నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

నిరసన గళం

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

● సీబీఐ విచారణకు పట్టు ● నారా లోకేష్‌ రాజీనామాకు డిమాండ్‌ ● భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, నాయకులు, కార్యకర్తలు ● చిత్తూరులో జనతాబజార్‌ వద్ద చేపట్టిన రిలే నిరహారదీక్షలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ● పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమనక్వయకర్త సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయరెడ్డి మాట్లాడారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా కింద పోస్టులను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ● కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన దీక్షలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ భరత్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. డీఎస్సీలో అక్రమాలకు తెరలేపారని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలకు బాధత వహిస్తూ మంత్రి లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

పలమనేరు మార్కెట్‌యార్డ్‌ సమీపంలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అడ్డదారిలో తమ వారికి పోస్టులు విక్రయించారని మండిపడ్డారు. అవకతవకలపై విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.

చిత్తూరు కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించి అర్హులకు అన్యాయం చేశారని మండిపడుతున్నాయి. వారికి వైఎస్సార్‌ సీపీ మద్దతు తెలిపింది. అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, ప్రజలు నిరాహార దీక్షల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం చేపట్టిన రిలే నిరహారదీక్షలకు విశేష స్పందన లభించింది. ఆడికృత్తిక పండుగ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జీడీనెల్లూరులో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి

డీఎస్సీ పేరుతో దగా

జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నిరాహార దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement