో గ్రామపెద్దలు మేళతాళాల నడుమ రాజనాలబండకు చేరుకున్నారు. కొలింపల్లె గ్రామం నుంచి గ్రామదేవత బోయకొండ గంగమ్మ అమ్మవారి ఉత్సవమూర్తితో కలసి ఊరేగింపుగా కోలాటలు, చెక్కభజనలు, పిల్లనగ్రోవుల గానామృతంతో పాటు కత్తిసాముతో నృత్యం చేస్తూ చేరుకుని సంప్రదాయబద్ధంగా బండారు పంపకం జరిగింది. అక్కడి నుంచి దేవరెద్దులతో బోయకొండ అమ్మవారి ఉత్సవమూర్తిని కలశాలను గ్రామపెద్దలు, వంశపారపర్యంగా తెచ్చిన వారికి టీటీడీ డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి రాజనాలబండ ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ మేళతాళాలతో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించి ఆలయంలోకి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు రాజనాలబండకు రావడంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో వీరాంజనేయస్వామికి పూజలు చేశారు. ఉట్లోత్సవం, పోకుమాను బరుగుట వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోకుమాను పైకి ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. మల్లువారిపల్లె నుంచి రాజనాలబండ వరకు వాహనాల రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్, ఏఈఓ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు భానుప్రకాష్, ధనుంజయరాజు, ఉదయ్కుమార్, రాజేష్, శ్రీహర్ష, చంద్రశేఖర్, దిలీప్ తదితరులు పర్యవేక్షించారు. ప్రత్యేక పూజలందుకుంటున్న వీరాంజనేయస్వామి, పోకుమాను ఎక్కుతున్న యువకులు, దేవరెద్దులను తీసుకొస్తున్న దృశ్యం -
ప్రయాస్.. పరిశోధనలకు చాన్స్
నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థుల దృష్టి మరల్చేందుకు, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి కేంద్రం ప్రయాస్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆసక్తి గల విద్యార్థుల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న 9 నుంచి 11 వ తరగతి వరకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ప్రతిపాదనలను దరఖాస్తు చేసేలా చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సంస్థ ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 6,426 ఉన్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 9 వ తరగతి నుంచి 11 వ తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రయాస్ పథకం అర్హులు. జిల్లాలో 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఈ విద్యాసంవత్సరంలో 42 వేల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు ప్రాజెక్టు ప్రతిపాదనలను పంపవచ్చు. అయితే ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆన్లైన్ విధానంలో ఈ నెల 30వ తేదీలోపు ప్రతిపాదనల దరఖాస్తులను పంపేందుకు అవకాశం కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇలా దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల ప్రతిపాదనలను సెప్టెంబర్ 15 లోగా పరిశీలన చేసి అక్టోబర్ 15వ తేదీన విజేతలను కేంద్రం ప్రకటించనుంది. జిల్లాలోని స్కూళ్లు, కళాశాలల సమాచారం కేటగిరీ స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య ప్రాథమిక 4,247 59,067 ప్రాథమికోన్నత 738 42,380 ఉన్నత 1,203 3,037 జూనియర్కాలేజీలు 238 27,700 మొత్తం 6,426 1,59,454 ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీ ఆగస్టు 30 దరఖాస్తుల స్క్రీనింగ్ సెప్టెంబర్ 15 జ్యూరీ ఎంపిక గడువు సెప్టెంబర్ 30 ఫలితల ప్రకటన అక్టోబర్ 15 ఎంపికయ్యే ప్రాజెక్టుల ప్రారంభం అక్టోబర్ 16 ప్రాజెక్టు ముగింపు తేదీ అక్టోబర్ 16–2026 రిపోర్ట్ సబ్మిషన్ తేదీ అక్టోబర్ 20–2026 -
డీఫార్మసీతో ఉజ్వల భవిష్యత్తు
–రేపు దరఖాస్తులకు చివరి గడువు తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులకు మంగళవారంతో గడువు ముగయనుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. డీఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. కోర్సులో ప్రవేశం పొంది.. రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టీఫికెట్ కలిగి ఉన్న పేద విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లు అందుతాయని తెలిపారు. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 99088 57585, 9966761446, 99635 41557 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
టీచర్ల అపరిష్కృత సమస్యలపై వినతి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ టీచర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆదివారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి అన్ని కేడర్లలో ఉద్యోగోన్నతులు చేపట్టాలన్నారు. 12వ పీఆర్సీ కమిటీ, ఐఆర్ ప్రకటన, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బకాయిల విడుదల ఆలస్యం అవుతోందని త్వరలో మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారన్నారు. తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం 10 వ తరగతి పరీక్షలు తెలుగు మీడియంలో రాయాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించినట్లు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చేపట్టబోయే మై స్కూల్, మై ప్రైడ్ పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసినట్లు ఆయన వెల్లడించారు. వైభవంగా గోకులాష్టమి నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం గోకులాష్టమి పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువనే సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. తిరుచ్చిపై శ్రీకృష్ణుని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారు, గోపాలునికి స్నపన తిరుమంజనం జరిపించారు. దేవదేవేరులు, శ్రీకృష్ణస్వామివారిని తిరుచ్చిపై ఊరేగింపుగా పదహారు కాళ్ల మండపానికి వేంచేపు చేశారు. ఈ మేరకు వేడుకగా ఉట్లోత్సవం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టి సందడి చేశారు. అనంతరం ఉత్సవర్లను ఆలయానికి తీసుకువచ్చి ఆస్థానం చేపట్టారు. ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, శ్రీనివాసభట్టాచార్య, నరసింహరాఘవ భట్టాచార్య, ఆర్జితం అధికారి భరత్ పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
సదుం: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. అక్రమ కేసులో అరెస్టు అయిన ఎంపీ విడుదల కావాలని సింగిల్విండో మాజీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. అనంతరం 116 టెంకాయలను నాయకులు కొట్టారు. వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పెద్దిరెడ్డి వెల్లడించారు. కేసుల పేరుతో జైళ్లలో ఉంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే గొంతుకలను నియంత్రించాలని భావిస్తే, అది వారి భ్రమ మాత్రమే అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను పార్టీ ఆధ్వర్యంలో ఎదిరించి, ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. కూటమి పాలనపై ప్రజలు ఈ కొద్దిరోజులకే విసిగి పోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పుట్రాజు, రమణ, రమణారెడ్డి, వాసు, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, ఈశ్వర్ రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో పోటెత్తిన బోయకొండ
చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట వరాలిచ్చే ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో బోయకొండకు చేరుకుని అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనెదీపాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. 20న విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక గాంధీరోడ్డులోని ట్రాన్స్కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వివరించారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు చౌడేపల్లె: అంకాలమ్మ కొండ సమీపంలోని అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, పశువులు, గొర్రెలు, మేకల కాపరులు వెళ్లొద్దొంటూ సోమల సెక్షన్ ఆఫీసర్ ఇంద్రాణి హెచ్చరికలు చేశారు. ఆదివారం ఆమె ఆమినిగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. గత రెండు రోజుల కిందట గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెలను గాయపరిచిన ఘటనపై అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరూ అడవుల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. కొండ చుట్టూ పంటలు సాగుచేసిన రైతులు ఒంటరిగా వెళ్లరాదని, అడవి జంతువులు కనిపిస్తే బిగ్గరగా కేకలు వేయాలని సూచించారు. చిరుతపులి ఇటీవల కాలంలో వరుసగా పశువులు, గొర్రెలపై దాడి చేసిందని గుర్తుచేశారు. ఎలాంటి ఘటనలు తలెత్తినా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట ఎఫ్బీఓలు ప్రభాకర్, రామచంద్ర తదితరులు ఉన్నారు. -
ఆడికృత్తికకు పుట్టింటికి వచ్చి..
శ్రీరంగరాజపురం : ఆడికృత్తిక పండుగకు పుట్టింటికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. పాతపాళ్యం గ్రామానికి చెందిన చిన్నస్వామి చివరి కుమార్తె పూజ (30)ను యాదమరి మండలం పరదరామి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే పూజ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఆడికృత్తిక సందర్భంగా పూజ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పాతపాళ్యం గ్రామానికి వచ్చింది. ఆదివారం తమ పొలం వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కింద పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను చూసి గ్రామస్తులు బోరున విలపించారు. -
ప్యాక్హౌస్.. సబ్సిడీ మిస్
పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ప్రభుత్వ హామీని నమ్మి ప్యాక్ హౌస్లను నిర్మించుకుని ఆర్థికంగా మరింత కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం ప్యాక్ హౌస్ నిర్మాణాలకు అనుమతిస్తూ 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో సబ్సిడీ అందుతుందనే నమ్మకంతో రైతులు నిర్మాణాలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.8 లక్షల హెక్టార్లలో మమాడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి దాదాపు 67 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏటా మంచి దిగుబడినిచ్చే తోతాపురి దిగుబడిని రైతులు అత్యధికంగా జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. అయితే పక్వానికి వచ్చిన కాయలను రైతులు గ్రేడింగ్ చేసుకుని మంచి రేటుకు అమ్ముకునేందుకు వీలుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్యాక్హౌస్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సకాలంలో సబ్సిడీ మొత్తాలను అందించి రైతులకు ఆర్థిక తోడ్పాటునందించింది. అయితే కూటమి ప్రభుత్వంలో ప్యాక్ హౌస్లు నిర్మించుకున్న రైతులు సబ్సిడీ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాక్ హౌస్ అంటే ? ఎంఐడీహెచ్– మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యానవన సమగ్రాభివృద్ధి మిషన్) పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకమే ప్యాక్ హౌస్. మామిడి రైతులు పంట దిగుబడి సమయంలో కాయలను గ్రేడింగ్ చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడానికి వీలుగా తోటల్లోనే ఏర్పాటు చేసుకునే చిన్నపాటి షెడ్డునే ప్యాక్ హౌస్ అంటారు. వీటిని గ్రామాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తారు. 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో, రేకుల పైకప్పుతో నిర్మాణం చేపట్టాలి. వీటిలో సాధారణంగా పంట దిగుబడి సమయంలో రోజువారిగా నాలుగు నుంచి ఐదు టన్నుల మేర నిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటుంది. 50 శాతం సబ్సిడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసే ప్యాక్ హౌస్ నిర్మాణాలకు 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. ఒక్కో ప్యాక్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వ అంచనా వ్యయం రూ.4 లక్షలు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.2 లక్షల ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాతో చెల్లించాల్సి ఉంది.బడ్జెట్ రిలీజ్ అయింది ప్రభుత్వం జిల్లాలో మొత్తం 30 ప్యాక్ హౌస్ నిర్మాణాలను మంజూరు చేసింది. ఇందుకోసం ఇటీవలే బడ్జెట్ రిలీజ్ అయింది. అయితే ప్యాక్ హౌస్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడంతో సబ్సిడీ రిలీజ్ చేయడం లేదు. ప్యాక్హౌస్ నిర్మాణం అంటే ఒక్క షెడ్ మాత్రమే కాదు. అందులో రెండు ఫ్యాన్లు, ఐదు లైట్లు, గ్రేడింగ్ టేబుల్, వేవింగ్ మిషన్, ట్రేలు వంటి వస్తువులు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది. అన్నీ ఏర్పాటు చేస్తే సబ్బిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. – బి.దశరథరామిరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, తిరుపతి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మా ప్రాజెక్టు పూర్తి చేసి 4 నెలలైంది. రూ.4 లక్షల అంచనా వ్యయంతో చేపట్టగా రూ.4.65 లక్షలు ఖర్చు అయింది. ఇందుకు సంబంధించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసి నెలలు గడుస్తున్నా ఇంకా సబ్బిడీ మొత్తం అందలేదు. సబ్సిడీ వస్తుందని కొంత అప్పు చేసి మరీ నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.ఉషారాణి, మహిళా రైతు, శాంతినగర్, పుత్తూరు -
గంగమ్మతల్లి ఆశీస్సులు అందాలి
పుంగనూరు: గంగమ్మతల్లి ఆశీస్సులు అందరికీ అందించి, అందరూ బాగుండేలా చూడాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రార్థించారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బాగేపల్లె గ్రామంలో గ్రామస్తులు నిర్మిస్తున్న నూతన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దిరెడ్డికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో సరదాగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భక్తిమార్గంలో పయణిస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామంలోనూ రామాలయాలు, గంగమ్మ ఆలయాలు నిర్మించి, ఆధ్యాత్మికత వైపు పల్లెలు పయణిస్తుండడం అభినందనీయమన్నారు. గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజ లంతా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్రెడ్డి, రాజారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఏనుగుల గుంపు మరోసారి దాడి చేసి పంటలను నాశనం చేశాయి.ముగిసిన తిరుణాల సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో తిరుణాల ఆదివారం అట్టహాసంగా ముగిసింది.సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి పాలకుల నిర్లక్ష్యంతో అన్నదాత గుండె బరువెక్కుతోంది. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న వారిపై ఎరువుల ధరల పెంపు అదనపు భారాన్ని మోపుతోంది. ప్రకృతికి ఎదురొడ్డి వ్యవసాయం చేస్తున్న జిల్లా రైతాంగానికి పాలకులు ఏమాత్రమూ సాయంగా నిలవలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగి అల్లాడిపోతున్న రైతులను ఎరువు ధరలు మరింత భయపెడుతున్నాయి. వ్యవసాయంలో ప్రధానమైన ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి , ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం కావడంతో ఎరువుల వాడకం మరింత పెరిగింది. గతంలో ఎరువుల ధరలను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడుసార్లు పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. రైతన్నలకు సాగు మరింత భారంగా మారుతోంది. సాగు విస్తీర్ణం ఇలా.. జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లు కాగా సరైన సమయంలో వర్షాలు కురవక ఇప్పటి దాకా కేవలం 50 నుంచి 70 వేల హెక్టార్లల్లో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. అందులో వేరుశనగ 3194 హెక్టార్లు, వరి 2747, కంది 135.0, చెరకు 2284, రాగి 113.5, టమాట 4,000, వివిధ రకాల కూరగాయల పంటలు 30 వేల హెక్టార్లతో పాటు ఇంకా పలు రకాల పంటలు, పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. అవసరానికి సరిపడా లేక జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువులు అవసరానికి సరిపడా లభించలేదు. ఒకవేళ దొరికినా అధిక ధరలతో పాటు వేరే ఎరువులు కూడా కొనాలనే ఒత్తిడి జిల్లా రైతాంగం ఎదుర్కొంటోంది. అవసరానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఒకసారి, కేంద్రం... రాష్ట్రానికి నెల వారీగా ఇవ్వాల్సిన కోటా ఎరువులు పంపడం లేదని ఇంకోసారి.. ఇలా కూటమి సర్కారు పొంతన లేని ప్రకటనలు చేయడం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. వాస్తవానికి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఎరువులను తెప్పించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని టీడీపీ నేతలే కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పక్కరాష్టాలకు పరుగు జిల్లాలో లభ్యమవుతున్న ఎరువుల ధరలు, నాణ్యత లోపం, సరఫరా తదితర విషయాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తద్వారా రైతులు ఎరువుల కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. పలమనేరు, కుప్పం, వీ.కోట, రామకుప్పం, శాంతిపురం, పంగనూరు తదితర ప్రాంతాల్లోని రైతులు ఎరువుల కోసం కర్ణాటకను ఆశ్రయిస్తున్నారు. బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరు, కార్వేటినగరం, నగరి, ఎస్ఆర్పురం, జీడీ నెల్లూరు, పాలసముద్రం తదితర మండలాల్లోని రైతులు తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పరదరామి, పొన్నై, సోలింగరం తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. ఎరువుల నిల్వ (ఫైల్) పెంచిన ధరలు ఏటా ఖరీఫ్తో పాటు రబీ సీజన్లో పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ పాస్పేట్ వంటి ఎరువుల వాడకం పెరుగుతోంది. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగింది. ఫలితంగా దిగుబడి ఎంత వచ్చినా రైతుకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచింది. జిల్లాలో ఒక్కో మండలంలో సరాసరిన రసాయనిక ఎరువులు ఏడాదికి 3,500 టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుం చి గరిష్టంగా రూ.4 వేల వరకూ ఎరువుల ధరలు పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. పంట వచ్చాక వడ్డీతో సహా తీర్చాల్సి ఉండటంతో వచ్చిన ఆదాయం ఎరువుల అప్పులకే సరిపోతోంది. ధరలు తగ్గించాలి ఏ పంట పండించాలన్నా పెట్టుబడి వేధిస్తోంది. బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినా తిరిగీ కట్టే పరిస్థితులు ఉండడం లేదు. పంట దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టాలు చవిచూస్తున్నాం. ఇందుకు నిదర్శనమే మామిడి విపత్తు. ఇప్పుడు అప్పొ..సప్పొ చేసి వరి పండించా. ముఖ్యంగా ఎరువులు దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి. ఇలాగైతే పంట పండించడం మానుకోవాల్సిందే. ఎరువుల ధరలు తగ్గించాలి. – ప్రభాకర్రెడ్డి, ఐరాల మండలం ఎరువుల కోసం తమిళనాడుకు నేను 2 ఎకరాలో అరటి, ఎకరాలో వరి వేశా. ఈ వర్షానికి వరి మొత్తం నేల మట్టమైంది. ఏ పంట పండించినా చేతికి చిల్లిగవ్వ మిగలడం లేదు. కష్టాల్లోనే మిగిలిపోతున్నాం. కర్షకుల కష్టాలు తెలియకుండా ఎరువుల రేట్లను పెంచుకుంటూ పోతే ఎలా. ఇది మంచిది కాదు. రైతులను బతికించాలి. ఎరువుల ధరలను తగ్గించాలి. ఈ దెబ్బతో చాలా మంది రైతులు ఎరువుల కోసం తమిళనాడుకు వెళుతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్లాల్సిందే. – కన్నయ్యనాయుడు, జంగాలపల్లి, చిత్తూరు మండలం రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచి రైతులపై భారాన్ని మోపాయి. ఏటా పెరుగుతున్న ధరల కారణంగా అన్నదాతలకు పంటల సాగు శక్తికి మించిన పనిగా మారుతోంది. పెరుగుతున్న ధరలు రైతన్నలను నడ్డి విరుస్తున్నాయి. నానో యూరియా ద్రవ రూపంలో కేంద్రం తీసుకొచ్చింది. కానీ దానిపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏటా సాగు ఖర్చులు రెట్టింపై వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇప్పటికై న పాలకులు కళ్లు తెరిచి రైతులపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల ధరలు ఇలా..(50 కిలోల బస్తా) ఎరువురకం పాతధర కొత్త ధర (రూ.లల్లో) (రూ.లల్లో) పొటాష్ 1,535 1,800 20–20–013(ఫ్యాక్ట్) 1300 1425 20–20–013(గ్రోమోర్) 1,300 1,350 20–20–013(పీపీఎల్) 1,300 1,400 10–26–26 1,470 1,800 12–32–16 1,470 1,720 16–16–16 1,450 1,600 15–15–15–0–9 1,450 1,600 16–20–0–13 1,250 1,300 24–24–0 1700 1800 14–35–14 1700 1,800 సింగల్ సూపర్ ఫాస్పేట్ 580 640 వైఎస్సార్సీపీ హయాంలో మేలు 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా తోచినప్పుడల్లా ఎరువుల ధరలు పెంచారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రసాయనిక ఎరువుల ధరలు ఒక్కసారి కూడా ధరలు పెరగలేదు. రైతులకు కావాల్సినంత మేర ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రైతుల నడ్డి విరిచేలా ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీకి మంగళం పాడుతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. -
అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపలేరు
నగరి : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్నచూపే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. సినిమా బాగుంటే ఎవరూ అడ్డుకోలేరని, బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందన్నారు. టీడీపీ–జనసేన ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సు చేసి, టికెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా హరిహర వీరమల్లు సినిమాను ఆడించలేకపోయారని గుర్తుచేశారు. సినిమా ఫంక్షన్లల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ ఛేంజర్ గానీ, హరిహరవీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాల్లో లేడని, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడని, ఆయన అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటున్న విషయం మనం చూస్తున్నామన్నారు. -
మమ్మేల్మురుగన్!
ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గుడుపల్లెలోని గుడివంక ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఆశ చూపించింది. ఎన్నికలయ్యాక ఆ మొత్తం పెంచినట్టే పెంచి కోతలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ముసుగులో వేలాది పింఛన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లా ప్రభుత్వాస్పత్రి, ఏరియా ఆస్పత్రుల్లో రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరీక్షల్లో పలువురిని అనర్హులుగా గుర్తించి వేటు వేసింది. పింఛన్లు తొలగింపు 2024 డిసెంబర్ నుంచి సదరన్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 1,936 మంది ఉంటే 1,911 మందిని రీ వెరిఫికేషన్ చేశారు. ఈ పరిశీలనలో 1,677 మంది అర్హులుగా తేలితే 234 మందిని అనర్హులుగా తేల్చారు. అలాగే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి మొత్తం 35,277 మంది ఉంటే 22,338 మందిని రీ వెరిఫికేషన్ చేశారు. వీరిలో ఇప్పటి వరకు అర్హులుగా 17,606 మంది కాగా అనర్హులుగా 4,732 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. వీరి పింఛన్ తొలగించేందుకు సర్వం సిద్ధం చేశారు. అత్యధికంగా చిత్తూరు అర్బన్లో 504, తవణంపల్లి మండలంలో 377, ఐరాలలో 267, యాదమరిలో 263 ఎస్ఆర్పురంలో 238, పెనుమూరులో 225, పుంగనూరులో 216, కార్వేటినగరంలో 189, చిత్తూరు మండలంలో 186, గుడిపాలలో 182 మందిని తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇంకా 12,939 మందిని పునఃపరిశీలన చేయాల్సి ఉండగా మరిన్ని పింఛన్లు కోత పడే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. నోటీసులు జారీ అనర్హత పేరుతో దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ సచివాలయాల ద్వారా నోటీసుల జారీమొదలైంది. ఈ నెల 27 నాటికి తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. తొలగింపు తర్వాతనే సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించిన డేటా విడుదలయ్యే అవకాశం ఉంది. పింఛన్ల కోత..దివ్యాంగుల పింఛన్లపై కూటమి కన్ను ...ఇవి మచ్చుకు మూడు ఘటనలు మాత్రమే. జిల్లాలో ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. కనికరం లేని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల నోటికూడు లాగేస్తోంది. రీ వెరిఫికేషన్ పేరుతో వేలాది పింఛన్లను అడ్డగోలుగా తొలగించేస్తోంది. సచివాలయ వారీగా తొలగింపు జాబితాను పంపింది. అనర్హులంటూ పలువురికి సచివాలయ సిబ్బంది నోటీసులిస్తున్నారు. చేసేది లేక దివ్యాంగులు కంటతడి పెడుతున్నారు. పింఛన్లు నమ్ముకుని జీవించే తమకు ఈ కోతలేమిటని కన్నీరుమున్నీరవుతున్నారు. నా పింఛన్ తొలగించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి రూ.200 పింఛన్ మంజూరైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పింఛన్ అందుకుంటూ వచ్చాను. ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు పర్సంటేజ్ తక్కువ ఉందని పింఛను తొలగించారు. నాకు జీవించడానికి ఎలాంటి ఆధారం లేదు. పింఛన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నా. – సురేంద్రబాబు, కార్వేటినగరం -
నన్ను చూస్తే...జాలి లేదా?
