breaking news
Youth Finance
-
అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..
డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అదేలా..అంటారా? మనం చేసే పెట్టుబడులే దీర్ఘకాలంలో భారీగా సంపదను సృష్టిస్తాయి. అందుకు చాలామంది రియల్ఎస్టేట్, వ్యాపారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బంగారం.. వంటివి ఎంచుకుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీన్ని తట్టుకొని మన సంపద దీర్ఘకాలంలో భారీగా పెరగాలంటే సరైన ఇన్వెస్ట్మెంట్, టైమ్ ఎంతో అవసరం. పైన తెలిపిన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే భారీగా నగదు కావాల్సి ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ క్రమానుగత పెట్టుబడులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కనిష్ఠంగా రూ.100 నుంచి పొదుపు చేసి దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు. ఇలా యుక్త వయసులో చేసిన పొదుపును రిటైర్మెంట్ తర్వాత సంతోషంగా ఖర్చు పెట్టవచ్చు. అలా ఖర్చు పెడుతూ కూడా తిరిగి సంపదను సృష్టించే ఎస్డబ్ల్యూపీ విధానాల గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై అవగాహన చాలా మందిలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ (SIP) మంచి మార్గంగా మారింది. సిప్లో ప్రతి నెలా మీరు పెట్టుబడి పెట్టే చిన్న మొత్తమే కాలక్రమేణా పెరుగుతుంది. తద్వారా మీ పెట్టుబడిపై మంచి రాబడి లభిస్తుంది.సిప్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.. దీన్నే సంక్షిప్తంగా సిప్ అని వ్యవహరిస్తారు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సిప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇది కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మీరు పదేపదే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయి మ్యూచువల్ ఫండ్కు వెళుతుంది.నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే..సిప్ ద్వారా ఇప్పుడు మీరు ప్రతి నెలా రూ .3000 పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే, 10 సంవత్సరాల తరువాత మీ పెట్టుబడి ఎలా పెరుగుతుందన్నది ఉదాహరణ ద్వారా చూద్దాం.. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే, అది సగటున 12% వార్షిక రాబడిని ఇస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.3,60,000 అవుతుంది. అదే సమయంలో ఈ పెట్టుబడిపై వచ్చే రాబడి సుమారు రూ.3,37,017 ఉంటుంది. అంటే పదేళ్ల తర్వాత మీ చేతికి మొత్తంగా రూ.6,97,017 వస్తుంది.సిప్ ప్రయోజనాలుచిన్న పెట్టుబడులతో ప్రారంభించి కాలక్రమేణా పెద్ద మొత్తంలో రాబడి సంపాదించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.సిప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది రాబడిని సమతుల్యం చేస్తుంది. అంటే మార్కెట్ పడిపోయినా, కాలక్రమేణా మీ పెట్టుబడి సరైన దిశలో పెరగడానికి సిప్ సహాయపడుతుంది.సిప్లో పెట్టుబడులను మీ సౌలభ్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా మీ ఖాతా నుండి నిర్ణీత మొత్తం నేరుగా మ్యూచువల్ ఫండ్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి మీరు మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు.సిప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని పొందుతారు. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు కాలక్రమేణా మెరుగుపడతాయి.గుర్తుంచుకోవాల్సినవి..సరైన మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి పనితీరు కనబరిచే ఫండ్లను ఎంచుకోవడం వల్ల మంచి రాబడి పొందవచ్చు.మీ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు రూ.500తో కూడా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.సిప్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులను నివారించి మంచి రాబడి పొందవచ్చు.క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తేనే సిప్ బెనిఫిట్ లభిస్తుంది. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రాబడి పొందొచ్చు.సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్(ఎస్డబ్ల్యూపీ)సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్(ఎస్డబ్ల్యూపీ).. ఇదేంటి.. మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు తప్ప ఈ ఎస్డబ్ల్యూపీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? నిజమే!! ఇది సిప్కు పూర్తి రివర్స్ పద్ధతి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి సిప్ అన్నది అందరికీ మూలమంత్రంగా మారిపోయింది. చాలా మంది చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్లు.. ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ కారణాల రీత్యా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.ఎస్డబ్ల్యూపీలో ప్రతి నెలా లేదా నిర్దిష్ట కావధుల్లో నిర్దిష్ట మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వీలుంటుంది. ఎస్డబ్ల్యూపీని వినియోగించుకునే ప్రతీసారి సదరు తేదీన ఫండ్ ఎన్ఏవీ ఆధారంగా యూనిట్ల రిడెంప్షన్, చెల్లింపులు ఉంటాయి.ఎవరి కోసమిది?చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉండి.. నెలవారీనో, మూడు నెలలకోసారో ఇలా నిర్ధిష్ట కావధుల్లో చేతిలోకి డబ్బు రావాలనుకునేవారికి ఎస్డబ్ల్యూపీ విధానం చాలా అనుకూలం. ఇక పదవీ విరమణ చేసి (రిటైరీలు) క్రమానుగత ఆదాయాన్ని ఆశించే వారికీ ఇది అనువైన విధానమే. అయితే, దీన్ని ఎంచుకునే ముందు.. దీని తీరుతెన్నుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇలా చేసిన బాలాజీ మూర్తి గురించి మీకు చెబుతాను. ఆయన దాదాపు 35 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవలే రిటైరయ్యారు. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వచ్చాయి. క్రమానుగతంగా ఆదాయాన్నిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటుంటే ఎవరో ఎస్డబ్ల్యూపీ గురించి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ వారి సలహాను పాటిద్దామని భావించాడనుకోండి. అపుడు ఏం జరుగుతుందో చూద్దాం...ఎస్డబ్ల్యూపీ తీరుతెన్నులుబాలాజీ తనకందిన డబ్బు నుంచి సుమారు రూ.10 లక్షల మొత్తాన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఒక డెట్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ కింద ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ఎన్ఏవీ ఉన్న లక్ష యూనిట్లు కొన్నారు. ప్రతి నెలా 5వ తారీఖున రూ.10,000 విత్డ్రా చేసుకునేలా ఆయన ఎస్డబ్ల్యూపీని సెట్ చేసుకున్నారు. తర్వాత నెల 5వ తేదీన సదరు ఫండ్ ఎన్ఏవీ రూ.10.50గా ఉంది. ఆ రోజున ఆయన విత్డ్రా చేసుకోవాల్సిన రూ.10,000కు సరిసమానంగా రూ.10.50 రేటుతో 952.3810 యూనిట్లు రిడీమ్ చేశారు. ఫలితంగా ఎస్డబ్ల్యూపీ రిడెంప్షన్ అనంతరం ఆయన వద్ద ఇక 99,047.619 యూనిట్లు మిగిలాయి. అటుపైన ప్రతి నెలా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.10 వద్దే స్థిరంగా ఉండి, ప్రతి నెలా రూ.10,000 విత్డ్రా చేసుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన రూ.10 లక్షల పెట్టుబడి.. 100 నెలల దాకా సరిపోతుంది. అయితే, అది డెట్ ఫండ్ కాబట్టి నష్టాలు తక్కువ. రాబడులు కాస్త స్థిరంగానే వస్తుంటాయి. కాబట్టి 100 నెలలు పైబడి కూడా ఎస్డబ్ల్యూపీ కొనసాగవచ్చు.ఎస్డబ్ల్యూపీ ఎన్నాళ్ల పాటు కొనసాగవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే బాలాజీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఏటా 12 శాతం రాబడులు ఇస్తుండగా.. ప్రతి నెలా కార్పస్ నిధి నుంచి 1 శాతం మేర విత్డ్రా చేసుకుంటూ పోయినా ఎస్డబ్ల్యూపీ జీవితాంతం కొనసాగుతోంది. ఎస్డబ్ల్యూపీలో ప్రత్యేకత ఇదే. మ్యూచువల్ ఫండ్ ఏటా సానుకూల రాబడులు అందిస్తున్నంత కాలం.. ఆయన ఎస్డబ్ల్యూపీ కచ్చితంగా 100 నెలల వ్యవధికి మించి కొనసాగుతుంది.గుర్తుంచుకోదగినవి..ఎస్డబ్ల్యూపీలనేవి దీర్ఘకాలిక కోణంలోనే ఉపయోగపడేవి. స్వల్పకాలిక కోణంలో ఇన్వెస్టరుకు పెద్దగా ప్రయోజనం ఉండదు.ఎస్డబ్ల్యూపీ అనేది ఇతరత్రా నెలనెలా వచ్చే ఆదాయానికి అనుబంధంగా రాబడినిచ్చేదే తప్ప.. ఇదే ప్రధాన ఆదాయవనరు కాదు.దీర్ఘకాలికంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.తొలినాళ్లలో ఎక్కువగా అసలు మొత్తం నుంచే విత్డ్రాయల్ జరుగుతుంది.ఇదీ చదవండి: ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సై -
మొదటిసారి అప్పు చేస్తున్నారా?
అత్యవసరాలకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్నిసార్లు అప్పు చేయడం తప్పదు. అయితే అప్పు తీసుకోవాలనుకుంటే క్రెడిట్ స్కోర్ తప్పకుండా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. దాంతో మొదటిసారి అప్పు చేయాలంటే సిబిల్ లేదనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా అప్పు చేసి అధిక వడ్డీలు చెల్లిస్తుంటారు. అలాంటి వారికోసం బ్యాంకులు ఇతర ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి రుణాలు మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ హిస్టరీ లేని న్యూ-టు-క్రెడిట్ (ఎన్టీసీ) కస్టమర్లకు రుణాలను విస్తరించాలని బ్యాంకులను కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ఆదేశాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.సంప్రదాయకంగా క్రెడిట్ బ్యూరో స్కోరు(సిబిల్) రుణ ఆమోదం ప్రక్రియలో కీలక నిర్ణయాంశంగా ఉంది. తగినంత లేదా క్రెడిట్ చరిత్ర లేకపోవడం వల్ల చాలా మంది రుణాలకు దూరంగా ఉంటున్నారు. అందులో కొందరు ఇతర మార్గాలు, అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మొదటిసారి రుణాలు పొందేవారికి క్రెడిట్ హిస్టరీ ఉండదు కాబట్టి అలాంటి వారి రుణ అర్హతను అంచనా వేయడానికి బ్యాంకులు విస్తృత సూచికలను పాటిస్తున్నాయి.ప్రత్యామ్నాయ డేటా వనరులుఎన్టీసీ కస్టమర్లకు రుణాలు మంజూరు చేయడానికి యుటిలిటీ పేమెంట్స్, మొబైల్, టెలికాం బిల్లులు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఈ-కామర్స్ బిహేవియర్ వంటి ప్రత్యామ్నాయ డేటా వనరులను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రజనీష్ కార్ణటక్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రుణగ్రహీతలకు 16 శాతం రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయని, మిగిలినవి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఈ వ్యత్యాసం రుణగ్రహీతలకు సంబంధించి నిర్మాణాత్మక డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ఏర్పడిందని కార్ణటక్ తెలిపారు.ఎన్టీసీ రుణగ్రహీతలకు మద్దతుప్రభుత్వం కూడా ఎన్టీసీ రుణగ్రహీతలకు మద్దతుగా నిలుస్తోంది. వీరికి రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ కనీస క్రెడిట్ స్కోర్ను తప్పనిసరి చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల స్పష్టం చేశారు. జనవరి 6, 2025 నాటి ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ను ప్రస్తావిస్తూ ‘మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.. కాబట్టి వారి రుణ దరఖాస్తులను తిరస్కరించకూడదు’ అని చౌదరి నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్కు చెక్ పెట్టాలి -
మరో బీమా సంస్థ సూపర్ టాపప్ ప్లాన్.. తీసుకోవచ్చా?
నాకు రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. తీసుకోవచ్చా? – షావలిటాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, మొత్తం బిల్లులో అంతకు మించిన క్లెయిమ్కే చెల్లింపులు లభిస్తాయి. డిడక్టబుల్ మేర పాలసీదారు భరించాల్సి ఉంటుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాల్సిన అసవరం లేదు. టాపప్ ప్లాన్లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. అదే సూపర్ టాపప్ ప్లాన్లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు.ప్రస్తుతం ఉన్న ప్లాన్లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.4 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.6 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.8 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.8 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా క్లెయిమ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. ఒకటికి మించిన సంస్థల వద్ద క్లెయిమ్ దాఖలుకు శ్రమించాల్సి వస్తుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక్క సూపర్ టాపప్ ప్లాన్ను కలిగి ఉండడమే సౌకర్యం.బంగారం, వెండి, ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే మల్టీ అస్సెట్ ఫండ్స్తో ప్రయోజనాలు ఏమిటి? – నగేష్ బంగారుమల్టీ అస్సెట్ ఫండ్స్ కనీసం మూడు రకాల సాధనాల్లో (సాధారణంగా ఈక్విటీ, డెట్, గోల్డ్) పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీ మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. 2008 నుంచి సెన్సెక్స్ పది దారుణ పతనాలను గమనించండి. ఆ సమయంలో ఈక్విటీలు ఒక నెలలో 22.5 శాతం మేర నష్టపోయాయి. అదే సమయంలో బంగారం ధరలు కూడా తగ్గాయి. కాకపోతే ఈక్విటీలతో పోల్చి చూస్తే బంగారంలో క్షీణత తక్కువ. పెట్టుబడుల విలువను రక్షించే స్థాయిలో ఈ వ్యత్యాసం లేదు. 2008, 2024 సంవత్సరాలు ఇందుకు మినహాయింపు. అప్పుడు ఈక్విటీలతో పోల్చితే బంగారం మెరుగ్గా పనిచేసింది. దీర్ఘకాలంలో ఈక్విటీలంత కాకపోయినా, కొంత వ్యత్యాసంతో బంగారం సైతం మెరుగైన రాబడులను ఇచ్చింది. కనుక మెరుగైన రాబడుల కోణంలో కాకుండా వైవిధ్యం కోసం మల్టీ అస్సెట్ ఫండ్స్లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: టారిఫ్లతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు -
డబ్బులు దాచుకునే పిగ్గీ బ్యాంక్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?
పిల్లలూ... మీరంతా డబ్బులను భద్రంగా దాచుకునేందుకు పిగ్గీ బ్యాంక్ను ఉపయోగిస్తుంటారు కదూ. పెద్దలు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుల్ని ఇందులో దాచుకొని, అది నిండాక పగలగొట్టి వాడుకుంటారు కదూ. వరాహం ఆకారంలో ఉండే ఈ పిగ్గీ బ్యాంక్ వాడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగానూ పెట్టుకుంటారు.ఇలా డబ్బు దాచుకునే సాధనాలను వాడే అలవాటు క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదలైందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు ఆ కాలంలో వారు డబ్బులు దాచే పెట్టెలు, హుండీలు బయటపడ్డాయి. వాటిని వివిధ రకాల లోహాలతో తయారు చేశారు. అయితే వరాహ ఆకారంలో ఇలాంటివి తయారు చేయడం మాత్రం క్రీ,శ, 12వ శతాబ్దంలో మొదలైందని అంటారు.వరాహ ఆకారంలో ఉన్న ఈ హుండీలు జావా ద్వీపంలో మొట్టమొదటిసారి దొరికినట్లు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో పెద్ద సంఖ్యలో వరాహ ఆకారపు పిగ్గీ బ్యాంకులు కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆకారంలోని పిగ్గీ బ్యాంకులు 13వ శతాబ్దంలో జర్మనీలో తయారయ్యాయని అంటున్నారు. అక్కడ పందులను అదృష్టానికి చిహ్నాలుగా గౌరవించేవారని, అందుకే పంది ఆకారంలో వాటిని తయారు చేసేవారని భావిస్తున్నారు.ఈ పిగ్గీ బ్యాంక్లు సిరామిక్ లేదా పింగాణీతో తయారు చేస్తారు. వివిధ సైజులు, ఆకారాలతో ఇవి లభ్యమవుతాయి. విదేశాల్లో పిల్లలకు పుట్టినరోజు బహుమతులుగా వీటిని ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. పిల్లల్లో పొదుపు ఆలోచన పెంచేందుకు కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పిగ్గీ బ్యాంకులను వారికి ఉచితంగా అందిస్తుంటాయి. -
మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వాలా?
చదువు పూర్తి చేసుకుని కెరియర్లోకి అడుగుపెడుతున్న చాలా మంది యువతకు పర్సనల్ ఫైనాన్స్పై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అప్పుడే చదువు అయిపోయి ఉంటుంది..కొత్త ఉద్యోగం.. కొత్త కొలీగ్స్.. పార్టీలు.. బ్రాండెడ్ వస్తువులు.. డైనింగ్లు.. ఇలా చాలా వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. కానీ కెరియర్ ఇనిషియల్ స్టేజ్ నుంచే పొదుపు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో దీర్ఘకాలంలో భారీ కార్పస్ను క్రియేట్ చేయవచ్చని చెబుతున్నారు. అందుకు ఏం చేయాలో సలహాలు ఇస్తున్నారు.త్వరగా పొదుపు ప్రారంభించాలి..మొదటి జీతం పెద్దగా లేకపోయినా, ప్రతి నెలా ఎంతో కొంత పొదుపు చేయడం ప్రారంభించాలి. చక్రవడ్డీ నిజంగా దీర్ఘకాలంలో అద్భుతాలు చేస్తుందని నమ్మండి. ఈ రోజు పొదుపు చేసిన డబ్బు కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది. ఉదా..22 సంవత్సరాల వయసు నుంచి నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి ఏటా 12 శాతం రిటర్న్తో లెక్కిస్తే కనీసం రూ.50 లక్షలు సమకూరుతాయి.ఖర్చులను ట్రాక్ చేయాలి..సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచే డబ్బు ప్రవాహాన్ని ట్రాక్ చేయాలి. అందుకు అవసరమయ్యే ఎక్సెల్ షీట్స్ వంటి బడ్జెట్ టూల్స్ను ఉపయోగించవచ్చు. దీనికి అధికంగా ఖర్చు చేస్తున్నారో షీట్లో చూసుకొని, ఖర్చు తగ్గించుకుంటే ఫలితం ఉంటుంది.అనవసరమైన ఈఎంఐలు..ఈఎంఐ ద్వారా లేటెస్ట్ కాస్ట్లీ ఫోన్ లేదా బైక్ కొనడం సులభంగా అనిపించవచ్చు. కానీ నెలవారీ ఈఎంఐ మీ ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అత్యవసరం లేదా పెట్టుబడి సాధనం(విద్య లేదా గృహనిర్మాణం వంటివి) రుణాలను తీసుకోవద్దు.అత్యవసర నిధిజీవితం అనూహ్యమైంది. మారుతున్న టెక్నాలజీ వల్ల ఏవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య సమస్యలు ఎప్పుడైనా ఎదురవ్వొచ్చు. కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఖర్చులను ప్రత్యేక, సులభంగా నగదుగా మార్చగలిగే సాధనాల్లో పొదుపు చేయాలి.టర్మ్ ఇన్సూరెన్స్చదువు అయిపోయి ఉద్యోగంలో చేరిన వెంటనే ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందిస్తుంది. ఎండోమెంట్స్ లేదా యులిప్స్ వంటి జీవిత బీమా పథకాలకు దూరంగా ఉండండి. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువ పడుతుంది.మ్యూచువల్ ఫండ్స్లో సిప్మంచి మ్యూచువల్ ఫండ్స్లో ప్రతినెలా క్రమానుగత పెట్టుబడులు(సిప్) పెట్టాలి. ఇది దీర్ఘకాలిక సంపదను పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా మార్కెట్కు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ 3.0 కీలక ఫీచర్లు.. 8 కోట్ల మందికి ప్రయోజనం -
మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?
