breaking news
House Construction Tips
-
ఇంటికి లగ్జరీ లుక్.. కిటికీలోనే ఉంది కిటుకు!
ఇంటీరియర్లో అద్దాలు భాగమైపోయాయి. రంగులు, మొక్కలు, ఫర్నీచర్ మాత్రమే కాదు విండోలతోనూ ఇంటికి లగ్జరీ లుక్ వస్తుంది. ఇన్సులేషన్ కిటికీలతో ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించే గుణం ఉండటమే వీటి ప్రత్యేకత అని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళిలతో పాటు శబ్ధాబ్దాలను ఇంటి లోపలికి రాకుండా ఈ కిటికీలు అడ్డుకుంటాయని చెబుతున్నారు.కాలుష్యం, రణగొణ ధ్వనులతో బిజీబిజీగా ఉంటే మెట్రో నగరాలలో నిశ్శబ్ద, ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకోవడం సహజమే. అందుకే గృహ కొనుగోలుదారులు హరిత భవనాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే గృహ నిర్మాణ ప్రాజెక్ట్లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల డిజైనింగ్ దశ నుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లగ్జరీ లుక్తో పాటు ఆహ్లాదభరిత వాతావరణం కల్పించేందుకు పెద్ద కిటికీలను ఎంపిక చేస్తున్నారు. గ్లేజింగ్, సీలింగ్ సాంకేతికతలతో తయారైన కిటికీలు మార్కెట్లో హాట్ ఫేవరేట్గా మారాయి.సంప్రదాయ సింగిల్ గ్లేజ్ విండోలతో బయటి నుంచి శబ్దాలు, దుమ్ముధూళి వంటివి సులభంగా ఇంటి లోపలికి వస్తాయి. అలాగే అపార్ట్మెంట్లలో పైఅంతస్తులలోని నివాసితుల హడావుడి, పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్, నిర్మాణ సంబంధిత ధ్వనులు కిటికీ ఫ్రేమ్ల చుట్టూ ఉన్న చిన్న ఓపెనింగ్ల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో నివాసితులకు చికాకు, ఒత్తిడి వంటివి కలుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది కస్టమర్లు మెరుగైన ఉష్ణోగ్రతలను నిర్వహించే ఇన్సులేటింగ్ గ్లాస్ కిటికీలను ఎంచుకుంటున్నారు.రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు షీట్లతో తయారైన ఈ విండోల మధ్యలో గాలి లేదా ఇతర వాయువుతో నిండి ఉంటుంది. దీంతో వేసవి కాలంలో ఇంటి లోపల వాతావరణం వెచ్చగా ఉండకుండా శీతాకాలంలో వేడిని బయటకు వెళ్లకుండా ఇన్సులేషన్ను అందిస్తాయి. ఫలితంగా ఇన్సులేటింగ్ గ్లాస్ కిటికీలు ఉన్న ఇంట్లో ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది.లామినేటెడ్ గ్లాస్ కిటికీలకు ధ్వనిని నియంత్రించే గుణం ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు పొరలతో తయారయ్యేదే లామినేటెడ్ గ్లాస్లు. ఇవి హానికారక యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. ఇంటి లోపల అధిక వేడిని తగ్గిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కోసం టెంపర్డ్ గ్లాస్ ఉత్తమమైంది. దీనికి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉంటుంది. వీటిని ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలలో వినియోగిస్తుంటారు.ఇది చదివారా? ఇళ్లు మారేవారికి.. ఇదో మంచి మార్గం!మీ ఇల్లు అధిక ధ్వనులు విడుదలయ్యే ప్రాంతాలైన విమానాశ్రయం, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులకు చేరువలో ఉంటే.. మీ ఇంట్లో తప్పనిసరిగా అకౌస్టిక్ విండోలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అదనపు సౌండ్ ఫ్రూఫింగ్ వీటి సొంతం. బహుళ గాజులు, ఇతరత్రా పదార్థాలతో తయారైన ఈ కిటికీలు బయటి శబ్దాలను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో ఎళ్లవేళలా ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. -
15 నిమిషాల్లోనే ఇల్లు.. రియల్ ఎస్టేట్లో కొత్త ట్రెండు
మెట్రో, బస్, రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 15 నిమిషాల్లోనే ఇల్లు.. ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లేంత దూరంలో ఆఫీసు.. సైకిల్ మీద వెళ్లేంత సమీపంలోనే మార్కెట్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్..సింపుల్గా 15 మినిట్స్ సిటీ అంటే ఇదీ! గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకొని విసుగు పడే బదులు మనకు ఇష్టమైన అభిరుచిలో గడిపేందుకు వీలు కల్పించేవే ఈ 15 నిమిషాల ప్రాజెక్ట్లు.వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాల సవాళ్లతో చాలా మంది డెవలపర్లు మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా నిర్మాణ సముదాయాల్లో నివాసాలతో పాటు వర్క్ప్లేస్లు, మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వినోదం వంటి అన్ని రకాల వసతులు కేవలం వాకింగ్, సైక్లింగ్ దూరంలో ఉంటాయి. ఈ రోజుల్లో గృహ కొనుగోలుదారులు గేటెడ్ కమ్యూనిటీ, సౌలభ్యం, కనెక్టివిటీలను కోరుకుంటున్నారు. కస్టమర్లు అనుభవపూర్వక జీవనాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నారు.బీమా, వెల్నెస్ సెంటర్లే కాదు ఫిజియోథెరపీ స్టూడియోలు, ప్లే స్కూళ్లు, పెంపుడు జంతువులను పెంచే ప్రత్యేక పార్క్లు ఇతరత్రా ఆధునిక వసతులు ఒకే చోట ఉండాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత నుంచి కస్టమర్లకు పర్యావరణ స్పృహ పెరిగిపోయింది. నివాసం ఉండే చోటే గ్రీనరీ అధికంగా ఉండాలని భావిస్తున్నారు. ఐసోలేటెడ్, హైరైజ్ ప్రాజెక్ట్ల కంటే నడకకు వీలుండే బహిరంగ ప్రదేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిత్యావసరాలతో పాటు వారాంతంలో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు అందుబాటులో ఉండే వసతుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతీది కిలో మీటరులోపే ఉండాలని కోరుకుంటున్నారు. స్వయం సమృద్ధి నగరాల వైపు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల నుంచి స్వయం సమృద్ధి గల పర్యావరణ వ్యవస్థల వైపు మళ్లుతోంది. రిటైల్, ఎంటర్టైన్ మెంట్ విభాగాలు నివాస సముదాయాలకు చేరువలోకి మారాయి. 15–20 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఆయా వసతులు, సౌకర్యాలు అందుకునే వీలు కలిగింది. కానీ, ఆఫీసు విభాగం మాత్రం ప్రధాన నగరంలో కంటే దూరంగా ఉంటున్నాయి. ఇందుకు అధిక అద్దెలు, ట్రాఫిక్ రద్దీ వంటి కారణాలనేకం.కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ విధానాలతో కంపెనీలు కూడా నివాస సముదాయాలకు చేరువలోనే ఆఫీసుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని ఐటీ రంగంలోని 60–70 శాతం మంది సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ హైటెక్ సిటీ ప్రాంతానికి ప్రయాణిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీతో పాటు కర్బన ఉద్గారాలతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో హైదరాబాద్లో 15మినిట్స్ సిటీ కాన్సెప్ట్ ప్రాచుర్యంలోకి వచ్చింది.ఏంటీ 15 మినిట్స్ సిటీ? 15 నిమిషాల నగరాలనేవి ప్రధానంగా పని, విద్య, విశ్రాంతి వంటి ముఖ్యమైన అంశాలతో కూడుకున్న కాన్సెప్ట్. ఇవన్నీ వాకింగ్, సైక్లింగ్ దూరంలో ఉండే ప్రాంతాలు. ఇక్కడ నివాసితులు ఇంటి నుంచి నడక లేదా సైక్లింగ్ రైడ్లో పని, విద్యా, వైద్యం, వినోదం, విశ్రాంతి వంటి రోజువారీ అవసరాలను పొందవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రాంతాలే 15 మినిట్స్ సిటీలు. వాహనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ వ్యవస్థను పెంపొందించే మౌలిక, సామాజిక వసతులను కల్పించడమే ఈ నగరాల ప్రధాన లక్ష్యం.ఈ ప్రాంతాలలో ఎక్కువగా.. ఈ తరహా ప్రాజెక్ట్లు ఎక్కువగా దక్షిణ భారతీయ నగరాలలో కనిపిస్తుంది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 10,101 కొత్త నివాస యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 39 శాతం వాటా కేవలం పశ్చిమం, ఆ తర్వాత 32 శాతం వాటా దక్షిణ హైదరాబాద్ కలిగి ఉంది. కొండాపూర్, మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, నియోపొలిస్, మోకిలా, కొల్లూరు, కోకాపేట వంటి ప్రాంతాలు స్వయం సమృద్ధి గల మినీ నగరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమం వైపు పరిమితమైన ఐటీ పరిశ్రమను తూర్పువైపు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దీంతో ఉప్పల్, పోచారం, ఎల్బీనగర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలు 15 నిమిషాల్లోనే కార్యాలయానికి చేరుకునే విధంగా అభివృద్ధి చెందాయి.ఈ నగరాల్లో ఏముంటాయంటే.. దట్టమైన పచ్చని ప్రదేశాలు, మిశ్రమ వినియోగ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. వాక్ లేదా సైక్లింగ్ మార్గాలు, మెరుగైన ప్రజా రవాణాపై దృష్టిపెడతారు. పని చేసే ప్రాంతాలు, దుకాణాలు, పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఇలా అన్నీ కిలో మీటరు దూరంలోనే ఉంటాయి. బైక్లు, కార్లు వంటి వాహనాలకు బదులుగా నడక, సైక్లింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మెరుగైన మౌలిక, సామాజిక వసతులతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి. కార్బన్ ఉద్గారాలను, ట్రాఫిక్ను తగ్గిస్తుంది. శారీరక శ్రమను ప్రోత్సహిస్తుంది. మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. -
చిన్న అపార్ట్మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్!
