Chittoor District Latest News
-
సమస్యలకు పరిష్కారమేదీ?
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం చప్పగా సాగింది. సమావేశాలకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా జిల్లా అధికారులు రాలేదు. తమ ప్రాంతా ల సమస్యలను సభలో తెలిపి పరిష్కరించుకుందామనుకున్న ప్రజాప్రతినిధులకు మళ్లీ నిరాశే మిగి లింది. సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు పంపించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సీఈవో రవికుమార్నాయుడును ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చి న స్టాకును కూడా రాజకీయ నాయకులు చెప్పిన వారికి ఇస్తున్నారని ఆరోపించారు. వారు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. యూరియా కొరత లేకుండా చూడా లని ఆదేశించారు. వేరుశనగ విత్తనాలను సరైన సమయానికి రైతులకు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. గత ప్రభు త్వం హయాంలో హార్టికల్చర్ ద్వారా మామిడి రైతులకు ఎకరాకు 15 వేల కవర్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు 6 వేల కవర్లే ఎందుకు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా మామిడి గుజ్జు నిల్వలు నిలిచిపోయాయని జ్యూస్ ఫ్యాక్టరీల యజమానులు అంటున్నారని, ఈ ఏడాది కూడా మామి డిని కొనే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయాలని సూచించారు. వితంతు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి తీర్మానం పంపుతామన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు నగదు చెల్లించి రెండేళ్లు అవుతున్నా ఎందుకు మంజూరు చేయడం లేదని ట్రాన్స్కో అధికారులను నిలదీశారు. సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదు పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ శరవణ మాట్లాడుతూ కుప్పంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, అంటుకట్టు మొక్కలు ఇవ్వడం లేదని తెలి పారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ఓపీల సంఖ్య తగ్గిందని, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని దుయ్యబట్టారు. సగంలో అగిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలన్నారు. తిరుపతి రూరల్ ఎంపీపీ మాధవ్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరైనా విడుదల చేయడం లేదని ఆరోపించారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు రూ.19 కోట్లు ఉన్నాయని, వాటిని మంజూరు చేయాలన్నారు. జెడ్పీటీసీ సుమన్ మాట్లాడుతూ నారాయణవనంలో ఉపాధి హామీ నిధులతో శ్మశానవాటికకు రోడ్డు వేయాలని, సగంలో ఆగిపోయిన రోడ్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపాళ్యం ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ, గృహ సర్వీసులకు వేర్వేరుగా ఫీడర్లు ఏర్పాటు చేయా లని తెలిపారు. పీటీఎం జెడ్పీటీసీ శివన్న మాట్లాడుతూ వ్యవసాయ సర్వీసులు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పూతలపట్టు జెడ్పీటీసీ దేవిక మాట్లాడుతూ చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో రెండేళ్లయినా కొత్త వాటిని ఏర్పాటుచేయలేదని తెలిపారు. కార్యక్రమంలో డీఈర్వో మోహన్కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పక్కన డీఆర్వో మోహన్కుమార్, సీఈఓ రవికుమార్నాయుడు, సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు‘‘మా మండలాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. పలు అభివృద్ధి పనులు సగంలోనే ఆగిపోయాయి. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరుకావడం లేదు. యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీల్లో పేదలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ విషయాలను గత జెడ్పీ సమావేశంలో చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమావేశాలు ఎందుకు’’ అని పలువురు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చప్పగా సాగిన జెడ్పీ సమావేశం ప్రోటోకాల్ పాటించరా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఏ అధికారి ప్రోటో కాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్స వానికి సైతం తనను పిలవడం లేదని వాపోయా రు. ఎంపీడీవోలు నిబంధనలు పాటించడం లేదని, వరదయ్యపాళ్యం ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వందలాది ఎకరాలకు పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తారని అధికారులను నిలదీశారు. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులను రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బేరాలు కుదరకపోవడంతో విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించలేదని విమర్శించారు. టెండర్లు పిలవకుండానే రూ.20 లక్షల విలువైన చెరువు పనులను కాంట్రాక్టర్కు అప్పనంగా అప్పగించారని దుయ్యబట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్తో సంబంధం లేకుండా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయిన వారికి జెడ్పీ నిధుల నుంచి పరిహారం ఇవ్వాలన్నారు. -
మై సైన్స్ గ్యారేజ్ ప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం) ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్లో శనివారం మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే పిల్లల్లో సైన్స్పై మక్కువ, జిజ్ఞాసను పెంపొందించేందుకు 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అనువుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ తెలిపారు. పిల్లల్లో సహజంగా నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుందని, వారి ఆలోచనలను ఆచరణాత్మకం చేయించడమే గ్యారేజీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా సృజనాత్మకత పెంపొందించడం, స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా గ్యారేజ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ను నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్ను సైన్స్ సెంటర్ అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో విభిన్న కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన త్రీ వే స్లైడర్ను చిన్నారులతో ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయ పీఆర్వో కార్యాలయంలో రగడ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం చోటుచేసుకున్న ఘటన కల కలం రేపింది. ఆలయంలో దళారులేరని ప్రజాప్రతినిధులు చెబుతున్న నేపథ్యంలో, పీఆర్వో కార్యాలయంలోనే ఓ రాజకీయ దళారిపై దాడి జరగడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. చరణ్ అనే యువకుడు తన తల్లితో కలిసి శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన సందర్భంగా, శివ అనే అనధికారిక వ్యక్తి భక్తులకు మార్గనిర్దేశం చేస్తూ అటువైపు వెళ్లండి అంటూ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తాను స్థానికుడిని అంటూ చరణ్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన చరణ్పై, శివా తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆవేదనకు గురైన చరణ్, తన తల్లి సమక్షంలోనే జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆలయానికి తిరిగి వెళ్లాడు. అక్కడ పీఆర్వో కార్యాలయంలో శివా కనిపించడంతో, చరణ్ అతనిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఆలయ ఈఓ బీకే వెంకటేశులు సెలవులో ఉన్నారు. చైర్మన్ ఈ విషయమై వివరణ కోరడానికి ప్రయత్నించగా తాను బయట ఉన్నానని మల్ల ఫోన్ చేస్తానంటూ దాటవేశారు. -
పల్లెపోరుకు వెనకడుగు
కాణిపాకం: హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ సర్కారు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి పసులు, పథకాల అమల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఘోర పరాభవం తప్పదని భావించి, ప్రత్యేక అధికారుల పాలనను తెరపైకి తెచ్చింది. ఈనెల 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం మొగ్గుచూపింది. శుక్రవారం ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలకు అధికారుల నియామకం పూర్తయ్యింది. ప్రత్యేకాధికారులు సోమవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 44 పంచాయతీలు, పూతలపట్టు నియోజకవర్గంలో 152 పంచాయతీలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో 90 శాతానికి పైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచులు, వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఐదేళ్ల పాటు పాలనలో శభాష్ అనిపించుకున్నారు. వీరి పదవీకాలం ముగియడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల జరిగే వరకూ పంచాయతీల పాలనా వ్యవహారాలు వీరు చూడనున్నారు. కలెక్టర్ నేతృత్వంలోనే పాలన సాగనుంది. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయ, ఇతరశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కష్టాలు తప్పవా? పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రజలకు అందాల్సిన వివిధ సేవలు, అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలంటే వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. దీనికితోడు ఒక్కో అధికారికి రెండు నుంచి అధిక పంచాయతీలు అప్పగించారు. దీంతో వారిపై మరింత అదనపు భారం పడనుంది. ఈ పరిణామం ఇబ్బందిగా మారనుంది. గ్రామ పంచాయతీల్లో సమస్యలు ఎదురైతే ఇబ్బందులు తలెత్తనున్నాయి. అధికారులు వేరే ప్రాంతాల్లో ఉంటారు. వారిని సంప్రదించాలంటే ప్రజలకు వ్యవప్రయాసలు తప్పవు. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే అవకాశం తక్కువ కావడం వల్ల ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై వెనక్కి.. పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అనేక పథకాలను పక్కన పెట్టేశారు. ఇసుక, మద్యం ద్వారా జేబులు నింపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతప్తి సెగలు రేగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పరాభవం తప్పవనే భావనతో వెనక్కి తగ్గుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.నిధులు.. తప్పనితిప్పలు పంచాయతీ పాలక వర్గాలు లేకుంటే పలు నిధులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టకపోతే, కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు రావు. ప్రస్తుతం స్థానిక నంస్థలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లడంతో ఆర్థిక సంఘం నిధులు విడుదలకు ఇబ్బంది వస్తుందని అంటున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో ఇవి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మేజర్ పంచాయతీలు సాధారణ నిధులపై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాంటి ఆదాయవనరులు లేని చిన్న పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తప్పవని సర్వత్రా ఆందోళన నెలకొంది. -
మీ సేవలు వెలకట్టలేనివి
కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ తరఫున సర్పంచులుగా గెలిచి ఐదేళ్లు ప్రజాసేవ చేశారని, మీ సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ఆయన శనివారం కుప్పం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ జగనన్న పిలుపుతో ముందుకు వచ్చి సర్పంచులుగా పోటీ చేశారని, కుప్పంలో 90 శాతం మంది సర్పంచులు గెలిచారని పేర్కొన్నారు. ఐదేళ్లు ఏ ఒక్క పొరపాటూ చేయకుండా ప్రజా సేవలో తరించారని కొనియాడారు. ఇదే స్పూర్తితో పనిచేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి కూడా నమ్మకస్తులనే సర్పంచులు గా పోటీలో పెడతామని తెలిపారు. కూట మి ప్రభుత్వం రెండేళ్లుగా చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పటికీ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికారులను అడిగితే టీడీపీ నాయకులను కలవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కోర్టులకు వెళ్లి బిల్లులను మంజూరు చేయించుకుంటామని స్పష్టం చేశారు. -
పీఎఫ్ బకాయిలు జమ
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధి (పీఎఫ్)కి సంబంధించి మార్చి నెలాఖరు వరకు ఉన్న బకాయిలు రూ.273 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్టు జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రుణాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి అందజేసే తుది మొత్తాల పూర్తి బకాయిలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ పరిష్కరించినట్లు చెప్పారు. పీఎఫ్కు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో చూసుకోవాలని, ఏవైనా సమ స్యలు ఉంటే కార్యాలయ పనివేళల్లో వచ్చి పరిష్కరించుకోవచ్చునని వివరించారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనం రూ.15.60 లక్షలు చెల్లించామని తెలిపారు. -
టీచర్ల గోడు పట్టించుకోని విద్యాశాఖ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వ్యక్తిగత, అనారోగ్య సమస్యల దృష్ట్యా విధులను రద్దు చేయాలని కోరుతూ పలువురు టీచర్లు శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల సాకుతో డీఈవో వారి విన్నపాలను తోసిపుచ్చారు. విధులను రద్దు చేయడం సాధ్యం కాదని, మినహాయింపు కావాలంటే 10 రోజుల మెడికల్ లీవ్ పెట్టుకోవాలని సూచించడంతో టీచర్లు విస్మ యం వ్యక్తం చేశారు. సముచిత కారణాలతో వచ్చే వారికి సెలవు మార్గాన్ని చూపడమే తప్ప, సమస్యను పరిష్కరించే ఉద్దేశం అధికారులకు లేదని ఆరోపిస్తున్నారు. విధులు కేటాయించింది కమిషనర్ కార్యాలయమని, తమకు సంబంధం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొనడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపులు ఇవ్వడంలో విద్యాశాఖ మీనమేషాలు లెక్కించడం మొండివైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు. పది రోజులు జరిగే మూల్యాంకన ప్రక్రియలో టీచర్లపై ఒత్తిడి పెంచడం కాకుండా, వారి సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరుతున్నారు. -
బావిలో పడి సచివాలయ ఉద్యోగి మృతి
వడమాలపేట (పుత్తూరు): మండలంలోని రామరాజుకండ్రిగ గ్రామంలో శనివారం బావిలోపడి సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి ఇందిరానగర్కు చెందిన సచివాలయ ఉద్యోగి చంద్రకుమార్(37) తన స్నేహితులు లక్ష్మీనారాయణ, అభిషేక్తో కలిసి రామరాజుకండ్రిగ గ్రామానికి వచ్చారు. ముగ్గురూ కలిసి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. అక్కడ చంద్రకుమార్ అదుపుతప్పి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతనితో వచ్చిన ఇద్దరు స్నేహితులు గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు విషయం తెలిపారు. వారు అక్కడికి వెళ్లి చంద్రకుమార్ను వెలికి తీశారు. అతను అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్వోసీ లేకుండానే క్వారీ నిర్వహణ? చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు గ్రామ పరిధిలో క్వారీ పనులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఎన్వోసీ లేకుండానే తవ్వకాలు చేపడుతున్నారని, మైనింగ్ శాఖ నుంచి కోడ్ రాక ముందే పనులు ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు. క్వారీ నిర్వహణలో బినామీల పేర్లతో పట్టాలు కట్టారని, అసలు యజమానులను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రా మస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ వాహనాల రాకపోకలతో ప్రజల భద్రతకు ముప్పు ఉందని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధి కారులకు ఫిర్యా దులు అందినట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్విమ్స్లో పలు పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు తిరుపతి తుడా: స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ఎవాల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ – స్క్రీనింగ్ ప్రోగ్రామ్ – ఆన్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అనే ఎంఆర్సీ ప్రాజెక్టులో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు ఈనెల 15వ, 16వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం, మామోగ్రాఫీ టెక్నీషియన్, కార్డియో వాస్క్యులర్ టెక్నీషియన్ గ్రేడ్–2, డేటా ఎంట్రీ ఆపరేటర్, పబ్లిక్ రిలేషన్న్స్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,445 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,383 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని 14 ఏళ్లు దాటిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని డీఎం అండ్ హెచ్వో శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్యకార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నెలా 1వ తేదీన హెచ్ఎంఐఎస్, సీఎస్ఎస్ఎం తదితర రిపోర్టులను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సీఎస్ఎస్ఎంలో ఈసీ డేటాను సోమవారం నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ప్రజల సానుకూల అభిప్రాయం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్) 80 శాతం కంటే తక్కువ ఉండకూడదని, ప్రతి ఇండికేటర్కు సంబంధించిన రికార్డులు నిర్వహిస్తూ 100 శాతం డేటా అప్లోడ్ చేయాలని సూచించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం నాటికి పూర్తి చేయాలని, సోమవారం రోజున ఆశా వర్కర్లు ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకువచ్చి టీకాలు వేయించేలా చూడాలన్నా రు. యువిన్ పోర్టల్లో గర్భిణులు, శిశువుల నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయా లని పేర్కొన్నారు. అలాగే ఐఈసీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అభా ఐడీ లేకుండా గర్భిణుల వివరాలను నమోదు చేయరాదని హెచ్చరించారు. ఎన్సీడీ కార్యక్రమాల్లో అనుమానిత కేసులను గుర్తించి, వైద్యాధికారులు నిర్ధారించి పాలో అప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ, అనిల్ కుమా ర్, జార్జ్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
పాపాలు చాలు తప్పుకో!
వడమాలపేట : అప్పలాయగుంటలో నిరసన తెలుపుతున్న భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా, నేతలుచిత్తూరులో నిరసన ర్యాలీ చేస్తున్న విజయానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులుకుప్పంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ భరత్, నాయకులుతిరుపతిలో నిరసన తెలుపుతున్న భూమన అభినయ్రెడ్డి, మాజీ మేయర్ తదితరులుబీఆర్ నాయుడూ చేసిన పాపాలు ఇక చాలు.. టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకో.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయొద్దు.. ఉన్నతమైన పదవిలో ఉంటూ రాసలీలలు సాగిస్తున్న నీలాంటి అపవిత్రులకు ఆ పదవిలో కొనసాగే హక్కులేదు.. నీవు పదవి చేపట్టిన నాటి నుంచి వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి.. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. అయ్యా.. ఇక తప్పుకో అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనలు చేపట్టారు. పలు ఆలయాలను శుద్ధి చేసి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. ప్లకార్డులను ప్రదర్శించారు. చైర్మన్ పదవికి బీఆర్ అనర్హుడు బీఆర్నాయుడు గలీజు మనిషి. ఆయన టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడు. ఆయన అరాచకాలన్నీ తెలిసే చంద్రబాబు టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆ మహాతల్లి ఏడాదిన్నర కిందటే చంద్రబాబు, పవన్కళ్యాణ్కు ఉత్తరాల ద్వారా బీఆర్నాయుడు నీచుడని, సీ్త్రలోలుడని, పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వద్దని కోరింది. అవేవి పట్టించుకోకుండా ఆయనకే చైర్మన్ పదవి కట్టబెట్టారు. అతను చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో మద్యం, మాసం విక్రయాలు, క్యూలైన్లలో భక్తుల మృతి తదితర దాష్టీకాలు జరిగాయి. వాటికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన వ్యక్తి నిస్సిగ్గుగా ఎదురుదాడి చేయడం దారుణం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు నిస్సిగ్గుగా చైర్మన్ పదవిలో.. రాసలీలలు సాగిస్తూ పట్టుబడినా, ప్రభుత్వం, పచ్చ మీడియా అండ ఉందన్న దీమాతో బీఆర్నాయుడు నిస్సిగ్గుగా చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. టీటీడీ పవిత్రతను కాలరాస్తున్నారు. సనాతన హిందూ ధర్మానికి ప్రతీకై న టీటీడీ చైర్మన్గా బీఆర్నాయుడిని ఇంకా కొనసాగిస్తూ చంద్రబా బు, పవన్కళ్యాణ్ అపచారం చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ పగటి వేషం వేసిన పవన్కళ్యాణ్ ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదు. బీఆర్నాయుడు అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. – ఆర్కే రోజా, మాజీ మంత్రిమీడియాపై ఆంక్షలుచిత్తూరు కార్పొరేషన్: అక్రమ సంబందాలతో కళంకితుడైన బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వారు శనివారం నాయకులు, కార్యర్తలతో కలిసి వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉండడం వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారుతోందని విమర్శించారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీకి ఒక కళంకితుడిని చైర్మన్గా కొనసాగించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనన్నారు. ప్రభుత్వం, పచ్చ మీడియా అండగా ఉందని బీఆర్ నాయుడు అసందర్భ ప్రేలాపనలతో నిస్సిగ్గుగా పదవిని అంటి పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు. గతంలో సనాత న ధర్మ పరిరక్షకులుగా పగటి వేషం వేసిన అవకాశవాదులంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. -
నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సభ్యులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ నాయకు లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, కర్షకు లు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు. రేపటి నుంచి సమ్మేటివ్ –2 పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమా న్య పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని తరగతులకు ఎస్ఈఆర్టీ ఇచ్చిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభు త్వం పంపిణీ చేసిన అసెస్మెంట్ పుస్త కాల్లో మాత్రమే జవాబులు రాయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 1 నుంచి 5 తరగతులకు క్లస్టర్ కేంద్రం నుంచి, 6 నుంచి 8వ తరగతుల కు ఎమ్మార్సీ నుంచి గంట ముందుగా ప్రశ్నాపత్రాలు అందజేస్తారు. పరీక్షల అనంతరం టీచ ర్లు జవాబు పత్రాలు/అసెస్మెంట్ బుక్లెట్స్ మూల్యాంకనం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ లోపు మార్కులు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వ్యక్తిగత, ఏకీకృత మార్కుల రిజిస్టర్లో నమో దు చేస్తారు. ఈ నెల 22వ తేదీలోపు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. పతనమైన టమాట ధరలు వి.కోట: టమాట ధరలు అమాంతంగా పతనమయ్యాయి. వి.కోట మార్కెట్లో శనివారం టమాటా 18 కిలోల బాక్సు రూ.50ల నుంచి అత్యధికంగా రూ.150 పలికింది. ధరలు తగ్గడంతో కాయలను కోసి మార్కెట్కు తరలించేందుకు అయ్యే ఖర్చులు కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కొంతమంది కాయలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు కోసిన టమాటాలను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడికి చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. అధ్యాపకుడికి ఎన్సీసీ భారత సైన్యం లెిఫ్టినెంట్ పదవి గుడిపాల: మండలంలోని సీఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న హేమంత్కుమార్ ఎన్సీసీ అధికారి శిక్షణా అకాడమీ(ఓటీఏ) కాంప్టీ నాగ్పూర్లో ప్రతిష్టాత్మక సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్ పదవిని అందుకున్నారు. ఈ శిక్షణలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక ప్రణాళిక, దేశభక్తి స్పూర్తి కనబరిచారు. ఆయనను కళాశాల యాజమాన్యం అభినందించింది. -
గొంతుకోసి.. చెరువులో పడేసి!
తవణంపల్లె: ఓ యువకుడిని బ్లేడుతో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. మూడు రోజుల క్రితం చెరువులో పడేశారు. ఈ ఘటన తవణంపల్లె మండలం, దిగువమోదలపల్లెలో చోటుచేసుకుంది. దిగువ మోదలపల్లెకు చెందిన రేవతి చిన్న కుమారుడు టి.లవకుమార్(23) ఓ ప్రయివేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నెల ఒకటవ తేదీన బుధవారం సాయంత్రం ఇంటి దగ్గర అన్నతో మాట్లాడి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్లి ఉంటాడని భావించి ఇంట్లోని వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బిడ్డ చెరువులో శవంగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోధించారు. చెరువులో శవమై తేలాడు దిగువమోదలపల్లె కొత్తచెరువులోలో శవం తేలడంతో బహిర్భూమికి వెళ్లిన వారు గుర్తించి లవకుమారై ఉంటాడని అనుమానించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. వారు తమ బిడ్డేనని గుర్తించారు. తవణంపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శరీరం బాగా ఉబ్బిపోయి దుర్వాసన రావడంతో శవం దగ్గరకు రావడానికి కూడా ఇబ్బందిపడ్డారు. చిత్తూరు రూరల్ సీఐ భాస్కర్నాయుడు పర్యవేక్షణలో శవాన్ని పరిశీలించగా చెరువులోని చెట్టు దగ్గర లవకుమార్ను బ్లేడుతో గొంతుకోసి హత్యచేసి చెరువులో పడేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో అగంతుకులు హత్యకు ఉపయోగించిన బ్లేడును, రక్తపు మరకలు చెరువు వరకు ఉండడం గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలను తల్లిదండ్రులు, అన్నదమ్ములను విచారించారు. ఎవరిదగ్గరా సరైన సమాచారం రాకపోవడంతో హత్య కేసును రెండు రోజుల్లో ఛేదిస్తామని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటాం యువకుడిని గొంతుకోసి హత్య చేసి చెరువులో పడేసిన అగంతుకులను సాంకేతిక పరిజ్ఞానంతో రెండు రోజుల్లో పట్టుకుంటామని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. హత్య జరిగిన కొత్తచెరువు పరిసరాలను పరిశీలించారు. హత్య ఎలా జరిగింది.. కారణాలను కుటుంబ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకొని జైలుకు పంపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లవకుమార్ను హత్య చేసినట్లు కేసు నమోదు చేసినట్లు చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్నాయుడు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కలెక్టర్ ఆదేశించినా..!
గంగాధర నెల్లూరు : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదంటే ఇదేనేమో. ఓ అంగన్వాడీ హెల్పర్ను విధుల్లోకి తీసుకోవాలంటూ పీడీని ఆదేశించినా సదరు అధికారిణితోపాటు సీడీపీఓ పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. గంగాధరనెల్లూరు మండలంలోని తూగుండ్రం దళితవాడలోని అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్గా సీత పనిచేస్తోంది. ఆమె అనారోగ్యం కారణంగా ఉద్యోగానికి రాలేకపోతున్నానని అక్కడి అంగన్వాడీ వర్కర్ గుణవతికి సమాచారం చేరవేసింది. ఆ తర్వాత సుమారు రెండు నెలలు అనంతరం విధుల్లోకి చేరడానికి హెల్పర్ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లగా..వర్కర్ విధుల్లోకి చేర్చుకోలేదు. పలుమార్లు సీడీపీఓ, పీడీకి చెప్పినా పట్టించుకోలేదు. చివరగా కలెక్టర్ సుమిత్కుమార్ను సంప్రదించగా.. ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే హెల్పర్ను విధుల్లోకి తీసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీని ఆదేశించారు. కానీ పీడీతోపాటు జీడీనెల్లూరు సీడీపీఓ సైతం కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో హెల్పర్ తన ఆవేదనను వీడియో ద్వారా తెలియజేయడంతో వైరల్గా మారింది. -
ఇరువర్గాల ఘర్షణ
నగరి: స్థానిక జామి యా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల వారు ఘర్ష ణ పడ్డారు. మసీదు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు విడివిడిగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మరో వర్గంపై ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ మల్లికార్జున తెలిపిన కథనం మేరకు.. గతంలో మసీదులో చందాల వసూళ్ల విషయంలో గోడవలు రాగా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. అనంతరం ఒక వర్గం వారు వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొని కమిటీని ఏర్పాటుచేసుకున్నారు. దీనిపై మరో వర్గం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్కో ఇచ్చింది. ఈ దశలో కమిటీ ఏర్పాటు చేసుకున్న వారు చందాల వసూలుకు ప్రయత్నించగా మరో వర్గం స్టేటస్కో ఇస్తే ఇంకా కమిటీ నిర్ధారణ కానట్లే అని చందాలు వసూలు చేయకూడదంటూ అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వారు గొడవపడ్డారు. చందాలు వసూలు చేయడమే గొడవకు కారణమైందని సీఐ తెలిపారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బైండోవర్ నమోదు చేస్తామన్నారు. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్రెడ్డిని కోరారు. ఆ సంఘ నాయకులు నెల్లూరులోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిసి వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీ.రెడ్డిశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీచర్ల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు, తక్షణమే తాత్కాలిక భృతిని ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 2003 డీఎస్సీలో నియామకమైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బలోపేతం చేసి, అక్కడ ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను వెంటనే భర్తీ చేయించాలన్నారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీచర్ల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జైకాంత్, గౌరవ అధ్యక్షులు సోమచంద్రారెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు. -
మూగ వేదన!
నోరులేని మూగ జీవాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతోంది. వాటికి అవసరమైన మందులు పంపిణీ చేయకుండా వేధిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో కనీసం మందులు, మాత్రలు కూడా లేకుండా చేసింది. జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తే పెంపకందారులు ప్రయివేటు మందుల దుకాణ దారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో మందులు అందక కొన్ని మృత్యువాత పడుతుండడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో పశుసంవర్థక శాఖ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాల్సిన రైతు భరోసా కేంద్రా లు మందుల లేమితో నిర్వీర్యంగా మారా యి. పశువులు వ్యాధులతో అల్లాడుతుండ గా, పశుపోషకులు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు. కనీస ఔషధాలు కూడా అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలోని పలు మండలాల్లో పశువులు జ్వరం, ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన మందులు లేక ప్రైవేట్ మెడికల్ దుకాణాల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, నొప్పి తగ్గించే ఇంజెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే యాంటీబయోటిక్స్, కమి నివారణ మందులు వంటి ప్రాథమిక ఔషధాలు దాదాపు అందుబాటులో లేవు. పశుప్రాణాలకు ముప్పు పశువులకు గాయాలు కావడం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణం. వాటికి సరైన చికిత్స అందకపోవడం ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది. గాయాలను శుభ్రపరచడానికి అవసరమైన ద్రావణాలు, డ్రెస్సింగ్కు ఉపయోగించే ఆయింట్మెంట్లు, స్ప్రేలు కేంద్రాల్లో లేవు. చిన్న గాయాలు కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నాయి. పరికరాలు ఏవీ? మందుల కొరతతో పాటు ప్రాథమిక పరికరాల లేమి కూడా పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. పశువుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడానికి థర్మామీటర్లు, ఇంజెక్షన్లు ఇవ్వడానికి సిరింజ్లు, చికిత్స సమయంలో అవసరమైన గ్లవ్స్, గాజ్ వంటి సామగ్రి కూడా అనేక కేంద్రాల్లో అందుబాటులో లేవు. దీంతో ఫీల్డ్ స్థాయిలో పశు వైద్య సేవలు దాదాపు నిలిచిపోయినట్లే. పాల ఉత్పత్తిపై దెబ్బ ఇక పాల ఉత్పత్తిపై కూడా ఈ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోంది. కాల్షియం, మినరల్ మిశ్రమాలు, విటమిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో పశువులు బలహీనంగా మారి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. జిల్లా పాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కొనసాగితే రైతుల ఆదాయంపై భారీ దెబ్బ పడే అవకాశముంది. వ్యాధులు అధికం పశువుల్లో కడుపులో పురుగుల సమస్యలు పెరుగుతున్నాయి. దీనివల్ల పశువులు ఆహారం తినకపోవడం, బరువు తగ్గడం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. జీర్ణ సమస్యలు, గ్యాస్, డయేరియా కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ వీటికి అవసరమైన టానిక్స్, ప్రోబయోటిక్స్, ఫ్లూయిడ్స్ అందుబాటులో లేవు. జిల్లా సమాచారం రైతు భరోసా కేంద్రాలు 297 ఆవులు, గేదెల సంఖ్య 4.68 గొర్రెలు 5,01,947 మేకలు 2,08,149 పందులు 386సంక్షోభంలో పశువైద్యం పట్టించుకోరా? మందుల కొరతపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పశువులే మా జీవనాధారంం అవి అనారోగ్యానికి గురైతే మేమెలా బతుకుతాం?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని అంటున్నారు. వెంటనే చర్యలు తీసుకుని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన పశువైద్య మందులు, పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని పశుపోషకులు కోరుతున్నారు. -
అధైర్యపడొద్దు..అండగా ఉంటాం!
కుప్పం: శ్రీకూటమి పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం..ఎవ్వరూ అధైర్యపడకండి.. అందరికీ అండగా ఉంటాం.. మరో మూడేళ్లు నిజాయితీతో కలసికట్టుగా పనిచేద్దాంశ్రీ అని కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ పిలుపునిచ్చారు. శ్రుకవారం తన క్యాంపు కార్యాలయంలో రామకుప్పం, శాంతిపురం బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పార్టీకి బూత్ కన్వీనర్లే కీలకమన్నారు. అందరూ కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. నిజాయితీతో పనిచేసేవారికి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సొంత ప్రయెజనాల కోసం పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారు మళ్లీ వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారిని పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు. దొంగలు, మోసపూరిత రాజకీయాలు చేసేవారు వంద మంది అవసరం లేదని, నిజాయితీతో పనిచేసేవారు ప్రతి పోలింగ్ బూత్కు ఐదుగురు ఉన్నా చాలన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణమని, కానీ నమ్మక ద్రోహం చేసేవారిని మాత్రం వైఎస్సార్సీపీ దరిదాపుల్లోకి రానివ్వమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిజమైన కార్యకర్తులు, జగనన్న అభిమానులు వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారని, అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలింగ్ బూత్ల్లో ఓటర్ల పర్యవేక్షణలో బూత్ కన్వీనర్లు జాగ్రత్తుగా ఉండాలని, అనుమానం వచ్చిన ఓటర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో రామకుప్పం, శాంతిపురం మండలాల నాయకులు బాబురెడ్డి, కోదండపాణి, నాయనపల్లి కృష్ణమూర్తి, సుబ్రమణి, మురుగేష్, చంద్రారెడ్డి, బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు విజయ్ కుమార్, రామకుప్పం సుగుణప్ప, గుడుపల్లె సంపంగి తదితరులు పాల్గొన్నారు. -
ఆదుకోరేం!
కష్టాల్లో ఉన్నాం..పుట్టెడు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాం. యుద్ధం పేరుతో ధరల సెగ చెమటలు పట్టిస్తోంది. గ్యాస్ కష్టాలతో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఉచిత వైద్యం అటకెక్కింది. రోజురోజుకీ పెరుగుతున్న ఎండలతో నీటి సమస్య తరుముకొస్తోంది. నిబంధనల మేరకు బిల్లులు కట్టినా కొత్త కరెంట్ కనెక్షన్ అందని ద్రాక్షగానే మారుతోంది. కోటి ఆశలతో వేరుశనగ వేసినా గిట్టుబాటు ధర అంతంతమాత్రంగానే దక్కుతోంది. గత ప్రభుత్వంలో పలు భవనాలు నిర్మించినా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని గాలికొదిలేశారు. టీడీ బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టీపటనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ జెడ్పీ సమావేశంలోనైనా మా కష్టాలపై చర్చిస్తారో లేదోనని ఎదురుచూస్తున్నాంశ్రీ అని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు. నేడు జరిగే సమావేశంలో సమస్యల పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు.. అధికారులు అడుగులు వేయాలని కోరుతున్నారు. రైతన్నల కష్టాలు జిల్లాలో వేరుశనగ పంట 9వేల హెక్టార్లలో నష్టం జరగగా వాటికి అంచనా విలువ రూ.15.42 కోట్లు వేశారు. దీని కోసం 24,342 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 14వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. దీన్ని భర్తీ చేయాలని రైతులు కోరుకుంటున్నారు. పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉంది. పశుగ్రాసం కొరత త్రీవంగా ఉంది. పశువులకు తాగునీరు అందక అల్లాడుతున్నాయి. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బకాయిల కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఆశించిన విధంగా సాగడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు సైతం తమకెందుకులే అన్న ధోరణితో వ్యవహరించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనైనా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగిన ఆరోగ్యశ్రీ జిల్లాలో ఆరోగ్యశ్రీ కష్టతరంగా మారింది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో రూ.200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వైద్యం చేయలేం బాబోయ్ అంటూ ఆయా ఆస్పత్రులు చేతులెత్తేశాయి. టీడీ బకాయిలు రూ.10 కోట్లు జిల్లాలో గత రెండేళ్లుగా మున్సిపాలిటీలో పంచాయతీలు మండలాలకు చెల్లించాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ పెండింగ్ రూ.10 కోట్లకు పైగా ఉంది. రెండేళ్లుగా జమ కాకపోవడంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. అధ్వాన్నం జెడ్పీ కార్యాలయ పరిధిలో అవసరం లేకున్నా రూ.కోట్లలో పలు పనులను నామినేట్ పద్ధతిలో కూటమి నేతకు కట్టబెట్టారు. ఇందులో చాలా పనులు అధ్వాన్నంగా.. నాసిరకంగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జెడ్పీ కార్యాలయ భవనాలకు వేసిన పెయింటింగ్ పెచ్చులూడిపోయింది. సమావేశ మందిరంలో టాయ్లెట్స్ నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. కరెంటు కష్టాలు తీరేనా? జిల్లాలో 2 వేలకు పైగా పైకం చెల్లించిన వ్యవసాయ సర్వీసులు అలానే పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్ల కోనుగోలుకు అధిక మొత్తం చెల్లించి కాంట్రాక్టర్కు దోచిపెడుతున్నారని టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అదే కాంట్రాక్టర్కు అదే మొత్తంతోనే అదనంగా ట్రాన్స్ఫార్మర్లు కోనుగోలు చేయిస్తున్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లాలో 200 మందికి పైగా ఉన్నారు. వీరికి ఒక నెల వేతనం కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకొని మరుసటి నెల నుంచి చెల్లిస్తున్నారు. ీపీఎం కుసుం కింద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు ముందుకు సాగడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర ఫలకాల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గ్యాస్తో యుద్ధం యుద్ధం కారణంగా జిల్లాలో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ లేకుండానే ఏజెన్సీలు అమ్మకాలు జోరుగా సాగిస్తున్నాయి. ఓ వైపు గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, టీస్టాల్స్ మూతపడుతున్నాయి. కొన్ని దుకాణాలు అమాంతంగా ధరలు పెంచేశాయి. భోజనం చేయాలంటే సామాన్యుడు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి ఎద్దడి జిల్లాలో వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య రోజురోజుకూ త్రీవ రూపం దాల్చుతోంది. జిల్లాకు ప్రతిపాదించిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించ లేదు. హంద్రీ–నీవా, గాలేరు –నగరి ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జెడ్పీ కార్యాలయం ఆ భవనాలపైనే కక్ష గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు 1,381 భవనాలను మంజూరు చేసింది. ఇందులో సచివాలయానికి రూ.40 లక్షలు, ఆర్బీకేలకు రూ.21.80 లక్షలు, వెల్నెస్ సెంటర్కు రూ.20.80 లక్షలు చొప్పున మంజూరు చేశారు. జిల్లాలో సచివాలయాలు 335, ఆర్బీకేలు 340, వెల్నెస్ సెంటర్లు 159 చొప్పున మొత్తం 834 భవనాలు నిర్మించారు. వీటి కోసం రూ.241 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా పలు దశల్లో, ప్రారంభం కాని భవనాలు మొత్తం 547 వరకు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.152 కోట్లు. వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోలేదు. రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్ గత ఏడాది కాలంగా జిల్లాలో పంచాయతీరాజ్ పరిధిలో దాదాపు 90 కి.మీ వరకు సీసీ, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. ఇందుకు సంబంధించి రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో .ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సవాలక్ష సమస్యలు -
సౌరఫలకాల ఏర్పాటుపై సమీక్ష
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ నివాసాలకు ఉచితంగా సౌరఫలకాల ఏర్పాటుపై ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆరా తీశారు. శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ సర్వీసులు 85,974 ఉన్నాయని, అందులో ఇంటి పైకప్పు సౌలభ్యం లేని వారు.. ఇతర సమస్యలతో ఉన్న వారు వేలాది మంది ఉన్నారన్నారు. మొదటి దశలో 21,500 నివాసాలకు సౌరఫలకాల ఏర్పాటుకు టెండర్లు ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను నిలదీశారు. ప్రతి సర్వీసుకు 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనులు వేగవంతం కావాలన్నారు. సంబంధిత మెటీరియల్స్ తిరుపతిలోని గోడౌన్లో పెట్టారని, వాటిని చిత్తూరుకు తరలించాలన్నారు. ఈఈలు మునిచంద్ర, సురేష్, మోహనమ్మ, పీఓ రెడ్డెప్ప, డీఈలు ప్రసాద్, శేషాద్రి, కొండయ్య పాల్గొన్నారు. -
గ్యాస్ మంటలు!