ఈరోజుల్లో చాలా కుటుంబాల్లో ఇల్లు, బంగారం, భూమి కొనుగోలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇవి దీర్ఘకాలంలో భద్రతా భావనను కలిగిస్తాయి. సామాజికంగా గౌరవం తెస్తాయి. ఇవి ఆర్థికంగా జీవితంలో విజయానికి సంకేతంగా నిలుస్తాయి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే వెంటనే ఉన్న భూమి అమ్మి ఖర్చు చేయలేని పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తులు వెంటనే నగదుగా మార్చుకోలేని ఆస్తులని గుర్తించాలి. పెద్ద ఇల్లు, బంగారం, వేల గజాల భూమి ఉన్నా నెలవారీ ఖర్చులు, ఆరోగ్య సమస్యలను తీర్చలేవు. ఇందువల్లే మనం నిజంగా ‘ఆస్తిపరులమా? ధనవంతులమా?’ అనే భావన వస్తుంది.ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి?సామాజిక ఒత్తిడిచదువు పూర్తయి ఉద్యోగం సంపాదించి పెళ్లి జరిగేలోపు ఇల్లు కొనాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దీనివల్ల పెద్ద మొత్తంలో ఈఎంఐతో స్థిరాస్తిలో కొనుగోలు చేస్తుంటారు. ఇది వారి ఆదాయాన్ని కొన్నేళ్లపాటు పరిమితం చేస్తుంది.ఆర్థిక ప్రణాళిక లోపాలుచాలా మంది అత్యవసర నిధిని ఏర్పాటు చేయరు. తగిన బీమా కవరేజీ ఉండదు. అన్ని పెట్టుబడులు బంగారం, భూమి వంటి స్థిరమైన ఆస్తులపైనే ఉండిపోతాయి. వాటితో రెగ్యులర్ ఆదాయం ఒనగూరదు.ఆదాయాన్నిచ్చే ఆస్తులను విస్మరించడంమ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్ స్టాక్స్, అద్దె ఇల్లు, సైడ్ బిజినెస్ వంటి ఆదాయమిచ్చే పెట్టుబడులను విస్మరిస్తారు. భద్రత అనే నెపంతో బంగారం, స్థిరాస్తుల్లోనే మొత్తం పెట్టుబడిని మళ్లిస్తారు. కానీ అవి మిగతా అవసరాలను తీర్చలేవని గ్రహించరు.ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 3–6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. తగిన హెల్త్, లైఫ్, ఆస్తి బీమా ఉండాలి. డబ్బును సులభంగా విత్డ్రా చేసే వీలుండే లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ (సిప్, షార్ట్ టర్మ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి. నిరంతర నగదు ప్రవాహం కోసం డివిడెండ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి. క్రమానుగత పెట్టుబడులు ప్రారంభించి దీర్ఘకాలిక ఆదాయానికి మార్గాలు వేయాలి. వీలైతే ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ బిజినెస్ ప్రారంభించాలి. అద్దె ఇల్లు/ కమర్షియల్ ప్రాపర్టీ వంటి ఆదాయ ఆస్తులను అన్వేషించాలి.ఇదీ చదవండి: పండగ రోజు బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
జీవితం సాఫీగా సాగాలంటే ఎంత డబ్బు కావాలి?
ప్రతి మనిషికి సాధారణంగా జీవితం సాఫీగా సాగాలంటే ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందోననే ప్రశ్న ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయితే తన ఫ్యామిలీ ఆర్థికంగా భద్రంగా ఉంటుందా ఉండదా.. అనే సందేహంతో తన వద్ద ఎంత డబ్బు ఉంటే సరిపోతుందనే లెక్కలు వేసుకుంటారు. ప్రస్తుత లైఫ్స్టైల్, ఖర్చులు, ఇతర సౌకర్యాలకు కోటి రూపాయలు ఉంటే సరిపోతుందా.. లేదా రెండు కోట్లు కావాలా.. ఐదు కోట్లు కావాలా..? అనే ప్రశ్నలు వస్తుంటాయి. మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా. ఒక్కొక్కరి అవసరాలు వారివారి జీవన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఎంతైనా సరిపోకపోవచ్చు..సాధారణంగా చాలామంది తమ లైప్ సెటిల్ కావాలంటే ఎంత మొత్తం డబ్బుకావాలో చెప్పమంటే రాండమ్గా తోచిన నంబర్లు చెప్పేస్తుంటారు. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి కోటి రూపాయలు ఉంటే వారి ఖర్చులు, అవసరాలు.. అన్నింటికీ సరిపోవచ్చు. ఇంకొందరికి రూ.10 కోట్లు ఉన్నా సరిపోకపోవచ్చు. ఎంత డబ్బు కావాలనేది కుటుంబ సభ్యులు, వారి అభిరుచులు, ఖర్చు నేపథ్యం, భవిష్యత్తు ప్రణాళికలను బట్టి ఆధారపడుతుంది.ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా..ఆధునిక సమాజంలో ఎంత డబ్బు సంపాదించిన మరింత ఆర్జించాలనే భావన వస్తుంది. కష్టపడి పని చేసి కొంత ఆదాయం సంపాదిస్తే, మరింత ఆదాయం కావాలనిపిస్తుంది. ఈ అంతులేని కోరిక వల్ల ఆందోళన, అసంతృప్తి ఎదురవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలా అని సంపాదన లేకుండా ఉండాలని వారు చెప్పడం లేదు. ఇలాంటి కోరికల వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం రాదు. కోరుకున్న జీవితాన్ని గడపడానికి వాస్తవంగా ఏమి అవసరమో తెలుసుకోవడం కీలకం. మీ నియమాలకు, ఖర్చులకు, భవిష్యత్తు ప్రణాళికలు, అత్యవసరాలకు, ఆరోగ్య సంరక్షణకు సరిపోయే డబ్బు సంపాదిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కొంతమందికి సౌకర్యవంతమైన ఇల్లు, స్థిరమైన ఉద్యోగం, కుటుంబంతో వారాంతాల్లో ట్రిప్కు వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొందరికి ముందస్తు పదవీ విరమణ, ప్రయాణాలు చేయడం లేదా ఆర్థిక ఒత్తిడి లేకుండా సృజనాత్మక అభిరుచులను కొనసాగించాలనుకుంటారు.ముందుగా చేయాల్సింది..మొత్తంగా ఎంత డబ్బు సంపాదించాలనే దానిపై కాకుండా భవిష్యత్తులో ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నారు? అనే దానిపై స్పష్టత వస్తే ఎంత సంపాదించాలో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు మీ సౌకర్యం, ఆరోగ్యం, సంతోషం కోసం రాజీపడని అంశాలు ఏమిటని గుర్తించాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఏవి దోహదం చేస్తాయో తెలుసుకోవాలి. కష్టపడే వయసులో సంపాదించే మొత్తాన్ని దుబారా ఖర్చు చేయకుండా, పొదుపు చేసి భవిష్యత్తులో జీవితం సాఫీగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందుకు మెరుగైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?
భారతదేశంలో ఎన్నో సామాజిక వర్గాలకు చెందినవారు వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులో చాలామంది విజయం సాధిస్తున్నారు. అయితే మార్వాడీ సామాజిక వర్గానికి మాత్రం వ్యాపారం చేయడంలో, అందులో విజయం సాధించడంలో ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆర్థిక ఆలోచనా విధానం, వ్యాపార పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. దాంతో వీరు వ్యాపారంలో ముందుంటున్నారనే వాదనలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకురావడంలో ఈ వర్గం ప్రావీణ్యం పొందిందని కొందరు చెబుతుంటారు. అయితే వీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.చిన్నతనం నుంచే...మార్వాడీ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే వ్యాపార అంశాలను పిల్లలకు నేర్పిస్తారు. చాలా షాపులు, వ్యాపారాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే మెలకువలు నేర్పిస్తారు.ఖర్చు చేయడం కన్నా పొదుపు చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.మార్వాడీలు ఏదైనా వస్తువు కొంటే ధర తగ్గించేందుకు భేరమడడం అలవాటు చేసుకుంటారు. ఇది తమ వ్యాపారాల్లో పెట్టుబడిని తగ్గించి లాభాలకు కారణం అవుతుంది.వ్యాపారంలోని ప్రమాదాలను స్వీకరించి అందుకు అనుగుణంగా ముందుకుసాగేలా సానుకూలతను అలవర్చుకుంటారు.నగదు ప్రవాహంపై ఫోకస్అధిక రుణాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే సొంత నిధులతో బిజినెస్ నడిపిస్తారు.లాభాలను తిరిగి వ్యాపారంలోకే మళ్లిస్తారు.నగదు ప్రవాహంపైనే ప్రధానంగా దృష్టి పెడుతారు.బిజినెస్ మోడల్స్వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.ఎక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల జోలికి వెళ్లరు.దశల వారీగా పెరిగే అవకాశాలున్న వ్యాపారాలనే ఎంచుకుంటారు.కమ్యూనిటీ నెట్వర్క్నమ్మకంతో బిజినెస్ సంబంధాలను పెంపొందించుకుంటారు.అప్పు, పెట్టుబడి, మార్కెట్ యాక్సెస్ కోసం సామాజిక సంబంధాలను ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకుంటారు.తరతరాల సంపద నిర్మాణంవ్యాపార వారసత్వాన్ని జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ఉండేలా చూసుకుంటారు.ఆస్తులను, తమ పెట్టుబడులను విభిన్న రంగాలకు విస్తరిస్తారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడుతారు.ఇదీ చదవండి: అమెజాన్ కొత్తగా మరో 40 ఆశ్రయ్ కేంద్రాలు -
రుణం భారమా...‘రాజీ’ ఉందిగా!
ఎన్నో అవసరాలకు నేడు అరువు ఆధారంగా మారుతోంది. రుణంపై ఖరీదైన కొనుగోళ్లకు సైతం వెనుకాడడం లేదు. ఈఎంఐతో చిన్నగా తీర్చేయొచ్చులే అన్న ధీమా కనిపిస్తోంది. కానీ, ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? లేదంటే ప్రమాదం/వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై.. రుణం తీర్చడం కష్టంగా మారితే? ఈ రిస్క్ ను రుణం తీసుకునే ముందు ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు ఉన్న ఏకైక మార్గం.. రాజీ (సెటిల్మెంట్) చేసుకోవడమే. ఇది ఎలా పనిచేస్తుంది..? రుణ చరిత్రపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? తదితర విషయాలతో కూడిన కథనమిది.రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల అసలుకు వడ్డీ తోడవుతుంది. దీనిపై పెనాల్టీ తదితర చార్జీలు కూడా పడతాయి. సకాలంలో రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతలపై, దీన్ని చట్టబద్ధంగా వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు ఎదురై రుణాన్ని సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో వన్టైమ్ లోన్ సెటిల్మెంట్ (రుణ పరిష్కారం) కోసం అభ్యర్థించొచ్చు. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఇందుకు అనుమతిస్తే.. చెల్లించాల్సిన మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ, దీని కారణంగా తర్వాతి కాలంలో రుణం పొందడం కష్టంగా మారొచ్చు. ‘‘వ్యక్తిగత రుణం, వాహన రుణం, గృహ రుణం, విద్యా రుణం, వ్యాపార రుణం, క్రెడిట్ కార్డు రుణం తదితర రుణాల్లో సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. రుణాన్ని పరిష్కరించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది క్రెడిట్ స్కోరుపై, ఆర్థిక భవిష్యత్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’ అని ఎంపాకెట్ (ఇన్స్టంట్ లోన్ ప్లాట్ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ జలాన్ వివరించారు. రుణ పరిష్కారం అన్నది అంతిమ ఆప్షన్గానే ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ చెల్లింపులు చేయలేక రుణ ఎగవేత పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడే లోన్ సెటిల్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలని ‘బేసిక్ హోమ్ లోన్’ సంస్థ సీఈవో అతుల్ మోంగా సూచించారు. దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు.ప్రధానంగా.. ‘‘అన్ సెక్యూర్డ్ రుణాలైన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు, వ్యాపార రుణాల విషయంలో రుణ పరిష్కారాన్ని పరిశీలించొచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్ కిందకు వచ్చే గృహ రుణాలు, ఆటో రుణాలు లేదా ప్రాపర్టీపై రుణాలు, బంగారంపై రుణాల పరిష్కారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తనఖాలో ఉన్న వాటిని రుణదాతలు స్వా«దీనం చేసుకుంటారు’’ అని మైమనీ మంత్ర డాట్ కామ్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు.తగ్గే భారం ఎంత? రుణం తీర్చే అవకాశం లేనప్పుడు పరిష్కారం మాత్రం ఎందుకు? అని సందేహించొచ్చు. చట్టపరమైన చర్యలకు దూరంగా ఎంతో కొంత చెల్లించి భయపడే మార్గం దీంతో లభిస్తుంది. దీనివల్ల మానసిక నిశి్చంత లభిస్తుంది. సెటిల్మెంట్తో తగ్గే భారం ఎంత? అన్న దానికి ఇతమిద్ధమైన సూత్రం ఏమీ లేదు. రుణం ఇచ్చిన సంస్థతో బేరసారాలు.. నియమ, నిబంధనలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీత చెల్లింపుల సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధిక వడ్డీ భారం ఉండే క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాల విషయంలో సెటిల్మెంట్తో చెప్పుకోతగ్గ భారం తగ్గుతుంది. రుణగ్రహీత తన ఇబ్బందికర పరిస్థితుల గురించి రుణదాతకు సమర్థవంతంగా వివరించగలిగితే.. పాక్షిక చెల్లింపులకు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ అంగీకరించొచ్చు. అవకాశం ఉంటే పూర్తి మొత్తంతో పరిష్కరించుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణుల సూచన. మొత్తం బకాయి ఎంత? దానిపై వడ్డీ భారం ఎంత? చర్చల సామర్థ్యంపైనే తుదకు ఎంత మొత్తం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుందని అతుల్ మోంగా తెలిపారు. అసలు రుణం కంటే కొంచెం ఎక్కువగాను.. అసలు, వడ్డీ అన్ని చార్జీలు మొత్తం కంటే తక్కువ చెల్లించే పరిష్కారానికి వీలుంటుంది. ‘‘ఏక మొత్తంలో చెల్లిస్తారు గనుక మొత్తం బకాయిలో తక్కువకే రుణ దాతలు అంగీకరిస్తారు. ఒకవేళ పాక్షిక చెల్లింపులకు సైతం కటకట ఎదుర్కొంటుంటే.. మొత్తం బకాయిలో 25 శాతం లేదా 30 శాతం చెల్లించే ప్రతిపాదన చేయొచ్చు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రుణదాతకు వివరించాలి. దీంతో చెల్లించాల్సిన మొత్తం 30–50 శాతానికి పరిమితం అవుతుంది’’ అని విద్యా రుణాల పంపిణీ సంస్థ ‘ప్రాపెల్డ్’ వైస్ ప్రెసిడెంట్ రవికిషోర్ గోయల్ తెలిపారు. చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉండి, చెల్లించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటే మరింత తక్కువ మొత్తానికి లోన్ సెటిల్ చేసుకునేందుకు అభ్యర్థించొచ్చని ఖోస్లా సూచించారు. బకాయిలో 10 నుంచి 50 శాతం మధ్య చెల్లింపులు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. సాధారణంగా రుణదాతలు బకాయిలో 50 శాతానికి పైన చెల్లించే పరిష్కారానికి అంగీకరిస్తుంటారని.. అయినప్పటికీ, సాధ్యమైనంత తక్కువకు పరిష్కారం కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చని సూచించారు. సమీప కాలంలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం లేని పరిస్థితుల్లోనే లోన్ సెటిల్మెంట్ను పరిశీలించాలన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే విడత కాకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు ఒకటికి మించిన వాయిదాల్లో చెల్లించే పరిష్కారం సైతం కుదుర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల సాయం.. రుణ గ్రహీతల తరఫున రుణ పరిష్కారం కోసం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలతో చర్చలు నిర్వహించేందుకు డెట్ కౌన్సిలర్ లేదా డెట్ సెటిల్మెంట్ ఏజెన్సీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. రుణ పరిష్కారం గురించి ఎలాంటి అవగాహన లేని వారు, ఎలా మాట్లాడాలో తెలియని వారు ఈ తరహా సేవలను పొందొచ్చు. ‘‘నిపుణుల సాయం తీసుకోవడం వల్ల స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంప్రదింపుల్లో డెట్ సెటిల్మెంట్ కంపెనీలు ఎంతో అనుభవం కలిగి ఉంటాయి. రుణగ్రహీత తరఫున మెరుగైన ప్రయోజనాలతో కూడిన పరిష్కారాన్ని చూడగలవు’’ అని గౌరవ్ జలాన్ తెలిపారు. అంగీకార పత్రాలు సంబంధిత డాక్యుమెంట్ల పని కూడా సులభతరం అవుతుందన్నారు. ఇలాంటి సేవలు అందించే కంపెనీల చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కనుక అందుబాటు ధరలపై అందించే సంస్థలను చూసుకోవడం ముఖ్యం. కొన్ని సంస్థలు ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంటే, కొన్ని బకాయిలో 15–25% వరకు తీసుకుంటాయని మోంగా తెలిపారు. ఇలాంటి సంస్థల సేవలను పొందే ముందు వాటి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి.క్రెడిట్ స్కోరుపై ప్రభావంరుణాన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ క్రెడిట్ బ్యూరోలకు అందిస్తాయి. ‘సెటిల్డ్’ లేదా ‘సెటిల్డ్ ఫర్ లెస్ దెన్ ద ఫుల్ అమౌంట్’ (అసలు కంటే తక్కువ మొత్తంతో పరిష్కారం) అంటూ బ్యాంక్లు తెలియజేస్తాయి. రుణ గ్రహీత క్రెడిట్ రిపోర్ట్లోకి ఇదే సమాచారం చేరుతుంది. సెటిల్డ్ అకౌంట్కు సంబంధించిన సమాచారం ఏడేళ్ల వరకు క్రెడిట్ రిపోర్ట్లో కొనసాగుతుంది. సెటిల్డ్ అని ఉంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేమిని సూచిస్తుంది. కనుక క్రెడిట్ స్కోరుపై గణనీయమైన ప్రభావమే పడుతుంది. దీంతో భవిష్యత్తులో అవసరానికి రుణం లభించదు. ఒకవేళ రుణం లభించినా ఇతరులతో పోలి్చతే చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణ బకాయిని పూర్తిగా చెల్లించినట్టయితే క్రెడిట్ రిపోర్ట్లో అది క్లోజ్డ్ (ముగిసినట్టు) అని ఉంటుంది. మరో రుణం పుడుతుందా? రుణాన్ని పరిష్కరించుకున్నాక చేయాల్సిన మొదటి పని, తిరిగి తమ క్రెడిట్ స్కోర్ను పునర్నిర్మించుకోవడం. తిరిగి మరో రుణం తీసుకునేందుకు కనీసం రెండేళ్లయినా విరామం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అప్పటి వరకు ఏ రుణం కోసం విచారణ చేయొద్దు. రుణ విచారణలు సైతం క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తాయి. రుణ పరిష్కారం చేసుకున్న వారు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచి ఆలోచన. అంటే ఫిక్స్డ్ డిపాజిట్పై జారీ చేసే క్రెడిట్ కార్డు. ఈ కార్డుపై 30–50 రోజుల కాలానికి వడ్డీ లేని రుణ సదుపాయం లభిస్తుంది. ఈ కార్డు మొత్తం లిమిట్లో 50 శాతం మించకుండా క్రమశిక్షణతో వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ వెళ్లాలి. దీనివల్ల రెండేళ్ల కాలంలో క్రెడిట్ స్కోరు బలపడుతుంది. తద్వారా గతంలో చేసుకున్న రుణ పరిష్కారం తాలూకు ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరి ఎంపికే.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది కనుక లోన్ సెటిల్మెంట్ అన్నది చివరి ఎంపికగానే ఉండాలి. దీనికంటే ముందు రుణ బకాయి మొత్తాన్ని చెల్లించే మార్గాలను పరిశీలించాలి. రుణదాతతో చర్చించుకుని, కొంత కాలం పాటు మారటోరియం (విరామం/6–12 నెలలు) కోరొచ్చు. ఈ లోపు ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టుకుని రుణ బకాయిని వడ్డీ సహా చెల్లించే వెసులుబాటును పరిశీలించాలి. లేదంటే దీర్ఘకాలానికి రుణాన్ని పునర్వ్యవస్థీకరించి, తక్కువ నెలసరి వాయిదాలతో చెల్లించే పరిష్కారం కుదుర్చుకోవచ్చు. ఏవైనా ఆస్తులు ఉంటే విక్రయించి చెల్లించడం మెరుగైన మార్గం అవుతుంది. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సాయంతో గట్టెక్కే మార్గం చూడొచ్చు. ఏ విధంగా చూసినా అవకాశం లేనప్పుడు రుణ పరిష్కారానికి వెళ్లొచ్చు. ఇవి గుర్తుంచుకోండి... కొన్ని వేల రూపాయిల బకాయి కోసం లోన్ సెటిల్మెంట్ కోరడం అస్సలు సూచనీయం కాదు. ఎంత కష్టమైనా సరే చెల్లించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. రుణ బకాయి వ్యక్తి వార్షిక ఆదాయంలో 20–30 శాతం ఉన్నప్పుడు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని క్రెడిట్ స్కోరులో రాజీ పడవద్దని ఖోస్లా సూచించారు. → లోన్ సెటిల్మెంట్లో భాగంగా అంగీకారం మేర చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రుణ దాత మాఫీ చేస్తారు. దాంతో చట్టపరంగా ఇకమీదట చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. → రుణ పరిష్కారం కంటే దివాలా పిటిషన్ దాఖలు చేయడమే తేలిక కదా అని అనుకోవద్దు. దివాలాతో రుణాలకు శాత్వతంగా దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. దీనికంటే సెటిల్మెంట్ నయం. → కొన్ని బ్యాంక్లు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ మొత్తం చెల్లింపులకు అంగీకరించకపోవచ్చు. → రుణం చెల్లించకుండా లేదా పరిష్కారం కుదుర్చుకోకుండా కాలయాపన చేస్తే బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు చట్టపరమైన చర్యలు మొదలు పెడతాయి. రుణగ్రహీతలపై కోర్టులో సివిల్ కేసు దాఖలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసు దాఖలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల లేనిపోని చార్జీల భారం నెత్తిన పడుతుంది. → సకాలంలో వసూలు కాని రుణ ఖాతాలను బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించొచ్చు. దీనివల్ల వారి నుంచి కఠిన వసూళ్ల చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్
డబ్బు దాచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం అత్యంత సురక్షితమైన మార్గం అని చాలామంది విశ్వసిస్తారు. ఈ కారణంగానే తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకులలో దాచుకుంటారు. అయితే ఎక్కడ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్యాంకు వెబ్సైట్ల నుంచి వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం.. కొన్ని ప్రధాన బ్యాంకులు ప్రస్తుతం ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకట్టుకునే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.HDFC బ్యాంక్ ప్రస్తుతం 2025 జూన్ 25 నుంచి అమలులోకి వచ్చేలా.. రెగ్యులర్ కస్టమర్లకు ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది. ICICI బ్యాంక్ & కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే రేట్లను అందిస్తున్నాయి.ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇది రెగ్యులర్ కస్టమర్లకు 6.40% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 20 నుండి అమలులోకి వచ్చే ఫెడరల్ బ్యాంక్ రేట్లకు అనుగుణంగా వడ్డీను అందిస్తోంది.భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా జూలై 15 నుంచి సాధారణ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది.వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లకు అందించే వడ్డీ చాలా చిన్న మొత్తంలో తేడా ఉంటుంది. రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా మంచి లాభాన్ని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ప్రత్యేకంగా.. ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి.. ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు వడ్డీ రేట్లను పరిశీలించి ఎంచుకోవడం ఉత్తమం. -
పోస్టాఫీస్ స్కీమ్: 5 ఏళ్లలో రూ.7 లక్షలు వస్తాయ్..
