కేవీబీపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కేవీబీపురం మండలంలో చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం, పెనుమల్లం గ్రామానికి చెందిన పెమ్ముగారి సెల్వ కుమార్ (50) కేవీబీపురం మండలం, ఆదవరం గ్రామంలోని అక్క పార్వతమ్మ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో హాజరై తిరుగు ప్రయాణమయ్యాడు. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు గుంటమెట్టు వద్ద ఢీకొట్టింది. సెల్వకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108లో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కొత్తకండ్రిగ వద్ద మృతిచెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు భరత్కుమార్ ఉన్నారు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సెల్వకుమార్ అకాల మరణంతో కుటుంబం వీధిన పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబయ్య తెలిపారు.