ఇంటికొచ్చే అతిథులకు తలుపులు స్వాగతం పలుకుతాయి. అందుకే ప్రధాన ద్వారం వద్ద తలుపుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అడుగు స్థలం కూడా ఖరీదైన మహానగరంలో వెడల్పాటి తలుపుల స్థానంలో స్థలాన్ని ఆదా చేసే డోర్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్లైడింగ్, ఓపెన్, ఫోల్డింగ్ డోర్స్ జోరు మార్కెట్లో కొనసాగుతోంది. విభిన్న రంగులు, డిజైన్లతో లభ్యమవుతుండటంతో యువ కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. మధ్యలో మడతపెట్టి.. సాధారణ తలుపుల మాదిరిగా కాకుండా తక్కువ స్థలంలో, మడతపెట్టే వీలుగా ఉండటమే ఈ డోర్స్ ప్రత్యేకత. వీటిని కలప, అల్యూమీనియంతో తయారు చేస్తారు. తలుపులు తెరిచినప్పుడు మధ్యలో 1/2 లేదా 1/3 లేదా 2/3 నిష్పత్తిలో మడత పడుతుంది. వీటినే ఫోల్డింగ్ డోర్స్ అంటారు. రెండు ప్యానెల్స్ సమాన పరిమాణంలో ఉండొచ్చు లేదా అసమాన పరిమాణంలో ఒక ప్యానెల్ కంటే మరోటి వెడల్పుగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా ఒకవైపు తిరగానికి, మధ్యలో ఫోల్డ్ కావడానికి వీలుగా స్క్రూలను అమరుస్తారు. కస్టమర్ల అభిరుచి, అవసరాలను బట్టి తలుపులు ఎడమ లేదా కుడి వైపునకు తెరుచుకుంటాయి. ఈ ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్కు అద్దాలను జోడించి మరింత అందంగా తయారు చేస్తున్నారు.గాలి, వెలుతురు సులువుగా.. చిన్న సైజు అపార్ట్మెంట్లకు, తక్కువ స్థలంలో నిర్మించే వ్యక్తిగత గృహాలకు ఈ తరహా తలుపులు బాగుంటాయి. ప్రధాన ద్వారం వద్ద కాకుండా ఇతర గదులకు ఈ డోర్స్ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అందంగా కనిపించడంతో పాటు వంద శాతం స్థలం వినియోగం అవుతుంది. అలాగే కప్బోర్డ్లు, వార్డ్ రోబ్లు, కారిడార్లు, వంటగది, బాత్రూమ్లు ఇతర యూటిలిటీ ప్రాంతాలలో ఈ ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా వీటిని ఇన్స్టాల్ చేయడం చాలా సులువు. నిర్వహణ కూడా తేలిక. ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్తో ఒక గది నుంచి మరో గదిలోకి గాలి, వెలుతురు సులువుగా ప్రసరిస్తుంది.కర్టెన్ ఉందిగా.. ఇంట్లో వెచ్చగా.. నగరంలో రోజురోజుకూ చలి పెరుగుతోంది.. ఉదయం నుంచే ఇంట్లోంచి బయటకు రావాలంటే గజగజలాడాల్సిందే.. సాయంత్రమైతే శీతల గాలులు వణికిస్తున్నాయి. ఈ చలికాలంలోనూ ఇంటి లోపలి వాతావరణం వెచ్చగా ఉండాలంటే కిటికీలకు ఉండే కర్టెన్లే కీలకమని అంటున్నారు కర్టెన్ ఇంటీరియర్ డిజైనర్లు. అయితే వాటిలోని రకం, రంగులను బట్టి ఇంటి లోపలి వాతావరణం గడ్డకట్టే చలిలోనూ వెచ్చగా ఉంటుందని చెబుతున్నారు.ఈ కాలంలో కర్టెన్లకు పలుచటి, కాటన్, లెనిన్ కర్టెన్లు కాకుండా మందంగా లేదా థర్మల్ కర్టెన్లను వెల్వెట్, ఉన్ని, స్వెడ్ లేదా థర్మల్ లైన్డ్, బ్లాక్అవుట్ కర్టెన్లను వినియోగించడం ఉత్తమం. ఇంటి లోపల వేడి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో కర్టెన్ల రంగులు కూడా కీలకమే. ఎరుపు, నారింజ, పసుపు వంటి రంగులకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంచుతాయి. -
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్లకే కాదు చిన్న ప్రాజెక్ట్లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్షిప్ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్లో జవాబుదారితనం పెరిగింది. -
ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..
నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..నెల రోజుల్లో నిర్మాణంఎన్ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.గతంలో వచ్చిన టెక్నిక్లుదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్లు.వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు. -
ఇంటి కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ..
పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్ వంటగదులనే అందిస్తున్నారు. మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్నెస్ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.వంటలో సహాయం.. కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్ కిచెన్లో హెడ్ చెఫ్కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్ చెఫ్’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్పుట్ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.ఆహార వ్యర్థాల తగ్గుదల.. స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్ కుక్టాప్లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది. సవాళ్లున్నాయ్.. ఏఐ కిచెన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. వంట గదిలో ఆటోమేటెడ్ కుకింగ్ అసిస్టెంట్లు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్ బేస్డ్, విజువల్ గైడ్లు ఏఐ కిచెన్ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. -
గృహ రుణానికి ముందే గుడ్బై
ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కుని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక... అటు కావాలనుకున్నది కొనలేక తరువాత చూద్దామని వాయిదా వేసుకుంటుంటారు. కానీ... ‘తరువాత’ అనేది రావటం కష్టం. ఎందుకంటే మనం అప్గ్రేడ్ అయ్యేసరికి మన కోరిక, లేకపోతే ఆ వస్తువు ధర కూడా అప్గ్రేడ్ అవుతాయి కదా? ఇదంతా ఎందుకంటే... ఆ మొదటి కేటగిరీ గురించి. ఇంకాస్త ఎక్కువపెట్టి ముందుకెళ్లే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా... తాను అనుకున్నది చేశామనే సంతృప్తి ఉంటుంది కదా! అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టే వారి గురించే ఈ ప్రత్యేక కథనం...ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్మెంట్ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా... ఈ తరం మాత్రం ఉద్యోగంలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20–30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా... వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా ఒక 5వేల రూపాయలు ఎంత మ్యాజిక్ చేస్తుందో? నెలనెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా రూ.5వేలు గనక చెల్లిస్తే... 20 ఏళ్లలో ఏకంగా రూ.11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలమూ తగ్గుతుంది. అదెలాగంటే...రూ.5,000 చేసే మ్యాజిక్ ఇదీ...ఉదాహరణకు శ్రీకర్ రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు రూ.40వేలు ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో రూ.5వేలు అదనంగా చెల్లిస్తే..? ఏం జరుగుతుందో చూద్దాం... → శ్రీకర్ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతం. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ,.43,500 → 20 ఏళ్లలో రూ.50 లక్షల అసలుతో పాటు మరో రూ.54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. → కానీ ప్రతినెలా రూ.43,500 కాకుండా దానికి రూ.5వేలు జోడించి రూ.48,500 చెల్లిస్తే.... → 20 ఏళ్ల రుణం కాస్తా 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా రూ.11.5 లక్షలు ఆదా అవుతుంది. → ఒకవేళ రూ.10,000 అదనంగా (రూ.53,500 చొప్పున) చెల్లిస్తే... రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.20 లక్షలు మిగులుతుంది. → ఇలా స్మార్ట్ చెల్లింపులతో 20 ఏళ్ల రుణ బంధాన్ని 12–13 ఏళ్లకే తీర్చుకోవచ్చు.ఒకే విడతా లేక నెలవారీనా..?→ వేతన జీవులు ప్రతి నెలా ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం → దీనివల్ల ప్రతి నెలా అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైనా నియంత్రణ వస్తుంది → బోనస్ లాంటివి వచి్చనపుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నపుడు... గృహ రుణం వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలేవైనా ఉన్నాయేమో చూడాలి. → అలాంటి మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహరుణాలపై వడ్డీ తక్కువ.అంత ఆదా సాధ్యమా?→ గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెలా చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. → ప్రతి నెలా చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. → ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో... అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు. → రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే... వడ్డీ– కాలవ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. ఫ్లోటింగ్ – ఫిక్స్డ్ రేటు రుణం→ ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. → ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1– 3 శాతం మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. → ప్రస్తుతం బ్యాంక్లు/ ఎన్బీఎఫ్సీలు ఫ్లోటింగ్ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్డ్ రేటుపై, పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించొచ్చు. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. -
ఇల్లే ప్రపంచం.. అందుకే వీటికి డిమాండ్!
కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కరోనా తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవటం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటాని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.2013లో 7 ప్రధాన నగరాలలో 2,102 ప్రాజెక్ట్లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్లు లాంచింగ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం..స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. -
ఇవి బిగించుకునే ఇళ్లు..
కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యకరమైన జీవితంపై శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎంపికలో రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, పచ్చని ప్రకృతిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా ఫామ్ ప్లాట్లకు, ఫామ్హౌస్లకు డిమాండ్ పెరిగింది. కనీసం ఇంటి చుట్లూ కనీస నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. మరి, ఫామ్ ప్లాట్లలో భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. దీంతో కంటైనర్ హోమ్స్కు గిరాకీ పెరిగింది. ఫ్యాక్టరీలో తయారు చేయడం, లారీలో తీసికొచ్చి బిగించేయడం వీటి ప్రత్యేకత. శామీర్పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాలలోని ఫామ్హౌస్, రిసార్ట్లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్మాత్రిక ప్రాంతాలలో ఈ తరహావే ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. 111 జీవోలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవటంతో పలువురు ఈ కంటైనర్ హోమ్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఆయా హోమ్స్లో సరదాగా గడుపుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. కంటైనర్ హోమ్స్ను గ్యాల్వనైజింగ్ స్టీల్స్(జీఏ) షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్(పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు.ఇంటి బీమ్లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూతతో ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్(పీపీవీసీ)లతో రూపొందిస్తారు. తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్యులేషన్తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీంతో అగ్ని, వేడి ఇంటిలోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల ఉష్ణోగత కంటైనర్ హోమ్లో తక్కువగా ఉంటుంది. ధరలు ఎలా ఉంటాయంటే?విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. ప్రారంభ ధర చదరపు అడుగు (చ.అ)కు రూ.1,300. ఉదాహరణకు 600 చ.అ. మాడ్యులర్ హోమ్కు రూ.7.80 లక్షలు. క్రేన్, రవాణా చార్జీలు కూడా కలిపితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మాడ్యులర్ హోమ్లో హాల్లోనే ఓపెన్ కిచెన్, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దీని నిర్మాణానికి 4–5 మంది కలిసి 45 రోజుల్లో పూర్తి చేస్తారు.కంటైనర్ హోమ్స్లో మన అభిరుచుల మేరకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు.మన్నిక ఎన్నేళ్లంటే? ఈ కంటైనర్ హోమ్స్ స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సాధారణ అపార్ట్మెంట్కు ఎలాగైతే నిర్వహణ చేసుకుంటామో ఈ కంటైనర్ హోమ్స్కు కూడా ఐదారేళ్లకొకసారి రంగులు, పాలిష్ చేసుకోవాలి. 1,000 చ.అ. బిల్డింగ్కు వార్షిక నిర్వహణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుంది. ఈ కంటైనర్ హోమ్స్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. మెటల్తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం జరగదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు! -
40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..
సొంతిల్లు.. దాదాపు ప్రతి ఒక్కరికీ జీవిత ఆశయం. కొంత మంది తక్కువ వయస్సులోనే సొంతిల్లు సమకూర్చుకుంటారు. కానీ చాలా మంది 40 ఏళ్లు వచ్చాక కూడా దీని కోసమే పోరాడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో కుదురుకోవడం, పెళ్లి, పిల్లలు ఇలా అన్నీ అయ్యాక సొంతింటి పని పడతారు. అయితే 40ల వయసులో ఇల్లు కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..40లలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా స్థిరంగా పెరుగుతాయి. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యయాలు కచ్చితంగా ఉంటాయి. అందుకే గృహ రుణం ఈ వాస్తవాలకు సరిపోయేలా ఉండాలి. ఈఎంఐలు మీ రిటైర్మెంట్ పొదుపులను తగ్గించకూడదు. నిత్య ఖర్చులకు క్రెడిట్ కార్డులపై ఆధారపడేలా చేయకూడదు.ఎలాంటి ప్రాపర్టీ కొనాలి?40ల్లో ప్రాధాన్యతలు మారతాయి. ఇప్పుడు ‘హాట్’ లొకేషన్ కంటే రోజువారీ సౌలభ్యం ముఖ్యం. అంటే ప్రయాణ సమయం తక్కువ ఉండటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండే ప్రాపర్టీని ఎంచుకోవాలి. తెలిసిన ప్రాంతమైతే మరీ మంచిది. రెడీ-టు-మూవ్ అంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఉత్తమం. ఇవి నిర్మాణ ఆలస్యం రిస్క్ను తగ్గిస్తాయి. క్యాష్ ఫ్లో ప్రణాళికను సులభతరం చేస్తాయి. అయితే కొనుగోలు ముందు రెరా (RERA) వివరాలు, కంప్లీషన్ సర్టిఫికేట్లు, సొసైటీ నిబంధనలు, పెండింగ్ బకాయిలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.40ల తర్వాత హోమ్ లోన్ తీసుకుంటే..సాధారణంగా బ్యాంకులు కానీ, రుణ సంస్థలు కానీ తామిచ్చే లోన్లను రుణగ్రహీత రిటైర్ అయ్యేలోపు రికవరీ అయ్యేలా చూసుకుంటాయి. అందులో భాగంగా రుణ చెల్లింపు వ్యవధి తక్కువ ఉంటుంది. ఫలితంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి చాలా మంది దంపతులు జాయింట్ లోన్ తీసుకుంటారు. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తారు. తద్వారా ఈఎంఐ చెల్లించదగిన స్థాయిలో ఉంటుంది.రిటైర్మెంట్ ప్రణాళికను దెబ్బతీయకూడదుమంచి ఇల్లు కొనాలన్న ఉత్సాహం రిటైర్మెంట్ సేవింగ్స్ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈపీఎఫ్, వీపీఎఫ్, ఎన్పీఎస్, దీర్ఘకాల సిప్లు వంటి పొదుపులపై ప్రభావం లేకుండా చూసుకోవాలి. దీని కోసం ఒక సింపుల్ పరీక్ష ఉంది. అదేంటంటే.. ఇంటి ఈఎంఐ కారణంగా మీ రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్లను రెండు మూడు నెలలకు పైగా నిలిపివేయాల్సి వచ్చేలా ఉంటే ఆ ఇంటి కొనుగోలు ప్లాన్ మార్చుకుని చిన్న ఇల్లు కొనడమో లేదా డౌన్ పేమెంట్ ఇంకాస్త పెంచుకోవడమో చేయాలి.ఎక్కువ డౌన్ పేమెంట్ మేలుడౌన్ పేమెంట్ ఎంత ఎక్కువైతే అంత మేలు. ఏళ్లుగా పోగుచేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ కాస్త ఎక్కువగా పెట్టగలిగితే నెల నెలా ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. తద్వారా మీ అత్యవసర నిధికి ఎలాంటి డోకా ఉండదు. ప్రతినెలా పెద్దగా ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా ఉండొచ్చు.ఇన్సూరెన్సులూ ముఖ్యమే..హోమ్ లోన్ మీ ఫైనాన్షియల్ రిస్క్ను పెంచుతుంది. అందుకే రుణ బకాయికి కనీసం సరిపడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసరం. ఇవి లేకపోతే కుటుంబ రుణ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. -
ఇల్లు కొనే ముందు జాగ్రత్త.. ఇవి తప్పనిసరి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పొదుపు, రుణం, పెట్టుబడులతో కూడుకున్న అంశం. జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా లేకుంటే అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో.. ఈ ఇల్లు కొని తప్పు చేశానే.. అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్నో చట్టాలు, నిబంధనలు ఉన్నా.. సామాన్యుడి సొంతింటి కలను క్యాష్ చేసుకోవాలనే అక్రమార్కులు కనిపిస్తూనే ఉన్నారు. ప్రీలాంచ్ మోసాలతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి, వాటిని విక్రయించడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న పలు జాగ్రత్తలివీ..టైటిల్ డీడ్డెవలపర్కు కన్వేయన్స్ రూపంలో భూమికి స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ ఉండాలి. గృహ కొనుగోలుదారులు దీని కోసం అడగాలి. స్థానిక సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సదరు భూమిపై ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ రసీదుల వంటి ఇతర కీలక పత్రాలను కూడా పరిశీలించాలి.అనుమతులుప్రాజెక్ట్ లేఅవుట్, భవన నిర్మాణ ప్రణాళికకు మున్సిపల్ అధికారుల ఆమోదం ఉండాలి. ఇవి లేకుంటే అది అక్రమ నిర్మాణం కిందే లెక్క. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు సదరు ప్రాజెక్ట్కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకోవాలి.సర్టిఫికెట్లుప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి కమెన్స్ సర్టిఫికెట్, అది పూర్తయ్యాక కంప్లీషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారమే నిర్మించిందని చెప్పడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అలాగే ప్రతీ ప్రాజెక్ట్కు అగ్నిమాపక, పర్యావరణం, నీటి సరఫరా, విద్యుత్ సహా బహుళ విభాగాల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) సరి్టఫికెట్లు అవసరం. ఇవన్నీ పునఃపరిశీలించిన తర్వాతే గృహ కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.రిజిస్ట్రేషన్రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టం కింద ప్రతీ ప్రాజెక్ట్ను నమోదు చేయాలి. రెరా ఆమోదం పొందకుండా ప్రాజెక్ట్ నిర్మాణం, అమ్మకం వంటివి చేయకూడదు. అందువల్ల ఆయా ప్రాజెక్ట్కు రెరా అనుమతి ఉందా లేదా అనేది తనిఖీ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: హైదరాబాద్లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ -
కొత్త ఇంటికి ఏం రంగులేద్దాం.. ఉందిగా ట్రెండింగ్ కలర్!