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కావాలంటే ఇప్పటి నుంచే ఎంతో కొంత పొదుపు చేయడం చాలా అవసరం. పిల్లల చదువులు, ఇల్లు కొనడం, పెళ్లి ఖర్చులు లేదా రిటైర్మెంట్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇందు కోసం ప్రతిఒక్కరూ పొదుపు మార్గాలను అన్వేషిస్తారు. అయితే చాలా మంది రిస్క్ లేని కానీ లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తారు. అలాంటి ఇన్వెస్టర్లకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీమ్ మంచి ఎంపిక.పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ అంటే ఏమిటి?పోస్టాఫీస్ ఆర్డీ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన పొదుపు పథకం. ఇది సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఇందులో మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కించి జమ చేస్తారు. దీంతో రాబడి వేగంగా వృద్ధి చెందుతుంది.పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్లో కనీస నెలవారీ డిపాజిట్ రూ.100. ఆపై మీరు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎటువంటి పరిమితి ఉండదు. కాల పరిమితి 5 ఏళ్లు. కావాలంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.ఈ స్కీమ్కు ప్రస్తుతం 6.7% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. దీనిని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. జూలై-సెప్టెంబర్ 2025 కోసం 6.7% వార్షిక వడ్డీని నిర్ణయించింది.ఆర్డీ పథకంలో మీరు జమ చేస్తున్న సొమ్ముపై అత్యవసర పరిస్థితుల్లో రుణ సదుపాయం కూడా ఉంటుంది. మీకు ఆకస్మిక ఆర్థిక అవసరం ఎదురైతే, మీరు ఒక సంవత్సరం తర్వాత మీ డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు రుణం తీసుకోవచ్చు. అయితే, ఈ రుణంపై మీ ఆర్డీ రేటు కంటే 2% ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.5 ఏళ్లలో రూ.7 లక్షలు పొందండిలా..పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్లో నెలకు రూ .10,000 డిపాజిట్ చేస్తే రూ.7 లక్షలు పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల పాటు నెలకు రూ .10,000 చొప్పున డిపాజిట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. 6.7% వార్షిక వడ్డీ (త్రైమాసిక చక్రవడ్డీ)తో మీ మెచ్యూరిటీ మొత్తం రూ.7,13,659 అవుతుంది. అంటే మీరు వడ్డీ రూపంలో రూ.1,13,659 పొందుతారు. అసలు, వడ్డీ మొత్తం సొమ్ము ఎలాంటి రిస్క్ లేకుండా చేతికందుతుంది. -
చదువుతో ఆర్థిక అక్షరాస్యత వస్తుందా?
చదువుకు, ఆర్థిక అక్షరాస్యతకు సంబంధం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. దేశంలోనే అధిక అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా కేరళకు గుర్తింపు ఉంది. అదే సమయంలో లాటరీ టికెట్లు కొని భారీగా డబ్బు నష్టపోతున్న జనాభా ఎక్కువగా ఉన్న రాష్టంగా కూడా కేరళకు గుర్తింపు ఉంది. దాంతో చదువు ఆర్థిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్పించడం లేదనే అభిప్రాయలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువుల్లో ఆర్థిక సంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచాలని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈమేరకు అకడమిక్ సిలబస్లో ఫైనాన్షియల్ టాపిక్స్ను బోధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. అందుకు ఏవరి కారణాలు వారికి ఉంటాయి. ఈ సంగతి అటుంచితే తల్లిదండ్రులుగా పిల్లల ఫైనాన్షియల్ లిటరసీ పెరగడానికి ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాలి.పిల్లలు చాలా సమయాల్లో సాధారణంగా మనం చెప్పింది చేయరు. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే వారు చూస్తూ దాన్ని అనుకరిస్తారు. అంటే ముందు తల్లిదండ్రులకు ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ ఉండి, క్రమశిక్షణగా నడుచుకుంటుంటే దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. తరగతి గదిలో చెప్పిన పాఠం కంటే ప్రయోగశాలలో నేర్చుకుంది ఎక్కువగా గుర్తుంటుంది.పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ నేర్పించాలంటే పరిస్థితులను అనుసరించి వీలైప్పుడు ఆర్థిక లావాదేవీల్లో వారిని ఇన్వాల్వ్ చేయాలి. ఉదాహరణకు.. మీరు సూపర్ మార్కెట్కు వెళ్లాలనుకుంటున్నారు. ముందే బడ్జెట్ రాసుకోండి. ఈరోజు మీరు చేయబోయే షాపింగ్ రూ.3000.. కొనవాల్సిన వస్తువులు ఇవి..అని జాబితా సిద్ధం చేసుకోవాలి. షాపులోకి వెళ్లాక వాటిని బడ్జెట్లో కొనటం ఎలాగో పిల్లలకి టాస్క్ ఇవ్వండి. ప్రాక్టికల్గా చూపించండి. ఆ సమయంలో అవసరాలు, అత్యావసరాలు, నిత్యావసరాలు ఏంటో గమనించేలా చేయాలి. భవిష్యత్తులో ఏదైనా షాపింగ్ వెళ్లినప్పుడు పిల్లలకి బడ్జెట్ కేటాయించాలి. దాన్ని దాటి చేసే ఖర్చులను కట్టడి చేయాలి. ఉన్న బడ్జెట్లో క్వాలిటీ వస్తువులను ఎలా ఎంచుకోవాలి.. అందుకు ఏయే మార్గాలున్నాయో తెలియజేయాలి. క్రమంగా కొంతకాలంపాటు దీన్ని అనుసరిస్తే తప్పకుండా పిల్లల్లో మార్పు వస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ కార్ల ధరలో రూ.80,000 వరకు రాయితీ? -
నాకొచ్చే జీతానికి 50/30/20 బడ్జెట్ రూల్ సరిపోతుందా?
బడ్జెట్కు సంబంధించి 50/30/20 సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక ప్రణాళికకు దీన్ని అనుసరించడం మంచి మార్గమేనా? – కరుణాకరన్బడ్జెట్కు సంబంధించి బాగా ప్రాచుర్యంలో ఉన్నదే 50/30/20 నియమం. మీ నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా వర్గీకరించడం ఇందులోని సూత్రం. ఇందులో 50 శాతాన్ని మీ అవసరాల కోసం కేటాయించుకోవాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, రుణ వాయిదా చెల్లింపులు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతంలోపే ఉండాలి. మరో 30 శాతం అన్నది కోరికల కోసం. అంటే రెస్టారెంట్లో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్ వంటివన్నీ 30 శాతం బడ్జెట్కు పరిమితం కావాలి.మిగిలిన 20 శాతాన్ని భవిష్యత్తు కోసం, దీర్ఘకాల లక్ష్యాల కోసం పొదుపు, మదుపు చేసుకోవాలి. ఇది ఒక సాధారణ సూత్రమే కానీ, అందరికీ వర్తించేది కాదు. మీ ఆదాయం ఎంత వస్తోంది? జీవన వ్యయాలు ఎంత? వ్యక్తిగత బాధ్యతలు ఏ మేరకు ఇలాంటి విషయాలన్ని బడ్జెట్ను నిర్ణయిస్తాయి.ఉదాహరణకు ఓ యువ ఉద్యోగి నెలవారీ రూ.40,000 ఆదాయం సంపాదిస్తున్నాడని అనుకుందాం. అతను ఉండేది మెట్రోలో. ఇంటి అద్దె, రవాణా వ్యయాలకే 50 శాతం ఖర్చవుతుంది. అప్పుడు ఇతర అవసరాలు, కోరికలు, పొదుపులకు మిగిలేది పెద్దగా ఉండదు. అదే రూ.2లక్షల వేతనం సంపాదించే వ్యక్తి కేవలం 30–35 శాతం బడ్జెట్లోనే అవసరాలను తీర్చుకోగలరు. అప్పుడు సదరు వ్యక్తి 30–40 శాతం ఆదా చేయగలరు. కనుక ఆదాయాన్ని బట్టి ఈ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది.50/30/20 అన్నది బడ్జెట్ మొదలు పెట్టడానికి అనుసరించొచ్చు. ముఖ్యంగా మీ జీవన వ్యయాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆదాయంలో 20 శాతాన్ని తప్పకుండా ఆదా చేసుకోవాలి. కోరికలకు సంబంధించిన బడ్జెట్లో రాజీ పడినా ఫర్వాలేదు. పొదుపు విషయంలో రాజీ పడకూడదు. ఈక్విటీ మార్కెట్లలో తరచుగా కనిపించే అస్థిరతలను ఎలా అధిగమించాలి? – శ్యామలఈక్విటీల్లో అస్థిరతలన్నవి సర్వసాధారణం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లు చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలాగో తెలిసి ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాలి.ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం.అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు అదనపు పెట్టుబడుల అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు.మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, ప్రతికూల సమయాల్లో చాలా మంది భయంతో పెట్టుబడులకు వెనుకాడుతుంటారు. కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది.సమాధానాలు :: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సిప్ సరే.. ఇక సిఫ్ చేస్తారా!
పెట్టుబడుల ప్రపంచం ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. ఎప్పటికప్పుడు కొంగొత్త సాధనాలు అందుబాటులోకి వస్తుంటాయి. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్, ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీల హవా. ఇప్పుడు మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీల వైపే. ఇందులోనూ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఎస్ఐఎఫ్–సిఫ్) పేరుతో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు)కు సైతం ఆదరణ పెరుగుతోంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ భిన్న సాధనాల్లో రిస్క్, రాబడుల పరంగా ఎంతో వ్యత్యాసం గమనించొచ్చు. ఇన్వెస్టర్లందరికీ ఈ సాధనాలు అనుకూలమని చెప్పలేం. తమ ఆకాంక్షలకు అనుగుణంగా సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు కొనసాగితే సంపద సృష్టి సాధ్యమే.సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్, ఏఐఎఫ్, సిఫ్ మధ్య పోలికలు తక్కువ. వైరుధ్యాలే ఎక్కువ. రాబడుల్లోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉన్న సాధనం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్. ఇక సిఫ్, పీఎంఎస్, ఏఐఎఫ్ అన్నీ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారికి ఉద్దేశించినవి. వీటి నిర్వహణ తీరులోనూ వైరుధ్యం కనిపిస్తుంది. వీటన్నింటిపైనా సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. ఎంపిక బాధ్యత మాత్రం ఇన్వెస్టర్లదే. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీయే కాకుండా డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ వీలు కల్పిస్తున్నాయి. విడివిడిగా, లేదంటే వీటి కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ను సైతం ఆఫర్ చేస్తున్నాయి. వేలాది పథకాల నుంచి ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెబీ పర్యవేక్షణ, నియంత్రణల మధ్య పనిచేస్తుంటాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వారం, పక్షం, నెలకొకసారి చొప్పున పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడి నుంచి ఆదాయం కోరుకుంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ద్వారా ప్రతి నెలా నిరీ్ణత మొత్తం ఉపసంహరించుకోవచ్చు. లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఉద్దేశించి రూపొందించిన సాధనాలు ఇవి. పదుల సంఖ్యలో విభాగాల నుంచి తమకు అనుకూలమైన ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువ. అంటే కోరుకున్నప్పుడు పెట్టుబడులను సులభంగా, వేగంగా వెనక్కి తీసుకోగలరు. ఇందులో యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి. ప్యాసివ్ ఫండ్స్లో 0.2 శాతం (మొత్తం పెట్టుబడుల విలువలో), యాక్టివ్ ఫండ్స్లో 0.5 శాతం నుంచి ఎక్స్పెన్స్ రేషియో ప్రారంభమవుతుంది. రాబడులు: ఎంపిక చేసుకున్న విభాగం, పథకం ఆధారంగా 5–20 శాతం మధ్య దీర్ఘకాలంలో ఉంటాయి. పన్ను బాధ్యత: ఈక్విటీ ఫండ్స్(ఈక్విటీల్లో కనీసం 65 శాతం పెట్టుబడులు పెట్టే), ఆర్బిట్రేజ్ ఫండ్స్లో పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం మొదటి రూ.1.25 లక్షలపై పన్ను లేదు. తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఇక డెట్ ఫండ్స్లో పెట్టుబడిని ఎప్పుడు విక్రయించినా వచి్చన లాభంపై పన్ను ఒకే మాదిరి ఉంటుంది. లాబాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాలి.పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ఇన్వెస్టర్ల రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా పెట్టుబడుల సేవలు అందించేవి పీఎంఎస్ సంస్థలు. అనుభవజు్ఞలైన ఫండ్ మేనేజర్లు ఇన్వెస్టర్ల ఖాతాల నుంచే వారి తరఫున పెట్టుబడుల వ్యవహారాలను నిర్వహిస్తారు, పర్యవేక్షిస్తుంటారు. కనీసం రూ.50 లక్షలు అంతకుమించి పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టర్ల రాబడి ఆకాంక్షలు, ఎంత రిస్క్ తీసుకుంటారు తదితర అంశాల ఆధారంగా వారి కోసమే ప్రత్యేకమైన పోర్ట్ఫోలియోని నిర్వహిస్తారు. కొత్త అవకాశాలను గుర్తించినప్పుడు పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. పీఎఎంస్లోనూ డిస్క్రీషినరీ, నాన్ డిరస్కీషినరీ అని రెండు రకాలు ఉంటాయి. డిస్క్రీషినరీలో అయితే ఫండ్ మేనేజర్ తన విచక్షణ ఆధారంగా స్వతంత్రంగా పెట్టుబడుల నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నాన్ డిస్క్రీషినరీలో క్లయింట్ అనుమతి తీసుకున్న తర్వాతే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ రెండూ కాకుండా అడ్వైజరీ పేరుతో మరో విభాగం కూడా ఉంది. ఇక్కడ ఇన్వెస్టర్కు పోర్ట్ఫోలియో మేనేజర్ సలహాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతారు. వాటిని పాటించడం, పాటించకపోవడం ఇన్వెస్టర్ అభీష్టమే. మ్యూచువల్ ఫండ్స్లో లక్షలాది మంది ఇన్వెస్టర్లను దృష్టిలో పెట్టుకుని పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తుంటారు. పీఎంఎస్లలో ఒక్కో ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా విడిగా పోర్ట్ఫోలియో ఉంటుంది. ఫండ్స్ మాదిరే పీఎంఎస్ల్లోనూ పారదర్శకత ఎక్కువ. పెట్టుబడిదారులకు ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ మాదిరి వీటి పనితీరు, ఫోర్ట్పోలియో తదితర సమాచారం ఓపెన్ ఫ్లాట్పామ్లపై (ఆన్లైన్ ప్రపంచం) ఉండదు. పీఎంఎస్ ఇన్వెస్టర్లకే తెలుస్తుంది. ఈక్విటీలతోపాటు డెరివేటివ్స్ పొజిషన్ల ద్వారా అధిక రాబడినిచ్చే విధంగా పీఎంఎస్లు పనిచేస్తాయి. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇందులో లిక్విడిటీ కొంచెం తక్కువ. వీటిలో ఫీజులు 3.5 శాతం నుంచి 5.5 శాతం వరకు ఉంటాయి. ఫీజును ఇన్వెస్టర్ స్వయంగా చెల్లించడం వీలుకానప్పుడు, పోర్ట్ఫోలియోలోని కొన్ని స్టాక్స్ను విక్రయించడం ద్వారా పీఎంఎస్ సంస్థ తన ఫీజులను రాబట్టుకుంటుంది. రాబడులు: గత ఏడాది కాలంలో సగటు రాబడులు 30 శాతంగా, ఐదేళ్ల కాలంలో 18.99 శాతం, పదేళ్లలో 17.35 శాతం చొప్పున ఉన్నాయి. పన్ను బాధ్యత: పీఎంఎస్ ఫండ్ మేనేజర్లు కొనుగోలు చేసిన షే ర్లు ఇన్వెస్టర్ డీమ్యాట్ ఖాతాలోనే ఉంటాయి. ఇన్వెస్టర్ పేరిటే చేస్తుంటారు కనుక ఈక్విటీలకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలోని కంపెనీలు జారీ చేసే డివిడెండ్ ఆదాయం వా ర్షిక ఆదాయానికి కలుస్తుంది. ఫండ్ మేనేజర్లు పోర్ట్ఫోలియో లోని స్టాక్స్ను ఎంత తరచుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారనే దాని ఆధారంగా పన్ను బాధ్యత ఆధారపడి ఉంటుంది.ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) ప్రైవేటు ఈక్విటీ, స్టార్టప్లు, హెడ్జ్ ఫండ్స్, డిరస్టెస్డ్ అసెట్స్ (ప్రాపర్టి), డెట్, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో ఏఐఎఫ్లు పెట్టుబడులు పెడుతుంటాయి. ఇందులో కనీస పెట్టుబడి కోటి రూపాయలు. ఇన్వెస్టర్లు అందరికీ అనుకూలమైన సాధనాలు కావు. వీటిలో మూడు కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ–1 ఫండ్స్.. ఆరంభ దశలోని వెంచర్లు, సోషల్ వెంచర్లు, సామాజిక ప్రభావం చూపించే ప్రాజెక్టులు, ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెడతాయి. కేటగిరీ–2 ఏఐఎఫ్లు ప్రైవేటు ఈక్విటీ (పీఈ), రియల్ ఎస్టేట్ ఫండ్స్, డిరస్టెస్డ్ అసెట్స్ (ప్రాపర్టి), డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కేటగిరీ–3 ఏఐఎఫ్లు హెడ్జింగ్ వ్యూహాలను అమలు చేస్తుంటాయి. లిస్టెడ్తోపాటు అన్లిస్టెడ్ కంపెనీలు, డెరివేటివ్స్లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. అవసరమైతే రుణం తీసుకుని మరీ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. మూడు విభాగాల్లోనూ కేటగిరీ–3లో రిస్క్ చాలా ఎక్కువ. వీటిలో సాధారణంగా మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో లిక్విడిటీ తక్కువ. అధిక రిస్క్ తీసుకునే ధనిక ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు), ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు అనుకూలం. సంప్రదాయ డెట్, ఈక్విటీలకు ప్రత్యామ్నాయంగా ఇతర పెట్టుబడుల అవకాశాలను ఇవి అందిస్తుంటాయి. వీటిలో స్పెక్యులేషన్ ఉండదు. కనుక అస్థిరతలు తక్కువ. అదే సమయంలో రిస్క్ ఎక్కువ. వీటిలో అస్సెట్ మేనేజ్మెంట్ ఫీజు 2 శాతం మేర ఉంటుంది. అంతేకాదు ఇన్వెస్టర్ల రాబడిపై 20 శాతం లెవీ కింద వసూలు చేస్తుంటాయి. లిక్విడిటీ తక్కువ. పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలంటే నిరీ్ణత కాలం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఏఐఎఫ్లు సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తుంటాయి. సంప్రదాయ సాధనాలకు వెలుపల పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలని భావించే వారు, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం, అధిక మొత్తంలో పెట్టబుడులు పెట్టగలిగే వారికి ఇవి ప్రత్యేకం. రాబడులు: ఎంపిక చేసుకున్న విభాగం ఆధారంగా రాబడి భిన్నంగా ఉంటుంది. పన్ను బాధ్యత: కేటగిరీ 1, 2 ఏఐఎఫ్లో మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఒకవేళ వ్యాపార ఆదాయంగా పరిగణిస్తే అప్పుడు 30 శాతం పన్ను పడుతుంది. ఇక కేటగిరీ 3 ఏఐఎఫ్లలో లాభంపై పన్ను ఫండ్ స్థాయిలోనే అమలవుతుంది. ఇన్వెస్టర్ ప్రత్యేకంగా ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్/ఏఐఎఫ్ మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు సిఫ్ సాధనాన్ని సెబీ గతేడాది మార్చిలో ప్రవేశపెట్టింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల పరంగా ఉన్న సౌలభ్యం వీటిల్లోనూ ఉంటుంది. పీఎంఎస్లో మాదిరి ఇన్వెస్టర్ల ఆకాంక్షలకు తగిన పెట్టుబడుల విధానాలు సిఫ్లలో ఉంటాయి. అన్లిస్డెడ్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్, స్ట్రక్చర్డ్ డెట్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఉంటాయి. కనీసం రూ.10లక్షల పెట్టుబడి పెట్టాలి. ఆధునిక ధోరణి కలిగి, అధిక రాబడి కోరుకునే దూకుడైన ఇన్వెస్టర్లకు అనుకూలం. డెరివేటివ్స్లోనూ పెట్టుబడులు పెడతాయి. లాంగ్–షార్ట్ వ్యూహాలను అమలు చేస్తుంటాయి. సమీప కాలంలో విలువ పెరుగుతుందని భావించినప్పుడు కొనుగోలు చేయడం (లాంగ్), స్టాక్స్ ధరలు ఖరీదుగా మారి సమీప కాలంలో దిద్దుబాటుకు గురవుతాయని భావించినప్పుడు డెరివేటివ్స్లో షార్ట్ చేస్తాయి (అమ్మకం). ఇందుకు ఫండమెంటల్స్తో పాటు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో ఓపెన్ ఎండెడ్ (ఎప్పుడైనా కొనుగోలు, విక్రయాలకు అందుబాటులో), క్లోజ్ ఎండెడ్ (నిరీ్ణత కాలం వరకు లాకిన్) ఉంటాయి. పోర్ట్ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. సంప్రదాయ ఈక్విటీ ఫండ్స్ మాదిరే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఈక్విటీ, డెట్ లేదంటే ఈక్విటీ–డెట్ కలిసిన హైబ్రిడ్ విధానాల్లో ఏదో ఒకదానినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి విలువ ఏదేనీ కారణంతో రూ.10 లక్షల లోపునకు తగ్గిపోతే.. ఇన్వెస్టర్ ఆ మేరకు తిరిగి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అప్పటికీ సర్దుబాటు చేయలేకపోతే పెట్టుబడులను ఏఎంసీ విక్రయించి వెనక్కి ఇచ్చేస్తుంది. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ గడువు 15 రోజులు. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్తో పోలి్చతే సిఫ్లలో ఫండ్ మేనేజర్లు అధిక రాబడుల దృష్ట్యా అగ్రెస్సివ్ పెట్టుబడుల విధానాలను అనుసరించొచ్చు. ఈ విభాగంలో ఇటీవలే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ‘సిఫ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్’ను ప్రారంభించింది. ఇందులో డెరివేటివ్స్కు కీలక పాత్ర ఉంటుంది. రాబడి: ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సాధనం. ఒకటి రెండేళ్లు గడిస్తే కానీ వీటిపనితీరును విశ్లేషించలేం. పన్ను బాధ్యత: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే వీటి రాబడులపైనా పన్ను అమలవుతుంది. → 2025 జూన్ చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం): రూ.33.47లక్షల కోట్లు → 2025 ఏప్రిల్ చివరికి పీఎంఎస్ల నిర్వహణలోని ఆస్తులు: రూ.32 లక్షల కోట్లు → 2025 మార్చి చివరికి ఏఐఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ :రూ.13.49 లక్షల కోట్లు – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మీ పిల్లలను కోటీశ్వరులను చేయొచ్చు..
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్వల్ ఫండ్స్ సిప్లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళికమ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.6,000 - ప్రతి సంవత్సరం 10% పెంపు - రాబడి అంచనా: 12% - మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు - అంచనా లాభం: రూ.29.22 లక్షలు - తుది మొత్తం: రూ.52.10 లక్షలు బంగారంపై..- నెలవారీ పెట్టుబడి: రూ.5,500 - రాబడి అంచనా: 10% - మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు - అంచనా లాభం: రూ.13.08 లక్షలు - తుది మొత్తం: రూ.22.98 లక్షలు పీపీఎఫ్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.7,500 - వడ్డీ రేటు: 7.1% - మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు - వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు - తుది మొత్తం: రూ.24.40 లక్షలు పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ -
టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?
బతికి ఉన్నప్పుడు చూడలేని డబ్బు మనకెందుకని చాలా మంది అనుకుంటారు. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. తీసుకున్నవారిలో కొందరేమో ‘ఛా.. ప్రీమియం అంతా వేస్ట్ అవుతుందే’ అని అనుకుంటూంటారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందిలో ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అపోహ-1‘టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల డబ్బు దండగ. టర్మ్ ఇన్సూరెన్స్ కడితే బతికుంటే డబ్బు రాదు.. చనిపోతే వస్తుంది. అప్పుడు ఆ డబ్బు అనుభవించలేరు. అలాంటప్పుడు నాకేంటి లాభం..’ అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇన్సూరెన్స్ ఉపయోగించుకోకుండా చివరిదాకా జీవించి ఉన్నారంటే ఎంత ఆరోగ్యవంతులో, ఎంతో అదృష్టవంతులో ఆలోచించాలి. దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే వచ్చే ఇన్సూరెన్స్ వల్ల పిల్లల చదువులు గానీ, పెళ్లిళ్లు గానీ ఆగిపోవు. ఈఎంఐలు నిలిచిపోవు. స్థూలంగా మీ కుటుంబం లైఫ్స్టైల్ అలాగే ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లాభం కోసం కాదు.. భరోసా కోసం తీసుకోవాలి.అపోహ-2‘టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అందరికీ అర్థం కాని విషయం’ అని కొందరు భావిస్తుంటారు. ఇన్సూరెన్స్ పాలసీల్లో సింపుల్గా అర్థమయ్యే పాలసీ టర్మ్ఇన్సూరెన్స్ అని గుర్తించాలి. మీ బైక్ కోసం లేదా కారు కోసం ప్రతి సంవత్సరం ప్రీమియం కడతారు కదా. ఈ క్రమంలో ఒకవేళ మీ వాహనానికి యాక్సిడెంట్ జరిగితే డబ్బు వస్తుంది. లేదంటే ఉచితంగా రిపేర్ చేస్తారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లోనూ ఇదే విధానం అమలవుతుంది. మీకు ఏదైనా జరిగితే డబ్బు రావాలంటే, దాంతో కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.అపోహ-3‘నేను ఇంకా యువకుడినే. ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు’ అని కొందరు భావిస్తారు. కొత్త కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ లేనిదే షోరూమ్ నుంచి బయటికి ఇవ్వరు. పాత వాహనం యక్సిడెంట్ అయి షెడ్లో ఉంటే దానికి ఎవరూ ఇన్సూరెన్స్ ఇవ్వరనే విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా జబ్బు చేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారా.. ఇవ్వరా.. అనేది మీ మెడికల్ రిపోర్ట్ను బట్టి ఉంటుంది. అదే చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా ఇస్తారు. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రీమియం అనేది ప్రతి సంవత్సరం మారదు. మీరు మొదటి సంవత్సరం ఉదాహరణకు రూ.10,000 కడితే 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రూ.10,000 కట్టాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణంతో సంబంధం ఉండదు. తర్వాత మీ ఆరోగ్యం క్షీణించినా పాలసీపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ వయసు పెరిగిన తర్వాత తీసుకుంటే ప్రీమియం ఎక్కువ అవుతుంది. మెడికల్ చెకప్ కూడా అవసరం ఉండొచ్చు.అపోహ-4‘అన్ని టర్మ్ పాలసీలు ఒకేలా ఉంటాయి. చనిపోతే డబ్బులు వస్తాయి. పాలసీలు ఒకటే కంపెనీలే మారుతాయి’ అని అనుకుంటారు. ఒక్కో పాలసీకి ఒక్కో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో(క్లెయిమ్ ఎంత త్వరగా, ఎంత మందికి చేస్తున్నారో తెలిపే సూచిక) ఉంటుంది. ఒక్కో పాలసీకి రైడర్స్, బెనిఫిట్స్, ప్రీమియం, సర్వీసెస్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అవి పాలసీని అనుసరించి మారుతాయి. అందులో మీకేది అవసరమో మంచి అడ్వైజర్ను సంప్రదించి తెలుసుకోవడం ముఖ్యం.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఅపోహ-5‘నాకు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. పర్సనల్గా ఇంకొకటి అవసరం లేదు’ అని చెబుతారు. చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయీస్కు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే గుంపులో గోవింద. ప్రత్యేకంగా మీ అవసరాలకు, బాధ్యతలకు తగ్గట్టుగా ఆ పాలసీ ఉండకపోవచ్చు. కంపెనీ పాలసీ ప్రకారం మాత్రమే వాటిని ఇష్యూ చేస్తారు. భవిష్యత్తులో కంపెనీ మారితే, ఉద్యోగం మానిస్తే ఇన్సూరెన్స్ ఉండదు. అక్కడితో ఆగిపోతుంది. అందుకే కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉన్నా పర్సనల్గా ఒక టర్మ్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి. -
ఆర్థిక స్వేచ్ఛ అంతరార్థం తెలుసా?
అంతా ఆర్థిక స్వేఛ్చ గురించి మాట్లాడుతుంటారు గానీ దాని అంతరార్థం గురించి చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. సాధారణంగా ఆర్థిక స్వేచ్ఛ అనగానే సంపద పోగేసుకుని, విశాలమైన ఇల్లు కట్టుకుని, విలాసవంతంగా విహారయాత్రలు చేస్తుండటమో, ఎర్లీగా రిటైర్ కావడమో అనుకుంటూ ఉంటారు. మన దగ్గరున్న డబ్బు గురించే తప్ప దాన్ని సంపాదించడానికి, నిలబెట్టుకోవడానికి అవసరమైన అలవాట్ల గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ, ఆర్థిక స్వేచ్ఛ అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన విలువ ఎంతఅనేది మాత్రమే కాదు.మనం కాలక్రమేణా అలవాటు చేసుకునే ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ఆర్థిక స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం భారీగా సంపాదించడం లేదా బాగా పొదుపు చేసుకుని దాచి పెట్టుకోవడమనేది ఆర్థిక భద్రత అనిపించవచ్చు. కానీ సంపాదన బాగా ఉన్నంత మాత్రాన మనశ్సాంతి గానీ ఆర్థిక సమస్యల నుంచి ఊరట గానీఉంటాయని గ్యారంటీ లేదు. అంతా అసూయపడేంత ఆదాయం ఉన్నవాళ్లు కూడా అప్పులతో సతమతమవుతూ నెలనెలా జీతమొస్తే గానీ గడవని పరిస్థితి ఉంటుంది. ఎంత వచ్చినా సరిపోవడం లేదనిపిస్తుంది. మరోవైపు, మరికొందరు అంతంత మాత్రం సంపాదన, ఒక మోస్తరు వనరులు ఉన్నా ఆర్థికంగా సాధికారత కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు. రెండు వర్గాల మధ్య వ్యత్యాసం క్రమశిక్షణే. పని, కుటుంబం, లైఫ్స్టయిల్ విషయాల్లో మనం సరైనవి ఎంచుకునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇది అందిస్తుంది.సంపద పరిమితులు..బోలెడంత డబ్బుంటే ఆటోమేటిక్గా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయనిపిస్తుంది. అయితే, సంపదతో అవకాశాలు వచ్చినా, రిస్క్లు కూడా పెరుగుతాయి. వివేకంతో వ్యవహరించకపోతే ఎంత సంపదైనా వేగంగా కరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. వారసత్వంగానో లాటరీల రూపంలోనో వచ్చిపడే డబ్బు కొన్నేళ్లలోనే ఆవిరైపోతుంది. అంతకు ముందు కన్నా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీనికి కారణం వనరులు లేకపోవడం కాదు. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే. కాబట్టి సంపదతో స్వేచ్ఛను సాధిస్తామా లేక ఆర్థిక కష్టాలను మరింతగా పెంచుకుంటామాఅనేది మన అలవాట్లను బట్టే ఉంటుంది.ఆర్థిక క్రమశిక్షణకు మూలస్తంభాలుఆర్థికంగా దీర్ఘకాలిక సంక్షేమం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అలాగని దీనికి అసాధారణ మేథోశక్తో లేదా అదృష్టమో అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే కాలక్రమేణా ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేస్తాయి. అలాంటి అలవాట్లు కొన్ని చూద్దాం..బడ్జెట్ వేసుకోవడం: ఆదాయాన్ని, ఖర్చుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే అనవసర ఖర్చులను నివారించుకోవచ్చు. సిస్టమాటిక్గా పొదుపు: పొదుపు ఉద్దేశపూర్వకంగానే ఉండాలే తప్ప మిగిలిపోయిన డబ్బును దాచిపెట్టుకునే వ్యవహారంగా ఉండకూడదు. ఆటోమేటిక్గా పొదుపు చేసే అలవాటును అలవర్చుకోవాలి.నిలకడగా పెట్టుబడులు: మార్కెట్లు ఎలా ఉన్నా సరే నిలకడగా పెట్టుబడులను కొనసాగిస్తే కాలక్రమేణా కాంపౌండెడ్ వృద్ధితో ప్రయోజనాలను పొందడం సాధ్యపడుతుంది. లైఫ్స్టయిల్ ప్రలోభాలకు లొంగకపోవడం: ఆదాయం పెరిగే కొద్దీ, లైఫ్స్టయిల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలనే కోరిక బలంగా పెరుగుతుంది. కానీ, అదనపు ఆదాయాన్ని సంపద నిర్మించుకునే అసెట్స్లోకి మళ్లిస్తూ, నిర్దిష్ట జీవన ప్రమాణాలను కొనసాగిస్తేనే సిసలైన పురోగతి సాధ్యపడుతుంది. సాధనాలు, సిస్టంలతో క్రమశిక్షణకు దన్ను క్రమశిక్షణకు సంకల్పంతో పాటు నిర్దిష్ట సాధనాలు కూడా తోడైతే మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. పెట్టుబడుల ఆటోమేషన్: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లనేవి (సిప్) మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగతంగా నిర్దిష్ట మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. లక్ష్యాల ఆధారిత ప్లానింగ్: ఇంటి కొనుగోలు, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్.. ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానికి తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడులకు ఒక దశ, దిశా ఏర్పడతాయి. నిర్మాణాత్మకమైన లక్ష్యాలు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి. వివేకవంతంగా కేటాయింపులుమీ ప్రొఫైల్కి తగ్గట్లుగా రిస్క్లు, రివార్డుల మధ్య సమతూకం ఉండేలా, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించాలి. వివిధ సాధనాలకు కేటాయింపుల విషయంలో క్రమశిక్షణతో ఉంటే ఒడిదుడుకుల్లోనూ మీ దీర్ఘకాలిక వ్యూహం పట్టాలు తప్పకుండా ఉంటుంది. ఇలా ఆటోమేటిక్గా పొదుపు చేయడం, ఖర్చులను సమీక్షించుకునేందుకు రిమైండర్లను పెట్టుకోవడం లాంటి చిన్న చిన్న అలవాట్లనేవి మెరుగైన ఫలితాలను అందిస్తాయి. క్రమశిక్షణను భారంగా కాకుండా రోజువారీ జీవితంలో భాగంగా మారుస్తాయి.చివరిగా చెప్పేదేమిటంటే, బ్యాంకు అకౌంటులో మ్యాజిక్ ఫిగర్ బ్యాలెన్స్తోనో, ఒకేసారి వచ్చి పడే లాభాలతోనో ఆర్థిక స్వేచ్ఛ రాదు. ఇది క్రమశిక్షణ, వివేకవంతమైన చిన్న చిన్న నిర్ణయాలతో ముడిపడి ఉండే జీవితకాలపు ప్రక్రియ. మీ ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అనేది మీ సంపాదన పరిమాణంపై ఆధారపడి ఉండదు. ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడే అలవాట్లను, క్రమశిక్షణను అలవర్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మొదటి అడుగు ముందుకు వేయండి.మైండ్సెట్లో మార్పుఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా మైండ్సెట్ను మార్చుకోవాలి. సాధారణంగా రియాక్టివ్, ప్రోయాక్టివ్ అంటూ రెండు రకాల మైండ్సెట్లు ఉంటాయి. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించే రియాక్టివ్ ధోరణిలో ప్రతి నెలా ఎంత మిగిలితే అంతే పొదుపు చేయడం. అత్యవసర పరిస్థితులు వస్తే అప్పటికప్పుడు హడావిడిగా ఏర్పాట్లు చేసుకోవడం, దీర్ఘకాలికంగా పనికొచ్చేవి అలవాటు చేసుకోవడం కన్నా సత్వర లాభాల వెంట పరుగులు తీయడంలాంటి తీరు ఉంటుంది. క్రియాశీలకమైన, ప్రోయాక్టివ్ మైండ్సెట్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ముందుగా మన అవసరాలను చూసుకోవడం, అత్యవసర పరిస్థితుల కోసం ప్లానింగ్ చేసుకోవడం, ముందుగా నిర్దేశించుకున్న ఫ్రేమ్వర్క్కి లోబడే ఖర్చులు ఉండేలా చూసుకోవడంలాంటివి ఈ ధోరణిలో ఉంటాయి. ఇది ఆర్థికంగా ఆందోళనను తగ్గిస్తుంది. స్పష్టతనిస్తుంది. పరిస్థితులను మన అదుపులో ఉంచుకునేలా నియంత్రణను ఇస్తుంది. కాలక్రమంలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ దిశగా ముందుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది.ఇదీ చదవండి: పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం? -
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్టాప్ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!