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతులు దినసరి కూలీలు. వీళ్లకు సొంత ఇల్లు లేదు. సెంటు జాగా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు ఇంటి స్థలం మంజూరు చేశారు. వీరి పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతం నుంచి రక్షించేందుకు 19 సవరాల బంగారాన్ని అమ్మేశారు. అయినా కుమారున్ని పక్షవాతం నుంచి కాపాడలేకపోయారు. మందులు, మాత్రలతోనే ప్రాణంతో నిలబెడుతున్నారు. నెలవారీగా రూ.7,500 ఖర్చువుతోంది. 20 ఏళ్లు దాటినా అతని ఆలనాపాలన మొత్తం తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇప్పుడు అతనికి చూపు కూడా మందగించింది. ఈ దుస్థితిని గుర్తించి వైద్యులు 2013లో సదరన్ సర్టిఫికెట్ జారీచేశారు. అప్పటినుంచి పింఛన్ మంజూరవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో భాగంగా ఐదుగురు అధికారులు బృందంగా ఇంటివద్దకు వచ్చి వికలత్వం 40శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు ఇచ్చారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
రాజనాలబండలో తిరుణాల సందడి
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో శనివారం నుంచి తిరుణాల సందడి మొదలైంది. పూర్వీకుల నుంచి శ్రావణమాసపు చివరి శనివారం, ఆదివారం భక్తి శ్రద్ధలతో తిరుణాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుణాలను పురస్కరించుకొని టీటీడీ అధికారులు ఆలయాన్ని విధుద్దీపాలు, పూలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. శనివారం మండలంలోని ప్రజలు, తిరుణాల నిర్వహించే సుమారు 18 గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు భక్తి శ్రద్ధలతో రాజనాలబండకు చేరుకొని శ్రీవీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రాజనాలబండకు సమీపంలో గల ఎత్తైన కొండపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాలినడకన చేరుకొని లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభు విగ్రహానికి అభిషేకాలు చేశారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కొండపై ఆహ్లాదకర వాతావారణం నడుమ సేద తీరారు. అనంతరం ఆలయం వద్ద శనివారం రాత్రి అఖండ దీపారాధన వెలిగించారు. రాజనాలబండ ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి నడిచి వెళ్తున్న భక్తులకు జీఆర్ఎస్ రమణయూత్, ఎస్ఎల్ఎన్ఎస్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. -
ఉద్యమాల నిప్పుకణిక సర్దార్ గౌతులచ్చన్న
చిత్తూరు కలెక్టరేట్: ఉద్యమాల నిప్పు కణిక సర్దార్ గౌతులచ్చన్న అని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో గౌతులచ్చన్న 116 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ నేటి యువతకు సర్దార్ గౌతులచ్చన్న జీవి తం ఆదర్శమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలు చేసిన మహనీయులను గుర్తించుకోవడం మన కర్తవ్యంగా భావించాలన్నారు. 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించిన మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న అని కొనియాడా రు. స్వాతంత్య్రోద్యమం, జమీందారి వ్యతిరేక పోరాటం, హరిజన సేవ, మద్యపాన నిషేధం వంటి రంగా ల్లో లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడు తూ గౌడు లచ్చన్న స్వాతంత్య్ర పోరాటంలో చురుకై న పాత్ర పోషించారన్నారు. చిత్తూరు నగరంలోని ఇరువారంలో వచ్చే సంవత్సరం లోపు గౌతు లచ్చన్న పేరు తో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. నగర మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, మొదలియార్ సంఘం అధ్యక్షుడు త్యాగరాజన్, బీజేపీ నాయకులు అ ట్లూరి శ్రీనివాసులు, డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, తదితరులు పాల్గొని లచ్చన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కావడి మొక్కులు చెల్లించిన మాజీ మంత్రి ఆర్కే రోజా
–సుబ్రమణ్య స్వామికి వెండి శూలాయుధం సమర్పణ నగరి : ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మాజీ మంత్రి ఆర్కేరోజా కావడి మొక్కులు చెల్లించారు. సంప్రదాయ పద్ధతిలో పసుపుచీర ధరించి సుబ్రమణ్యస్వామి వ్రతమాచరించిన ఆమె పుష్పాలతో అలంకరించిన కావడి ఎత్తారు. రాష్ట్ర సరిహద్దులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.తర్వాత మొక్కుబడిలో భాగంగా వెండి శూలాయుధాన్ని హుండీలో వేసి మొక్కు చెల్లించుకున్నారు. ఆమెను ఆలయ పురోహితులు ఆశీర్వదించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, నాయకులు రమేష్రెడ్డి, మురుగ, ఆనంద్కుమార్, కృష్ణమూర్తి, దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
ఓరియంటేషన్లు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 20, 21 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీన మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై, ఈనెల 21న బాలికల కౌమార సమస్యలపై మహిళా ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 187 పింఛన్ల తొలగింపు గుడిపాల: మండల పరిధిలో 187 పింఛన్లను తొలగించినట్లు ఎంపీడీఓ శిరీషా తెలిపారు. ఆమె మాట్లాడుతూ వికలాంగులు, మానసిక రోగులకు సంబంధించిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు సరిగ్గా లేనందున పింఛన్లు తొలగించినట్లు వివరించారు. మండలంలో వికలాంగులు, మానసిక రోగులు తదితరులు 838 మంది ఉన్నారని, అందులో సర్టిఫికెట్లు సరిగా ఉన్న వారు 651 మంది మాత్రమేనని పేర్కొన్నారు. పింఛన్లు తొలగించిన వారిలో 189 కొత్తపల్లెలో 14 మంది, 197రామాపురంలో 16, ఎఎల్పురం 07, బసవాపల్లె 13, బొమ్మసముద్రం 10, చీలాపల్లె 13, చిత్తపార 25, గుడిపాల 07, నంగమంగళం 16, మరకాలకుప్పం 01, నారగల్లు 07, పానాటూరు 22, పాపసముద్రం 12, పేయనపల్లె 04, రామభద్రాపురం 07, వసంతాపురం 11 మంది ఉన్నట్టు వెల్లడించారు. నిత్యావసర సరుకుల వితరణ కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి శనివారం ఓ దాత నిత్యావసర సరుకులు వితరణ చేశారు. తవణంపల్లి మండలం, మైనగుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి రూ.2.5 లక్షల విలువ చేసే బియ్యం 5 టన్నులు, నూనె, కూరగాయలు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి పాల్గొన్నారు. -
శాసీ్త్రయ సమాజ నిర్మాణమే జేవీవీ లక్ష్యం
పలమనేరు: శాసీ్త్రయ సమాజ నిర్మాణమే జనవిజ్ఙాన వేదిక లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డా.గేయానంద్ పేర్కొన్నారు. పల మనేరులోని ఓ ప్రైవేటు స్కూల్లో జేవీవీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలు, సూడోసైన్స్, అశాసీ్త్రయ భావజాలం విపరీతంగా ప్రచారమవుతోందన్నారు. వీటిని అరికట్టి శాసీ్త్రయ సమాజాన్ని నిర్మించాలంటే యువత నడుం బిగించాలన్నారు. మరో అతిఽథి పలమనేరు బాలాజీ మాట్లాడుతూ నేటి సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక నేతలతో కలసి వారు సెప్టంబర్ 13న విజయనగరంలో జరగనున్న జేవీవీ వార్షిక సమావేశపు వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. జేవీవీ జిల్లా నూతన కార్యవర్గం జేవీవీ జిల్లా అధ్యక్షుడిగా అరుణశివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మిఠాయి యుగంధర్బాబు, కోశాధికారి గా గిరిధర్ మూర్తితోపాటు కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నాయకులు మునిరత్నం, బాలచైతన్య, సుధాకర్, విజయకుమార్, ఆనందబెన్, సెల్వం, శ్యామల, రామలింగం పాల్గొన్నారు. -
మమ్మేల్మురుగన్!
గుడుపల్లె: గుడివంక శ్రీవళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యస్వామి కొండ హారోహర.. వేల్ మురుగా.. నామస్మరణంతో మార్మోగింది. శనివారం ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కావళ్లు ఎత్తుకుని పశ్చిమ వాహినిలో స్నానాలు ఆచారించారు. అనంతరం స్వామి వారి నామస్మరణతో పశ్చిమ వాహిని కొండపైకి చెరుకున్నారు. కావళ్లను ఎత్తుకుని ఆలయం చట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ఆకృతులతో కావళ్ల చెలింపు కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామి వారికి పలు ఆకృతులతో కావళ్ల ద్వారా మొక్కులు చెల్లించారు. తేరు కావళ్లు, రాగి గుండులు, ఇనుప శూలాలు, నిమ్మకాయలతో సూదులు శరీరానికి గుచ్చుకుని ఆలయం ఎదుట కావళ్లు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కొంత మంది భక్తులు ఎస్కాట్ వాహనంపై వీపుకు కొక్కిళ్లు వేసుకుని వెలాడుతూ వేల్ మురుగా అంటూ నినాదాలు చేస్తూ ఆలయం చట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గుడివంకలో జన సందడి ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామి వారిని దర్శర్శించుకునేందుకు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం కనిపించింది. పశ్చిమ వాహిని నుంచి ఆలయం వరకు డప్పు వాయిద్యాల నడుమ కావళ్లు ఎత్తుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అలంకరణంతో గంగాధరేశ్వరస్వామి గుడివంక బ్రహ్మోత్సవాల సందర్భంగా గంగాధరేశ్వరస్వామిని ప్రత్యేక ఆలంకరణంతో భక్తులకు దర్శనం కల్పించారు. కొండపై సుబ్రమణ్య స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు గంగాధరేశ్వరస్వామిని దర్శించుకుని గ్రామాలకు తిరుగుప్రయాణమయ్యారు. తేరు కావళ్లతో భక్తుల సందడిశూలాలతో వస్తున్న భక్తులు ఆలయం వద్ద మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు దర్శనం కోసం క్యూలో కిక్కిరిసిన భక్తులు -
నాల్గోసారీ!
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ 4వ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగింది. శనివారం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన, సీఈఓ రవికుమార్నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జేసీ విద్యాదరి హాజరయ్యారు. ఇక సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆదిమూలం, మురళీమోహన్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మినహా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాలేదు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించగా మధ్యాహ్నం 1.30కు ముగించేశారు. అజెండాలో 11 అంశాలపై చర్చ జరపాల్సి ఉండగా.. అందులో రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆర్యోగ శాఖలపై చర్చించి మిగిలిన వాటిని తూతూమంత్రంగా కానిచ్చేశారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల అధికారులు హాజరు కాలేదు. సభ్యుడు కానీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజన్ సమావేశానికి హాజరవ్వడం గమనార్హం. 50 ఏళ్లుగా ఇలాంటి పాలన చూడలేదు ప్రజాప్రతినిధులంటే దిష్టిబొమ్మల్లా అధికారులకు కనపడుతున్నట్టు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పిచ్చి తుగ్లక్ పాలన చూడలేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో తన చేతులమీదుగా ఇచ్చిన చెక్ను మరోసారి కార్యక్రమం పెట్టి ఇంకొకరి చేతుల మీదుగా వ్యవసాయశాఖాధికారులు ఇప్పించారన్నారు. పలు కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. ప్రొటోకాల్ పాటించని అధికారుల పై స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గత పాలనలో రోడ్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో బాగా జరిగాయన్నారు. ప్రస్తుతం 36 రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాపోయారు. ఆర్అండ్బీ బైపాస్ రోడ్డు మంజూరైనా పనులు చేయలేదని, సీకేపొడి, నాగలాపురం– శ్రీసిటీ, నాగలాపురం–టీపీకోట రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. చాలా రోడ్లపై కనీసం ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కేవీపురం మండలం, ఎగవ పూడిబ్రిడ్జి, నారాయణవనంలోని తంబూరు, పాలమంగళం బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. నాగలాపురం–సురటపల్లెకు వెళ్లే మార్గంలో మూడు కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉందన్నారు. జెడ్పీ గెస్ట్హౌస్లో కనీసం ఫర్నిచర్ కూడా లేదన్నారు. 108 వాహనాలు లేవు పలు ప్రభుత్వాస్పత్రుల్లో 102, 104, 108 వాహనాలు అందుబాటులో లేవని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర కేసులను దూరంగా ఉండే ప్రభుత్వాస్పత్రులకు కాకుండా సమీపంలో ఉండే నెట్వర్క్ ఆస్పత్రులకు పంపాలన్నారు. తల్లీబిడ్ల ఎక్స్ప్రెస్ వాహనాల సంఖ్యను పెంచాలని చెప్పారు. గ్రామాల్లో వేసిన బోర్లకు విద్యుత్ సర్వీసులు ఇవ్వడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆరోపించారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, జేసీ విద్యాదరి పక్కన సీఈఓ రవికుమార్నాయుడు సమస్యలు ఏకరువు -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కావాలని పూజలు
పుంగనూరు: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలోని శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనారిటీ సెల్ కన్వీనర్ ఫకృద్దీన్షరీఫ్తో కలసి ఆయన కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి, తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర, వైఎస్సార్సీపీ నా యకులు జయరామిరెడ్డి, కిజర్ఖాన్, రాజేష్, ఖాదర్ బాషా, ఖాదర్, మమ్ము, రేష్మా, అంజాద్, తులసమ్మ, సాజిదా, శ్రీనివాసులు, నజీర్, భారతి, ఇంతియాజ్, రాఘవేంద్ర, అస్లాంమురాధి పాల్గొన్నారు. -
చెరువులో మట్టి తరలింపుపై కలెక్టర్, ఎస్పీ సీరియస్
పెద్దపంజాణి: మండలంలోని బట్టందొడ్డి పంచాయతీ, కొత్తూరుగ్రామ సమీపంలోని ఎర్రచెరువులో మట్టి తవ్వకాలపై మండల అధికారులు ఎవ్వరూ స్పందించక పోవడంతో కలెక్టర్, ఎస్పీ నేరుగా రంగంలోకి దిగారు. దీంతో అక్రమార్కులు ఉడాయించారు. దీనిపై ఫిర్యాదు చేసిన పెద్దపంజాణి సింగిల్ విండో మాజీ చైర్మన్ శంకరప్ప వివరాల మేరకు.. మండలంలోని ఎర్రచెరువులో శనివారం ఉదయం నుంచి అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు శ్రీరామాపురం సమీపంలోని లేఅవుట్కు మట్టి తోలేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను అధికార పార్టీలో ఉన్నానని, తనను ఎవరు అడగుతారంటూ మూడు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో మట్టిని తరలించడం ప్రారంభించాడు. దీనిపై తహసీల్దార్, ఎస్ఐ, మైన్స్, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమార్కులకు కొమ్ముకాయడంతో తాను చేసేదేమి లేక కలెక్టర్, ఎస్పీకి ఫొటోలు, వీడియోలు పంపినట్టు ఆయన వివరించారు. చివరకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించడంతో విషయం తెలుసుకున్న చోటానాయకుడు వాహనాలతో సహా అధికారులు రాకముందే చెరువు నుంచి ఉడాయించాడని తెలిపారు. మొగిలి ఘాట్లో లారీ బోల్తా బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం వేకువజామున లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కర్ణాటకలోని హసన్ నుంచి విజయవాడకు దానిమ్మ, ద్రాక్ష పండ్ల లోడ్డుతో వెళ్తున్న లారీ మొగిలి ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో భయటపడ్డారు. రహదారిపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు. -
బాధితులకు పరామర్శ
గంగాధరనెల్లూరు: కారులో గత మంగళవారం తిరుత్తణికి వెళ్తూ ప్రమాదానికి గురై గాయపడి, రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. శనివారం తమిళనాడులోని రాణిపేట సీఎంసీకి తమిళనాడు రాష్ట్రం, షోలింగర్ మాజీ ఎమ్మెల్యే పార్దిబన్తో కలిసి చేరుకున్నారు. సీఎంసీ డైరెక్టర్ దీపక్ సెల్వంతో భేటీ అయ్యారు. ప్రమాద బాధితులకు ప్రత్యేక వైద్య సేవలందించాలని కోరారు. చిట్టెమ్మ, రేఖ, కీర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీకరరెడ్డి, రూపకుమార్రెడ్డి, సురేంద్రరెడ్డి ఉన్నారు. -
సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాల సమర్పణ
సదుం: స్థానిక శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భరణి కావళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. శనివారం ఆడికృత్తిక సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే భక్తులకు అన్నదానం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతమ్మ ఆలయం వద్దకు చేరుకుని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తాటిగుంటపాలెంలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్రెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరమణ, నారాయణరెడ్డి, పుట్రాజు, ఇమ్రాన్, కల్యాణ భరత్, అంజిబాబు, వెంకటస్వామి, మోహన్ రెడ్డి, దామోదర రెడ్డి, గిరిధర్ రెడ్డి, ఎల్లారెడ్డి, హనుమంత రెడ్డి, వాసు, బాబు, హరినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీకి బెయిల్ రావాలని పాదయాత్ర
చిత్తూరు కార్పొరేషన్, చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికు బెయిల్ రావాలని వైఎస్సార్సీపీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ఆధ్వర్యంలో చిత్తూరు–కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం స్థానిక దొడ్డిపల్లెలోని సప్తకనికలమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ర్యాలీని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, ఉద్యోగుల పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడారు. అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎంపీ మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు త్వరగా బెయిల్ రావాలని అమ్మవారిని ప్రార్థించి కాణిపాకం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. చేయని తప్పుకు ఎంపీని జైలులో పెట్టడం ఎంత వరకు న్యాయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాణిపాకంలో స్వామివారిని దర్శించుకొని ప్రార్థనాలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గుడిపాల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, చిత్తూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు జయపాల్, జెడ్పీటీసీ బాబునాయుడు, నాయకులు, ప్రజాప్రతినిధులు హరీషారెడ్డి, ప్రతిమారెడ్డి, మధురెడ్డి, శివ,మనోజ్రెడ్డి, అన్బు, మధుసూదన్, త్యాగ, అమర్నాథ్రెడ్డి, సంపత్, అప్పొజీ, భాను, స్టాండ్లీ,శేఖర్, లోక, చంద్ర, చామంతి, జస్టిన్, శ్యామ్, సద్దాం, రవి, మహేష్, చిన్నా, ట్వింకిల్, శివారెడ్డి, సెల్వ, విజయ్ పాల్గొన్నారు. -
మిథున్రెడ్డి విడుదల కావాలని దర్గాలో ప్రార్థనలు
చౌడేపల్లె : అక్రమ కేసులో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని జైలుకు పంపారని త్వరగా బెయిల్ ఇవ్వడంతో పాటు అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకురావాలని దాదేపల్లెలోని మషాయక్ బహదూర్ అలీషాబాబా దర్గాలో దుర్గసముద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం దర్గాలో బాబా మజ్జార్కు చాదర్ను కప్పి గంధం, పూలు సమర్పించి మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు , దువ్వా చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకొని వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, అమర, కో ఆప్షన్ మెంబర్ సాధిక్, రమేష్బాబు, ఉపసర్పంచ్లు కృష్ణంరాజు, అల్తాఫ్, వైఎస్సార్సీపీనేతలు సుబ్రమణ్యం రాజు, అల్తాఫ్,రెడ్డిభాషా, అనీష్ తదితరులున్నారు. -
5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం
జిల్లాలో 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకం రెపరెలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలుతో వివిధ శాఖల అధికారులతో కలిసి జెండావిష్కరణ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షో అలరించింది. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ : రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. డిజిటల్ నెర్వ్ సెంటర్లు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా కుప్పంలో నిర్వహిస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్లను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం కుప్పంలో ఏర్పాటు చేసిన నెర్వ్ సెంటర్ పరిధిలోకి 13 వైద్య ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవలను సమన్వయం చేస్తూ వ్యక్తుల హెల్త్ హిస్టరీని డిజిటలైజ్ చేయడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో రూ.5 లక్షలు వార్షిక ఆదాయం లోపు ఉన్న ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయల ఖర్చు పైబడి ఉన్న 3255 జబ్బులకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 47,725 మందికి రూ.91 కోట్లు, ఆరోగ్య ఆసరాలో 15,711 మందికి రూ.7.80 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలుగా భావించి గ్రామాల అ భివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాలో పల్లెపండుగలో ఇప్పటి వ రకు రూ.85 కోట్లతో పనులు ప్రారంభించామని, ఇందుకు 1454 రోడ్లు పూర్తి కాగా, రూ.19 కోట్ల తో ప్రా రంభించిన 33 బీటీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నా యని చెప్పారు. స్వా మిత్రా డ్రోన్ టెక్నాలజీ జిల్లాలోని 781 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. జిల్లా లో 72,763 గృహాలకు ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్ష ల చొప్పున రూ.1350 కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు చేస్తున్నామన్నారు. జెండా వందనం చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్, కలెక్టర్ ఉప్పొంగిన దేశభక్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. వైఎస్సార్ కడపకు చెందిన జయచంద్ర అకాడమీ నిర్వహించిన కళారిపట్టు నృత్యం ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా ఎస్వీ యూనివర్శిటీకి చెందిన విద్యార్థినులు నిర్వహించిన రాణి ఆఫ్ ఝాన్సీ ప్రదర్శన అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విజయం విద్యా సంస్థల విద్యార్థులకు మొదటి బహుమతి, ఏపీ ట్రైబల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు రెండో బహుమతులను మంత్రి సత్యకుమార్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అందజేశారు. శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖ మొదటి బహుమతి , విద్యాశాఖ శకటం రెండవ బహుమతి కై వసం చేసుకుంది. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, టీచర్లు పాల్గొన్నారు. స్టాల్స్ ప్రదర్శన: స్టాల్స్ ఏర్పాటులో హార్టికల్చర్ శాఖ మొదటి బహుమతి, పట్టుపరిశ్రమ శాఖ రెండవ బహుమతిని కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ తదితరులు పాల్గొన్నారు. సీ్త్ర శక్తి పథకం పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం ప్రారంభించుకున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాలనలో బా ధ్యత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్ర తి సోమవారం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని చెప్పారు. కడా ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో ఏబీఐఎస్, ప్రోటిన్, మథర్ డెయిరీ వంటి పరిశ్రమలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఇంకా 14 పరిశ్రమలు స్థాపన దశలో ఉన్నాయని, జిల్లాలో సర్వేలో గుర్తించిన 42,852 మంది నిరుపేదలను 3640 మంది మార్గదర్శకులతో ప్రత్యక్షంగా దత్తత తీసుకుని సహాయం చేసే పీ–4 విధానం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. మురిసిన మువ్వన్నెల రెపరెపలు జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో 44 చంద్రన్న సంచార రథాలతో ఇంటింటికి వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలో 2,23,201 మంది విద్యార్థులకు సంబంధించి రూ.335 కోట్లు తల్లుల ఖాతాలకు తల్లికి వందనం నగదు జమచేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. అనంతరం పనితీరులో ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలను, స్టాల్స్ను మంత్రి తిలకించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు టీసీ రాజన్ను సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, థామస్, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్ కుమార్, డీఎఫ్వో భరణి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆర్డీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో ప్రథమ చికిత్స కేంద్రం
