కందిపాయె!
బయట నిత్యావసర ధరలు నింగినంటుతున్నాయి. పప్పు, నూనె ధరలు మండిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రేట్లు మరీ కొండెక్కెస్తున్నాయి. గతంలో మాదిరిగా చౌకదుకాణాల్లోనూ అన్ని సరుకులు అందడం లేదు. బియ్యం, నామమాత్రంగా చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పేదలేగా.. మనల్ని ఎవరు అడిగిది..? అన్నట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు. గత నాలుగు నెలలుగా కనీసం కంది పప్పు కూడా పంపిణీ చేయకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకేనా ఓట్లేసింది బాబూ.. అంటూ జిల్లా ప్రజలు నిట్టూర్చుతున్నారు.