భారత్లో క్రెడిట్ కార్డు రుణ సంక్షోభం పెరుగుతోంది. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న క్రెడిట్కార్డుల బిల్లులు కట్టలేక డిఫాల్ట్లు అధికమవుతున్నట్లు తెలిపింది. అన్సెక్యూర్డ్ లోన్ల చెల్లింపులు బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది.సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదికలోని అంశాలు..2025 మార్చి నాటికి 91 నుంచి 360 రోజుల వరకు చెల్లించని క్రెడిట్ కార్డు రుణాలు రూ.33,886 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 44% పెరిగింది.91-180 రోజుల గడువు కార్డు రుణాలు రూ.29,983.6 కోట్లు (2024లో రూ.20,872.6 కోట్ల నుంచి పెరిగింది)గా ఉంది.పోర్ట్ఫోలియో ఎట్ రిస్క్ (పీఏఆర్) 2024లో 6.9 శాతంగా ఉంది కాస్తా ఇప్పుడు 8.2 శాతానికి పెరిగింది.181-360 రోజులు గడువు ముగిసిన పీఏఆర్ 0.9 శాతం నుంచి 1.1 శాతానికి పెరిగింది.పెరుగుతున్న క్రెడిట్ కార్డు వినియోగం..కొన్నేళ్లుగా డిజిటల్ విస్తరణ, ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ అధికమైంది.డిఫాల్ట్లు ఎందుకు పెరుగుతున్నాయి?ఆకర్షణీయమైన ఆఫర్లు: క్యాష్ బ్యాక్ రివార్డులు, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, నో కాస్ట్ ఈఎంఐలు ఆదాయానికి మించి ఖర్చును ప్రోత్సహిస్తున్నాయి.లైఫ్స్టైల్ ద్రవ్యోల్బణం: క్రెడిట్ కార్డులు స్టేటస్ సింబల్స్గా మారాయి. ఇది వినియోగదారులను బారీగా ఖర్చు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.ఆర్థిక నిరక్షరాస్యత: చాలా మంది వినియోగదారులకు బిల్లింగ్ సైకిల్స్, లేట్ పేమెంట్ లేదా కాంపౌండింగ్ వడ్డీ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు.ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికక్రెడిట్ కార్డు ఎన్పీఏలు (నిరర్థక ఆస్తులు) పెరగడంతో బ్యాంకింగ్ వర్గాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరిస్తోంది.అన్ సెక్యూర్డ్ లెండింగ్: క్రెడిట్ కార్డులు స్వభావరీత్యా అధిక రిస్క్ కలిగి ఉంటాయి. ఎందుకంటే తిరిగి చేసే చెల్లింపులపై ఎలాంటి పూచీకత్తు ఉండదు. మొండిబకాయిలు పెరగడం వల్ల బ్యాంకులు నష్టాల్లోకి జారుకుంటున్నాయి.రెగ్యులేటరీ చర్య: 2023లో ఆర్బీఐ క్రెడిట్ కార్డు రుణాలపై రిస్క్ పెంచింది. సంభావ్య నష్టాలను పూడ్చడానికి బ్యాంకులు ఎక్కువ మూలధనాన్ని కేటాయించవలసి వస్తుంది.కఠిన రుణ నిబంధనలు: డిఫాల్ట్లు పెరిగేకొద్దీ బ్యాంకులు రుణాలు జారీ చేయడంలో మరింత జాగ్రత్తలు వహించాలి.ఇదీ చదవండి: దేశంలో ఏఐ, ఎడ్టెక్ల విస్తరణ.. కానీ..వినియోగదారులు చేయాల్సింది..క్రెడిట్ కార్డులను ఆర్థిక సాధనాలుగా పరిగణించాలి. కానీ ఉచితంగా వచ్చే డబ్బుగా భావించకూడదు.అధిక వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి సకాలంలో పూర్తి బకాయిలు చెల్లించాలి.మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం సకాలంలో చెల్లింపులు చేయాలి. అందుకు క్రెడిట్ రిపోర్టులను పర్యవేక్షించాలి.బిల్లింగ్ సైకిల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఆఫర్లు, ఈఎంఐలపై అవగాహన పెంచుకోవాలి. -
ఒకటికి మించిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – రాఘవరాజుపెట్టుబడులను పెట్టడమే కాదు.. వాటిని వెనక్కి తీసుకునే విషయంలోనూ తగిన ప్రణాళిక కలిగి ఉండాలి. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. పెట్టుబడిని నిర్ణీత కాలానికి ఓసారి వెనక్కి తీసుకునేందుకు ఎస్డబ్ల్యూపీ వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎస్డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, అదనపు ఆదాయం కోరుకునే వారికి అనుకూలం. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల విలువ తగ్గుతుంటుంది. సిప్ ఎంపిక చేసుకుంటే.. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిగా వెళుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్డబ్ల్యూపీ. మీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఏడాదిలో ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తం పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది.ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, 5 శాతాన్ని వెనక్కి తీసుకునేట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడిని వృద్ధి చేస్తుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడి విలువ క్షీణించకుండా స్థిరంగా ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ఏటా ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను పడదు. నికర లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. అంతకు మించిన మొత్తంపైనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఏడాదిలోపు ఈక్విటీ పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభం చెల్లించాలి. డెట్ పెట్టుబడులపై లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? – చిట్టి లాస్యఒకటికి మించిన మ్యూచువల్ ఫండ్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టుకున్నప్పటికీ.. నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకాలు అన్నిరకాల మార్కెట్ విభాగాల్లోని కంపెనీల్లో (స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూయేషన్ల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయించే పెట్టు బడుల మొత్తం మారిపోతుంటుంది.సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీ క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు విడిగా లార్జ్క్యాప్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడులపై అధిక రాబడులు కోరుకుంటూ, రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు.. ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్కు కేటాయించుకోవచ్చు. -
రూ.15 వేలు బోనస్.. ఆగస్టు 1 నుంచి కొత్త పథకం
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద రూ.15,000 లభిస్తాయి. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)గా పిలిచే ఈ పథకానికి రూ.99,446 కోట్ల బడ్జెట్తో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. పీఎం-వీబీఆర్వై పథకం యాజమాన్యాలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహిస్తుంది. వివిధ రంగాల్లో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఉపాధి ఆధారిత అభివృద్ధి ద్వారా భారత ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.పథకం అమలు తీరు ఇలా..ఈ పథకం రెండు విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తుంది. ఒకటి మొదటిసారి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం. ఈ భాగం మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరిన (ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి) వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులు (రూ .1 లక్ష వరకు వేతనం ఉన్నవారు) రూ .15,000 వరకు వన్ టైమ్ ఈపీఎఫ్ వేతన ప్రయోజనాన్ని పొందుతారు.దీన్ని ఉద్యోగంలో చేరిన 6 నెలల తరువాత, మళ్లీ 12 నెలల నిరంతర సర్వీస్ తర్వాత రెండు వాయిదాలలో చెల్లిస్తారు. రెండో విడత పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పూర్తి చేయాలి. పొదుపు అలవాట్లను పెంపొందించడానికి ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతా లేదా సాధనానికి కేటాయిస్తారు. దాన్ని తరువాత ఉపసంహరించుకోవచ్చు.ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ మద్దతు రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. అదే తయారీ యూనిట్లకు అయితే ప్రోత్సాహక కాలాన్ని మూడు, నాల్గవ సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది.ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి,ఈపీఎఫ్ఓలో నమోదైన కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలైతే కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ను ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా తొలిసారి ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో లబ్ధిదారు కంపెనీలకు ప్రోత్సాహకాలను నేరుగా ఆ సంస్థ పాన్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డులు అనేవి ప్రస్తుతం ప్రతిఒక్కరికి దైనందిన జీవితంలో కనీస అవసరాలుగా మారిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులు ఇప్పుడు పెద్దలకు మాత్రమే ఆర్థిక సాధనాలు కాదు.. విద్యార్థులలో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు నిరుద్యోగులు, సరైన క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వవు. అయితే, విద్యార్థులు ఇందుకు మినహాయింపు.చదువుల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటున్న యువత కోసం పలు బ్యాంకులు స్టూడెంట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వివిధ బిల్లులు, కిరాణా సరుకులు లేదా రూం అద్దెలు వంటి చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విద్యార్థులు రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి సహాయపడటమే కాకుండా మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఏయే బ్యాంకులు విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి.. వీటిలో టాప్ ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. కార్డుపై ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డ్ పాయింట్, రూ.500 నుంచి రూ.3,000 మధ్య లావాదేవీలపై 2.5% ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ ఇతర క్రెడిట్ కార్డుల బకాయి బిల్లులను ఈ ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డుకు తక్కువ వడ్డీ రేటుతో బదిలీ చేయవచ్చు.ఐడీఎఫ్సీ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ ఈ కార్డుకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు కాబట్టి ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ చెక్ కూడా ఉండదు. విద్యార్థులు ఎలాంటి ఆదాయ రుజువు లేకుండా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 1,500 రెస్టారెంట్లలో 20% వరకు తగ్గింపును ఆస్వాదించవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఖర్చులపై 4 రెట్ల వరకు రివార్డులను పొందవచ్చు.కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డు ఈ కార్డులో జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు. ఇది ఆల్-ఇన్-వన్ క్రెడిట్ కార్డు. ఇది 48 రోజుల వరకు వడ్డీ లేని నగదు ఉపసంహరణలు, అన్ని కొనుగోళ్లపై రివార్డులు, మీ టర్మ్ డిపాజిట్ మొత్తంలో 90% వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. ఇది జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు. ఇది విద్యార్థులకు ఖర్చు లేని ఎంపిక.యాక్సిస్ బ్యాంక్ స్టూడెంట్స్ ఫారెక్స్ కార్డు ఇది విదేశీ కరెన్సీతో లోడ్ చేసిన ఫారెక్స్ కార్డు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించారు. మీరు సందర్శించే దేశం స్థానిక కరెన్సీలో సౌకర్యవంతంగా నగదును ఉపసంహరించుకోవచ్చు. ఒకే కార్డుపై 16 కరెన్సీలను లోడ్ చేయవచ్చు. లాక్-ఇన్ ఎక్స్ఛేంజ్ రేటు నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది కరెన్సీ హెచ్చుతగ్గులపై ఎక్కువ ఖర్చు చేయకుండా నిరోధిస్తుంది.ఐసీఐసీఐ కోరల్ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు ఈ కార్డుతో బుక్ మైషో బుకింగ్స్, డైనింగ్, రైల్వే, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధనం నింపిన ప్రతిసారీ ఫ్యూయల్ సర్ఛార్జ్పై 1% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇది చిప్, పిన్ సెక్యూరిటీతో వస్తుంది. ఇక్కడ మీరు మర్చంట్ అవుట్లెట్లలో లావాదేవీల కోసం టెర్మినల్పై మీ పిన్ నంబర్ నమోదు చేయాలి. -
రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?
మనీ మార్కెట్ ఫండ్ ఎవరికి అనుకూలం? – స్వర్ణముఖిమనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్క్లేని ఊహించదగిన రాబడులను ఇవి ఇవ్వగలవు. ఇవి అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రిస్క్లేని, అధిక రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కాస్త అధిక రాబడులను ఇస్తాయి. ఎందుకంటే ఇవి వైవిధ్యమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంచుకునే వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్ను ఎంపిక చేసుకోండి. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.రిటైర్మెంట్ నిధి కోసం స్మాల్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అనిరుధ్ భట్టాచార్యదీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. స్మాల్క్యాప్లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటే ప్రామాణికం కాదు. నష్ట భయాన్ని, యూనిట్ల విలువ క్షీణించినా తట్టుకునే గుండె నిబ్బరం కావాలి. ఇవి నిర్ణీత సమయాల్లో (సైకిల్స్) భారీ నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్క్యాప్లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందడం సహజం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15% మించి స్మాల్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం సూచనీయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారితే, మంచి సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ బడా కంపెనీ అవ్వాలనేమీ లేదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువ. లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు.ఇదీ చదవండి: దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డుమరీ చిన్న కంపెనీలు అయితే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం దూరంగా ఉంటారు. స్మాల్క్యాప్ విభాగం పెద్దది. స్మాల్క్యాప్ విభాగంలో వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కనుక సిప్ ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్క్యాప్ కంపెనీలకు సంబంధించి తగినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువ. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. చిన్న కంపెనీల్లో ఏ ధరలో ప్రవేశించారు, ఎక్కడ విక్రయించారన్నది రాబడులకు కీలకం అవుతుంది. -
34 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చు!
దేశం వదిలి వెళ్లినవారు ఎంతో కొంత సంపాదించి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలనుకుంటారు. 34 ఏళ్ల ఎన్ఆర్ఐ రూ.4 కోట్లు సంపాదించి భారత్కు తిరిగి వచ్చి త్వరగా రిటైర్ అవ్వాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. తన వద్ద రూ.4 కోట్లు ఉన్నాయని చెప్పారు. అందులో రూ.రెండు కోట్లు బ్యాంకు ఖాతాలో ఉందని, మరో రూ.రెండు కోట్లను రిటైర్మెంట్ కోసం పొదుపు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే సోషల్మీడియా వేదికగా తనకు ఎవరైనా ఆర్థిక సలహా ఇవ్వమని కోరాడు. దాంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్గా మారింది.పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘నేను ఇండియా వచ్చి రిటైర్ అయినా పార్ట్టైమ్గా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు నేను రిటైర్ అవ్వడం ఇష్టం లేదు. పీహెచ్డీ పూర్తికావడంతో భారత్లో నాకు మంచి ఉద్యోగమే వస్తుందని నమ్ముతున్నాను. నా పొదుపులో నుంచి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే మొత్తం ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ.1లక్ష-రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నా వద్ద ఉన్న నిధులు సరిపోతాయా? అనే అనుమానం ఉంది. ఈ ఖర్చులను పరిగణించి దయచేసి రిటైర్మెంట్ ప్రణాళికలు సూచించండి’ అని కోరాడు.ఇదీ చదవండి: 'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?‘మీరు త్వరగా పదవీ విరమణ చేసి భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే అగ్రెసివ్ పెట్టుబడులు చేయవద్దు. నిధులు సరిపోతాయనే దిగులు వద్దు. అయితే మీ బడ్జెట్ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలి. సుమారు 5-6% వడ్డీ సమకూరే ఎఫ్డీలో రూ.1 కోటి ఉంచండి. మీ బడ్జెట్ అంచనా నెలకు రూ.1లక్ష-రూ.1.5 లక్షలుగా ఉంది. లోయర్ టైర్ సిటీలో ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ల పాటు అక్కడ ఉండండి. మరో రూ.3 కోట్లను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోకి మళ్లించేలా బ్యాలెన్స్డ్ స్టాక్ మార్కెట్ ఫండ్లో పెట్టుబడి పెట్టండి. కనీసం 5-6 సంవత్సరాల వరకు దీన్ని విత్డ్రా చేయకూడదు. దాంతో ఇది బాగా పెరుగుతుంది. మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగలదు. దాంతో నెలకు కనీసం రూ.లక్ష సమకూరుతుంది. దాంతోపాటు మీరు పెట్టిన కార్పస్పై ప్రభావం ఉండదు’ అని ఒక యూజర్ తెలిపారు. -
క్రెడిట్ కార్డే దిక్కు!
తక్కువ ఆదాయ వర్గాల వారికి క్రెడిట్ కార్డులు ఆధారంగా మారుతున్నాయి. రూ.50,000లోపు ఆదాయం ఉన్న వేతన జీవుల్లో 93 శాతం మంది అవసరాల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నట్టు థింక్ 360.ఏఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. స్వయం ఉపాధిపై ఉన్న వారిలో 85 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగం, స్వయం ఉపాధిలో ఉన్న 20,000 మంది వ్యక్తుల ఏడాది కాల ఆర్థిక తీరును అధ్యయనం చేసి థింక్ 360 ఈ వివరాలను విడుదల చేసింది.బై నౌ పే లేటర్ (బీఎన్పీఎల్/ఇప్పుడు కొని తర్వాత చెల్లించే సదుపాయం) సేవలను సైతం వీరు వినియోగిస్తున్నారు. స్వయం ఉపాధిలోని వారిలో 18%, వేతన జీవుల్లో 15% మంది బీఎన్పీఎల్ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఆకాంక్షలుగానే ఉన్న క్రెడిట్ కార్డులు, బీఎన్పీఎల్ సేవలు నేడు నిపుణుల నుంచి తాత్కాలిక ఉద్యోగుల వరకు.. ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారాయని థింక్360 వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్దాస్ తెలిపారు. డిజిటల్ రుణాల్లో ఫిన్టెక్లు పోషిస్తున్న ముఖ్య పాత్రను కూడా ఈ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుక్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని ఇటీవల పీడబ్ల్యూసీ అంచనా వేసింది. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. -
సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలు
దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను డిజిటల్ చెల్లింపులు సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన కూడా పెరగాల్సి ఉంది. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవి వినియోగదారులకు డిజిటల్ భద్రతను అందిస్తాయి. డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 5 జాగ్రత్తలను సూచిస్తోంది.లావాదేవీ ముందే సరిచూసుకోవడం..ఏదైనా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికైతే డబ్బు పంపిస్తున్నారో వారి పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. తొందరపడి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి.ఆథరైజ్డ్ యాప్లు, వెబ్సైట్లే వాడేలా..ఎప్పుడూ అధికారిక యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. తెలియని వారు, లేదా మరేదైనా వెబ్సైట్లో సూచించిన విధంగా లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి లావాదేవీలు చేయవద్దు.గోప్యంగా ఓటీపీయూపీఐ పిన్ లేదా మెయిల్, ఫోన్కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత గోప్యమైనవని గమనించాలి. ఈ వివరాలు బ్యాంకువారు కూడా అడగరని గుర్తించాలి. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా ఆయా వివరాలు అడిగితే స్కామర్లని వెంటనే తెలుసుకుని ఫిర్యాదు చేయాల్సి.హడావిడి పేమెంట్లు వద్దు..వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.ఇదీ చదవండి: లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?పేమెంట్ అలర్ట్లను ఆన్ చేసుకోవడం..మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ను సంప్రదించండి. -
ఎవరు చెప్పినా వినండి.. కానీ..
డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు. -
పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!