ఇంటికి రంగులు వేయడం ఒక కళ. జీవితకాలం కష్టపడి సొంతం చేసుకునే సొంతింటికి రంగుల ఎంపిక ఆషామాషీ వ్యవహారం కాదు. కలర్స్ ఇంటికి అందాన్ని, అనుభూతిని తీసుకురావడమే కాదు యజమాని అభిరుచిని, మానసిక స్థితిని తెలియజేసేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.కంటికి, మనసుకు ఆహ్లాదకరమైన రంగులతో రోజువారీ జీవితం రంగులమయం అవుతుంది. మనిషి ఇంద్రియాలు రంగులతో కనెక్ట్ అవుతాయి. స్పర్శ, రుచి, సువాసనలు మనలో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ఇంటీరియర్లో రంగులు, వాటి ఎంపికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రకృతి, ఆహార్యం, సువాసన, మృదుత్వం, ప్రకాశవంతం వంటి వాటితో రంగులు నివాసితులు, చూపరులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది.సోలార్ ఎల్లో.. సోలార్ ఎల్లోగా పిలవబడే ఈ రంగు ప్రస్తుతం ఇంటీరియర్లో ట్రెండ్గా మారింది. సూర్యుని నిజమైన రంగు తెలుపు. కానీ, మన వాతావరణం, దాని కాంతిని వెదజల్లే విధానం కారణంగా భూమి నుంచి చూస్తే సూర్యుని రంగు పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. అలాగే సోలార్ ఎల్లో రంగు కూడా వాతావరణాన్ని బట్టి రంగులు మారుతున్న అనుభూతిని కల్పిస్తుంది.స్వచ్ఛమైన కాంతి, ప్రకాశవంతంగా ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లక్కర్డ్ ఫర్నిచర్, గాజు ఫినిషింగ్తో కఠినమైన, కాంతిని ప్రతిబింబించే ఉపరితలంగా సోలార్ ఎల్లో అందంగా ఉంటుంది. దీని మెరుపులు, మృదుత్వం ఉల్లాసభరితంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్!
శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కనిపించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. అనేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూసేందుకు చక్కగా కనిపించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరోరెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీంతో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–రూ.350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ 100 చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కు చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలప ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్ను సులువుగా వేసుకోవచ్చు. ఒక్కరోజులో పని పూర్తవుతుంది. ఈ గచ్చు ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. దీనిపై గీతలు కనిపించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులు అక్కరలేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు. బుడతల గదికి ప్రత్యేకం.. సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది. -
తేలికగా, దృఢంగా, వేగంగా, ఖర్చు తక్కువగా..
ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే నిరంతరం పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు సామాన్యులకు ఒక సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతులు, ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు, కొత్త సాంకేతికతలపై సమగ్ర అవగాహన అవసరం.సంప్రదాయ విధానంభారతదేశంలో ఇళ్లు కట్టడానికి శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులు ప్రధానంగా స్థానికంగా లభించే వస్తువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కాల్చిన ఎర్ర ఇటుకలు, సిమెంటు, ఇసుక మిశ్రమంతో (మోర్టార్) గోడలను నిర్మించడం.. దీనిపై కాంక్రీటు (RCC) స్లాబ్తో పైకప్పు వేయడం సాధారణంగా వస్తున్న ఆనవాయితి. ఇది దృఢమైన, మన్నికైన పద్ధతి. ఇటుక గోడలు ఉష్ణ బంధకాన్ని (Thermal Insulation) అందించి వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. అయితే దీని నిర్మాణం శ్రమతో కూడుకుంది. సమయం ఎక్కువ పడుతుంది. పునాది ఖర్చు ఎక్కువ. ఇటుకల తయారీ పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో మట్టి, గడ్డి, వెదురు, కలప, రాళ్లను ఉపయోగించి ఇళ్లను నిర్మించేవారు. కచ్చా ఇళ్లుగా పిలిచే ఈ విధానంలో ‘కాబ్’ (మట్టి, గడ్డి మిశ్రమం), ‘అడోబ్’(ఎండబెట్టిన మట్టి ఇటుకలు) వంటి పద్ధతులను వాడేవారు. వీటికి ఖర్చు తక్కువ. వీటి వల్ల పర్యావరణహితం, ఉష్ణ నియంత్రణ (Thermal Regulation) ఉంటుంది. అయితే వీటి మన్నిక తక్కువ. తరచుగా మరమ్మత్తులు అవసరం. భారీ వర్షాలకు అంతగా నిలబడవు.రాతి నిర్మాణంస్థానికంగా లభించే రాళ్లను సున్నం లేదా మట్టి మోర్టార్తో కలిపి గోడలు కట్టేవారు. ఇవి దృఢమైనవి. దీర్ఘకాల మన్నిక, సహజ ఉష్ణ బంధక సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటి నిర్మాణానికి ఎక్కువ శ్రమ అవసరం. ఎక్కువ సమయం పడుతుంది.ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే పద్ధతులునిర్మాణ సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఖర్చును తగ్గించి, సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి.ప్రిఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ నిర్మాణంగోడలు, పైకప్పు స్లాబులు, కిటికీలు వంటి భవన భాగాలను ఫ్యాక్టరీలో ముందుగా తయారు చేయించి ఆపై నిర్మాణ స్థలంలో వాటిని నేరుగా బిగించవచ్చు. దీంతో నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. శ్రమ తక్కువ. నాణ్యతలో స్థిరత్వం ఉంటుంది. వ్యర్థాలు తగ్గుతాయి.ఇన్సులేటెడ్ కాంక్రీట్ ఫారమ్లుఇది థర్మాకోల్ లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్తో చేసిన బోలు బ్లాకులను ఉపయోగించి గోడలను నిర్మించే విధానం. ఈ బోలు బ్లాకుల మధ్య తర్వాత కాంక్రీటు పోస్తారు. దీని వల్ల గోడలకు అధిక ఇన్సులేషన్ (ఉష్ణ బంధకం) లభిస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రత నియంత్రణ సులభమై ఎయిర్ కండీషనర్ల వినియోగం, తద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.స్టీల్ ఫ్రేమ్ నిర్మాణంస్టీల్ కాలమ్స్, బీమ్లను ఉపయోగించి భవనానికి ప్రధాన ఫ్రేమ్ను నిర్మించే విధానం. ఈ నిర్మాణం తేలికగా, దృఢంగా ఉంటుంది. భూకంపాలను తట్టుకోగలదు. నిర్మాణ సమయం తక్కువ.ఫ్లై యాష్ ఆధారిత ఇటుకలు/ బ్లాకులుథర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం (ఫ్లై యాష్), ఇతర బైండర్లను ఉపయోగించి ఇటుకలు, బ్లాక్లను తయారు చేసే విధానం. ఉదాహరణకు ఏఏసీ బ్లాక్లు. ఇవి సాంప్రదాయ ఇటుకల కంటే తేలికైనవి. మెరుగైన ఉష్ణ బంధకాన్ని అందిస్తాయి. సిమెంట్ వినియోగాన్ని తగ్గిస్తాయి. పర్యావరణహితమైనవి.ఇంటి నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కేవలం వస్తువుల ధరలు మాత్రమే కాకుండా నిర్మాణ ప్రణాళిక, డిజైన్, సాంకేతికతలో మార్పులు తీసుకురావడం ముఖ్యం. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లోని మన్నికను, స్థానిక వస్తువుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రిఫ్యాబ్రికేషన్, ఏఏసీ బ్లాక్లు, సమర్థవంతమైన డిజైన్ వంటి ఆధునిక, తక్కువ ఖర్చు పద్ధతులను అనుసరించడం ద్వారా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు!