చిత్తూరు లీగల్ : చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రథమ చికిత్స కేంద్రాన్ని జిల్లా జడ్జి అరుణసారిక ప్రారంభించారు. కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు.. ఎవ్వరైనా సరే ప్రథమ చికిత్స అవసరమైనప్పుడు ఇక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా జడ్జి తెలిపారు. న్యాయస్థానాలు పనిచేసే రోజుల్లో ప్రథమ చికిత్స కేంద్రం కూడా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారన్నారు. అధికారులు సమాచారంతో రావాలని కోరారు. కాణిపాకం..జనసందడి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినా యకస్వామి దేవస్థానం శుక్రవారం భక్తజన సందడితో రద్దీగా మారింది. ఉచిత దర్శనం మొదలు శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనం వరకు భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. మూడు రోజుల పాటు సెలవులు కావడంతో ఆలయం భక్త జనులతో కిటకిటలాడింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. వాణ్యిసముదాయానికి వేలంపాటతో ఆదాయం వెదురుకుప్పం : మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన వాణిజ్య సముదాయానికి అధికారులు ఎట్టకేలకు వేలంపాట నిర్వహించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెదురుకుప్పం పంచాయతీని వ్యాపారపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో మాట్లాడి రూ.50 లక్షలు జెడ్పీ నిధులు మంజూరు చేయించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకుడు, కాంట్రాక్టర్ రామయ్య 11 గదులు నిర్మించి పూర్తి చేశారు. అప్పట్లోనే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభోత్సవం చేసేశారు. అయితే వేలం పాట సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైంది. స్థానిక సర్పంచ్ శిల్ప వేలం పాటకు నోటీస్ అందించి తేదీ నిర్ణయించినా టీడీపీ నేతలు అధికారులను బెదిరించి జరపకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో వేలం పాట నిర్వహించాలంటూ రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో అధికారులు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. 11 గదుల కొత్త షాపింగ్ కాంప్లెక్స్ను వేలం వేయగా నెలకు రూ. 65,500, 10 గదుల పాత కాంప్లెక్స్ గదుల వేలం ద్వారా నెలకు రూ. 28,300 వచ్చినట్లు కార్యదర్శి కోదండరామిరెడ్డి తెలిపారు. అదేవిదంగా వారపు సంత వేలం ద్వారా సంవత్సరానికి రూ. 1,81,500 వచ్చిందన్నారు. మొత్తానికి అన్ని విధాలా సంవత్సరానికి రూ. 13,07,100 ఆదాయం పంచాయతీకి వచ్చిందన్నారు. వేలం పాటలో ఎంపీడీఓ పురుషోత్తం, సర్పంచ్ శిల్ప, డిప్యూటీ ఎంపీడీఓ బాలసుబ్రమణ్యం, కార్యదర్శి కోదండరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బోయకొండలో రాహుకాల పూజలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా గంగమ్మకు రాహుకాల పూజలు నిర్వహించారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయంగా అర్చనలు , అభిషేక పూజలు చేశారు. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదం పంపిణీ చేశారు. -
పోలీసుల నిర్లక్ష్యంపై ఆందోళన
పుంగనూరు : కన్నబిడ్డ కూలీకెళ్లి మృతి చెందాడని, ట్రాక్టర్ యజమాని నిర్లక్ష్యం , సమాచారం కూడా ఇవ్వలేదని కన్నబిడ్డ మరణంపై చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు మరోలా కేసు నమోదు చేయడంపై బాధితులు ఆగ్రహించారు. శుక్రవారం పోలీసుల తీరుకు నిరసనగా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చారాలకు చెందిన రవితేజ (25) ట్రాక్టర్లో పొలం మడి దున్నేందుకు వెళ్లి చౌడేపల్లె మండలం దుర్గసముద్రం వద్ద ఈనెల 14న మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో పాటు, ప్రమాదం విషయాన్ని మృతుడి కుటుంబీకులకు తెలపలేదని బోరున విలపించారు.108 వాహనంలో కాకుండా ఆటోలో తరలించడంలో ఆలస్యం కావడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపించారు. ప్రమాదం జరిగి 24 గంటలు పూర్తి అయినా పోలీసులు పోస్టుమార్టం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ట్రాక్టర్ యజమానిని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, పొలీసులు ఇచ్చిన ఫిర్యాదు కాకుండా మరోలా వారికి నచ్చినట్లు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి బాధితులకు న్యాయం చేయకుండా అన్యాయం చేయడం తగదని రోడ్డెక్కారు. విషయం తెలుసుకొన్న చౌడేపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని , ఎఫ్ఐఆర్లో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కాగా చౌడేపల్లె పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. -
మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం
– ప్రారంభోత్సవంలో మంత్రి సత్యకుమార్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండులో శుక్రవారం మహిళకు ఉచిత బస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కలెక్టర్ సుమిత్కుమార్, ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాద్రావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత, మేయర్ అముద ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఉచిత బస్సును ప్రారంభోత్సవం చేశారు. వీరంతా బస్సులో కాణిపాకం వరకు ప్రయాణం సాగించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాణిపాకానికి ఎక్స్ప్రెస్ షో.. కాణిపాకానికి ప్రస్తుతం పల్లె వెలుగు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ పల్లె వెలుగు బస్సులే నిత్యం చిత్తూరు– కాణిపాకానికి రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా చిత్తూరు–కాణిపాకానికి ఒక పల్లె వెలుగు బస్సుతో పాటు ఒక ఎక్స్ప్రెస్ బండిని నడిపారు. చిత్తూరు బస్టాండులో బస్సు బయలుదేరే క్రమంలో చిత్తూరు–తిరుపతి అనే బోర్డు తీసేసి చిత్తూరు–కాణిపాకం అనే బోర్డు పెట్టారు. దీంతో అక్కడున్న వారంతా ఆ బస్సుపై ఓ లుక్కేశారు. ఇకపై కాణిపాకానికి ఎక్స్ప్రెస్ బస్సు కూడా నడుపుతారని ఊహించారు. అయితే ఈ ఎక్స్ప్రెస్ బండి కాణిపాకానికి షో మాత్రమేనని పలువురు విమర్శలు చేశారు. -
ఎమ్మెల్సీ మేరిగకు పరామర్శ
రాపూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ను పలువురు పరామర్శించారు. మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు (89) గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాపూరులోని లక్ష్మీపురంలోని ఆయన నివాసంలో ఆనందరావు భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు నాయకులు మేరిగ మురళీధర్ను పలకరించి, సంతాపం తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జోన్–4 వర్కింగ్ ప్రెసిడెండెంట్ కాకాణి పూజితమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు బత్తిన పట్టాభిరామిరెడ్డి, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మండల కన్వీనర్ బోడ్డు మధుసూదన్రెడ్డి, దందోలు నారాయణరెడ్డి, మస్తాన్యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి తదితరులు శుక్రవారం ఆనందరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మేరిగను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. -
పండుగకు వచ్చి ..నీట మునిగి చిన్నారి మృత్యువాత
శాంతిపురం : బంధువుల ఇంట కావడి పండుగ కోసం వచ్చిన నాలుగేళ్ల బాలుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. కుప్పం మండలం మోట్లచేను సమీపంలోని బిక్కిలిగట్టు గ్రామానికి చెందిన నితీష్కుమార్ (4) తన అమ్మమ్మతో పాటు ఎంకేపురానికి వచ్చాడు. శుక్రవారం బంధువుల ఇంట్లో కావడి పండుగ పూజలు చూసి, భోజనం అనంతరం సాయంత్రం ఇంటి సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు మరో ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లాడు. మిగతా పిల్లలు చూస్తుండగానే నితీష్కుమార్ నీటిలో పడిపోవడంతో వారు కేకలు వేస్తూ ఇంటికి వచ్చారు. గ్రామస్తులు వెళ్లి నీట మునిగిన బాలుడిని బయటకు తీసి శాంతిపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. గ్రామంలో సుబ్రమణ్యస్వామి భక్తులు కావడి పండుగతో ఉన్న కోలాహలం ఆవిరై ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బిక్కిలిగట్టుకు చెందిన శంకర్, రూపకు ముగ్గురు సంతానం. కుమారుడు నితీష్కుమార్(మనోజ్) తర్వాత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నారి మృతదేహాన్ని కుప్పం మండలంలోని స్వగ్రామానికి తరలించారు. అరాచకం రాజ్యమేలుతోంది – వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన తిరుపతి మంగళం : స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతోందని, అయితే రాష్ట్రం స్వాతంత్య్రం కోల్పోయి ఏడాదిన్నర అవుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ శుక్రవారం తిరుపతి పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా హరించివేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు వాక్ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నామని, ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించే వారిపై నిందారోపణలు మోపి, హింసలకు పాల్పడే వారిగా చిత్రీకరించి, కేసులు బనాయించి జైళ్లల్లోకి కుక్కి ప్రజస్వామ్యమనేది లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొత్తం ఈవీఎంలన్నీ ట్యాపరింగ్ చేశారన్న విషయం దేశమే కోడై కూస్తోందన్నారు. ప్రజాస్వామ్యంగా పరిపాలించి రాష్ట్రంలోని పేదల ప్రజలకు సంక్షేమ రూపంలో రూ. 2.50 లక్షల కోట్లను పేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడైన వైఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని జైళ్లల్లోకి కుక్కే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో హక్కులు లేవు, భావప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే మనుషులకు సంకెళ్లు పడుతున్నాయని ఆరోపించారు. ఈ కూటమి అరాచకాలపై ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామే తప్ప రాష్ట్రంలో మాత్రం స్వాతంత్య్రం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తిరుపతి మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జేసీబీ తరలిస్తుండగా విద్యుదాఘాతం
ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు, జేసీబీని తరలిస్తున్న టెంపో – డ్రైవర్ మృత్యువాత చౌడేపల్లె : టెంపోలో జేసీబీని తరలిస్తుండగా విద్యుదాఘాతంతో జేసీబీ డ్రైవర్ సుబ్రమణ్యంరెడ్డి(45) మృతి చెందిన ఘటన శుక్రవారం కొలింపల్లె వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. పుంగనూరు మండలం ఎల్లారుబైలు నుంచి జేసీబీని టెంపోలో కొలింపల్లె మీదుగా పుంగనూరు వైపునకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న రామసముద్రం మండలం టి.గొల్లపల్లెకు చెందిన సుబ్రమణ్యంరెడ్డి టెంపోలో జేసీబీని ఎక్కించి ఆ సీటులోనే అక్కడే కూర్చొని ప్రయాణిస్తుండగా కొలింపల్లె సమీపంలోని ఒడ్డోనితోట సమీపంలోకి రాగానే టెంపోలో గల జేసీబీకి విద్యుత్ తీగలు తగులుతాయని టెంపో డ్రైవర్ సుబ్రమణ్యం రెడ్డిని కట్టె సాయంతో పైకి ఎత్తాలని సూచించారు. జేసీబీలో నుంచి దిగేందుకు డోర్ తీయగా విధ్యుదాఘాతానికి గురై సుబ్రమణ్యంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో టి.గొల్లపల్లెలో విషాధఛాయలు అలుముకొన్నాయి. ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం గల తీరుపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
నేటి నుంచి రాజనాలబండ జాతర
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ లక్ష్మినరసింహస్వామి ,శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నేటి నుంచి రెండు రోజులపాటు వైభవంగా జాతర జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో తిరుణాల జరగనుందన్నారు. ఏటా పూర్వీకుల నుంచి శ్రావణమాస చివరి శనివారం రోజున రాజనాలబండపై వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు పక్కనే ఉన్న ఎత్తైన శ్రీలక్ష్మినరసింహస్వామి కొండపై భక్తులు తరలివెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. అదే రోజు రాత్రి కొండపై గల రాతి స్తంభంపై దీపం వెలిగించి అఖండ దీపారాధన చేస్తారు. స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు చేపడుతారు. ఆదివారం రోజున కోలాహలంగా తిరుణాల నిర్వహిస్తారు. రాజనాలబండకు సమీపంలోని మొత్తం 18 గ్రామాలకు చెందిన ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకొంటారు.కొలింపల్లె నుంచి గ్రామదేవత బోయకొండ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తితో కలిసి ఊరేగింపుగా చేరుకొని బండారు పంపకం చేసిన అనంతరం సంప్రదాయ రీతిలో దేవరెద్దులు, బోయకొండ అమ్మవారిని రాజనాలబండకు చేర్చుతారు. వేల మంది భక్తులు వీరాంజనేయస్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. అక్కడి నుంచి ఉట్లోత్సవం, పోకుమాను బరుగుట వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ ఇన్చార్జి ధర్మేంధ్ర ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
విశిష్ట సేవలకు పురస్కారాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధుల పట్ల ప్రతిభ చూపిన ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి అవార్డులు వరించాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. గత వైఎస్సార్సీ సర్కారు నెలకొల్పిన విప్లవాత్మకమైన గ్రామ సచివాలయాల ఏర్పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేడర్ సచివాలయ ఉద్యోగుల విశిష్ట సేవలకు గాను అవార్డులు అందుకోవడం విశేషం. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ విశిష్ట సేవలందించిన 21 మంది అవార్డులు స్వీకరించారు. అదే విధంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న 319 మందికి అవార్డులు అందించారు. వేడుకల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు అందజేసిన ప్రశంసాపత్రాల్లో కొత్త పద్ధతి అవార్డు గ్రహీతల ఫొటోలను ముద్రించి అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. బేబిరాణి, ఏఎన్ఎం హరికృష్ణ, వెటర్నరీ అసిస్టెంట్ ఈశ్వర్, హార్టికల్చర్ అసిస్టెంట్ సమీర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ జ్యోష్ణ, అగ్రికల్చ ర్ అసిస్టెంట్ యుగంధర్రెడ్డి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
వి.కోట : రాష్ట్రంలో అస్సలు ప్రజాస్వామ్యం ఉందా..? అని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రశ్నించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుచూస్తే అసలు మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా అన్న అనుమానం వస్తోందని వాపోయారు. గురువారం మండలంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కపాడాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ దారుణమైన పాత్ర పొషించడం దురదృష్టకరమన్నారు. ఎన్నికలు జరిగిన 15 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మీరు ప్రజాస్వామ్య బద్ధంగా గెలిసుంటే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు పంచాయతీల్లో గ్రామసభలు చిత్తూర కార్పొరేషన్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలను నిర్వహించాలని డీపీఓ సుధాకర్రావ్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పశుసంవర్థకశాఖ సహకారంతో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం, పంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై ప్రధానంగా గ్రామసభల్లో చర్చించి తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించిందన్నారు. డీఎస్సీ స్కోర్ కార్డులు చిత్తూరు కలెక్టరేట్ : సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ అభ్యర్థుల స్కోర్ కార్డులను ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్టు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. మెగా డీఎస్సీ తుది కీ, స్కోరు కార్డులను ఇది వరకే విడుదల చేశారన్నారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను www.apdsc.apcfss.in వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. సవరించిన స్కోరు కార్డులను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులు సరిచూసుకోవాలన్నారు. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే అభ్యర్థి ఐడీ నెంబర్తో వెబ్సైట్లో సరిచేసుకోవాలని డీఈఓ సూచించారు. -
వైఎస్సార్సీపీ యువజన విభాగంలో పదవులు
తిరుపతి అర్బన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వైఎస్సార్సీపీకి చెందిన పలువురు యువ నేతలకు రాష్ట్ర యువజన విభాగ కమిటీలో వివిధ హోదాల్లో పదవులు కల్పించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఆ జాబితాను ప్రకటించింది. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మిద్దింటి కిషోర్బాబుకు రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ, శ్రీకాళహస్తి అసెంబ్లీ పరిధిలోని కంఠా ఉదయకుమార్ సెక్రటరీ, డీజే సుధీర్కుమార్ జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. ప్రతి అర్జీని పరిష్కరించాలి చిత్తూరు కలెక్టరేట్ : ప్రజాసమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకూడదన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీకి పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో స్పష్టంగా సమాధానం తెలియజేస్తూ అర్జీదారునికి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. అర్జీల పరిష్కారం పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు 60,053 అర్జీలను స్వీకరించినట్టు తెలిపారు. కోర్టు కేసులకు వెంటనే కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగనన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో నెలకున్న సమస్యలను నివేదికల రూపంలో తెలియజేయాలన్నారు. హెచ్వోడీలు కచ్చితంగా ఫైళ్లను ఈ ఆఫీస్లోనే పంపాలని ఆదేశించారు. -
పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
నగరి : పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆరోపించారు. ఉప ఎన్నికలు జరిగిన తీరుపై ఆమె గురువారం ఈ మేరకు స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 62 శాతం ఓట్లు సాధించిందన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లోనే 62 శాతం ఓట్లు సాధించిన పార్టీకి అనుకూల వాతావరణం నెలకొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో 8.95 శాతం ఓట్లు రావడం ఏమిటన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాపితంగా అనుకూల గాలి వీచిన సమయంలో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీ సాధించింది 24 శాతం ఓట్లు మాత్రమే అన్నారు. అలాంటి పార్టీకి 88 శాతం ఓట్లు రావడం యావత్ రాష్ట్రాన్ని షాక్లో ముంచిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకి వరుసగా 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. అంటే పోటీ చేసిన అభ్యర్థి తాలుకా ఏజెంట్లు వారి కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వేయరా?.. పోటీ చేసిన అభ్యర్థి కూడా తనకు తాను ఓటు వేసుకోడా? ఈ ఫలితాన్ని జనం ఎలా నమ్మాలన్నారు. అధికార దుర్వినియోగం, రౌడీయిజం, అవకతవకలే ఈ విజయం సాధించి పెట్టాయన్నారు. -
ఇంకెందుకు ఉచిత ప్రయాణం
ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అన్ని బస్సుల్లో కాదంట కదా. తిరుమలకే వెళ్లడానికి వీల్లేదంట కదా.. దగ్గరలో ఉన్న ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లి రావడానికి లేనప్పుడు ఇంకెందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణం. – పుష్ఫ, చిత్తూరు ఉపాధి అవకాశాలు కల్పించండి మా తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివించలేకపోయారు. చదివిన చదువుతో ఉద్యోగాలు దొరకడం లేదు. అప్పు చేసి ఆటో కొనుగోలు చేశా. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఇస్తే ఇవ్వండి.. కానీ మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఉపాధి లేకపోతే మా పరిస్థితేంటి.? – జ్ఞానశేఖర్, ఆటోడ్రైవర్ , చిత్తూరు -
తల్లిదండ్రులు మందలించారని!