ఇంట్లో నాన్న తీసుకొచ్చిన కిడ్డీబ్యాంక్ గుర్తుందా.. అమ్మ, నాన్న, ఎప్పుడైనా బంధువులు వస్తూపోతూంటే ఇచ్చే చిల్లర డబ్బులు దాచుకునేందుకు కిడ్డీబ్యాంకు ఉపయోగిస్తారు. ఏదైనా అత్యవసర సమయాల్లో పిల్లలు ఆ డబ్బును వాడుకుంటారు. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోయాలని అలా చేస్తారు. స్కూల్కు వెళ్లే దారిలోనో..సండే అలా పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్లే సమయంలోనే ఎస్బీఐ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ అని పేర్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న కిడ్డీబ్యాంకు గురించి తెలుసుకానీ.. ఇవేం బ్యాంకులని చిన్నారుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ బ్యాంకులు కూడా ఇంట్లోని కిడ్డీ బ్యాంకుల్లాగే పని చేస్తాయి. పిల్లలు నిత్యం ఎలాగైతే డబ్బు పొదుపు చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారో.. అదే మాదిరిగా సేవింగ్స్, ఎఫ్డీ వంటి ఖాతాలో డబ్బు దాచుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాదంటే.. కిడ్డీ బ్యాంకులో ముందుగా ఎంతైతే డబ్బు వేస్తామో చివరిదాకా అంతే మొత్తం ఉంటుంది. కానీ బయట చూసే బ్యాంకుల్లో డబ్బు దాస్తే కొంత అధిక మొత్తం కలిపి ఇస్తారు. ఇలా బ్యాంకువారు కలిపి ఇచ్చే మొత్తాన్నే వడ్డీ అంటారు. కాబట్టి ప్రాథమికంగా కిడ్డీబ్యాంకులో డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకొని, తర్వాత బ్యాంకుల్లో దాచుకోవడం నేర్చుకోవాలి. దాన్నివల్ల అదనంగా వడ్డీ సమకూరుతుంది కదా!పిల్లలే నేరుగా బ్యాంకు ఖాతాను తెరిచేందుకు వెళ్తే పాటించాల్సినవి..బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు గేట్వద్దే తుపాకీ పట్టుకొని బారుమీసాలతో గంభీరంగా ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నారులూ.. అతడిని చూసి భయపడకండి. ఆ మీసాల మామ మనోడే.. మీ ఇంట్లోనీ కిడ్డీ బ్యాంకును ఎలాగైతే జాగ్రత్తగా ఒకచోట దాస్తారో.. అలాగే ఆ బ్యాంకుకు తాను నిత్యం భద్రత అందిస్తూ కాపలాకాస్తాడు. కాబట్టి మీరు వేసే డబ్బులు మరింత భద్రంగా ఉంటుంది.మామకు గుడ్మార్నింగ్ చెప్పి బ్యాంకులోకి వెళితే చాలామంది ఉంటారు. వారిలో చాలావరకు బ్యాంకులో ఏదోఒక పని కోసం వచ్చినవారే. కంగారు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లో కూర్చున్నవారిని గమనించండి. వారే బ్యాంకు సిబ్బంది.బ్యాంకులో డిపార్ట్మెంట్ల వారీగా చాలా మంది సిబ్బంది పని చేస్తారు. అంటే.. డబ్బులు మన నుంచి తీసుకునే వారు కొందరు ఉంటే.. ఇప్పటికే బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి ఇచ్చేవారు ఇంకొందరుంటారు. దాంతోపాటు ప్రత్యేకంగా లోన్లు ఇచ్చే వారుంటారు. మీ తరగతిలో లీడర్ ఎలాగైతే ఉంటాడో.. బ్యాంకులోనూ వీరందరినీ మ్యానేజ్ చేసే లీడర్ ఉంటారు. అతడే మేనేజర్.ప్రతి బ్యాంకులో ‘మే ఐ హెల్త్ యూ’ అని లేదా ‘ఎంక్వైరీ’ సైన్ బోర్డుతో ఒక క్యాబిన్ ఉంటుంది. అందులో ఉన్న అంకుల్ దగ్గరకు వెళ్లి.. ‘బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయానుకుంటున్నాను.. ప్రాసెస్ ఏంటి’ అని అడిగితే తాను ఖాతా ఓపెన్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి చెబుతారు. దాంతోపాటు ఎలాంటి రకాల ఖాతాలున్నాయో వివరిస్తారు.పిల్లల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఖాతాలు..యూత్ లేదా మైనర్ అకౌంట్: ఇది మైనర్ల కోసం రూపొందించిన ప్రామాణిక పొదుపు ఖాతా. ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఖాతాకు జోడించబడి ఉంటుంది. ఈ ఖాతాలను చిన్న మొత్తాలను నిర్వహించవచ్చు.కస్టోడియల్ అకౌంట్: ఈ ఖాతా పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు పిల్లల వయసు (సాధారణంగా 18 లేదా 21) వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తాడు.జాయింట్ అకౌంట్: కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు తమ పిల్లలతో జాయింట్ అకౌంట్ తెరిచేందుకు అనుమతిస్తాయి. ఈ ఖాతాలో పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నిర్వహించవచ్చు.బ్యాంకు ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..అన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలకు ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. ఆన్లైన్ సహాయంతో పిల్లల ఖాతాలు తెరిచేందుకు అనువైన బ్యాంకులను సెర్చ్ చేయాలి.నెలవారీ రుసుము లేకుండా.. నెలవారీ రుసుము వసూలు చేయని బ్యాంకులను ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వల్ల పిల్లల చిన్నపాటి పొదుపు హరించుకుపోతుంది.తక్కువ లేదా నో మినిమమ్ డిపాజిట్.. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కనీస డిపాజిట్ అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ లేదా ఎలాంటి డిపాజిట్ అవసరంలేని బ్యాంకులను ఎంచుకోవాలి.ఆన్లైన్ బ్యాంకింగ్.. చాలా బ్యాంకులు యువ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ను అందిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉన్న బ్యాంకుల తలుపు తట్టండి.ఎడ్యుకేషనల్ టూల్స్.. కొన్ని బ్యాంకులు పిల్లలకు పొదుపు, బడ్జెట్, డబ్బు నిర్వహణ గురించి నేర్పడానికి రూపొందించిన సాధనాలను అందిస్తాయి. అలాంటి ఆర్థిక అక్షరాస్యత నేర్పే వాటిని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఐడీకార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మొదలైనవి).చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు, లీజు ఒప్పందం మొదలైనవి).పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్పోర్ట్ (వయసును ధ్రువీకరించడానికి అవసరం)చిరునామా రుజువు (పిల్లవాడి పేరు మీద శాశ్వత చిరునామా ఉంటే ఇవ్వాలి)కొన్ని బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ముందుగా వివరాలు తనిఖీ చేయడం మంచిది. -
లార్జ్క్యాప్ – మిడ్క్యాప్లో ఏది మెరుగు?
నేను ప్రతి నెలా రూ.5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలం కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏవైనా ఉన్నాయా? – వాణిమీ పెట్టుబడులకు తగినంత దీర్ఘకాలం ఉంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు మంచి ఎంపిక అవుతుంది. ఈక్విటీ మార్కెట్లన్నవి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాయి. మీ సౌకర్యానికి అనుగుణంగా మంచి పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్తో ఆరంభించొచ్చు. పెట్టుబడుల్లో మూడింట రెండొంతులను ఈక్విటీలకు, మిగిలిన ఒక వంతును డెట్ సాధనాలకు ఇవి కేటాయిస్తాయి. ఈక్విటీ విభాగం ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. అచ్చమైన ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులతో పోల్చి చూసినప్పుడు ఆటుపోట్ల ప్రభావం హైబ్రిడ్ పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.నెలకు రూ.5,000 చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేస్తూ వెళితే 12.18 శాతం రాబడుల ఆధారంగా (గత 20 ఏళ్ల సగటు రాబడి) రూ.51.25 లక్షలు సమకూరుతుంది. పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలకు కేటాయించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడం సహజం. ఆ సమయంలో నష్టాలకు సైతం ఈక్విటీ పెట్టుబడులు అమ్మేస్తుంటారు. అలాంటి తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడుల విలువ క్షీణతను పరిమితం చేస్తాయి. మార్కెట్ల ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం ఉన్నవారు.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను సైతం పరిశీలించొచ్చు. ఇవి లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో విభాగంలో పెట్టుబడులను మార్పులు చేర్పులు చేస్తుంటాయి. చారిత్రకంగా చూస్తే వీటి వార్షిక రాబడి గత 20 ఏళ్లలో 12.66 శాతం చొప్పున ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కొంచెం అదనపు రాబడులను ఇవ్వగలవు.ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్లో వేటిని ఎంపిక చేసుకోవాలి. – అనిరుధ్దీర్ఘకాలంలో ఏ విభాగం అధిక రాబడులను ఇస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ (దిద్దుబాటు) ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తే.. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ కంపెనీలు మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ విభాగం అధిక రాబడులను ఇస్తుంటుంది. కనుక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీక్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్ను చక్కగా అధిగమించగలరు. -
లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!
డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.శ్యామ్ శేఖర్ ఎక్స్లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.Why do middle class families stay middle class? It is because they refuse to think of what will make them break out of the middle class mindset.What is the middle class mindset?It is something which stops you from dreaming of what you feel is beyond your present reach. You…— Shyam Sekhar (@shyamsek) July 4, 2025ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్ ఫైనాన్స్పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు
నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలమైన సాధనాలు ఏవి? – నళినీ ప్రకాశ్స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. స్వల్పకాల పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి కంటే ఎఫ్డీలోనే అధికంగా లభిస్తుంది. కచ్చితమైన రాబడి కావాలని కోరుకునే వారికి ఎఫ్డీ కంటే మెరుగైన సాధనం లేదు. బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్పై బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడినా రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తికి భరోసా ఉంటుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే కనుక ఎఫ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం పెద్దగా ఉండదని అర్థం చేసుకోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ను కూడా పరిశీలించొచ్చు. ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభం అని లేదు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత కాలంలో విక్రయించినట్టయితే వచ్చే మూలధన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఏ శ్లాబు పరిధిలో ఉండే ఆ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనుకూలమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మంచి ఎంపిక. అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్ అనుకూలం. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. డెట్ ఫండ్స్లో మెరుగైన రేటింగ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్లో రాబడులతో పాటు రిస్క్ కూడా ఎక్కువ. డిపాల్ట్ రిస్క్ ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా.. వీటి నుంచి మంచి పథకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? – వెంకటస్వామిఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ట్రాకింగ్ ఎర్రర్ను కూడా గమనించాలి.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనఒక ఇండెక్స్ ఫండ్.. అది పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది తెలియజేస్తుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా ఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకోండి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వ్యాల్యూ రీసెర్చ్. -
మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్ తన లింక్డ్ఇన్లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు. -
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
దేశంలో అత్యధికంగా ఉపయోగించే హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారీ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు వంటివి జరిపే వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిర్దిష్ట రకాల అధిక-విలువ లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టడం, సవరించిన రివార్డ్ పాయింట్ విధానాలు, అనేక కేటగిరీలలో ఫీజుల పరిమితి వంటివి ఈ మార్పులలో ఉన్నాయి.కొత్త మార్పులు.. ఛార్జీలుఆన్లైన్ గేమింగ్: నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు). రివార్డ్ పాయింట్లు లభించవు.వాలెట్ లోడింగ్: పేటీఎం (PayTM), మొబీక్విక్ (Mobikwik) వంటి డిజిటల్ వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు).యుటిలిటీ బిల్లులు: వినియోగదారుల కార్డులకు రూ.50,000, బిజినెస్ కార్డులకు రూ.75,000 దాటితే 1% ఫీజు (రూ.4,999 వరకు). ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఫీజు లేదు.లావాదేవీ ఫీజు పరిమితి: రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ చెల్లింపులకు గరిష్టంగా రూ.4,999 ఫీజు. ఫ్యూయల్ కోసం రూ.15,000 లేదా రూ.30,000 దాటితే మాత్రమే ఫీజు వర్తిస్తుంది.ఇన్సూరెన్స్ లావాదేవీలు: రివార్డ్ పాయింట్లు లభిస్తాయి కానీ కార్డు రకాన్ని బట్టి పరిమితి ఉంటుంది. ఇన్ఫీనియా, ఇన్ఫీనియా మెటల్ కార్డులకు రూ.10,000, డైనర్స్ బ్లాక్, డైనర్స్ బ్లాక్ మెటల్, బిజ్ బ్లాక్ మెటల్, కార్డులకు రూ.5,000, మిగిలిన కార్డులకు రూ.2000 నెలవారీ పరిమితి ఉంటుంది.యువ ప్రొఫెషనల్స్కు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కీలకంఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి. మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి. వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్ స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – రాజ్దీప్మ్యూచువల్ ఫండ్స్లో 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. -
40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..
పని ఒత్తిడి పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అలా అని ముందే ఉద్యోగం మానేస్తే ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయనే భయాలున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుని, దాన్ని పాటిస్తే 40 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చాలా మంది తమ కెరియర్ పీక్కు చేరుకున్నప్పుడు 40 ఏళ్లలో పనిచేయడం మానేసి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. బాస్లు ఉండరు.. సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీస్కు వెళ్లాలా అనే బెంగా ఉండదు.. వీకెండ్ కోసం ఎదురుచూడటం అవసరం లేదు. అయితే నిజంగా 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం మానేసి జీవితాంతం సౌకర్యవంతంగా జీవించవచ్చా? అనే అనుమానం ఉందా. అయితే కింది విషయాలు తెలుసుకోవాల్సిందే.40 ఏళ్లకే రిటైర్ కావడం సాధ్యమేనా?కొంతమంది ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధ్యమే. కానీ చాలా సవాలుతో కూడుకున్నది. ముందే రిటైర్ అవ్వడాన్ని ప్రధానంగా.. మీరు ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నారు.. కాలక్రమేణా మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయి.. అనే అంశాలు కీలకంగా మారుతాయి. 20-25 ఏళ్ల వయసు ఉన్నవారు 40 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ఆదాయంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత వార్షిక ఖర్చులకు 79 రెట్లు పొదుపు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?ఫిన్నోవేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నేహాల్ మోటా మాట్లాడుతూ.. ‘40ల్లో రిటైర్ అవ్వడం సాధ్యమే. కానీ అధిక ఆర్థిక క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక ఉండాలి. ఎక్కువ సంపాదించడంపైనే కాకుండా, అధికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. మధ్యతరగతి వేతనం పొందుతున్న వారు కూడా తమ ఆదాయంలో 50 శాతానికి పైగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెడితే త్వరగానే రిటైర్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి?ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. నెలకు రూ.50,000 ఖర్చులు ఉన్నాయనుకుంటే 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల పదవీ విరమణలో మంచి కార్పస్ రావాలంటే నెలకు రూ.18,080 ఆదా చేయాల్సి ఉంటుంది. 20-25 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటే తాను నెలకు రూ.35000 వేతనంతో ఉద్యోగం సాధించినప్పటి నుంచి నెలవారీ ఆదాయంలో 60-70% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయాలి. అంటే దాదాపు నెలకు రూ.20,000 పొదుపు చేయాలి. ఉద్యోగం వచ్చి, పెళ్లి కావాడానికి ముందు పొదుపును మరింత పెంచాలి. ఈ మొత్తాన్ని 20-25 ఏళ్ల కాలానికి 10-12 శాతం వార్షిక రాబడి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. కాలక్రమేణా ఇది 40-45 ఏళ్ల వయసు నాటికి రూ.2–2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుంది. -
బ్యాంక్ బ్యాలెన్స్.. బ్యాడ్ న్యూస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లతో సహా ప్రధాన బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్స్పై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో పొదుపు ఖాతాదారులు తక్కువ రాబడిని చూస్తారు. ఈ ఏడాది క్యుములేటివ్ రేటు కోత ఇప్పుడు 1 శాతంగా ఉంది. పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధమైన తక్కువ రేట్ల విధానానికి మారడంతో డిపాజిటర్లపై ప్రభావం పడుతోంది.వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన పొదుపు ఖాతా వడ్డీ రేటును జూన్ 15 నుండి అన్ని బ్యాలెన్స్లకు సంవత్సరానికి 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్లపై 2.7 శాతం, రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేసేది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పొదుపు రేట్లను జూన్ 10 నుండి ఫ్లాట్ 2.75 శాతానికి సర్దుబాటు చేసింది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్లపై 2.75 శాతం, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన వడ్డీ రేటును 2.75 శాతానికి సవరించింది. ఇది జూన్ 12 నుండి వర్తిస్తుంది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్లపై 2.75 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3.25 శాతం వడ్డీని అందించేది.రాబడి పెంచుకోండి..యువత బ్యాంక్ బ్యాలెన్స్పైనే దృష్టి పెట్టకుండా దాన్ని రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు ఖాతా మీ డబ్బును సురక్షితంగా ఉంచుతుంది. కానీ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాని విలువను తినేస్తుంది. మరోవైపు, పెట్టుబడి మీ డబ్బును కాంపౌండింగ్ శక్తి ద్వారా కాలక్రమేణా పెంచుతుంది. ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ లు లేదా స్టాక్స్ లోని ఫ్రాక్షనల్ షేర్లతో చిన్నగా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి మీరు ధనవంతులు కానవసరం లేదు. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ ఆర్థిక పునాది బలంగా మారుతుంది. -
నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ డబ్బు పొదుపునకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన వార్షిక ఆదాయంలో 95% ఆదా చేస్తున్నట్లు చెప్పారు. తన ఆర్థిక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అక్షత్ ఎక్స్లోని వివరాల ప్రకారం.. తాను నెలకు కేవలం రూ.10,000 సంపాదనతో కెరియర్ ప్రారంభించారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుతూ, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లో తయారు చేసిన భోజనం తింటూ నెలకు రూ.1,000-2,000 పొదుపు చేయగలిగాడు. అప్పులు చేయలేదు.. అనవసరమైన ఖర్చులు లేవు. మొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చిన్నమొత్తంలో స్థిరంగా పొదుపు చేస్తూ వచ్చారు.కొన్నేళ్ల తర్వాత రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు. తర్వాత అతని పొదుపు అలవాట్లు కూడా పెరిగాయి. ఏడాదికి కనీసం రూ.20 లక్షలు పొదుపు చేస్తూ అప్పులేని జీవనం కొనసాగించారు. అందులో ఎక్కువ భాగాన్ని అధిక వృద్ధి పెట్టుబడులకు మళ్లించారు. కాలక్రమేణా ఆ పెట్టుబడులు సొంత ఆదాయాన్ని సృష్టించడం ప్రారంభించాయి. దాంతో రిటైర్మెంట్ కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేశారు.[1] When I started my career: my salary was 10K, I used to live with my parents; used a 2nd hand mobile phone. Ate home cooked meals (almost all the time). I was not married/had kids, took no debt. And, still saved 1-2K/month. [2] Fast forward a few years: I got a good…— Akshat Shrivastava (@Akshat_World) June 15, 2025ఇదీ చదవండి: ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, ప్రపంచ ప్రయాణాలు చేస్తూ ఖరీదైన నగరంలో నివసిస్తున్నప్పటికీ అక్షత్ తన పొదుపు రేటు ఇప్పటికీ 95% కొనసాగిస్తున్నారు. జీవనశైలి మారుతున్నా పొదుపు మాత్రం మరవకూడదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి తనకు మార్గనిర్దేశం చేసిన నియమాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘మీరు ఏదైనా రెండుసార్లు కొనగలిగితే తప్పా దాన్ని ఒకసారి కొనవద్దు. మీ నైపుణ్యాలు మెరుగుపడే పనికి మాత్రం ఖర్చు చేసేందుకు వెనుకాడవద్దు’ ఇది తెలిపారు. -