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడిపాల ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన గ్యాస్ దోపిడీ ఘటనతో అసలు వ్యవహారం బయటపడగా, ఇప్పుడు జిల్లాలోని మరిన్ని గ్యాస్ ఏజెన్సీలపై కూడా అదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ విధానాన్ని పక్కనబెట్టి సిలిండర్లను అక్రమంగా సరఫరా చేస్తున్న ఈ వ్యాపారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. సాధారణంగా గృహవినియోగ గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఓటీపీ విధానం తప్పనిసరి. వినియోగదారుడికి మొబైల్ ఫోన్న్కు వచ్చే ఓటీపీని చూపిన తరువాతే సిలిండర్ ఇవ్వాలి. అయితే ఈ నియమాన్ని పక్కన పెట్టి కొంతమంది ఏజెన్సీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత నెలలోనే వేల సంఖ్యలో ఓటీపీలు లేకుండా సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సుమారుగా 40 వేలకు పైగా సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22 ఏజెన్సీలుంటే.. అందులో కొన్ని ఏజెన్సీలు వేలల్లో బ్లాక్లో సిలిండర్లు పెట్టినట్టు తెలుస్తోంది. గుడిపాల ఘటనతో.. గుడిపాల ఘటన బయటపడిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ఏజెన్సీలపై తనిఖీలు ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీపీ లేకుండా సరఫరా చేసిన సిలిండర్ల జాబితాను బయటకు తీయడంలో అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని ఏజెన్సీల్లో కూడా? కొన్ని గ్యాస్ ఏజెన్సీలు పౌరసరఫరాల శాఖ అధికారులతో కుమ్మకై ్క ఈ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగానికి సరైన సమాచారం అందించకుండా తప్పుడు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణను ఉద్దేశపూర్వకంగా నెమ్మదింపజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అధికార పార్టీ మద్దతు, ధనబలంతో అధికారుల తనిఖీలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సమాచారం. దీంతో నిజాలను వెలికితీయడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఈ గ్యాస్ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాను కుదిపేస్తున్న ఓటీపీ అక్రమాలు -
నేడు విద్యుత్కు అంతరాయం
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక రాములవారి గుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో సంతపేట ఏఈ ప్రసన్న తెలిపారు. బజారువీధి, శేషాపిరాన్వీధి, జెండామాను వీధి, డీఐరోడ్డు, ఓటీకే రోడ్డు, తోటపాళ్యం, గాంధీరోడ్డు, కై లాసపురం, ఇందిరానగర్ ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. కాణిపాకంలో ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి కానిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ పట్నాయక్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శేష వస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీని పునరుద్ధరించాలి చిత్తూరు కార్పొరేషన్: ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులలో వైద్యసేవలు నిలిపివేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బకాయిలు వెంటనే విడుదల చేసి వైద్యసేవలు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఒకరి మృతి – ఇద్దరికి తీవ్రగాయలు శ్రీరంగరాజపురం : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఉడమాలకుర్తి పంచాయతీ, కుశస్థలినది ఫ్లైఓవర్ వంతెనపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పొదలపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య కూమారుడు సీ.కే.బాబు (34) పుత్తూరు మండలం, వేపగుంట గ్రామానికి చెందిన దోరస్వామి, అతని భర్య తేన్మాయిని కార్వేటినగరం మండలంలోని సమీప బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ నుంచి మండలంలోని పొదలపల్లి గ్రామానికి సీ.కే.బాబు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. మార్గ మధ్యంలో ఉడమాలకుర్తి కుశస్థలి నది వంతెనపై అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సీ.కే.బాబు అక్కడికిక్కడే మృతి చెందాడు. గాయపడిన దొరస్వామి, తేన్మాయిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాధు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. మృతదేహాన్ని పో్స్ట్మార్టం నిమత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. -
కొత్త రైల్వే లైను!
పుత్తూరు: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైల్వేలైను ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పుత్తూరు, తమిళనాడులోని అత్తిపట్టు మధ్య రైల్వేలైను ఏర్పాటుకు కేంద్రం రూ.517.47 కోట్లు మంజూరు చేయడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అత్తిపట్టు–పుత్తూరు మధ్య 88.30 కి.మీ మేర రైల్వేలైను రూట్ మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రూట్లో మొత్తం 8 స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో నాలుగు స్టేషన్లు ఏపీలో ఉండగా, మరో నాలుగు తమిళనాడులో ఉంటాయి. తిరుపతి జిల్లాలోని పుత్తూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే లైను నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం స్టేషన్లు ప్రతిపాదించారు. పుత్తూరు నుంచి నారాయణవనం రైల్వే స్టేషన్కు మూడు కి.మీ దూరం ఉండగా, అక్కడ నుంచి కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం స్టేషన్ల మధ్య దూరం 10 కి.మీగా ఉంటుంది. అలాగే తమిళనాడులోని ఊత్తుకోట, పాలవాక్కం, పెరియపాళెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పుత్తూరు–అత్తిపట్టు రైల్వే మార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు బోగీలతో నాలుగు ఈఎంయూలు నాలుగు ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ రైల్వే లైను ఏర్పాటు పూర్తయితే తిరువళ్లూరు, పుత్తూరు రూట్లో రద్దీ తగ్గుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. 2024 నుంచే భూసేకరణ పుత్తూరు–అత్తిపట్టు మధ్య కొత్త రైల్వే లైను కోసం 2024 డిసెంబర్ 6 నుంచే భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతించింది. 88 కి.మీ దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములును సేకరించాల్సందిగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పుత్తూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డెడ్ఎండ్ లూప్లైన్ పుత్తూరు రైల్వే స్టేషన్ -
ల్యాబ్ టెక్నీషియన్లకు మార్గదర్శకాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంఅండ్హెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీహెచ్సీలకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వబడుతుందన్నారు. డాక్టర్ నుంచి మందులు అందించే సిబ్బంది వరకు అందరి పనితీరుపై ఈ గ్రేడింగ్ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ల్యాబ్లలో మూడు నెలలకు సరిపడా స్టాక్ తప్పనిసరిగా ఉండాలని, అన్ని రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచాలని ఆదేశించారు. జిల్లా అదనపు వైద్యాధికారి వెంకటప్రసాద్ మాట్లాడుతూ, మార్చి 24 నుంచి ప్రారంభమైన టీబీ ముక్త్భారత్ అభియాన్ 2.0 కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, హైరిస్క్ గ్రూపులకు తప్పనిసరిగా కఫ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని వివరాలను స్వర్ణాంధ్ర పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నెలాఖరు వరకు 50 శాతం వడ్డీ మాఫీ చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్నుపై 50 శాతం వడ్డీ మాఫీని ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు అందాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నుపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయని ప్రభుత్వం.. 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ, మార్చి 31వ తేదీలోపు చెల్లించి వాళ్లకే ఈ అవకాశం అన్నట్లు గతనెల ఉత్తర్వులు జారీచేసింది. అయితే చివరి తేదీ ముగిసేనాటికి ప్రజల్లో దీనిపై పెద్దగా స్పందన రాలేదు. దీంతో 50 శాతం వడ్డీ మాఫీని ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తూ మరోమారు ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ అధికారుల విచారణ కుప్పం: కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 2024లో అప్పటి సబ్రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మోహన్ పట్టుబడ్డారు. దీనిపై ఏసీబీ అధికారులు కుప్పం సబ్రిజిస్ట్రార్ కార్యలయంలో విచారణ చేపట్టారు. సాక్షులను సుదీర్ఘకంగా విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం నిశబ్ద వాతావరణం నెలకొంది. పక్కాగా ‘సంజీవి’ని చిత్తూరు కలెక్టరేట్: సంజీవిని ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో సంజీవిని ప్రాజెక్టు అమలుపై వైద్యశాఖ అధికారులతో గురువారం ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్సీలకు వచ్చే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, ఏబీహెచ్ఏ ఐడీని క్రియేట్ చేయాలన్నారు. రోగుల వివరాలను ఆన్లైన్ నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో సేవలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్ రెడ్డితో పాటు వైద్యాధికారులు అనిల్కుమార్, ప్రవీణ, గిరి, శ్రీవాణి, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రజలు తమ అభిప్రాయాల్ని తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను నియమించిందన్నారు. తమ వినతులను ఈ నెల 30లోగా సమర్పించవచ్చనిసూచించారు. ‘హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు’ చిత్తూరు అర్బన్: రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు ‘హెల్మెట్ పెట్టు – బహుమతి పట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ తుషార్డూడి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన రైడర్లు, పిలియన్ రైడర్లకు బహుమతులు అందజేయనున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు స్లిప్లు ఇచ్చి, లక్కీ డ్రా ద్వారా వారానికి, నెలకు నగదు బహుమతులు ప్రకటించనున్నారు. మొత్తం రూ.1.67 లక్షల బహుమతులు ఇవ్వనున్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూనే, పాటించని వారిపై జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. -
ఏపీడీఈఈసెట్కు దరఖాస్తుల ఆహ్వానం
కార్వేటినగరం: ఏపీడీఈఈ సెట్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026కు సంబంధించిన డీఈఈసెట్ నోటీఫి కేషన్ విడుదల చేశారని, మార్చి 31 నుంచి దరకాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో విద్యాశిక్షణతో పాటు ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్–2026కు ఆశక్తి గల అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ట్లు హెచ్టీటీపీఎస్// సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా హెచ్టీటీపీఎస్// ఏపీ డీఈఈసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా దరకకాస్తులు చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుము రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని, ఈ రుసుము మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 మధ్య గేట్వే ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు 45 శాతం ఉండాలని సూచించారు. అదే విధంగా 2026 సెప్టెంబర్ నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలని, గరిష్ట వయో పరిమితి లేదని పేర్కొన్నారు. పరీక్ష విధానం డీఈఈసెట్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుందని, అందులో పార్ట్–ఎ 60 మార్కులు, పార్ట్–బీకి 40 మార్కులకు ఉంటుందని, ప్రశ్న పత్రం తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అభ్యర్థి ఎంచుకున్న దాని ప్రకారం ఉంటుందని చెప్పారు. దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులు మొదట వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాలి. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే జర్నల్ నంబర్ సహాయంతో ఆన్లైన్ దరకాస్తును పూర్తిచేయాలి. ఫొటో, సంతకం స్కాన్ చేసి (గరిష్టంగా 50 కేబీ లోపు) అప్లోడ్ చేయాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికార వెబ్సైట్ను సందర్శించవచ్చు. లేదా హెల్ప్ లైన్ నంబర్ 7995869743ను సంప్రదించవచ్చునని ప్రిన్సిపాల్ తెలిపారు. -
ఆనారోగ్యశ్రీ!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆరోగ్యశ్రీ సేవలు క్రమంగా దిగజారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిల ప్రభావం చిత్తూరు జిల్లాపైనా పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు సేవలను పరిమితం చేయగా, పూర్తిగా నిలిపివేత దిశగా పరిస్థితులు వెళ్తున్నాయి. బుధవారం ప్రారంభమైన సమ్మె గురువారం కూడా కొనసాగింది. నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి పలికాయి. తద్వారా పేదలు వైద్య సేవలకు అవస్థలు పడుతున్నారు. బకాయిల భారం ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించడం ఆర్థికంగా సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నెట్వర్క్ ఆస్పత్రులు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు సందిగ్ధం! గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది వ్యాధులకు ఉచితంగా చికిత్సలు అందించేవారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భరోసాగా నిలిచింది. రూ.25 లక్షల వరకు పరిమితి ఉండడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సీఎంఆర్ఎఫ్పై ఆధారపడే పరిస్థితి ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్)పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఈ నిధుల మంజూరులో సిఫార్సుల ప్రభావం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఈ నిధులు సులభంగా అందకపోవడం మరింత ఇబ్బందిగా మారుతోంది.అప్పుల ఊబిలో పేదలు ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడంతో అనేక మంది రోగులు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక చికిత్సల కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలకడగా కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా జిల్లాల వ్యాప్తంగా గురువారం కూడా నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె కొనసాగింది. అన్ని ఆస్పత్రులు వైద్య సేవలను బంద్చేసి ప్రైవేటు కేసులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాయి. చాలా మంది సమ్మెతో ఫీజులు చెల్లించి సేవలుపొందారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. సేవలకు అంతరాయం జిల్లాలో ప్రస్తుతం 4,73,877 ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు, 74 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 4 ప్రభుత్వ ఆస్పత్రులు, 9 ప్రైవేటు ఆసుపత్రులు, 47 పీహెచ్సీలు, 7 సీహెచ్సీలు, 7 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు బకాయిల చెల్లింపులపై అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రులు కొత్త కేసులు స్వీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. మరికొన్ని అత్యవసర సేవలకే పరిమితమవుతున్నాయి. క్యాన్సర్, గుండె, కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ఇప్పటికే చికిత్స మధ్యలో ఆగిపోతుందేమోనన్న భయం వెంటాడుతోంది. ఆరోగ్యశ్రీ లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది?’ అంటూ పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పరిహారం ఇవ్వండి
పుత్తూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి (205) విస్తరణ పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులు గురువారం పరమేశ్వరమంగళం గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై తిరుపతి–చైన్నె ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరమేశ్వరమంగళం దళితవాడ వద్ద ఉన్న ఓవర్హెడ్ ట్యాంకును కూల్చడానికి ఎన్హెచ్ అధికారులు హిటాచీని తీసుకురావడంతో, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసలే వేసవి ప్రారంభమై తాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకును ఎలా కూలుస్తారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఏడాదిగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా ముందుగా మరోచోట ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టిన తర్వాత పాత దాన్ని తొలగించాలని ఇప్పటికే పలుమార్లు విన్నవించామని తెలిపారు. ట్యాంకు ఎవరు నిర్మించాలి? జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడ్డుగా ఉన్న ఓవర్హెడ్ ట్యాంకును తొలగించే క్రమంలో అందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట ట్యాంకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఆ ట్యాంకు నిర్మాణం ఎవరు చేపట్టాలన్న దానిపై అధికారుల్లో స్పష్టత లేదు. రోడ్డు పనులు చేడుతున్నది ఎన్హెచ్ అధికారులు కనుక వారే నిర్మించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతుండగా, లేదు ఆర్డబ్ల్యూఎస్ అధికారులే నిర్మించాలని ఎన్హెచ్ అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. స్థలాలు ఎందుకు చూపరు? పరమేశ్వరమంగళం దళితవాడ, ఏఏడబ్ల్యూకు చెందిన 45 కుటుంబాల వారు తమ ఇళ్లను కోల్పోయారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 2012లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు కేవలం ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని మాత్రం చెల్లించారు. అప్పటి నుంచి ల్యాండ్ కాస్ట్ చెల్లించలేదు. నివసించడానికి ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న ఇంటి స్థలాలను కేటాయించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే తమ ఇళ్లను తొలగించినా, నేటికీ ఇంటి స్థలాలు చూపకపోవడాన్ని బాధితులు తీవ్రంగా తప్పుపట్టారు.తహసీల్దార్ చొరవతో.. సంఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు నిర్వాసితులతో మాట్లాడారు. ఇంటి స్థలాలను వెంటనే చూపాలంటూ వీఆర్ఓ లతను ఆదేశించడంతో పాటు ట్యాంకు నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. దీంతో సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది. అలాగే నష్ట పరిహారం చెల్లింపుల్లో అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
అప్పుడే శాపమైంది!
పలమనేరు: ఏదో సొంత బిడ్డలాంటివాడు.. కష్టాల్లో ఉన్నాడని అప్పు ఇవ్వడమే ఆమెకు శాపంగా మారింది. ఇచ్చిన అప్పును చెల్లించమని అడిగినందుకు దారుణ హత్యకు గురైంది. నియోజకవర్గంలోని పెద్దముద్దేపల్లికి చెందిన ఎల్ చంద్రమ్మ(33) దారుణహత్యకు గురై పలమనేరు మండలంలోని జగమర్ల అడవిలో మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. ఈ హత్యలో కీలక ముద్దాయి అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(22)ను పోలీసులు అరెస్ట్ చూపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మీడియాకు వివరించారు. భర్తను వదిలేసిన చంద్రమ్మ పెద్దపంజాణిలో టైలరింగ్షాపు నిర్వహిస్తూ చీటీలను నడిపేది. వరుసకు కుమారుడైన సుబ్రమణ్యం ఆమె ఇంటికి వస్తూ ఉండేవాడు. తనకు ఏవో సమస్యలున్నాయంటూ రూ.2 లక్షలకుపైగా పిన్ని వద్ద అప్పుచేశాడు. అయితే అప్పు చెల్లించకపోవడంతో ఆమె నిలదీయడం మొదలుపెట్టింది. ఎలాగైనా ఆమెను మట్టుబెట్టాలని సుబ్రమణ్యం పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. నిడిగుంట గ్రామంలోని తన బావమరిది దేవీవరప్రసాద్ వద్ద తీసిస్తానంటూ గతనెల 30వ తేదీన తన బైక్పై తీసుకెళ్లాడు. ఆపై ఆమె కనిపించకుండాపోయింది. నిందితుడే మృతురాలి కుటుంబీకుల వద్దకెళ్లి తాను నిడిగుంటకు తీసుకెళుతుండగా ఎవరో బొలేరో జీపులో వచ్చి మమ్మల్లి కొట్టి పిన్నిని కిడ్నాప్ చేశారంటూ కథ అల్లాడు. ఆపై ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. వారు గతనెల 31న మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరస్థుడ్ని పట్టించిన రక్తపు మరక సుబ్రమణ్యంపై ఓ కన్నేసిన పోలీసులు గతనెల 31న ముత్తుకూరు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. పోలీసులకు విచారిస్తున్న సమయంలో అతని షర్ట్పై రక్తపు మరకను గుర్తించారు. ఆపై తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకుని! చంద్రమ్మ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును సుబ్రమణ్యం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకున్నట్టు పోలీసులకు తెలిపాడు. ఏమి చేసినా తాను అప్పు కట్టలేనందునే ఇలా స్నేహితులతో కలసి చంపినట్టి అంగీకరించాడు. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారిని పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నందున నిందితులకు జీవిత ఖైదు పడేలా చూస్తామని ఆయన తెలిపారు. ఇకపై పట్టణ ఆవాసాల్లోనూ రాత్రిపూట గస్తీని ముమ్మరం చేస్తామని, క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. ఇందులో గంగవరం సీఐ పరశురాముడు, పెద్దపంజాని ఎస్ఐ మారెప్ప పాల్గొన్నారు. పక్కా ప్లాన్తోనే! అప్పు చెల్లించలేని సుబ్రమణ్యం తన బావమరిది అయిన దేవీవరప్రాద్, స్నేహితుడైన షేక్నూర్మహ్మద్తో కలిసి ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా వారు తులసిమొనెమ్మ గుడి సమీపంలోని ఓ మామిడితోపులో బొలేరో వాహనంతో సిద్ధంగా ఉండగా ఇతను చంద్రమ్మను బైక్పైకి అక్కడికి తీసుకెళ్లాడు. ఉన్నట్టుండి ముగ్గురూ కలిసి ఆమె తలపై ఇనుపరాడ్తో కొట్టి ఆపై గొంతుకోసి హతమార్చారు. ఈ సమయంలో ఆమె శరీరంలోంచి రక్తపు మరకులు నిందితులపై పడినట్టు తెలిసింది. తర్వాత అనుమానం రాకుండా మృతదేహాన్ని బొలోరేలో వేసుకుని పలమనేరు సమీపంలోని జగమర్ల అడవిలో పడేసి వెళ్లిపోయారు. -
అంతరాయం లేకుండా సిలిండర్ల పంపిణీ
● ఇబ్బందులుంటే 08572–242734 నంబర్కు ఫిర్యాదు చేయండి ● జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల సరపరాలో ఎటువంటి అంతరాయం లేదని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ సరపరా విషయంలో వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత వంటి వదంతులు నమ్మకూడదన్నారు. గ్యాస్ సరపరా, బుకింగ్కు సంబంధించి వినియోగదారులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా సమస్యలుంటే వినియోగదారులు 08572–242734 నెంబర్కు పనిరోదినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించాలన్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్కు 50 ఫిర్యాదులు రాగా, అందులో 46 సమస్యలను ఏజెన్సీలతో మాట్లాడి తక్షణమే పరిష్కరించినట్టు వెల్లడించారు. వినియోగదారులకు సూచనలు డెలివరీ సిబ్బందికి గ్యాస్ బిల్లులో ఉన్న ధర మాత్రమే చెల్లించాలి. ఎవరైనా అదనపు రుసుం డిమాండ్ చేస్తే వెంటనే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలన్నారు. వాణిజ్య అవసరాలకు వారి వినియోగ్యాన్ని బట్టి 70 శాతం వరకు కమర్షియల్ సిలిండర్లను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు గ్యాస్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. ప్రతి తహసీల్దార్ తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీలను రోజూ తనిఖీ చేసి, స్టాక్, బుకింగ్ వివరాలను పర్యవేక్షించాలన్నారు. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై దాడులు చేసి ఇప్పటి వరకు 23 మంది పై 6ఏ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 49 సిలిండర్లను సీజ్ చేసి జేసీ కోర్టులో సమర్పించారన్నారు. గుడిపాల మండలం కీర్తన గ్యాస్ ఏజెన్సీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీచేశామన్నారు. -
సంక్షేమ హాస్టళ్లపై నిర్లక్ష్యం వద్దు
బంగారుపాళెం: సంక్షేమ హాస్టళ్లపై నిర్లక్ష్యం చేయెద్దని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రం బంగారుపాళెంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత ఎస్సీ బాలికల హాస్టల్, అనంతరం బీసీ బాలికల హాస్టల్, తరువాత ఎస్సీ బాలుర ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలు, వసతులు, పారిశుధ్య పరిస్థితులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బాలికలతో మాట్లాడుతూ సమస్యలు ఎమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వార్డెన్లు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఇబ్బందులకు గురిచేస్తున్నారా..? అనే విషయాల గురించి అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. వార్డన్లు వసతి గృహాల నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరగా బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సదుపాయాలు, మందులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అనంతరం డయాలసిస్ సెంటర్ను తనిఖీ చేశారు. ఎంతమంది రోగులు కేంద్రానికి వచ్చి డయాలసిస్ చేసుకుంటున్నారు... సౌక ర్యాలు ఎలా ఉన్నాయని అక్కడి నిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో కరంట్ ఆఫ్ చేసే సందర్భంలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక కరంటు లైన్ ఏర్పాటు చేయాలని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన వెంట తహసీల్దార్ షబ్బీర్బాషా, డిప్యూటీ ఎంపీడీఓ పురుషోత్తం ఉన్నారు. -
టమాట లారీ బోల్తా
యాదమరి మండలంలోని పీలేరు–చిత్తూరు జాతీయ రహదారిపై టమాట లారీ బోల్తాపడింది. ‘ఆరోగ్య’ పర్యవేక్షణ తప్పనిసరి చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కచ్చితమైన పర్యవేక్షణ అవసరమని డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ.నాగశశిభూషణ్రెడ్డి సూచించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీహెచ్సీల్లో అందించే ఆరోగ్య సేవలపై ప్రజల స్పందనను ఐవీఆర్ఎస్ ద్వారా 100 శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ రోగుల నమోదు, అభ ఐడీ లింకేజీ వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో రోజువారీగా నమోదు చేయాలని సూచించారు. మాతృ, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మాతృ మరణాలు, శిశు మరణాలను వెంటనే యాప్లో నమోదు చేయాలన్నారు. టీనేజ్ గర్భదారణలు ప్రస్తుతం 11 శాతంగా ఉన్నందున అవగాహన కార్యక్రమాల ద్వారా వాటిని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ కింద పీ, ఎల్, ఎస్ ఫారాలను అభ ఐడీ లింకేజీతో ప్రతిరోజూ పంపాలని ఆదేశించారు. ఏ సీడీ స్క్రీనింగ్లో భాగంగా బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ క్యాన్సర్ అనుమానిత కేసులను వారానికి కనీసం 75 కేసులు గుర్తించి వైద్యులకు పంపించాలని చెప్పారు. అవసరమైన వారికి రెఫరల్ ద్వారా చికిత్స అందించాలని సూచించారు. గర్భిణీ సీ్త్రలందరికీ అభ ఐడీ లింకేజీ తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం 79 శాతంగా ఉన్నదాన్ని 100 శాతానికి తీసుకురావాలని ఆదేశించారు. డాక్టర్లు ప్రతిరోజూ కార్యక్రమాలను పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. పీహెచ్సీలకు విడుదల చేసిన నిధులను వినియోగించి బిల్లులను సమర్పించాలని సూచించారు. అలాగే వడదెబ్బ, వడగాల్పులపై గ్రామ స్థాయిలో వి స్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సూచనల్లో ఎలాంటి లోపాలు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
పుర పోరుకు.. పునర్విభజన బ్రేక్!
చిత్తూరు అర్బన్: మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలనంగా లేదనే వాదన మరోమారు బలంగా వినిపిస్తోంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు సంబంధించి విడుదలైన మార్గదర్శకాలు ఈ వాదనకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది. అధికారుల గొంతుపై ఏడు రోజుల గడువు కత్తి అడ్డుగా పెట్టి వార్డుల పునర్విభజన చేయాల్సిందేనంటూ ప్రభుత్వం షరతు పెట్టింది. జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, ఓ కార్పొరేషన్తో కలిపి కొత్తగా 35 వార్డులు పెరగనున్నాయి. ఇలా పునర్విభజన జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మునిసిపల్ అధికారులు వార్డుల పునర్విభజన చేయాలి. ఈ లెక్కన చిత్తూరు కార్పొరేషన్లో 1,89,332 లక్షల జనాభా ఉన్నారు. ఈ మొత్తాన్ని 60తో భాగిస్తే 3,155 మంది జనాభా ఉంటారు. అంటే వార్డుల పునర్విభజనలో ఒక్కో డివిజన్లో సగటున 3,155 మంది జనాభా ఉండేలా చూసుకోవాలి. ఇందులో 10 శాతం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అలాగే పలమనేరు జనాభా ఆధారంగా 40, నగరిలోనూ 40 వార్డులుగా రూపాంతరం చెందనున్నాయి. కుప్పం మునిసిపాలిటీలో పాలకవర్గం (కౌన్సిల్)కు గడువు ఉండడంతో ఇక్కడ వార్డుల పునర్విభజన ఉండదు. గురువారం ప్రారంభించి ఈనెల 9వ తేదీన వార్డుల పునర్విభజన పూర్తిచేయాలి. 10వ తేదీన కొత్త వార్డుల వివరాలు ప్రచురించి 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు కోరడం.. 17 నుంచి 26వ తేదీలోపు మునిసిపల్ పరిపాలన విభాగం కమిషనర్–డైరెక్టర్కు పంపాలి. ఏప్రిల్ 26 నుంచి మే 2వ తేదీ వరకు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పునర్విభజన వార్డులను ఆమోగిస్తారు. మే 3వ తేదీ నుంచి 5వ తేదీలోపు కొత్త వార్డుల స్వరూపాన్ని గెజిట్లో ప్రచురిస్తారు.చిత్తూరు నగర స్వరూపంలోని ఓ భాగం మునిసిపాలిటీ ప్రస్తుత కొత్త వార్డులు వార్డులు చిత్తూరు 50 60 పలమనేరు 26 40 నగరి 29 40పారదర్శకత ఉంటుందా? వార్డుల పునర్విభజన అంత సులువైన విషయం కాదు. మునిసిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక విభాగం ఈ వ్యవహారాన్ని చూడాల్సి ఉంది. చిత్తూరు మినహా మిగిలిన మునిసిపాలిటీల్లో ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయి సిబ్బందిలేరు. పునర్విభజన సమయంలో వార్డుల్లోని సహజ సరిహద్దులు (రోడ్లు, కాలువలు) ప్రామాణికంగా తీసుకోవాలి. 2011 జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే.. ఇపుడు మొదలుపెట్టిన జనగనణ–2026 లెక్కలను ఏం చేయాలి..? ఎన్నికల సమయంలో ఏ జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకోవాలి.? రిజర్వేషన్లు ఎలా వర్తింపచేయాలి..? అనే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తుదిగా మునిసిపల్ ఎన్నికలపై న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమై.. ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
మండలాల వారీగా మిగులు నిధులు
‘అన్నా.. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోశాం. మీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాం. ఇక ఉండేది రెండేళ్లే. ఇంతలోగా మేం ఏదో ఒకటి చేసుకోవాలి కదన్నా.. అందుకే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. మేం చెప్పినట్టు వినే అధికారులే కావాలి. మీరు పై అధికారులతో మాట్లాడి ఆ దిశగా చర్యలు చేపట్టండి’ అంటూ పచ్చ నేతలు స్థానిక ప్రజాప్రతినిధుల పై ఒత్తిడి తెస్తున్నారు. పల్లె నిధులను అభివృద్ధి పేరుతో దిగమింగేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో అయితే తమను అడిగే నాథుడే ఉండడని భావిస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్: పల్లె నిధులపై పచ్చ నేతలు కన్నేశారు. జిల్లాలోని 621 పంచాయతీల పాలకవర్గాలకు పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యింది. పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో తమ పెత్తనం చెలాయించడం కోసం టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. తమ మాట వినే అధికారులను నియమించుకుని పంచాయతీల్లో ఉన్న నిధులను అడ్డంగా దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్నారు. జాబితా సిద్ధం? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ గ్రామ పంచాయతీ సర్పంచులు వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉన్నారు. అప్పుడు పనిచేసిన అధికారులంటే టీడీపీ శ్రేణులకు గిట్టడం లేదు. ఏ చిన్న సమస్య అయినా వారు వాడుతున్న ఊతపదం.. ఆ ప్రభుత్వంలో మేం ఇబ్బంది పడ్డాం.. ఫలానా అధికారి మాకొద్దు అంటూ చెబుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే గత ప్రభుత్వం పై బురదజల్లి ఫలానా అధికారి అలా చేశారు.. ఇలా చేశారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా మండల స్థాయి అధికారులను నియమించే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు వారి నియామకం పై టీడీపీ నేతలు దృష్టి పెట్టారు. తమకు ఫలానా అధికారి కావాలి, ఆయనుంటేనే తమ పనులు జరగుతాయంటూ కావాల్సిన వారినే నియమించుకునేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. దాదాపు 150 మంది అధికారులు జాబితా సిద్ధమైనట్లు సమాచారం. ఆ ప్రాంతాలపై దృష్టి అధిక ఆదాయం, నగరపాలక, మున్సిపాలిటీ శివారు పంచాయతీలకు ఎస్ఓలుగా పనిచేసేందుకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ఎవరిని ఎక్కడ నియమించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.రూ.15.63 కోట్ల నిధులు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఫిబ్రవరి నాటికి దాదాపు రూ.15.63 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు నిల్వ ఉన్నాయి. ఇవిగాక వృత్తిపన్ను, తలసరి గ్రాంటు నిధులు ఉన్నాయి. ఈ నిధులను ప్రస్తుత సర్పంచులు సద్వినియోగం చేసేందుకు వీలు లేకుండా ఇటీవల చెక్పవర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కూటమి పాలన కావడంతో స్థానిక నేత ఒత్తిళ్లతో కార్యదర్శులు, అధికారులు నిధులు వినియోగానికి కొర్రీలు వేస్తూరావడం జరిగింది. దీంతో ప్రస్తుతం పంచాయతీల ఖాతాల్లో సాధారణ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా ఉన్నాయి. ఈ నిధులను ఏప్రిల్లోగా సద్వినియోగం చేయాల్సి ఉంది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రత్యేక పాలన రానుండడంతో ఈ నిధులను అప్పుడే తమకిష్టమైన పనులకు వాడుకోవచ్చన్న ఆశతో టీడీపీ నేతలు ఉంటున్నారు. జిల్లాలోని 621 పంచాయతీలుండగా పలు కారణాలతో నగరిలోని నంబాకం, డి.అగ్రహారం, కృష్ణరామాపురం, పెనుమూరులోని కలికిరి, పెనుమూరు, మొరవకండ్రిగ, కుప్పంలోని మళ్లనూరు. మెట్లచేను, టి.సదుమురు, రామకుప్పంలోని ననియాలతాండ, రొంపిచెర్లలోని బొమ్మాయిపల్లె, పులిచెర్లలోని ఎలింకివారిపల్లెతో కలిపి మొత్తం 12 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. పల్లె నిధులపై టీడీపీ నేతల కన్ను! మొదట అక్కడేనా? పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఈ ఎన్నికలు గ్రామాల్లో వర్గపోరుకు దారితీసే అవకాశం ఉంది. ఈ ప్రభావం తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నాయకులు అంటున్నారు. అందుకే ముందుగా పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బైరెడ్డిపల్లె మండలంలో రూ.51.54 లక్షలు, బంగారుపాళ్యం రూ.1.45కోట్లు, చిత్తూరు రూ.21.78 లక్షలు, జీడీనెల్లూరు రూ.1.01 కోట్లు, గంగవరం రూ.55.24 లక్షలు, గుడిపాల రూ.62.67 లక్షలు, గుడుపల్లె రూ.26.28 లక్షలు, ఐరాల రూ.45.83 లక్షలు, కార్వేటినగరం రూ.35.26 లక్షలు, కుప్పం రూ.70.72 లక్షలు, నగరి రూ.28.14 లక్షలు, నిండ్ర రూ.36.45 లక్షలు, పలమనేరు రూ.51.95 లక్షలు, పాలసముద్రం రూ.13.35 లక్షలు, పెద్దపంజాణి రూ.1.41 కోట్లు, పెనుమూరు రూ.43.05లక్షలు, పులిచెర్ల రూ.63.05 లక్షలు, పూతలపట్టు రూ.70.15 లక్షలు, రామకుప్పం రూ.89.75 లక్షలు, రొంపిచెర్ల రూ.41.34 లక్షలు, ఎస్ఆర్పురం రూ.13.52 లక్షలు, శాంతిపురం రూ.33.43 లక్షలు, తవణంపల్లె రూ.1.02 కోట్లు, వి.కోట రూ.80.64 లక్షలు, వెదురుకుప్పం రూ.20.28 లక్షలు, విజయపురం రూ.18.42 లక్షలు, యాదమరి రూ.94.87 లక్షలు.. మొత్తం రూ.15.63 కోట్ల వరకు మిగిలింది. -
ముగిసిన పది పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ప్రారంభమైన పది పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. జిల్లాలో 129 పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా అధికారులు పరీక్షలు నిర్వహించారు. డీఈవో రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ఎలాంటి మాల్ప్రాక్టీస్, డీబార్ కేసులు లేకుండా కట్టుదిట్టంగా పూర్తిచేశారు. ‘సాక్షి’ మెటీరియల్ ఎంతో ఉపయోగం జిల్లాలో పరీక్షలు రాసిన కొందరు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాక్షి పంపిణీ చేసిన మెటీరియల్స్ తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. అందులోనుంచే చాలా వరకు ప్రశ్నలు వచ్చాయని వెల్లడించారు. గణితం, సైన్స్ కొంచెం ఆలోచింపజేసేలా ఉన్నప్పటికీ, సగటు విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించేలా ప్రశ్నలు వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూల్యాంకనం, ఫలితాలు విద్యాశాఖ ప్రస్తుతం మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) పై దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకు కసరత్తు చేపట్టారు. మూల్యాంకనం పూర్తి చేసి, మే మొదట , రెండవ వారంలో ఫలితాలను విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నారు. విహారయాత్రలకు సిద్ధం పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడిన విద్యార్థులు ఇప్పుడు సెలవుల మూడ్లోకి వెళ్లిపోయారు. వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పర్యాటక ప్రాంతాలకు ప్లాన్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు, పై చదువుల కోసం (ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్) కోచింగ్ సెంటర్ల చుట్టూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదక్షిణలు మొదలుపెట్టారు. -
అక్రమాలపై సాక్షి కన్ను
ఇరాన్ – ఇజ్రాయేల్ యుద్ధ ప్రభావం ఎక్కువగా గ్యాస్పై పడింది. సిలిండర్ల కొరత నెలకొంది. దీనికితోడు కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. ప్రభుత్వం ఓటీపీని తప్పనిసరి చేసింది. దీంతో వ్యాపారులు బ్లాక్లో ఎక్కువ ధరకు సిలిండర్లను కొనడానికి సిద్ధపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని ఏజెన్సీలు అక్రమాలకు తెరలేపాయి. ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే సిలిండర్లను విక్రయించాయి. ఈ విషయాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు పరుగులు తీశారు. విచారణలో గుడిపాలలోని ఒక ఏజెన్సీ ఒక రోజులోనే 270 సిలిండర్లను అక్రమంగా సరఫరా చేసినట్టు గుర్తించారు. అలాగే జిల్లాలోని మరిన్ని ఏజెన్సీలపైనా విచారణకు సిద్ధమయ్యారు. సాక్షి టాస్క్ఫోర్స్ : గ్యాస్ సరఫరా వ్యవస్థ ఒక పెద్ద అక్రమాల పంజాలో చిక్కుకుంది. గుడిపాలలోని ఓ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే సిలిండర్లు విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. గ్యాస్ సరఫరాలో దొంగలు పడ్డారనే విషయాన్ని సాక్షి కథనం బట్టబయలు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు అక్రమాలను వెలుగుతీసి గ్యాస్ కంపెనీ అధికారుల ముందు పెట్టారు. ఒక్కరోజులోనే ఒక ఏజెన్సీనే 270 సిలిండర్లను అక్రమంగా సరఫరా చేయడాన్ని గుర్తించి షాక్కు గురయ్యారు. ఏజెన్సీ నిర్వాహకుడికి షోకాజ్ నోటీసులిచ్చారు. సంబంధిత కంపెనీకి విచారణ అంశాలను నివేదిక రూపంలో సమర్పించారు. త్వరలో నిర్వాహకుడిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరిన్ని ఏజెన్సీల్లో అక్రమాలను వెలికి తీసేందుకు జిల్లా అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ఏజెన్సీల గుండెల్లో గుబులు పట్టుకుంది. షోకాజ్ నోటీసులు జారీ అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీ నిర్వాహకుడికి బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే కంపెనీకి సైతం నివేదికలు పంపారు. ఇక షోకాజ్ నోటీసుకు ఆ నిర్వాహకుడు ఇచ్చే వివరాల ఆధారంగా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. కచ్చితంగా వేటు పడడం ఖాయమని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకుడు అధికార పార్టీ నేతలతో అధికారులకు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదని, ఏదైనా ఉంటే జేసీతో మాట్లాడుకోవాలని చెప్పినట్టు సమాచారం. గుడిపాలలో గ్యాస్ ఏజెన్సీ అక్రమాలు మరిన్ని ఏజెన్సీలపై దాడులు..? జిల్లాలోని పలు ఏజెన్సీల్లో ఓటీపీలు లేకుండా వందలాది సిలిండర్లను దారి మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్రమాలు గుడిపాలలో మాత్రమే కాదని, జిల్లాలోని పలుచోట్ల జరిగాయని, అనుమానిత గ్యాస్ ఏజెన్సీలపై తనిఖీ చేసి గ్యాస్ దోపిడీని వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో ఓటీపీ ధ్రువీకరణ లేకుండా ఎన్ని సిలిండర్లు సరఫరా చేశారు.. అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుమానిత ఏజెన్సీలపై దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చర్యలను అడ్డుకోవడానికి కొన్ని ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గ్యాస్ బండను తమ వారు రూ.3 వేలు చేశారని అధికారులకు బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. గుడిపాలలో మార్చి 23వ తేదీన వందలాది మంది పేరుతో ఓటీపీ ధ్రువీకరణ లేకుండా గ్యాస్ బుకింగులు జరిగాయనే విషయాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకు వచ్చింది. బ్లాక్ బండ పేరుతో ఆ రోజు జరిగిన వందలాది గ్యాస్ సిలిండర్ల దారి మళ్లింపు అక్రమాన్ని బట్టబయలు చేసింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణకు దిగారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నేరుగా వినియోగదారుల దగ్గరకు వెళ్లారు. వారు తమకు జరిగిన అన్యాయాన్ని రాత పూర్వకంగా అధికారులకు అందజేశారు. అలా విచారించుకుంటూ పోగా లెక్క డబుల్ సెంచరీ దాటింది. ఒక్క రోజుల్లోనే ఓటీపీ లేకుండా 270 గ్యాస్ బండ దారి మళ్లిందని తెలుసుకున్నారు. దీంతో విచారణ పూర్తి చేసిన అధికారులు..మంగళవారం జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించారు. -
ఎన్హెచ్ 71 ఫ్లైఓవర్పై ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయండి
తిరుపతి సిటీ: మదనపల్లి–పీలేరు సెక్షన్ ఎన్హెచ్–71పై ఇటీవల 40 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఫ్లైఓవర్పై సరైన ప్రవేశ, నిష్క్రమణ మార్గా లు లేకపోవడంతో కలికిరి ప్రాంతానికి చెందిన 60 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయని, అయినప్పటికీ కలికిరి పట్టణ సమీపంలో ప్రధాన రహదారిని చేరుకోవడానికి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయలేదన్నారు. సమీప ప్రవేశ మార్గం 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో స్థానికులతో పాటు బస్సులు, ప్రజారవాణా వాహనాలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కలికిరికి అనుసంధానం తగ్గిందన్నా రు. ఐఆర్సీ ఎస్పీ 84:2014 ప్రకారం పట్టణ ప్రాంతాలు, ప్రధాన పట్టణాల్లో సర్వీస్ రోడ్లకు ఒకటి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రవేశ మార్గాలు కల్పించాలని సిఫార్సు చేశారని, ఐఆర్సీ ఎస్పీ 99: 2013, ఎంఓఆర్టీహెచ్ సర్క్యులర్ల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఈ దూరం 2 నుంచి 5 కిలోమీటర్లు ఉండవచ్చన్నారు. 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో స్థానిక అనుసంధానాన్ని నిర్ధారించడానికి సుమారు కిలోమీటరు దగ్గరి దూరం అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద పట్టణానికి 6 కిలోమీటర్ల పరిధిలో ప్రవేశ లేదా నిష్క్రమణ మార్గం లేకపోవడం ఐఆర్సీ నిబంధనలకు విరుద్ధమని, ప్రజల సౌకర్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. దీనిపై దృష్టి సారించి కలికిరి ఫ్లై ఓవర్ సమీపంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను (స్లిప్ రోడ్లను) ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. డీపీఆర్ను సమీక్షించి కలికిరి ప్రధాన పట్టణంగా ఉన్నా తగినంత ప్రవేశ సౌకర్యం ఎందుకు కల్పించలేదో స్పష్టం చేయాలని కోరారు. -
కుష్టువ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కుష్టువ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో కలిసి చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునీకరించిన లెప్రసి వార్డును ప్రారంభించారు. వార్డులో ఏర్పాటుచేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కుష్టువ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించి పూర్తిస్థాయిలో సాధారణ వ్యక్తులుగా మార్చాలన్నారు. ఫిజియోథెరపీ యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పాదరక్షలు, దుస్తులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, అరుణ, రమేష్, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, ఎం.ఎస్ ఉషశ్రీ, ఆర్ఎంవో సంధ్య, టీహెచ్ లెప్రసి వార్డు మెడికల్ అధికారి జానకిరావు, జిల్లా లెప్రసి ఎయిడ్స్ అండ్ క్షయ నివారణ అధికారి జి వెంకటప్రసాద్, అపోలో అధికారులు పాల్గొన్నారు. -
మామిడి తోటలపై గజరాజుల దాడి
ఐరాల: మండలంలో ఏనుగుల గుంపు మళ్లీ దాడులు చేశాయి. మంగళవారం అర్థరాత్రి చుక్కావారిపల్లె గ్రామానికి చెందిన రైతులు రఘునాథ్రెడ్డి, టీ.సంపూర్ణమ్మ, తిరుమలరెడ్డి ప్రకాష్, తిరుమల వాసుకు చెందిన మామిడి తోటలకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను ధ్వంసం చేశాయి. మామిడి కొమ్మలను విరిచేసి, కాయలను తిని నాశనం చేశాయి. పది ఎకరాలకు పైగా మామిడి తోటల్లో మామిడి చెట్లను కూలదోశాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. ఫోన్ ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఏనుగుల గుంపు దాడి చేయడం పరిపాటిగా మారిందని, వాటిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకుని పంటలను కాపాడాలని కోరారు. ఉన్నత స్థాయికి ఎదగాలి యాదమరి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం జిల్లా సైన్స్ అధికారి మోహన్ సింగ్తో కలిసి యాదమరి మండలంలోని పచ్చాపూరు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. జీఎఫ్ఎల్ఎన్ ఎండ్లైన్ పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యంపై సంతప్తి వ్యక్తం చేశారు. ఎంఈవో మహబూబ్ బాషా, ఉపాద్యాయులు పాల్గొన్నారు. 9 మందిపై కేసు నమోదు గంగాధర నెల్లూరు: మండలంలోని పాత వెంకటాపురంలో సత్యమ్మ గుడి నిర్మాణం వివాదంలో 9 మందిపై కేసు నమోదు చేశారు. జీడీ నెల్లూరు మండలంలోని పాత వెంకటాపురం పంచాయతీ గుండ్ల వెంకటాపురం గ్రామంలో సత్యమ్మ ఆలయ నిర్మాణంపై 50 కుటుంబాలు ఉన్న వడ్డెర కులస్తులకు, అదే గ్రామానికి చెందిన అశోక్ నాయుడుకు వివాదం నెలకొంది. ఈ గొడవలో 9 మంది వడ్డెర కులస్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిలో జానకిరామ్, నటరాజ్, యోగానందం, రాజవేలు, ఉమాపతి, అర్జున్, కన్నయ్య, జయశంకర్, సుబ్రహ్మణ్యం ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం ఇరువర్గాల వారిని జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇరువర్గాల గొడవలో అగ్రవర్ణాలకు చెందిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
నిబంధనలు మీరితే పీడీ యాక్ట్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు విక్రయించాలని ఆదేశించారు. మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలన్నారు. జిల్లాలో అక్రమంగా చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలు లింగ నిష్పత్తిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లల భ్రూణ హత్యలకు సహకరించే ఏ వ్యవస్థనైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మెడికల్ అసోసియేషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మత్తు పౌడర్లు, నార్కోటిక్ మందుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. అక్రమ విక్రయాలపై సమాచారాన్ని ఈగల్ టోల్–ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన, మెడికల్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.వార్డెన్లు తీరు మార్చుకోవాలి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న వార్డెన్లు తీరు మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలన్నారు. బాలికల వసతి గృహాలను ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు తరచూ సందర్శించి వైద్యసేవలు అందించాలన్నారు. అసిస్టెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు విధిగా వారానికి కనీసం నాలుగు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. కుప్పంలోని బాలుర వసతి గృహంలో సౌకర్యాల కొరత దృష్ట్యా, వెంటనే అనుకూలమైన అద్దె భవనాన్ని గుర్తించాలని ఆదేశించారు. హాస్టళ్లలో గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐసీడీఎస్ పీడీకి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వార్డెన్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బాని బాషా పాల్గొన్నారు. -
పోలీసు యాక్టు వైఎస్సార్ సీపీకేనా..?
