రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డు
చిత్తూరు కలెక్టరేట్ : రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డును ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో పలు అంశాలను విలేకరులకు వెల్లడించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులు త్వరలో రానున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న రహదారి పనులు, రాబోయే వేసవి సవాళ్లు, విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులను ఆయన వివరించారు.
రహదారుల నిర్మాణం
నీటి ఎద్దడి తలెత్తకుండా...
వేసవిలో జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 72 ప్రధాన చెరువుల్లో ప్రస్తు తం 80 శాతం మేరకు నీటి నిల్వ ఉందన్నారు.
జూన్ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో
తరగతులు
చిత్తూరు, కుప్పం కేంద్రీయ విద్యాలయాల్లో జూన్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. వేగవంతంగా కేంద్రీయ విద్యాలయ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.