– ఉరివేసుకుని యువకుడి మృతి బంగారుపాళెం: మండలంలోని వెలుతురుచేను గ్రామంలో గురువారం ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెలుతురుచేను గ్రామానికి చెందిన వేలు కుమారుడు ఉపేంద్ర(18) ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అతను మనప్తాపానికి గురై గ్రామ సమీపంలో ఒంటిల్లు వద్ద గల పశువుల పాకలో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి వేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పొట్టకూటి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు! చౌడేపల్లె: కూలి కోసం వెళ్లి ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. వివరాలు.. మండలంలోని చారాలకు చెందిన బాలసుబ్రమణ్యం కుమారుడు రవితేజ(25) ట్రాక్టర్ డ్రై వర్. దుర్గసముద్రం పంచాయతీ, బండమీదపల్లె సమీపంలో గొల్లవానికుంట వద్ద ట్రాక్టర్తో మడి దున్నేందుకు వెళ్లాడు. మడిలో దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని పుంగనూరు పభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవితేజ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ భూములకు యాజమాన్య హక్కు పత్రాలు తవణంపల్లె: గ్రామ కంఠం భూములకు స్వామిత్వ కార్యక్రమం ద్వారా యాజమాన్య హక్కు పత్రాలను కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు తెలిపారు. గురువారం తవణంపల్లె మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు స్వామిత్వ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీపీఓ సుధాకర్రావు పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలిచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామం కఠం భూములను పారదర్శకంగా సర్వే చేసి అనుభవంలో ఉన్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తర్వాత క్షేత్ర స్థాయిలో ఎగువ తవణంపల్లెలో స్వామిత్వ సర్వే ఎలా చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. డిప్యూటీ ఎంపీడీఓ మురుగేష్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 28 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 75,859 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
కన్నీటి వీడ్కోలు
గంగాధరనెల్లూరు : మండలంలోని వేపంజేరి పంచాయతీ, గోవిందరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డికి కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం తిరుత్తణికి వెళ్తుండగా కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో విశ్వనాథరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం గోవిందరెడ్డిపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు తమ మధ్య సంతోషంగా తిరుగుతున్న వ్యక్తులు దూరమవ్వడంతో గ్రామస్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. విశ్వనాథరెడ్డి తల్లిదండ్రులు, అన్న సురేంద్రారెడ్డిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చుట్టుపక్కల గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి నివాళి అర్పించారు. పలువురి నివాళి వైఎస్సార్సీపీ గంగధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు నియోజకవర్గం ఇన్చార్జ్ ఎంసీ విజయానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనగంటి హరికృష్ణ గ్రామానికి చేరుకుని మృతుడు విశ్వనాథరెడ్డికి ఆత్మీయ నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మాజీ సీడీసీఎంఎస్ చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, నాయకులు మునిరాజారెడ్డి, చిన్నమ్మరెడ్డి, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు. తల్లడిల్లిన తిరుమలపల్లి విశ్వనాథరెడ్డి అన్నకుమార్తె కీర్తి కుమారుడు షాన్విక్రెడ్డి(ఏడాది) ప్రమాదంలో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం విగత జీవిగా గ్రామానికి రావడంతో స్థానికులు తల్లడిల్లిపోయారు. చిన్నారి తండ్రి స్వగ్రామామైన యాదమరి మండలం, తిరుమలపల్లి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మరో నెలలో చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్న తరుణంలో మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారి తల్లి కీర్తి, అమ్మమ్మలు రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. విశ్వనాథరెడ్డి మృతదేహానికి నివాళి అర్పిస్తున్న కృపాలక్ష్మి, విలపిస్తున్న సురేంద్రారెడ్డి -
గజదాడుల కట్టడిలో విఫలం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చక్కటి వేదిక. ఇందులో అనేక సమస్యలు పరిష్కరించడమే కాకుండా అభివృద్ధి పనులు, కొత్త నిర్ణయాల అమలు పట్ల చర్చించవచ్చు. అయితే ప్రతి సారీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న ఈ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగుతోంది. ఈ సమావేశం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిధిలో నిర్వహిస్తారు. ఈ మూడు జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు హాజరైతే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ఇప్పటి వరకు తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు హాజరు కాలేదు. ఆయా జిల్లాల అధికారులు సైతం గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని జెడ్పీటీసీలు సమావేశానికి హాజరై సమస్యలు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రతిసారీ అజెండాలో తప్పిదాలే జిల్లా పరిషత్ సర్వసమావేశానికి అందజేసే అజెండాలో అన్ని శాఖల పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల సమాచారం పొందుపరచాలి. అయితే అనేక శాఖల అధికారులు అజెండాలో తమ శాఖకు చెందిన సమాచారమే ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 29న నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అందజేసిన అజెండాలో కేవలం 11 శాఖల సమాచారమే పొందుపరిచారు. ఆ సమాచారంలోనూ అనేక తప్పిదాలున్నాయి. చివరి నిమిషంలో పలు శాఖలు సమాచారం అందజేస్తుండడంతో చాలా తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. జాడలేని ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోంది. జెడ్పీ, పంచాయతీలకు కలిపి రూ.85 కోట్లు ఇవ్వగా వాటిని పల్లె పాలనకు కేటాయించాల్సి ఉంది. ఆ డబ్బులు మంజూరు చేయకుండా సతాయిస్తోందని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండుగ కింద పంచాయతీరాజ్ పరిధిలో రూ3.కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. సెస్ బకాయిలు రూ.36.4 కోట్లు జిల్లాలోని గ్రంథాలయాలకు నగరపాలక, పంచాయతీల నుంచి వచ్చే సెస్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, నిర్వహణ కలిపి మొత్తం రూ.80 లక్షలు అవుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సెస్ బకాయిలు రూ.36.40 కోట్లు రావాల్సి ఉంది. నూతన విద్యుత్ సర్వీసులకు మీనమేషాలు ఉమ్మడి జిల్లాలో డబ్బులు కట్టించుకొని విద్యుత్ ఇవ్వాల్సిన సర్వీసులు 4 వేలకు పైగా ఉన్నాయి. శాఖా పరంగా కట్టిన డబ్బులకంటే పలుకుబడి, అధికారులకు మామూళ్లు ఇచ్చుకున్నవారికే సర్వీసులు జిల్లా స్టోర్స్ నుంచి త్వరగా విడుదలవుతున్నాయి. అత్యవసర కోటా కింద పరికరాలు తీసుకునే వెసులుబాటు ఉన్నా అవి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.260 కోట్లు ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు రూ.260 కోట్లకుపైగా ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు రూ.500 కోట్లు పలు ప్రభుత్వ శాఖలు, పంచాయతీల పరంగా రూ.500 కోట్ల మేర విద్యుత్ శాఖకు రావాల్సి ఉంది. ఇలాంటి మొండి బకాయిలపై అసలు దృష్టి పెట్టడం లేదు. వీటికి తోడు ఓ వైపు ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు జోరుగా సాగుతోంది. కాలనీల్లో మౌలిక వసతులు కరువు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా జగనన్న కాలనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించడంలో అలసత్వం వహిస్తోంది. ఆ కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులున్నాయి. వేతనాల కోసం ధర్నా చేస్తున్న గ్రీన్అంబాసిడర్లు(ఫైల్) పరిష్కారం కాని అన్నదాత కష్టాలు జిల్లాలో అన్నదాతలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాకు 40,338 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం కాగా 26,350 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటే అప్పటి వరకు ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని కొత్తగా మెలిక పెట్టారు. జిల్లాలో వేలాది మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రూ.3,341 కోట్ల రుణం తీసుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొక్కుబడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధుల జీతాలకే దిక్కులేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో జెడ్పీటీసీ, సర్పంచ్ల జీతాలకు దిక్కులేదు. ఉమ్మడి జిల్లాలోని 65 మండలా జెడ్పీటీసీలకు నెలకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ అనేక నెలలుగా ఇవి పెండింగ్లో ఉండగా ఇప్పటికి రూ.1.7 కోట్లు రావాల్సి ఉంది. అలాగే సర్పంచ్లకు ఇవ్వాల్సిన రూ.3వేల గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. వారికి రూ.1.72 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మామూళ్ల మత్తులో ఇంజినీరింగ్ శాఖ ఇంజినీరింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లా ఆర్అండ్బీ పరిధిలో 15 ఏఈలకుగాను ముగ్గురే ఉన్నారు. వీరే అన్ని నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి ఉంది. ప్రతి పనికీ పైసలు ఇవ్వనిదే చేయడం లేదని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు. సంవత్సరాల కాలంగా ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ శాఖలకు ఇన్చార్జి ఎస్ఈలే దిక్కుగా మారారు. ఆర్డబ్ల్యూఎస్లో 50 మంది ఏఈలకు 34 మందే ఉన్నారు. ఇక పంచాయతీరాజ్లోనూ ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. ఇక్కడ డీఈలు 15 మందికి గాను ఐదుగురు, 62 మంది ఏఈలకు గాను 37 మంది, ఇంజినీర్ సహాయకులు 504కు గాను 90 మంది కొరత ఉన్నారు. ట్రాన్స్కోలోనూ 40 మంది ఏఈలకు గాను దాదాపు 12 మంది తక్కువగా ఉన్నారు. ఫలితం శూన్యం జెడ్పీ సమావేశాలంటే పలు శాఖల అధికారులకు లెక్క లేకుండా పోయింది. దీనిపై జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా ఎన్హెచ్ఎఐ, అటవీశాఖ, విద్యుత్శాఖ, డ్వామా, డీఆర్డీఎ, డీఎంఅండ్హెచ్, విద్యశాఖ అధికారులు రావడం లేదు. సోషల్ మీడియా కోసం రీల్స్ పెట్టడానికి కొందరు వీడియోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. -
మళ్లీ వాళ్లే!
చిత్తూరు అర్బన్: ‘ఏం చెప్పేదయ్యా..! అటెండరుగా 38 ఏళ్ల క్రితం మునిసిపాలిటీలో చేరాను. ఈ నెలాఖరున రిటైర్మెంట్. ఎన్ఎంఆర్గా పనిచేస్తూ జీతాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాను కానీ, ఏ రోజూ డ్యూటీకి ఎగ్గొట్టలేదు. రిటైర్డ్ అయ్యేలోపు ఒక్కసారైనా కలెక్టర్ నుంచి ప్రసంసా పత్రం అందుకోవాలని కలలు కన్నాను. అవి నెరవేరకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాను. ఆఫీసర్లను కాకాపట్టేవాళ్లు, చాడీలు చెప్పేవాళ్లకే గుర్తింపు. మా పేర్లంతా కలెక్టర్కు పంపరు.’ – జిల్లా కేంద్రంలోని ఓ ఉద్యోగి ఆవేదన వాళ్ల బాధలు అర్థంకావా? విధుల్లో నిబద్ధత.. అధికారుల పట్ల గౌరవం ప్రదర్శించే ఉద్యోగులను ఇప్పుడు చేతి వేళ్లపై లెక్కించే పరిస్థితి. ఫలితంగా ప్రతీ ఏటా పంద్రాగస్టు, గణతంత్య్ర దినోత్సవాల నాడు ఉత్తమ అధికారుల ఎంపిక యాంత్రికంగా కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగుల పనితీరు, క్రమశిక్షణ, పూర్వపు రికార్డులు పరిశీలించి, పరీక్షించి ఉత్తమ అవార్డుకు అధికారుల్ని ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తే వాళ్లు, రాజకీయనాయకుల వద్ద పీఏలు, గుమస్తాలు ఉత్తములైపోతున్నారు. కష్టపడి సేవలందించే అధికారులకు, సిబ్బందికి గుర్తింపు దక్కడం లేదు. ఉద్యోగ విరమణ వయస్సు దగ్గరపడుతున్నా తమ సేవలకు గుర్తింపు లేదని పలువురు కుమిలిపోతున్నారు. ఒకప్పట్లో... జిల్లాలోని వివిధ శాఖల్లో 30 వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల్ని ఎంపికచేసి ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. దశాబ్దన్నర కాలం క్రితం వరకు అయితే కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం అందుకోవాలంటే సవాలక్ష కారణాలను పరిగణనలోకి తీసుకునే వారు. ప్రశంసా పత్రం తీసుకునే ఉద్యోగులు కుటుంబ సమేతంగా వచ్చి అతిథుల చేతులు మీదుగా అవార్డులు అందుకోవడం ఓ మధురానుభూతిగా భావించేవాళ్లు. కానీ కాలం మారిపోయింది. ఉద్యోగుల జాబితాను తయారు చేయడంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖాధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ వారికి నచ్చిన పేర్లనే ఉన్నతాధికారులకు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. -
జాతీయ రహదారి పనుల పరిశీలన
నగరి : చైన్నె, తిరుత్తణి, రేణిగుంట నేషనల్ హైవే 716 పనులను, 205 రహదారి వెడల్పు పనులను కలెక్టర్ సుమిత్కుమార్ గురువారం పరిశీలించారు. జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఆలయాలు, నివాసాలు తొలగించనుండడంతో పాటు టోల్ ప్లాజా ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతామన్న రైతుల నుంచి పలు వినతులు అందడంతో వాటిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఆయన నగరికి విచ్చేశారు. సమస్య ఉత్పన్నమైన నెత్తంకండ్రిగ, వీకేఆర్పురం ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు ఇప్పటికే జాతీయ రహదారికి 200 మీటర్ల మేర తమ స్థలాలను ఇచ్చేశారని, మిగిలిన స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తున్నామని, అందుకు మళ్లీ స్థలం కావాలంటున్నారని, తాము చాలా నష్టపోతామని కలెక్టర్కు విన్నవించుకున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరారు. ఈ అంశంపై జాతీయ రహదారి అధికారులతో చర్చించిన కలెక్టర్ రహదారి మ్యాపులు పరిశీలించి, జాతీయ రహదారికి సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. ఆర్డీవో అనుపమ, డీఎస్పీ సయ్యద్ అబ్దుల్అజీజ్, తహసీల్దార్ రవికుమార్, సర్వేయర్ సురేష్, భూములు, నివాసాలు కోల్పోయే వారు పాల్గొన్నారు. -
సీజ్ చేసిన ఇసుక మాయం!
పాలసముద్రం : మండంలోని బలిజకండ్రిగ సమీపం, తమిళనాడు సరిహద్దులో పోలీసులు సీజ్చేసిన ఇసుక మాయమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు సుమారు 100 టిప్పర్లకుపైగా ఇసుకను తమిళనాడు సరిహద్దులో డంప్ చేశారు. ఆపై అక్కడి నుంచి రాత్రికి రాత్రి తరలించి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించి ఇసుకను సీజ్ చేశారు. అయితే పోలీసుల కన్నుగప్పి టీడీపీ నాయకులు సీజ్ చేసిన ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. కానీ దీనిపై పోలీసులు నోరుమెదపకపోవడం గమనార్హం. ఆగని గజదాడులుపులిచెర్ల(కల్లూరు): మండలంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. వారం రోజులుగా పాళెం సమీపంలోని చింతల వంకలో తిష్టవేసిన 16 ఏనుగుల గుంపు పగలు అక్కడే ఉండి రాత్రిపూట పంటలను నాశనం చేస్తున్నాయి. గురువారం తెల్ల వారుజామున ఏనుగుల గుంపు పాళెం పంచాయతీలోని కోటపల్లె, కల్లూరు సమీపం సైదుల్లా గుట్ట వద్ద ఉన్న పంట పొలాలను నాశనం చేశాయి. మామిడి చెట్లను పెరికి వేయడం, కొమ్మలు విరిచేయడం, కొబ్బరి చెట్లను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉదయం వరకు ఏనుగుల గుంపు పంట పొలాల్లోనే తచ్చాడుతుండడంతో అన్నదాతలు అటువైపు వెళ్లలేని పరిస్థితి. ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవానికి సర్పంచ్ భాగ్యవతి చౌడేపల్లె: ఢిల్లీలో జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవానికి గడ్డంవారిపల్లె సర్పంచ్ భాగ్యవతికి ఆహ్వానం అందింది. గురువారం జలశక్తి అభియాన్ మంత్రి మండళి ఆహ్వానం మేరకు భాగ్యవతి దంపతులు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అక్కడ జరగబోయే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. గడ్డంవారిపల్లె పంచాయతీ పరిధిలో జరిగిన వాటర్షెడ్ పథకం అమలులో భాగంగా ఉత్తమ సేవలకు గాను ఈ ఆహ్వానం అందినట్టు పేర్కొన్నారు. -
పాత పద్ధతినే అమలు చేయాలి
అసలే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అంతే కాని రైతులపై కక్ష సాధింపునకు పాల్పడే విధంగా కొత్త నిర్ణయాలు అమలు చేయడం సబబు కాదు. మీ భూమి పోర్టల్ లో తెచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అవసరమైన భూ పత్రాలు పొందలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాత పద్ధతిలోనే మీ భూమి పోర్టల్ ను కొనసాగించాలి. – గోవర్ధన్, రైతు, చిత్తూరు జిల్లా -
కిక్కుకు పర్మిట్
చిత్తూరు అర్బన్ : ఇన్నాళ్లు తెరచాటు సాగుతున్న వ్యవహారానికి ఇప్పుడు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. మద్యం దుకాణాల వద్ద.. మందు బాబులు మద్యం తాగడానికి పర్మిట్ గదులను ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు కల్పిస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలోని 113 మద్యం దుకాణాల వద్ద అధికారికంగా పర్మిట్ గదులు నడపడానికి పచ్చజెండా ఊపింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే ఉండేవి. వీటి పనివేళలు సైతం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకే ముంగిచేవాళ్లు. ఎక్కడా కూడా మద్యం తాగడానికి పర్మిట్ గదులకు ఎలాంటి అనుమతులు లేవు. మహిళలు, కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో మంచి ఫలితాలనే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉపాధిలేని తమ్ముళ్లకు లైసెన్సులు ఇస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు దుకాణాలను తీసుకొచ్చింది. జిల్లాలో అన్–రిజర్వుడు కింద 104, కల్లుగీత సామాజిక వర్గాలకు 9 దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. దీంతో నెలకు జిల్లాలో దాదాపు రూ.120 కోట్లకు పైనే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వచ్చేనెల నుంచి పర్మిట్ గదులను అధికారికం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.7 కోట్ల ఆదాయం తాజాగా విడుదలైన ఉత్తర్వుల మేరకు రూ.55 లక్షల లైసెన్సు ఫీజు ఉన్న మద్యం దుకాణాలకు ఏటా పర్మిట్ గదులు పెట్టుకోవడానికి రూ. లక్షలు, రూ.65 లక్షల ఫీజు ఉన్న చోట రూ. లక్షలుగా నిర్ణయించారు. ఈ లెక్కన రూ.55 లక్షల ఫీజులున్న దుకాణాలు జిల్లాలో 38 ఉంటే, పర్మిట్ గదుల ద్వారా రూ.2.09 కోట్లు, రూ.65 లక్షల ఫీజులున్న 75 మద్యం దుకాణాల నుంచి రూ.5 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. మద్యం దుకాణాల్లో పర్మిట్ గదులకు అనుమతి జిల్లాలో 113 మద్యం దుకాణాలకు పచ్చజెండా ప్రభుత్వానికి మరో రూ. 7 కోట్లు అ‘ధనం’ -
దేశాభివృద్ధిలో భాగస్వాములుకావాలి
చిత్తూరు కలెక్టరేట్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గాంధీ సర్కిల్ నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా నాగయ్య కళాక్షేత్రం వరకు చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతి గ్రామం, ప్రతి జిల్లాలో రెండు వారాల పాటు స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని 2 వేల మంది విద్యార్థులతో మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈనెల 15 వ తేదీన పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ పతాకావిష్కరణ చేస్తారన్నారు. డ్రగ్స్ సమాజానికి ప్రమాదకరం సమాజంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. డ్రగ్స్ సమాజానికి ప్రమాదకరంగా మారిందన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మత్తుపదార్థాల రవాణా, అమ్మకం, వాడకం, తదితరులకు సంబంధించి సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.. చిత్తూరు నియోజకవర్గాన్ని డ్రగ్ ఫ్రీ చిత్తూరుగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, ఏఎస్పీ రాజశేఖర్, డీఈవో వరలక్ష్మి పాల్గొన్నారు. -
బస్సు, టెంపో ఢీ
– డ్రైవర్ దుర్మరణం కుప్పం రూరల్ : ఎదురుగా వస్తున్న బస్సు – టెంపో ఢీకొని టెంపో డ్రైవర్ మృతి చెందిన సంఘటన కుప్పం మండలం, నడుమూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. కుప్పం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుప్పం వైపు నుంచి కోళ్లను వేసుకుని వెళ్తున్న లారీ, తమిళనాడు నుంచి అటుగా వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి కుప్పం మండలం, నడుమూరు అటవీ ప్రాంతం వద్దకు రాగానే సరిహద్దు సమీపంలో ఢీకొన్నాయి. ప్రమాదంలో టెంపో డ్రైవర్ తమిళనాడుకు చెందిన మునిరాజు (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తమిళనాడు బస్సులోని డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతి చెందిన టెంపో డ్రైవర్ను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా టెంపో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అమ్మో.. ఏపీకే ఫైల్స్!
