ముగిసిన అంతర్జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో గత పదిరోజలుగా శ్రీహర్షుని ‘‘ఖండన ఖండఖాద్య’’ గ్రంథంపై జరిగిన అంతర్జాతీయ శాస్త్ర అధ్యయన శిబిరం గురువారం ఘనంగా ముగిసింది. వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యూఢిల్లీకి కేంద్రీయ సంస్కృత వర్సిటీ వీసీ శ్రీనివాస వరకేది ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ శిబిరాలు మేధోపరమైన గ్రంథాల బోధనకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సమాజానికి మేలుకలిగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విష్ణుభట్టాచార్యులు, మహామహోపాధ్యాయ ఆచార్య మణి ద్రావిడ శాస్త్రి, ప్రొఫెసర్ గణపతి భట్, కేఎస్ సతీష్, నాగరాజ భట్, శ్రఋహరి శివరామ్, షిండే మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