ఇప్పటివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎలా ఎంపిక చేసుకోవాలి?, ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?, ఇంటి నిర్మాణం కోసం కావలసిన మెటీరియల్స్ వంటి వివరాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్ని రంగాల్లోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే మీరెలా ఉపయోగించుకోగలుతున్నారు? అనేదే ప్రశ్న. సరిగ్గా ఉపయోగించుకుంటే.. సమయాన్ని, ఖర్చుకు కూడా తగ్గించుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ విషయానికి వస్తే..ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీసాధారణంగా ఒకప్పటి నుంచి వస్తున్న పద్దతిలో ఇల్లు కట్టాలంటే.. గోడలు కట్టి నిర్మాణం చేయాల్సిందే. అయితే ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ద్వారా గోడలను లేదా ఇంటి భాగాలను ఫ్యాక్టరీలో తయారుచేసి.. మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. ఈ విధానం ద్వారా వేస్ట్, డస్ట్ పొల్యూషన్ వంటివి చాలా వరకు తగ్గుతాయి.3డీ ప్రింటింగ్ టెక్నాలజీఈ పేరును చాలామంది వినే ఉంటారు. అయితే దీనిని ఇంటి నిర్మాణంలో కూడా ఉపయోగించుకోవచ్చనే విషయం బహుశా కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది. కంప్యూటర్లో డిజైన్ చేసి.. ఇంటి నమూనాను, కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా వేసి నిర్మించడానికి ఈ 3డీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కేవలం గంటల వ్యవధిలోనే మీరు ఇంటిని ధృఢంగా నిర్మించుకోవచ్చు. కార్మిక ఖర్చు తగ్గడమే కాకుండా.. మెటీరియల్ కూడా పెద్దగా వృధా అయ్యే అవకాశం లేదు.కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది.. ఇంటి నిర్మాణం కోసం ప్రాజెక్ట్ ప్లానింగ్, ఖర్చు తగ్గించుకోవడం, మెటీరియల్ మేనేజ్మెంట్, సైట్ మానిటరింగ్ కోసం ఉపయోగించే డిజిటల్ టూల్స్. ఇల్లు కట్టుకోక ముందే.. కట్టుకోబోయే ఇల్లు ఎలా ఉంటుందో దీని ద్వారా చూడవచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో ముందుగానే బడ్జెట్ అంచనా వేయవచ్చు.గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీగ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ ద్వారా.. పర్యావరణానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేయవచ్చు. ప్రకృతి వనరులను సంరక్షించుకుంటూ.. సోలార్ పానెల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటివి నిర్మించుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు నిర్మించుకునే ఇంటిలోకి సహజంగా కాంతి, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ టెక్నాలజీ ఉపయోగించి కార్బన్ ఉద్గారాలను చాలావరకు తగ్గించుకోవచ్చు.ఏఐ & స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ఈ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ చాలా అవసరం, అందరూ ఇష్టపడతారు కారు. ఇంట్లో ఉండే లైట్స్, ఫ్యాన్స్, టీవీ, ఏసీ, డోర్ లాక్స్, సీసీటీవీ కెమరాలు అన్ని కూడా ఏఐ ఆధారంగా.. ఆటోమేటెడ్గా పనిచేసేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఇంట్లో లేకపోయినా, అవసరం అనుకుంటే, లైట్స్ ఆన్ చేయడం.. లేదా ఆఫ్ చేయడం, డోర్ బెల్స్ మోగినప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారో ముందుగానే చూడటానికి ఏఐ ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్ -
పునాది నుంచే పొదుపు.. తక్కువ ఖర్చుతో సొంతిల్లు
గత దశాబ్దంలో గృహ నిర్మాణ వ్యయం (house construction) రెండింతలు పెరిగింది. ముఖ్యంగా పునాది నిర్మాణంలో అవసరమైన మెటీరియల్స్ (construction material) ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరైంది.ఈ నేపథ్యంలో, సంప్రదాయ మెటీరియల్స్కు ప్రత్యామ్నాయంగా చౌకగా, మన్నికగా, పర్యావరణ హితంగా ఉండే కొత్త మేటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే నిర్మాణ నాణ్యతను కోరుకునే వారికి ఇవి వరంగా మారుతున్నాయి.మెటీరియల్సంప్రదాయ ఎంపికలుకొత్త/చౌకైన ప్రత్యామ్నాయాలువిశేషాలుసిమెంట్ఓపీసీ, పీపీసీజియోపాలిమర్ సిమెంట్, స్లాగ్ బేస్డ్ సిమెంట్తక్కువ ఉద్గారాలు, శాశ్వతత ఎక్కువఇసుకనది ఇసుకఎం-సాండ్, రోబో సాండ్తక్కువ ధర, నది పరిరక్షణరాళ్లు20ఎంఎం, 40ఎంఎం మిక్స్రీసైకిల్ అగ్రిగేట్వ్యర్థాలను ఉపయోగించి తయారీస్టీల్ (TMT)Fe500, Fe550బసాల్ట్ రీబార్తక్కువ బరువు, తక్కువ ఖర్చు, ఎక్కువ సంవత్సరాలు మన్నికబీమ్ & ఫౌండేషన్సైట్లలో తయారు చేసే బీమ్లుప్రికాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్వేగంగా నిర్మాణం, శ్రమ ఆదాకొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీలు, మెటీరియల్స్రోబో సాండ్ – ఇసుకకు ఉత్తమ ప్రత్యామ్నాయం* మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M-Sand) కన్నా మెరుగైన గుణాత్మకత కలిగిన రోబో సాండ్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంది.* ధర నది ఇసుక కంటే 25-30% తక్కువ.* గృహ నిర్మాణానికి సరైన పైనెస్ మోడ్యూలస్ (Fineness modulus) కలిగి ఉంటుంది.జియోపాలిమర్ సిమెంట్ – పర్యావరణ హితమైన కొత్త పరిష్కారం* జియోపాలిమర్ సిమెంట్ తయారీలో లైమ్ వినియోగం తక్కువగా ఉంటుంది.* OPC కంటే 60% తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుంది.* పునాది స్థాయిలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ను అమలుపరచవచ్చు.ప్రికాస్ట్ బ్లాక్స్ – వేగంగా నిర్మాణం* ఫౌండేషన్, పిలర్స్, వాల్ సెక్షన్లను ముందే తయారు చేసి సైటులో ఫిక్స్ చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది.* ఒక సాధారణ 1000 చ.అ. ఇంటికి 15 రోజుల పని, 5–6 రోజుల్లో పూర్తవుతుంది.బసాల్ట్ రీబార్ – స్టీల్కు ఆధునిక ప్రత్యామ్నాయం* బసాల్ట్ ఫైబర్తో తయారవుతుంది.* తక్కువ బరువు, తక్కువ ఖర్చు.* తేమ, ఉప్పు వల్ల తుడుపుకు గురికాకపోవడం దీని ప్రత్యేకత.నిర్మాణ ఖర్చు తగ్గాలంటే.. ఇంజినీర్లు, నిపుణుల సలహాలు* స్థలానికి దగ్గరగా లభించే మెటీరియల్స్ను ప్రాధాన్యత ఇవ్వాలి.* పునాది నిర్మాణానికి ముందు సైట్ సొయిల్స్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయించాలి. తద్వారా అవసరమైన మెటీరియల్స్ను సరిగ్గా అంచనా వేయవచ్చు.* సామూహిక కొనుగోలు లేదా గ్రామీణ కాంట్రాక్టర్లతో పనిచేయడం ద్వారా మెటీరియల్ ధరకులను తగ్గించవచ్చు.* ప్రికాస్ట్ టెక్నాలజీని అనుసరించడం వల్ల పని వేగంగా పూర్తవుతుంది, లేబర్ ఖర్చు తగ్గుతుంది.చివరగా..పునాది నుంచే చౌకగా, మన్నికగా, పర్యావరణహితంగా నిర్మించగలిగితే ఇంటి మొత్తం నిర్మాణ వ్యయం మీద సగటున 15 నుంచి 20 శాతం వరకు ఆదా చేయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
ఈ చిన్న టెక్నిక్స్తో నిర్మాణ సామగ్రి ఖర్చు సేవ్
ఇల్లు నిర్మించడం అనేది ప్రతివ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక, భావోద్వేగ పెట్టుబడుల్లో ఒకటి. కానీ, నిర్మాణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్న కాలంలో మెటీరియల్ ధరలు, ద్రవ్యోల్బణం, కార్మిక కొరత సవాళ్లుగా మారుతున్నాయి. అయినప్పటికీ సొంతింటి నిర్మాణంలో నాణ్యత విషయంలో గృహ యజమానులు రాజీపడడం లేదు. అందుకోసం తెలివైన, మరింత సమర్థవంతమైన మార్గాల కోసం చూస్తున్నారు. అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి మెటీరియల్ కొనుగోలు విషయంలో డబ్బులు మిగుల్చుకునే మార్గాలు ఏమిటో.. నిర్మాణదశలో కొత్త టెక్నాలజీలు ఏమున్నాయో తెలుసుకుందాం.డబ్బు మిగిలే మార్గాలు..బల్క్ ఆర్డర్లుపెద్ద మొత్తంలో మెటీరియల్స్ కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సరఫరాదారులు తరచుగా సిమెంట్, స్టీల్, ఇటుకలు, టైల్స్ బల్క్ ఆర్డర్లపై రాయితీ ఇస్తారు. నిత్యం చిన్నమొత్తంలో కొనుగోలు చేయడం కంటే బల్క్గా కొంటే రిటైలర్తో బేరమాడి తక్కువ ధరకే పొందవచ్చు.సీజనల్ కొనుగోలుమెటీరియల్ ధరలు సీజన్ను అనుసరించి మారుతుంటాయి. మార్కెట్ డిమాండ్తో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి. ఉదాహరణకు, వర్షాకాలంలో ఉక్కు, సిమెంట్ ధరలు చౌకగా ఉండే అవకాశం ఉంటుంది.ప్రత్యామ్నాయ మెటీరియల్ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫ్లై యాష్ ఇటుకలు, ఏఏసీ బ్లాక్స్ వంటివి తక్కువ ధరతో ఎక్కువ మన్నికనిస్తాయి. ఈ మెటీరియల్స్ నిర్మాణ, రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తాయి.