● భక్తులతో కిటకిటలాడిన సుబ్రమణ్య స్వామి
ఆలయం
కుప్పం: మండలంలోని వానగుట్టపల్లిలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడిమాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా ఆడిమాసంలో భక్తులు కావళ్లు చెల్లిస్తారు. ఈ ఏడాది భక్తులు శరీరానికి శూలాలు గుచ్చుకుని ఎస్సార్ట్ వాహనంలో విన్యాశాలు చేశారు. సైకిల్ చక్రం తరహాలో ఒక భక్తుడు శరీరానికి శూలాలు గుచ్చుకున్నాడు. కొందరు నోటిలోనూ శూలాలు గుచ్చుకున్నారు. వీటిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో హారోం హర నామ స్మరణతో వానగుట్టపల్లి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.