● వాట్సాప్లో వాటిని టచ్ చేస్తే ఫోన్ హ్యాంకింగ్ ● జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులుపలమనేరు: నేటి సమాజంలో మనిషి జీవితంలో సెల్ఫోన్ అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఏ మాత్రం ఖాళీ దొరికినా సెల్ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రా, యూట్యూబ్లను చూస్తూ గడిపేస్తున్నారు. ఇదే అదునుగా హ్యాకర్లు సైతం వాట్సాప్లకు ఏపీకే ఫైల్స్ను పంపి వాటిని టచ్ చేయగానే ఫోన్ సెకండ్లలో హ్యాక్ చేస్తున్నారు. ఆపై మన ఫోనులోని సమాచారం కమాండ్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళుతోంది. దీంతో మన ఫోన్లోని పాస్వర్డ్ల ఆధారంగా బ్యాంకు ఖాతాలోని మొత్తం నగదు ఖాళీ అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని హరించే ఇలాంటి ఏపీకే మెసేజ్ల పట్ల సెల్ వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏపీకే అంటే ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫ్యాకేజీ అని అంటారు. ఇది యాప్ ప్రాజెక్ట్లో ప్రధానమైంది. దీని ద్వారా మన సెల్లోని వాట్సాప్కు పలు రకాల మెసేజ్లు నిత్యం వస్తూనే ఉంటాయి. వీటిని మనం టచ్ చేసిన వెంటనే మన ఫోన్లోని మొత్తం సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. మనం దీన్ని సరిచేసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎలా ఏమార్చుతారంటే! మన సెల్లోని వాట్సాప్లో ఎన్నో గ్రూపులుంటాయి. వీటిల్లో హ్యాకర్లు చొరబడి ఉంటారు. ఏపీకే పేరిట మనల్ని ఏమార్చే ఆధార్ అప్డేట్ చేసుకోండని, ఎస్బీఐ ఈకేవైసీ చేసుకోవాలని, పీఎం కిసాన్ పడిందా లేదా చూడాలని ఇలా రకరకాలుగా వస్తుంటాయి. పొరబాటున ఏపీకే పై టచ్ చేశామో మనం ఫోన్కు పిచ్చిపట్టినట్టు మారిపోతుంది. మన ఫోన్ని హ్యాకర్లు విదేశాల నుంచి ఆపరేట్ చేయడం మొదలు పెడుతారు. మనం స్విచ్ఆఫ్ చేసినా ఇక లాభం లేదు. మన సమాచారం, బ్యాంకులకు సంబంధించిన ఫోన్ఫే, గుగూల్పేలాంటి పిన్లు వివరాలన్నీ వారి చేతుల్లోకి చేరిపోతాయి. మన ఫోన్ ద్వారా నగదును సులభంగా తస్కరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వేలాది మంది ఫోన్లు హ్యాక్ చిత్తూరు జిల్లాలోనే గత ఆరు నెలల్లో వేలాది మంది ఫోన్లు ఏపీకే ఫైల్ కారణంగా హ్యాక్కు గురయ్యాయి. ఫలితంగా లక్షలాది రూపాయలను హ్యాకర్లు చోరీ చేశారు. మోసం జరిగాక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపై పోగొట్టుకున్న నగదు తిరిగి రావడం చాలా కష్టమే. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయ్యాక ఏం చేయాలంటే ● గూగూల్పే ప్రొటెక్ట్ ఆఫ్షన్ ట్యాప్ చేసి స్కాన్ చేయాలి ● హామ్ఫుల్ యాప్స్ కనిపిస్తే దాన్ని డిలీట్ చేయాలి ● సెట్టింగ్స్లో డివైజ్ౖ మె యాప్స్లో ఫైండ్ మై డివైజ్ను ఆన్ చేయాలి ● మొబైల్ డేటాను బ్యాక్అప్ చేసి రీస్టార్ట్ చేసి ఆపై కొత్త పాస్వర్డ్ను పెట్టుకోవాలి.చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో మన అవసరాలను బట్టి రకరకాలుగా సేవల పేరిట ఏపీకే యాప్స్ వస్తున్నాయి. ఇవి మనకు ఉయయుక్తంగా ఉంటాయని వాటిపై టచ్చేస్తే ఇక అంతే సంగతులు. సమస్యలు తెచ్చుకుని ఇబ్బందులు పడేదానికంటే మనం తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. స్మార్ట్ఫోన్లో అన్ని రకాల సేప్టీ మెజర్స్ను పాటించాలి. – డేరంగుల ప్రభాకర్, డీఎస్పీ, పలమనేరు -
ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు
వి.కోట : కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలు మిన్నంటాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పీఎన్ నాగరాజు ఆరోపించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించిన ఒక్క పోలింగ్ బూత్లోనూ వైఎస్సార్ సీపీ ఏజెంట్ లేకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. బయటి ప్రాంతాల వారు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు అడ్డుకోకపోవడం సరికాదన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రజలు ఓట్లు వేయడానికి వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇంతటి దారుణమైన ఎన్నికలు ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల నడుమ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పక్షవాతానికి మందు ఇస్తానని మోసం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పక్షవాతానికి మందు ఇస్తానని చెప్పి ఓ గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడని బుధవారం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు నగరం మురకంబట్టులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగమ్మ భర్త కొన్నాళ్లుగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. నల్ల సంచితో ఇంటి వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగమ్మను పలకరించి ఆమె ద్వారా భర్తకు కాళ్ల నొప్పి సమస్య ఉందని తెలుసుకున్నాడు. తాను పక్షవాతానికి మందు ఇస్తానని నొప్పులు నయం అయిన తర్వాత ఆలయానికి దానం చేయమని నాగమ్మను గుర్తుతెలియని వ్యక్తి నమ్మించాడు. కొబ్బరి నూనె తీసుకురమ్మని చెప్పి.. సంచిలోని పదార్థాలను తీసి నూనెలో కలిపాడు. తొందరగా నయమవుతుందని ఆమెను పూర్తిగా నమ్మేలా చేశాడు. ఆతర్వాత బంగారు ఆభరణాలను అడిగాడు. ఇంటికెళ్లి పూజ చేసి ఇస్తామని చెప్పి వెళ్లిపోయాడు. తిరిగీ రాకపోయే సరికి మోసపోయామని తెలుసుకున్న నాగమ్మ తాలూకా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. రూ. 80 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను మోసగిచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్పా వెనకున్నదెవరు?
● కట్టిగేనహళ్లి ముఠాతో సంబంధాలపై ఆరా ● జేసీబీ డ్రైవర్ స్మగ్లర్గా అవతారం ● ఇసుక ట్రాక్టర్లలో దుంగల తరలింపు ● బైరెడ్డిపల్లి ఘటనలో నిందితుడిని తప్పించడంపై అనుమానాలు ● అటవీశాఖ ఈ చిక్కుముడులను విప్పేనా? పలమనేరు : బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట పొలాల వద్ద ఓ ఇంట్లో 144 ఎర్ర చందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్ అధికారులు రెండు రోజుల కిందట సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న భాస్కర్రెడ్డి కర్ణాటకలోని బెంగళూరులో జేసీబీ డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఎలా స్మగ్లర్గా మారాడన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఓ సాధారణ డ్రైవర్గా ఆపై జేసీబీ ఆపరేటర్గా ఉంటూ ఇంతటి డాన్గా మారడంతో ఆయన వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంపై స్థానిక అటవీశాఖ విచారణ చేస్తోందని సమాచారం. ఎర్ర చందనం దుంగలున్నాయనే పక్కా సమాచారంతో వెళ్లిన ఫారెస్ట్ అధికారులు పక్కన ఉండి తన ప్రియురాలితో పరారైన భాస్కర్రెడ్డిని ఎందుకు పట్టుకోలేదనే విషయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. సరుకు కట్టిగేనహళ్లికేనా... తాజాగా దుంగలు పట్టుబడిన గ్రామం కర్ణాటక రాష్ట్రానికి కూత వేటు దూరంలో ఉంది. శేషాచలం నుంచి హొస్కోట సమీపంలోని కట్టిగేనహళ్లికి ఎన్నో ఏళ్లుగా చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి మీదుగానే ఎర్ర చందనం అక్రమ రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన స్మగ్లర్లు ఏపీ సరిహద్దులోని ఆలపల్లి ప్రాంతాన్ని స్టాక్ పాయింట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైవే నుంచి ఈ గ్రామం చాలా దగ్గర్లో ఉంది. ఇక్కడి నుంచి కర్ణాటకలోని చల్లహళ్లి, బైప్పళ్లి, కగ్గనహళ్లిల మీదుగా హైవేలో ఎలాంటి టోల్గేట్లు లేకుండా హోస్కోటకు అడ్డదారులున్నాయి. దీంతో ఇక్కడి నుంచి దుంగలను కర్ణాటకలోని కట్టిగేనహళ్లికి తరలిస్తున్నారనే సమాచారం. స్మగ్లర్లకు ఆ గ్రామం అడ్డా కొన్నేళ్లుగా శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్ర చందనం కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట సమీపంలోని కట్టినేనహళ్లికి చేరుతోంది. ఈ గ్రామం ఎర్ర చందనం స్మగ్లింగ్కు పేరు గాంచింది. ఆ గ్రామానికి చెందిన వసీంఖాన్, నదీంఖాన్ అంతర్జాతీయ ఎర్ర స్మగర్లుగా పేరొందారు. వీరి అండతో ఆ గ్రామస్తులు రెండు దశాబ్దాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాను వృత్తిగా చేసుకున్నారు. ఈ గ్రామంలో దాదాపు 20 మంది ఎర్ర స్మగర్లుండగా వీరిలో ఆరుగురు అంతర్జాతీయ ఎర్ర చందనం డాన్లు ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగీ రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఖాకీ చొక్కా కనబడితే అంతే సంగతులు. ఒక్కో గ్యాంగ్లో వంద మంది దాకా ప్రైవేటు సైనాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్ని కుటుంబాల వారు ఇదే వృత్తిగా మార్చుకున్నారు. గ్రామ పొలిమేరల్లోని కోళ్లఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్ర చందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. ఇప్పటికే ఆ గ్రామానికి వెళ్లిన కన్నడ పోలీసులు, ఈ ప్రాంతం నుంచి వెళ్లిన పోలీసులపై గతంలో దాడులు కూడా జరిగాయి. పట్టుబడిన దుంగలు ఏ–1 గ్రేడ్ పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు ఏ–1 గ్రేడ్వని పలమనేరు సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. అత్యంత ధర ఫలికే ఈ దుంగలను జపాన్, చైనా దేశాలకు తరలిస్తారన్నారు. ఈ దుంగలు కట్టెగేనహళ్లిలో గ్రేడింగ్ చేశాక మంగళూరు సముద్ర తీరం నుంచి తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వారా తరలిస్తుంటారని తెలుస్తోంది. స్టీమర్లలోని ఖాళీ ప్రదేశాల్లో దుంగల నుంచి దుబాయ్కు తరలిస్తారని గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడ్డ నాజర్ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్లో కన్నడ పోలీసులతో పాటు, పోర్టు సిబ్బందితో పాటు సెంట్రల్, ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వామ్యులేనని గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఏదేమైనా ఫారెస్ట్ అధికారులు ఈ కొత్త పుష్పాలు, కనిపించని పుష్పాలను ఎలా పట్టుకుంటారో కేసును ఎలా ఛేదిస్తారో వేచి చూడాల్సిందే. కాగా ఈ విషయమై స్థానిక సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్, ఎఫ్ఆర్వో నారాయణలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రధాన స్మగ్లర్ ఉడాయింపుపై అనుమానాలు ఆలపల్లి సమీపంలోని దండుకుంట వద్ద ఓ ఇంట్లో ఎర్ర చందనం దుంగలున్నాయని స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. సోమవారం మధ్యాహ్నం అక్కడికి అధికారులు చేరుకున్నారు. ఇంటిపై దాడిచేసి అక్కడి దుంగలను స్వాధీనం చేసుకుంటుండగానే అక్కడే నిందితుడు భాస్కర్రెడ్డి ఉన్నాడని సమాచారం. అధికారులను చూసిన నిందితుడు పొలంలో ఉన్న తన ప్రియురాలికి కాల్ చేసి పక్కనే ఆపి ఉన్న కారు వద్దకు రమ్మని దాంట్లో ఇద్దరూ ఉడాయించారు. అయితే వీరిని ఫారెస్ట్ అధికారులు ఎందుకు పట్టుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుక మాటున అక్రమ రవాణా శేషాచలం అడవుల నుంచి సేకరించిన దుంగలను పలు మార్గాల ద్వారా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇసుక చాటున తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రికార్డులు లేని కార్లను కూడా స్మగ్లింగ్కు వాడుకున్నట్లు సమాచారం. ఫ్రీ ఇసుక పాలసీ కావడంతో ఇసుక ట్రాక్టర్ను ఎవరూ ఆపడంలేదు. దీంతో ఎలాంటి అనుమానం రాకుండా స్మగర్లు ఇలా దుంగలను సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఆలపల్లి వద్ద పొలాల వద్దనున్న ఇంటి వద్దకు కేవలం ఇసుక ట్రాక్టర్లు, కొన్ని కార్లు మాత్రమే వచ్చేవని స్థానికులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఇసుక లోపలే దుంగలు ఇక్కడికి చేరుతున్నట్లు తెలుస్తోంది. -
రైతులకు న్యాయం చేయాలి
తవణంపల్లె : అన్నదాత సుఖీభవ పథకంలో లోపాలను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపాడేల్ సూచించారు. బుధవారం తవణంపల్లె రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులతో అన్నదాత సుఖీభవ పథకంపై సమీక్షించారు. మండలంలోని ఎంత మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు, ఎంత మంది రైతుల ఖాతాలకు నగదు జమ అయ్యింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈకేవైసీ, ఆధార్, సెల్ నంబరు లింకేజీ వివిధ కారణాలతో కొంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందడంలేదన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది రైతులతో కలసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో వీఆర్ఓలు, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 3,100 టన్నుల యూరియా నిల్వలు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో 3100 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 3 వేల టన్నుల యూరియా నిల్వ ఉండిందన్నారు. కేరళ నుంచి 100 టన్నుల యూరియా బుధవారం సాయంత్రం జిల్లాకు చేరిందన్నారు. రైతులకు అవసరమైన మేర యూరియా అందజేస్తామని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో వరుస సమావేశాలను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్యసేవలకు అవసరమైన సమాచారం సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రులు, డాక్టర్లు, అంబులెన్స్లు ఇతర ముఖ్యమైన సమాచారం సిద్ధం చేయాలన్నారు. అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 451 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 221 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్టిక్, సోలార్ లైటింగ్, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి వెళ్లే వాహనదారులు సూచిక బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. సమావేశంలో డీఎఫ్వో భరణి, ఆర్టీవో నిరంజన్రెడ్డి, డీఈవో వరలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని పరిశీలించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ లెవల్ మానిటరింగ్ (డిల్లీ బృందం) ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారన్నారు. సమావేశంలో బృందం సభ్యులు మణికందన్, ప్రశాంత్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
మత్తుతో భవిష్యత్తు అంధకారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో బుధవారం నషా ముక్త్ భారత్ అభియా న్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా విభిన్న ప్ర తిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాదక ద్ర వ్యాలకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్య క్రమంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. జిల్లాలోని కుప్పం ద్రవిడ యూనివర్శిటీ, చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను అవగాహన కల్పించినట్లు తెలిపారు. పాలక మండలిలో 14 మందికి చోటు చౌడేపల్లె : బోయకొండ దేవస్థానం పాలక మండలిలో ఎక్స్ అఫిషియో మెంబరుతో కలిపి మొత్తం 14 మందికి చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం బుధవారం తెలిపారు. పాలక మండలి ఏర్పాటులో ఆరుగురు మహిళలై ఉండాలన్నారు. ఆరుగురు ఓసీలలో ఒకరు బ్రాహ్మణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలలో ఇద్దరు , బీసీలలో 5 గురు సభ్యులై ఉండి, వారిలో ఒకరు నాయీబ్రాహ్మణులై ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారులు 30 ఏళ్లకు పైబడి హిందువులై ఉండాలన్నారు. నిర్ణీత గడువులోపు దేవాదాయశాఖ ఉప కమిషనర్ విడుదల చేసిన ఫార్మెట్లో దరఖాస్తు చేసుకోవాలని ఈఓ సూచించారు. పోలీసు కస్టడీకి బ్యాంకు మేనేజర్ చిత్తూరు అర్బన్ : ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల గోల్మాల్ కేసులో యూనియన్ బ్యాంకు మేనేజరు మురళి అప్రైజర్ భాస్కర ఆచార్యను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ చిత్తూరులోని మొదటి అదనపు మెజిస్ట్రేట్ మాధవి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. యాదమరిలోని యూనియన్ బ్యాంకులో ఖాతాదారులు బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకునే వారు. అయితే ఇటీవల బ్యాంకు ఆడిట్ నిర్వహించగా అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు స్థానంలో నకిలీ ఆభరణాలు తేలాయి. దీంతో ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు మేనేజర్ మురళి అప్రైజర్ భాస్కర్ను ఇటీవల అరెస్టు చేశారు. వీరిని కస్టడీకి ఇస్తే కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో చిరుజల్లులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా బుధవారం చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచే మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి రాత్రి వరకు నిలకడలేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ కురుస్తున్న వర్షాలకు వాతావరణం పూర్తిగా చల్లబడింది. చలి తీవ్రత పెరిగింది. వీటి కారణంగా విష జ్వరాలు పెరిగే అవకాశాలున్నాయని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
అవసరమైన పత్రాలు పొందలేకపోతున్నా
నాకు 1బీ, ఎఫ్ఎంబీ పత్రాలు అవసరం పడ్డాయి. ఈ పత్రాల కోసం 20 రోజులుగా తిరుగుతున్నా. ప్రతి రోజు నెట్ సెంటర్ల వద్దకు వెళ్తున్నా. ప్రస్తుత ప్రభుత్వం మీ భూమి పోర్టల్కు ఓటీపీ విధానం అని కొత్తగా పెట్టిందంట. మొదట్లో ఆ ఓటీపీ చెప్పాలంటే భయమేసింది. తర్వాత చేసేదేమిలేక ఆ ఓటీపీ ని కూడా చెప్పాను. అయినప్పటికీ నాకు అవసరమైన భూ పత్రాలను పొందలేకపోయాను. సజావుగా సాగుతున్న మీ భూమి పోర్టల్ లో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. పూర్వపు విధానమే అమలు చేయాలి. – నాగభూషణం, రైతు, చిత్తూరు జిల్లా ● -
వీరాంజనేయా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించు
– మిఽథున్రెడ్డి విడుదల కావాలని పూజలు చౌడేపల్లె : వీరాంజనేయా.. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించయ్యా.. అంటూ మండలంలోని ఆమినిగుంట పంచాయతీ వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో కడియాలకుంట సమీపంలో వీరాంజనేయస్వామికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అభిషేక పూజలు చేయించారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా అక్రమ కేసు నుంచి బయటకు వస్తారని ఆకాక్షించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దామోదరరాజు, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి, పార్టీ మండల ఉపాఽఽధ్యక్షుడు వెంకటరమణ, రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మాటేసిన మృత్యువు
దైవదర్శనానికి వెళుతుండగా..బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన పద్మ, ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిన విశ్వనాథరెడ్డి కావిడి ఎత్తుకొని వారంతా భక్తి భావంతో తిరుత్తణి ఆలయానికి కారులో బయలు దేరగా అనుకోని మృత్యువు దారిలోనే కాపు కాసి కాటేసింది. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడి ముగ్గురు విగత జీవులయ్యారు. కుటుంబ సభ్యులు ఏం జరిగిందో ఊహించే సరికి ఘోరం జరిగిపోయింది. ఈ విషాదకర ఘటనతో జీడీ నెల్లూరు మండలం గోవిందరెడ్డి పల్లె శోకసంద్రంగా మారింది. గంగాధర నెల్లూరు : తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి ఆలయానికి కావిడి ఎత్తుకొని దైవదర్శనానికి కారులో వెళుతుండగా మార్గమధ్యలో అనుకోని ప్రమాదం కుటుంబాన్ని కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తుల వివరాల మేరకు గంగాధర నెల్లూరు మండలం వేపంజేరి పంచాయతీ గోవిందరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి తమ్ముడు విశ్వనాథ రెడ్డి ( చిన్నబ్బ) కుటుంబ సభ్యులు మంగళవారం తమ ఇంటి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి మురుగన్ ఆలయానికి కావిడి ఎత్తుకొని కారులో బయలుదేరారు. ఈ కారులో విశ్వనాథ రెడ్డి, ఆయన భార్య రేఖ, వదిన చిట్టెమ్మ, అన్న కుమార్తె కీర్తి, అన్న మనవడు శాన్విక్ రెడ్డి , గ్రామస్తురాలు (పనిమనిషి) పద్మ, గోవిందరెడ్డి పల్లి నుంచి తిరుత్తణికి ప్రయాణిస్తుండగా పల్లిపట్టు నుంచి కొద్ది దూరంలో తమిళనాడుకు సరిహద్దులో తర్చూరు హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం జరిగింది. తమిళనాడు సరిహద్దులో కుమార రాజపేట– వెంగళరాజ కుప్పం ప్రాంతంలో అసంపూర్తిగా పూర్తిస్థాయిలో నిర్మాణం కానీ హైవే రోడ్డు లో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గ్రామస్తురాలు పద్మ(50) అక్కడికక్కడే చనిపోగా విశ్వనాథరెడ్డి(44) తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య రేఖ , వదిన చిట్టెమ్మ, అన్న కుమార్తె కీర్తి తీవ్ర గాయాలతో తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో విశ్వనాథరెడ్డి అన్న కుమార్తె కీర్తి కుమారుడు శాన్విక్ రెడ్డి ( ఒక సంవత్సరం లోపు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.న్యూస్రీల్ హైవే రోడ్డు నిర్మాణం వద్ద కారు ప్రమాదం ముగ్గురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ నేత ఇంట్లో విషాదం -
ఆధార్ కేంద్రాల్లో ఇబ్బంది పెట్టొద్దు
చిత్తూరు కార్పొరేషన్ : సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకులు బాధ్యతగా పనిచేయాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. మంగళవారం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని సచివాలయ డిజిటల్ సహాయకులకు ఆధార్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆధార్ కోసం రద్దీ వచ్చినప్పుడు వారితో మర్యాదగా నడుచుకోవాలన్నారు. పదేపదే కార్యాలయాలకు తిప్పించుకోకుండా అప్పటికప్పుడు పనులు చేసి పంపాలన్నారు. ప్రస్తుతం అధికంగా సచివాలయాల్లో యువత పనిచేస్తున్నారన్నారు. కొందరు ప్రతి చిన్న విషయానికి ప్రజలను విసుక్కుంటున్నారని తెలుస్తోందన్నారు. ఏదో సమస్యల పై కార్యాలయానికి వచ్చేవారితో అమర్యాదగా నడుచుకోవద్దన్నారు. అనంతరం డీఎల్డీఓలు రవికుమార్, ఇందిరా మాట్లాడారు. ఇటీవల బదిలీలపై ఉద్యోగులు మారడంతో వారి కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్, పుట్టినరోజు ,పేరు మార్పు వంటి సేవల పై మరింత అవగాహన తెచ్చుకోవాలన్నారు. -
నకిలీ బిల్లులతో హైటెక్ మోసం
– రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్న వైఎస్సార్ సీపీ నేతలు విజయపురం : మండలంలోని మహారాజపురంలో నకిలీ బిల్లులతో తమిళనాడుకు తరలి వెళ్తుంటే ఆరు గ్రావెల్ టిప్పర్లను వైఎస్సార్ సీపీ నేతలు నకిలీ బిల్లులతో సహా రెడ్ హ్యాండెడ్గా మంగళవారం సాయంత్రం పట్టుకొన్నారు. దీంతో హైవే పేరుతో హైటెక్గా జరుగుతున్న మోసం బట్టబయలైంది. వారు తహసీల్దార్కు సమాచారం అందించగా బిల్లులు పరిశీలించిన ఆయన టిప్పర్లను పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో ఏడాది కాలంగా జరుగుతున్న అవినీతి వ్యాపారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. విజయపురం మండలంలోని మహారాజపురంలోని గ్రావెల్ క్వారీలు తమిళనాడు సరిహద్దుకు ఆనుకొని ఉండటంతో అక్రమార్కుల కన్ను దానిపై పండింది. దీంతో కూటమి నేతలు అక్రమార్జనకు ఇది కల్పతరువుగా మారింది. గ్రావెల్ తమిళనాడుకు తరలిస్తూ ఒక టిప్పర్కే సుమారు రూ.10 నుంచి 15 వేల ఆదాయం గడిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 100 టిప్పర్లు తరలిస్తున్నారు. తరలింపు కోసం నకిలీ బిల్లులు టిప్పర్ల రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా తమిళనాడు వెళ్లడానికి ఏపీ గనులు శాఖ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ బిల్లులతోనే గ్రావెల్ తరలిస్తున్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ నేతలు లారీలను అడ్డుకొని బిల్లులు పరిశీలిస్తే గ్రావెల్ తరలిస్తున్నది మహారాజపురంలో అయితే కౌలు పొందిన క్వారీ ప్రదేశం నగరి మండలం కాకవేడు అని చూపడం అది తిరుపతి జిల్లాలో ఉన్నట్లు చూపడంతో బిల్లులు నకిలీవని తేలిపోయింది. ఏడాది పాటుగా జరుగుతున్న అసలు దందా వెలుగుచూసింది. వాహనాలను వదిలేసి డ్రైవర్లు కూడా పరారీ కావడం అక్రమ వ్యాపారానికి అద్దం పట్టింది. ● ఈ సంఘటనపై తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ.. గ్రావెల్ తరలించే టిప్పర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. బిల్లులపై అనుమానం ఉండడంతో మైనింగ్ అధికారులకు సమాచారం అందించామన్నారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకొంటామని తెలిపారు. -
జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
పుంగనూరు : జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు మండలంలోని చండ్రమాకులపల్లె జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న గానవి ఎంపికై ంది. మంగళవారం హెచ్ఎం వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలలో బాలిక ఉత్తమ ప్రతిభను చాటిందని తెలిపారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీలకు గానవిని ఎంపిక చేశారన్నారు. ఈనెల 25న ఛత్తీస్ఘడ్లోని నారాయణపుర్లో జరిగే జాతీయస్థాయి పోటీలలో గానవి పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు క్రీడాకారిణి గానవి ని, వారి తల్లిదండ్రులను అభినందించారు. ‘నులి’మేద్దాం ఐరాల : చిన్నపిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులిపురుగులేనని.. ఆల్బెండజోల్ మాత్రలతో నులి పురుగులను నులిమేద్దామని రాష్ట్ర ఆరోగ్యశాఖ జేడీ, ఎన్డీడీ ప్రోగ్రాం నోడల్ అధికారి డాక్టర్ సునీల్కుమార్నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం కాణిపాకం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఆ పాఠశాల హెచ్ఎం మోహన్కు ఆదేశించారు. 1 నుంచి 19 ఏళ్లు కలిగిన పిల్లలందరూ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని, ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్గా త్యాగరాజన్ చిత్తూరు అర్బన్ : రాష్ట్ర మొదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా సీఎస్ త్యాగరాజన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా చిత్తూరు నగరానికి చెందిన సీఎంటీ త్యాగరాజన్ను ఈ పదవిలో నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. గడువు పొడిగింపు చిత్తూరు కలెక్టరేట్ : స్కూల్ గేమ్స్ సెక్రటరీగా రెండేళ్ల నియామకానికి స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీలు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి మంగళవారం పేర్కొన్నారు. 58 ఏళ్లు వయస్సు లోగా ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు వినియోగించుకొని గడువులోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని వివరించారు. డెత్ క్లెయిమ్స్ పరిష్కారానికి కృషి చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల ఈపీఎఫ్కు సంబంధించి డెత్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని కడప రీజియన్ పీఎఫ్ కమిషనర్ రవితేజకుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డెత్ క్లెయిమ్స్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు 9491138280 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బైరెడ్డిపల్లె : కూటలవంక వద్ద మంగళవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గడ్డూరు పంచాయతీ కోట్రేపల్లెకు చెందిన వేణుగోపాల్రెడ్డి (58) బైరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కూటలవంక వద్ద అదుపుతప్పి గాయపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్రెడ్డిని స్థానికులు 108 వాహనం ద్వారా పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యాయత్నం కేసులో ప్రియుడు అరెస్ట్ పుంగనూరు : ప్రియురాలి గొంతు కోసిన కేసులో ప్రియుడు వెంకటేష్ను అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు మంగళవారం తెలిపారు. పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్లో ఉంటున్న మహిళ గొంతు కోసిన వెంకటేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఓర్వలేకనే ఎంపీపై అక్రమ కేసులు
వెదురుకుప్పం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎలాగైనా అణిచివే యాలనే కుట్రతో ఎంపీ మిథున్రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసినట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజయరెడ్డి అన్నారు. ఎంపీ కడిగిన ఆణిముత్యంలా బయటకు రావాలని కోరుతూ మంగళవారం చవటగుంటలోని ఆవుదేవర నందీశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నియో జకవర్గ కార్యదర్శి భీమశంకర్రెడ్డి, వైద్యవిభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, మాజీ ఎంపీ పీ మేలిపాటి పురుషోత్తం, సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు దేవరాజులురెడ్డి, మండల యువ త మాజీ అధ్యక్షుడు నరేష్రెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్లు మునికృష్ణారెడ్డి, జయప్రకాష్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గోవిందరెడ్డి, మాజీ ఎంపీటీసీ మునిరత్నంరెడ్డి, సర్పంచ్ ఆశీర్వాదం, మాజీ సర్పంచ్లు చిరంజీవిరెడ్డి, రమేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మిథున్రెడ్డి విడుదల కావాలని పూజలు సదుం : అక్రమ కేసులతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి తెలిపారు. మండలంలోని రెడ్డివారిపల్లె శ్యాంమతుల ఎల్లమ్మ ఆలయంలో అక్రమ కేసులో అరెస్టు అయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావాలని సర్పంచ్ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేసి ఆలయ ఆవరణలో 101 టెంకాయలను కొట్టారు. ఈ కేసులో ఎంపీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, గిరిధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఆనంద రెడ్డి, శ్రీనివాసులు, వెంకటస్వామి, శివ, మోహన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రమణారెడ్డి, తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
మా మీద దయ చూపరా..!
● పెండింగ్లో 6 విడతల రీయింబర్స్మెంట్ బకాయిలు ● విద్యాశాఖ మంత్రికి విన్నవించినా స్పందన కరువు ● అయోమయంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ● నేడు తాడేపల్లిలో ఏపీ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ రెండేళ్ల బకాయిలు చెల్లించకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు డిగ్రీ ప్రైవేటు కళాశాలలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటి వరకు జరగకపోవడంతో పాటు 2023 నుంచి 2025 వరకు ప్రభుత్వం నుంచి సుమారు ఆరు విడతల బకాయిలు అందకపోవడంతో కళాశాలలను ఎలా కొనసాగించాలో అర్థం కాని పరిస్థితిలో యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. ఏడాది నుంచి పలుమార్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసి విన్నవించినా స్పందన లేదు. దీంతో ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ఏపీపీడీసీఎంఏ) ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు శాంతియుతంగా ధర్నా నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని సిద్ధమయ్యారు. 6 విడతల బకాయిలు సుమారు రూ.330.15 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమారు 108 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 85 కళాశాలలు ఎక్కువ మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయి. గత మూడేళ్లుగా 6 విడతల ఫీజురీయింబర్స్మెంట్ సుమారు రూ.330.15 కోట్లు ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఉమ్మడి జిల్లా సమాచారం ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 108 చదువుతున్న విద్యార్థుల సంఖ్య 47,360 పెండింగ్లో ఉన్నది 6 విడతలు బకాయిలు మొత్తం రూ.330.15 కోట్లు ఒక్కో డిగ్రీ కళాశాలకు సుమారు రూ.3.05 కోట్లు ఒక్కో విద్యార్థికి సరాసరి అందాల్సిన మొత్తం రూ.18,000ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం ఆరువిడతల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభు త్వం చెల్లించకపోవడంతో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయాం. కనీసం నూతన విద్యాసంవత్స రం ప్రారంభం కావడంతో ఉద్యోగులకు, అధ్యాపకులు జీతాలు ఇవ్వలేని దుస్థితి. కళాశాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణం బకాయిలను విడుదల చేయాలి. – పట్నం సురేంద్రరెడ్డి, ప్రైవేటు డిగ్రీ కాలేజీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తక్షణం విడుదల చేయాలి పెండింగ్ రీయింబర్స్మెంట్ నిధులను ప్రభు త్వం తక్షణమే విడుదల చేయాలి. గత 6 విడతలకు సంబంధించి సుమారు జిల్లాకు రూ.330 కోట్లు రావాల్సి ఉంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి నాలుగు మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ రాకపోవడం విచారకరం. ఈ ఏడాది కళాశాలలో కనీసం 50 శాతం అడ్మిషన్లు జరుగుతాయనే నమ్మకం లేదు. సింగిల్, డబుల్ మేజర్ అంటూ డిగ్రీ అడ్మిషన్ల విషయంలో అయోమయం నెలకొంది. – ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు, తిరుపతి జిల్లా -
ఘనంగా సంకటహర చతుర్థి
– పోటెత్తిన భక్తులు కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అ లంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి...ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతంను ఆచరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఈఓ పెంచల కిషోర్, డీఎస్పీ సాయినాథ్, ఏఈవో రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నేత్రానందం.. స్వర్ణరథం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడ వీధులలో స్వర్ణ రథ సేవను నేత్రానందంగా నిర్వహించారు. -
గజరాజులను కాపాడుకుందాం
పలమనేరు : కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులు ఉండడం మన అదృష్టమని వాటిని మన సంపదగా భావించి వాటిని కాపాడుకుందామని పలమనేరు సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్ సూచించారు. మండలంలోని మొసలిమడుగు కుంకీ ఏనుగుల క్యాంప్లో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని స్థానిక అటవీశాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏనుగులను అలంకరించి వాటికి పూజలు చేసి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విడత థీమ్గా మాతృస్వాములు వాటి జ్ఞాపకాలుగా నిర్ణయించారన్నారు. గుంపులోని పెద్ద ఆడ ఏనుగు ఓ పెద్దమ్మలా గుంపును రక్షించుకుంటూ నడిపించడం చేస్తూ వాటి ఉనికికి మార్గాన్ని చూపుతుందన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని ఏనుగులు అడవిని దాటి కరెంట్ బారీన పడి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గ్రామాల్లోకి ఏనుగులు వచ్చినప్పుడు ప్రజలు వాటిపై దాడులు చేయడం లాంటివి చేయరాదన సూచించారు. ఏనుగులను కాపాడుకునేందుకు అందరం భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎఫ్ఆర్వో నారాయణ, పలువురు ఎఫ్ఎస్వోలు, ఎఫ్బీవోలు, మావటీలు, సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
నిజమైనా కార్యక్తులకు పెద్దపీఠ
కుప్పం: వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తామని వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వకర్త, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. సోమవారం బాబు షురిటీ– మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎందరో మాయమాటలు చెప్పారని, అధికారం కోల్పోగానే అడ్రస్ లేకుండా పోయారని చెప్పారు. అందర్నీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బాబు షూరిటీ –మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వాహించాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ప్రజలకు గుర్తుచేయాలన్నారు. అనంతరం నూతనంగా వైఎస్సార్సీపీ నియమించినా మున్సిపల్ కమిటీని ఆయన సన్మానించారు. వైఎస్సార్సీపీ నాయకులు హఫీజ్, మురుగేష్, మణి, మునిరాజ్, గుడుపల్లె జెడ్పీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, రామకృష్ణా, కుమారుస్వామి, మురుగేష్ పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 45 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్కు 45 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్రాజు, పోలీసు శిక్షణా కేంద్రం డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. నివాసం లేని ఇంటికి రూ.28,438 విద్యుత్ బిల్లు కార్వేటినగరం: నిత్యం ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు పోతున్న ఇళ్లకు రాని విద్యుత్ బిల్లు ఎవరూ కాపురం లేని ఇంటికి రావడంతో స్థానికులు విస్తుపోతున్నారు. పరిశ్రమా.. లేకా ఇల్లా? అన్న అనుమానంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. వివరాలు.. కార్వేటినగరం మండల పరిధిలోని ఎగువరాజులకండ్రిగ గ్రామానికి చెందిన దామోదరరాజు, శాంతమ్మ దంపతులు వారి పిల్లలతో పాటు గత కొన్నేళ్లుగా ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిపడ్డారు. అయితే ఎప్పుడో పండుగలు, శుభ కార్యాలకు మాత్రం స్వగ్రామం ఎగువరాజులకండ్రిగకు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్లేవారు. అయినప్పటికీ విద్యుత్ బిల్లులు సమీప బంధువులు చెల్లిస్తుంటారు. గత నెలలో దామోదరరాజు ఇంటికి విద్యుత్ బిల్లు రూ.64 వచ్చింది. ఆగస్టులో అకస్మాత్తుగా రూ.28,438 బిల్లు రావడంతో ఇంటి యజమాని షాక్ అయ్యారు. ప్రభుత్వ ఆలసత్వం వల్లే విద్యుత్ బిల్లులు ఇలా వస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. విశ్వబ్రాహ్మణులకు లోకేష్ క్షమాపణ చెప్పాలి పలమనేరు: విశ్వబ్రాహ్మణులకు లోకేష్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షురాలు పవిత్ర డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా లోకేష్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పద్మశాలిలకు రెండు కులవృత్తులుంటాయని, అందులో ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి అని చెప్పడం బాధాకరమన్నారు. కనీసం రాష్ట్రంలోని బీసీ కులాల్లో ఏకులం ఏ కులవృత్తిని చేస్తుందో తెలియక ఆయన తెలివిలేకుండా మాట్లాడడం శోచనీయమన్నారు. విశ్వబ్రా హ్మణుల మనోభావాలను దెబ్బతినేలా లోకేష్ మాట్లాడడం చాలా బాధ కలిగించిందని, దీన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. -
గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!
● మిథున్రెడ్డి విడుదల కావాలని బోయకొండలో పూజలు ● తరలివచ్చిన పార్టీ శ్రేణులు చౌడేపల్లె: అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ.మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ బోయకొండలో సోమవారం 1,116 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దిగువపల్లె పంచాయతీకి చెందిన నేతలు మునికృష్ణమనాయుడు, కొలింపల్లె గంగిరెడ్డి, లడ్డూరమణ, నరసింహారెడ్డి, ఆనందరెడ్డి, వెంకటరెడ్డి, జీఆర్ఎస్ రమణ, ప్రసాద్నాయుడు, శ్రీనాథ్, సుధ, గంగిరెడ్డి, సోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బోయకొండలో నాలుగు కాళ్ల మండపం వద్ద నుంచి మెట్ల మార్గంలో బయలుదేరివెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అభిషేకం, అర్చనలు చేశారు. కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తోందని, మంచి బుద్ధిని ప్రసాదించాలని పూజలు చేశారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా అక్రమ కేసు నుంచి బయటకు వచ్చేలా శక్తిని ప్రసాదించాలని కోరారు. అనంతరం మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి, యువకాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్బాబు, మండల పార్టీ ఉపాఽఽధ్యక్షుడు వెంకటరమణ, మాజీ సింగిల్విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు షంషీర్, చెంగారెడ్డి, ఓబులేసు, ప్రభాకర్ యాదవ్, ఓబుల్రెడ్డి, శ్రీరాములు, రమేష్ బాబు, మణిరాజు, అనుప్రియ, గిరిబాబు, శంకరప్ప, అరుణ, ఖాజా తదితరులు పాల్గొన్నారు. మిథున్రెడ్డికి బెయిల్ రావాలని పూజలు చిత్తూరు కార్పొరేషన్: కక్షలే పాలనగా.. కేసులే పరమావధిగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని దొడ్డిపల్లె సప్తకనికలమ్మ ఆలయంలో మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషే కాలు చేశారు. ఆలయం వెలుపల టెంకాయలు కొట్టి రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలని ప్రార్థించామన్నారు. ఉయ్ స్టాండ్ ఫర్ మిథున్రెడ్డి అంటూ పోస్టర్లు చేతబట్టి వారి మద్దతును తెలిపారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ జగనన్నకు ఆప్తుడు అయిన మిథున్రెడ్డిపై కక్షగట్టి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని మానసికంగా వేధించాలనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, జెడ్పీటీసీ బాబునాయుడులు మాట్లాడారు. నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, నాయకులు మధుసూదన్, హరిషారెడ్డి, కృష్ణారెడ్డి, లత, బిందు, మనోహర్రెడ్డి, మధురెడ్డి, చల్లాముత్తు, శివ, అప్పొజీ, మనోజ్రెడ్డి, మదన్, త్యాగ, స్టాండ్లీ, గుణ, సత్య, గురుమూర్తి, రాంగణేష్, లోక, శివారెడ్డి, చంద్ర పాల్గొన్నారు, మసెమ్మ ఆలయంలో పూజలు పుంగనూరు: ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి విడుదల కావాలని కోరుతూ మసెమ్మ ఆలయంలో వైఎస్సార్సీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, జిల్లా యూత్ వింగ్ కార్యదర్శి కొత్తపల్లె చెంగారెడ్డి, పీకేఎం మాజీ ఉడా చైర్మన్ వెంకటరెడ్డియాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు కలసి కొండచెర్ల కురప్పల్లెలో గల మసెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ భాస్కర్రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మిథున్రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నంజుండప్ప, జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, సుబ్బన్న, జయరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, బాబునాయక్ పాల్గొన్నారు. -
అనుబంధ విభాగాలు చురుగ్గా పనిచేయాలి
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు చురుగ్గా పని చేయాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు, దాడులపై పార్టీ జిల్లా అనుబంధ విభాగాల నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిరసనలు చేపట్టాలన్నారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా తాను ఉద్యమాల్లో ముందుంటానని తెలిపారు. కూటమి అరాచకాలను, దాడులను ఎప్పటికప్పుడు సోషల్మీడియా ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారని, వాటిని ఆయా వర్గాల నాయకులు ఖండించాలన్నారు. సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. కూటమి అరాచకాలు, దాడులపై నిరసనలు చేయండి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన -
ఫీజు బకాయిలపై పోరుబాట
● ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ● కళాశాలలు ఎలా నిర్వహించుకోవాలని ఆవేదన ● ఇప్పటి వరకు ఒక్క విడత ఫీజు బకాయి చెల్లించలేదని ఆరోపణ ● ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ నాయకుల మండిపాటు చిత్తూరు కలెక్టరేట్ : ఫీజు బకాయిల కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆ అసోసియేషన్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచికళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చిల్లిగవ్వకూడా ఇవ్వలేదన్నారు. ఫీజు బకాయిలు ఇవ్వకపోతే కళాశాలలు ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. అప్పులు చేసి కళాశాలలు నిర్వహిస్తున్న తమ పరిస్థితి ఏమవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి 3 విడతల ఆర్టీఎఫ్, 2024–25 విద్యాసంవర్సంలో 3 మొత్తం 6 విడతల ఆర్టీఎఫ్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. తమ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొరపెట్టుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విద్యాశాఖామంత్రి లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. అయినా ఏ మాత్రం స్పందన లేదన్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో సిబ్బంది జీతాలు, రవాణా, కళాశాల నిర్వహణ కష్టతరమవుతోందన్నారు. చాలామంది కరస్పాండెంట్లు అప్పుల ఉబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 13న తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు బాలాజీ, వాసు, ప్రభు, సురేష్, జానకిరామిరెడ్డి పాల్గొన్నారు. -
పరిశ్రమలకు అత్యంత అనుకూలం
తమిళనాడుకు సరిహద్దులో విజయపురం మండలం ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవసర మైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ఈ ప్రాంతం 48 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయాలు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇదిగాక చైన్నె–తిరుత్తణి జాతీయ రహదారి 2.3 కిమీ దూరంలోనే ఉంది. చైన్నె పోర్టు 45 కి.మీ దూరంలో, కటికపల్లి ఓడరేవు 60 కి.మీ దూరంలో, కామరాజర్ ఓడరేవు 115 కి.మీ దూరంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి రవాణాకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు చైన్నె విమానాశ్రయం 50 కిమీ దూరంలోను, రేణిగుంట విమానాశ్రయం 43 కిమీ. దూరంలో ఉండడంతో పరిపాలనాపరమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే కోసలనగరం వద్ద కోరా ప్యాక్, చైన్నె పార్కింగ్ బ్రిక్స్ పరిశ్రమలను తమిళనాడు నుంచి వచ్చిన వారు ఏర్పాటుచేసుకున్నారు. -
నిరక్షరాస్యులకు వరం ఓపెన్ స్కూల్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఓపెన్ స్కూల్ విధానాన్ని నెలకొల్పారని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలన్నారు. చదువు మధ్యలో మానేసిన, బడికి వెళ్లే పరిస్థితి లేని వారికి సార్వత్రిక (ఓపెన్ స్కూల్) విధానం ఎంతో సులభమైందన్నారు. డీఈవో వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ విధానంలో పది, ఇంటర్ కోర్సులకు అడ్మిషన్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 31, 2025 నాటికి 15 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. అభ్యర్థులకు ఏప్రిల్, మే, జూలై నెలల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత ఉంటుందన్నారు. పదో తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100, అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1,300, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు రూ.900 చెల్లించాలన్నారు. ఇంటర్మీడియెట్కు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1,400, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు రూ.1,100 చెల్లించాలన్నారు. అనంతరం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డ్వామా పీడీ రవికుమార్, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, డీఈవో కార్యాలయం ఏడీ–2 వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
భస్మాసురహస్తం!