పునర్వినియోగంపాత భవనాలు లేదా కూల్చివేసిన సైట్ల నుంచి కిటికీలు, తలుపులు, శానిటరీవేర్ లేదా టైల్స్ వంటి సెకండ్ హ్యాండ్ మెటీరియల్స్ను తిరిగి వాడుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఇలా రీయూజబుల్ మెటీరియల్ను అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకొని అవసరమైతే కొనుగోలు చేసుకోవచ్చు.ప్రభుత్వ పథకాలుప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. భవనాలకు కావాల్సిన మెటీరియల్స్పై తగ్గించిన జీఎస్టీ రేట్లు, సరసమైన గృహాలకు సబ్సిడీలు (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటివి), పన్ను మినహాయింపులు ఇవన్నీ మొత్తం నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.టెక్నాలజీలునిర్మాణంలో 3డీ ప్రింటింగ్టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 3డీ-ప్రింటెడ్ గృహాలు నిర్మాణం ఎక్కువైంది. టెక్నాలజీ ఆధారంతో ఎలాంటి డిజైనింగ్ ఇళ్లు కావాలనేదానిపై ముందుగానే అంచనాలు ఏర్పరుచుకొని ఖర్చు తగ్గించుకునేలా 3డీ ప్రింటెడ్ గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగంలో కొన్ని స్టార్టప్లు తక్కువ సమయంలోనే గృహాలను నిర్మిస్తున్నాయి. దీనివల్ల సమయం, కార్మిక ఖర్చులు రెండింటినీ మిగుల్చుకోవచ్చు.ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ప్రీ-కాస్ట్ గోడలు(ముందుగానే కట్టిన గోడలు), ఫ్లోర్ ప్యానెల్స్, పైకప్పులు బయట ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇంటి అవసరానికి తగినట్లుగా నిర్దిష్ట కొలతలతో అసెంబ్లింగ్ కోసం నిర్మాణ స్థలానికి రవాణా చేస్తున్నారు. ఇది ఆన్-సైట్ వ్యర్థాలను తగ్గిస్తుంది. నిర్మాణ సమయాన్ని 50% వరకు తగ్గించగలదు.బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బీఐఎం)బీఐఎం వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు భాగస్వామ్య 3D మోడల్ను ఉపయోగించి వారికి సహకరిస్తుంది. ఇది కచ్చితమైన పదార్థ అంచనాను నిర్ధారిస్తుంది. డిజైనింగ్ అవరోధాలను నిరోధిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీఐఎం అనేది కట్టే ఇంటికి నమూనాలాంటిది.ఏఐ-ఆధారిత ఎస్టిమేటర్లుకృత్రిమ మేధ సాధనాలు డిజైన్ బ్లూప్రింట్లను విశ్లేషించగలవు. కచ్చితమైన మెటీరియల్ అంచనాలను అందించగలవు. ఇది అధిక ఆర్డర్లు, తక్కువ వినియోగం లేదా చివరి నిమిషంలో మెటీరియల్ కోసం కంగారు పడడం వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.గ్రీన్ కాంక్రీట్ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థ ఉత్పత్తుల నుంచి తయారైన జియోపాలిమర్ కాంక్రీట్ సాంప్రదాయ సిమెంట్కు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ మెటీరియల్ మన్నికగా ఉంటూ పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో తోడ్పడుతుంది.డ్రోన్ ఆధారిత సైట్ సర్వేలుహై-రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతో కూడిన డ్రోన్లు వివరణాత్మక టోపోగ్రాఫిక్ మ్యాప్లు అందిస్తాయి. భారీ నిర్మాణ సైట్ల్లో డెవలప్మెంట్ను ట్రాక్ చేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’ -
ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్
ఇదివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంచుకోవాలి?, ల్యాండ్ కొనేముందు.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి? అనే విషయాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏవి అనే విషయాన్ని పరిశీలిద్దాం..ఇల్లు కట్టుకోవడానికి ఏ మెటీరియల్స్ కావాలనే విషయం బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అవగాహన కోసం ఒకసారి పరిశీలిస్తే.. సిమెంట్, ఇసుక, ఇటుకలు, కంకర, ఇనుము, వాటర్ ప్రూఫ్ మెటీరియన్స్ అవసరమవుతాయి. ఇవి కాకుండా వైరింగ్ కోసం, ప్లంబింగ్ కోసం మెటీరియల్స్, టైల్స్ / మార్బుల్ / గ్రానైట్, ఉడ్, గ్లాస్ వంటివి అవసరం అవుతాయి. ఇంటీరియర్ డిజైన్ కోసం మీ అభిరుచిని బట్టి ఎలాంటి మెటీరియల్స్ కావాలనేది మీ ఛాయిస్.మెటీరియల్స్ ధరల విషయానికి వస్తే..ఇల్లు నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ధరలు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ధరలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా.. నగరాల్లో ఇంకోలా ఉంటాయి. అయితే ధరలు ఎలా ఉన్నా.. జీఎస్టీ సవరణల కారణంగా అధిక ధరల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దీంతో ఖర్చులు కొంత తగ్గుముఖం పడతాయి.ఇదీ చదవండి: ఇంటి నిర్మాణం కోసం ఓ మంచి స్థలం: ఎంపిక చేయండిలా..నిర్మాణ సామగ్రిపై కొత్త జీఎస్టీ➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు?, వేగంగా ఇల్లు కట్టుకోవడం ఎలా?, ఇల్లు కట్టుకునేటప్పుడు ఖర్చులను తగ్గించుకునే మార్గాలు? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. -
ఇంటి స్థలం రెడీ.. ఇక పునాది పనులు ప్రారంభించండీ..
ఇంటి స్థలం ఎలా ఎంచుకోవాలి.. నిర్మాణానికి ముందు ప్లాటును ఎలా పరీక్షించుకోవాలన్నది ఇదివరకటి కథనాల్లో చూశాం.. ఇప్పుడు పునాదికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఇంటి నిర్మాణం అనేది కేవలం ఒక ఆస్తి నిర్మాణం మాత్రమే కాదు.. ఇది తరాల వారసత్వానికి బలమైన ఆధారం. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ ఫౌండేషన్. పునాది బలంగా లేకపోతే, ఎంత అందమైన నిర్మాణమైనా కాలక్రమంలో బీటలు పడే ప్రమాదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక పరిస్థితులు, మట్టి స్వభావం, నీటి మట్టం వంటి అంశాలు ఫౌండేషన్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. అందుకే, ప్రతి ఇంటి నిర్మాణానికి ముందు మట్టి పరీక్ష (soil test) చేయడం తప్పనిసరి. ఇది భవనం బరువును మట్టి తట్టుకోగలదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.సాంప్రదాయ ఫౌండేషన్ పద్ధతులుఇప్పటికీ చాలా మంది ఇండివిడ్యువల్ ఫుటింగ్ లేదా స్ట్రిప్ ఫౌండేషన్ వంటి సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి చిన్న స్థాయి గృహాలకు అనువైనవి. ఇండివిడ్యువల్ ఫుటింగ్ పద్ధతిలో ప్రతి పిల్లర్ కింద ప్రత్యేకంగా ఫుటింగ్ వేసి, భవన బరువును సమంగా పంపిణీ చేస్తారు. స్ట్రిప్ ఫౌండేషన్ పద్ధతిలో గోడల వెంట కాంక్రీట్ స్ట్రిప్ వేసి, గోడల బరువును మట్టిలోకి పంపిస్తారు.అయితే, మట్టి బలహీనంగా ఉన్న చోట రాఫ్ట్ ఫౌండేషన్ లేదా పైల్ ఫౌండేషన్ అవసరం అవుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్లో మొత్తం భవనానికి ఒకే పెద్ద ఆర్సీసీ స్లాబ్ వేసి, బరువును సమంగా పంపిస్తారు. పైల్ ఫౌండేషన్లో లోతైన కాంక్రీట్ పైల్స్ వేసి, భారం లోతుగా ఉన్న బలమైన మట్టికి చేరేలా చేస్తారు. ఇవి ఖర్చుతో కూడుకున్నవే అయినా, భద్రతకు మిన్న.కొత్త పద్ధతులుఇటీవల కాలంలో ప్రీకాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్ అనే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫ్యాక్టరీలో తయారైన ఫౌండేషన్ బ్లాక్స్ను నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి అమర్చడం వల్ల నిర్మాణ వేగం పెరుగుతుంది. కార్మిక వ్యయం తగ్గుతుంది. మెటీరియల్స్ వేస్టేజ్ తగ్గుతుంది. మరో కొత్త పరిష్కారం జియోపాలిమర్ కాంక్రీట్ ఫౌండేషన్. ఇది సాంప్రదాయ సిమెంట్కు ప్రత్యామ్నాయంగా ఫ్లై యాష్, స్లగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాల ఆధారంగా తయారవుతుంది. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. పర్యావరణానికి మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతల్లో రెట్రోఫిట్ అవసరమైన చోట మైక్రోపైల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇది చిన్న వ్యాసం గల పైల్స్ ద్వారా భవనాన్ని రీఇన్ఫోర్స్ చేయడం ద్వారా భద్రతను పెంచుతుంది.ఖర్చుల అంచనాఒక సాధారణ 1000 చ.అ.ఇంటి నిర్మాణానికి ఫౌండేషన్ ఖర్చు రూ.3.7 లక్షల నుండి రూ.5.9 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో మెటీరియల్స్, కార్మికుల వ్యయం, సాయిల్ టెస్టింగ్, నిర్మాణ డిజైన్ ఖర్చులు ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో ఒక బ్యాగు సిమెంట్ ధరలు రూ.350–రూ.400, స్టీల్ కేజీ రూ.60–రూ.70, ఇసుక ఇక క్యూబిక్ అడుగుకు రూ.40–రూ.60 మధ్య ఉన్నాయి. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అందుకే, నిర్మాణానికి ముందు స్థానిక కనస్ట్రక్టర్ లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్ సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!ఇంటిని నిర్మించడం అంటే భద్రత, మన్నిక, అందం అన్నీ మిళితమైన ప్రక్రియ. పునాది పద్ధతులు కూడా ఈ మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. పర్యావరణ అనుకూలత, నిర్మాణ వేగం, ఖర్చు తగ్గింపు వంటి అంశాలు కొత్త పద్ధతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తులో త్రీడీ ప్రింటెడ్ ఫౌండేషన్లు, స్మార్ట్ సెన్సర్లతో సాయిల్ మానిటరింగ్ వంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి రావొచ్చు. -