కుప్పం రూరల్ : కుప్పంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులను కట్టడి చేయడానికే పోలీసులు 30 యాక్టు అమలుచేస్తున్నారని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కుప్పంలో ప్రతినెలా పోలీసు 30 యాక్టును అమలు చేస్తున్నారని తెలిపారు. తాము పార్టీ ఆవిర్భావం, పార్టీకి సంబంధించిన సమావేశాలు, మృతిచెందిన మా నేతలకు నివాళి తదితర కార్యక్రమాల నిర్వహణకు అనుమతి కోరితే తిరస్కరిస్తున్నారని, కూటమి నేతలు గంటల తరబడి రోడ్ల ను బ్లాక్ చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద స్పీకర్లు పెట్టు కుని చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేసినా, వందల సంఖ్యలో గుమికూడి అలజడి సృష్టించినా చూసీచూడనట్టు ఉంటున్నారని దుయ్యబట్టారు. తమ నాయకులపై దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికై నా కుప్పం పోలీసులు సమన్యాయంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
మామిడి బిల్లులు ఇప్పిస్తాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులకు ఈ నెల 7 నాటికి బిల్లులు ఇప్పించేలా చూస్తామని, లేకుంటే తాను తమతోపాటే నడుస్తానని చిత్తూరు రూరల్ తహసీల్దార్ కల్యాణి హామీ ఇచ్చారు. బిల్లుల కోసం రైతులు చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని పండ్ల గుజ్జు ఫ్యాక్టరీ వద్ద దీక్ష చేపట్టారు. దీనిపై గుంజుకొని డబ్బులు ఎగ్గొట్టారు అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో థనం ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ తహసీల్దార్ కల్యాణి దీక్షా శిబిరానికి చేరుకుని రైతులతో చర్చించారు. బిల్లులు చెల్లింపునకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు కావాలని ఫ్యాక్టరీ ఎండీ కోరారని పేర్కొన్నారు. ఈ మేరకు వారు లెటర్ ఇచ్చారని తెలిపారు. 7వ తేదీ నాటికి మొత్తం బకాయిలు ఇప్పిస్తామని తెలిపారు. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పుడు కూడా బిల్లులు చెల్లించకపోతే పూచి ఎవరని రైతుల ప్రశ్నించారు. అందుకు తహసీల్దార్ మాట్లాడుతూ తాను ప్రభుత్వం తరఫున వచ్చానని, ఇవ్వకుంటే తాను కూడా మీతో ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ నేతల నిరాహార దీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉద్ధృతం చేయనున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ తెలిపారు. యూటీఎఫ్ నాయకులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరాహర దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. వెంటనే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యూటీ బకాయిలను విడుదల చేయాలన్నారు. సీపీఆర్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. నిరాహార దీక్షకు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాఘవులు మద్దతు ప్రకటించారు. నిరహార దీక్షలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్పనాయుడు, మణిగండన్, రాష్ట్ర కౌన్సిలర్ సోమశేఖర్నాయుడు, ఎస్పీ బాషా, జిల్లా గౌరవాధ్యక్షులు సదాశివరెడ్డి పాల్గొన్నారు. -
హత్య చేసి అడవిలో పడేశారా?
పలమనేరు: సంచలనం సృష్టించిన టైలర్ చంద్రమ్మ హత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దపంజాణి మండలం పెద్ద ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ(35) అదృశ్యమై.. ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెను బైక్పై తీసుకెళ్లిన సుబ్రమణ్యం అనే యువకుడు లింగాపురం ప్రాంతంలోని ఓ మామిడి తోపులో తన స్నేహితులతో కలిసి హత్య చేసి శవాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అడవిలో వేసినట్టు తెలుస్తోంది. పోలీసులు, క్లూస్ టీం అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రధాన నిందితుడైన సుబ్రమణ్యం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అతని ద్వారా ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. హైవేలో ఆందోళనకు దిగినమృతురాలి బంధువులు అడవిలో ఉన్న తమ బిడ్డ మృతదేహాన్ని కూడా చూడనివ్వడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చైన్నె– బెంగళూరు హైవే నుంచి జగమర్ల అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న పలమనేరు, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి ఎస్ఐలు స్వర్ణతేజ, మారెప్ప, చందనప్రియ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళన కారులతో చర్చించారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు పోలీసుల కాళ్లావేళ్లా పడడం, బతిమలాడడం అందరినీ కలచివేసింది. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
పాలసముద్రం : ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 11 గంటలకే సూర్యుడు భగభగమండుతున్నాడు. ఇంటిలో ఉన్నా ఉక్కపోతతో అల్లాడాల్సిన పరిస్థితి. ఒంటిపూట బడులు కావడం.. మధ్యాహ్నం స్కూళ్లు వదిలేస్తుండడంతో పిల్లలు యువకులతో కలిసి ఈత కొట్టడానికి బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చేతులు పట్టుకుని పైనుంచి బావిలోకి దూకడం.. సురాబాణం కొట్టడం.. అంట్టు ఆటలు తదితర ఆటలు ఆడుతూ ఎండలో తిరగకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఈత రాని కొంద మంది పిల్లలు నడుముకు ప్లాస్టిక్ క్యాన్ కట్టునుని ఈత నేర్చుకుంటున్నారు. -
పన్నుల వసూళ్లలో ఫస్ట్
●గ్రామ పంచాయతీలకు ముఖ్యమైన ఆదాయ వనరు పన్నులు. వాటిని సకాలంలో వసూలు చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయవచ్చు. అలాగే సిబ్బందికి జీతాలు చెల్లించవచ్చు. తద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీలోనూ మార్చి నెలాఖరులో వందశాతం పన్నులు వసూలు చేయాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తుంటారు. చిత్తూరు జిల్లా అధికారులు పన్నుల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో 96.26 శాతం వసూలు చేశారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో మొత్తం 621 పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలోని పన్నుల వసూలు లక్ష్యం రూ.24.36 కోట్లు, పాత బకాయిలు రూ.2.94 కోట్లు. మొత్తం రూ.27.29 కోట్లు. వాటిని వసూలు చేయడానికి పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. గడువు సమయంలో తొందర పడకుండా ముందస్తుగా దశలవారీగా సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో పాత బకాయిలు రూ.2.67 కోట్లు, పన్నుల వసూళ్లు రూ.23.60 కోట్లు కలిపి మొత్తం రూ.26.27 కోట్లు సాధించారు. రాష్ట్రంలో 96.26 శాతం పన్నుల వసూళ్లతో మొదటి స్థానాన్ని సాధించారు. ఇంకా పాత, కొత్త బకాయిలు కలిపి మొత్తం రూ.1.02 కోట్లు వసూలు కాలేదు. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో కలుపుకుని వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది సైతం పన్నుల వసూళ్లలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి ప్రతి ఏటా పన్నులు వసూలు చేయాలని అధికారులు చెప్పడం.. క్షేత్రస్థాయి సిబ్బంది సరే అనడం.. తీరా మార్చి వచ్చాక ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ సారి అధికారులు సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తూనే వారితో ఎలా పనిచేయించుకోవాలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఐదు నెలల ముందునుంచే పన్నుల వసూలుపై సమావేశాలు, రోజు ఫోన్లో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ఒకేసారి ఒత్తిడి తీసుకురాకుండా లక్ష్యం చేరుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ అంశాన్ని అధికారులు పదేపదే చెప్పడంతో పన్నులు వసూలు చేయనిదే వదిలేలా లేరని పంచాయతీ కార్యదర్శులు అభిప్రాయానికి వచ్చారు. ఇతర జిల్లాల్లో పన్నుల వసూళ్లకు సంబంధించి కార్యదర్శులకు షోకాజ్లు ఇవ్వగా, చిత్తూరు జిల్లాలో అలాంటిది లేకుండా జాగ్రత్త పడ్డారు. ఉద్యోగులను అవమానపరచడం సరికాదని భావించి మాటలతోనే ఒత్తిడి తెచ్చారు. వినకపోతే చర్యలు ఉంటాయని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పడంతో వయస్సు మీరిన వారు, ఆరోగ్య సమస్యలున్న వారు సైతం కష్టపడి పనిచేశారు. దీనికి తోడు ఓటర్ల జాబితా పనులు, సర్వేలు ఉన్నా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పన్నులు చెల్లించాలని గ్రామస్తులకు చెబుతూ వసూళ్లు ప్రారంభించారు. జనవరి నుంచి వీటిని వేగం పెంచారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, మండల, డివిజనల్ అధికారులు ఐక్యమత్యంగా దృష్టి పెట్టారు. అంతేగాక ప్రతి గ్రామ పంచాయతీలోనూ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది అందరికీ పలు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోల ప్రత్యేక పర్యవేక్షణ చేయడంతో పన్నుల వసూలు లక్ష్యానికి చేరుకున్నారు. టీంవర్క్తోనే సాధ్యం అందరి సహకారంతోనే పన్నుల వసూళ్లు 96.26 శాతం సాధ్యమైంది. గత సంవత్సరం రాష్ట్రంలో రెండో స్థానం రాగా, ప్రస్తుతం మొదటి స్థానం వచ్చింది. దీంతో పాటు పలు అంశాలపై కుప్పం బ్లాక్కు జాతీయ అవార్డు వచ్చింది. పని విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి పెట్టినా.. అందుకు తగిన ఫలితం దక్కింది. టీంవర్క్తోనే ఇది సాధ్యపడింది. – సుధాకర్రావు, డీపీవో -
కష్టపడిన వారికి తగిన గుర్తింపు
కుప్పం : నాయకులు, కార్యకర్తలు నిజాయితీతో పనిచేసి వైఎస్సార్ సీపీని మరోసారి అధికారంలోకి తీసుకువద్దామని వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ఆయన బుధవారం గుడుపల్లె, కుప్పం రూరల్, కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడతూ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిపొందిన వారు ఇప్పుడు పార్టీని వీడి మోసం చేశారని తెలిపారు. చాలా మంది వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో రెండేళ్లుగా ఎన్నో అవమానాలు పడుతూ, పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా అందరినీ గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో బూత్ కన్వీనర్లే పార్టీకి కీలకమన్నారు. నిజాయితీతో పనిచేసి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికై న బూత్ కన్వీనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలాల కన్వీనర్లు రామకృష్ణ, హఫీజ్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ విజయ్కుమార్, గుడుపల్లె మండలం బూత్ కన్వీనర్ సంపంగి తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్వోగా నాగశశిభూషణ్రెడ్డి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన అనంతపురం జిల్లా డీఐఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సుధారాణి రాష్ట్ర శాఖకు బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సంక్రమణ, అసంక్రమణ వ్యాధులపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. మాతా–శిశు మరణాలను తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ, వడగాడ్పులతో వచ్చే వ్యాధులపై ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ నిర్వహించిన హీట్ స్ట్రోక్, హీట్ వేవ్స్పై జూమ్ సమావేశంలో పాల్గొని వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఈగా అమర్బాబు బాధ్యతల స్వీకరణ చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో ఎస్ఈగా అమర్బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ఎం విభాగం ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై ఎస్ఈగా జిల్లాకు వచ్చారు. ఆయనకు ఈఈలు మునిచంద్ర, సురేష్, పీవో రెడ్డెప్ప, అధికారులు, ఉద్యోగులు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం చిత్తూరు కార్పొరేషన్: స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్నాయుడు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు తగిన సమాచారంతో రావాలని సూచించారు. 60 డివిజన్లతో చిత్తూరు కార్పొరేషన్ చిత్తూరు అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపల్ కార్పొరేషన్లలోని డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా 50 డివిజన్ల పరిధిలో ఉన్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ను 60కి పెంచింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతున్న క్రమంలో డివిజన్ల పెంపు అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం 10 డివిజన్లను అదనంగా పెంచడంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 60 డివిజన్లకు పెరగనుంది. అలాగే తిరుపతి నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా అదనంగా మరో 16 డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి నగరం మొత్తం 66 డివిజన్లకు చేరింది. -
హైవేపై వాహనాలకు అనుమతి
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు–తచ్చూరు హైవేపై వాహనాలను బుధవారం నుంచి ట్రయిల్రన్లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్లు రోడ్డు పనులు పూర్తయ్యాయి. మొత్తం 116 కి.మీ కాగా అందులో పనులు పూర్తవ్వడంతో అధికారులు రాకపోకలకు అవకాశం కల్పించారు. త్వరలో టోల్గేట్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు పై 100 స్పీడ్తో 95 కిలోమీటర్ల దూరం 1.30 గంటల్లో చేరుకోవచ్చని అంచనా వేశారు. ఇందులో అనుపల్లె్, అరతల, నరసింహరాజపురం, పల్లెపట్లు, నగరి, ఊత్తుకోట, కుమారజపేట, ఎన్ఆర్పురం, వీరకావేరిరాజపురం, పొందవక్కం మొత్తం 7 ఇంటర్చేంజ్లు ఉంటాయని తెలిపారు. -
శిథిలావస్థలో వాటర్ ట్యాంక్
గంగాధర నెల్లూరు: వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరిందని, దాన్ని తొలగించి కొత్తదాన్ని నిర్మించాలని మండలంలోని నందనూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ ట్యాంకు నుంచి నందనూరు, దళితవాడలోని దాదాపు 200 కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీన్ని అనేక ఏళ్ల క్రితం నిర్మించారు. తర్వాత మరమ్మతులు చేపట్టలేదు. దీంతో శిథిలావస్థకు చేరింది. స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పు పెచ్చులు ఊడడంతో ఇనుప కమ్మీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి ట్యాంకును కూలదోసి నూతన ట్యాంకు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్ఈగా అమర్బాబు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ఎం విభాగం ఈఈ అమర్బాబు నియమితులయ్యారు. గత ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ మంగళవారం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో అమర్బాబును నియమిస్తూ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా డీపీఈ ఈఈ హరి పదోన్నతి పై కార్పొరేట్ కార్యాలయ ఎనర్జీ ఆడిట్ జీఎంగా నియమితులయ్యారు. ఎస్ఈ పోస్టు పోటీ పై సోమవారం ‘ఎస్ఈ సీటుపై ఇద్దరి కన్ను’ అనే శీర్షికన సాక్షిలో కథనం వచ్చింది. తిరుపతి, చిత్తూరు ఈఈలు పోటీ పడుతున్నరనే విషయం పై వెల్లడించింది. అందులో ప్రస్తావించినట్టుగానే తిరుపతిలో ఈఈ క్యాడర్లో ఉన్న అమర్బాబు పదోన్నతిపై ఎస్ఈగా చిత్తూరు వచ్చారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
శిశు మరణాలపై సమీక్ష
–10 కేసుల పరిశీలన చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో నమోదైన శిశు మరణాలపై వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మార్చిలో చోటుచేసుకున్న పది శిశు మరణాలపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమీక్ష నిర్వహించింది. చిత్తూరులోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డీఐఓ హనుమంతరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం జరిగింది. గర్భిణులకు గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు రెండేళ్ల వయస్సు వరకు 1000 రోజుల ప్రత్యేక సంరక్షణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలందించాలని, అవసరమైతే ఉన్నత ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించారు. ప్రతి గర్భిణి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలు నివారించడం, టీనేజ్ గర్భధారణపై నిఘా పెంచడం అవసరమని పేర్కొన్నారు. ప్రతి నెలా 9వ తేదీన పీహెచ్సీలలో నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గుండె జబ్బులు, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్న గర్భిణులకు ప్రత్యేక చికిత్స అందించాలని, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు వెంటనే వైద్య సేవలందించాలని తెలిపారు. -
● తేజోమూర్తి.. స్వర్ణకీర్తి
మిరుమిట్లు గొలుపుతూ ధగధగలాడే స్వర్ణ రథంలో తేజోమూర్తి అయిన శేషాచలవాసుడు కొలువుదీరారు.. తిరువీధుల్లో విహరించారు.. భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథోత్సవం దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సిరి సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే మంగళవారం శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి స్వర్ణరథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, కలియుగవైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. – తిరుమల స్వర్ణరథంపై విహరిస్తున్న మలయప్పస్వామిసమాధులు పెకళించి..దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. అధికారం ఉన్నప్పుడే చేతినిండా సంపాధించాలని కూటమి నేతలు తహతహలాడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూములు.. పోరంబోకు జాగాల్లో పాగా వేస్తున్నారు. అది చాలదన్నట్టు చెరువులనూ చెరబడుతున్నారు. సమాధులను సైతం పెకళించి అందినకాడికి మట్టిని లోడేస్తున్నారు. ఇలాంటిదే ఇప్పుడు పలమనేరు మండలంలో సాగుతోంది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు చెరువును నిలువునా తవ్వేస్తున్నారు. భారీగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినీ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులుగానీ.. స్థానిక ఎమ్మెల్యే గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మట్టిని తరలించి! -
బంగారు కొండ
●తిరుపతి సిటీ: బీవీఎస్సీ విద్యార్థిని రిషిత 9 పసిడి పతకాలను సాధించి రికార్డు నెలకొల్పింది. మార్చి 30వ తేదీన తిరుపతి వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ) కోర్సులో విద్యార్థిని రిషిత 9 బంగారు పతకాలు సాధించి, గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పతకాలు అందుకుని ప్రశంసలు పొందారు. వెటర్నరీ అధికారిగా సేవ చేయాలన్నదే లక్ష్యం చాలా సంతోషంగా ఉంది. నిరంతర కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం, అక్క ఆదర్శంతో 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించాను. వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకోవడం గర్వంగా అనిపించింది. మాది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అమ్మ గృహిణి. అక్క వెటర్నరీ వైద్యురాలు. ఆమె స్ఫూర్తితో ఇన్ని పతకాలు సాధించాను. చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. పదో తరగతి లో పదికి 10 పాయింట్లు, ఇంటర్లో 985 మార్కు లు సాధించి ఎంసెట్లో ర్యాంక్తో బీవీఎస్సీలో చే రాను. విజయవాడ గన్నవరం పశువైద్య కళాశాలలో బీవీఎస్సీలో సీటు సాధించి తొలి ఏడాది నుంచి కష్టపడి చదివాను. అధ్యాపకుల సహకారం మరువలేనిది. వర్సిటీ, కళాశాల, బాలికల విభాగం, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరికులమ్, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఎల్పీటీ ప్రాజెక్ట్ ఇలా ఎనిమిది విభాగాల్లో టాపర్ నిలిచి బంగారుపతకాలు సాధించాను. అలాగే యూనివర్సిటీ పరిధిలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థిగా మరో పతకం సాధించాను. దీంతో పాటు మరో వెండిపతకం సైతం లభించింది. వెటర్నరీ ఆఫీసర్గా పాడి పరిశ్రమకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో ఎంవీఎస్సీ చేసేందుకు సన్నద్ధమవుతున్నా. – కారు మంచి రిషిత, బీవీఎస్సీ విద్యార్థిని, గన్నవరం పశువైద్య కళాశాల -
పారిశ్రామిక భద్రతపై రాజీ పడొద్దు
పలువురికి ఇంక్రిమెంట్లు కట్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారిశ్రామిక భద్రత పై రాజీ ఉండకూడదని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలో 111 కి.మీ ఐఓసీఎల్, 107 కి.మీ హెచ్పీసీఎల్ పైప్లైన్లు ఉన్నందున, రసాయనాల రవాణా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కోసం త్వరలోనే ఒక నిపుణ సంస్థ తో ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికను రూపొందించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాడారు. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త లక్ష్యంగా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 30 వరకు అందిన 781 దరఖాస్తులలో 753 దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితి లోపు పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశాల్లో జిల్లా ఫ్యాక్టరీ చీఫ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, డీఎస్పీ మహబుబ్బాషా, కుప్పం ఆర్డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. మహిళ దారుణహత్య లక్ష్యానికి చేరువగా పన్ను వసూళ్లు చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీల్లో లక్ష్యానికి చేరువగా పన్ను వసూళ్లు చేశారు. జిల్లాలో 621 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27.04 కోట్లు వసూలు లక్ష్యంగా నిర్దేశించారు. మార్చి 31న చివరి రోజు మంగళవారం సాయంత్రం వరకు 95.33 శాతం అంటే రూ.25.77 కోట్లు వసూలు చేశారు. పన్నుల రూపంలో రూ.20.09 కోట్ల లక్ష్యానికి గాను రూ.19.30 కోట్లు (96.09 శాతం) వసూలు చేయగా, పన్నేతర వసూళ్లలో రూ.6.95 కోట్ల లక్ష్యానికి గాను రూ.6.57 కోట్లు (94.57 శాతం) వృద్ధి సాధించారు. రుయా సూపరింటెండెంట్గా డాక్టర్ మనోహర్ తిరుపతి తుడా: రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ బి మనోహర్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రఘు నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుయా సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ రాధ ఉద్యోగ విరమణ చేశారు. ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభుతో పాటు ఉద్యోగ విరమణ చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ రాధ ఇతర వైద్య అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాయలసీమ పరిధిలోని అన్ని మెడికల్ కళాశాలలో సీనియర్స్ జాబితాలో ముందు వరుసలో ఉన్న రుయా పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మనోహర్ను (ఎఫ్ఏసీ) సూపరింటెండెంట్గా నియమించారు. సుదీర్ఘకాలం పాటు రుయా చిన్నపిల్లల విభాగంలో ఆయన విస్తృత సేవలు అందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి విభాగాధిపతిగా 30 వసంతాలకు పైగా విశేష సేవలు అందించారు. చిన్నపిల్ల విభాగంలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అందించే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అమోఘం. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం న్యాయబద్ధంగా ఆయనకు దక్కాల్సిన రుయా సూపరింటెండెంట్ పోస్టులో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏడీ రమేష్, పలువురు వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు ఆయన్ను అభినందించారు.పలమనేరు: నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం, పెద్దముద్దేపల్లికి చెందిన ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ కౌండిన్య అభయారణ్యంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం, చెలమంగళం పంచాయతీ, పెద్ద ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ(35)కు గతంలో వీకోట మండలం, నాగిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి తో పెళ్లయ్యింది. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భర్త తో విబేధాల కారణంగా ప్రస్తుతం పుట్టింటికొచ్చి పెద్దపంజాణిలో టైలరింగ్ పనిచేస్తూ జీవ నం సాగిస్తోంది. దీంతోపాటు కొంతమందికి ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉండేది. తనకు వరసకు కుమారు డైన పెద్ద ముద్దేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సుబ్రమణ్యం(22)కు సైతం చీటీలతో పాటు రూ.40 వేలదాకా డబ్బులు ఇచ్చింది. అయితే అతను ఆమెకు డబ్బులివ్వకుండా విసిగించేవాడు. ఈ నేపథ్యంలో ఆమె గట్టిగా అడగడంతో నిడి గుంటలో తనకు డబ్బు రావాలని, అక్క డే ఇచ్చేస్తానంటూ ఆమెను తన బైక్పై ఎక్కించుకొని సోమవారం వెళ్లాడు. ఆపై ఆమె ఆచూకీ లేకుండాపోయింది. పక్కా ప్లాన్ప్రకారమేనా? డబ్బు కట్టలేక ఎలాగైనా ఆమెను అంతమొందించాలని సుబ్రమణ్యం ముందుగానే పక్కా స్కెచ్ వేసినట్టు సమాచారం. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పలమనేరు సమీపంలోని గాందీనగర్ అడవిలో చంద్రమ్మను హత్య చేసినట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాంఽధీనగర్ అడవిలో చంద్రమ్మ మృతదేహాన్ని గుర్తించా రు. అయితే పూర్తి విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ను వివరణ కోరగా మొగిలి అడవిలో మహిళ హత్యకు గురైంది వాస్తవమేనని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. తిరుపతి రూరల్ : తిరుపతి సర్కిల్లో అనధికారికంగా పనుల నిర్వహించడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. సాయిశంకర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. విశ్వనాథానికి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు. అనధికారికంగా విద్యుత్ లైన్ల మార్పు చేయడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. శ్రీనివాసమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సి.చిన్నప్ప, అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్. హేమచంద్రుడు, లైన్ ఇన్స్పెక్టర్ ఎం.శరత్ బాబు, లైన్మన్ ఎస్ఆర్ గోపాల్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే తిరుపతి సర్కిల్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సి. విజయ వెంకటేష్, లైన్మన్ బి. శేఖర్, అసిస్టెంట్ లైన్మన్ కె.సురేష్, జూనియర్ లైన్మన్ గ్రేడ్– 2 టీ. భాగ్యరాజ్ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కర్నూలు సర్కిల్లో హెచ్టీ సర్వీసుకు సంబంధించి రీడింగును నమోదు చేయడంలో అవకతవకలకు పాల్పడిన సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జె. చిన్నరాఘవులుకు 6 నెలలపాటు పదోన్నతి నిలుపుదల, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.వి.మోహన్ కుమార్కు ఒక ఇంక్రిమెంటు కట్ చేశారు. అలాగే మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏ. రాజమోహనరెడ్డికి రెండు ఇంక్రిమెంట్లు ఆపివేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె. సుబ్రమణ్యం శెట్టికి రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే వినియోగదారుని సర్వీసు పేరు మార్పు అంశంలో నిర్లక్ష్యం వహించినందుకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ జి. బాలచౌడయ్య, కడప సర్కిల్లో అనధికారికంగా విద్యుత్ లైన్ల మార్పు చేసిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.కుళ్ళాయప్ప, అసిస్టెంట్ ఇంజినీర్ టి. శివకుమార్, లైన్ ఇన్స్పెక్టర్ అయ్యవారయ్య, లైన్మన్ నాగసుబ్బారెడ్డికి షోకాజ్ నోటీసులిచ్చారు. శ్రీసత్యసాయి సర్కిల్లో విధులు నిర్వహిస్తూ అనధికారికంగా విద్యుత్ లైన్ల మార్పు చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.విశ్వనాథానికి ఒక ఇంక్రిమెంటు కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరులో నిబంధనలను పాటించనందుకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. విశ్వనాథంను వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ ఇంజినీర్, ఏఎల్ఎంపై వేటు అనంతపురం సర్కిల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసును మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడిన అంశంపై ఇన్చార్జి అసిస్టెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న జూనియర్ ఇంజినీర్ బి. బాలచంద్రను సస్పెండ్ చేశారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. శ్రీనివాసులు నాయుడికి షోకాజ్ నోటీసును జారీ చేశారు. చిత్తూరు సర్కిల్లో అనధికారికంగా లైన్ల మార్పు, ట్రానన్స్ ఫార్మర్ ఏర్పాటు అంశంలో అసిస్టెంట్ లైన్మన్ ఎస్. రమేష్ బాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చంద్రమ్మ(ఫైల్) -
దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ఫోర్స్: న్యాయం చేయాలని కోరుతూ ఓ దళిత కుంటుంబం మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. గత మూడు రోజుల కిందట చిత్తూరు నగరంలోని కట్టుకాలువ వీధికి చెందిన యువతి, బుల్లెట్ సురేష్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన విషయం విధితమే. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. చిత్తూరు నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒంటిపై కిరోసిన్, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు దాన్ని భగ్నం చేశారు. బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించారు. బుల్లెట్ సురేష్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. తాము ఎదుర్కొంటున్న న్యాయకష్టాలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దళిత సంఘ నేతలు కూడా భగ్గుమన్నారు. ఈ క్రమంలో చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నెట్టికంటయ్య బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. బుల్లెట్ సురేష్పై అట్రాసిటీ కేసు చిత్తూరు అర్బన్: దళిత మహిళను కులం పేరుతో ధూషించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్తో సహా ఆరుగురిపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. తనవద్ద పనిచేస్తూ తన ఖరీదైన చేతి గడియారం దొంగతనం చేశారనే ఆరోపణలపై నగరంలోని కయినికట్టు వీధికి చెందిన ఓ దళిత మహిళను గతేడాది అక్టోబర్ 5న బుల్లెట్ సురేష్ తన కార్యాలయానికి పిలిపించాడు. మహిళతో పాటు ఆమె తల్లిపై దాడిచేసి, కులం పేరుతో ధూషించాడు. ఆపై లైంగిక వేధింపులకు పాల్పడడం, తుపాకీతో బెదిరించాడని ఇటీవల ఓ కుటుంబం వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళ టూటౌన్ పోలీసులకు ఇదే విషయమై రాత పూర్వక ఫిర్యాదు అందచేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బుల్లెట్ సురేష్, అతని కుమారుడు సాయిబాలాజీ అలియాస్ అప్పు, భార్య భారతితోపాటు రామారావు, ప్రశాంత్, ప్రవీణ్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ, లైంగిక వేధింపులు, ఎస్సీ మహిళపై దాడి, తుపాకీ చూపించి బెదిరించడం లాంటి వాటిపై కేసు పెట్టినట్లు సీఐ తెలిపారు. మహిళల భద్రతే లక్ష్యం చిత్తూరు కలెక్టరేట్ : నేటి బాలికలే రేపటి పౌరులని ఏఎస్పీ రాజశేఖర్రాజు అన్నారు. మంగళవారం నగరంలోని మిట్టూరులో ఉన్న ఆర్కే డిగ్రీ కళాశాలలో బాల్య వివాహాల నిరోధకం, పోక్సోచట్టం, శక్తి యాప్ వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు, మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టవిరుద్ధమన్నారు. విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలబడే వరకు వివాహాల జోలికి వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఆర్కే ప్రిన్సిపల్ రమేష్బాబు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు తిరుపతి లీగల్: చెక్ బౌన్స్ కేసులో చిత్తూరు, కొంగారెడ్డిపల్లి, నీలా ఎన్ క్లేవ్కు చెందిన పీఎస్ ప్రేమ్కృష్ణ కు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పి కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పారు. పాకాల మండలం, బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన పి జయ చంద్రారెడ్డి వద్ద ప్రేమ్కృష్ణ 2017 జూన్ 15వ తేదీ రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దానికి గాను ప్రేమ్కృష్ణ ఓ ప్రో నోటును రాసి ఇచ్చాడు. ఆ సొమ్ము అసలు, వడ్డీ చెల్లించే క్రమంలో 2018 జూలై 20వ తేదీ ప్రేమ్కృష్ణ రూ.5 లక్షల విలువ చేసే చెక్కును జయచంద్ర రెడ్డికి ఇచ్చాడు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో జయచంద్రారెడ్డి కోర్టులో ప్రేమ్కృష్ణ పై చెక్కు బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రేమ్ కృష్ణకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఉద్యోగమేళాకు విశేష స్పందన – 158 మందికి ఉద్యోగ అవకాశాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించినట్లు ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా ఈ ఉద్యోగ మేళా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగ మేళాకు జిల్లాలోని నలుమూలల నుంచి 347 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. వివిధ బహుళజాతి కంపెనీలు నిర్వహించిన రాత, ముఖాముఖి పరీక్షల్లో అభ్యర్థులు తమ ప్రతిభను చాటుకున్నట్లు తెలిపారు. ఈ మేళాలో 158 మంది ఎంపికకాగ, 42 మందిని వివిధ కంపెనీలు షార్ట్లిస్ట్ చేశాయన్నారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు. జేకేసీ నోడల్ అధికారి ప్రసాద్, జేకేసీ ఎఫ్టీఎం నారాయణరావ్ పాల్గొన్నారు. -
ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపీలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో కొందరు ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్నారు. ప్రథమ చికిత్స వదిలి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పసి పిల్లలకు సైతం వైద్యం చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటిదే రామకుప్పం మండలంలో వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యమే కారణమా? రామకుప్పం ప్రాంతంలో ఓ ఆర్ఎంపీ వైద్యు డు మూడేళ్ల బిడ్డకు వైద్యం అందించాడు. ఆ తర్వాత వైద్యం వికటించడంతో ఆ బిడ్డ మృత్యువాత పడ్డాడు. నిర్లక్ష్య వైద్యమే తమ బిడ్డ మృతికి కారణమని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషయం చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో టాస్క్ఫోర్స్ టీం వెల్లడించింది. ఆర్ఎంపీ వైద్యులపై మండిపాటుకు గురైంది. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడమే కారణమని తేల్చింది. దీనికారణంగానే శిశుమరణాలు జరుగుతున్నాయని పేర్కొంది. కఠిన చర్యలు తీసుకోవాలి మూడేళ్ల బిడ్డ మృతికి కారణమైన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతోపాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించకపోతే మరిన్ని పసిప్రాణాలు బలయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇష్టారాజ్యం ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో కొంతమంది ఆర్ఎంపీలు నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నట్టు తేలింది. ఇలా పట్టుబడ్డ వారిలో కొంతమందిని వదిలిపెట్టేశారు. వారిలో చాలా మంది డీఎంహెచ్ఓ కార్యాలయంలో సిబ్బందికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో దాదాపు రెండు వేల మంది ఆర్ఎంపీలు ఉండగా.. అందులో 700 మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని సమాచారం. -
రూ.2.08 కోట్ల ఆస్తిపన్ను వసూలు
చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను వసూలు చేయడానికి మంగళవారంతో గడువు ముగిసింది. చివరి రోజున జిల్లాలోని ఓ కార్పొరేషన్తో పాటు మూడు మునిసిపాలిటీలలో రూ.2.08 కోట్ల ఆస్తిపన్నులు వసూలయ్యాయి. ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, మార్చి 31వ తేదీలోపు ఒకేసారి బకాయిలు చెల్లించిన వాళ్లకు మాత్ర మే అది వర్తిస్తుందని షరతు పెట్టడం తెలిసిందే. అయితే మొండి బకాయిలు పెద్దగా వసూ లు కాలేదు. మొత్తంగా చివరి రోజున చిత్తూరు కార్పొరేషన్కు రూ.1.3 కోట్లు, కుప్పం మునిసిపాలిటీకి రూ.50 లక్షలు, పలమనేరు రూ.16 లక్షలు, నగరిలో రూ.13 లక్షలు చొప్పున ఆస్తి పన్ను వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆస్తిపన్నుల వసూళ్లలో 9.47 శాతం పెరుగుదల కనిపించింది. ఇంజినీరింగ్ కాలేజ్ వ్యాన్ బోల్తా ఐరాల: మండలంలోని పొలకల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద మంగళవారం సాయంత్రం పీలేరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ కాలేజ్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు పీలేరు సమీ పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్కి వెళ్తుంటారు. రోజూ మాదిరిగానే ఉదయం విద్యార్థులు వ్యాన్లో కాలేజ్కి వెళ్లారు. తిరిగి సాయంత్రం వ్యాన్లో వస్తుండగా టీటీడీ కల్యాణ మండపం వద్దకు రాగానే వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్లో కూర్చున్న మండలంలోని నెల్లిమందపల్లెకు చెందిన యువరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుట్కా ప్యాకెట్ల స్వాధీనం గుడిపాల: మండలంలో అక్రమంగా తరలుతున్న 16 గుట్కా ప్యాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. గుడిపాల మండలం, బొమ్మసముద్రం క్రాస్కు చెందిన సురేష్, మంజునాఽథ్, కిరణ్ మంగళవారం ఆటోలో చిత్తూరు నుంచి బొమ్మసముద్రంకు గట్కా ప్యాకెట్లు తీసుకొస్తున్నట్టు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో నరహరిపేట క్రాస్ నుంచి పశుమంద క్రాస్ మధ్యలో తనిఖీ చేయగా వారు పట్టుబడ్డారన్నారు. వీరిని విచారించగా బొమ్మసముద్రంలో చిల్లర అంగడికి తీసుకువెళ్తున్నట్టు చెప్పారన్నారు. ఇందులో 16 గుట్కా ప్యాకెట్ల బస్తాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి విలువ సుమారు రూ.1,80,000 ఉంటుందన్నారు. దీనిపై సేల్స్ట్యాక్స్ అధికారులకు నివేదికలు పంపినట్టు వెల్లడించారు. ఒంటరి ఏనుగు హల్చల్ చంద్రగిరి: మండలంలోని ఎగువ కూచివారిపల్లిలో సోమవారం అర్ధరాత్రి ఒంటరి ఏనుగు స్థ్వైర్య విహారం చేసింది. అరటి, వరి పంటలతోపాటు ఫెన్సింగ్ రాళ్లు, మోటార్లను ధ్వంసం చేసింది. నెల రోజులుగా ఏనుగు పొలాలపై దాడులు చేస్తుండటంతో సర్వం కోల్పోతున్నా మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు చేప ట్టి, గజదాడులను అడ్డుకోవాలని కోరుతున్నారు. నలుగురిపై క్రిమినల్ కేసులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆడిటర్ మహ్మద్రియాజ్ ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. నగరంలోని మండీ వీధిలో ఉన్న వక్ఫ్ భూము లు ఆక్రమించి, తప్పుడు పత్రాలతో విక్రయించారని, ఇందులో నలుగురు వ్యక్తులు మోసాల కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్కె.హుస్సేన్, ఎస్.సత్రాజ్, ఎస్.ఫరీదా, బి.సుజాతపై వన్టౌన్ సీఐ మహేశ్వర కేసు నమోదు చేశారు. కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం వెంకటగిరి రూరల్: ఏపీ జోన్–4 పరిధిలో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఏపీ మోడల్ స్కూల్ ద్వారా ఐఐటీ, జేఈఈ, ఈఏపీ సెట్ కోచింగ్కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసిజ్యోతి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏపీ జోన్–4 పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసిన వంద మంది బాలురకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
నైపుణ్యాలే కీలకం
– అపోలోలో రాష్ట్ర స్థాయి ఎన్ఆర్పీ వర్క్షాప్ ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం ): నవజాత శిశువుల అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని ది అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.వినోద్భట్ పేర్కొన్నారు. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో, అరగొండ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సహకారంతో నిర్వహిస్తున్న బేసిక్ నియోనేటల్ రీసస్సిటేషన్ ప్రోగ్రామ్ (ఎన్ఆర్పీ) రాష్ట్ర స్థాయి రెండు రోజుల వర్క్షాప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలల నుంచి అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ హెచ్.వినోద్ భట్ మాట్లాడుతూం నవజాత శిశువుల ప్రాణరక్షణలో వైద్య సిబ్బంది సమయోచిత నిర్ణయాలు, సరైన నైపుణ్యాలు అత్యంత కీలకమన్నారు. ఈ కార్యక్రమానికి ఎపీఎన్ఎంసీ అబ్జర్వర్గా కె.ఎన్.సత్యనారాయణబాయి హాజరయ్యారు. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.జయంతి స్వాగత ఉపన్యాసం చేశారు. వర్క్షాప్నకు రిసోర్స్ పర్సన్స్గా నేఐఎంఎస్ఆర్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ రాజేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గ్నానవేల్, తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మైలా గీత పాల్గొని శిక్షణ అందించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్, ప్రీ–టెస్ట్ నిర్వహించి, అనంతరం శాసీ్త్రయ సెషన్లు, స్కిల్ స్టేషన్ల ద్వారా శిక్షణ అందించారు. పాల్గొన్న వారిని చిన్న గ్రూపులుగా విభజించి నిర్వహించిన హ్యాండ్స్–ఆన్ ట్రైనింగ్ ఈ వర్క్షాప్ ప్రత్యేకతగా నిలిచింది. కార్యక్రమంలో ఏఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె అగస్టీన్, నర్సింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జింటో మాథ్యూ, అధ్యాపకులు, రాష్ట్రంలోని వివిధ నర్సింగ్ కళాశాలల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 35 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 35 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదుపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. -
బ్లాక్లో గ్యాస్!