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్ అమౌంట్ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల కొత్త మినిమమ్ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ను ఎస్బీఐ కార్డ్ తమ వెబ్సైట్లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాకరు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు కొన్ని ఉన్నాయి. సబ్స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల మీరు తీవ్రమైన జీవనశైలిలో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ పొదుపును చాలా వరకు పెంచుకోవచ్చు.సబ్స్క్రిప్షన్ ఆడిట్అనవసరమైన సబ్స్క్రిప్షన్ లను గుర్తించండి. చాలా మంది తాము అరుదుగా ఉపయోగించే సేవలకు సబ్ స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్ని యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను జాబితా రాసుకుని వాటి అవసరాన్ని అంచనా వేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ఆడిట్ నిర్వహించండి. పనికిరాని లేదా అరుదుగా ఉపయోగించే వాటిని రద్దు చేయండి. ఈ చిన్న నని మీకు ప్రతి నెలా చాలా డబ్బును ఆదా చేస్తుంది. దీన్ని మరింత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.రోజువారీ ఖర్చులపై పర్యవేక్షణరోజువారీ చేసే చిన్న చిన్న కొనుగోళ్లను పర్యవేక్షించండి. రోజువారీ చిరు ఖర్చులు అంటే కాఫీ, స్నాక్స్ వంటి కోసం చేసేవి. ఇవి తక్కువే కదా అనిపించవచ్చు. కానీ నెలాఖరున లెక్కిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చులను ఒక వారం పాటు తనిఖీ చేయండి. అవి మీ బడ్జెట్ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడండి. అలా అని సరదా విషయంలో రాజీపడాల్సిన పని లేదు. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇంట్లో కాఫీ, స్నాక్స్ చేసుకుని ఆస్వాదించవచ్చు.అనవసర షాపింగ్ వద్దుషాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంత మంది తరచూ షాపింగ్కు ప్రేరేపితం అవుతుంటారు. ఈ ప్రేరేపిత కొనుగోలు అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయిస్తుంది. బయటకు వెళ్ళే ముందు షాపింగ్ జాబితాలను తయారు చేయడం లేదా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సెట్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా, మీరు ఆకస్మిక నిర్ణయాలను నియంత్రించగలుగుతారు. బదులుగా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు సరిపోయే ఆలోచనాత్మక కొనుగోళ్లు చేయగలరు.ఛార్జీలపై అవగాహనబ్యాంకు ఫీజులు, ఛార్జీలను సమీక్షించుకోవడం అవసరం. ఇవే నిశ్శబ్దంగా వచ్చే ఖర్చులు. వీటిని అవగాహన, అప్రమత్తతో తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా ఏటీఎం ఫీజులు వంటి ఏదైనా పునరావృత రుసుము కోసం బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. తక్కువ ఖర్చులు లేదా ఎటువంటి రుసుము లేని ఖాతాల కోసం ఎంపికలను అన్వేషించండి. బ్యాంకులు లేదా ఖాతా రకాలను మార్చడం కాలక్రమేణా గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది.వినియోగ సామర్థ్యంయుటిలిటీ బిల్లులు మన అసమర్థ వినియోగ అలవాట్ల కారణంగా నిశ్శబ్ద ఖర్చుల ఉచ్చులో పడే మరొక ప్రాంతం. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లను ఆపివేయడం. విద్యుత్తును తక్కువ వినియోగించే ఉపకరణాలను ఉపయోగించడం లేదా థర్మోస్టాట్ సెట్టింగులను సర్దుబాటు చేయడం వంటి సాధారణ చర్యలు ఇంట్లో సౌకర్య స్థాయిలతో రాజీపడకుండానే కాలక్రమేణా యుటిలిటీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక్క నెల ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీ ఖర్చుల్లో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకుంటారు. -
యువతకు బెస్ట్ పెట్టుబడి మార్గాలు
పెట్టుబడి విషయానికి వస్తే యువతకు, వయసుపైబడిన వారికి మధ్య ఉన్న తేడా ఇన్వెస్మెంట్లను ముందుగా ప్రారంభించడం. యువతకు దీర్ఘకాలంలో ఇది ఎంతో కలిసొస్తుంది. 40-45 ఏళ్లు దాటిన వారితో సమానంగా యువత ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి ఒకే సమయంలో ఉపసంహరించుకుంటే కచ్చితంగా యువతకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి ప్రారంభించాలో స్పష్టత ఉండడంలేదు. యువకులు క్రమశిక్షణతో, ఆర్థిక నిపుణుల సలహాతో మంచి పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చు. మార్కెట్లోని కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.పొదుపు ఖాతాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు (సీడీలు)పొదుపు ఖాతా అనేది డబ్బును నిర్వహించేందుకు సరళమైన, అత్యంత రిస్క్ లేని మార్గం. అయితే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఖాతాలు సురక్షితమైనవి. మరోవైపు సీడీలు మీ డబ్బును నిర్ణీత కాలానికి (6 నెలలు లేదా ఒక సంవత్సరం) లాక్ చేస్తాయి. అందుకు కొంత అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.స్టాక్ మార్కెట్స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకొని పెట్టుబడి కొనసాగిస్తే కాలక్రమేణా అధిక రాబడిని అందించగలవు. అయితే ఇవి అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో రిస్క్ అధికంగా ఉంటుందని మరిచిపోకూడదు.ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ స్టాక్స్లో నిర్ణీత షార్ట్టర్మ్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాంగ్టర్మ్లో మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఈటీఎఫ్లు(కొన్ని స్టాక్స్ కలిపి ఉన్న ఫండ్) మార్కెట్లో నేరుగా లైవ్లో ట్రేడవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్టార్ వారీగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాటిని నిత్యం ఫండ్ మేనేజర్ నిర్వహిస్తుంటారు.బాండ్స్బాండ్లు అంటే కాలానుగుణ వడ్డీ చెల్లింపుల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. ఇవి స్టాక్స్ కంటే సురక్షితమైనవి. కానీ, తక్కువ రాబడిని అందిస్తాయి.రియల్ ఎస్టేట్ (ఆర్ఈఐటీ)రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు) యువ పెట్టుబడిదారులను భౌతిక ఆస్తిని కొనుగోలు చేయకుండానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి డివిడెండ్ సంపాదించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని చాలా బ్రోకరేజీ ఖాతాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది మంచి మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?విద్య, నైపుణ్యాలువిద్య, సర్టిఫికేషన్లు లేదా అధిక ఆదాయాన్ని సమకూర్చే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం (కోడింగ్, డిజైన్ వంటివి) కోసం పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే మంచి ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే కెరియర్లో అంత ప్రయోజనం పొందుతారు. -
డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచన
‘స్మార్ట్’ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.స్మార్ట్ లక్ష్యాలుSMARTSpecificMeasurableAchievableRealisticTime-boundనిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. -
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్స్టాగ్రామ్లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్ఫామ్లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
యువతకు సత్య నాదెళ్ల సూచన
కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బేసిక్స్పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్ డెవలప్మెంట్కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?సుందర్ పిచాయ్ కూడా అదే బాటలో..లెక్స్ ఫ్రిడ్మన్తో గతంలో జరిగిన పాడ్కాస్ట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్ కోడింగ్ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్ తెలిపారు. -
30 ఏళ్ల నాటి షేర్లు.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
అదృష్టం ఎవరి జీవితంలో ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. 1990వ దశకంలో తన తండ్రి కొన్న షేర్లు ఇప్పుడు కొడుక్కి జీవితం మారిపోయే అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో తన తండ్రి కేవలం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన పాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ సర్టిఫికెట్లు అనుకోకుండా ఇటీవల కొడుక్కి దొరికాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని పదుల కోట్ల రూపాయలు.రెడిట్లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘ఎక్స్’ పోస్ట్ లో వివరించారు. ‘ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లలో రూ.1లక్షకు కొన్న జేఎస్డబ్ల్యూ షేర్లను ఇటీవల కనుగొన్నాడు. ఇప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా.ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండటంతో ఇప్పుడు ఒక తరానికే సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేస్తున్నాయి. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ ఈ పోస్ట్కు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు.. ఇది కేవలం పెట్టుబడి కాదు.. వారసత్వ సృష్టి.. అంటూ పలు విధాలుగా కామెంట్లు చేశారు.జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీదారు. బలమైన మార్కెట్ ఉనికితో ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేరు ధర రూ.1004.90 వద్ద ఉండగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లుగా ఉంది. జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి.👉ఇది చదివారా? జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడుల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరియర్ను ప్రారంభించిన యువత సేవింగ్స్పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్కు, ఇన్వెస్ట్మెంట్కు తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పసి మనసులకు కావాలి ఆర్థిక పాఠాలు
మనీ మేనేజ్మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.డబ్బు సంపాదనపై స్పష్టతజీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.పొదుపుతో లాభాలురూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.పెట్టుబడులపై అవగాహనపొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.ఆర్థిక ప్రణాళికఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలుఅప్పు గురించి తెలుసుకోవాలి..ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి. -
చదువు కొంటున్నారా?
నాణ్యమైన విద్య.. అందని ద్రాక్ష కాదు..! ఏటేటా భారీగా పెరిగిపోతున్న ఫీజులు పాఠశాల విద్యకే రూ.లక్షలాది ఖర్చు విదేశీ విద్యకు భారీగా వెచ్చించాల్సిందే ముందస్తు ప్రణాళికతో సాధించడం సులభమే పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు–సంస్కారం. అందుకే తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించేందుకు తమ వంతు ప్రయత్నిస్తుంటారు.కానీ, నాణ్యమైన విద్య నేడు అందరికీ అందుబాటులో లేదు. పాఠశాల స్థాయి నుంచే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎల్కేజీ, యూకేజీలకు రూ.లక్షల ఫీజులు తీసుకుంటున్న పాఠశాలలు చాలానే ఉన్నాయి. ఉన్నత విద్యకు ఇంకా అధిక మొత్తమే వెచ్చించాల్సి వస్తోంది. నాణ్యమైన చదువుల కోసమని ఈ స్థాయి ఖర్చును భరించడం మధ్యతరగతి వారికి ముందస్తు ప్రణాళికతోనే సాధ్యం.గడిచిన దశాబ్ద కాలంలో స్కూలు ఫీజులు 150–200 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్, బెంగళూరులో పేరున్న పాఠశాలలు 30 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. సాధారణ ద్రవ్యోల్బణం 6 శాతమే. కానీ విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం వరకు ఉంటోంది. అంటే ఫీజులు ఏటా ఈ స్థాయిలో, ఇంతకుమించి పెరుగుతున్నాయి. దీనికి అదనంగా ట్యూషన్లు, క్రీడల్లో కోచింగ్, సంగీతం/కళలు, పుస్తకాలు, బస్సు రవాణా రూపంలో అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఐఐటీల్లోనూ నాలుగేళ్ల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పాఠశాల చదువు తర్వాత ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, బిట్ తదితర ప్రఖ్యాత సంస్థల్లో సీటు రాకపోతే.. ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా ఈ ఫీజులు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. పాఠశాల స్థాయిలో చేసే ఖర్చుకు అదనంగా.. మరోవైపు వారి ఉన్నత విద్యకోసం కావాల్సినంత సమకూర్చుకునేందు కు ప్రాధా న్యం ఇవ్వాల్సిందే. ఇందుకు ముందస్తు వ్యూహం, ప్రణాళిక తప్పకుండా అవసరం. ప్రణాళిక.. విద్యా వ్యయాలను భరించాలంటే అది ముందస్తు ప్రణాళికతోనే సాధ్యమని సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ హర్‡్షవర్ధన్ రుంగ్తా పేర్కొన్నారు. విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ (ఫీజులు, ఆహారం, వసతి ఇతర ఖర్చులు) కోసం ప్రస్తుతం 1,00,000 డాలర్లు (సుమారు రూ.86 లక్షలు) అవుతున్నట్టు చెప్పారు. దేశాలను బట్టి ఈ వ్యయాలు మారిపోతాయన్నారు. సింగపూర్తో పోల్చి చూసినప్పుడు యూఎస్, కెనడాలో అధిక చార్జీలు ఉన్నట్టు తెలిపారు. పిల్లల వయసు ఏడాది, ఆలోపు ఉన్నప్పుడే పెట్టుబడుల ప్రణాళిక ఆరంభించాలని సూచించారు. ప్రైవేటు విద్యా వ్యయాలు పెరిగిపోతున్న తీరు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. ‘‘గత పదేళ్లలో స్కూల్ ఫీజులు 150 శాతానికి పైనే పెరగ్గా, కొన్ని యూనివర్సిటీల్లోనూ 200 శాతం మేర ఫీజులు పెరిగాయి. నాణ్యమైన విద్యకు పెరుగుతున్న డిమాండ్ను ఈ ఫీజులు సూచిస్తున్నాయి’’ అని వివరించారు. పిల్లలు ప్రీ స్కూల్ దశకు రాకముందే ప్రణాళిక మొదలు పెట్టాలని సూచించారు. ముందస్తుగా ఆరంభిస్తే కాంపౌండింగ్తో పెట్టుబడి మెరుగైన వృద్ధిని చూస్తుంది. కాల వ్యవధి.. పిల్లల వయసు ప్రస్తుతం ఎంత? పాఠశాల విద్య, ఉన్నత విద్య కోసం ఎంత సమకూర్చుకోవాలన్న విషయాలపై స్పష్టత అవసరం. చిన్నారి వయసు మూడేళ్లు ఉందనుకుందాం. ఇక్కడి నుంచి కాలేజీ చదువులకు ఇంకా 15 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఉన్నత విద్య కోసం కావాల్సినంత సమకూర్చుకునేందుకు 15 ఏళ్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అదే సమయంలో ఇక్కడి నుంచి ప్లస్2 వరకు (ఇంటర్) అయ్యే ఖర్చులకూ సన్నద్ధత, ప్రణాళిక వేరుగా ఉండాలి. స్కూల్ ఫీజులే కాకుండా, వారికి ఇతర విభాగాల్లో తరీ్ఫదు ఇప్పించాలనుకుంటే అందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖర్చుకు సన్నద్ధత విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం చొప్పున ఉంటోంది. కనీసం 10 శాతాన్ని అంచనా కింద తీసుకుని చూసినా.. ఐఐటీల్లో బీటెక్ కోసం నాలుగేళ్లకు నేడు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంటే.. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.30 లక్షలకు చేరుతుంది. ఇంకాస్త అదనంగా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటి వరకు మీకున్న పొదుపు పెట్టుబడులను ఒకసారి పరిశీలించండి. అవి కాకుండా, అదనంగా ఎంత సమకూర్చుకోవాలో స్పష్టతకు రావాలి. పిల్లల విద్యకు ఇప్పటి నుంచి ఎన్నేళ్లకు, ఎంత మొత్తం కావాలన్న అంచనాకు వచ్చిన తర్వాత.. ఆ మొత్తం సమకూర్చుకునేందుకు పెట్టుబడుల ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడులకు కావాల్సినంత మిగులు లేకపోతే.. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి.సరైన సాధనాలు.. ఇక్కడి నుంచి ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు, పద్దెనిమిదేళ్ల కాలంలో ఎంత మొత్తం కావాలన్న అంచనాకు అనుగుణంగా పెట్టుబడులు మొదలు పెట్టాలి. అంత మొత్తం సమకూర్చునేందుకు వైవిధ్యమైన పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడిపై రాబడి ద్రవ్యోల్బణాన్ని మించేలా చూసుకున్నప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైనవి. 10 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో ఇవి 12–15 శాతం స్థాయిలో వార్షిక రాబడులను ఇవ్వగలవు.అదే సమయంలో పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించకూడదు. దీనివల్ల ఆటుపోట్ల రిస్క్ పెరుగుతుంది. డెట్ సాధనాలకూ నిరీ్ణత శాతాన్ని కేటాయించుకోవాలి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అస్సెట్ ఫండ్స్ను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ ఈక్విటీ, డెట్తోపాటు రియల్ ఎస్టేట్, బంగారం, వెండి తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ పథకం గత పదేళ్లలో ఏటా 13 శాతానికి పైనే రాబడిని ఇవ్వడం గమనార్హం. కాల వ్యవధి కనీసం 7–10 ఏళ్లు అంతకుమించి ఉంటేనే ఈక్విటీలకు కేటాయింపులు చేసుకోవాలి. లేదంటే డెట్ సాధనాలు అనుకూలం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలు ఉన్న వారు) వంటి పన్ను రహిత సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనల మేరకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాతే మిగులు నుంచే ఖర్చులకు వెళ్లాలి. తద్వారా లక్ష్య సాధన తేలిక అవుతుంది. రక్షణ కవచాలుఅనుకోని, ఊహించని ఘటనలు చోటు చేసుకుంటే పిల్లల విద్యా లక్ష్యాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించుకోవడం అవసరం. కనుక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి.. 10–20 ఏళ్లపాటు కుటుంబం జీవన అవసరాలు, పిల్లల విద్యా వ్యయాలు, వారి వివాహం ఖర్చులు, రుణాలు ఏవైనా ఉంటే అంత మేర సమ్ అష్యూర్డ్తో జీవిత బీమా తీసుకోవాలి. ఇందుకు అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్తోపాటు.. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించొచ్చు.సమీక్ష అవసరం.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా.. అవి అనుకున్న విధంగానే రాబడులను ఇస్తున్నాయా? అన్నది ఏడాదికోసారి నిపుణుల సాయంతో సమీక్షించుకోవాలి. తక్కువ రాబడి ఇస్తుంటే ఇతర సాధనాల్లోకి మారిపోవడం లేదంటే.. పెట్టుబడిని పెంచుకోవడం చేయాలి. అలాగే, అంచనాలకు మించి విద్యా వ్యయాలు పెరుగుతున్నా కూడా పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిందే. కనుక పెరిగే సంపాదనకు అనుగుణంగా ఏటా పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అనుకు న్న మేర రాబడులను ఇవ్వకపోవచ్చు. లేదంటే అంచనాలకు మించి ఫీజులు పెరిగిపోవచ్చు. మొత్తం మీద నిరీ్ణ త కాలానికి కావాల్సినంత సమకూరకపోతే అప్పుడు ఉన్నత విద్య కోసం విద్యా రుణాలను ఆశ్రయించడం ఒక మార్గం. కోర్సు పూర్తయిన అనంతరం లేదా ఉద్యోగంలో చేరిన అనంతరం చెల్లింపులు మొదలయ్యే ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయపన్ను పాత విధానంలో విద్యా రుణాలపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తానికీ పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. స్కాలర్షిప్లు భారంగా మారిన విద్యా వ్యయా లను గట్టెక్కేందుకు స్కాలర్షిప్లు కూడా ఒక మార్గం. పేరొందిన సంస్థలు ఏటా నిరీ్ణత సంఖ్యలో విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తుంటాయి. వీటిని సాధించేందుకు ప్రయత్నించాలి. నిపుణుల సాయం పిల్లల విద్యా వ్యయాలు, ద్రవ్యోల్బణం ప్రభావం, పెట్టుబడి సాధనాల ఎంపిక అన్నవి చాలా సంక్లిష్టమైనవి. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడం వల్ల అనవసర ఆందోళన, గందరగోళాన్ని నివారించొచ్చు. అంతేకాదు, మెరుగైన సాధనాల ఎంపిక సాధ్యపడుతుంది. కొంత ఫీజుకు వెనుకాడకుండా వారి సాయాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ఎంతో ముఖ్యమైన విద్యా లక్ష్యాలను సాఫీగా అధిగమించొచ్చు.‘నా చిన్నారిని ఖరీదైన ప్రైవేటు స్కూల్కు పంపించను’ఫీజుల పెంపు చేయి దాటిపోతోంది. కొన్ని హైదరాబాదీ స్కూల్స్ ఈ ఏడాది 30% వరకు ఫీజులు పెంచేశాయి! → వార్షిక సగటు ఫీజులు ఇప్పుడు రూ. 60,000–2,00,000 మధ్య ఉన్నాయి. → ఏడాది ఫీజు అంతా ముందే చెల్లించాలని కొన్ని స్కూల్స్ డిమాండ్ చేస్తున్నాయి. → ఒక స్కూల్ ఎల్కేజీకి రూ.4 లక్షలు చార్జ్ చేస్తోంది. → విద్యా ద్రవ్యోల్బణం 12 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ ధరలతో మనం పిల్లలను స్కూల్కు పంపేందుకు సన్నద్ధం చేస్తున్నామా.. లేక తల్లిదండ్రులను దివాలా బాట పట్టిస్తున్నామా? ప్రైవేటు స్కూల్స్ నేడు విద్యా సంస్థల కంటే కూడా స్టార్టప్ల మాదిరిగా కనిపిస్తున్నాయి’’ – ఫైనాన్షియల్ అడ్వైజర్, మాజీ వెల్త్ మేనేజర్ (ఐఐఎఫ్ఎల్) నేహ నగర్ లింక్డ్ఇన్లో చేసిన పోస్ట్ ఇది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్ స్కోర్ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.జాబ్ అప్లికేషన్పై క్రెడిట్ స్కోర్ ప్రభావంక్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.👉ఇదీ చదవండి: టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్ను షేర్ చేయాలని కంపెనీలు అడగవచ్చు. -
టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!