ఆలయ భూములపై..● దేవుడి మాన్యాలు ‘పచ్చ’ నేతల చేతుల్లోకి ● చిత్తూరులో రూ.50 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం ● నామమాత్రపు అద్దెలు.. మూడేళ్ల లీజు పేరిట నాటకం ● ఆపై 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకునేలా ఒప్పందం? ● టెండరు నోటీసులు ఇవ్వకుండాఅధికారుల డ్రామా ● కరపత్రాలతో పబ్లిసిటీ ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేసిన వైనం ఎవడ్రా ఆపేది? సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు నగరంలోని కొందరు కూటమి పార్టీ ప్రజాప్రజాప్రతినిధుల కన్ను ఆలయ భూములపై పడింది. ఐదేళ్ల పాటు నిధుల ఆకలితో అల్లాడిపోయిన నేతలు ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేశారు. టెండరు లేదు.. నోటీసు బోర్డులో కరపత్రాలు పెట్టలేదు.. పోటీలేదు.. కానీ వేలం పాట మాత్రం జరిగిపోయినట్లు రికార్డులు సృష్టించేశారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన దేవదాయశాఖ భూముల్ని లీజు పేరిట కారుచౌకగా కొట్టేశారు. అన్ని వేళ్లూ అధికారుల వైపే ఈ మొత్తం వ్యవహారంలో దేవదాయశాఖకు చెందిన కొందరు అధికారులు కూటమి నేతలు చెప్పినట్లు తలూపినట్లు స్పష్టమవుతోంది. దేవదాయశాఖకు చెందిన ఏ స్థలాన్ని లీజుకు ఇవ్వాలన్నా ముందుగా పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆపై బహిరంగ వేలం పాట నిర్వహించాలి. ఈ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా భద్రత కోరుతూ డీఎస్పీకి లేఖ రాయాలి. వేలం పాటకు ఒకే వ్యక్తి వచ్చినట్లయితే వాయిదా వేయాలి. వేలం పాట జరిగే ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు చేయించాలి. కానీ అధికారులు ఎవ్వరూ కూడా ఈ నిబంధనలు పాటించలేదు. గుట్టుచప్పుడు కాకుండా కూటమి నేతలకు ఆలయ భూములు అప్పగించేశారు. తొలుత మూడేళ్ల పాటు లీజుకు తీసుకుని.. 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఒప్పందం కుదుర్చుకోవచ్చన్న దురాలోచన కూడా అధికారులే సూచించినట్లు సమాచారం. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అధికారులు కరపత్రాలు ముద్రించి, వీటిని నగరంలోని ఇంటింటికీ పంచిపెట్టినట్లు తప్పుడు రాతలను పుస్తకాల్లోకి ఎక్కించారు. ఆలయ భూములను చెరబట్టిన కూటమి నేతల చేష్టలపై సొంత పార్టీ నాయకులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తుండడం కొసమెరుపు. చిత్తూరు నగరం హైరోడ్డు ప్రాంతంలో వడ్లమండి సత్రం ఉంది. సత్రం భూమిలో మొత్తం 18 దుకాణాలు ఉండేవి. నెలకు రూ.1.15 లక్షలు ఆదాయం వచ్చేవాటిని రోడ్డు విస్తరణ పేరిట కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. రూ.15 కోట్ల విలువ చేసే ఖాళీ స్థలంలో పర్యాటక రంగం పేరిట అభివృద్ధి చేయడానికి భూమిని లీజుకు తీసుకునేందుకు పూతలపట్టుకు చెందిన కూటమి నేత ప్రధాన అనుచరుడు దరఖాస్తు పెట్టుకున్నాడు. బంగారుపాళ్యంకు చెందిన ఆ పచ్చ చేత కన్ను పడ్డ దేవదాయశాఖ స్థలాన్ని విడిపించడం ఎవ్వరితరం కాదనే వాదన వినిపిస్తోంది. చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలోని వీరాంజనేయస్వామి దేవాస్థానానికి సంబంధించి ఆర్టీసీ వన్డిపో సమీపంలో 17 సెంట్ల భూమిని నెలకు రూ.49,700 చొప్పున అద్దెకు తీసుకున్నట్లు గత ఏడాది రికార్డుల్లో నమోదైంది. ఈ స్థలంలో షాపులు కూడా నిర్మించేశారు. ఈ షాపుల ద్వారా నెలవారీ అద్దె రూ.లక్షకు పైనే వస్తుంది. అడ్వాన్సుల కింద రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం. అన్యాక్రాంతంగా ఉన్న భూమి నుంచి అద్దెలు వసూలు చేస్తే తప్పేంటనేది అధికారుల ప్రశ్న. చిత్తూరు నగరంలోని జీవకారుణ్యసత్రానికి సంబంధించిన 3.3 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. ఓవర్ బ్రిడ్జి కింద, రైల్వేస్టేషన్–బస్టాండుకు పక్కనే ఉన్న ఈ భూమి విలువ రూ.30 కోట్లకు పైమాటే. ఇంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.75 వేల నామమాత్రపు అద్దెకు అధికారులు లీజుకు ఇచ్చేశారు. త్వరలోనే ఇక్కడ వాణిజ్య సముదాయం, కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడున్న పురాతనమైన ఈశ్వరుని ఆలయం ఎదుట భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు వేసుకోవాలంటే భక్తులకు అనుమతి ఇవ్వని దేవదాయశాఖ అధికారులు.. అసలు టెండరు ఇవ్వకుండా రూ.కోట్ల విలువచేసే స్థలంలో కాంప్లెక్సులు కట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్
● కేటగిరీల వారీగా ఫలితాల వెల్లడి ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 50,502 మంది అభ్యర్థుల ఫలితాలు ● త్వరలో టెట్ అభ్యంతరాల ప్రక్రి ● ఆపై ర్యాంకులు, అర్హుల వివరాలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 3వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసింది. చిత్తూరు జిల్లా పరిధిలో 33,181 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిన మెలికల కారణంగా చాలామంది పరీక్షలు రాయలేక నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 33,181 మంది దరఖాస్తు చేసుకోగా 30,952 మంది పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో 21,340 మంది దరఖాస్తు చేసుకోగా.. 19,550 మంది పరీక్షలు రాశారు. ఫలితాలు ఇలా.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పరీక్షలకు హాజరైన 50,502 మంది అభ్యర్థుల డీఎస్సీ ఫలితాలను ప్రకటించారు. ఆయా అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఫలితాలు పొందేలా అవకాశం కల్పించారు. టెట్ వెయిటేజీ, డీఎస్సీ మార్కుల స్కోర్లను కలిపి మొత్తం స్కోర్ను ప్రకటించారు. ప్రస్తుతం ఫైనల్ స్కోర్ మాత్రమే ప్రకటించారు. కొందరు టెట్ మార్కులు తప్పుగా నమోదు చేయడంతో వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. తుది ఎంపిక జాబితా అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 1,478 పోస్టులను భర్తీ చేయనున్నారు. పేరు : ఎస్.భార్గవ ప్రాంతం :ఐరాల. పోస్టు : ఎస్జీటీ మొత్తం స్కోర్ : 100 మార్కులకు 80.08 పేరు : ఎం.ప్రశాంత్ ప్రాంతం : చిత్తూరు నగరం పోస్టు : ఎస్జీటీ మొత్తం స్కోర్ : 100 మార్కులకు 82.48 పేరు : కే.మునికుమార్ ప్రాంతం : పలమనేరు పోస్టు : ఎస్జీటీ మొత్తం స్కోర్ : 100 మార్కులు 71.20 పేరు : ఎస్. రమేష్ ప్రాంతం : కుప్పం పోస్టు : ఎస్జీటీ మొత్తం స్కోర్ : 100 మార్కులకు 86.36 -
గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
● నివాళి అర్పించిన ఎస్పీ, డీఎస్పీలుకార్వేటినగరం: గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మండలంలోని కుప్పానిగుంట సమీపంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. కార్వేటినగరం బీసీ కాలనీకి చెందిన అయ్యప్ప(41) పుత్తూరు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ కేసు విచారణ కోసం కార్వేటినగరం వస్తున్నాడు. మార్గమధ్యం కుప్పానిగుంట సమీపంలోని చిన్నకనుమ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయ్యప్ప మృతదేహానికి ఘన నివాళి మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అయ్యప్ప మృతదేహానికి తిరుపతి ఎస్సీ హర్షవర్ధన్రాజు ఘన నివాళి అర్పించారు. అలాగే పుత్తూరు డీఎస్పీ రవికుమార్, నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, స్థానిక సీఐ హనుమంతప్ప పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ అయ్యప్ప కుటుంబానికి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్రాజు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అదే విధంగా ఏఆర్ కానిస్టేబుల్ యూనియన్ ఆధ్వర్యంలో అయ్యప్ప కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు ఏఆర్ కానిస్టేబుల్గా పుత్తూరులో విధులు నిర్వహిస్తున్న అయ్యప్ప మృతి చెందడంతో సోమవారం తన స్వగ్రామం కార్వేటినగరంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆకాశంలో మూడో కన్ను
అన్నింటా ఇపుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పరిజ్ఞానం వచ్చేసింది. విద్య, వైద్యం, ఆఖరుకు హెయిర్కట్ చేసే దుకాణాల్లో సైతం వ్యక్తి ముఖాకృతికి తగ్గట్టు హెయిర్ స్టయిల్ను సూచించే కంప్యూటర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనేన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దొంగలను పట్టుకోవడం.. అసలు దొంగతనాలే జరగకుండా ఉండడానికి పోలీసుశాఖ అడుగులు వేస్తోంది. ఏఐకు డ్రోన్లు జోడించి నిఘా ఉంచడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. చిత్తూరు అర్బన్: పోలీసు శాఖకు డ్రోన్ల అవసరం కచ్చితంగా ఉంది. ఎవరైనా దొంగ చైన్స్నాచింగ్ చేసి పారిపోతుంటే అతని వెంట పరుగెత్తే రోజులు పాతకాలంవి. ఇప్పుడు కూర్చున్నచోటు నుంచే సెల్ఫోన్లో చూస్తూ దొంగను పట్టుకోవచ్చు. దీనికి డ్రోన్ సాయం చేస్తుంది. కాలంతో పోటీపడుతూ నేరం చేసే నిందితులు సరికొత్త మార్గాల్లో దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసుశాఖ కూడా జవాబునిచ్చేందుకు సిద్ధపడుతోంది. రోడ్లపై పోలీసులు కనిపిస్తే తప్పుచేసే వాళ్లు కాస్త ఆలోచిస్తారని నిత్యం గస్తీలు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు నగరాలు, పల్లెటూర్లలో శివారు ప్రాంతాలు, కొండలు–గుట్టల్లో పేకాట ఆడటం, గంజాయి సేవించడం, అడవుల్లో నాటుసారా తయారు చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, నగరి, కుప్పం, చిత్తూరు సబ్–డివిజన్లలో ఇప్పటికే పోలీసులు డ్రోన్లను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతీ స్టేషన్కు ఓ డ్రోన్ జిల్లాలోని నాలుగు సబ్–డివిజన్లలో ఉన్న నాలుగు డ్రోన్లు అన్ని స్టేషన్ల అవసరాలను వినియోగంచడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో జిల్లాలోని ప్రతీ స్టేషన్కు డ్రోన్లు ఇవ్వడానికి రాష్ట్ర హోంశాఖ ఇప్పటికే పోలీసుశాఖ నుంచి వివరాలు తీసుకుంది. జిల్లాలోని 38 పోలీస్ స్టేషన్లతో పాటు అదనంగా మరో మూడు డ్రోన్లు కావాలని జిల్లా పోలీసుశాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. స్టేషన్కు ఓ డ్రోన్ వస్తే శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి ఎంతో ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఖాకీలు డ్రోన్లను ఉపయోగించడానికి చిత్తూరు పోలీసుశాఖ నుంచి ఇటీవల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయ్యింది. మొత్తం 42 మందికి డ్రోన్లను వినియోగించే పద్ధతులపై చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ప్రతీ స్టేషన్ నుంచి ఓ కానిస్టేబుల్ను పిలిపించి శిక్షణ ఇప్పించారు. ఖాకీ యూనిఫామ్ ధరించనున్న డ్రోన్లు పోలీసుశాఖలో సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బంది జిల్లాకు 41 డ్రోన్లు అవసరమని నివేదించిన ఎస్పీ నేర నియంత్రణ.. అసాంఘిక శక్తుల గుర్తింపే లక్ష్యం డ్రోన్ల ద్వారా క్రైమ్ తగ్గిస్తున్నాం జిల్లాలో ప్రస్తుతానికి ప్రతీ సబ్–డివిజన్కు ఓ డ్రోన్ ఉంది. రొటేషన్ పద్ధతిలో స్టేషన్లకు వీటిని ఉపయోగిస్తున్నాం. ప్రతీ స్టేషన్కు డ్రోన్ ఇవ్వడానికి ప్రతిపాదనలు వెళ్లాయి. సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇప్పించాం. డ్రోన్ల ద్వారా నిఘా ఉంచడం వల్ల నేరం జరిగినపుడు నిందితుడ్ని పట్టుకోవడంతో పాటు.. అసలు నేరం జరగకుండా కూడా నియంత్రిస్తున్నాం. దీనివల్ల క్రైమ్ తగ్గుతోంది. – సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గంగవరం: ఇంట్లో ఉరేసుకుని గంగవరం సమీపంలోని జనని మెస్ నిర్వాహకుడు కుమార్(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మండల పరిధిలోని సాయినగర్లో నివాసముంటున్న కుమార్ కొన్నేళ్లుగా అక్కడే జననీ మెస్ నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం షాపునకు కన్నం వేసి చోరీ రొంపిచెర్ల: రొంపిచెర్ల మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు మద్యం దుకాణంలో నగదు, మద్యం చోరీకి గురైనట్లు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. సూపర్వైజర్ వెంకటసాయి కథనం.. ఫజులుపేట సమీపంలో ఉన్న ఎస్వీ మద్యం షాపులో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గోడకు రంధ్రం వేసి లోనికి చొరబడ్డారు. మద్యం షాపులో ఉన్న లాకర్ ఉంచిన రూ.1.88 లక్షల నగదు, అలాగే రూ.9వేల విలువ చేసే మూడు మద్యం బాటళ్లను చోరీ చేశారు. రొంపిచెర్ల ఎస్ఐ సుబ్బారెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. సీపీఐ జిల్లా కార్యదర్శిగా నాగరాజు చిత్తూరు కార్పొరేషన్: సీపీఐ జిల్లా కార్యదర్శిగా రెండో వసారి ఎస్.నాగరాజును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు సోమవారం వివరాలను ప్రకటించారు. ఆగస్టు 9, 10 తేదీల్లో నగరిలో జరిగిన జిల్లా 24వ మహసభలో పలు పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టగా వాటిని రాష్ట్ర కార్యవర్గం ఆమోదించిందన్నారు. ఆయనతో పాటు జిల్లా సహాయ కార్యదర్శులుగా టీ. జనార్ధన్, ఎన్.శివారెడ్డిని ఎన్నుకున్నరన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వివరించారు. -
జాతీయ స్థాయి రగ్బీలో ప్రతిభ
పలమనేరు: జాతీయ స్థాయి రగ్బీలో పలమనేరు పట్టణానికి చెందిన అక్షయ ప్రతిభ చాటింది. ఆసియా రగ్బీ ఎమిరేట్స్ అండర్–20 చాంపియన్షిప్ 2025లో ఇండియా మూడో స్థానంలో నిలవడంలో విశేష ప్రతిభ కనబరిచింది. రెండు రోజుల క్రితం బీహార్లోని రాజ్గిరి ఇంటర్నేషల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన సెమీస్లో మన జట్టు చైనా చేతిలో ఓడింది. దీంతో కాంస్య పతకం దేశానికి దక్కింది. ఈ జట్టులో పలమనేరుకు చెందిన అక్షయ ఉంది. భవిష్యత్తులో అక్షయ ఇండియన్ మహిళా జట్టులో కీలకం కానుంది. అక్షయ తల్లిదండ్రులైన నర్రా సురేష్, శ్రీదేవీ పట్టుదలతోనే ఆమె జాతీయ స్థాయికి ఎదిగిందని తెలుస్తోంది. ఆమెకు అభినందనల వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేసి సత్తాచాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అంతకుముందు మాజీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామినాయుడు, జోనల్ ఇన్చార్జి శివనారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే బాబు పాలన సాగించలేరన్నారు. చిత్తూరులో చాయ్ పే చర్చ ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మిట్టూరులో ఓ టీ దుకాణంలో రైతులు, ప్రజలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. అనంతరం కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహనికి, వివేకానంద విగ్రహనికి నివాళులర్పించి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వనాయుడు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి, నాయకులు నిషిద, చిట్టిబాబు, రామభద్ర, షణ్మగం, సత్య పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
యాదమరి: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ సాయినాథ్ కథనం మేరకు.. యాదమరి మండలం, బోదగుట్టపల్లి పంచాయతీ, తొట్టిగానిఇండ్లుకు చెందిన సదాశివం కుమారుడు విజయకుమార్(26) తమిళనాడు రాష్ట్రం పరదరామిలో ఆవుల వ్యాపారం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం స్వగ్రామానికి వచ్చాడు. సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆపై ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సోమవారం మృతుని తండ్రి సదాశివం కనికాపురం చెరువు వద్ద ఉన్న తన పొలం గట్టుకు వెళ్లాడు. అక్కడ విజయకుమార్ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సాయినాథ్, తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు అనుమానం వ్యక్థం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఐదో రోజూ ఆగని ఏనుగుల దాడులు పులిచెర్ల(కల్లూరు): మండలంలో గత ఐదు రోజులుగా పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. సోమవారం మండలంలోని గండోలపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, దేశిరెడ్డిగారిపల్లెల్లోని పొలాలపై పడి వేరుశనగ, మామిడి, కొబ్బరి చెట్లు, వరి మడులను నాశనం చేశాయి. -
ప్రహసనంగా ఎఫ్ఏ–1 పరీక్షల విధానం
చిత్తూరు కలెక్టరేట్ : అన్ని విద్యాసంస్థల్లో జరుగుతున్న ఎఫ్ఏ–1 పరీక్షల విధానంలో పలు మార్పులు ముఖ్యమని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సోమవారం నుంచి జరగనున్న ఎఫ్ఏ–1 పరీక్షలు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు ఓ పరీక్షగా మారిందని విమర్శించారు. ఇంతవరకు నూతన పరీక్ష విధానం పట్ల ఏ అధికారి నేటి వరకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేదని తెలిపారు. మండల కేంద్రం నుంచి ఉపాధ్యాయులు అసెస్మెంట్ పుస్తకాలు తెచ్చుకోవడం ఓ పరీక్ష అయితే, ప్రతిరోజూ పరీక్ష పత్రాలు తెచ్చుకోవడం మరో పరీక్ష అని దుయ్యబట్టారు. ప్రపంచ బ్యాంకు నిధుల కోసం కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను భయాందోళనలకు ఇలా గురిచేస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఉపయోగపడని విద్యా విధానాలను, పరీక్షా విధానాలను తక్షణమే ఉపసంహరించుకుని.. విద్యార్థులకు స్వేచ్ఛ ఉండేలా మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమే చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమేనని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శులు వాడ గంగరాజు, బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎస్ఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసేందుకే ఈ క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున బహుమతులు ఇస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని పలు స్కూళ్ల వద్ద గుట్కా, మత్తుపదార్థాలు విక్రయాలు జరుగుతున్నాయని, పోలీసులు నిఘా పెట్టి నియంత్రించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ మసూద్, నాయకులు దిలీప్, నిసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో రోజూ ఆగని ఏనుగుల దాడులు పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పంటలను సర్వనాశనం చేశాయి. ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు మిట్టమీదరాచపల్లె పంచాయతీలో పంటలను తొక్కిపడేశాయి. పురుషోత్తం రెడ్డికి చెందిన కొబ్బరి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. అలాగే మామిడి కొమ్మలను విరిచేశాయి. ఏనుగుల దాడిలో టమాట పంట ధ్వంసం ఐరాల: మండలంలో రెండు ఏనుగులు మళ్లీ విజృంభించాయి. శనివారం అర్ధరాత్రి నయనంపల్లెకు చెందిన రైతులు చిన్నయ్య, రాఘవయ్యకు చెందిన టమాట పంటలను ధ్వంసం చేశాయి. అపోలో వారికి చెందిన నాలుగు రాతికూసాలను కూలదోశాయి. అటవీ అధికారులు ఇకనైనా ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కరుణించమ్మ.. గంగమ్మ.. చౌడేపల్లె: జిల్లాలో రెండో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కరుణించమ్మ.. గంగమ్మా అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యే కంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రావణమాసం సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలతో గంగమ్మకు పూజలు చేశారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. జాతీయ స్థాయి తెలుగుభాషా పోటీలు పలమనేరు: వచ్చే తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి తెలుగుభాషా పోటీలను నిర్వహించనున్నట్లు తెలుగుసాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు అమృతభాష అనే అంశంపై రెండు పేజీలకు మించకుండా వ్యాసం రాసి ఈనెల 20వ తేదీలోపు కళామందిరం, గంగవరం, 517408 అనే చిరునామాకు తపాలా ద్వారా మాత్రమే పంపాలని సూచించారు. -
జ్యోతిష్యం చెబుతానని చెప్పి..