ఓటీపీలు లేకుండానే బుకింగ్లు ● ఒక్క రోజులోనే 270 కనెక్షన్లు బ్లాక్లో అమ్మకం ● గుడిపాల మండలంలో భారీ కుంభకోణం మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026యుద్ధం సాకుగా చూపి గ్యాస్ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన సిలిండర్లను ఏకంగా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నాయి. ఓటీపీలు లేకుండానే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు రికార్డులు సృష్టిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ విచారణ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి టాస్క్ఫోర్స్: వంట గ్యాస్ సరఫరాలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. వినియోగదారుల మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాకుండానే గ్యాస్ సిలిండర్లు బుకింగ్లు చేసి, వాటిని బ్లాక్ మార్కెట్కు మళ్లించినట్టు తేలింది. ఈ వ్యవహారం గుడిపాల మండలంలో బయటపడింది. దీనిపై సాక్షి దినపత్రికలో మూడు రోజులకు క్రితం ‘బ్లాక్ బండ’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై లోతుగా విచారణకు దిగిన పౌరసరఫరాల శాఖ అధికారులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఒక్క రోజుల్లోనే 270 కనెక్షన్లకు ఓటీపీ లేకుండా మంగళం పాడారనే విషయం తేటతెల్లమైంది. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. త్వరలో ఓ ఏజెన్సీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటీపీ లేకుండా బుకింగ్లా? సాధారణంగా గ్యాస్ బుకింగ్ సమయంలో వినియోగదారుడి రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ పంపడం తప్పనిసరి. ఆ ఓటీపీ ద్వారా బుకింగ్ను ధ్రువీకరిస్తారు. కానీ గుడిపాలలో ఈ ప్రక్రియను పూర్తిగా పక్కనబెట్టి, పెద్ద ఎత్తున బుకింగ్లు జరిగినట్టు సమాచారం. ఇది సిస్టమ్లో లోపమా? లేక ఉద్దేశపూర్వక మోసమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘సాక్షి’ కథనంతో కదలిక ఈ అక్రమంపై ‘సాక్షి’లో కథనం వెలువడిన వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత వినియోగదారులను సంప్రదిస్తూ, వారి గ్యాస్ బుకింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సాంకేతికంగా ఎలా బుకింగ్లు జరిగాయో తెలుసుకునేందుకు లోతైన విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం సంబంధిత గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు? గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిని కాపాడాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఒక ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పకుండా తప్పుడు నివేదిక పంపించాలని ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భయం, అనుమానాలు ఈ ఘటన తర్వాత స్థానిక గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ కనెక్షన్ సురక్షితంగా ఉందా? తమ పేరుతో ఎన్ని బుకింగ్లు జరిగాయి? సబ్సిడీ దుర్వినియోగం జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ అక్రమంపై పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయా? లేక రాజకీయ ఒత్తిళ్లతో వ్యవహారం మరుగున పడుతుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. గుడిపాల గ్యాస్ కుంభకోణం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రోజులోనే 270 కనెక్షన్లు? మార్చి 23న ఒక్క రోజులోనే దాదాపు 270 మంది వినియోగదారుల గ్యాస్ కనెక్షన్లపై ఓటీపీ లేకుండా బుకింగ్లు జరిగినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇందులో చాలామంది వినియోగదారులు తమకు గ్యాస్ బుక్ అయ్యిందన్న విషయమే తెలియకపోవడం గమనార్హం. ఈ బుకింగ్ల వెనుక ప్రధాన ఉద్దేశం సబ్సిడీ గ్యాస్ను దారి మళ్లించడమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా వినియోగదారులకు ఇవ్వాల్సిన సిలిండర్లను అక్రమంగా విక్రయించి, అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
పేదరిక నిర్మూలనే ధ్యేయం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పేదరిక నిర్మూలనకు నడుం బిగించాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీ4 వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమం చేపట్టిందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 12 శాతం కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయన్నారు. ఉపాధి లేకపోవడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విద్యాలోపాలు ఈ కుటుంబాల వెనుకుబాటుకు ప్రధాన కారణాలని చెప్పారు. ఈ కుటుంబాలను అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు. బెంగుళూరుకు చెందిన ఒక సంస్థ 100 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించిందన్నారు. ఎన్ఆర్ఐ సంస్థలు పాఠశాలలను దత్తత తీసుకోవడం వంటి అంశాలను కొనియాడారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలు కనీసం 50 నుంచి 200 కుటుంబాలను దత్తత తీసుకుని మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. -
వేడుకోలు!
చిత్తూరు కలెక్టరేట్ : శ్రీఅయ్యా న్యాయం చేయండిశ్రీ అంటూ అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించా రు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఇతర అధికారులు ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు. కోర్టు ధికారం కోర్టు ధిక్కారానికి పాల్పడి భూ కబ్జాకు పాల్పడుతున్నారని యాదమరి మండలం, దాసరపల్లెకు చెందిన బాధితురాలు ఎస్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తమ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ తమ భూమిని రాజన్ అనే వ్యక్తి తన భూమిగా దొంగ పేపర్లతో పట్టా పొందాడన్నారు. వాస్తవానికి అతను కొనుగోలు చేసిన భూమి కేవలం 10కి 15 అడుగులు మాత్రమేనన్నారు. అయితే తమ 6 సెంట్ల భూమి ని చూపించి 2.1/4 సెంట్లుగా పట్టా పొందాడన్నారు. తమకు న్యాయం చేయాలని గత ఏడాది ఏప్రిల్లో తహసీల్దార్ను కోరా మన్నారు. ఆ సమయంలో ఇది ప్రభుత్వం ఇచ్చిన పట్టా, దీనిని రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పారన్నారు. అయినప్పటికీ గత ఏడాది మే 9వ తేదీన శ్యామల, కుమార్ అనే వ్యక్తులు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తమ భూమిని సక్రమంగా సర్వే చేసి ఇవ్వాలని అడిగితే, మండల సర్వేయర్ తులసిధర్, వీఆర్వో సురేష్ సర్వే చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. ప్లాట్లు 1, 2, 3 సర్వే చేయమని కోరినా సర్వే చేయలేదన్నారు. తమ సమస్యకు మొత్తం కారణం వీఆర్వో షర్మిల అని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక -
ఎన్నికల కమిషన్పై నమ్మకం లేదు
కార్వేటినగరం : గత ఎన్నికల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్పై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం లేదని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సోమవారం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కల్యాణ మండపంలో నియోజవర్గ స్థాయి బూత్ కమిటీ కన్వీనర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల వరకు 50 శాతం ఉన్న పోలింగ్ అమాంతంగా పెరిగి 2 సెకన్లకు ఒక ఓటు ఎలా వేశారో ప్రజల్లో ఇప్పటికీ సందేహం ఉందన్నారు. సుప్రీంకోర్టు కల్పించుకుని 2024 ఎన్నికల తీరును, అధికారుల వ్యవహార శైలికి సంబంధించిన నివేదికలు తెప్పించుకుందని గుర్తుచేశారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎవ్వరిని అడిగినా తాము జగనన్నకు ఓటు వేశామంటూ చెబుతున్నారని, ప్రజలు వేసిన ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా 5 వేల ఓట్లు లోపే సుమారు 35 శాతం మంది గెలిచినట్లు గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి పొరబాట్లు, నిర్లక్ష్యం, అజాగ్రత్తగా ఉండకూడదని సూచించారు. జగనన్న నవరత్నాలే ఎన్నికల ఆయుధం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు మేనిఫెస్టోలుగా పెడుతున్నాయని చెప్పారు. జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షమాన్ని పక్కన పెట్టి అమరావతి, పోలవరం పేరుతో దోచుకుంటోందని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అయితే రాజధాని ముసుగులో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను ఉపేక్షించేది లేదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో సమానంగా ముందుకు సాగాలన్నదే తమ ధ్యేయమన్నారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గతంలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుమ్మెత్తి పోసిన కూటమి నేతలు నేడు సంపద సృష్టి అంటూ అప్పులను సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్తో పేరుతో అట్టర్ ప్లాప్షో చూపిస్తోందని విమర్శించారు. -
ఆంక్షల అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం ఆర్భా టంగా ప్రకటించిన విద్యాహక్కుచట్టం (ఆర్టీఈ) అమలులో పెను అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. లాటరీలో సీటు దక్కిందని సంతోషించిన నిరుపేద కుటుంబాలు, ప్రైవేట్ పాఠశాలల గుమ్మం తొక్కగానే తీవ్ర నిరాశకు లోనవుతున్నాయి. యాజమాన్యాలు పేద కుటుంబాల నుంచి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు, పుస్తకాల యూనిఫాం, ఇతర మౌలిక సదుపాయాలు అంటూ రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీనిపై కొందరు తల్లిదండ్రులు ఎంఈవో కార్యాలయల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తున్నా ఏమాత్రం న్యాయం జరగడం లేదు. వేధింపులకు సరికొత్త మార్గాలు సర్టిఫికెట్ల సమర్పణలో చిన్నపాటి వ్యత్యాసాలను కూడా సాకుగా చూపుతూ ప్రవేశాలను నిరాకరిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి నివాస ధ్రువీకరణ పత్రాల కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. విద్యుత్ బిల్లులు, ఆధార్ కార్డు వివరాలు సరిపోవడం లేదని కొర్రీలు పెడుతున్నారు. ‘సమాచారం అందలేదు’ అనే సాకు కూడా వాడుతున్నారు. చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అడ్మిషన్లు దక్కక.. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 296 మంది విద్యార్థులు లాటరీ ద్వారా ఆర్టీఈ కింద ఎంపికయ్యారు. ఫోన్లకు మెసేజ్లు రావడంతో ఆనందంతో స్కూళ్లకు వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ‘మాకు ప్రభు త్వం నుంచి ఎలాంటి లిస్టు రాలేద్ఙు, పోర్టల్ పని చేయడం లేదు’ అంటూ సాకులు చెబుతూ అడ్మిషన్లను కాలయాపన చేస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీతో గడువు ముగుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరిష్కార మార్గాలు అధికారుల బాధ్యత జిల్లా సమాచారం ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు 161 విద్యార్థులు 30,804 ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలు 85 విద్యార్థులు 13,040 ఉన్నత పాఠశాలలు 185 విద్యార్థులు 45,532 మొత్తం ప్రైవేట్ పాఠశాలలు 431 మొత్తం విద్యార్థుల సంఖ్య 89,376 హెచ్చరికలు నామమాత్రమే విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా, క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు కొన్ని పాఠశాలలకు నోటీసులు ఇచ్చినా, యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. ‘మా పిల్లలకు మంచి చదువు దొరుకుతుందని ఆశించాం, కానీ ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. విద్యాశాఖ అధికారులు మాకు న్యాయం చేయాలి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోగా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, యాజమాన్యాల మొండివైఖరి వల్ల పేద విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. -
పారా ఫెన్సింగ్లో కాంస్య పతకం
ఐరాల: జాతీయ స్థాయి పారా ఫెన్సింగ్ పోటీ ల్లో మండలంలోని కాకర్లవారిపల్లెకు చెందిన విద్యార్థి గురుప్రసాద్ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినట్లు ఫెన్సింగ్ కోచ్ రాఘవకార్తీక్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహించిన జాతీయ స్థాయి పారా ఫెన్సింగ్లో చిత్తూ రు నగరం విజయం జూనియర్ కళాశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి గురుప్రసాద్ పాల్గొన్నట్టు తెలిపారు. అక్కడ ప్రతిభ చూపి కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు చెప్పారు. కాణిపాకం జెడ్పీ హైస్కూల్లో పారా ఫెన్సింగ్కు శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో పతకం సాధించడం జిల్లాకు గర్వకారణమని తెలిపా రు. ఈ సందర్భంగా గురుప్రసాద్ను జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, కోచ్, తల్లిదండ్రులు, విజ యం కళాశాల యాజమాన్యం అభినందించారు. గంజాయి స్వాధీనం : నలుగురి అరెస్టు పాకాల : అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని సీఐ చినగోవిందు సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఆదివారం వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ తన సిబ్బందితో పాకాల మండల పరిధిలోని కుందేటివారిపల్లి, శంకంపల్లి రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు అనుమానాస్పద ప్రవర్తన కలిగిన నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఒక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో తిరుపతి మంచాల వీధికి చెందిన పూజారి ముని, లింగేశ్వర్ నగర్కు చెందిన ముల్లతంటి రాకేష్, తాతయ్యగుంటకు చెందిన సింగనమల్లి సునీల్కుమార్, అక్కనగారి వెంకటసాయి ఉన్నారని తెలిపారు. వీరు తిరుపతికి చెందిన జనార్దన్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందని అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిందితులపై సీఐ చినగోవిందు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ తరుణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్ఈ సీటుపై ఆ ఇద్దరి కన్ను?
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, కార్పొరేట్ కార్యాలయ సీజీఎం కృష్ణారెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. తదుపరి ఇద్దరు ఈఈలకు ఎస్ఈలుగా పదోన్నతి లభించనుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా ఎస్ఈ స్థానంపై వారిద్దరూ ముందుగానే కన్నేశారు. ఒకరు ప్రస్తుతం చిత్తూరులో పనిచేస్తుండగా, మరొకరు తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరికి చిత్తూరులో పనిచేసిన అనుభవంతో పాటు జిల్లాపై పట్టు ఉంది. దీనికి తోడు అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేశారు. ఇక ఆలస్యం చేయకుండా ఎస్ఈ సీటుపై వారు కర్చీఫ్ వేశారు. వారి స్థాయిలో ఎమ్మెల్యేల వద్ద లెటర్లు తెచ్చుకుని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక ఈఈ జిల్లాలోని ఎమ్మెల్యేల వద్ద లెటర్ ప్యాడ్ సిఫార్సులతో అధికారులకు సమర్పించినట్టు సమాచారం. మరో ఈఈ తనకు తిరుపతి జిల్లాలోని ఓ ఎమ్మెల్యేతో ఉన్న సాన్నిహిత్యం, చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ కుటుంబ సభ్యులతో పరిచయాలను ఇందుకోసం వాడుతున్నట్టు తెలిసింది. గతంలో తిరుపతి కేంద్రంగా ట్రాన్స్కో పాలన సాగేది. సర్కిల్ విభజన జరిగాక 2024 అక్టోబరులో చిత్తూరుకు ఎస్ఈ పోస్టుతోపాటు ఇతర విభాగాల పోస్టులు, కార్యాలయాన్ని కేటాయించారు. అప్పట్లో ఈ పోస్టుకు పలువురు పోటీపడ్డారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయన దృష్టిలో పడాలని ప్రయత్నించారు. అన్యూహంగా పోటీలో లేని ఇస్మాయిల్ అహ్మద్ జిల్లా మొదటి ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన పదవీ కాలం 17 నెలల్లో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడమే తప్ప ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించినట్టు ఎక్కడా ఆరోపణలు లేవు. ఆయన పదవీ కాలం మార్చి 31న ముగియనుండడంతో ఆ స్థానంలో చేరడానికి ఇద్దరు ఈఈలు పోటీ పడుతున్నారు. ఇద్దరులో ఒకరు వస్తారా..? లేదా అనుకోని అధికారిని నియమిస్తారా..? అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం -
చదరంగంలో చిత్తూరు చిచ్చర పిడుగులు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులో ఆదివారం జిల్లా స్థాయి అండర్ 7, అండర్ 9 చదరంగం పోటీలు నిర్వహించారు. ఇందులో చిత్తూరుకు చెందిన చిన్నారులు కార్తికేయ, ఆదిత్య, అర్జున్, దర్షిత్, నివృత, నాగతన్విత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఆర్.బీ ప్రసాద్ రాష్ట్ర స్థాయి విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించారు. అండర్ 7 విజేతలు కార్తికేయ, ఆదిత్య ఏప్రిల్ 4, 5 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే అండర్ –9 విజేతలు అర్జున్, దర్షిత్, నివృత, నాగతన్విత ఏప్రిల్ 18, 19 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వారిని అభినందించారు. ఎస్.ఆర్ దినేష్, ఆర్బిటర్ మల్లికార్జున, సునీల్, సాయి, నెహార్, తస్లీమ్ పాల్గొన్నారు. మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు గంగవరం: మండలంలో ఆదివారం ఒక దుండగుడు మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధిత మహిళ కథనం మేరకు.. మండలంలోని కీలపట్ల పంచాయతీ గాంధీనగర్కు చెందిన లక్ష్మి, ఆమె భర్త బావి దగ్గర నివాసం ఉంటున్నారు. ఆమె ఆదివారం తాగునీరు తెచ్చుకునేందుకు వ్యవసాయ బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో బైక్పై వచ్చిన దుండగుడు దాహంగా ఉందని నీరు ఇవ్వాలని మహిళను అడిగాడు. నీరు తాగుతున్న సమయంలో మహిళ మెడలో చైన్ లాక్కున్నేందుకు ప్రయత్నించాడు. ఆమె నిలువరించి గట్టిగా పట్టుకోవడంతో చైన్ తెగిపోయి సగ భాగం దుండుగుడు తీసుకుని వెళ్లిపోయాడు. చైన్ ధర సుమారు రూ.40 వేలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. ఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీవారి దర్శనానికి 08 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,040 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,606 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.18 కోట్లు లభించాయి. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
25 వేల గృహాలకు సోలార్ విద్యుత్ లక్ష్యం
– ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటి రేణిగుంట: ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏప్రిల్ 14వ తేదీ లోగా 25 వేల గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తోలేటి పేర్కొన్నారు. రేణిగుంట పారిశ్రామికవాడలో సోలార్ పరికరాల గోడౌన్ను ఆదివారం సీఎండీ శివశంకర్ లోతేటి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ ఆమర్చేందుకు సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఏప్రిల్ 4 నుంచి 14 వరకు ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీసూర్యఘర్ ఉత్సవ్శ్రీ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ముగిసేలోగా సంస్థ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎస్సీ,ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను అమర్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, ఇప్పటికే సంబంధిత ఏజెన్సీలను ఆదేశించామన్నారు. సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటి) పి. అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్ వి.విజయన్, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిన్న రెడ్డప్ప, బాలాజీ, గంగాధర్ రెడ్డి , రేణిగుంట సెక్షన్ ఏడీ రమేష్, ఏఈ పుణ్య కోటి తదితరులు పాల్గొన్నారు. -
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ కనిపించింది. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దర్శనం కోసం క్యూ లైన్లు పొడవుగా ఏర్పడగా, గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించారు. భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. మొత్తానికి భారీ రద్దీ ఉన్నప్పటికీ అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో భక్తులు సజావుగా దర్శనం చేసుకున్నారు. -
ప్రభుత్వ పథకాలకు దిక్సూచి జనగణన
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పథకాలకు దిక్సూచి జనగణన అని డీఆర్వో మోహన్కుమార్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్ను, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈనెల 27న ప్రారంభమైన మొదటి విడత శిక్షణలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియపై రెండు బ్యాచ్లుగా ట్రైనర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఈ ప్రక్రియ సమగ్రతను గుర్తించాలన్నారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన మౌలిక, సామాజిక వివరాలను పక్కాగా సేకరిస్తేనే భవిష్యత్లో ప్రభుత్వ పథకాల రూపకల్పన జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన ట్రైనర్లు తమ మండలాలకు వెళ్లి ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు ఇదే నాణ్యతతో శిక్షణ ఇచ్చి, సమాచార సేకరణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. మాస్టర్ ట్రైనర్ డాక్టర్ హేమలత, డైట్ కళాశాల ప్రతినిధి మునిచంద్ర, ఇతర ట్రైనర్లు పాల్గొన్నారు. -
నిరంతర వ్యాయామంతో ఆరోగ్యం
ఏర్పేడు: వ్యాయామం దినచర్యగా మార్చుకుని ప్రతిరోజూ వ్యాయామ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ శశిధర్గుమ్మా తెలిపారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఆదివారం ఉద యం ఐఐటీ క్రీడా విభాగం, ఫిట్నెస్ క్లబ్తో కలిసి ‘టైకా’ సహకారంతో 3వ ’5కే ఫిట్నెస్ ఫ్యూజన్ క్యాంపస్ రన్’ను నిర్వహించారు. తిరుపతి ఐఐటీ, ఐసర్ విద్యార్థులతో పాటు తిరుపతి, నాయుడుపేట, నెల్లూరు, కడప, చిత్తూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 250 మంది 5కే రన్ పోటీల్లో పాల్గొన్నారు. డీన్ ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా జెండా ఊపి 5కే ఫిట్నెస్ ఫ్యూజన్ క్యాంపస్ రన్’ను ప్రారంభించారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతులు, పతకాలను ఐఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.పి.కృష్ణకుమార్, క్రీడా సలహాదారు డాక్టర్ ఎస్.ఉదయకుమార్, ఐఐటీ స్పోర్ట్స్ అధికారి అయ్యప్పన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ క్రీడా అధికారి డాక్టర్ అయ్యప్పన్, జూనియర్ క్రీడా అధికారులు టి.శ్రీధర్ రెడ్డి, ఎం.పవన్, ఫిట్నెస్ క్లబ్ సమన్వయకర్త జాషువా డేనియల్ పాల్గొన్నారు. మహిళలు– పురుషుల విభాగంలో మొదటి మూడు స్థానాలలో నిలిచింది వీరే మహిళల విభాగం 1.మయూరి(నాయుడుపేట 6వ తరగతి విద్యార్థిని) (మొదటి స్థానం) 2.నాగేశ్వరి(రెండవ స్థానం) 3. నిత్య(మూడవ స్థానం) పురుషుల విభాగం 1.విఽ.ధనుష్ (నల్గొండ జిల్లా ముకుందపురం) (మొదటి స్థానం) 2. సికిందర్ (రెండవ స్థానం) 3. ఎల్. శివరాజ్ (మూడవ స్థానం) -
సర్పంచ్ లకు‘చెక్’
చిత్తూరు కార్పొరేషన్: పల్లెపాలనపై కూటమి ప్రభు త్వం మొదటి నుంచి విషం కక్కుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పట్ల చులకనగా వ్యవహరిస్తోంది. వారికి గౌరవం, వేతనం ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతోంది. సమావేశాలలో అధికారికంగా ప్రాధాన్యత ఇవ్వకుండా వేధిస్తోంది. గ్రామసభలలో కూటమి నేతలు చెప్పిన పనులనే మంజూరు చేస్తోంది. నామమాత్రానికే పదవులో ఉన్న వారిని మరింత అవమానపరుస్తూ చెక్ పవర్ను రద్దు చేసింది. ఏప్రిల్ 2వ తేదీతో వారి పదవీ కాలం ముగియనుంది. ఇటీవల చెక్ పవర్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విమర్శలకు తావిస్తోంది. గడువుకన్నా ముందే..! సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నా ఇంతవరకు ఎన్నికలు జరపని ప్రభుత్వం.. వారి చేతుల్లో ఉన్న పవర్ను మాత్రం గడువు కన్నా ముందే లాగేసింది. పదవీ కాలం ముగిసే సమయంలో పాలక వర్గాలు, పంచాయతీ అధికారులు కలిసి వృథా ఖర్చులు చేస్తారనే వంకతో చెక్ పవర్కు ఆంక్షలు విధించింది. అలాగే పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించి, తమ కనుసన్నల్లోనే చంద్రబాబు సర్కార్ పాలన సాగించనుంది. ఇప్పుడున్న సర్పంచులలో 90 శాతం మందికి పైగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా అవమానం జిల్లాలో మొత్తం 697 గ్రామ పంచాయతీలు ఉండగా.. జిల్లాల విభజన అనంతరం చిత్తూరు జిల్లా పరిధిలోకి 621 పంచాయతీలు వచ్చాయి. ఏప్రిల్ 2న పంచా యతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సంఘం నిధులకు సైతం నిబంధనలు పెట్టారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభు త్వం ఆంక్షలు పెట్టడమేంటని పలువురు గళం విప్పా రు. దీన్ని సర్దిపుచ్చుకోవడానికి ఆంక్షలను ఎత్తివేశారు. పలు పల్లెల్లో సర్పంచులు సొంత డబ్బులు రూ.లక్షలు ఖర్చు పెట్టి వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. తీరా ఇప్పుడు ఆ పనులకు డబ్బులు తీసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయ డంతో వారు మండిపడుతున్నారు. మార్చి నెలఖరు కావడంతో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి మరీ ఇంటి పన్నులు వసూలు చేయడంతో గ్రామ పంచాయతీలకు పుష్కలంగా నిధులు సమకూరుతున్నాయి. అయినప్పటికీ చేసిన ఖర్చులకు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ) ఆమోదించాలి. సర్పంచ్ సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే నేరుగా ట్రెజరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు డీడీవో లాగిన్కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులను పరిశీలించి థంబ్ వేస్తేనే ట్రెజరీకి చేరుతుంది. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో) చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా కార్యదర్శులు, సర్పంచులతో కుమ్మకై ్క నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. ఇంజినీరింగ్ అధికారులు ఎం.బుక్ నమోదు చేసిన తర్వాత కూడా అనుమానంతో బిల్లులు చెల్లింపులకు ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. -
రంగులపై రణం
ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతం నగరి. ఇక్కడ పవర్ లూమ్స్తోపాటు చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు సంతోషంగా సాగుతున్న వారి జీవితాలను రంగులు నాశనం చేస్తున్నాయి. తమిళనాడులో నిషేధానికి గురైన నూలు డైయింగ్ యూనిట్లు నగరి పట్టణంలో ఏర్పాటయ్యాయి. వాటి నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు భూమిలో కలిసిపోయి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ విషయం తెలిసినా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పట్టణ వాసులు రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతలపట్టెడలో నీటి పారుదల కాలువలో రసాయన నీరునిరుపయోగంగా ఉన్న ఈటీపీ ప్లాంటు నగరి : నగరిలో ఉన్న నేత పరిశ్రమకు అనుబంధంగా డైయింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ రాను రాను ఉత్పత్తి తగ్గిపోవడంతో పనిలేక డైయింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఇదే సమయంలో తమిళనాడులో నిషేధానికి గురైన అత్యధిక సామ ర్థ్యం కలిగిన డైయింగ్ యూనిట్ల వారు సరిహద్దులో ఉన్న నగరిపై కన్నేశారు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వారికి బాగా కలిసి వచ్చింది. అనుమతికి మించి సామర్థ్యం ఉన్న యూనిట్లను ఏర్పాటుచేశారు. ప్రస్తు తం 18 మిషన్ డైయింగ్ యూనిట్లు, 22 మాన్యువల్ డైయింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇవి స్థానిక పరిశ్రమల అవసరాలకంటే అనేక రెట్లు ఎక్కువ సామ ర్థ్యం కలిగినవి. వీటిలో 90 శాతం వరకు తమిళనాడుకు చెందిన ఉత్పత్తుల కోసమే పనిచేస్తున్నాయి. ఈ అంశాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ కౌన్సిల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నగరి పట్టణంలో రసాయనాలు వదలి సిద్ధం చేసే నూలు ఇక్కడి నుంచి సేలం, ఈ రోడ్డు వరకు సరఫరా అవుతున్నట్టు పేర్కొన్నారు. కొరవడిన పర్యవేక్షణ డైయింగ్ యూనిట్లకు అనుమతులు ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆపై అవి నిబంధనలను తుంగలో తొక్కుతున్నా అణువంతైనా చలించడం లేదు. దశాబ్దాల తరబడి నివాసాల మధ్య హాని కలిగించే యూనిట్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ చేపట్టిన తనిఖీలో తేలిన పలు అంశాలను కూడా పీసీబీ అధికారులు గుర్తించిన దాఖలాలు లేవు. ప్రజలకు హాని కలుగుతున్నా, పర్యావరణం పాడైపోతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయా యూనిట్ల నుంచి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుండడంతో ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడంలో విఫలమౌతోంది. డైయింగ్ యూనిట్లను సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం.. అందుకు స్థలం చూపించి శంకుస్థాపన కూడా చేశాం అని చెబుతున్నా ఆచరణలో అమలుకావడం లేదు. స్వచ్ఛత కనుమరుగు లక్షల లీటర్ల రసాయన నీరు డైయింగ్ యూనిట్ల నుంచి బయటకు వస్తుండడంతో భూగర్భ జలాలు తాగడానికి అనువుకానివిగా మారాయి. దీనికితోడు డైయింగ్ యూనిట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండడంతో నగరిలోని భూగర్భ జలాలు స్నానానికి కూడా వీలుకాని విధంగా మారిపోయాయి. ఇప్పటికే పలువురు చర్మ, కిడ్నీ సమస్యలతోపాటు క్యాన్సర్, వెంట్రుకలు రాలిపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. తమిళనాడులో నిషేధించిన డైయింగ్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఎందుకు అనుమతి ఇచ్చా రన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడు లేడు. బీటీఎం వీధిలో కాలువల్లో పారుతున్న రసాయన నీరు మూతపడిన ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటు మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన రంగునీటిని శుద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటును ఏర్పాటుచేశారు. దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్లాంటు విద్యుత్ బకాయిలను చెల్లించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు. యూనిట్ల వారు మళ్లీ విద్యుత్ బకాయిలు పెట్టడం, నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మూతబడింది. దాన్ని మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఆ ప్లాంటుకు హానికర రసాయన నీటిని పంపే మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నిర్వాహకులు నీటిని కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ నీరు భూమిలోకి ఇంకిపోవడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆ నీటిని తాగుతున్న స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. నగరిలో విచ్ఛలవిడిగా డైయింగ్ యూనిట్లు ఊపందుకుంటున్న రసాయన వ్యతిరేక పోరాటం రసాయన ప్రమాదాన్ని ఇంకా ఎంతకాలం భరించాలంటూ నగరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ సమితి పేరిట ఇప్పటికే నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. పలువురు అధికారులకు వినతిపత్రాలు అందించారు. మరోవైపు ప్రజలు కూడా అధికారులను నిలదీస్తున్నారు. ఇటీవల ఏకాంబరకుప్పంలో డైయింగ్ యూనిట్ల పరిశీలనకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్, అధికారులను స్థానికులు చుట్టుముట్టారు. బోర్ల నుంచి పలు రంగుల్లో నీరు వస్తోందని, దాన్ని ఎలా తాగాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు ఉద్యమ రూపం దాల్చి ఉద్ధృతం కాకమునుపే సమస్య పరిష్కారానికి అధికారులు చొరవచూపాల్సిన అవసరం ఉంది. -
రైతు బజార్
నిరుపయోగంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేసింది. వారి సౌకర్యం కోసం పలు పనులు చేపట్టింది. అవి ఎంతో ఉపయోగపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పలమనేరులో నిర్మించిన రైతు బజార్ను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. రూ.లక్షలతో నిర్మించిన గదులు నిరుపయోగంగా మారాయి. రైతు బజార్ను వినియోగంలోకి తీసుకువస్తే జగన్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోందని స్థానికులు అంటున్నారు. మాకు దుకాణాలు ఇవ్వండి వందలాది మంది రైతులు కూరగాయలను ప్రతి రోజూ పలమనేరు మార్కెట్కు తీసుకువచ్చి వ్యాపారులకు కమీషన్ ఇచ్చి అమ్ముకోవాల్సి వస్తోంది. రైతు బజార్లో దుకాణాలను రైతులకు ఇస్తే నేరుగా కూరగాయలు అమ్ముకుంటారు. తద్వారా వ్యాపారులకు ఇచ్చే కమీషన్ మిగులుతుంది. గిట్టుబాటు ధర అందుతుంది. ప్రజలకు తాజా కూరగాయలు లభిస్తాయి. దీనిపై అధికారులు ఆలోచించాలి. – అమరనాథ రెడ్డి, రైతు, కంచిరెడ్డిపల్లి పలమనేరు: గత ప్రభుత్వంలో పలమనేరు పట్టణంలోని వారపు సంతలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో రైతు బజార్ను నిర్మించారు. ఇందులో 16 గదులను ఏర్పాటుచేశారు. అందులో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీన్ని గత ఏడాది మార్చి 8వ తేదీన స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రారంభించారు. సమావేశంలో మాట్లాడుతూ ఇందులో రైతులు, వ్యాపారులు, మహిళా సమాఖ్య సభ్యులు కూరగాయల దుకాణాలు పెట్టుకోవచ్చని చెప్పారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. రైతు బజార్లో వ్యాపారాలు కొనసాగిస్తే వైఎస్.జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి కనిపిస్తుందని కూటమి నాయకులు భావించారు. అందులో భాగంగా దాన్ని ప్రాంభించి వదిలేశారు. ఇక్కడ వ్యాపారాలు చేసేందుకు వ్యాపారులు, రైతుల ముందుకు రావడం లేదనే మాటను అధికారుల ద్వారా చెప్పిస్తున్నారు. మాకు రోడ్లపైనే వ్యాపారం బాగా సాగుతోందని కొందరు, మాకు దుకాణాలకు అవకాశం ఇవ్వలేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని రైతు బజార్ను వినియోగంలోకి తీసుకువస్తే వ్యాపారాలు చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వ్యాపారులు చెబుతున్నారు. బాగా సాగుతున్న వారపు సంత రైతు బజార్ను నిర్మించిన చోటే వారపు సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ సంతలో 300లకు పైగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. పట్టణ వాసులు వారానికోసారి సంతకు వచ్చి అవసరమైన కూరగాయలు, సరుకులు తీసుకు వెళుతున్నారు. సంతకొస్తున్న జనం రైతు బజార్కు ఎందుకు రారనే ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు దినసరి మార్కెట్ను దక్కించుకున్న వ్యాపారులు సైతం రైతు బజార్ రాకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏది ఏమైనా మున్సిపల్, మార్కెటింగ్ శాఖ అధికారులు తగిన చొరవచూపి రైతు బజార్ను వినియోగంలోకి తీసుకువచ్చి అక్కడ వ్యాపారాలు జరిగేలా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ప్లాట్ఫామ్లపై 50 దుకాణాలు పట్టణంలోని వారపు సంత, మున్సిపల్ ఆఫీసు, గంగమ్మ గుడి వీధి, చర్చి పక్కన, సూపర్ బజార్ వద్ద దాదాపు 50 మంది చిరువ్యాపారులు ప్లాట్ ఫామ్పైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. వీరిని రైతు బజార్కు పంపితే అక్కడ వ్యాపారాలు జరుగుతాయి. అధికారులు రైతు బజార్ను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారాలు అక్కడికి వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. -
బేరాలే లేవమ్మా..!