నిర్మాణ సామగ్రిపై తగ్గిన జీఎస్టీ.. గృహాలకు పెరగనున్న డిమాండ్
కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే. గృహ, కార్యాలయ, రిటైల్ విభాగాల వృద్ధికి దోహదపడటంతో పాటు సరళీకృత పన్ను విధానంతో పారదర్శకత, స్థిరాస్తి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. అయితే నిర్మాణ సామగ్రిపై తగ్గే జీఎస్టీ భారాన్ని.. ఆమేరకు డెవలపర్లు ప్రాపర్టీ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్ కస్టమర్లలో రెట్టింపు జోష్ నిండుకుంటుంది.నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు..నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే ఈ తగ్గింపును డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.నిర్మాణ పనులు వేగవంతం..జీఎస్టీ గతంలో మాదిరిగా ఐదు పన్ను శ్లాబులతో గందరగోళంగా లేకుండా రెండు రకాల ట్యాక్స్ ఫ్రేమ్వర్క్లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ప్రాపర్టీ కొనుగోలుదారుల్లో పన్ను చిక్కులు తొలుగుతాయి. స్థిరాస్తి రంగంలోకి మరిన్ని సంస్థాగత పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు తగ్గుతుండటంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతమవడంతో పాటు కొత్త ప్రాజెక్ట్ల లాంచింగ్స్కు డెవలపర్లు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో పట్టణ మార్కెట్లలో దాదాపు కోటి బడ్జెట్ గృహాల కొరత ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరుతుంది. ఇలాంటి సమయంలో కేంద్రం జీఎస్టీ తగ్గింపు చేయడం బడ్జెట్ గృహాలకు పెద్ద ఉపశమనం.ఏ విభాగంలో ఎంత ప్రయోజనమంటే? గృహ విభాగం: సిమెంట్పై జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ ఖర్చులు 3–5 శాతం మేర తగ్గుతాయి. ముఖ్యంగా రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే చౌక గృహాలను నిర్మిస్తున్న డెవలపర్లకు నగదు ప్రవాహం, మార్జిన్లు పెరుగుతాయి. దీంతో ఈ విభాగంలోని బిల్డర్లకు గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ భారం కారణంగా అందుబాటు గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపించలేదు. దీంతో మొత్తం కొత్త గృహాల సరఫరాలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. 2025 తొలి అర్ధభాగం నాటికి ఏకంగా 12 శాతానికి పడిపోయింది. అలాగే విక్రయాలలో ఈ విభాగం వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. తాజాగా కేంద్రం జీఎస్టీ సవరణతో నిర్మాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ తగ్గింపు వ్యయాలను డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక అందబాటు గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.కార్యాలయ విభాగం: ప్రస్తుతం కార్యాలయ విభాగం 12 శాతం జీఎస్టీ ఉంది. ఇన్పుట్ క్రెడిట్(ఐటీసీ) కూడా అందుకోవచ్చు. అయితే ఇటీవల పరిణామాలు పరిస్థితిని కొంచెం క్లిష్టతరం చేశాయి. వాణిజ్య ఆస్తుల లీజులపై ఐటీసీని తొలగించారు. దీంతో డెవలపర్లు ఇకపై ప్రాజెక్ట్ సంబంధిత వ్యయాలపై ఐటీసీని క్లెయిమ్ చేయలేరు. దీంతో కార్యాలయ స్థలాలు, ఇతర వాణిజ్య ఆస్తుల కార్యాచరణ ఖర్చులు, అద్దె ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రిజిస్టర్ చేయని వాణిజ్య ఆస్తుల అద్దెలు రివర్స్ ఛార్జ్ మెకానిజం(ఆర్సీఎం) ప్రకారం అద్దెదారులు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాణిజ్య ప్రాపర్టీలను అద్దెకు తీసుకునేవారికి ఇది అదనపు భారమే.రిటైల్ విభాగం: నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు డెవలపర్లకు ఇన్పుట్ ఖర్చులను తగ్గిస్తుంది. దీంతో షాపింగ్ మాల్స్, రిటైల్ కాంప్లెక్స్ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి రిటైల్ ప్రాజెక్ట్ల సరఫరా పెరగడంతో పాటు రిటైల్ అద్దెలలో పోటీ పెరుగుతుంది. జీఎస్టీ సవరణ లాజిస్టిక్ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. సరఫరా గొలుసులను క్రమబదీ్ధకరించడంలో సహాయపడుతుంది. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే రిటైల్ ప్రాపరీ్టల అద్దె ఆదాయంపై మాత్రం జీఎస్టీ 18 శాతం చెల్లించాల్సిందే. ఇది ఆయా అద్దెదారులకు కాసింత ఇబ్బందే..ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే? ➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది. ➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది. ➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది. -
ఇంటి నిర్మాణానికి ప్లాట్ ఎంచుకునేముందు..
ఇల్లు కట్టుకోవడం చాలా మంది కల. ప్రాథమికంగా ఇది సరైన ప్లాట్ను, సరైన ప్రదేశంలో ఎంచుకోవడంతో ప్రారంభమవువుతుంది. అందుకు ఎంపిక చేసుకునే ప్లాట్ నాణ్యత, భవిష్యత్తులో ఆ ఆస్తి విలువ పెరుగుదల, సమీపంలోని మౌలిక సదుపాయాలు వంటివి ఎంతో ప్రభావితం చేస్తాయి. ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశంలో తక్కువ ధరకు ప్లాట్ లభిస్తుంది కదా అని తొందరపడి కొనుగోలు చేశారంటే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మంచి ప్లాట్ను ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన కీలక అంశాలను కింద తెలుసుకుందాం.ప్రదేశంకొనుగోలు చేయాల్సిన ప్లాట్ పని ప్రదేశానికి లేదా వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్రధాన రహదారులు లేదా ప్రజా రవాణా ద్వారా సులువుగా ప్రయాణించే వీలుండాలి. భద్రత పరంగా మెరుగైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. భవిష్యత్తులో వాణిజ్యంగా, ఇతర పరామితుల దృష్ట్యా అభివృద్ధి చెందే అవకాశం ఉండాలి.మౌలిక సదుపాయాల లభ్యతహైటెక్ ఇల్లు కట్టుకున్నా అత్యవసర సేవల విషయంలో రాజీ పడడం సరికాదు. కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యం. విద్యుత్తు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ, వీధి దీపాలు, రవాణా సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.అత్యవసర సేవలుముఖ్యంగా విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. కొనుగోలు చేయాలనుకునే ప్లాట్కు 2-5 కిలోమీటర్ల లోపు పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి. సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్లినిక్ లేదా ఆసుపత్రి ఉండడం చాలా అవసరం. ఫార్మసీలు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు ఉండేలా తనిఖీ చేసుకోవాలి. ప్లాట్కు 5-10 కిలోమీటర్ల పరిధిలో 24/7 ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ఉండటం కీలకం. అత్యవసర సమయాల్లో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు.భూమి నాణ్యతప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు నేల నాణ్యత, స్థలాకృతిని అంచనా వేయాలి. ఇవి నిర్మాణ వ్యయాన్ని, భద్రతను ప్రభావితం చేస్తాయి. నీరు నిలవకుండా ఉండటానికి డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందనేది పరిశీలించాలి. తప్పకుండా భూసార పరీక్షలు చేసి నిపుణుల సలహా మేరకు నిర్మాణం ప్రారంభించాలి.పరిసరాలు, సమాజంఇల్లు అంటే కేవలం ఒక భవనం మాత్రమే కాదు. ఇక్కడే మీ జీవితం సాగుతుంది. చుట్టూ పార్కులు, ఆటస్థలాలు ఉండేలా గమనించాలి. కమ్యూనిటీ కల్చర్ (ఫ్యామిలీ ఫ్రెండ్లీ) ఎలా ఉందో గమనించి, అవసరమైతే సమీపంలోని వారితో మాట్లాడి ప్లాట్ కొనుగోలు చేయాలి.ఇదీ చదవండి: చిటికేసినంత సులువుగా ఇల్లు కొనేస్తున్నారు.. -
ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!