దేశంలో టీనేజర్లు అప్పులు చేస్తున్న ధోరణి ఇటీవల పెరుగుతోంది. భారత యువత ముఖ్యంగా టీనేజర్లు అప్పుల కోసం డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్లు, క్రెడిట్ కార్డులు, ఇతర అనధికారిక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. రుణ ప్రాప్యత ఆర్థిక సౌలభ్యాన్ని అందించినప్పటికీ, ఆర్థిక అవగాహన అంతగా లేని యువ రుణగ్రహీతలకు ముప్పును కూడా కలిగిస్తుంది.పైసాబజార్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మూడు తరాలలో మొదటిసారి అప్పు తీసుకునే సగటు వయస్సు 21 సంవత్సరాలకు తగ్గింది. చాలా ఆలస్యంగా రుణాలు తీసుకోవడం ప్రారంభించిన మునుపటి తరాలతో పోలిస్తే, నేటి యువత ఇప్పుడు వారి క్రెడిట్ ప్రయాణాలను 20 ల మధ్యలో ప్రారంభిస్తున్నారు. "బై నౌ, పే లేటర్" వంటి పథకాలు, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు పెరగడం వల్ల రుణాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏదేమైనా, భారతీయ యువతలో ఆర్థిక అవగాహన తక్కువగా ఉంది, రుణ నిర్వహణపై చాలా మందికి ఆచరణాత్మక పరిజ్ఞానం లేదు.రిస్క్లు, పర్యవసానాలురుణ ఉచ్చులు: అధిక వడ్డీ రేట్లు, దాచిన రుసుములు దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి.ఆర్థిక ఒత్తిడి: పేలవమైన ఆర్థిక ప్రణాళిక, అధిక రుణాలు ఆందోళనకు కారణమవుతాయి. మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి.క్రెడిట్ స్కోర్ డ్యామేజ్: తప్పిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్లను దెబ్బతీస్తాయి. ఇది భవిష్యత్తు ఆర్థిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది.మితిమీరిన రుణాలు: అనియంత్రిత రుణాలు వ్యక్తులకు, ఆర్థిక పరిశ్రమకు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.బాధ్యతాయుతమైన రుణం.. జాగ్రత్తలుఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: బాధ్యతాయుతమైన రుణాలు, ఆర్థిక నిర్వహణపై పాఠశాలలు, తల్లిదండ్రులు టీనేజర్లకు అవగాహన కల్పించాలి.బడ్జెట్ నైపుణ్యాలు: ఖర్చులను ట్రాక్ చేయడానికి, వాస్తవిక తిరిగి చెల్లించే ప్రణాళికలను సెట్ చేయడానికి యువ రుణగ్రహీతలను ప్రోత్సహించడం.రుణ నిబంధనలను అర్థం చేసుకోవడం: రుణం తీసుకునే ముందు, టీనేజర్లు వడ్డీ రేట్లు, ఫీజులు, తిరిగి చెల్లించే పరిస్థితులను క్షణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.రుణాన్ని పరిమితం చేయండి: అవసరమైనప్పుడు మాత్రమే రుణం తీసుకోండి. ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవడం మానుకోండి.మార్గదర్శకత్వం పొందండి: ఆర్థిక సలహాదారులు లేదా మార్గదర్శకులను సంప్రదించడం టీనేజర్లకు సమాచారంతో కూడిన రుణ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. -
ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు
ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీ పని వాతావరణం నచ్చకో.. మరింత వేతనం ఆశించో.. ప్రమోషన్ కోసమో.. ఇలా విభిన్న కారణాలతో వేరే సంస్థకు మారాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీ వేతనం ఇచ్చిన తేదీ రోజున లేదంటే తర్వాత రోజున ఉద్యోగులు అధికంగా రాజీనామా పత్రాలను సమర్పిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ ‘పిట్@గో జీరో’ వ్యవస్థాపకురాలు కిరణ్ షా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.‘ఉద్యోగులకు తాము చేస్తున్న కంపెనీలు నచ్చలేదంటే.. సరిగ్గా వేతనం పడే రోజున లేదా పడిన మరుసటి రోజున రాజీనామా చేస్తున్నారు. ఇది కొన్ని యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా అన్ని కంపెనీల్లో ఒకటో తేదీన జీతాలు ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని యాజమాన్యాలకు చుక్కలే. తమ ఉద్యోగులు ఎక్కడ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉంటారోననే ఆందోళన చెందుతుంటాయి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో కంపెనీలకు విదేయతతో ఉండాలి. తమ డిమాండ్లు ఏమిటో ముందుగా కంపెనీతో చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: 30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు‘ఉద్యోగులు నిజంగా కంపెనీ నుంచి తప్పుకోవాలనుకుంటే హుందాగా తప్పుకోండి. తప్పా కంపెనీ వేతనం పడిన వెంటనే కొలువు నుంచి వైదొలగడం సరికాదు. అప్పటివరకు ఉద్యోగికి ఇచ్చిన బాధ్యతలు వెంటనే మరో వ్యక్తికి అసైన్ చేయాలంటే సంస్థకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పుకుండా నోటీస్ పీరియడ్ చేయాలి. జీతం వేసిన వెంటనే మీ యజమానిని భయభ్రాంతులకు గురిచేయకండి’ అని తెలిపారు. -
30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు
యువత చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలనే ధోరణి మంచిదే. అయితే కొలువు సంపాదించాకా కార్పొరేట్ వాతావరణానికి అలవాటుపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారి సగటు వయసు 40 కంటే తక్కవే కావడం ఆందోళన కలిగిస్తుంది.సమస్యలు షురూ..దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయసు బాగా తగ్గిపోతోంది. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 35 మాత్రమేనని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.వ్యయ భారం ఇలా..కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం ఆయా కుటుంబ సభ్యులను ఆందోళకు గురిచేస్తోంది. ఇది దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యాఏం చేయాలంటే..కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కొద్దిమంది ఉద్యోగులే పాల్గొంటున్నారు. చాలా కొద్ది కంపెనీలే ఉద్యోగుల ఆరోగ్యానికి అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రస్తుత పని ప్రణాళిల్లో మార్పులు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు కంపెనీ అందించే బీమా ఉపయోగపడొచ్చు. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా ఉండడం ఉత్తమం. సంపాదన మొదలు పెట్టిన వెంటనే ఆర్థిక నిపుణులు సలహాతో మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి. -
కుర్రకారూ.. పడొద్దు బోల్తా..!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులు భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ చెల్లింపులదే ఆధిపత్యం. ముఖ్యంగా టీనేజర్లు, కుర్రకారు ఎక్కువగా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దాదాపు అందరికీ యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసు. కానీ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. ఆన్లైన్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకునే మోసాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.తాజా నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ప్రకారం, 15-29 సంవత్సరాల వయసువారిలో దాదాపు 99.5 శాతం మందికి యూపీఐ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఇది డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించడాన్ని హైలైట్ చేస్తున్నప్పటికీ, స్కామర్లు సైతం తమ వ్యూహాలను అమాయక యూజర్లను మోసం చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.యూపీఐ లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?మోసాన్ని నివారించడానికి వినియోగదారులు ఈ భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలని అధికారులు, ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.యూపీఐ పిన్ షేర్ చేయకండి: సైబర్ నేరగాళ్లు తరచూ బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ వినియోగదారులను మోసం చేస్తుంటారు.లావాదేవీ లింక్లను సరిచూసుకోండి: స్కామర్లు చట్టబద్ధమైన ప్లాట్ ఫారమ్ లను అనుకరించే నకిలీ యూపీఐ చెల్లింపు లింక్ లను పంపవచ్చు. లావాదేవీలను ఆమోదించడానికి ముందు ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేయండి.పేమెంట్ రిక్వెస్ట్ల పట్ల జాగ్రత్త: తెలియని వ్యక్తుల నుంచి పేమెంట్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు వాటికి స్పందించే ముందు సోర్స్ను చెక్ చేసుకోండి.అధికారిక యాప్లు, ప్లాట్ ఫామ్ ఉపయోగించొద్దు: భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి ధ్రువీకరించిన బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరిగేలా చూసుకోండి.అకౌంట్లో ఏం జరుగుతోందో చూసుకోండి: యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయడం అనధికార చెల్లింపులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. -
ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు
ఆర్థిక స్వాతంత్ర్యం చాలా మంది యువకుల కల. కానీ సమర్థమైన డబ్బు నిర్వహణ అలవాట్లు కొరవడడంతో సంపాదన మొదలుపెట్టిన ప్రాథమిక దశలోనే యువతకు ఆర్థిక కష్టాలు తప్పడంలేదు. అయితే సరైన ప్రణాళికతో ఈ ఇబ్బందులను గట్టెకవచ్చని నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. యువత సాధారణంగా ఎలా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారో.. దాని నుంచి ఎలా బయటపడవచ్చో కింది ఏడు సమస్యలు-పరిష్కారాల ద్వారా తెలుసుకుందాం.1. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడంచాలా మంది యువతకు బడ్జెట్, రుణ నిర్వహణ, పెట్టుబడి వంటి ముఖ్యమైన ఆర్థిక నైపుణ్యాలు ఉండవు. అవకాశం ఉన్నా వాటిని నేర్చుకోవాలనే స్పృహ ఉండదు. పాఠశాలలు, కళాశాలల్లోనూ నిజ జీవితంలోని ఆర్థిక పరమైన సమస్యలపై అరుదుగా బోధిస్తారు. దానికితోడు యువత స్థిరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతుంది.పరిష్కారం: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వివిధ మాధ్యమాల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్, ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి... వంటి చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకొని ప్రాథమికంగా అందులోని అంశాలను నేర్చుకోవాలి.2. అధిక వ్యయం, జీవనశైలి ద్రవ్యోల్బణంసామాజిక మాధ్యమాలతో లాభాలున్నట్లే నష్టాలున్నాయి. యువత ప్రధానంగా ప్రస్తుతం అనుసరిస్తున్న సోషల్ మీడియా అకౌంట్ల్లో తోటివారిలాగా తమ లైఫ్స్టైల్ను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి బట్టలు, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు.. వంటివి కొనుగోలు చేస్తున్నారు. తోటివారి నుంచి ఏర్పడే పరోక్ష ఒత్తిడి ద్వారా శక్తికి మించి ఖర్చు చేయడానికి సోషల్ మీడియా అవకాశం కల్పిస్తుంది.ఉదా: రూ.30,000 సంపాదించే వ్యక్తి సోషల్మీడియా ప్రభావం ద్వారా రూ.25,000 ఖర్చు చేసే అవకాశం ఉంది. దాంతో పొదుపునకు పరిమిత అవకాశం ఉంటుంది.పరిష్కారం: 50/30/20 నియమాన్ని అనుసరించాలి. అంటే అవసరాలకు 50%, కోరికలకు 30%, పొదుపునకు 20% ఖర్చులతో బడ్జెట్ రూపొందించుకోవాలి.3. నియంత్రించలేని రుణం, క్రెడిట్ కార్డు దుర్వినియోగంక్రెడిట్ కార్డులు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి. కానీ వాటి దుర్వినియోగం అధిక వడ్డీలకు కారణం అవుతుంది. సులభంగా ఉన్నట్లు కనిపించే ‘బై నౌ, పే లేటర్ (బీఎన్పీఎల్)’ పథకాలు యువతను ఖర్చుల వైపు లాగేస్తున్నాయి. నెలల తరబడి చెల్లించని రూ.50,000 క్రెడిట్ కార్డు బిల్లు అధిక వడ్డీ కారణంగా రూ.70,000 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.పరిష్కారం: ప్రణాళికాబద్ధమైన ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి. వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి ప్రతి నెలా బిల్లులను పూర్తిగా చెల్లించాలి. అత్యవసరమైతే తప్ప బీఎన్పీఎల్కు దూరంగా ఉండాలి.4. పొదుపు చేయకపోవడంఅత్యవసర నిధి లేకుండా యువకులు వైద్య బిల్లులు, ఉద్యోగం కోల్పోవడం లేదా అత్యవసర ప్రయాణం వంటి ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని పూడ్చేందుకు చాలా మంది అప్పులు చేయడం లేదా ఖరీదైన రుణాలు తీసుకోవడం చేస్తుంటారు.పరిష్కారం: కనీసం 3-6 నెలల సరిపడా ఖర్చులను ప్రత్యేక అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అవసరం లేని కొనుగోళ్ల కోసం అప్పుల్లో మునిగిపోవద్దు.5. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకపోవడంచాలా మంది యువత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి సంపదను పెంచే అవకాశాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు డబ్బును పొదుపు ఖాతాలు, ఇతర సాధానాల్లో ఉంచుతారు. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాలక్రమేణా కాంపౌండింగ్ ప్రయోజనాలు తగ్గుతాయి.పరిష్కారం: దీర్ఘకాలిక వృద్ధి కోసం మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించాలి. స్టాక్స్, ఈటీఎఫ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులను వైవిధ్యపరచాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్, రిటర్న్లపై స్పష్టత ఉండాలి.6. స్కామ్ల బారిన పడడంవేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువ పెట్టుబడిదారులు తరచుగా పోంజీ పథకాలు(మోసపూరిత స్కీమ్లు), క్రిప్టో స్కామ్లు, నకిలీ స్టాక్ చిట్కాలకు మొగ్గుచూపుతారు. సరైన పరిశోధన లేకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కోల్పోతున్నారు.పరిష్కారం: పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లను సరిచూసుకోవాలి. ఆథరైజ్డ్ ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి సొంతంగా నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా7. పన్ను ప్రణాళికలు విస్మరించడంచాలా మంది ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పన్ను ఆదా పథకాలను ఉపయోగించకపోవడం వల్ల అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గుతుంది.పరిష్కారం: పొదుపు, పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి సెక్షన్ 80 సీ ఆప్షన్లను ఉపయోగించాలి. పన్నులను కచ్చితంగా సమయానికి దాఖలు చేయాలి. -
ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు
పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం చాలా ముఖ్యం. ఈ వేసవి సేలవుల్లో తల్లిదండ్రులు విభిన్న వయసు కలిగిన పిల్లలు, యువతకు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా డబ్బుకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో మనీ మేనేజ్మెంట్ విషయాలపై బలమైన పునాది నిర్మిస్తే పొదుపు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలపై స్పష్టత ఏర్పడుతుంది. వయసు వారీగా పిల్లలకు ఎలా డబ్బు అంశాలు తెలియజేయాలో చూసేద్దాం.వయసు 3–5 ఏళ్లునాణేలు, కరెన్సీని గుర్తించడంపై అవగాహన కల్పించాలి. డబ్బు ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చని అర్థం చేయించేలా అవసరాలు, ఆ అవసరాల మధ్య తేడాను గుర్తించేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. కథలు చెప్పడం, ఆడించడం లేదా నాటకం రూపంలో దుకాణంలో వస్తువులను కొనుగోలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం.. వంటి వాటిని తెలియజేయాలి.వయసు 6–13పొదుపు చేయడం, ఖర్చు చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలు, ఖర్చు అధికమైతే కలిగే నష్టాలను చెప్పాలి. బేసిక్ బడ్జెటింగ్ సూత్రాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఎలా వస్తుందో చెబుతూ.. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పాలి. అందుకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వండి. దాంతో రెండు ప్రయోజనాలుంటాయి. డబ్బు సంపాదించేందుకు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఏదైనా అత్యవసర సమయాల్లో మనీ కావాలంటే మళ్లీ కష్టపడాల్సి వస్తుందనే భావనను తెలియజేయాలి. పొదుపుపై అవగాహన పెంచాలి. డబ్బును కిట్టీ బ్యాంకులో జమ చేయడం అలవాటు చేయాలి.టీనేజ్ (14+)క్రెడిట్, వడ్డీ, పెట్టుబడి, పన్నుల గురించి చర్చించాలి. బ్యాంక్ స్టేట్మెంట్ చదవడం లేదా యాప్లు, స్ప్రెడ్ షీట్లను ఉపయోగించి ఖర్చులను ట్రాక్ చేయడం ఎలాగో నేర్పించాలి.షాపింగ్ వెళ్తున్నారా..వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తాయి. పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు తల్లిదండ్రులతో షాపింగ్మాళ్లకు వెళ్తుంటారు. దుకాణాల వద్ద ధరలను గమనించాలి. డిస్కౌంట్లను చర్చించాలి. బ్రాండ్లలో ఉండే తేడాలు పరిశీలించాలి. లోకల్ షాపులోనూ అదే తరహా వస్తువులు లభిస్తాయి. కానీ రెండింటి మధ్య తేడాలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఇతర దేశాల వస్తువులపై ఏమేరకు పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ పన్నుల వల్ల కంపెనీలు, వినియోగదారులపై కలిగే ప్రభావాలను గమనించాలి.ఇదీ చదవండి: బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులుపిల్లలు బడ్జెట్ తయారు చేసుకోవాలి. బడ్జెట్ సమయంలో 50-30-20 నియమాన్ని పాటించాలి. అంటే నిత్యం అవసరాల కోసం చేసే తప్పనిసరి ఖర్చుకు మొత్త రాబడిలో 50 శాతం, కోరికల కోసం 30 శాతం, పొదుపునకు మరో 20 శాతం కేటాయించాలి. కుటుంబ బడ్జెట్ రాసేప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం కావాలి. -
బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులు
చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించిన కొద్ది నెలల్లోనే బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి ‘సర్.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైఫ్ టైమ్ ఫ్రీ.. మీ శాలరీ బేస్ చేసుకుని కార్డు ఇస్తున్నాం’ అని చెబుతుంటారు. డబ్బు అవసరం లేనివారికి ఈ కార్డు ఒక వనరుగా పనిచేస్తే.. మనీ నిత్యం అవసరం ఉండేవారికి మాత్రం ఇదో సంకటంగా మారతుందనే వాదనలున్నాయి. ఏదేమైనా క్రెడిట్ కార్డు వాడుతుంటే రివార్డ్ పాయింట్లు, క్యాష్బ్యాక్ రూపంలో ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఎలాంటి ప్లాయింట్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం.క్యాష్ బ్యాక్ & రివార్డు పాయింట్లుఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: ఆన్ లైన్ ఖర్చులపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ప్రైమ్ మెంబర్లకు 5% క్యాష్ బ్యాక్తో ఎలాంటి ఛార్జీలు లేకుండా లైఫ్టైమ్ ఫ్రీ కార్డు.హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు: షాపింగ్, డైనింగ్పై క్యాష్ పాయింట్స్ అందిస్తుంది.ట్రావెల్ & లాంజ్ యాక్సెస్ కార్డులుహెచ్డీఎఫ్సీ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్: అపరిమిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, అధిక రివార్డు పాయింట్లు అందిస్తుంది.యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు: అపరిమిత దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు.యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్: ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు పొందవచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!ప్రీమియం, లైఫ్స్టైట్ కార్డులుహెచ్డీఎఫ్సీ గోల్డ్ క్రెడిట్ కార్డు: ఎంపిక చేసిన బ్రాండ్లపై ఐదు రేట్లు రివార్డ్ పాయింట్లు అందిస్తుంది.అమెక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్: ప్రత్యేక ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ మెంబర్షిప్ పొందవచ్చు.