కుదేలైన మామిడి వ్యాపారం క్యూలో నిరీక్షిస్తున్న భక్తులుచిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. తోటలన్నీ పండ్లతో నిండిపోయాయి. రైతు ముఖంలో మాత్రం ఆనందం కనిపించడం లేదు. ఇందుకు ముందస్తు మామి డి వ్యాపారం సాగకపోవడమే. సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులు తోటలను పరిశీలించి ఒప్పందాలు కుదుర్చుకునేవారు. రైతులకు ఇది పెద్ద భరోసాగా ఉండేది. పంట చేతికి రాకముందే కొంత డబ్బు చేతికి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్థానిక వ్యాపారులతో పాటు తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పరదరామి, గుడియాత్తం, తిరుత్తణి, క్రిష్ణగిరి తదితర ప్రాంతాలకు చెందిన కొనుగోలుదారులు కూడా వ్యాపారానికి దూరంగా ఉండడం రైతులకు పెద్ద దెబ్బగా మారింది. ధరలు పడిపోవడమే కారణం వ్యాపారులు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం గత ఏడాది జరిగిన చేదు అనుభవమే. గత సీజన్లో మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మార్కెట్లో సరఫరా ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేశారు. ఫ్యాక్టరీలు కాయలను కొనుగోలు చేయడానికి ము ఖం చాటేశాయి. రైతులు కాయలను బలవంతంగా ఫ్యాక్టరీలకు అంటగట్టారు. వారు కొనుగోలుకు ముందుకు కావడంతో కాయలను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలను రోడ్ల పాలు చేశారు. చాలామంది రైతులు అప్పుల పాలయ్యారు. ఈ నష్టాలను చూసిన వ్యాపారులు ఈ సారి ముందస్తు కొనుగోళ్లకు పూర్తిగా వెనక్కు తగ్గారు. ఈ సారి ప్రశ్నార్థకమే ఈ ఏడాది పరిస్థితి మరింత క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తోతాపురి 40,024 హెక్టార్లకు గాను 4,83,981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. అలాగే బేనీషా 6,856 హెక్టార్లకు 42,242 టన్నులు, కాదర్ 2,702 హెక్టార్లకు 18,834 టన్నులు, నీలం 5,178 హెక్టార్లకు 42,242 టన్నులు, మల్లిక 1,349 హెక్టార్లకు 10,444 టన్నులు, ఇతర రకం 3,217 హెక్టార్లకు 23,509 టన్నుల దిగుబడి ఉండవచ్చునని ముందస్తుగా గుర్తించారు. మొత్తంగా 59,326 హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా సుమారు 6,21,252 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా మే నెల నుంచి కోతలు మొదలు కానున్నాయి. ఆసక్తి చూపని ఫ్యాక్టరీలు గతంలో పండ్లు అమ్ముడుపోకపోయినా మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు రైతులకు కొంత ఉపశమనం కలిగించేవి. ఈ సారి అవి కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, ఎగుమతుల మందగమనం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో రైతులకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. పంట చేతికి వచ్చేసరికి అమ్మకం ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. ముందస్తు బేరాలు లేవు. కొనుగోలుదారులు కనిపించడం లేదు. ధరలపై స్పష్టత లేదు. తోటల నిర్వహణ ఖర్చులు, కార్మికుల వ్యయం కలిపి రైతులపై భారంగా మారుతున్నాయి. ‘‘పండ్లు ఉన్నాయి.. కానీ కొనేవారు లేరు’’ అన్న పరిస్థితి రైతులను తీవ్ర నిరాశలోకి నెడుతోంది. ప్రభుత్వం పట్టించుకోకుంటే అంతే సంగతులు ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర ప్రకటించడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, మామిడి పల్ప్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వ డం, ఎగుమతులకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. లేకపోతే గత ఏడాది లాగే ఈసారి కూడా భారీ నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. పంట వస్తుందో.. లేదో.. వస్తే గిట్టుబాటు ధరలు పలుకుతాయో లేదో అన్న మీమాంశ అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా మామిడి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. ఒకప్పుడు మామిడి సీజన్ ప్రారంభంలోనే తోటల వద్ద వ్యాపారుల సందడి కనిపించేది. ముందస్తు బేరాలు సాగేవి. రైతులకు లక్షల్లో అడ్వాన్సులు అందేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మామిడి తోటల ముందస్తు వ్యాపారం సాగడం లేదు. తోటల వద్దకు వచ్చే వ్యాపారులు కనిపించడం లేదు. ‘బేరాలే లేవమ్మా’ అన్న రైతుల మాటల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మహిళపై దాడి కేసులో నిందితుల అరెస్టు
తవణంపల్లె: అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి మహిళపై దాడి చేసి హత్య చేయడానికి యత్నించిన కేసులో ఇద్దరు మహిళా నిందితులను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తవణంపల్లె ఇన్చార్జి ఎస్ఐ నరసింహులు తెలి పారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ గురువారం ఇంటిలో ఉండగా అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలు వచ్చారు. రాళ్లు, ఇనుప కమ్మీ లతో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరు మహిళల ను శనివారం కె.పట్నం ఓవర్ బ్రిడ్జి దగ్గర అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఆవును కాపాడబోయి అనంత లోకాలకు.. పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండలంలో శనివారం ఆవును కాపాడే క్రమంలో రైతులు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఎగువ పాలకూరు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య(60) పాడి ఆవులను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటిలాగే శనివారం తన గోసంపదను మేతకు తీసుకుని గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి అక్కడికి వెళ్లాడు. అక్కడ ఒక ఆవు కనిపించకపోవడంతో వెతికడం మొదలుపెట్టాడు. రాత్రి అయినా కుటుంబ పెద్ద ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రామకృష్ణయ్య గ్రామంలోని చెరువు సమీపంలో కనిపించినట్టు ఒక వ్యక్తి చెప్పడంతో అక్కడికి వెళ్లి గాలించారు. చెరువులో నీటిపై తేలుతున్న మృతదేహం కనిపించింది. పరిశీలించగా రామకృష్ణయ్య గా గుర్తించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి కార్వేటినగరం : మండలంలోని ముక్కరవానిపల్లెలో శనివారం సాయంత్రం వైఎస్సార్ సీపీ నాయకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. స్థానికుల కథనం మేరకు.. ముక్కరవానిపల్లికి చెందిన మురళీకృష్ణారెడ్డికి, తిరుమల రెడ్డికి భూ వివాదం ఉంది. గతంలో గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు సరిహద్దు రాళ్లు నాటి వివాదాన్ని పరిష్కరించారు. దీంతో మురళీకృష్ణారెడ్డి ఆ స్థలానికి పెన్సింగ్ వేసుకున్నాడు. తిరుమలరెడ్డి శనివారం పెన్సింగ్ను తొలగించాడు. దీంతో మురళీకృష్ణారెడ్డి, తిరుమల రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్ద లు, టీడీపీ కార్యకర్తలు రచ్చబండ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమలరెడ్డి రెచ్చిపో యి మురళీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. బాధితుడు మురళీకృష్ణారెడ్డి కార్వేటినగరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,526 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.45 కోట్లు వచ్చాయి. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని తెలిపారు. -
● కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ● నిరంతర నిఘా ఉండాలి ● స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటల పహారా ● ఈవీఎం గోడౌన్ ఆకస్మిక తనిఖీ
ఈవీఎంల భద్రతపై రాజీపడొద్దు చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల భద్రతలో ఎలాంటి రాజీ పడొద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన శనివారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) రక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదన్నారు. అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ యంత్రాల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గోడౌన్ పరిసరాల్లో సీసీ కెమెరాల పనితీరును నిత్యం తనిఖీ చేయాలన్నారు. 24 గంటల నిఘా వ్యవస్థ కొనసాగేలా చర్యలు చేపటాలన్నారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎంల నిల్వ, భద్రతపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేంద్ర, ఎన్నికల విభాగం సిబ్బంది ఉమాపతి, మనోజ్కుమార్, పార్టీల ప్రతినిధులు ఉదయ్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, గంగరాజు, పరదేశి తదితరులు పాల్గొన్నారు. చట్టబద్దంగానే భూముల విక్రయంచిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని థియోసాఫికల్ సంస్థకు చెందిన భూములను సొసైటీ నిబంధనలకు లోబడి.. చట్టబద్దంగానే విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు ప్రదీప్, సభ్యులు కృష్ణ, షిండే, నారాయణన్, సన త్, త్రివేది శనివారం చిత్తూరులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ ఉచిత విద్య, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తాజాగా ఉచిత వైద్యం అందిచడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చిత్తూరులోని భూములను సొసైటీ నిబంధనల మేరకు విక్రయించామన్నారు. కొందరు వ్యక్తులు దీనిపై లేనిపోని అసత్య ప్రచారం చేస్తున్నారని.. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. ఇక్కడి భూములపై సర్వాధికారాలు సొసైటీకి ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. భూముల విక్రయంపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు. -
నారాయాణాచార్యులుకు నివాళి
చిత్తూరు అర్బన్: సరస్వతి పుత్రులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పుట్టపర్తి నారాయణాచార్యులుకు చిత్తూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నారాయాణాచార్యుల జయంతి నేపథ్యంలో శనివారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటం ఏర్పాటుచేసి ఎస్పీ తుషార్డూడీ పూలమాల లు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహితీ కారుల్లో అగ్రగణ్యుడైన నారాయాణాచార్యులు 15 భాషల్లో పాండిత్యాన్ని పొందడం అద్బుతమని కొనియాడారు. తెలుగు సాహితీ రంగ అభివృద్ధికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. ఏఎస్పీ రాజశేఖర్రాజు, సీఐలు మనోహర్, ఉమామహేశ్వరన్, కృష్ణమోహన్ తదితరులు నారాయాణాచార్యులుకు నివాళులర్పించారు. -
ఘనంగా వైఎస్సార్ టీయూసీ ఆవిర్భావ వేడుకలు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ టీయూసీ 15వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాన్బాషా, నగర అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఘగర్ ఫ్యాక్టరీ బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. జగనన్న పాలనలో రూ.108 కోట్లు చెల్లించినట్టు గుర్తు చేశారు. అప్పట్లో పలు పథకాల ద్వారా కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూరినట్టు వివరించారు. ప్రస్తుతం సంక్షేమం అనే మాట వినిపించడం లేదన్నారు. శ్రామికుల కష్టాలను పట్టించుకునే వారు లేరని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు మధురెడ్డి, అంజలిరెడ్డి, నౌషద్, సీతాపతి, వెంకటేష్, శివ, సురేష్, నవాజ్, వెంకటరమణ పాల్గొన్నారు. -
సమన్వయంతోనే అభివృద్ధి
చిత్తూరు కలెక్టరేట్ : ఆహార శుద్ధి రంగం అభివృద్ధికి సమన్వయం అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్గా రెండోసారి ఎన్నికై న కట్టమంచి బాబీని శనివారం కలెక్టర్ సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేసేందుకు పరిశ్రమలు, రైతుల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్టాత్మకమైన ఏఐఎఫ్పీఏ సౌత్ జోన్ చైర్మన్గా రెండోసారి ఎంపిక కావడం చిత్తూరు జిల్లాకు గర్వకారణమన్నారు. చిత్తూరు జిల్లాలో పండుతున్న మామిడి, టమాట వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెరగాలన్నారు. ఇందుకు అసోసియేషన్ చురుకై న పాత్ర పోషించాలని సూచించారు. రైతులు పండించిన పంటను నేరుగా పరిశ్రమలకు విక్రయించేలా ఒక వ్యవస్థను రూపొందించాలని కోరారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ సభ్యులకు, అభినందించిన కలెక్టర్కు కట్టమంచి బాబి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆహార శుద్ధి పరిశ్రమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జిల్లాలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తలుపులపల్లి బాబురెడ్డి, శివకుమార్, శివారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తండ్రి ఒడిలోనే కూతురు మృతి
బంగారుపాళెం: మండలంలోని పాలమాకులపల్లె వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. బెంగళూరులోని సింగసంద్రలో ఉంటున్న దాపు శ్రీధర్ కుమార్(46), అతని భార్య లక్ష్మి(42), కుమారై అధ్విక(3)తో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు ముందు సీటులో శ్రీధర్కుమార్ తన కుమార్తె అధ్వికను ఒడిలో కూర్చుని పెట్టుకున్నాడు. భార్య లక్ష్మీ వెనుక సీటులో కూర్చుంది. కారు బస్సు కిందకు దూసుకెళ్లినప్పుడు తండ్రి ఒడిలో చిన్నారి మృతి చెందిన దృశ్యం చూసిన ప్రయాణికులు, స్థానికుల కంట తడిపెట్టారు. ఆ దేవుడైనా కనికరించలేదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ పాలమాకులపల్లె వద్ద హైవేపై ప్రమాదం చోటు చేసుకోవడంతో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సుమారు రెండు గంటలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇది మూడో ప్రమాదం పాలమాకులపల్లె వద్ద హైవేపై ఇది మూడో ప్రమాదమని స్థానికులు, వాహనదారులు తెలిపారు. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే పల్లెవెలుగు బస్సులు పాలమాకులపల్లె వద్ద సర్వీసు రోడ్డు వీదుగా వెళ్లాల్సి ఉందని, డ్రైవర్లు బస్సులను హైవేపై నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత నెల ఇక్కడే ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు గాయపడినట్లు చెప్పారు. అంతకు మునుపు ఆర్టీసీ బస్సు కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. హైవేపై బస్సులు ఆపితే చర్యలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు హైవేపై ప్రయాణికులను ఎక్కించుకో వడం, దింపడం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యానికి కూడా చెప్పాం. బస్సులను సర్వేసు రోడ్డులోనే నడపాలి. బస్సులను హైవేలో నిలపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. – పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ -
పారదర్శక ఓటరు జాబితానే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 15,78,617 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటరు నమోదులో అగ్రస్థానం ఓటరు నమోదు, దరఖాస్తుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా చేర్చే ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందన్నారు. నగరిలో పెండింగ్లో ఉన్న 35 ఫారమ్స్కు అనుమతి కోరుతూ సీఈవో కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. మరణించిన వారు, బోగస్ ఓటర్ల పేర్లను తొలగించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఇందుకు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏ) నియమించుకోవాలని చెప్పారు. వారు బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ జాబితాలోని తప్పులను సరిదిద్దాలని సూచించారు. పారదర్శకంగా ప్రక్షాళన జిల్లాలోని 1,776 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటరు జాబితా ప్రక్షాళన పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బీఎల్వోలు ఇప్పటికే 76 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారన్నారు. రాజకీయ పార్టీలు వాస్తవాలను తెలియజేస్తే మరింత పక్కాగా జాబితాను సిద్ధం చేయవచ్చన్నారు. డీఆర్వో మోహన్కుమార్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్, సురేంద్ర, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, గంగరాజు పాల్గొన్నారు. -
మంచి చేశాం.. ఎవ్వరికీ భయపడొద్దు
నగరి : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ మంచి చేశామని, నేడు మరో పార్టీ అధికారంలో ఉందని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా తెలిపారు. ఆమె శనివారం తన నివాస కార్యాల యం వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. మరోవైపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఓటర్ల సవరణకు ఎస్ఐఆర్ ఐదు విడతల్లో చేపట్టినట్టు తెలిపారు. బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించకుండా, అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు చేర్చకుండా చూడాలని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారిని ఎప్పటికప్పుడు ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. మరణించిన వారి ఓట్లను తొలగింపులోను శ్రద్ధ చూపాలన్నారు. ఇతర ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఇక్కడ కూడా ఓట్లు ఉన్నవారిని గుర్తించాలన్నారు. మనం అధికారంలో ఉన్నంతకాలం అందరికీ మంచి చేశామని, ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. మీకు నేను అండగా నిలబడతానని, నాకు జగనన్న అండగా ఉంటారని, అందరమూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంలో బూత్ కమిటీ సభ్యులు కీలకమని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇది మన పని అన్న భావనతో బీఎల్వోలు పనిచేయాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అందరికీ మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ బినామీల పేరుతో 90 పైసలకే భూములు ఇస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలనూ గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర బూత్ కమిటీ మేనేజర్ భరత్, తిరుపతి, చిత్తూరు జిల్లాల బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ఓటర్ల చేర్పు, తొలగింపు, ఎస్ఐఆర్పై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ గాంధీ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన బూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతున్న మాజీమంత్రి ఆర్కేరోజా -
వ్యాపారంగా ప్రణయ బంధం! నేటి తరం యువతీ యువకులు పెళ్లిని వ్యాపారంగా మార్చేశారు. పెళ్లితో ఆర్థికంగా పైకి ఎదగాలని భావిస్తున్నారు.
ఈవీఎంల భద్రతపై రాజీపడొద్దు ఈవీఎంల భద్రతపై రాజీ పడొద్దని కలెక్టర్ తెలిపారు. ఆయన ఈవీఎంల గోడౌన్ను తనిఖీ చేశారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు మే 31 వరకు ఐపీఎల్ మ్యాచ్లు ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026పలమనేరు: దేశంలో ఐపీఎల్ సీజన్ మొదలైంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగులు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెట్టింగు ముఠాలు రంగంలోకి దిగాయి. కొంచెం పెట్టుబడి పెడితే ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు లక్షాధికారులవుతారని ఆశలు పెంచాయి. దీనికితోడు సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో కొంతమంది అప్పులు చేసి మరీ బెట్టింగుల రొచ్చులోకి దిగుతున్నారు. ప్రస్తు తం బెట్టింగులు మూడు రకాలుగా జరుగుతున్నా యి. కొంతమంది కలిసి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా బెట్టింగులు చేస్తున్నారు. ఇంకొందరు రహస్య ప్రదేశాల్లో ఉంటూ మ్యాచ్లు మొదలైనప్పటి నుంచి గ్రూపుల్లోని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు డార్క్నెట్ సాయంతో పనిచేసే ఆఫ్లైన్ యాప్లను వాడుతున్నారు. ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసిన రాయలపేటకు చెందిన చంద్రబాబు @radha.exchenge@ ఆఫ్లైన్ ద్వారా రూ.కోట్లు మోసాలకు పాల్పడిన విషయం సంచలనం కలిగించింది. క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే చర్యలు బెట్టింగుల జోరు! దేశంలో ఐపీఎల్–2026 సీజన్ ప్రారంభమైంది. అప్పుడే యువకులు.. క్రికెట్ అభిమానులు తమ అభిమాన జట్టు గెలుస్తుందంటే.. తమదే గెలుస్తుందని పేర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన బెట్టింగులు నేడు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని మారుమూల గ్రామాలకు సైతం చేరాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఉద్యోగులు, యువకులు, కొంతమంది విద్యార్థులు సైతం ఈ రొంపిలోకి దిగుతున్నారు. సర్వస్వం కోల్పోయి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగుల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. చిత్తూరు అర్బన్: ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ తుషార్డూడి హెచ్చరించారు. క్రికెట్ను ఒక ఆటగానే పరిగణించాలని, అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని బెట్టింగులకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నా రని తెలిపారు. ఎక్కడైనా బెట్టింగులు నిర్వహిస్తే ఫోన్–112, వాట్సాప్ 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు క్రికెట్ బెట్టింగుల కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది ఏమైనా బెట్టింగుల కారణంగా యువకులు జీవితాలను నాశనం చేసుకుని తల్లిదండ్రులకు కడుపు కోతతోపాటు మనోవ్యథను కలిగిస్తున్నారు. చాలామంది యువకులు బైక్లను, ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలను అమ్ముకుంటున్నారు. అదీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలామంది బెట్టింగులను ఓ వ్యసనంలా మార్చుకున్నారు. బెట్టింగులపై ప్రత్యేక నిఘా ఉంచాం క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులపై ఇప్పటికే నిఘా ఉంచాం. బెట్టింగుల్లో బాధితులుగా మారిన వారి ద్వారా కీలక సమాచారాన్ని తెలుసుకుని బెట్టింగు ముఠాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎవరైనా బెట్టింగులకు పాల్పడుతుంటే 100 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలి. – డేగల ప్రభాకర్, డీఎస్పీ, పలమనేరు -
కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు
ఉష్ణోగ్రతలతోపాటు విద్యుత్ వాడకం పెరగడంతో లోడును తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటికి ట్రాన్స్కో సిబ్బంది సకాలంలో మరమ్మతులు చేయడం లేదు. దీంతో పంటలకు నీరు అందించలేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,650 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మార్చిలో ఎండలు పెరగడంతో ఇప్పటికి 600లకు పైగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని సొంత ఖర్చులతో తీసుకువచ్చినా సకాలంలో రిపేర్లు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్: చిత్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 25/63/100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు, పట్టణ ప్రాంతాల్లో 100/160/250 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తున్నారు. అవి కాలిపోతే మరమ్మతుల కోసం సగటున కేవీఏకు రూ.200 చొప్పున ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యానికి తగిన మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రూ.15 వేల నుంచి రూ.20 వేలు ట్రాన్స్కో ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్లో కాలిపోయిన వైండింగ్ స్థానంలో కొత్త వైండింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆయిల్ను ఫిల్టర్ చేసి వేస్తారు. ఒక్కోసారి పూర్తి వైండింగ్ కాలిపోతే ఖర్చు అధికమవుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్లకు ఐదేళ్ల వారంటీ ఉంటుండగా, కాలిపోయిన వాటికి మరమ్మతులు చేసిన తర్వాత ఆరు నెలల గ్యారెంటీ పిరియడ్ ఉంటుంది. గ్యారెంటీ పిరియడ్ లేని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పూర్తి వ్యయం ట్రాన్స్కో భరించాల్సి ఉంటుంది. జిల్లాలో 1650 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వాటిలో 15 కేవీఏ సామ ర్థ్యం గలవి 116 ట్రాన్స్ఫార్మర్లు, 16 కేవీఎ సామర్థ్యం ఉన్నవి 673, 25 కేవీఏవి 751 ఉన్నాయి. చిత్తూరు, కార్వేటినగరం, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ రోలింగ్ స్టాక్ సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు ఇక్కడికి తీసుకుస్తారు. రైతులకు రోలింగ్ స్టాక్లో నుంచి ట్రాన్స్ఫార్మర్ అందజేసి తదుపరి మరమ్మతులు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ఇవ్వాలి. నగరానికి సంబంధించిన ట్రాన్స్పార్మర్ను ఒక రోజు, గ్రామాలకు చెందిన వాటిని రెండు రోజుల్లో మరమ్మతు చేయాలి. వీటికి ఎలాంటి పైకం తీసుకోకూడదు. ట్రాన్స్కో వాహనం ద్వారా రవాణా చేస్తామని ప్రతి ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం) వద్ద నోటీసు బోర్డులో రాసి ఉంటుంది. అది రాతలకు మాత్రమే పరిమితమైంది. రోజూ పదుల సంఖ్యలో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను రైతులు సొంత వాహనాల్లో సంబంధిత కేంద్రాలకు తీసుకువస్తున్నారు. వాటిని తొందరగా రిపేర్లు చేయాలంటే చేయి తపడాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమయానికి ట్రాన్స్ఫార్మర్లు రాక పంటలకు నీరు పెట్టలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో రిపేర్లు చేయాలి ఎండా కాలంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేయాలి. మరమ్మతు కేంద్రాల్లో రోలింగ్ స్టాక్ను సిద్ధంగా పెట్టుకోవాలి. రైతులు తమ వాహనాలతో కేంద్రాల వద్దకు వస్తున్నారు. సేవలకు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమస్యల పై ఫిర్యాదు చేయండి. – ఇస్మాయిల్అహ్మద్, ఎస్ఈ ట్రాన్స్కో -
పూతలపట్టు పంచాయతీకి కాసుల పంట
– వేలం పాటలో రూ.25 లక్షలు ఆదాయం పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు పంచా యతీకి కాసుల పంట పండింది. వారపు సంత, వాణిజ్య సముదాయాలకు వేలం పాటల ద్వారా రూ.25,03,700ల ఆదాయం లభించింది. పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి మాట్లా డుతూ సర్పంచ్ మాసిలామణి ఆధ్వర్యంలో శనివారం వేలం పాటలు నిర్వహించినట్టు తెలిపారు. పంచాయతీకి భారీ ఆదాయం రావడం శుభపరిణామమన్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర సౌకర్యాల కోసం ఖర్చు చేస్తామని వివరించారు. ప్రశాంతంగా బయాలజీ పరీక్ష చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా శనివారం బయాలజీ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 129 పరీక్ష కేంద్రాల్లో 22,128 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 21,853 మంది హాజరయ్యారని, 275 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 52 పరీక్ష కేంద్రాలను డీఈవో 4, అసిస్టెంట్ కమిషనర్ 6, ఫ్లయింగ్ స్క్వాడ్ 11 మంది పరిశీలించినట్టు పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ 96 కేంద్రాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా బయాలజీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈవో వెల్లడించారు. సెలవుపై వెళ్లిన చిత్తూరు డీఎస్పీ చిత్తూరు అర్బన్: చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ శనివారం నుంచి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో రెండు నెలలు విధులకు సెలవు పెట్టారు. డీటీసీ లేదా పలమనేరు డీఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు నగరి డీఎస్పీ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న డీఎస్పీల బదిలీల్లో చిత్తూరు జిల్లాకు నూతన డీఎస్పీలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటికప్పుడే ఎల్ఆర్ఎస్ అనుమతులు చిత్తూరు అర్బన్: అన్ని పత్రాలు ఉంటే ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) అనుమతులను అప్పటికప్పుడే ఇస్తామని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు ఏసీపీ నాగేంద్రతో కలిసి చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి పత్రాలు మంజూరు చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న యజమానులు సరైన పత్రాలను సకాలంలో కార్పొరేషన్ అధికారులకు అందజేయాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నామని, దీని వల్ల స్థలాల యజమానులకు మేలు చేకూరుతుందన్నారు. లైసెన్సుడు ఇంజినీర్లు సైతం దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ఫైళ్లు త్వరగా పరిష్కారమవడానికి సహకరించాలని సూచించారు. -
బ్లాక్ బండ..!
బ్లాక్ మార్కెట్కు గ్యాస్ సిలిండర్లు తిరుపతి సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 ఉన్నాయి. గత 20 రోజులుగా జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సరఫరాకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. ఆలయాలు, ట్రస్టులు, హాస్టళ్లు, ఆస్పత్రులు తదితరాలకు గ్యాస్ సరఫరాకు మినహాయింపు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు దొరక్క పలు హోటళ్లు మూతపడ్డాయి. పలుకుబడి ఉన్న హోటళ్లకు మాత్రం సిలిండర్లు బ్లాక్లో తరలుతున్నాయి. చిరు వ్యాపారాలకు మాత్రం మొండి చేయి మిగిలింది. గ్యాస్ బ్లాక్ పేరిట బహిరంగ దోపిడీ గ్యాస్ బ్లాక్ పేరుతో ఒక్క సిలిండర్కు రూ.2,000 వర కు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. అధికారిక ధరలు ఒకవైపు ఉండగా, బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ జరుగుతున్నట్టు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొందరు ఏజెన్సీలు పూర్తిగా పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సరఫరా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుని కావాల్సిన వారికి మాత్ర మే సిలిండర్లు అందజేస్తూ మిగతా వారిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు చెల్లించే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ చిన్న వ్యాపారులను పక్కన పెట్టేస్తున్నారని బాధితులు అంటున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆల యాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్లు పెట్టుకుని బ్లాక్లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని అధికారులు దొంగ బుకింగ్ల దందా ... ఈ గందరగోళంలో మరింత సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల పేర్లతో అక్రమంగా బుకింగ్లు చేసి గ్యాస్ సిలిండర్లను మళ్లిస్తున్నలు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుడిపాల ప్రాంతంలో ఈ దొంగ బుకింగ్ల వ్యవహారం భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. వినియోగదారులకు తెలియకుండానే వారి పేర్లతో బుకింగ్లు నమోదు చేసి, గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది జిల్లాలో పెద్ద స్కామ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే ‘‘జంపింగ్’’ పేరుతో ఏజెన్సీలు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒక ఏజెన్సీ నుంచి మరొక దానికి బాధ్యతలు మళ్లిస్తూ సమస్య నుంచి తప్పించుకుంటున్నాయని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో గ్యాస్ బ్లాక్ మయమవుతోంది. కొందరు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇరాన్– ఇజ్రాయేల్ యుద్ధ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గ్యాస్ కొరతను చూపిస్తూ అక్రమాలకు తెరలేపారు. ఓటీపీలకు మంగళం పాడి.. దొంగచాటు బుకింగ్లు మొదలు పెట్టారు. బండ వ్యాపారంగా మార్చుకుని కాసులు దండుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక మొత్తానికి విక్రయిస్తున్నారు. తమకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినట్టు వచ్చిన మెసేజ్లను చూసిన వినియోగదారులు ఇలా ఎందుకు వచ్చిందని ఏజెన్సీలను నిలదీయడంతో జంపింగ్ మెసేజ్లు వస్తున్నాయని మభ్యపెడుతున్నారు. సామాన్య వినియోగదారులను తిప్పలు పెడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పౌర సరఫరాల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొందరు అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫార్సుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రమేనని పలువురు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఈ గ్యాస్ గందరగోళంపై అధికారులు ఇప్పటికై నా స్పందిస్తారా..? అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
జన్యుపరమైన వ్యాధులపై అవగాహన
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ది అపోలో యూనివర్సిటీ వీసీ హెచ్.వినోద్ భట్ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరం మురకంబట్టుంలోని ది అపోలో యూనివర్సిటీ, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – రీసెర్చ్ (ఎఐఎంఎస్ఆర్), ప్యాకల్టీ రీసెర్చ్ ఫోరం సంయుక్తంగా చేపట్టిన డౌన్ సిండ్రోమ్ అవేర్నెస్ డే, క్లినికల్ సైటోజెనెటిక్స్ వర్క్షాప్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణలో ఆధునిక వైద్య విధానాలు కీలకమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనాటమీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సుభద్ర దేవి వెలిచేటి మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్కు సంబంధించిన డేటా సేకరణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. మన దేశంలో నమోదైన కేసులు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్యు నిర్ధారణ సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తల్లిదండ్రులు, సంరక్షకుల కోసం రూపొందించిన పేరెంట్ గైడ్ను విడుదల చేశారు. వర్క్షాప్లో భాగంగా నిర్వహించిన క్లినికల్ సైటోజెనెటిక్స్ సెషన్లో అకాడమిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.జీవన్ కుమార్ జన్యు నిర్ధారణ పద్ధతులు, రోగి సంరక్షణలో వాటి ప్రాముఖ్యతపై వివరించారు. -
మూల్యాంకనంపై సాంకేతిక నిఘా!