– మహిళ మెడలో నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు బైరెడ్డిపల్లె: గుర్తు తెలియని వ్యక్తి ఓంశక్తి మాల ధరించి ఓ వృద్ధురాలి వద్ద నగలు దోచికెళ్లిన సంఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు..నాగిరెడ్డిపల్లెకు చెందిన లక్ష్మమ్మ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓంశక్తి మాల ధరించి అక్కడకు చేరుకున్నాడు. లక్ష్మమ్మ పలకరించగా తాను జ్యోతిష్యం చెబుతానని, కష్టాలు ఉంటే పోగొడతానని నమ్మించాడు. ఇసుక గ్లాసులో తీసుకువచ్చి అందులో నీరు, పసుపు కలపమని చెప్పాడు. ఇసుక తీసుకొచ్చి నీరు, పసుపు కలుపుతున్న సమయంలో లక్ష్మమ్మపై మత్తు మందు చల్లి సుమారు రూ.2 లక్షలు విలువ చేసే నగలను దోచుకెళ్లాడు. ఈ విషయంపై బాధితురాలు బైరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా చెస్ పోటీల్లో అర్జున్ ప్రతిభ చిత్తూరు కలెక్టరేట్: నగరిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీల్లో చిత్తూరు నగరానికి చెందిన న్యూయార్క్ స్కూల్ విద్యార్థి అర్జున్ 2వ బహుమతి గెలుపొందాడని ఆంధ్రా చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఆర్బీ ప్రసాద్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నగరి, నగరి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 250 క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొని రెండవ స్థానాన్ని కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని న్యూయార్క్ స్కూల్ చైర్మన్ శ్రీధర్ అన్నారు. అనంతరం అతన్ని పలువురు అభినందించారు. పోలీసుల అదుపులో గంజాయి విక్రేత ! పూతలపట్టు(యాదమరి): జిల్లాలో మత్తు పదార్థాలకు నిలయమైన పూతలపట్టు మండలం బండపల్లిలో గంజాయి విక్రయదారుడిని పూతలపట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థకు చెందిన కొందరు విద్యార్థులు నిత్యం గంజాయి కోసం బండపల్లిలోని ఓ గంజాయి స్మగ్లర్ రహస్య స్థావరానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆదివారం కాలేజీలకు సెలవు కావడంతో మత్తుకు బానిసైన విద్యార్థులు అధికంగా వచ్చారు. సరఫరాదారు వద్ద అవసరానికి తగ్గ గంజాయి లేకపోవడంతో.. రెగ్యులర్ వినియోగదారులకు తప్ప కొత్తగా వచ్చిన వారికి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన కొందరు విద్యార్థులు సరఫరాదారులపై వాగ్వాదానికి దిగారు. కాగా అక్కడ జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఓ విద్యార్థి పూతలపట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని నుంచి దాదాపు రూ.3000 విలువ చేసే 250 గ్రాముల శీలావతి అనే అత్యంత విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
జిల్లా ఆస్పత్రిలో ఫార్మసిస్టుల కొరత
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసిస్టులు (ఫార్మసీ ఆఫీసర్లు) పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్న వారిపైనే అధిక భారం పడుతోంది. జిల్లా ఆస్పత్రిలో అందించే సేవలతోపాటు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోగులకు చికిత్స అందించే వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం ఫార్మసిస్టులకు ఉంది. వైద్యులు రాసి ఇచ్చిన మందులు అందించేది ఫార్మసిస్టులే. అయినా వారిపై ఉన్న పనిభారాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జి ల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మంది ఫార్మసి స్టులు ఉన్నారు. ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సే వలు అందించడానికి 25 మంది ఉండాలి. ఇంకా 15 మ ంది వరకు ఫార్మసిస్టులు అవసరం. పదేళ్ల క్రితం జిల్లా ఆస్పత్రికి 500 నుంచి 600 వరకు ఓపీలు వచ్చేవి. ఇప్ప డు ఓపీల సంఖ్య 1200 వరకు పెరిగింది. ప్రభుత్వం తరపున 450 బెడ్లు, అపోలో తరపున 400 బెడ్లు ఉన్నా యి. ఇన్పేషెంట్లు రోజువారీగా 300 నుంచి 350 వరకు ఉంటున్నారు. వీరికి 24 గంటల పాటు ఫార్మసిస్టులు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్నవాళ్లపై భారం పడుతోంది. గత ప్రభుత్వంలో సకాలంలో పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులను ఎప్పటికప్పడు భర్తీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో 50 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయడం విశేషం. పీహెచ్సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఏ ఆస్పత్రిలోనైనా పోస్టు ఖాళీ అయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవారు. కానీ ఇప్పుడు పోస్టు ఖాళీ అయితే ఏడాదిన్నర అయినా భర్తీ చేసిన దాఖలాలు లేవు. ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి వెళ్లినా... చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని మే 5న వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సందర్శించారు. ఆయనకు యూనియన్ నాయకులు ఆస్పత్రి పరిస్థితిని, పోస్టుల భర్తీ ప్రాధాన్యతను వివరించారు. అయినా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. -
శభాష్ చిన్నోడా..
చౌడేపల్లె: మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటలు, వాగుల్లోకి వర్షపునీరు చేరుతోంది. ఈ క్రమంలో ఆదివారం నెట్టిబండకు చెందిన రాము కుమారుడు సార్విక్ పొలం వద్దకు వెళ్తుండగా దేవిరెడ్డిచెరువుకు వర్షపునీరు వచ్చే వాగులో పెద్దచేపను గుర్తించాడు. సుమారు గంట సేపు కుస్తీ పడి సుమారు 8 కేజీలు ఉన్న పెద్ద మారవ చేపను అతికష్టం మీద పట్టుకున్నాడు. చిన్నారి పొడవంత సైజు గల చేపను పట్టిన విషయం తెలిసిన స్థానికులు పెద్దచేపను చూసేందుకు క్యూకట్టారు. పీఏసీఎస్లకు కమిటీల నియామకం చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 5 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీడీనెల్లూరు సొసైటీ చైర్పర్సన్గా మోహన్నాయుడు, సభ్యులుగా జ్యోతియాదవ్, చవటగుంటకు చైర్పర్సన్గా బోడిరెడ్డి సుధాకర్రెడ్డి, సభ్యులుగా బీఎం రవి, పి.మనోహర్, పలమనేరుకు చైర్పర్సన్గా వెంకంటరమణ, సభ్యులుగా పాపిరెడ్డి, రమేష్, రొంపిచెర్లకు చైర్పర్సన్గా రఘునాథరెడ్డి, సభ్యులుగా శివరెడ్డి, సురేంద్ర, తవణంపల్లికి చైర్పర్సన్గా అమరేంద్ర నాయుడు, సభ్యులుగా మునీంద్ర, భూపతినాయుడుని నియమించింది. వీరు 2026 జనవరి నెలాఖరు వరకు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన తెలుగు తమ్ముళ్లు
చౌడేపల్లె: తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ఆదివారం చౌడేపల్లె మండలం సింగిరిగుంటలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం పాలన నచ్చక వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. సింగిరిగుంటకు చెందిన ఎం.ప్రకాష్నాయుడు, పి.చెన్నకృష్ణ, పి.నగేష్, కె.రాజశేఖర్నాయుడు, నుంజార్లపల్లెకు చెందిన పి.నాగరాజనాయుడు, రామయ్యగట్లుకు చెందిన డి.సుజాత వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వైఎస్సార్సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దామోదరరాజు, మండల పార్టీ అఽధ్యక్షుడు జి.నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ, మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, వెంకటరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచ్ షంషీర్, నాయకులు చెంగారెడ్డి, రమేష్నాయుడు, మల్లీశ్వరరెడ్డి, సుబ్రమణ్యం నాయుడు, నాగరాజ, హరి, రమేష్బాబు, బాబు తదితరులు పాల్గొన్నారు. కుట్రలకు తెరలేపిన వైనం.. సింగిరిగుంటలో ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో టీడీపీ కార్యకర్తలు చేరిన విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు కుట్రలకు తెరలేపారు. పార్టీని విడిచిన కె.రాజశేఖర్నాయుడు, పి.నగేష్, పి.నాగరాజనాయుడుతో చర్చలు జరిపారు. పుంగనూరు పర్యటన ముగించుకుని మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో రొంపిచెర్లకు వెళ్తున్న చల్లా రామచంద్రారెడ్డి చేత స్థానిక నేతలు మళ్లీ టీడీపీ కండువా వేసి ఆ పార్టీలోకి పిలుచుకున్నారు. కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ిసింగిరిగుంటలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పార్టీలో చేరిన ఆరుగురిలో ముగ్గురికి మళ్లీ కండువా వేసిన టీడీపీ నేతలు -
మోసాలకు నిలువెత్తు రూపం బాబు
పూతలపట్టు(యాదమరి): మోసాలకు నిలువెత్తు రూపం సీఎం చంద్రబాబు అని.. ప్రజలను వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధి పి.కొత్తకోటలోని శ్రీనివాస కల్యాణ మండపంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసమే ఆచరణ సాధ్యం కాని అబద్ధపు హామీలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని చెప్పారు. అధికారం చేపట్టి ఇప్పటికి దాదాపు ఏడాదిన్నర కాలం కావొస్తున్నా ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్సిక్స్ పథకాలలో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా ? అని చంద్రబాబుని ప్రశ్నించారు. సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభ్బుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ప్రజా సంక్షేమంపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గతంలో మునుపెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. కూటమి మోసాలను ప్రజలకు చేరువ చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, నాయకులతో కలిసి క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి అమర్నాథ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు జయచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు రాజారత్నంరెడ్డి, గౌహతి సుబ్బారెడ్డి, యువత అధ్యక్షుడు నవీన్, బూసిపల్లి రెడ్డెప్ప, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి భవితకు విజ్ఞాన్ మంథన్
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషన్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్ఓ, బార్క్, డీఆర్డీఓ ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ వీవీఎం పట్ల జిల్లాలోని క్షేత్రస్థాయి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో దాగి ఉన్న శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగిన సృజనాత్మకత ఆలోచనలు, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరిట జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు గానూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల ఆహ్వానం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వతేదీ వరకు గడువు ఉంటుంది. ఆన్లైన్లో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. 6వ తరగతి నుంచి 11(ఇంటర్ మొదటి సంవత్సరం)తరగతుల వరకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. వంద మార్కులకు పరీక్ష ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబరు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సెకండ్ లెవెల్(ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్లైన్లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19వ తేదీన ఉంటుంది. జాతీయస్థాయికి ఎంపిక ఇలా.. రాష్ట్రస్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2000 చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1 నుంచి 3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు. విజ్ఞాన మంథన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న విద్యాశాఖ అధికారులు 6 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అవకాశం ఎంపికై తే స్కాలర్షిప్, ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్ కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని స్కూళ్లు, కళాశాలల సమాచారం కేటగిరీ స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య ప్రాథమిక 4,247 59,067 ప్రాథమికోన్నత 738 42,380 ఉన్నత 1,203 30,307 జూనియర్ కళాశాలలు 238 27,700 మొత్తం 6,426 1,59,454 సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్జి.ఇన్ వెబ్సైట్లో లాగిన్ కావొచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష ఎంతో దోహదపడుతుంది. పరీక్ష వల్ల కలిగే ఉపయోగాలపై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నాం. – బి.హిమబిందు, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ జిల్లా కోఆర్డినేటర్, చిత్తూరు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్షల్లో పాల్గొనేలా హెచ్ఎంలు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే స్కాలర్షిప్తో పాటు ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్కు అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు జిల్లా. -
చదువుకోవడానికి చెట్లు అడ్డుగా ఉన్నాయట..!
● గుడిపాల మండలం చీలాపల్లె స్కూల్లో భారీ వృక్షాల నరికివేత ● తమకు విషయమే తెలియదంటున్న ఎంఈఓలు ● తహసీల్దార్కు ఇచ్చిన అర్జీని సాకుగా చూపి పని కానిచ్చిన ప్రబుద్ధులు గుడిపాల: ఆ ప్రభుత్వ పాఠశాలలో భారీ వృక్షాలతో ఆహ్లాదం వెల్లివిరిసేది. అయితే ప్రకృతిలో దేన్నీ వదలని కొందరి కన్ను ఆ చెట్లపై కూడా పడింది. సమయం కోసం చాలా రోజులుగా వేచి చూశారు. తాజాగా మూడురోజుల పాటు సెలవులు రావడంతో పని కానిచ్చారు. వివరాలు.. మండలంలోని చీలాపల్లె పాఠశాలలో భారీ వృక్షాలు ఉన్నాయి. అయితే వారి పని కానిచ్చేందుకు పాఠశాల విద్యాకమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో చెట్లలో ఉన్న కొమ్మలను మాత్రం నరికేందుకు పాఠశాల కమిటీ చైర్మన్, సర్పంచ్, విద్యార్థుల వద్ద సంతకాలు సేకరించారు. ఆపై స్కూల్లో పని చేసే టీచర్తో తహసీల్దార్కు పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఈ చెట్ల వల్ల ఆటంకం ఉందని కాకమ్మ కథ అల్లి వినతిపత్రం ఇప్పించారు. సదరు తహసీల్దార్ వెంటనే పంచాయతీ కార్యదర్శికి ఎండార్స్ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. అయితే ఇక్కడే సదరు వ్యక్తులు తెలివి ఉపయోగించారు. ఆ అర్జీని సాకుగా చూపుతూ తహసీల్దార్ చెట్లు కొట్టేందుకు అనుమతి ఇచ్చారని గ్రామంలో హడావుడి చేశారు. ఎలాగూ మూడు రోజుల పాటు సెలవులు కావడంతో సదరు నేతలు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లన్నీ నరికేశారు. గ్రామస్తులు, ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఎందుకు చెట్లను నరుకుతున్నారని అడిగితే విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని కొట్టేశామని నమ్మించారు. అయితే అడ్డంగా ఉంటే చెట్లకొమ్మలు కొట్టాలి కానీ చెట్లన్నీ ఎలా కొడతారని నిలదీశారు ?. ఈవిషయంపై సాక్షి గుడిపాల ఎంఈఓలు హసన్బాషా, గణపతిని వివరణ కోరగా తమకు తెలియదని చెప్పారు. తహసీల్దార్ మాత్రం తనకు అర్జీ ఇచ్చారని.. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శికి రెఫర్ చేశానన్నారు. అయితే ఆదివారం చెట్లను నరికి మొద్దులను ఐచర్ వ్యాన్లోకి లోడ్ చేస్తున్న విషయాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి చెప్పారు. అయితే వ్యాన్ ఆపాలని సూచించారు. అయితే కొద్దిసేపటికే ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో కానీ కలప లోడ్తో ఉన్న వాహనం వెళ్లిపోయింది. ఎంతో ఆహ్లాదాన్ని పంచే వృక్షాలను ఇలా నరికేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కిక్కు పర్మినెంట్!
చిత్తూరు అర్బన్: తొమ్మిది నెలలు నిండాయి. కాన్పుకు కాదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చి. నెలలు నిండిన బిడ్డ ఆరోగ్యంగా ఉందా..? ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని చూడాలి కదా. జిల్లాలో అమలవుతున్న నూతన మద్యం పాలసీ పరిశీలిస్తే.. కేవలం పచ్చ నేతలకు నెలవారి తాయిలాలు, ఆబ్కారీలోని కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోందనడంలో సందేహం లేదు. అందరూ వాళ్లే.. జిల్లాలో గతేడాది అక్టోబర్ 15 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాగినోడికి తాగినంత అనే నినాదంతో ముందుకు వెళుతోంది. చిత్తూరు జిల్లాలోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ పరిధిలో ఎనిమిది సర్కిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో అన్–రిజర్వుడు కింద 104 మద్యం దుకాణాలు, కల్లుగీత సామాజిక వర్గాలకు 9 మద్యం దుకాణాలు చొప్పున లైసెన్సులు జారీఅయ్యాయి. మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిలో దాదాపు అధికార పార్టీకి చెందిన నాయకులు, సానుభూతిపరులే ఉన్నారు. ఒకరిద్దరు బయటివాళ్లకు లైసెన్సులు వచ్చినా.. వాళ్లను ఇబ్బందులు పెట్టిన నాయకులు, దారిలోకి తెచ్చుకుని అమ్మకాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఎవరి వాటా వాళ్లదే! పర్మిట్ గదులు వెలసినచోట.. మరే వ్యాపారం చేయడానికి వీలుండదు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు నిత్యం గొడవలు పడడం, తాగి అక్కడే వాంతులు చేసుకోవడం, పడిపోవడం సర్వసాధారణం. ప్రతీ పర్మిట్ గదికి ఎకై ్సజ్, ఖాకీలు కప్పం వసూలు చేస్తున్నారు. ఈ కప్పంలో ఎకై ్సజ్ అధికారులు ఒక్కో దుకాణానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టులోని ఓ అధికారికి నెలవారీ మామూళ్లు రాకపోవడంతో రెండు పర్మిట్ గదులు మూయించడంతో, తీవ్ర కోపానికి లోనైన ఓ నేత ఆ అధికారికి ఛీవాట్లు పెట్టడంతో మళ్లీ అవి తెరుచుకున్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదికాదన్నట్లు మద్యం దుకాణాలున్న నియోజకవర్గంలో వాటి యజమానులు ఇష్టం ఉన్నా, లేకున్నా పచ్చ నేతలను వాటాదారుడిగా చేర్చుకోవాల్సిందే. వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడి పెట్టని కూటమి నేతలు 5 నుంచి 7 శాతం వరకు.. అంటే నెలకు రూ.8 కోట్ల పైనే లాభాలు ఆర్జిస్తున్నారన్న మాట. కాసులు కురిపించే కల్పవృక్షంగా మద్యం దుకాణాలు విచ్ఛలవిడి అమ్మకాలు.. అనధికార పర్మిట్ గదులు ‘పర్మిట్’లో పచ్చ నేతలు, ఖాకీలకు నెలవారి మామూళ్లు రూ.కోట్లు కురిపిస్తున్న ‘ప్రైవేటు’ మద్యం అమ్మకాలు జిల్లాలో మద్యం దుకాణాలు, విక్రయాలు మద్యం దుకాణాలు – 104 కల్లుగీత మద్యం దుకాణాలు – 09 అనుమతుల్లేని పర్మిట్ గదులు – 350పై చిలుకు మద్యం విక్రయాలు (నెలకు) – రూ.124.20 కోట్లు పర్మిట్ గదుల్లో వ్యాపారం (నెలకు) – రూ.10.50 కోట్లు మొత్తంగా వచ్చే లాభాలు (నెలకు) – రూ.20.26 కోట్లు అధికారులకు అందుతున్న మామూళ్లు – రూ.2 కోట్లకు పైగా నేతలకు ఇచ్చే నెలవారి వాటా – రూ.8.12 కోట్లు పర్మిట్ గదులతో కిక్కు మద్యం దుకాణాలకు మాత్రం ప్రభుత్వమే లైసెన్సులు జారీచేసింది. కానీ జిల్లాలో ప్రతీఒక్క మద్యం దుకాణానికి పక్కనే అనధికారిక పర్మిట్ గదులు ఉన్నాయి. మద్యం తీసుకున్న వ్యక్తి ఆ గదిలోకి వెళ్లి మద్యం సేవించడం, గ్లాసులు, కూల్ డ్రింకులు, స్టఫ్, సిగరెట్లు.. ఇలా ఓ మినీ సూపర్ మార్కెట్ పర్మిట్ గదుల్లో నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న పర్మిట్ గదుల్లో రోజుకు సగటున రూ.30 వేలకు పైనే వ్యాపారం జరగుతోంది. బార్లకు సమాంతరంగా ఉన్న పర్మిట్ గదులు నాయకులకు, ఎకై ్సజ్, పోలీసు అధికారులకు మామూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక గ్రామాల్లోని పర్మిట్ గదుల్లో సగటున రూ.10 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. జిల్లా మొత్తంగా ఉన్న మద్యం దుకాణాల వద్ద 350 వరకు పర్మిట్ గదులు ఉంటే.. నెలకు రూ.కోటికి పైగా వ్యాపారం ఇక్కడే జరుగుతోంది. ఇక మద్యం దుకాణాల్లో సగటున రోజుకు రూ.కోటి పైనే అమ్మకాలు జరగుతున్నాయి. ఈ రెండింటి నుంచే నెలకు దాదాపు రూ.20 కోట్లకు పైనే లాభాలు వస్తున్నాయి. -
జిల్లాను వీడని వర్షాలు
జీడీ నెల్లూరులో భారీ వర్షం చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కూడా జిల్లా లో పలుచోట్ల భారీ వర్షం పడగా.. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. చిత్తూరులో మాత్రం బలమైన వర్షం పడింది. పూతలపట్టులో పలుచోట్ల మోస్తారు వర్షం కురిసింది. పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో తేలికపాటి వర్షం పడింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల వాగులు, వంకలు ప్రమాదకరంగా మార డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చెరువులకు సైతం వర్షపు నీరు చేరుతోంది. పంట పొలాలు వర్షపు నీటితో తడిసి ముద్దవుతున్నాయి. వరి పంట నేలకొరుగుతోంది. పలమనేరు, పుంగునూరు ప్రాంతాల్లో సాగులో ఉన్న టమాటాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కాయలపై నల్లమచ్చలు పడే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూరగాయ పంటలు, మల్బరీ సాగుకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని వాపోతున్నారు. ఐదురోజులుగా ఎడతెరిపి లేని వాన పలుచోట్ల భారీ వర్షం..కొన్నిచోట్ల తుంపర్లు వాగులు.. వంకల్లో నీరు సాగులో ఉన్న పంటలకు దెబ్బ