ఇల్లు కట్టే కలను సాకారం చేసుకోవాలంటే, ముందుగా భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని (ప్లాటు) ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకం. ఇది కేవలం ఆస్తి పెట్టుబడి మాత్రమే కాదు. మీ కుటుంబ భద్రత, ఆరోగ్యం, జీవనశైలి అన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. భూమి బలహీనంగా ఉంటే, ఎంత ఖరీదైన నిర్మాణమైనా భవిష్యత్తులో ప్రమాదమే. అందుకే, భవన నిర్మాణానికి ముందు భూమి స్వరూపాన్ని శాస్త్రీయంగా పరీక్షించుకోవడం తప్పనిసరి. సాయిల్ టెస్టింగ్ (Soil Testing) ద్వారా భూమి బలాన్ని, నీటి నిల్వ సామర్థ్యాన్ని, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో వచ్చే నిర్మాణ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఈ అంశాలు కీలకంతెలుగు రాష్ట్రాల్లో భూమి స్వరూపం ప్రాంతానుసారంగా మారుతుంది. ఎర్ర మట్టి (Red Soil) బలమైన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. నల్ల మట్టి (Black Cotton Soil) తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది, కదలికలతో భవనానికి ప్రమాదం కలిగించవచ్చు. ఇసుక నేలలో (Sandy Soil ) నీటి పారుదల బాగుంటుంది కానీ నిర్మాణానికి పనికిరాదు. భౌగోళిక స్థితి కూడా కీలకం. తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలు భద్రతకు మంచివైనా, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందువల్ల, స్థలం ఎంపికలో మట్టి స్వరూపం, నీటి ప్రవాహం, పరిసరాల భద్రత.. ఇలా అన్ని అంశాలూ కీలకం.ఇవిగో ఇవీ పరీక్షలుభూమి బలాన్ని, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కొన్ని ముఖ్యమైన సాయిల్ టెస్టులు ఉన్నాయి. బేరింగ్ కెపాసిటీ టెస్ట్ (Bearing Capacity Test) ద్వారా భూమి ఎంత బరువు మోయగలదో తెలుసుకోవచ్చు. మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ (Moisture Content Test) మట్టిలో తేమ శాతం ఎంత ఉందో తెలియజేస్తుంది. అట్టెర్బర్గ్ లిమిట్స్ (Atterberg Limits) పరీక్ష ద్వారా మట్టి ద్రవ, ప్లాస్టిక్ లక్షణాలు అంచనా వేయవచ్చు. కంపాక్షన్ టెస్ట్ (Compaction Test) ద్వారా భూమిని ఎంత గట్టిగా పాకబెట్టవచ్చో తెలుసుకోవచ్చు. పీహెచ్ టెస్ట్ (pH Test) ద్వారా మట్టి ఆమ్లత/క్షారత స్థాయిని తెలుసుకోవచ్చు. గ్రెయిన్ సైజ్ అనాలిసిస్ (Grain Size Analysis) ద్వారా మట్టి కణాల పరిమాణం, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయం అర్థమవుతుంది. ఈ పరీక్షల ఆధారంగా ఇంటికి ఎలాంటి పునాది వేయాలి.. పిల్లర్లు ఎంత లోతు నుంచి నిర్మించాలి అనే విషయాలను ఇంజినీర్లు నిర్ణయిస్తారు.ఎక్కడ చేస్తారీ పరీక్షలు?తెలంగాణలో సాయిల్ టెస్టింగ్ సేవలు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో కొన్ని ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా భూమి శాస్త్రీయ విశ్లేషణ పొందవచ్చు. అలాగే, ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా కూడా కొన్ని ప్రాంతాల్లో సాయిల్ టెస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన కేంద్రాలు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, శ్రీకాకులంలలో ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ద్వారా భూమి పరీక్షలు చేయించుకుని, నివేదిక ఆధారంగా పునాది, నిర్మాణ సామగ్రి, నీటి పారుదల వంటి అంశాలు నిర్ణయించుకోవచ్చు. జియోటెక్నికల్ నివేదిక తీసుకోవడం, ఫౌండేషన్ ప్లానింగ్ చేయడం, డ్రైనేజ్ డిజైన్ రూపొందించడం భవన నిర్మాణానికి ముందు అనుసరించాల్సిన చర్యలు.సాధారణంగా డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాటు తీసుకుంటుంటే ఈ పరీక్షలన్నీ డెవలపర్లే చేయిస్తారు. కానీ స్థలం కొంటున్నవారు కూడా టెస్ట్ చేయిస్తే మంచిది. నిపుణులు చెబుతున్న సూచన ప్రకారం, స్థలం ఎంపిక చేసిన వెంటనే సాయిల్ టెస్టింగ్ చేయించాలి. ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్స్ లేదా సివిల్ ఇంజినీర్ల ద్వారా నివేదిక పొందాలి. నివేదిక ఆధారంగా నిర్మాణ పునాది, నిర్మాణ పదార్థాలు, డ్రైనేజీ వంటి అంశాలు నిర్ణయించాలి. ఇది భవిష్యత్తులో వచ్చే నిర్మాణ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాయిల్ టెస్టింగ్ ఖర్చు కాదు.. ఇది భద్రతకు పెట్టుబడి.ఇదీ చదవండి: కోటి రూపాయలు లేకపోతే సొంతిల్లు కష్టమే.. -
ఇంటి నిర్మాణం కోసం ఓ మంచి స్థలం: ఎంపిక చేయండిలా..
పేదవారికైనా, ధనవంతులకైనా సొంతంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కల. ఆ కల కోసం చాలా కష్టాలు పడి డబ్బు పోగు చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనుకోవడం మంచి ఆలోచనే.. కానీ ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంపిక చేసుకోవాలి?, దానికి అయ్యే బడ్జెట్ ఎంత అనేదానికి సంబంధించిన విషయాలపై కూడా ఓ అవగాహన ఉండాలి.ఇల్లు కట్టుకోవడానికి.. ఓ మంచి స్థలం ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లు ఒక్కసారే ఇష్టపడి కట్టుకుంటారు. కాబట్టి మీ జీవనశైలికి తగిన విధంగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అందుబాటులో ఉన్న వనరుల గురించి తెలుసుకుని స్థలం ఎంచుకోవాలి.స్థలం ఎంచుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలుచేతిలో డబ్బు ఉంది, ఇల్లు కట్టుకుంటాం.. అనుకుంటే సరిపోదు. ఆలా అని తక్కువ ధరలో.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొనే స్థలానికి దగ్గరలో.. స్కూల్, హాస్పిటల్, మార్కెట్స్, రవాణా సదుపాయాలు మొదలైనవి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.స్వచ్ఛమైన వాతావరణం ఉండే ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటే.. ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శబ్దాలు లేకుండా.. స్వచ్ఛమైన గాలి అందుబాటులో వుండే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ఉందా?, లేదా? అనేది కూడా ముందుగానే పరిశీలించాలి.ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎంచుకోవడానికి ముందు.. అది భూకంప ప్రభావానికి గురైన ప్రాంతమా?, వరదలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా?, అనే విషయాలతో పాటు.. మంచినీటి వసతి, డ్రైనేజీ సదుపాయాలు మొదలైనవి ఉన్నాయా? లేదా అని ముందుగానే తెలుసుకోవాలి.బడ్జెట్ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుగోలు చేయాలనుకున్నప్పుడే.. ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే ప్రశ్న తెలెత్తుతుంది. స్థలం కోసమే ఎక్కువ డబ్బు వెచ్చిస్తే.. ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి.. దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని, ప్రణాళికను దెబ్బతీస్తుంది.ఉదాహరణకు.. ఇంటి స్థలం కోసం రూ.10 లక్షలు కేటాయించాలి అని ప్లాన్ వేసుకున్నప్పుడు, ఆ బడ్జెట్లో లభించే స్థలం కోసం వేచి చూడాలి. మీ బడ్జెట్కు స్థలం లభించిన తరువాత ముందడుగు వేయాలి. ఇక్కడ కూడా మీకు కావలసిన సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..ప్రస్తుతం స్థలాల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ధరలు నగరాల్లో ఒకలా.. నగరాలకు కొంత దూరంలో ఇంకోలా ఉన్నాయి. ఈ విషయాలను ముందుగా తెలుసుకోవాలి. దీనికి నిపుణుల సలహాలు తీసుకోవాలి. కొంతమంది మధ్యవర్తులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కట్టుకోవడం అంటే.. గోడలు కట్టి, పైకప్పు వేసుకోవడం కాదు, అది మనసుకు నచ్చేలా.. ప్రశాంతతను ఇచ్చేలా ఉండాలి. ఇది మొత్తం మీ ఎంపిక మీదనే ఆధారపడి ఉంటుందనే విషయం మాత్రం మరచిపోకూడదు. -
ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
ఇల్లు కట్టుకోవడం సామాన్యుడి కల. ప్రాథమిక దశలో అందుకోసం ప్లాట్ను ఎంచుకోవడం నుంచి చివరకు గృహప్రవేశం వరకు ఎన్నో ఆలోచిస్తారు. ముందుగా ఇల్లు నిర్మించాలనుకునేవారు సరైన ప్లాట్ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన దశ. ఇది ప్లాట్ ధర లేదా దాని పరిమాణం గురించి మాత్రమే కాదు.. ఒకవేళ అనుకోని కారణాలతో ప్లాట్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోకపోయినా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించేందుకు ప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.ప్రదేశంప్లాట్ కొనేప్పుడు సమీప పరిసరాల్లో కనీస మౌలిక సదుపాయాలుండేలా చూసుకోవాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, కిరాణా దుకాణాలు, ప్రజా రవాణా వంటి నిత్యావసరాలకు దగ్గరగా ఉండాలి. సజావుగా ప్రయాణించడానికి ప్రధాన రహదారులు లేదా రహదారి కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్తులో ఇన్ఫ్రా ప్రాజెక్టులు రాబోయే ప్రాంతాలు ఆస్తి విలువను పెంచుతాయి.ప్లాట్ ఆకారం, పరిమాణంకొనుగోలు చేసే ప్లాట్ ఆకారం చివరవందరగా, తక్కువ పరిమాణంలో ఉంటే ఇల్లు నిర్మించడం కష్టం అవుతుంది. చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకార ప్లాట్లు సరళమైన డిజైనింగ్, నిర్మాణానికి అనువైనవని గుర్తించాలి. సరైన ఆకారం లేని ప్లాట్లు నిర్మాణ ప్రణాళికను క్లిష్టతరం చేస్తాయి. ఖర్చులను పెంచుతాయి. ఇవి సాధారణ ప్లాట్ల కంటే తక్కువ ధరకే లభించవచ్చు. అయితే అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్లాట్ పరిమాణం ప్రస్తుత భవన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే భవిష్యత్తు విస్తరణకు అవకాశం ఉంటే మరీ మంచిది.నేల నాణ్యత, భూగర్భ జలాలుమట్టి నాణ్యతను పరీక్షించడంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత కాలంలో నిర్మాణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. నిర్దిష్ట ప్రదేశంలోని ల్యాండ్ ‘లోడ్ బేరింగ్ సామర్థ్యం(ఎంత బరువును తట్టుకుంటుందని తెసుకుపోవడం)’ను అంచనా వేయడానికి భూసార పరీక్ష నిర్వహించాలి. వదులుగా ఉన్న భూమి లేదా బంకమట్టి ఉంటే ఇది పునాదిని దెబ్బతీస్తుంది. భూగర్భజలాల లభ్యత, నీటి మట్టం లోతును తనిఖీ చేసుకోవాలి.లీగల్ వెరిఫికేషన్భూమిపై పెట్టుబడి పెట్టేటప్పుడు చట్టపరంగా ప్లాట్కు స్పష్టమైన టైటిల్ ఉండేలా చూసుకోవాలి. ఆ ల్యాండ్ వివాదరహితంగా ఉండాలి. న్యాయపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. స్థానిక మున్సిపల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉండేలా జాగ్రత్తపడాలి.వాస్తువాస్తు తప్పనిసరి కానప్పటికీ, భారతదేశంలో చాలా మంది కొనుగోలుదారులు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేసింగ్ ఉన్న ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. శ్మశానవాటికలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు లేదా శబ్దం చేసే పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ప్లాట్లకు డిమాండ్ తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?