చిత్తూరు కలెక్టరేట్ : ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధునాతన సాంకేతి కతతో పహారా చేపట్టనున్నారు. అజాగ్రత్తగా జవా బు పత్రాలు దిద్దినా, మార్కుల్లో తేడాలు వచ్చి నా దిద్దుబాటు చర్యలతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం ప్రారంభంకా నుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఈవో రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్నారు. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఇలా.. స్పాట్ వాల్యుయేషన్కు సంబంధించి 1400 మంది నిపుణులైన సిబ్బందిని నియమించారు. ఇందులో 200 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 800 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 400 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉంటారు. చిత్తూరులోని పీసీఆర్ ఉన్నత పాఠశాలలో 25కి పైగా తరగతి గదులను సిద్ధం చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా వాల్యుయేషన్ ప్రక్రి య కొనసాగుతుంది. సుమారు 7 జిల్లాల నుంచి వచ్చే 7 సబ్జెక్టులకు సంబంధించిన 2 లక్షల సమాఽ దాన పత్రాలను ఇక్కడ దిద్దనున్నారు. ఒక్కో ఉపాఽ ద్యాయుడికి రోజుకు 40 పేపర్ల చొప్పున కేటాయించనున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనాల్టీల మోత ఈసారి మూల్యాంకనంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపాధ్యాయులకు జరిమానా తప్పదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తీర్ణత కాని విద్యార్థిని ఉత్తీర్ణత అయినట్లు చూపించినా (1 నుంచి 5 మార్కుల తేడా వచ్చినా), చీఫ్ ఎగ్జామినర్కు రూ.4 వేలు, సహాయ ఎగ్జామినర్కు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తారు. మార్కు ల లెక్కింపులో పెరిగే ప్రతి అదనపు మార్కును బట్టి జరిమానా మొత్తం కూడా పెరుగుతుంది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఉపాధ్యా యులను అప్రమత్తం చేస్తున్నారు. సాంకేతికతతో తప్పులకు చెక్ గతంలోలా కాకుండా ఈ సారి మూల్యాంకనంలో అత్యాధునిక సాంకేతికతను అమలు చేయనున్నా రు. మార్కులను నేరుగా ట్యాబ్లలో నమోదు చేయడం వల్ల మానవ తప్పిదాలకు తావుండదని అధికారులు చెబుతున్నారు. ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసే ప్రక్రియను ప్రవేశపెట్టడం వల్ల డేటా సేకరణలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. మార్కుల నమోదు, పునః పరిశీలన, పునః లెక్కింపు దశల్లో ఎక్కడా లోపాలు జరగకుండా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నేరుగా పర్యవేక్షించనున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
వేసవి క్రీడాశిబిరాల నిర్వహణకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం వెలికితీసేలా జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేస వి సెలవుల్లో ఉల్లాసంగా గడిపేలా క్రీడా శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఈ సారి ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, క్రీడా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా సంఘాల నిర్వాహకులతో పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, వ్యాయామ టీచర్లు, కోచ్లు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎనిమిది నుంచి 14 ఏళ్ల బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసేందుకు అన్ని క్రీడా విభాగాల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ముమ్మరంగా ప్రైవేట్ బస్సుల తనిఖీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): మార్కాపురం రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. శుక్రవారం కూడా తనిఖీలను కొనసాగించారు. ఇకపై సరిహద్దులో విధిగా తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టారు. పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖల అధికారులు బృందంగా ఏర్పడి నరిహరిపేట, పలమనేరులో ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టెస్టులు, పత్రాల తనిఖీ, సేఫ్టీ ప్రమాణాలు, నిబంధనలను అనుసరిస్తున్నారా లేదా అని చూస్తున్నారు. ఇలా ఒక్కరోజులోనే 170 ప్రైవే ట్ బస్సులను తనిఖీ చేశారు. రవాణా నియమాలు పాటించని వాటిపై 20 కేసులు నమో దు చేసి, రూ.13 లక్షల వరకు జరిమానా విధించినట్లు డీటీసీ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 65,600 మంది స్వామి ని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకూ న్యా యం చేస్తామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ కుప్పం సమన్వయకర్త భరత్ తెలిపా రు. ఆయన శుక్రవారం కుప్పంలోని పార్టీ కార్యాలయంలో గుడుపల్లె నాయకులతో సమావేశమయ్యారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ న మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సారి నాయకులు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పలుమార్లు తెలిపారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలేసి వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేయడంపైనే దృష్టి పెట్టిందని దుయ్య బట్టారు. కూటమి నేతలు అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామని, కక్ష సాధింపులకు పాల్పడితే రిటర్న్ గిప్టులు తప్ప వని హెచ్చరించారు. అనంతరం గుడు పల్లె మండల మహిళా అధ్యక్షురాలిగా మణిమేఘలకు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణ, జెడ్పీటీసీ కృష్ణమూర్తి, చెండ్రాయన్, సంపంగి, అన్ని పంచాయతీల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
నీతి తప్పిన దస్త్రం
చిత్తూరు కార్పొరేషన్: అనాదిగా వస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అప్పుడప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని క్రయ విక్రయదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ అక్రమాలకు వేదికగా మారిందని, వీటిపై కలెక్టర్, ఏసీబీ దృష్టి పెట్టాలని గత నెలలో ‘సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవి నీతి జలగలు’ అన్న శీర్షికన సాక్షి దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. సీఎంవో కార్యాలయం ఆరా తీసిన విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు స్పందించిన అధికారులు తనిఖీలు చేశారు. అందులో లెక్కలో చూపని మొత్తం రూ.1,12,730 స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత తనిఖీలు ఏసీబీ అధికారులు చిత్తూరు జిల్లా కేంద్రంలో తనిఖీలు చేసి దాదాపు పదేళ్లు అవుతోంది. 2016 సెప్టెంబర్, 2018 నవంబరులో సోదా లు నిర్వహించారు. తదుపరి 8 ఏళ్ల తర్వాత తిరిగి తనిఖీలు చేపట్టారు. ఇన్నేళ్లు గ్యాప్ ఇవ్వకుండా అప్పుడప్పుడు సోదాలు నిర్వహిస్తుంటే రైటర్లు, అధికారుల్లో భయం ఉంటుందని, ఇలా చిత్తూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు చెబుతున్నారు. చేయి తడిపితేనే ఫైల్ ముందుకు మాకేమీ లేదు.. రైటర్లు ఇచ్చింది తీసుకుంటాం.. అని సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది చెబుతూ ఉంటారు. వాస్తవానికి రైటర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకుండా అక్కడ ఏ పని జరగదనేది బహిరంగ రహస్యం. ఉద్యోగులు ఉదయం విధుల్లోకి వచ్చినప్పుడు ఎంత నగదు తెచ్చారు.. సాయంత్రం విధులు ముగించేటప్పుడు ఎంత నగదు ఖర్చు చేశారు అన్న వివరాలను క్యాష్ బుక్లో నమోదు చేయాలి. జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఈసీ, సీసీ మొదలు స్టాంప్ పేపర్, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్, ఈ–కేవైసీ ఇలా ప్రతి దాంట్లోనూ చేయి తడపనిదే పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. సొసైటీ, అసోసియేషన్స్, ఫర్మ్స్ పనులు కూడా సకాలంలో కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జిలే దిక్కు చిత్తూరు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్చార్జిలే దిక్కుగా మారారు. నాలుగేళ్ల క్రితం సబ్ రిజిస్ట్రార్గా ఉన్న రహంతుల్లా బదిలీ అయి నప్పటి నుంచి ఇన్చార్జిలతోనే నడిపిస్తున్నారు. రెండేళ్ల క్రితం రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్గా అశోక్ ఉద్యోగ విరమణ ముందు బాధ్యతలు తీసుకుని సెలవుపై వెళ్లారు. తదుపరి ఇన్చార్జిలతోనే పాలన సాగింది. ఇటీవల కర్నూలు జిల్లా నుంచి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్గా వచ్చిన ఆయన మరో మూడు నెలల తర్వాత ఉద్యోగ విరమణ చేయనున్నారు. రైటర్లు, ఫోర్జరీ ముఠా, కార్యాలయ ఖర్చులంటేనే భయపడిపోతున్నామని కొందరు అధికారులు చెప్పుకుంటున్నారు. చిత్తూరులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సాక్షిలో ప్రచురితమైన కథనం కీలకంగా మారిన రైటర్లు ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కీలకం. రిజిస్ట్రేషన్ చేసుకుంటే గాని ఆ భూమి లేదా స్థలం, ఆస్తులపై పూర్తి స్థాయిలో హక్కు లభించదు. ఈ క్రమంలో కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కానిచ్చేస్తున్నారు. అధికారులు పనిని బట్టి రేటు మాట్లాడుకుని అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇందులో చిత్తూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ముందు వరుసలో ఉన్నారు. రైటర్ల అండతో హవా సాగిస్తున్నారు. చేయి తడపనిదే దస్త్రం కదలడం లేదు. స్లాంపు పడడం లేదు. పైసలు ఇస్తే కలెక్టర్ కార్యాలయాన్ని సైతం అమ్మేస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఏసీబీ అధికారులు చిత్తూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేసిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రైటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిందే వేదంగా మారింది. అన్నీపోనూ మాకేమీ మిగలదు రోజువారీ కూలీ తప్ప అని రైటర్లు చెప్పుకోవడం అలవాటుగా మారింది. నిజానికి రైటర్ గా రాకముందు.. ఆ తర్వాత వారి ఆస్తులు, వారి జీవన విధానాన్ని పరిశీలిస్తే రూ.వేల నుంచి లక్షలు, కోట్లకు ఎలా పడగలెత్తారన్న విషయం తెలుస్తుంది. అంతేగాక భూములు, బంగారం, కార్లు కొనుగోలు, వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తున్నారో అర్థం అవుతుంది. చిత్తూరులో ఏకంగా తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసి అక్రమ రిజిస్ట్రేషన్కు యత్నించడాన్ని బట్టి చూస్తే రైటర్లు ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. -
ఏప్రిల్ 1న యూటీఎఫ్ నిరాహార దీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 1న ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ తెలిపారు. ఆయన శుక్రవారం ఆ సంఘం నేతలతో కలిసి కలెక్టరేట్లో డీఆర్వో మోహన్కుమార్కు ముందస్తు నోటీసు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చలేదన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ కోసం ఇప్పటి వరకు కమిషన్ నియమించకపోవడం తగదన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్పనాయుడు, మణిగండన్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశా రు. 29 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల చేయాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టి కోవిడ్ సమయంలో మృతి చెందిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే లక్ష పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టామన్నారు. విజయవాడలో భారీ ధర్నా చేపట్టినప్పటికీ ప్రభు త్వం నుంచి ఆశించిన స్పందన లేదని మండిపడ్డా రు. అందుకే దశలవారీ పోరాటాల్లో భాగంగా ఏప్రి ల్ 1న నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎస్.రెహనాబేగం, డి.ఏకాంబరం, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.పి.బాషా, జిల్లా కార్యదర్శి ఎం.పార్థసారథి, నాయకులు జి.రవీంద్ర, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణకు పట్టం
ఆపదలో ఉన్న చిన్నారులకు కొండంత అండగా నిలిచే చైల్డ్లైన్–1098 వ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవో)ల నుంచి ఐసీడీఎస్ పరిధిలోకి మారిన ఈ విభాగం, ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల పరం కానుంది. సిబ్బంది కొరత, నిర్వహణ బాధ్యతల మార్పుల మధ్య చిన్నారులకు అందే అత్యవసర సేవలు ఏ మేరకు మెరుగుపడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్ : అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులకు సేవలు అందించేందుకు ఉద్దేశించిన చైల్డ్లైన్ –1098 నిర్వహణను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. గతంలో ఇది స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీవో), ఆ తర్వాత ఐసీడీఎస్ ద్వారా నడిచేది. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న నెపంతో ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. ఉన్నతాధికారులు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. అర్హత కలిగిన ఏజెన్సీ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఆందోళనలో ఉద్యోగుల భవితవ్యం చైల్డ్లైన్ –1098 వ్యవస్థ ప్రైవేటీకరణ నిర్ణయంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ఆందోళనలో పడింది. వారి తొలగింపునకు సంబంధించి ఇచ్చిన మూడు నెలల నోటీసుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. తమను ఐసీడీఎస్ పరిధిలోనే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. కొత్త ఏజెన్సీ వస్తే పాత వారినే తీసుకుంటారా లేదా కొత్త వారిని నియమించుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణలో గందరగోళం చైల్డ్ లైన్–1098 విభాగం గత రెండేళ్లలో పదే పదే చేతులు మారింది. ముందు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉండేది. 2024 జూలై 8వ తేదీ నుంచి ఐసీడీఎస్ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పదే పదే యాజమాన్యం మారడం వల్ల వ్యవస్థ స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పిల్లల అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి కీలక బాధ్యతలు చూసే ఈ విభాగం ప్రభుత్వం, ప్రైవేట్ మధ్య నలుగుతోంది. దీనికితోడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 8 మంది ఉండాల్సిన చోట నలుగురే ఉన్నారు. నిర్వహణలో స్పష్టత లేకపోవడం వల్ల ఆపదలో ఉన్న పిల్లలకు అందాల్సిన సేవలు సకాలంలో అందుతాయా లేదా అన్నదే అసలైన ఆందోళన. -
ప్రీ పెయిడ్ విద్యుత్!
కరెంట్ కావాలంటే ఇక నుంచి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అలా చేసుకుంటేనే ఇంటిలో బల్బులు వెలుగుతాయి. లేదంటే అంధకారంలో ఉండాల్సిందే. ప్రస్తుతం కరెంటు బిల్లు కట్టేందుకు కొన్ని రోజులు గడువు ఉంది. అది దాటినా అపరాధ రుసుంతో కట్టేసుకోవచ్చు. స్మార్ట్ మీటర్ మన గోడకు వేలాడిందంటే ఆ సదుపాయాలన్నీ ఆగిపోతాయి. సెల్ఫోన్, డీటీహెచ్ మాదిరిగా రీచార్జ్ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్లను బిగిస్తున్నారు. ఇది పూర్తయి ఇళ్లకు కూడా బిగిస్తే ముందుగా రీచార్జ్ చేసుకోలేని పేదలు, మధ్య తరగతి ప్రజలు మళ్లీ చిన్న దీపాల వెలుగులో బతకాల్సి వస్తుంది. చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు 7.60 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వృథా ఎక్కువగా అవుతోందని, దీన్ని అరికట్టేందుకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించే వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చుతామంటే కూటమి నేతలు వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పెద్దలు గృహ వినియోగదారులకు సైతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తున్నారు. దీనిపై ప్రజలతో పాటు ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. గృహ వినియోగానికి సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. ఈ క్రమంలో ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని నిర్ణయించింది. జిల్లాలో 18 వేల సర్వీసులకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రతినెలా రీచార్జ్ చేసుకోవాల్సిందే స్మార్ట్ మీటర్లుగా పిలిచే ప్రీ పెయిడ్ మీటర్లకు ప్రతినెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. వినియోగదారులు 12 నెలల విద్యుత్ బిల్లులను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ వినియోగంపై ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రీచార్జ్ చేసుకోవాలి. మూడు రోజులు ముందుగానే రీచార్జ్ చేసుకోవాలని వినియోగదారుడికి అలెర్ట్ మేసేజ్ వస్తుంది. అందులో అంతకు ముందు రీచార్జ్ చేసుకున్న మొత్తం.. విద్యుత్ వినియోగం.. ఇంకా ఎంత రీచార్జ్ చేసుకోవాలి.. అన్న విషయాలు ఉంటాయి. దాన్ని బట్టి తదుపరి నెలలో విద్యుత్ వినియోగంపై ఒక అవగాహన వస్తుంది. ఒక వేళ రీచార్జ్ చేయడం ఆలస్యమైతే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రీచార్జ్ చేసుకున్న తర్వాతే సరఫరాను పునరుద్ధరిస్తారు. ఇందుకోసం స్మార్ట్ మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి తమ సిబ్బందితో మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ప్రజల్లో భయాందోళనలు స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో భయాందోళనలు నెల కొన్నాయి. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై చంద్రబాబునాయుడు, నారా లోకేష్ సహా కూటమి నేతలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సభల్లో మాట్లాడిన సందర్భంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయానికి గురిచేశారు. ఇప్పుడు వారే స్మార్ట్ మీట ర్లు బిగించాలని చెబుతుండడంతో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా ప్రజ లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విద్యుత్ వృథాను అరికట్టేందుకేనని చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు సంబంధించి స్మార్ట్ మీటర్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అన్నిరకాల ప్రభుత్వ కార్యాలయాలు సుమారు 18 వేలు ఉన్నాయి. ఇప్పటికే 98 శాతం వరకు కార్యాలయాలకు మీటర్లు అమర్చారు. రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా -
కల్యాణ వైభోగం.. చూసిన కన్నులదే భాగ్యం
నాయుడుపేట : విశేషాలంకరణలో శ్రీరామచంద్రమూర్తిసిరి కల్యాణపు బొట్టును బెట్టి..మణి బాసికం నుదుటిన గట్టి.. పారాణి పాదాలకు బెట్టి..పెళ్లి కూతురైన సీతమ్మను చూసి భక్తులు తరించారు. సంపెంగ నూనెను కురులదువ్వి..సొంపుగ కస్తూరి నామం దీర్చి..చెంపన జివ్వాజి చుక్కను పెట్టి..పెళ్లి కొడుకై న రామయ్యను చూసి భక్త జనం పరవశించింది. జానకి దోసిట కెంపులు పోయగా..రాముని దోసిట నీలపురాశులై ఆణిముత్యాలు తలంబ్రాలుగా ఇరువుల మెరవగా భక్తకోటి మురిసింది. వేద మంత్రాలు.. మంగళవాయిద్యాలు మోగగా.. మోమున సిగ్గుతో తలదించుకుని ముసి ముసి నవ్వుల సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టిన కమనీయ ఘట్టం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేత్రపర్వంగా సాగింది.. శ్రీరామనవమి సందర్భంగా రెండు జిల్లాల్లోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్న రీతిలో వైభవంగా సాగింది. –సాక్షి నెట్వర్క్ -
ఇలలో వైభోగం.. సీతారాముల కల్యాణం
తుమ్మలగుంటలో సీతారాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు వేద మంత్రాలు.. మంగళవాయిద్యాలు మోగుతుండగా సిగ్గుతో తలదించుకుని ముసి ముసి నవ్వుల సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టే కమనీయ ఘట్టం ఇలలో జరిగే వైభోగం.. అలాంటి సుందర, కమనీయ కావ్యం శనివారం తుమ్మలగుంట కల్యాణ వెంకన్న ఆలయంలో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. తిరుపతి రూరల్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తుమ్మల గుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద సీతారాము ల కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం 9 గంటల నుంచి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులతోపాటు వందలాది మంది భక్తులు పాల్గొనే కల్యాణోత్సవంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు కల్పించారు. 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం శ్రీసీతారాముల కల్యాణోత్సవం ముగిసిన తరువాత ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆలయం వద్ద జరిగే శ్రీరామ నవమి మహోత్సవాల్లో పాల్గొనే భక్తులందరికీ చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల నుంచి సీతాసమేత రామ లక్ష్మణులు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆకట్టుకునేలా పుష్పాలంకరణ కల్యాణ వేంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు గర్భాలయం లోపల, బయట వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. కల్యాణ వేదికను సుగంధభరిత పుష్పాలు, పత్రాలతో ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణం వీక్షించండి భక్తాదులందరూ తుమ్మలగుంటకు వచ్చి కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆహ్వానించారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణం, శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవాలను తిలకించి పునీతులు కావాలని కోరారు. ఆలయం వద్ద జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు వచ్చే భక్తులందరికీ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. -
సూర్య తేజం.. నేత్రపర్వం
నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్యపూజోత్సవంలో భాగంగా మూడోరోజైన గురువారం రవి కిరణాలు గర్భాలయంలోని స్వామివారి నాభిని తాకాయి. ఆలయ అర్చకులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. పరివార దేవతలకు అభిషేకాలు, విశేష పూజలు చేసి భక్తుల సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఉదయం 10 గంటలకు సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారికి అమ్మవారి మండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించి, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు సూర్య భగవానుడు అస్తమించే సమయంలో రవికిరణాలు మెల్లమెల్లగా ఆలయ ప్రధాన గోపురం నుంచి గర్భాలయంలోని స్వామి వారి నాభిని తాకాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు పులకించారు. అనంతరం సూర్యుని కిరణాలు పయనించిన మార్గాన్ని ఆలయ పరిచారకులు పుణ్యజలంతో అభిషేకించారు. భక్తుల గోవింద నామస్మరణలతోఅలయం మారుమోగింది. తెప్పపై విహరిస్తున్న కోదండరాముడు కిరణాలను వీక్షించడానికి పోటెత్తిన భక్తులుతిరుచ్చిపై ఊరేగుతున్న కోదండరాముడు తెప్పోత్సవం సూర్యపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురు వారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో తెప్పపై కొలువు దీర్చారు. అనంతరం స్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదపండితులు వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
అంతర్యుద్ధం!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వర్గపోరు తార స్థాయికి చేరింది. జూనియర్లు, సీనియర్ల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఇన్నాళ్లు రేసుగుర్రంలా వ్యవహరించిన వారికి డీఎంహెచ్ఓ బదిలీ షాక్ ఇచ్చింది. 14 నెలల కాలంలో కార్యాలయంలో జరిగిన అవినీతి బాగోతాన్ని బయటపెట్టేందుకు సీనియర్లు సిద్ధమవుతుండగా.. జూనియర్లు తమపై విచారణ తప్పదేమోనన్న ఆందోళనలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా కొనసాగిన సీనియర్లు – జూనియర్ల మధ్య కోల్డ్వార్ తాజాగా వీధికెక్కింది. నాలుగు గోడల మధ్య నలిగిన సీనియర్లు డీఎంహెచ్ఓ బదిలీతో ఊపిరి పీల్చుకున్నట్టయింది. బదిలీతో మారిన సమీకరణాలు ఇటీవల డీఎంహెచ్ఓ బదిలీతో కార్యాలయంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్ప టివరకు మౌనం పాటించిన సీనియర్లు ఇప్పుడు ముందుకొచ్చి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘ఇన్నా ళ్లు ఒత్తిడితో మౌనం పాటించాం... ఇక నిజాలు బయటపెడతాం’ అంటూ తెగేసి చెబుతున్నారు. గత 14 నెలల కాలంలో జరిగిన ప్రతి అంశాన్ని పరిశీలించి, అవినీతి అక్రమాలు బయటపెడతామని బహిరంగంగా చెబుతున్నారు. అవసరమైతే పూర్తి ఆధారాలతో రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిధుల దుర్వినియోగం, తప్పుడు బిల్లులు, అక్రమ డెప్యూటేషన్లు వంటి అంశాలపై పూర్తి వివరాలతో ఉన్న నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాల ని నిర్ణయించారు. నిధుల వినియోగంపై అనుమానాలు జిల్లాలో అమలు చేసిన పలు ఆరోగ్య కార్యక్రమా లకు సంబంధించిన నిధుల వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించలేదని, లెక్కల్లో తేడాలు ఉన్నాయని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తప్పుడు బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్ము మింగేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టానుసారంగా డెప్యూటేషన్లు కార్యాలయంలో నియామకాలు, డెప్యూటేషన్లు కూడా వివాదాస్పదంగా మారాయి. నిబంధనలు పక్కనబెట్టి, కొంతమందికి అనుకూలంగా పోస్టింగులు ఇచ్చారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. రూ.50వేల నుంచి రూ.3 లక్షల వరకు మామూళ్లు తీసుకుని బదిలీలు చేశారనే ఫిర్యాదులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు వెళ్లినట్లు సమాచారం. 40 మందికిపైగా బదిలీలపై ఉన్నారని, నిబంధనల ప్రకారం డెప్యూటేషన్లు లేవని ఆ శాఖ అధికారులు కోడై కూస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వర్గపోరు అసలు అధికారమంతా ఒకరిదే? డీఎంహెచ్ఓగా సుధారాణి బాధ్యతలు స్వీకరణ తర్వాత పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత అప్పటి వరకు ఉన్న ఫోగ్రాం ఆఫీసర్ల కుర్చీలను ఖాళీ చేయించారు. వారి స్థానంలో వైద్య వ్యవస్థలో ఓనమాలు నేర్చుకుంటున్న జూనియర్లకు ఫోగ్రాం ఆఫీసర్లుగా పగ్గాలు కట్టబెట్టారు. కానీ వారి చేతుల్లో అసలు అధికారాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక నిర్ణయాలు, ఫైళ్ల కదలికలు, నిధుల ఆమోదాలు అన్నీ ఒకే అధికారి ఆధీనంలో జరిగాయని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ‘పేరుకే పోస్టులు... కానీ అధికారమంతా ఒకరే వినియోగించారు’ అని సీనియర్ వర్గం అంటోంది. తోకముడిచిన జూనియర్లు? మరోవైపు, పరిస్థితులు మారడంతో జూనియర్ వర్గం రక్షణాత్మకంగా మారినట్లు తెలుస్తోంది. డీఎంహెచ్ఓ బదిలీ ప్రభావంతో తమపై విచారణ జరిగే అవకాశం ఉందన్న భయంతో వారు మౌనం వహిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం త్వరలోనే పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధి కారిక విచారణ ప్రారంభమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
నూతన ఆవిష్కరణలతో ఎంతో మేలు
పూతలపట్టు(యాదమరి): నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ణానం ఎంతో అవసరమని, నూతన ఆవిష్కరణలతోనే సమాజానికి మేలు జరుగుతుందని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపడాల్ తెలిపారు. గురువారం ముత్తిరేవుల సమీపంలోని ఎస్వీసెట్ కళాశాలలో నిర్వహించిన హాకథాన్ 26 కార్యక్రమానికి ఆయనతో పాటు డిప్యూటీ కలెక్టర్ సురేష్ అతిథులుగా హాజరై ప్రసంగించారు. అనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా అదే కళాశాలకు చెందిన చందుప్రియ బృందానికి రూ.లక్ష , రెండో విజేతకు రూ.50వే లు, మూడో విజేతకు రూ.25వేలు నగదు బహుమతి అందజేశారు. కళాశాల వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్, ప్రిన్సిపల్ మోహన్బాబు, విభాగాధిపతి విజయ్కుమార్ పాల్గొన్నారు. వ్యవస్థాపకత నైపుణ్యాలపై శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూ హోమ్సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రూసా 2.0 సహకారంతో ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విద్యార్థులకు వ్యవస్థాపకత నైపుణ్యాలు, ఫైర్ స్టార్టర్ అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం వర్సిటీలో జరిగిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి వీసీ టాటా నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరమని, వర్సిటీ విద్యార్థుల ఉన్నతికి అన్ని విధాల ప్రోత్సహిస్తుందని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్, రూసా సీఈఓ వంశీ, కన్వీనర్ ప్రొఫెసర్ సుచరిత, అధ్యాపకులు ఆర్కే అనురాధ, బి స్వరూపారాణి, కే అనురాధ పాల్గొన్నారు. -
రెండు ఇసుక లారీలు సీజ్
– నలుగురి అరెస్టు చిత్తూరు అర్బన్: చిత్తూరు మీదుగా తమిళనాడుకు ఇసుక తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మెట్టి కంటయ్య కథనం మేరకు... గురువారం బెంగళూరు–చైన్నె జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి తమిళనాడుకు రెండు లారీల్లో ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించి అడ్డుకున్నారు. తమిళనాడుకు చెందిన పళణి (35), బాబు (45), నటరాజన్ (30), సుకుమార్ (29) అనే నలుగురిని అరెస్టు చేశారు. వారి యజమానులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులతో చర్చాగోష్టి చంద్రగిరి: ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రకృతి వ్యవసాయంపై గురువారం రైతులతో చర్చాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుమతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 160 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డిశేఖర్, ప్రసాద రావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు కేవీ నాగమాధురి, ఎస్ మురళీకృష్ణ, ఎస్. కలీముల్లా, కె. విశ్వనాథ్, పి.మహేశ్వరరెడ్డి, టీఎం హేమలత, బి. సంతోష్ కుమార్ పాల్గొన్నారు. దొంగ ప్రేమజంట తొట్టంబేడు: ఆ ప్రేమజంట రూటే వేరు. దర్జాగా దొంగలించడం ఆ మొత్తంతో జల్సాలు చేయడం వారి నైజం. తొట్టంబేడు పోలీసు కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన కిరణ్ ఐటీఐ వరకు చదివాడు. జియో టవర్ వద్ద టెక్నీషియన్గా పనిచేసేవాడు. అయితే అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. కసి పెంచుకున్న అతను తన ప్రియురాలితో కలసి స్కెచ్వేశాడు. అదే కంపెనీకి చెందిన టవర్ల వద్ద పరికరాలను చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. సెల్ఫోన్ వాడితే పోలీసులకు పట్టుపడతామని, వాకీటాకీలతో చోరీలకు పాల్పడ్డారు. పోలీసు రెక్కీతో బుధవారం పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 40 రోటర్లు, డమ్మీగన్, రెండు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అవగాహన కల్పించండి చిత్తూరు కలెక్టరేట్: జనగణన ప్రక్రియపై ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. గురువారం జనగణనపై మాస్టర్ ట్రైనర్లకు కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా చేప ట్టే గృహ గణనలో గృహ నిర్మాణం, సామాజిక–ఆర్థిక వివరాలు ఇతర అంశాలపై సమగ్ర డేటాను అందించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి తిరుపతి తుడా: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 30న తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన నున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో ఏర్పాట్ల ను అధికారులతో కలసి కమిషనర్ తనిఖీ చేశారు. అన్ని మార్గాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు. -
హుండీ కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది
నేడు పాఠశాలలకు సెలవు చిత్తూరు కలెక్టరేట్ : శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజులో ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విస్తృత తనిఖీలు చిత్తూరు రూరల్(కాణిపాకం): తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు నగరంలోని మురకంబట్టు ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. తాలూకా ఎస్ఐ అశోక్కుమార్ తన బృందంతో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా రౌడీ షీటర్లను గుర్తించే పనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను నిలిపి ప్రశ్నిస్తున్నారు. వాహనాల్లో అక్రమంగా నగదు, మద్యం లేదా ఇతర వస్తువులు తరలిస్తున్నారో లేదో పరిశీలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టాలను కాపాడడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.9 కోట్లు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు పకడ్బందీగా లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరి గిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,90,12,047 ఆదాయం వచ్చింది. ఇందులో బంగారం 87 గ్రాములు, వెండి 1.100 కిలోలుగా లెక్కగట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.18,926, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,79,966 వచ్చింది. యూఎస్ఏవి 1,607 డాలర్లు, మలేషియావి 6 రింగిట్స్, కెనడా 250 డాలర్లు, యూరో 30 యూరో, ఇంగ్లండ్ 20 పౌండ్స్, ఆస్ట్రేలియావి 115 డాలర్స్, సింగపూర్ 22 డాలర్లు, యూఏఈ 30 దిర్హామ్స్ రియాల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. చిత్తూరు కార్పొరేషన్ పై ఏసీబీ ఆరా చిత్తూరు అర్బన్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు ఇస్తే గానీ పనులు చేయడం లేదనే ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ )అధికారులు ఆరా తీస్తున్నారు. నగరంలోని ఓ భవనానికి యజమాని పేరు మార్చండికి కార్పొరేషన్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గతంలో లంచం అడగడం తెలిసిందే. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. సదరు ఇన్స్పెక్టర్ గురించి వివరించారు. త్వరలోనే కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి దీనిపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు
ఐరాల: అడవికి నిప్పు పెడితే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని డీఆర్ఓ రాకేష్కుమార్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని వీఎస్.అగ్రహారంలో కళాజాత బృందంతో అడవికి నిప్పు పెట్టడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవికి వెళ్లే పశువులు, గొర్రెల కాపరులు, అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులు అడవికి నిప్పు పెట్టడం వల్ల క్రమేణా అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందన్నారు. దీనివల్ల ఏటా వర్షపాతం కూడా తగ్గిపోతుందని తెలిపారు. అడవులకు నిప్పుపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిలో ప్రమాదాలు తగ్గాలంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్బీఓలు పద్మ, లావణ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
29 నుంచి జిల్లా స్థాయి చెస్ ఎంపికలు
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా స్థాయి చెస్ ఎంపికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్టు ఏపీ చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.బీ ప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లా స్థాయి అండర్–07, అండర్–09 ఓపెన్–గర్ల్స్ చెస్ చాంపియషిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 29న చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్కూల్ ఆఫ్ చెస్ కార్యాలయంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 8.15 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్ 07 పోటీలకు 1–1–2019 తర్వాత, అండర్ 09కి 01–1–2017 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా తమ వెంట సొంత చెస్ బోర్డు, చెస్ క్లాక్, పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం తీసుకురావాలన్నారు. ప్రతి కేటగిరీ నుంచి ప్రతిభ కనబరచిన మొదటి ఇద్దరు క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అండర్ 07 విజేతలకు ఏప్రిల్ 4న ద్వారకా తిరుమలలో, అండర్ 09 విజేతలకు ఏప్రిల్ 18న అన్నవరంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9849313676, 900475799 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు దినేష్, గిరిధర్, గజేంద్ర, అశోక్ పాల్గొన్నారు. -
‘పన్ను’పోటు!
జిల్లాలో ఆస్తి పన్ను వసూలైంది 50 శాతమే చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్తో పాటు మూడు మునిసిపాలిటీల్లో రూ.32.32 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు గడువు ముగుస్తుండడంతో కనీసం 80 శాతం పన్నులైనా వసూలవుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు కమిషనర్లు గతేడాదితో పోలిస్తే ఈ సారి పన్ను వసూళ్లలో పురోగతి ఉందంటూ ఆన్లైన్లో గ్రాఫ్లు చూసుకుంటూ మురిసిపోతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరులోనే ‘భారీ’ బకాయిలు జిల్లాలో మూడు మునిసిపాలిటీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్ నుంచి ఈ మార్చి 31వ తేదీలోపు రూ.64.68 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ మాఫీతో అప్పటి వరకు వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తారని భావించిన ప్రజలకు నిరాశనే మిగిల్చింది. అయితే రూ.64.68 కోట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.32.36 కోట్లు వసూలైంది. ఇంకా రూ.32.32 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మొత్తం లక్ష్యంలో ఒక్క చిత్తూరు కార్పొరేషన్ నుంచి రూ.46.08 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో గతేడాది ఏప్రిల్ 1 నుంచి బుధ, గురురాల నాటికి రూ.21.65 కోట్లు వసూలు చేశారు. ఇంకా దాదాపు రూ.24 కోట్లకు పైనే బకాయిలున్నాయి. చిత్తూరు కార్పొరేషన్లో మూతబడ్డ సహకార చక్కర ఫ్యాక్టరీ, విజయా డెయిరీ పాత బకాయిలు, కలెక్టరేట్ కార్యాలయ బకాయిలు.. ఇలా ప్రభుత్వ భవనాల నుంచే రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉన్న బకాయిలపై ప్రతీ ఏటా కొత్త బకాయిలు పెరిగిపోతున్నాయి. నాలుగు రోజుల్లో రూ.32 కోట్లు? మార్చి 31తో 2025–26 ఆర్థిక సంంత్సరం ముగుస్తుండడంతో మునిసిపాలిటీల్లో వసూలు కావాల్సిన ఆస్తి పన్ను వసూళ్లకు నాలుగు రోజులే సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో రూ.32.32 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పలమనేరు నుంచి రూ.2.13 కోట్లు, కుప్పంలో రూ.3.37 కోట్లు, నగరిలో రూ.2.39 కోట్లు, చిత్తూరులో రూ.24 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. మొండి బకాయిల వసూళ్లకు ఇప్పటి వరకు ఏమైనా ప్రత్యేక చర్యలు, ప్రణాళికలు తీసుకున్నారా..? అంటే ఏ అధికారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. -
అభద్రత!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవలి కాలంలో కర్నూలు, అర కు, చిత్తూరు జిల్లా గంగసాగరం ప్రాంతాల్లో జరిగిన ఘటనలు మరువకముందే మార్కాపురం వద్ద మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వరుస ఘటన లు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. రాత్రి ప్రయాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా కేంద్రం మీదుగా విజయవాడ, నెల్లూరు, తిరుపతి నుంచి బెంగళూరు, అలాగే తమిళనాడు నుంచి తిరుపతికి 800కుపైగా ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో అంత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. బంగారుపాళ్యంలోని మొగిలి, చిత్తూరు–వేలూరు రోడ్డు, పూతలపట్టు–తిరుపతి మార్గం, కాణిపాకం బైపాస్, పుత్తూరు రోడ్డు, నగరి రోడ్డు ఇలా పలు మార్గాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ మార్గాల్లో ప్రమాదా లు జరగకుండా రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. బస్సులను నిత్యం తనిఖీలు చేయిస్తున్నారు. అయినా ప్రాథమికంగా వెలుగులోకి వస్తున్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాల్లో లోపాల వల్ల ఎక్కడో ఓ చోట ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ బస్సుల వాస్తవ పరిస్థితి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రంగంలోకి రవాణాశాఖ మార్కాపురం ప్రమాదాల పరంపర నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. చెక్పోస్టులు, హైవేలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ల లైసెన్సులు, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్, ఇన్సూ రెన్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడ్పై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీవ్ర లోపాలు ఉన్న వాహనాలను సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అనుమతులను రద్దు చేసే చర్యలకూ వెనుకాడబోమని అంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్పై పెరుగుతున్న అనుమానాలు భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకురావడమే ఈ తనిఖీల లక్ష్యమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బస్సు పరిస్థితిని గమనించడం, అధిక వేగంపై అభ్యంతరం చెప్పడం అవసరమని చెబుతున్నారు. -
రెండు బైక్లు ఢీకొని ఒకరి మృతి
గంగవరం: మండలంలోని మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు గడ్డూరు కాలనీకి చెందిన జుబేర్(20), రామసముద్రానికి చెందిన శ్రీధర్(20) మదర్ థెరిసా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు ద్విచక్ర వాహనంలో పలమనేరు వెళ్తున్నారు. అదే మార్గంలో మేలుమాయి గ్రామానికి చెందిన మేసీ్త్ర దొరస్వామి(55) మేసీ్త్ర పని ముగించుకుని పలమనేరు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలోని మేలుమాయి క్రాస్ వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వారిని 108 అంబులెన్స్లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. సీఎంసీకి వెళుతుండగా మార్గమధ్యంలో దొరస్వామి మృతిచెందారు. ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్పంచులపై కూటమి కక్ష
కుప్పం రూరల్: వైఎస్సార్ సీపీ మద్దతుదారులుగా ఉన్న సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోందని చిత్తూరు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త భరత్ ఆరోపించారు. ఆయన బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 91 పంచాయతీలకు గాను 77 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారని చెప్పారు. గెలిచిన సర్పంచులు ఎలాంటి పక్షపాతం లేకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. భారీ గెలుపును తట్టుకోలేని టీడీపీ నాయకులు అప్పట్లో తీవ్రంగా నిరాశకు గురయ్యారని తెలిపారు. 2024లో టీడీపీ ప్రభుత్వం రావడంతో వైఎస్సార్ సీపీ సర్పంచులపై అక్కసు వెళ్లగక్కుతున్నట్టు విమర్శించారు. తాగునీరు, పారిశుధ్యం, పైపులైన్ల ఏర్పాటు, బోర్ వెల్ రిపేర్లు వంటి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోందని దుయ్య బట్టారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకూ బిల్లులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సజావుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కలెక్టర్ను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా టీడీపీ నియామక పదవిలో ఉన్న కడా ప్రాజెక్టు డైరెక్టర్ను అడగాలని తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కడా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, ఎంపీడీవోల వద్దకు వెళ్లమంటున్నారని, అక్కడికి వెళితే టీడీపీ నాయకులను కలవాలంటూ బదులిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని విమర్శించారు. బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు. -
31న ముగియనున్న నవజీవన్శ్రీ పాలసీ
పుత్తూరు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అమలుచేస్తున్న నవజీవన్శ్రీ పాలసీ(911)ని ఈ నెల 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు స్థానిక బ్రాంచి మేనేజర్ పి.ఎస్.హేమాద్రి తెలిపారు. ఆయన బుధవారం తమ సిబ్బందితో కలిసి నవజీవన్శ్రీ పాలసీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవజీవన్శ్రీ పాలసీ కింద సింగిల్ ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితానికి భద్రత పొందవచ్చునని తెలిపారు. గ్యారెంటీ అడిషన్ లాభం కూడా ఉంటుందని పేర్కొన్నారు. జీరో వయస్సు నుంచి 65 ఏళ్ల వారు పాలసీ చేసుకోవచ్చని వెల్లడించారు. కుటుంబ భద్రత, పిల్లల భవిషత్తు కోసం ఇది ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. భారీ జరిమానా యాదమరి: మండల పరిధిలోని వరిగపల్లి వద్ద ఇటీవల పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సేల్స్ ట్యాక్స్ అధికారులు నిందితులకు రూ.9 లక్షల భారీ జరిమానా వసూలు చేసి, వాహనాన్ని విడుదల చేసినట్లు స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. కారు ఢీకొని యువకుడికి గాయాలు గంగవరం: మండలంలోని అప్పినపల్లి క్రాస్ వద్ద బుధవారం బైక్ను కారు ఢీకొనడంతో యువకుడు గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కల్లుపల్లి గ్రామానికి చెందిన బాబు కుమారుడు గోకుల్సాయి(19), ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు ద్విచక్ర వాహనంలో పలమనేరు వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో మదనపల్లి వైపు వస్తున్న కారు అప్పినపల్లి క్రాస్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గోకుల్సాయికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అర్ధగిరి హుండీ ఆదాయం రూ.11.19 లక్షలు
తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలోని హుండీల ద్వారా రూ.11.19 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతి, ఈవో మునిశేఖర్ తెలిపారు. అర్ధగిరి క్షేత్రంలోని మండపంలో బుధవారం ఎండోమెంట్ అధికారి రాధిక పర్యవేక్షణలో హుండీల్లోని కానుకలను లెక్కించారు. గత సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.11,19,899లు వచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో అరగొండ గ్రామీణ బ్యాంకు అధికారి పి.ఎం.ఉమామహేష్, ట్రస్టుబోర్డు సభ్యులు సుబ్రమణ్యం, శ్రీధర్నాయుడు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. నేడు పాఠశాలలకు పని దినం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు గురువారం పనిచేస్తాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన పాఠశాలలకు సెలవు ఉంటుందని డీఈవో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు. అంగన్వాడీ హెల్పర్పోస్టులకు ఇంటర్వ్యూలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చిత్తూరు, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు, ఐరాల, బంగారుపాళ్యం, పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 187 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు వచ్చిన మహిళా అభ్యర్థులతో ఆర్డీవో కార్యాలయం కిక్కిరిసింది. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తాయని ఒకే రోజు ఆరు ప్రాజెక్టుల పరిధిలో పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సమాచారం. బాగా ఆలస్యం అవుతుండడంతో రెండు ప్రాజెక్టులకు ఇంటర్వ్యూ లు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దీంతో ఐరాల, జీడీ నెల్లూరు సీడీపీవో ప్రాజెక్ట్ పరిధిలోని పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓపై చర్యలు! చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆమెను రాష్ట్ర శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో చిత్తూరు డీఎంహెచ్ఓగా అనంతపురం జిల్లా డీఐఓగా పనిచేస్తున్న నాగశశిభూషణ్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆయన ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
యువతే దేశానికి అసలైన సంపద
యువతే మన దేశానికి అసలైన సంపద అని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. గ్రామాలకు 104 వాహనంలో ఆల్బెండజోల్ సస్పెన్షన్, అల్యూమినియం హైడ్రోక్లోరైడ్, మెగ్నీషియం+సమిథికాన్ సిరప్, ఆంట్రాక్సోల్ సిరప్, ఎమోక్సిసిలిన్ క్యాప్సుల్స్, ఎటెనిరాల్, బెం జోయిక్ యాసిడ్–సాల్సిలిక్ యాసిడ్ ఆయింట్మెంట్, బిమటోఫ్రాస్ట్ ఐ డ్రాప్స్, సిఫిక్సిమ్ సస్పెన్షన్, సిప్రోఫ్లోక్సాసిన్ ఇయర్, ఐ డ్రాప్స్, క్లోట్రిమోజోల్ క్రీము, డాంపెరిటోన్ సస్పెన్షన్, ఇటో ఫైలిన్–రి యోఫైలిన్ ఇంజక్షన్, ఫ్రామిసైటిస్ సల్ఫేట్ క్రీమ్, ప్రామిసైటిన్+డెక్సామిథాజోన్+కోట్రిమజోల్ ఆయింట్మెంట్, ఫెరాక్రీలం అయింట్మెంట్, ప్యూరాజోలిడాన్ సస్పెన్షన్, లివోసిట్రిజిన్ సిరప్, లివో సిట్రిజిన్ మాంటీలుకాస్ట్ ట్యాబ్లెట్స్, మెట్రోనిడజోల్ సస్పెన్షన్, మెట్రోనిడజోల్ 400 ఎంజీ ట్యాబ్లెట్స్, మినరల్ ఆయిల్–హైడ్రాక్సీ ప్రొఫైల్ సంయుక్త ఐ లూబ్రికెంట్, ఓఆర్ఎస్, పారాసిటమాల్ ఇంజక్షన్లు, ప్రీమెతిరిన్ క్రీమ్, పావిడన్ ఆయోడిన్ 5 శాతం అయింట్మెంట్, టెల్మిసార్ధన్ 40 తదితర మందులు ఉండడం లేదు. సిరంజీల్లో 2 సీసీ, 5 సీసీ లేవు, ఐవీ సెట్లు, బ్యాండ్ ఎయిడ్లు 10, 15 సెంటీమీటర్లు, టార్న్ క్విట్ పీడియాట్రిక్ లింబ్స్, పేపర్ ప్లాస్టర్ 3 ఇంచ్, గ్లాజులు మీడియం, లార్డ్, డిస్పోజబుల్ గ్లాజులు, డిజిటల్ బీపీ మెషిన్ కూడా లేకుండానే 104 సేవలను కొనసాగిస్తున్నారు. మందుల కొరతతో కొన్నిచోట్ల షార్ట్ ఎంకై ్వరీ మందులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని కొందరు సిబ్బంది వాపోతున్నారు. డ్రగ్స్ స్టోర్ నుంచే స్టాక్ రావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. పట్టి పీడిస్తున్న మందుల కొరత -
మత్తు పదార్థాలు లేని జిల్లాగా మారుద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మారుద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారం జిల్లా ఎస్పీ తుషార్డూడితో కలిసి చిత్తూరు జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు వెన్నెముక వంటి యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జిల్లాలోని 25 జెడ్పీ హైస్కూళ్ల పరిసరాల్లో వారం రోజుల్లోపు రూ.2 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే డ్రాయింగ్, వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి కళాశాలలో ఒక నోడల్ అధికారిని నియమించి హాస్టళ్లలో అవగాహన పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. విద్యార్థులకు టొబాకో ఉత్పత్తులు విక్రయించే వారిపై దాడులు చేయాలని పోలీస్, ఫుడ్ సేఫ్టీ, ఈగల్ టీమ్స్ను ఆదేశించారు. నగరి, కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, ఆన్లైన్లో అక్రమంగా మందులను ఆర్డర్ చేసి విక్రయించే మెడికల్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్, గంజాయి సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ముట్టుకోరు: ఎస్పీ తుషార్ డూడి ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ‘దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ జోలికి వెళ్లడు‘ అని అన్నారు. జిల్లాను డ్రగ్ రహితంగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా గంజాయి సాగుపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఈగల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కీర్తన, వ్యవసాయ శాఖ జేడీ మురళి, ఈగల్ ప్రతినిధి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం పెన్షనర్ల నిరసన
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల హక్కులకు రక్షణ కల్పించాలని ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా నాయకులు సహదేవనాయుడు, భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ సరికాదన్నారు. దాని వల్ల పెన్షనర్లకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ధర్నా చేస్తున్నట్టు వివరించారు. గత ఏడాది మార్చి 25న పార్లమెంటులో ఆమోదించిన ఆర్థిక సవరణ బిల్లులో పెన్షనర్ల విభజన అధికారాన్ని కేంద్రం పొందిందన్నారు. దీనివల్ల ప్రస్తుతం పాత పెన్షన్ పొందుతున్న వారు భవిష్యత్లో పెన్షన్ పెరుగుదల సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నల్ల చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయిందన్నారు. అనంతరం డీఆర్వో మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రాజారావు, మురళి, సునందరెడ్డి, రంగనాథమ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
అపోలో స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలో నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ స్పోట్స్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. ఏకేసీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే–2026లో భాగంగా చేపట్టిన ఈ క్రీడా పోటీలకు విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ను వీసీ వినోద్ భట్ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్వహించిన టార్చ్ రన్ కార్యక్రమం క్రీడాస్ఫూర్తికి ప్రతీ కగా నిలిచింది. బాస్కెట్ బాల్, వాలీబాల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. తొలి బాస్కెట్ బాల్ పోటీని రిజిస్ట్రార్ ఎం.పోతరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు రిజిస్ట్రార్ ఎస్.అనీల్కుమార్, ఏఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ జె ఆగస్టీన్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ జగదీశన్, ఏఐపీఎస్ డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్రెడ్డి, స్టూడెంట్స్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ మురళీకష్ణ, ఫిజికల్ డైరెక్టర్లు దిలీప్, సుమలత, స్పోర్ట్స్ క్లబ్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ జి.స్వప్న పాల్గొన్నారు. -
గ్రీన్ రేటింగ్పై అవగాహన సదస్సు
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : రాష్ట్రంలోని పరిశ్రమలలో సుస్థిర విధానాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా బుధవారం ‘గ్రీన్ రేటింగ్’పై శ్రీసిటీలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీపీసీబీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం ‘గ్రీన్ రేటింగ్’ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా భాగం కావాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచాలనే లక్ష్యాన్ని, తీర ప్రాంతంలో ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రణాళికను ప్రస్తావించారు. సుస్థిరత శ్రీసిటీలో భాగం శ్రీసిటీలో గ్రీన్ రేటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు డాక్టర్ కృష్ణయ్యకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుస్థిరత అనేది శ్రీసిటీలో అంతర్భాగమని పేర్కొ న్నారు. హరిత భవనాలు, పునరుత్పాదక శక్తి వినియోగం, సమర్థవంతమైన నీటి, వ్యర్థాల నిర్వహణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఏపీపీసీబీ రూపొందించిన ప్రోత్సాహక వ్యవస్థతో తమ పరిశ్రమలు క్రమంగా ప్రపంచ స్థాయి హరిత ప్రమాణాలను పాటిస్తున్నాయని చెప్పారు. అనంతరం సీఐఐ గ్రీన్కో దక్షిణ ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ చైర్మన్ నిహాల్ కౌల్ మాట్లాడారు. ఇంధన శక్తి, నీరు, వ్యర్థాల వినియోగాన్ని క్రమబద్ధం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కంపెనీకి లాభాలు కూడా సాధ్యమవుతాయని చెప్పారు. సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ముత్తుసెళియన్ స్వాగత ఉపన్యాసం చేశారు. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ సదుపాయాలు త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని డాక్టర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. -
అర్ధంతరంగా ఆగిన పశువైద్యశాల భవన నిర్మాణం
గంగాధర నెల్లూరు: మండలంలోని నందనూరు గ్రామంలోని పశువైద్యశాల భవన నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేయలేమని చేతులెత్తేశాడు. దీంతో రైతులు తమ పశువులకు వైద్య సేవలు అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రమైన గంగాధరనెల్లూరులోని పశువైద్యశాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని నందనూరు పంచాయతీలో పశు వైద్యశాల భవనం నిర్మాణం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలు మంజూరు చేసింది. అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పనులు చేపట్టాడు. గోడలు పూర్తి చేసి పైకప్పుకూడా వేశాడు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు మంజూరుకాలేదు. దీంతో పనులు చేయలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. ఈ వైద్యశాల పూర్తయితే నందనూరు, కలిజవేడు, పాపిరెడ్డి పల్లి, కొట్రకోన, పెనుమూరు సరిహద్దులోని పలు గ్రామాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. పశువైద్యశాల భవనం అర్ధంతరంగా ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వైద్య సేవలను తాత్కాలికంగా గ్రామపంచాయతీ భవనం వద్ద నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 50కి పైగా పాడి ఆవులు వైద్య సేవల కోసం తీసుకువస్తున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద పశువులకు సంబంధించిన మందులు, రికార్డులను ఉంచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి పశువైద్యశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
వార్డుల పునర్విభజన షురూ..!
చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులను పెంచడంతోపాటు జనాభా ప్రాతిపదికన వార్డులను పునర్భజన చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలన – పట్టణాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు గ్రేడ్ల ఆధారంగా ఉన్న వార్డులు, డివిజన్లను తాజాగా జనాభా ప్రామాణికంగా వర్గీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వార్డుల పెంపు ఇలా.. జనాభా ఆధారంగా వార్డుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 2 లక్షలలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లలో 60 డివిజన్లు ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటి వరకు ఉన్న 50 డివిజన్ల సంఖ్య 60కి చేరుకోనుంది. పలమనేరులో 26 ఉన్న వార్డులు 40కు, నగరిలోని 29 వార్డులు 40కి చేరుకోనున్నాయి. వార్డుల పునర్విభజన ఎలా చేయాలనేదానిపై ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు అందాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాతే అధికారులు వార్డుల స్వరూపం మార్చడంతో పాటు, గెజిట్ ప్రచురించడం, ఆపై ప్రజల నుంచి అభ్యతరాలు స్వీకరించడం చేయాలి. తుదిగా వార్డుల సంఖ్య పెంచుతూ, పునర్విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. వచ్చే ఏడాది జనగణన పూర్తయ్యి, మునిసిపల్ ఎన్నికలకు వెళ్లేలోపు కొత్త వార్డులు–డివిజన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిబంధనలు.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికే అమలులో ఉన్న వార్డులు, డివిజన్ల సంఖ్య తదుపరి జనగణన ఫలితాల వరకు మార్చకూడదు. ఇక పాలకవర్గాలు (కౌన్సిల్) ఉన్న చోట పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా పెరిగిన వార్డులు అమలులోకి వస్తాయి. ఈ లెక్కన కుప్పం మునిసిపాలిటీలో సెప్టెంబరు తర్వాతే వార్డుల సంఖ్య పెరగనుంది. -
పటిష్టంగా జనగణన ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జనగణన ప్రక్రియను పట్టిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. జనగణన ప్రక్రియలో శిక్షణ అత్యంత కీలకమన్నారు. మండల స్థాయి సిబ్బందిని 5 నుంచి 6 ఆరుగురితో చిన్న చిన్న బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇవ్వాలన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ జనగణనపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. జనణనలో సేకరించిన వివరాలు రాబోయే 10 నుంచి 15 ఏళ్ల వరకు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక విధానాల అమలుకు జనగణన వివరాలే ప్రాతిపదికన్నారు. జిల్లా స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సందేహాల నివృత్తికి ముఖ్య అంశాలతో కూడిన లీఫ్లెట్లు, ప్రశ్నోత్తరాల పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రైనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ దీపక్ భరద్వాజ్, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. -
30న టిడ్కో ఇళ్ల అప్పగింత
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈనెల 30వ తేదీన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కమిషనర్ పి.నరసింహప్రసాద్ తెలిపారు. బుధవారం టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, మౌలిక వసతులు, సదుపాయాలపై అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. కమిషనర్ వెంట ప్రజారోగ్యశాఖ అధికారి లోకేష్, మునిసిపల్ ఇంజినీరు వెంకటరామిరెడ్డి, టిక్కో డీఈ వెంకటముని, ఏఈ ధనంజయరెడ్డి ఉన్నారు. పోలీస్ స్టేషన్కుడ్రోన్ కెమెరా అందజేత చిత్తూరు అర్బన్: గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమెరాను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అందించారు. గంగాధరనెల్లూరుకు చెందిన బిల్డర్ ప్రసన్నకుమార్ విరాళంగా ఇచ్చిన ఈ కెమెరాను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్కు అందచేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు దీన్ని ఉపయోగించాలని ఎస్పీ ఆదేశించారు. అపోలోలో వరల్డ్ ఆప్టోమెట్రీ డే చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని ది అపోలో యూనివర్సిటీ పరిధిలోని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డివిజన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆప్టోమెట్రీ డే–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కంటి ఆరోగ్య ప్రాముఖ్యత, నాణ్యమైన విజన్ కేర్ సేవలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వీసీ వినోద్ భట్ హాజరై ప్రసంగించారు. గౌరవ అతిథిగా అదనపు రిజిస్ట్రార్ అనీల్ కుమార్తోపాటు వైద్య నిపుణులు ఆల్ఫ్రెడ్ జె అగస్టీన్, భాస్కర్ రెడ్డి, సుచరిత, కుమార్ అమత్, రాకేష్ కుమార్ యాదవ్, అఖిల్ పాల్గొన్నారు. -
ఖో–ఖో పోటీల్లో మెరిసిన ఉద్యోగులు
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిభ చూపారు. వారిని బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించారు. డీఈవో మాట్లాడుతూ మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల్లో టీచర్లు ఏపీ జట్టు తరపున పాల్గొని కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. విద్యాబోధనలోనే కాకుండా క్రీడా రంగంలోనూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. అనంతరం ప్రతిభ చాటిన సురేష్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీ, మంగళపల్లి), ముత్తు (పీఈటీ, జెడ్పీ ఎండీ, మంగళం), దేవేంద్ర (పీఈటీ, జెడ్పీ కీరమంద)ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీలు సిరాజ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్కు అభినందన కార్వేటినగరం: జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఉద్యోగి మనోజ్కుమార్(ఇంజినీరింగ్ అసిస్టెంట్ కార్వేటినగరం) ప్రతిభ చూపాడు. ఆయనను బుధవారం ఎంపీడీవో మధుసూదన్ అభినందించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖో–ఖో పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. అందులో ఏపీ జట్టు ప్రతిభ కనబరిచిందన్నారు. ఆ జట్టులో కార్వేటినగరం ఇంజినీరింగ్ అసిస్టెంట్ మనోజ్కుమార్ పాల్గొని కాంస్య పతకం సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏవో విద్యావతి, పీఆర్ ఏఈ దినేష్, చెంగల్రాయులు యాదవ్ పాల్గొన్నారు. -
యువతే దేశానికి అసలైన సంపద
చిత్తూరు కలెక్టరేట్ : యువతే దేశానికి అసలైన సంపదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నెహ్రూ యువజన శాఖ ఆధ్వర్యంలో కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం నిర్వహించారు. కాశ్మీర్లోని 6 జిల్లాల నుంచి వచ్చిన 132 మంది యువతీ యువకులకు జిల్లా యంత్రాంగం సాదర స్వాగతం పలికింది. ఇందులో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భారత్ మాత్రం అపారమైన యువశక్తితో విరాజిల్లుతోందన్నారు. భారతదేశంలో ఖనిజాలు, గనుల కంటే అత్యంత విలువైనది యువతరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ప్రత్యేకత అని చెప్పారు. విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ భారతీయుల ఐక్యత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందన్నారు. దేశంలో అలజడులు సృష్టించే శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి యువకుడు శాంతిని కాపాడే పీస్ అంబాసిడర్గా ఎదగాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ మాట్లాడుతూ యువత ఉగ్రవాదం, నక్సలిజం వంటి దేశద్రోహ చర్యలు, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. మై భారత్ స్టేట్ డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాశ్మీర్ యువత ఇక్కడి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను తెలుసుకుంటారని చెప్పారు. స్థానిక పర్యాటక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారని తెలిపారు. రెండు ప్రాంతాల యువత మధ్య భావవినిమయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి, అకడమిక్ డైరెక్టర్ శైలజ, ఏవో రాజగోపాల్, మై భారత్ జిల్లా యువ అధికారి ప్రదీప్, అకౌంట్స్ ఆఫీసర్ బాబురెడ్డి పాల్గొన్నారు. -
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
పెనుమూరు(కార్వేటినగరం): కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెనుమూరు మండటలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని అత్తిమాకులపల్లికి చెందిన సుకన్య(32) కు చిత్తూరు రూరల్ మండలం సీఎం కాలనీకి చెందిన నాగేంద్రబాబుతో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 6, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రబాబు భార్యాపిల్లలతో కలిసి అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నారు. దంపతులు తరచూ గొడవ పడేవారు. మంగళవారం కూడా దంపతుల గొడవ జరిగింది. నాగేంద్రబాబు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని సొంత గ్రామం సీఎం కాలనీకి వెళ్లి పోయాడు. దీంతో మనస్థాపం చెందిన సుకన్య బుధవారం గ్రామంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహం కోసం గాలించారు. మృతదేహం జాడకనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతికి గల కారణాలను ఆరాతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 71 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 97, సర్వీసు లైన్ పరంగా 03 కలిపి మొత్తం 171 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. అందులో 9 సమస్యలను పరిష్కరించామన్నారు. మిగిలినవి ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరిష్కరించనున్నట్లు వివరించారు. పీసీఆర్ పాఠశాలలో జేడీ తనిఖీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలను జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులపై ఆయన ఆరా తీశారు. జేడీ మాట్లాడుతూ భవనం వారసత్వ సంపద దెబ్బతినకుండా, ఆధునిక సాంకేతికతతో పనులు చేపట్టాలన్నారు. గోడల పటిష్టత, పైకప్పు లీకేజీ నివారణ చర్యలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోడింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, డీసీఈబీ సెక్రెటరీ హేమాద్రి, ఎంఈఓ పాండ్యన్, హెచ్ఎం పూర్వాణి, పీడీ దేవా తదితర అధికారులు పాల్గొన్నారు. 4 నుంచి ‘మై సైన్స్ గ్యారేజ్’ తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 4 నుంచి ఏడాది పొడవునా మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 3, 4, 5వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లలే స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఈ గ్యారేజ్ను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్ను సైన్స్ సెంటర్ అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు రూ.2వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
టులిప్స్తో గంజాయ్!
అటు గంజాయి.. ఇటు టులిప్స్! చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ఇటీవల గంజాయి వాడకం విచ్చలవిడిగా తయారయ్యింది. పలు జూనియర్ కళాశాలల నుంచి డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల ఆవరణలో గంజాయి నింపిన సిగరెట్లను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ‘జాయింట్’గా పిలుచుకుంటున్న గంజాయి సిగరెట్ల పట్ల యువత సులువగా ఆకర్షితులైపోతున్నారు. ఒక్కో సిగరెట్ రూ.100 రూ.200 వరకు దొరుకుతోంది. జిల్లాలోకి వచ్చే ప్రధాన గంజాయి వనరు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని సరిహద్దు జిల్లాల నుంచే చిత్తూరులోకి ఎక్కువగా వస్తోంది. అయితే పూతలపట్టులోని బండపల్లె గంజాయి డంప్ కేంద్రంగా ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడి నుంచి పలమనేరు.. బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న పలువురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బాల్యానికి టులిప్ భయం గంజాయి విషయం అటుంచితే.. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు పాఠశాల స్థాయి విద్యార్థుల్లోకి వెళుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు, నగరి, పలమనేరు ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని టులిప్స్గా పిలుచుకుంటున్నారు. చిత్తూరు నగరంలో ప్రతి ఒక్క దుకాణంలో పొగాకుతో తయారైన ఈ టులిప్ ప్యాకెట్లు లభిస్తున్నాయి. చిన్నచిన్న పొట్లాల్లో కనిపించే వీటిని తీసుకుని నాలుకపై పెట్టుకోవడం, నోట్లో పెట్టుకుంటే మత్తు ఎక్కుతుందని భావించి పిల్లలు వీటికి బానిసై పోతున్నారు. చిత్తూరులో టులిప్ నియంత్రణ చేయిదాటిపోతోంది. నిత్యం పోలీసులు పాఠశాలల ఆవరణల్లో తనిఖీలు చేస్తూ, వీటిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నా.. అంతే మొత్తంలో మళ్లీ మార్కెట్లోకి ప్రత్యక్షమవుతోంది. వీటిని దిగుమతి చేస్తున్న స్మగ్లర్లను పట్టుకుంటే తప్ప ఈ జాడ్యంకు కళ్లెం వేయడం సాధ్యం కాదు. చిత్తూరులో పొగాకు ఉత్పత్తులపై దాడులు చేస్తున్న పోలీసులు, అధికారులుగుడిపాల స్టేషన్ వద్ద రెండు రోజుల క్రితం సీజ్ చేసిన పొగాకు ఉత్పత్తులు ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీడీ రవికుమార్ వెదురుకుప్పం: జాబ్ కార్డ్ అప్లోడ్ ఎందుకు చేయలేదంటూ టీకేఎం పురం క్షేత్ర సహాయకుడుపై డ్వామా పీడీ రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కింద గ్రామాల్లో వివిధ పనుల కోసం 10.79 కోట్లు నిధులు వెచ్చించారు. దీనికి సంబంధించి సామాజిక తనిఖీ జరగగా మంగళవారం వెదురుకుప్పంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ రవికుమార్ ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం బుక్లు కళ్లుమూసుకుని రాస్తావా అంటూ జేఈ మునిరత్నంను అడిగారు. మొక్కల పెంపకానికి సంబంధించి బిల్లులు ఎలా చెల్లించారని టెక్నికల్ అసిస్టెంట్ రూపేష్పై అసహనం వ్యక్తం చేశారు. ఏపీడీ సునీల్ కుమార్, ఎంపీడీఓ పురుషోత్తం, ఏపీఓలు మీనాకుమారి, ఇందు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. రూ. 22,267 రికవరీకి ఆదేశం మండలంలోని 2024–2025 సంవత్సరంలో జరిగిన గ్రామీణ ఉపాధి పథకంలో వేజ్ పేమెంట్ కింద రూ.7.79 కోట్లు, మెటీరియల్ పనుల కింద రూ. 3 కోట్లు ఖర్చు పెట్టగా ఇందులో రూ.22,267 రికవరీకి పీడీ రవికుమార్ ఆదేశించారు. వీటిని తక్షణమే రికవరీ చేయాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు కర్ణాటక.. ఇటు తమిళనాడు.. మధ్యలో చిత్తూరు జిల్లా. 15 నిమిషాల్లో రాష్ట్రం దాటే అవకాశం. ఈ మాత్రం హింట్ ఇస్తే రెచ్చిపోతాం అన్నట్లు.. స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రధానంగా గంజాయితో పాటు ఇప్పుడు పొగాకు ఉత్పత్తులు జిల్లాలోకి భారీగా దిగుమతి అవుతున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారవుతోంది. సీరియస్గా తీసుకుంటాం టులిప్స్, గుట్కా లాంటివాటిపై కొన్ని చోట్ల నిషేధం ఉంటే.. మరికొన్ని చోట్ల విక్రయాలు చేసుకునే వెసులుబాటు ఉంది. మన జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు అంతర్రాష్ట్రాలకు చేరువలో ఉండడంతో పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతవుతున్నాయి. అయినాసరే మా వాళ్లు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నారు. ఇదే వృత్తిగా ఎంచుకున్న స్మగ్లర్లను ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదు. దీనిపై సీరియస్గా ముందుకు వెళుతున్నాం. చర్యలు కఠినంగా ఉంటాయి. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు. -
ఉపాధ్యాయుల రణభేరి
– నిరాహార దీక్షకు మద్దతు పలికిన సీపీఐ జాతీయ కార్యదర్శి నగరి: ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమ లు, పెండింగ్ డీఏల విడుదల, ఆర్థిక బకాయిల సాధ న కోసం రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాలలో ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మంగళవారం చిత్తూరు జిల్లా, నగ రి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఈ నిరాహార దీక్షా శిబిరంలో యూటీఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మణిగండన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. 12వ పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లవుతున్నా అమలుకు ప్రయత్నించకపోవడం ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలను అమలు చేయడంతో పాటు, ఆర్థిక బకాయిలన్నిటినీ ఆరు మాసాలలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూట మి ప్రభుత్వం ఆ వైపుగా కనీసం ఆలోచించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. తిరుపతి జిల్లా సహాధ్యక్షురాలు గీతమ్మ మా ట్లాడుతూ తక్షణం నూతన పీఆర్సీని ఏర్పాటు చేసి అది అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11500 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ మెమో నెంబరు 57 మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతర్ చేసిందని జిల్లా కార్యదర్శి కె.వంశీకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహరదీక్షలు చేపడతామన్నారు. అప్పటికీ చలించకుంటే ఏప్రిల్ 22వ తేదీ చలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శేఖర్, పూర్వ రాష్ట్ర కౌన్సిల ర్లు పీఆర్ మునిరత్నం, కుప్పరాజు, జిల్లా నాయకులు జయరాజ్, నరేష్, రవీంద్రబాబు, కొలత్తూరు భాస్క ర్, జాన్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులతో పాటు నిరాహార దీక్షా శిబిరంలో బైఠాయించారు. కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓ అనుపమకు వినతిపత్రాన్ని అందజేశారు. -
బాధ్యతగా మత్స్యకారుల భద్రత
తిరుపతి మంగళం : పులికాట్ సరస్సు పరిధిలోని సుమారు 20వేల మంది మత్స్యకారుల భద్రతను కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు పార్లమెంట్లో మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ మాట్లాడుతూ రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో పెద్ద యాంత్రిక పడవలతో పొరుగు రాష్ట్రాల జాలర్లు అక్రమంగా చొరబడి వలలు, పడవలకు నష్టం కలిగించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి, శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత, మత్స్యకారుల అక్రమ చొరబాట్ల నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ మండళ్లు ఏర్పాటు చేస్తే సమస్యల తీరిపోదని స్పష్టం చేశారు. తీరంలో కట్టుదిట్టంగా గస్తీ పెట్టాలని, అక్రమంగా చొరబడిన మర పడవలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని శాశ్వత అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,483 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ట్రైనీ సబ్ రిజిస్ట్రార్గా నాగార్జున
చిత్తూరు కార్పొరేషన్: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ట్రైనీ సబ్ రిజిస్ట్రార్లగా సుస్మిత, నాగార్జునను నియమించారు. బంగారుపాళ్యం కుర్మాయిపల్లెకు చెందిన నాగార్జున కడప సీఐఎస్ఎఫ్ ఎస్ఐగా ఉత్తరాఖండ్లో 2018–2026 వరకు విధులు నిర్వహించారు. తదుపరి ఉన్నత పరీక్షలు రాసి వైఎస్ఆర్ జిల్లా ఏటీడబ్ల్యూగా బాధ్యతలు చేపట్టారు. గ్రూప్స్–2లో ఎంపికై చిత్తూరు జిల్లాకు కేటాయించబడ్డా. సంవత్సరం పాటు ట్రైనీ సబ్ రిజిస్ట్రార్గా నగరంలో పనిచేయనున్నారు. ఆయనకు నియమాకపత్రాలను జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి మంగళవారం అందజేశారు. నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు పులిచెర్ల(కల్లూరు): నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వివిధ కోర్టుల్లో ష్యూరిటీగా వినియోగిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంపీడీఓ పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ సీళ్లు తయారు చేసి, వాటితో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ద్వారా తిరుపతి, పా కాల, పుంగనూరు, పీలేరు, చిత్తూరు కోర్టుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు ష్యూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సీళ్లు, రబ్బరు స్టాంపులు, ఇంక్ప్యాడ్, వ్యాల్యుయేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకొన్నారు. పులిచెర్ల 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన డి.ఆంజనేయులు, సి.రవి, చిన్నగొట్టిగల్లుకు చెందిన నీలం వెంకటరమణ, తిరుపతికి చెందిన పి.బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కుప్పం రూరల్: చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండ లం మోట్లచేను గ్రామంలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మృతి చెంది... మంగళ వారం బయటపడ్డ సంఘటన వివరాలు స్థానికుల కథనం మేరకు ఇలా ఉంది. మోట్లచేను గ్రామానికి చెందిన భూపతి(38)కి, భార్య మధ్యన తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా ఇరువురు గొడవలు పడ్డారు. ఆదివారం తరువాత భూపతి కనిపించకుండా పోయాడు. తీరా మంగళవారం గ్రామం సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసు కుని వేలాడుతున్న భూపతి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. భూపతి మృతి చెందిన తీరు... సంఘటనలో ఆనవాళ్లను బట్టి స్థానికు లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులపై దాడి చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఏసీబీ అధికారులపై దాడి చేసినందుకు సనంగి రామకృష్ణ, సనంగి సతీష్ అనే అన్నదమ్ములపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ సీఐ నెట్టి కంఠయ్య కథనం మేరకు.. చిత్తూరులోని స్టాంపులు–రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో బయట రైటర్లు ఉన్న పలు దు కాణాల్లో తనిఖీలు చేశారు. ఏసీబీ కానిస్టేబుళ్లు ధనుంజయ్, లీలాప్రసాద్ తనిఖీలు చేస్తున్న సమయంలో వెలుపల ఉన్న రైటర్స్ దుకాణంలో ఉన్న రామకృష్ణ, సతీష్ వాదనకు దిగారు. ఆపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేశారు. దీంతో ఏసీబీ సీఐ నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ‘గాలేరు– నగరి’ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్ తిరుపతి అర్బన్: గాలేరు–నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి పూల మొక్కను అందజేశారు. పాఠశాలకు మౌలిక వసతులు గుడిపాల: పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. మంగళవారం నరహరిపేట జెడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలోని బిల్డింగ్లకు పెయింటింగ్, విద్యార్థులకు డెస్క్లు, పాఠశాల పైకప్పుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను తెలియజేస్తేపరిష్కరిస్తామన్నారు. ప్రకృతి సేద్యంతో అధిక ఆదాయం తవణంపల్లె: ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం వస్తుందని జిల్లా రీసోర్స్ సెంటర్ అధికారి లక్ష్మీప్రసన్న తెలిపారు. మంగళవారం మండలంలోని చెర్లోపల్లెలో పీఎం ఆర్కేవీవై(ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) పథకం కింద రైతులకు వ్యవసాయ సాంకేతికత, సమగ్ర పోషక నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈఓ కుసుమ, ఏఓ వందన, రైతులు పాల్గొన్నారు. -
మామిడి ముందస్తు అంచనా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మామిడి దిగుబడి అంచనాను ఉద్యాన శాఖ అధికారులు పూర్తి చేశారు. తోతాపురి 40024 హెక్టార్లకు 483981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చునని అంచనా వేశారు. అలాగే బేనీషా 6856 హెక్టార్లకు 42242 టన్నులు, కాదర్ 2702 హెక్టార్లకు 18834 టన్నులు, నీలం 5178 హెక్టార్లకు 42242 టన్నులు, మల్లిక 1349 హెక్టార్లకు 10444 టన్నులు, ఇత ర రకం 3217 హెక్టార్లకు 23509 టన్నుల దిగుబడి ఉండవచ్చునని ముందస్తుగా గుర్తించారు. మొత్తంగా 59326 హెక్టార్లు ఉండగా సుమారు 621252 హెక్టార్లల్లో దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యం చిత్తూరు రూరల్ (కాణిపాకం): రానున్న రెండు సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాలో క్షయవ్యాధి కేసులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం టీబీ నిర్ధారణ సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లాలో సుమారు 2,500 నుంచి 3,000 వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరికి సమయానికి మందులు అందజేస్తున్నామని తెలిపారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభించి, ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే టీబీ పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, చుడా చైర్మన్ కఠారి హేమలత, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్పొరేట్కు ప్రభుత్వ భూములు – సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ నగరి: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేయాలంటూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నగరి టవర్ క్లాక్ సెంటర్ నుంచి నిర్వహించిన ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు వందల ఎకరాలు దోచిపెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ కచ్చితంగా అందరికీ పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, పార్టీ నాయకులు మురళి, శిరావుద్దీన్, యేసయ్య, రాజేంద్రన్, సతీష్. నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు పార్వతి, కుట్టి, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారంపై అక్షింతలు
పలమనేరు: పూర్వపు పలమనేరు రెవిన్యూ డివిజన్లోని సదుం మండలం కభంవారిపల్లి పంచాయతీ చింతపర్తివారిపల్లి వద్ద గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కొత్త చెరువు ప్రాజెక్టును నిర్మించింది. దీని నిర్మాణం కోసం అక్కడి రైతు ల నుంచి భూములను ఎల్ఏ ద్వారా సేకరించారు. కానీ వారికి ఆపై నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. వీరిలో కొందరు హైకోర్టుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇక్కడి రెవెన్యూ అధికారులు వెంటనే పరిహారాన్ని రైతులకివ్వాలని ఆదేశించడంతో ఇప్పుడు దారిలోకి వచ్చిన అధికారులు ఈ పనులను చేపడుతున్నారు. వీరిలోనూ కొందరికి పరిహారం దక్కలేదు. దీంతో వీరు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతపర్తివారిపల్లి వద్ద పచ్చార్లొంకపై గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కొత్త చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి పూను కుంది. ఇందుకోసం ఆ ప్రాంతంలోని 82 ఎకరాల పట్టాభూములు, 43.53 ఎకరాల డీకేటీ భూములు, 52 ఎకరాల ప్రభుత్వభూమి మొత్తం 176 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించారు. ఇందుకు నష్టపరిహారంగా బాధిత రైతులకు రూ.13.76 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే పరిహారం ఇవ్వకుండా రైతులను పరిహాసం చేశారు. దీనిపై ఆగ్రహించిన వై.లక్ష్మమ్మతోపాటు మరో 65మంది పిటిషనర్లుగా ఇరిగేషన్శాఖ, సీఈఓ ఇరిగేషన్, కలెక్టర్, ఆర్డీఓ, సదుం తహశీల్దార్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతివాదులుగా చేస్తూ హైకోర్టులో 2024లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం బాధితులకు అవార్డు పాసైనప్పటినుంచి ఇప్పటిదాకా ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. దీంతో రైతులు కోర్టు ధిక్కరణకు వెళ్లగా తాజాగా హైకోర్టు అక్షింతలు వేయడంతో పరిహారం ఇచ్చేందుకు అధికారులు పూనుకున్నారు. మరో తిరకాసు మొత్తం బాధిత రైతుల్లో 88 మందికి రూ.8కోట్ల దాకా పరిహారం దక్కింది. పరిహారం దక్కని రైతులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దకొచ్చి సదుం రెవెన్యూ అధికారులకు డబ్బులిచ్చిన వారికి మాత్రం పరిహారం ఇస్తూ తమలాంటిి పేదలకు అన్యాయం చేశారంటూ ఆరోపించారు. ఆర్డీఓ వీరికి నచ్చజెప్పినా పట్టించుకోలేదు. సదుం మండల తహశీల్దార్తోపాటు వీఆర్ఓ దాకా తమ సమస్యకు కారణమంటూ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో చింతపర్తివారిపల్లి వద్ద నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టు , వడ్డీతో పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు అందరికీ న్యాయం చేస్తాం కొంతమంది రైతులు వచ్చి రకరాకాల ఆరోపణలు చేసిన మాట నిజమే. కానీ మొత్తం రైతుల్లో అన్ని బ్యాంకు ఖాతా నెంబర్లు కరెక్ట్గా ఉన్నవారి ఖాతాలకు అవార్డు జమ అయింది. కొందరు రైతులు గతంలో గ్రామీణ బ్యాంకు ఖాతాలను ఇచ్చారు. అయితే ఆ బ్యాంకు ఇప్పు డు కెనరా బ్యాంకుతో కలిసినందున ఖాతాలు మారా యి. సీఎఫ్ఎంఎస్లో ఖాతాలకు సంబంధించిన సమస్యలతో రిజెక్ట్ అయినమాట నిజ మే. చాలామందికి డాక్యుమెంట్లు, ఖాతాలను అప్డేట్ చేశాం. మిగిలినవారి సమస్యలను పరిష్కరిస్తాం. అయి తే ఈ వ్యవహారంలో అధికారులు మామూళ్లు తీసుకున్నారనేది నిజం కాదు. – భవానీ, ఆర్డీఓ, పలమనేరు -
కేజీబీవీలలో పటిష్ట భద్రత
– నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో విద్యార్థినుల భద్రతను మరింత మెరుగు రిచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడంతో పాటు, క్రమశిక్షణను పర్యవేక్షించడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టారు. 8 కేజీబీవీల పనితీరును జిల్లా కేంద్రంలోని సమగ్రశిక్ష శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఏర్పా టు చేసిన మానిటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. సిబ్బంది పనితీరు, విద్యార్థుల ఆహార నాణ్యతను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించవచ్చని తెలిపారు. కేజీబీవీ జీసీడీఓ ఇంద్రాణి పాల్గొన్నారు. నిఘా నీడలో విద్యాలయాలు -
గ్యాస్ మంట
పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్రీ పాయింట్లు, హోటళ్లలో ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ధరలు పెంచినట్లు బోర్డులు పెట్టారు. గుడిపాలలో చాలా వరకు హోటళ్లు వారు గ్యాస్ పొయ్యికి బదులు కట్టెల పొయ్యికి మారిపోయారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, పానీపూరి సెంటర్లు, చిన్న హోటళ్లను మూసివేశారు. కొన్ని ఇళ్లలో గ్యాస్ స్టవ్లకు బదులు ఆరుబయట కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నారు. గుడిపాల మండలంలో పాటు చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. – గుడిపాల గ్యాస్ పెరగడంతో హోటల్లోని మెనూలో 10 రూపాయలు పెంచుతూ బోర్డు , గుడిపాలలో కట్టెల పొయ్యిపై వంటలు -
నిశీధిలో డైట్
నిధుల లేమి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కార్వేటినగరం డైట్కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇక్కడ దాదాపు తెలుగు, తమిళ భాషలకు సంబంధించి 260 మందికి పైగా ఛాత్రోపాధ్యాయులు శిక్షణ తీసుకునే వారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ డైట్పై శీతకన్ను వేయడం, ప్రైవేటు కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఇక్కడ దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడ డైట్లో రక్షణ కొరవడింది. బయటి వ్యక్తులు సైతం డైట్ వసతి గృహంలో ఉంటున్నట్టు సమాచారం. ఇప్పటికై నా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి డైట్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్వేటినగరం : కార్వేటినగరంలోని జిల్లా ఉన్నత విద్య శిక్షణ సంస్థ(డైట్)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులు డైట్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా తయారైంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే అంధకారం నెలకొంటోంది. వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చీకట్లో కాలం వెల్లదీయాల్సి వస్తోంది. వసతి గృహం నుంచి అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట విష పురుగుల సంచారం అధికంగా ఉండడంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని వాపోతున్నారు. సెల్ ఫోన్ల వెలుతురులో బయటకు రావాల్సి వస్తోందని చెబుతున్నారు. కార్వేటినగరంలోని డైట్లో మొత్తం 67 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాలలో సుమారు వంద మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ అరకొర వసతుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల డైట్ ఆవరణలో కొండ చిలువ సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మనీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మట్టి తోలి మాయ చేశారు డైట్లో పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తూ గుంతను తలపించేది. ఈ సమస్యను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ రూ.10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మకై ్క మట్టి తోలి చదును చేయకుండా చేతులు దులుపుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. భవనాలు పెయింటింగ్ వేసి రూ.లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిటికీలకు మెస్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ పనులు చేయలేదన్నారు. అలాగే సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తొలగించారు. వాటి స్థానంలో నూతనంగా గదుల నిర్మాణం కోసం మట్టిని తవ్వి వదిలేసినట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి డైట్లో జరిగిన నిధుల గోల్మాల్పై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మురికి కూపంలా డైట్ డైట్లో పారిశుద్ధ్యం లోపించింది. నీటి ట్యాంకు వద్ద నీరు వృథాగా పోతుండడంతో బురదమయంగా మారింది. ట్యాంకు చుట్టూ పాచి పట్టి దుస్థితికి చేరింది. దోమలు వృద్ధి చెంది రాత్రిళ్లు దాడి చేస్తుండడంతో సరిగ్గా నిద్ర పట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ట్యాంకును శుభ్రం చేయడంతోపాటు నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. -
ముగిసిన ఏసీబీ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన ఏసీబీ తనిఖీలు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం సాయంత్రం 4.55 గంటలకు తనిఖీలు ప్రారంభించి 24 గంటలు పూర్తిగా తనిఖీలు చేశారు. సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన సమయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక అటెండర్ అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఆ సిబ్బంది మంగళవారం సైతం విధులకు హాజరు కాలేదు. సబ్రిజిస్ట్రార్, ఇతర విభాగాల సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు, వారి అసిస్టెంట్లను విచారించారు. పలు ఫైల్స్ను పరిశీలించారు. నిషేధిత భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని ఏసీబీ గుర్తించి, వివరాలు సేకరించింది. ఏసీబీ తనిఖీల సమయంలో కార్యాలయంలోని వివిధ ప్రదేశాల్లో రూ.30,200, ఉద్యోగుల వద్ద రూ.4,440, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.79,090 లభించాయి. అనధికార నగదు రూ.1,12,730ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 15 మంది దస్తావేజు లేఖరుల్ని విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో డాక్యుమెంట్ రైటర్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు -
అర్హులు ఎవరంటే?
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే ఐదు శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్న్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉన్న వారికి ఐదు శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు. చిత్తూరు కలెక్టరేట్ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31లోగా (www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనుంది. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30వ తేదీ వరకు ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఏడు కేంద్రాల్లో నిర్వహణ ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ)లలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భావి శాస్త్రవేత్తలకు వేదికగా యువికా–2026 సద్వినియోగం చేసుకోవాలి 9వ తరగతి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యువ విజ్ఞాని కార్యక్రమానికి జిల్లాలోని 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ణానం పై ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదిక. ఈ శిక్షణలో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 శాతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. – సుమిత్కుమార్గాంధీ, కలెక్టర్, చిత్తూరు -
ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిప ల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ సుమిత్కుమార్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్, కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి కలెక్టరేట్లోని చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్యేక అధికారిగా సుమిత్కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే పాలకవర్గాల (కౌన్సి ల్) గడువు పూర్తవడంతో.. కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి మునిసిపల్ ఎన్నికలు జరిగేంత వరకు కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. ఏడాదిగా పెండింగ్ చిత్తూరు కార్పొరేషన్: వ్యవసాయ సర్వీసుకు గత ఏడాది ఫిబ్రవరిలో డబ్బులు కట్టినా విడుదల చేయలేదని సోమల నుంచి రైతు మునేంద్రబాబు ఫిర్యాదు చేశారు. సోమవారం ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే పుంగనూరులోని నగరి ఎస్ఎస్ గ్రామంలో ఉదయం 7–8 గంటల మధ్యలో లోఓల్టేజీ సమస్య వేధిస్తోందని వినియోగదారుడు వాసుదేవయ్యశెట్టి తెలిపారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఈ హామీ ఇచ్చారు. -
పొగాకు ఉత్పత్తుల రవాణా గుట్టురట్టు
అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను యాదమరి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసు గ్రీవెన్స్కు 28 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదా లు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమ స్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయ డంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. వాటిని దశ ల వారీగా పరిష్కారించనున్నట్లు వివరించారు. ‘సంపన్న కారి కార్యక్రమం’ వరం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు సంపన్న కారి కార్యక్రమం వరం లాంటిందని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాల అభివృద్ధికి రూపొందించినదే సంపన్న కారి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటు నాలుగు లక్షల వరకు సున్నా వడ్డీ రుణ సదుపాయం అందిస్తారన్నారు. జిల్లాలో ఇందుకు అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం రవి, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, రవి, డీఆర్డీఏ అధికారులు కేశవులు , మణి పాల్గొన్నారు. -
సంక్షేమం పట్టదా బాబూ?
కార్వేటినగరం: సంపద సృష్టించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతానని నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు విస్మరించారని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు.సోమవారం ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల కడుపుకొట్టేందుకు సిద్ధమైందన్నారు. గత వైఎస్సార్సీపీ హ యాంలో పేదల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అమలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు రెండేళ్లు అవుతు న్నా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్సిక్స్ హిట్ అంటూ ప్లాప్ షోలు చూపించి పేదల నడ్డి విరుస్తోందన్నారు. యువతకు కొత్తగా రుణాలు ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. గ్రామాల్లో నీటి పన్ను, చెత్త పన్ను, చిరు వ్యాపారస్తులపై కూడా ట్రేడ్ ఫీజుల పేరిట ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. పరామర్శ ఆళత్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకు డు ముత్యాలశెట్టి(53) అనారోగ్యంతో మృతి చెందా రు. సమాచారం అందుకున్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆయన గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి పిల్లల భవిష్యత్తుకు తాను బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా కొత్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసులునాయుడు అన్న సుబ్రమణ్యంనాయుడు భార్య లక్ష్మీదేవి(65) అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామానికి వెళ్లి లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మాజీ జేసీఎస్ కన్వీనర్ పురంధర్, నాయకులు చిరంజీవిరెడ్డి, మురాజ్, శ్రీనివాసులునాయుడు, జనార్దన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చిరంజీవులునాయుడు, ధర్మయ్య, శేఖర్రెడ్డి, కుమార్, ధనకోటేశ్వరరావు, అర్జున్, పెద్దబ్బ, సురేష్నాయుడు ఉన్నారు. -
పొగాకు ఉత్పత్తుల రవాణా గుట్టురట్టు
యాదమరి: అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను యాదమరి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపిన వివరాలు మేరకు.. సోమవారం ఉదయం యాదమరి పోలీసు బృందం బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టాటా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎటువంటి బిల్లులు లేకుండా పొగాకు ఉత్పత్తుల ప్యాకె ట్లు బయటపడ్డాయి. బెంగళూరుకు చెందిన వాహన డ్రైవర్ నదీమ్ పాషా, తబ్రీజ్ను అదుపులోకి తీసుకుని విచారించగా, అదే ప్రాంతానికి చెందిన తమ యజమాని ఆదేశాల మేరకు సరుకుని తిరుపతికి తరలిస్తున్నామని వెల్లడించారు. వాహనంలో సుమారు రూ.8,99,496 విలువ చేసే 93 సంచుల పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వరల్డ్ టీబీడే వేడుకలు రేపు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులో మంగళవారం వరల్డ్ టీబీ డే–2026 వేడుకలు నిర్వహించనున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి గాంధీ విగ్ర హం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నా రు. సమావేశంలో టీబీ నిర్మూలనపై అవగాహన కల్పించ డంతో పాటు టీబీ ముక్త పంచాయతీ కార్యక్రమంలో భాగంగా 27 టీబీ రహిత పంచాయతీలకు గాంధీ విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఉత్తమంగా పనిచేసిన వారికి సత్కారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ పాలసముద్రం : మండలంలోని బలిజకండ్రిగ సమీపంలో టీటీడీ దేవస్థానానికి ఎదురూగా ధర్మరాజుల గుడికి తూర్పు భాగమైన అడవిలో పేకాట ఆడుతున్న వారిపై సోమవారం నగరి ఇచార్జ్ డీఎస్సీ సాయినాథ్, కార్వేటినగరం సీఎం హనుమంతప్ప, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, ఎస్బీ కానిస్టేబుల్ శివకుమార్, ఐడీ సిబ్బంది దాడి చేశారు. బలిజకండ్రిగ సమీపంలో రాత్రి పూట పేకాట ఆడుతున్నట్టు అందిన రహస్య సమాచారం మేరకు ఎస్పీ తుషార్డూడీ ఆదేశాలతో దాడి చేసినట్టు ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లు పట్టుబడగా.. మరో ఎనిమిది మంది పరారైనట్టు పేర్కొన్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.55,680 నగదు, ఐదు మోటారు సైకళ్లు, తొమ్మిది మొబైల్ ఫోన్లు, మూడు పేకాట కట్టులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టయిన వారిలో జీ.గోవింద (50), ఎన్.నరసింహన్(38), ఎమ్.రామన్(28), సీ.అరుల్దాస్(49), ఈ.శివరాజ్ (35), ఎమ్.కృష్ణన్ (56) ఉన్నట్టు తెలిపారు. వీరందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసి చిత్తూరు కోర్టులో హాజరు పరిచినట్టు వెల్లడించారు. ఇళ్ల పట్టాలపై విచారణకు ఆదేశం రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీ, లక్ష్మీనారాయణ కాలనీలో ఇళ్ల పట్టాలపై విచారణకు జిల్లా కలెక్టర్ సుమితకుమార్ సోమవారం అదేశాలు జారీ చేశారు. సర్వే నం.1605–1, 1606–2లో 172 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి, సొమ్ము చేసుకున్నారని రొంపిచెర్లకు చెందిన దొరబాబునాయుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలో ఏసీబీ బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తూనే అదే సమయంలో డ్యాకుమెంట్ రైటర్ల దుకాణంలో సోదాలు చేశారు. పలువురు రైటర్లను అదుపులో తీసుకొని కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో రైటర్ రామకృష్ణ తనిఖీకి వచ్చిన ఏసీబీ కానిస్టేబుల్ పై దాడికి దిగారు. తనిఖీకి వచ్చిన సిబ్బందితో ఐడీ కార్డు చూపాలనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రామకృష్ణ గొడవకు దిగి దాడి చేయడంతో టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో రామకృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భారీగా నగదు స్వాధీనం చిత్తూరు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో సీఐలు నరసింహారావు, విద్యసాగర్, రమణతో కూడిన బృందం తనిఖీల్లో చేపట్టింది. రిజిస్ట్రార్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లలో జరిగిన లావాదేవీలను పరిశీలించారు. అక్కడ నిర్ణీత నగదుకు మించి రూ.95 వేలు ఎక్కువగా ఉండడాన్ని గుర్తించారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తనిఖీలప్పుడు కార్యాలయంలోని దస్తావేజు లేఖరులు, వారి సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫోన్ పే లావాదేవీలను పరిశీలించి.. ఈ నగదు ఎవరు పంపారని ఆరా తీశారు. -
యువతను దగా చేస్తున్న బాబు
తిరుపతి మంగళం: ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను నమ్మించినట్లే యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇస్తానంటూ చంద్రబాబు యువతను దగా చేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు ఉదయ్వంశీ మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా కేవలం ప్రచారం కోసం 10,060 ఉద్యోగాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి న కూటమి ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీలను నిలబెట్టుకోలేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
సెమిస్టర్ ఫలితాలు విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఎన్.పి.సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రథ మ సెమిస్టర్ ఫలితాలు సోమవారం ఎస్వీ యూ నివర్సిటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రణాళిక, అభివృద్ధి మండలి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎన్.పి.వెంకటేశ్వరచౌదరి మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు కేవలం విద్యలోనే కాకుండా క్రీడలు, ఇతర అంశాల్లో సైతం ప్రతిభను చాటుతుండడం గర్వ కారణమన్నారు. సీపీడీసీ సభ్యులు, పూర్వ విద్యార్థిని డాక్టర్ ఎం.శైలజా మాట్లాడుతూ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను గౌర వించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.మనోహర్ మాట్లాడుతూ కళాశాల స్వయం ప్రతిపత్తి సాధించిన తొలి ప్రయత్నంలోనే 76.54 శా తం ఉత్తీర్ణత సాధించడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు మార్కుల మెమోలను అందజేశారు. -
వర్మీకంపోస్టు, జీవామృతం వల్ల లాభాలు
పుత్తూరు: మండలంలోని రామసముద్రం గ్రామానికి చెందిన ఎస్.మహేశ్వరరావు, పద్మావతి దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రైతు కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. మహేశ్వరరావుకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించి పదేళ్ల క్రితమే మొదలు పెట్టారు. మనం అందించే వ్యవసాయ ఉత్పత్తులు ఆకలిని తీర్చడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్నది ఆ దంపతుల ఆశయం. ఇందుకు వర్మీకంపోస్టును ఎంచుకున్నారు. దీంతో పాటు జీవామృతం, ఘనజీవామృతాలను గత పదేళ్లుగా తామే తయారు చేస్తూ, ఇతర రైతులకు విక్రయిస్తూ, తామూ వినియోగిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలా వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలు మరో రెండు చోట్ల మాత్రమే ఉండడం గమనార్హం. రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణ కాల్వలో రామ్మోహన్నాయుడు, వడమాలపేట మండలం, వేమూరులో అయ్యప్పనాయుడు వర్మీకంపోస్టులను నిర్వహిస్తున్నారు. జీవామృతం తయారీ ఇలా.. ఆవులను పెంచాలి ప్రతి రైతు ఆవులను పెంచాలి. నా తల్లిదండ్రులు నిర్మాలాదేవి, వెంకటాచలంనాయుడు నాకు 50 దేశీయ ఆవులనిచ్చారు. నేను వాటిని 70కి పెంచాను. నా భార్య పద్మావతి ప్రకృతి సేద్యం చేయడంలో పూర్తి సహకారం అందిస్తోంది. ఇద్దరం కలసి ఆవు పేడతో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నాం. పంటల సాగులో దానిని వినియోగిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నాం. మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకొనే ఆహారం విషతుల్యం కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన పంటలు తయారు పండించడానికి ప్రతి రైతు ముందుకు రావాలి. వర్మీకంపోస్టును స్వయంగా తయారు చేస్తున్నాం. పలువురికి విక్రయిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎస్.మహేశ్వరరావు, పద్మావతి, వర్మీకంపోస్టు తయారీదారి దంపతులు, రామసముద్రం, పుత్తూరు మండలం కూరగాయలు పండించాలి ప్రస్తుత సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయమే మార్గం. ప్రతి కుటుంబం 15 రకాల కూరగాలను పండించే విధానాన్ని అందిపుచ్చుకోవాలి. 1996లో తిరుపతిలో ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంస్థ (వర్డ్) ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కోసం పనిచేస్తున్నాం. ఈ కోవలో నడుస్తున్న రైతులందరికీ ప్రభుత్వం తనవంతు సహకారం అందించాలి. అలాగే హైస్కూల్ నుంచి యూనివర్సీటీ విద్యార్థుల వరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవాటు చేయాలి. – డాక్టర్ కె.గంగాధరం, కార్యదర్శి, వర్డ్, తిరుపతి ఆ దంపతులకు ప్రకృతి సేద్యంపై మక్కువ ఎక్కువ. వర్మీకంపోస్టు, జీవామృతం ద్వారా వ్యవసాయం చేయడంలో ముందుంటారు. గత పదేళ్లుగా వర్మీకంపోస్టును తయారు చేస్తునానరు. దాన్ని నిస్సారమైన భూముల్లో సైతం వినియోగిస్తూ తద్వారా ఆ భూములను సారవంతం చేసి పునరుజ్జీవం పోస్తున్నారు. తాము తయారు చేసిన వర్మీకంపోస్టును ఇతర రైతులకూ విక్రయిస్తూ, వారిని ప్రకృతి సేద్యం పైపుగా నడిపిస్తున్నారు. వారే పుత్తూరు మండలానికి చెందిన మహేశ్వరరావు, పద్మావతి దంపతులు. వర్మీకంపోస్టు, జీవామృతం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
30 ఏళ్ల పాలకులు ఎందుకు చెయ్యలేదు?
మూడేళ్లలో చేసిన అభివృద్ధి.. చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలి నగరి : గత ప్రభుత్వంలో తొలి రెండేళ్లు కరోనా తీవ్రతతో గడచిపోగా మిగిలిన మూడేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మూడు దశాబ్దాలుగా పాలించిన వారు ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోయారని మాజీ మంత్రి ఆర్కేరోజా నిలదీశారు. ప్రజలకు మంచి చెయ్యాలనే తపన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. ఆదివారం తన నివాస కార్యాలయంలో ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న పుత్తూరు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ఆమె సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తీవ్రతతో గడిచిపోయిందన్నారు. ఆ సమయంలో ప్రజలకు తామందరం ఎంతో అండగా నిలిచామన్నారు. మిగిలిన మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో తాజ్మహల్ లాంటి షాదీమహల్ కట్టించామని, పార్కు, పాలిటెక్నిక్ కళాశాల, క్రిమేషన్ షెడ్డు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మున్సిపల్ కార్యాలయం, ఆస్పత్రి నవీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. గతంలో పాలించిన నాయకులు వీటిని ఎందుకు చెయ్యలేక పోయారన్నారు. నియోజకవర్గ కేంద్రం నగరిలో టీటీడీ కల్యాణ మండపం లేదని, వడమాలపేట మండలంలో ప్రసిద్ధి చెందిన టీటీడీ ఆలయం ఉన్నా అక్కడ టీటీడీ మండపం లేదని గతంలో ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. నేత్ర దేవత దేశమ్మ దేవత ఆలయం నుంచి పలు ఆలయాలు నిర్మించామని గతంలో ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ఇవి చెయ్యాలంటే ప్రజలకు మంచి చెయ్యాలనే తపన వారికుండాలన్నారు. జగనన్న నుంచి పొందిన స్ఫూర్తితో తాను చెయ్యగలిగానన్నారు. తోపు..తురుము అని చెప్పుకునే నాయకు లు ఎందుకు వీటిని చెయ్యలేకపోయారో ప్రజలే ఆలోచించాలన్నారు. కట్టిన షాదీమహల్ను వినియోగంలోకి తేలేని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానిదన్నారు. వినియోగంలోకి తెస్తే ఎక్కడ రోజమ్మకు పేరొస్తుందోనని అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఆయన చివాట్లు పెట్టినా వినియోగంలోకి రాలేదన్నారు. మరోమారు ఈ విషయమై గత మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలెక్టర్ను సంప్రదిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పుత్తూరు ఆస్పత్రికి రూ.9 కోట్లు మంజూరు చేసుకొని రాగా దానిని సత్యవేడుకు పంపి పుత్తూరుకు రూ.1.5 కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే తండ్రిదన్నారు. వారు తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆనందపడుతూ పుత్తూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అవసరం లేని చోట ఫ్లై ఓవర్ కట్టి ప్రజలను ఇబ్బంది పడేలా చెయ్యడం మినహా ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యేగానీ, ఆయన తండ్రిగానీ ఎందుకు అభివృద్ధి పనులు చెయ్యలేక పోయారన్నారు. ప్రజలే ఈ విషయం గ్రహించి నేడు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. కొండచుట్టు మండపం విషయంలో .. పవిత్ర కొండచుట్టు మండపాన్ని రహదారి వెడల్పులో పోకుండా కాపాడుకుందామని వెళితే 2023లో గాడిదలు కాస్తున్నారా ? అంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడటంపై మాజీ మంత్రి రోజా స్పందిస్తూ జాతీయ రహదారి పనులు మంజూరై భూముల స్వాధీనానికి టెండర్ వదిలింది 2008 ఆగస్టు నెల 20వ తేదీన అన్నారు. దానికి సంబంధిత పత్రికా ప్రకటనలను చూపారు. అయితే రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఢిల్లీ వరకు వెళ్లి 2023లో ఆగిన పనులకు చలనం తెచ్చి రోడ్డు పనులను తాను ప్రారంభించానన్నారు. 2008లో సర్వే చేసిన మేరకు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. నాడు నగరిలో ఒక సీనియర్ నాయకుడు, పుత్తూరులో ప్రస్తుత ఎమ్మెల్యే తండ్రి ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. ఆపై టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారే ఉన్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆయన తండ్రి వెంట తిరుగుతూ ఉన్నాడన్నారు. అప్పుడు చేసిన సర్వేలో మండపం తొలగించేలా ఉంటుందని వీరికి తెలియదా అని మాజీ మంత్రి రోజా సూటిగా ప్రశ్నించారు. 2008లో ఎవరు పాలకులు ఉన్నారో తెలియని అజ్ఞానంలో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. నిజానికి కొండచుట్టు మండపం విషయంలో గాడిదలు కాసింది ఎమ్మెలే, ఆయన తండ్రే అన్నారు. అవాంతరాలు ఎదురైనా మండపాన్ని కాపాడుతా? రోడ్డు విస్తరణ పనుల్లో మహానేత వైఎస్సార్ విగ్రహం తొలగించే సమయంలోనే కొండచుట్టు మండపం కూలుస్తారనే విషయాన్ని నాయకులు చెప్పారని వెంటనే ఆ విషయంలో తాను చైన్నెకి వెళ్లి జాతీయ రహదారి ప్రాజెక్టు అధికారులతో చర్చించడం, కోర్టుకు వెళ్లి స్టే తేవడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కారిని కూడా కలవడం జరిగిందన్నారు. దానిపై నేటి వరకు పోరాడుతున్నానని కొండచుట్టు మండపం కాపాడే బాధ్యతను నేను తీసుకున్నానన్నారు. అయితే దానిపై చర్యలు చేపట్టాల్సిన ఎమ్మెల్యే.. ఆవిడ తలచుకుంటే మండపాన్ని కాపాడేస్తుందా అంటూ పలువురి వద్ద ఎద్దేవా చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కొలవుదీరే 21 మంది దేవతల ఆశీర్వాదం తనకు ఉంటుందన్నారు. తప్పక మండపాన్ని కాపాడగలుగుతానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు ప్రజల కోసం పనిచేసే టైం లేదన్నారు. ఒక డిపార్ట్మెంట్ చినబాబు చూసుకుంటే.. మరో డిపార్ట్మెంట్ బాలగోపాల్ చూసుకుంటున్నారని, దోచుకుందాం, దాచుకుందాం అన్నరీతిన పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక్క కొండ కూడా వదల్లేదని కొండలన్నీ క్వారీలకు అప్పగించి గ్రావెల్, కంకర, ఇసుక అంటూ అన్నీ దోచుకుంటున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో క్వారీల్లో ఏ మేరకు వనరులు తీశారో, ప్రస్తుతం రెండేళ్లలోనే ఎంత తీశారో లెక్కిస్తే తేలిపోతుందన్నారు. తిరుమల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలని మాజీ మంత్రి ఆర్కేరోజా విమర్శించారు. అబద్దాలతో అధికారపీఠం ఎక్కిన ఆయన ..చేసింది ఏమీ లేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతిలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పింఛన్లు లేవని ఏ హామీ నెరవేర్చకుండా తాను అధికారంలోకి వచ్చాకా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పడం కన్నా మరో విడ్డూరం ఏదీ లేదన్నారు. మన జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన తిరుమలనే అపవిత్రం చేస్తున్న చంద్రబాబు జిల్లాలో పుట్టినందుకు జిల్లావాసులు సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. టీడీపీ, జనసేన నాయకులు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని వారి కింద ఉన్న స్క్రాప్తో ప్రెస్ మీట్ పెట్టించడం, తిట్టించడం మాత్రమే చేస్తున్నారన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు మంచి చేయడం, మనం చేసిన అభివృద్ధి పనులు వారికి తెలియజేయడం పార్టీ శ్రేణుల కర్తవ్యమన్నారు. తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా పదవి బాధ్యతలు పూర్తిచేసుకున్న కౌన్సిలర్లు గజమాలతో మాజీ మంత్రి రోజాను సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, పార్టీ లీగల్సెల్ కన్వీనర్ రవీంద్ర, పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కోడెగిత్తల జోరు
వెదురుకుప్పం: పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని పాతగుంటలో జరిగిన జల్లికట్టు(ఎద్దుల పందేలు) దుమ్మరేపాయి. అట్టహాసంగా సాగిన జల్లికట్టు యువకుల్లో జోష్ తెచ్చింది. రామచంద్రాపురం, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఎద్దులను పందేనికి తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎద్దులకు పలకలు, వస్త్రాలు కట్టి పందేలకు వదిలారు. కోడెగిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోగా ఎద్దులను నిలువరించి పలకలు పట్టేందుకు యువత పోటీపడ్డారు. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి యువకులు ఆనందం పంచుకున్నారు. ఈ పోటీల్లో ఎద్దుల కింద పడి పలువురు గాయపడ్డారు. చెరువులో పడి రెండు కోడె గిత్తలు మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. సందడే..సందడి పాతగుంటలో ఆదివారం జరిగిన జల్లికట్టులో జగన్ నినాదంతో మారుమోగింది. యువత పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటంతో కూడిన పలకలు, వైఎస్సార్సీపీ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ జెండాలు, పలకలతో కూడిన కోడె గిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోతున్న క్రమంలో యువత జై జగన్ జైజై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు స్థానిక సర్పంచ్ భువనేశ్వరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బండి గోవర్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందన్, వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి బొజ్జారెడ్డి అల్లె వద్ద పూజలు చేసి పోటీలు ప్రారంభించారు. ఎద్దుల పందేలను ప్రారంభిస్తున్న సర్పంచ్ భువనేశ్వరి జనసందోహం -
శిక్షణకు హాజరుకావాలి
చిత్తూరు కలెక్టరేట్: జనగణనపై నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు క్షేత్రస్థాయి ట్రైనర్లు తప్పనిసరిగా హాజరు కావాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న 70 మందిని క్షేత్రస్థాయి ట్రైనర్లుగా నియమించామన్నారు. మొదటి విడతలో ఈనెల 23, 24, 25 తేదీల్లో కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లలో శిక్షణ ఉంటుందన్నారు. రెండో విడతలో ఈనెల 26, 28, 29 తేదీల్లో చిత్తూరు డివిజన్ క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణనివ్వనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి ట్రైనర్లు ఆ తర్వాత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన వివరించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 77,864 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,348 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
వంటింట నూనెల మంట
– ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం కార్వేటినగరం: పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు చిత్తూరు జిల్లాలోని వంటిళ్లలో మంట పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నూనె ధరలు ఒక్క సారిగా పెరిగి జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో లీటరు నూనె ధర రూ.5 నుంచి 10 రూపాయల మేర పెరిగింది. జిల్లాలో రోజుకు సుమారు 120 టన్నులకు పైగా ఆయిల్ విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. 10 రోజుల క్రితం ఒక కంపెనీ ఆయిల్ ధర రూ, 162 ఉండగా ప్రస్తుతం రూ, 170కి పెరిగింది. మరోక రకం ఆయిల్ ధర రూ.115 నుంచి 125కి చేరింది.ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నూనె ధరలు దిగి రాకుంటే ఆహారం పదార్థాల ధరలు పెంచక తప్పదని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. -
దంపతులను కబళించిన మృత్యువు
పూతలపట్టు(యాదమరి): తిరుమల యాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంటి వద్ద ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో కారులో బయలుదేరగా.. విధి ఆడిన వింత నాటకంలో ఏ కారులో అయితే ఉత్సాహంగా బయలుదేరారో అదే కారు వారి పాలిట మృత్యుశకటంగా మారుతుందని గ్రహించలేకపోయారు. మరో రెండు గంటల్లో తిరుమలకు చేరుకోనుండగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెలుతున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు దంపతులు సహా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం పి. కొత్తకోటలో చోటు చేసుకుంది. పూతలపట్టు పోలీసుల వివరాలు మేరకు.. కర్ణాటక రాష్ట్రం మాండ్య ప్రాంతానికి చెందిన సతీష్ (50) తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పూతలపట్టు మండల పరిధి పి.కొత్తకోట సమీపంలో స్వయంగా కారు నడుపుతున్న సతీష్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ముందు వెలుతున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో కూర్చున్న సతీష్, భార్య భాగ్యలక్ష్మి(45) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న శశాంక్, పవని, మహాలక్ష్మి, తుషారకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో సమీప పి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సతీష్, క్షతగాత్రులను అంబులెన్సులో తరలిస్తున్న పోలీసులు -
పరీక్షల దోపిడీ!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ల్యాబ్ల వ్యవహారం నియంత్రణ తప్పి దోపిడీ స్థాయికి చేరుకుంది. అడ్డ గోలుగా అమాయకుల రక్తాన్ని గుంజేస్తున్నాయి. రోగుల రక్తమే ఆదాయ మార్గంగా మార్చేశాయి. ప్రజ ల ఆరోగ్యంపై ఆధారపడి నడవాల్సిన ఈ వ్యవస్థ, ఇప్పుడు పూర్తిగా వ్యాపార ధృక్పథంతో నడుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పక్కనపెట్టి అనేక ల్యాబ్లు ఇష్టారాజ్యంగా సేవలు అందిస్తూ రోగులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ దందా వైద్య ఆరోగ్య శాఖ కళ్లగప్పగించుకుని చూస్తోందనే విమర్శలు భగ్గుమంటున్నాయి. ప్రజల భయమే పెట్టుబడి సాధారణ ఆరోగ్య సమస్యలకే ‘పెద్ద సమస్య కావచ్చు’ అని భయపెట్టి టెస్టులు చేయించుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆరోగ్యంపై ఉన్న భయాన్ని ల్యాబ్లు తమ లాభాలకు ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు జరగకపోవడం, ఫిర్యాదులపై స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. ‘ఆఫర్ల’ పేరుతో మాయాజాలం ‘‘ఫుల్ బాడీ చెకప్ ఆఫర్’’, ‘‘డిస్కౌంట్ ప్యాకేజ్’’ వంటి ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తున్న ల్యాబ్ లు, ఆ తర్వాత అవసరం లేని అదనపు టెస్టులు జోడించి భారీగా బిల్లులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భయం, అనుమానం కలిగించేలా మాట్లాడి టెస్టు లు చేయించుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాబ్ల దందాలో అత్యంత కీలక అంశం కమిషన్ వ్యవస్థ. కొన్ని ఆస్పత్రులు, డాక్టర్లు, సిబ్బంది ల్యాబ్లతో కుమ్మకై ్క ప్రతి టెస్ట్పై రూ.200 నుంచి రూ.250 వరకు కమీషన్ పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. డెమోను డమ్మీ చేసేశారు.. ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, స్కానింగ్ సెంటర్, ల్యాబ్ల పర్యవేక్షణ ఒకప్పుడు డెమో విభాగం చేతిలో ఉండేది. అడపాదడప పర్యవేక్షణ చేస్తూ...తప్పిదాలను సరిదిద్దేలా చర్యలు చేపట్టేవారు. అయి తే రెండేళ్ల కాలంలో ల్యాబ్ పర్యవేక్షణ శూన్యమైంది. రిజిస్ట్రేషన్ లేని ల్యాబ్లను గాలికొదిలేశారు. రెన్యూవల్ను ఆమాడదూరంలో పెట్టేశారు. వీటి నుంచి కమీషన్లు తీసుకుంటూ...గప్చుప్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాఖలోని ఓ ఉన్నతాధికారికి అంటకాగిన సిబ్బంది రిజిస్ట్రర్కానీ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్, ల్యాబ్లను తన గుప్పెట్లో పెట్టుకుని మామూళ్ల మత్తులో ఉండిపోతున్నారని శాఖలోని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. అడ్డగోలు వ్యాపారానికి చెక్పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ల్యాబ్లో రక్త నమూనాలను పరీక్షిస్తున్న దృశ్యం (ఫైల్)అనవసర టెస్టులతో.. భారీ బిల్లులు చిన్న సమస్యలకే పెద్ద పెద్ద టెస్టులు రాయించడం ఇప్పుడు సాధారణమైంది. వైద్య అవసరం లేకపోయినా ప్యాకేజీల పేరుతో రోగులకు టెస్టులు సూచిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఒక్కో టెస్ట్కు రూ.600 నుంచి ప్రారంభమై, కొన్ని సందర్భాల్లో రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి, పేద కుటుంబాలు ఈ ఖర్చులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి ల్యాబ్లో టెస్టుల ధరల జాబితా ప్రదర్శించాలి. కానీ చాలా ల్యాబ్లలో ఈ నియమం అమలు కావడం లేదు. రోగి అడిగితేనే ధర చెబుతూ, ప్రతి ఒక్కరికి వేరువేరు రేట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండా వందల ల్యాబ్లు జిల్లాలో పనిచేస్తున్న ల్యాబ్లలో గణనీయమైనవి సరైన రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నాయి. జిల్లా లో అధికారికంగా సుమారు 500పైనే ల్యాబ్లున్నా యి. అయితే వీటిలో కూడా రెవెన్యూవల్ కానివి వందల్లో ఉన్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కానివి జిల్లా వ్యాప్తంగా 300పైనే ఉండవచ్చునని అధికారులు అంచనా వేశారు. చాలా మంది ఇంట్లోనే ల్యాబ్లు ఏర్పాటు చేసుకుని...కొన్ని ఆస్పత్రులకు కమీషన్ల పేరుతో ఎరవేస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా ల్యాబ్ టెస్టులు పుంజుకుంటున్నాయి. చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధి, సుందరయ్యవీధి, సుబేదారువీధి, దర్గా సర్కిల్, గురునగర్ కాలనీ, కొంగారెడ్డిపల్లి, మిట్టూరు, తోటపాళ్యం, జిల్లా ప్రభుత్వ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వీటిలో చాలా వరకు కనీస ప్రమాణా లు పాటించకుండా టెస్టులు నిర్వహించడం వల్ల ఫలితాల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రోగుల చికిత్స కూడా తప్పు దోవ పట్టే ప్రమాదం ఉంది. -
ఇదేనా స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చే గౌరవం !
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మె ల్యే టీసీ రాజన్ (107) రెండ్రోజుల క్రితం అనా రోగ్యంతో బెంగళూరులోని ఆస్పత్రిలో మృతి చెందితే పలమనేరులో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. దేశం కోసం స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం స్థానిక తహసీల్దార్ సైతం అంత్యక్రియలకు హాజరు కాకపోవడం గమనార్హం. దీంతో కుటుంబీకులు, బంధువులు, స్థానికులే ఆఖ రి మజిలీని చేపట్టారు. గతంలో ఆయన బతికున్నప్పుడు జిల్లాలో జరిగే రిపబ్లిక్డే, పంద్రాగ స్టు వేడుకలకు ముఖ్య అతిథిగా పిలిచి సన్మానించిన కలెక్టర్లు ఆయన మరణించాక ఎందుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదనే మాట సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు.సాధారణ వ్యక్తిలా టీసీ రాజన్కు అంత్యక్రియలను నిర్వహిస్తున్న దృశ్యం పలమనేరులోని రాజన్ అద్దె ఇల్లు నిజాయితీ గల నేత పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం రాయలపేటలో 1918లో రాజన్ జన్మించారు. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరపున గెలుపొంది ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుడిగా , ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను తీర్చిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బతుకు ఇబ్బందిగా మారినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఉండేందుకు ఇల్లులేక, అద్దె ఇంట్లో బతికారు. తనకు రావాల్సిన పింఛనుకు సంబంధించి లంచం ఇవ్వడానికి మనసు రాక దశాబ్ధకాలంగా కలెక్టరు కార్యాలయం నుంచి భారత రాష్ట్రపతి వరకు తిరిగినా లాభం లేకుండా పోయింది. గతంలో టీడీపీ పాలనలో పంద్రాగస్టు వేడుకలకు తిరుపతికొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఫ్రీడం ఫైటర్స్కు రూ.15 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాలు అమలుకాలేదు. -
బంగారు ఆభరణాలు చోరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లిలో చోరీ జరిగిన ఘటనను ఆదివారం గుర్తించారు. ఇక్కడ నివాసం ఉంటున్న ఒక కుటుంబం గత 40 రోజులుగా బెంగళూరులో ఉంటోంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగుల గొట్టి 25 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు వన్టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. నిత్యావసర సరుకులు, ల్యాప్టాప్లు వితరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): సామాజిక సేవలను మరింత విస్తృతం చేయాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్న్స్ క్లబ్ జిల్లా గవర్నర్ అశ్వత్థ నారాయణస్వామి అన్నారు. ఆదివారం చిత్తూరులోని ఓ హోటల్లో నిర్వహించిన లయన్స్క్లబ్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యాన్నదానం చేస్తున్న పలు సంస్థలకు బియ్యం, విద్యార్థులకు రెండు ల్యాప్ టాప్లు అందజేశారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురిని సత్కరించారు. లయన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరులో ఎలక్ట్రిక్ శ్మశాన వాటిక నిర్మాణం, కలెక్టరేట్లో వాటర్ ప్లాంట్ నిర్మించడం సంతృప్తి కలిగించిందని పేర్కొనారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, సభ్యులు విజయ్ భాస్కర్రెడ్డి, భానుమూర్తిరెడ్డి, ప్రతాప్ యాదవ్ , రంగారెడ్డి, భక్తవత్సల రెడ్డి, శ్రీనివాసమూర్తి, మల్లిఆచారి, భాస్కర్, రాజారెడ్డి పాల్గొన్నారు. -
దాహార్తి తీర్చండి మహాప్రభో!
శ్రీ రంగరాజపురం: తమ గ్రామంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న పట్టించుకోని ప్రభుత్వాధికారుల తీరుపై కొత్తపల్లి మెట్ట గ్రామస్తుల నిరసన రోడ్డుపైకి చేరింది. శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమెట్ట గ్రామంలో పాత బోరు పనిచేయకపోవడంతో గ్రామంలో నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త బోరు వేయించినప్పటికీ ఇంకా కనెక్షన్ ఇవ్వకపోవడంతో తమ గ్రామంలో నీటి ఇబ్బందులు తీవ్రతరంగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని గ్రామస్తులు రోడ్లపైకి ఎక్కారు. వేసవి ఇంకా మొదలు కాకుండానే నీటి ఎద్దడి ఉంటే మరి మండు వేసవిలో గ్రామస్తుల పరిస్థితి ఏమిటో అధికారులు ప్రభుత్వమే కాపాడాలి డి మాండ్ చేశారు. సత్వరమే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.


