యువతకు సత్య నాదెళ్ల సూచన | Microsoft CEO Satya Nadella advice to succeed in the AI era youth finance | Sakshi
Sakshi News home page

యువతకు సత్య నాదెళ్ల సూచన

Jun 11 2025 3:00 PM | Updated on Jun 11 2025 3:12 PM

Microsoft CEO Satya Nadella advice to succeed in the AI era youth finance

కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు బేసిక్స్‌పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్‌ డెవలప్‌మెంట్‌కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్‌ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.

ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?

సుందర్‌ పిచాయ్ కూడా అదే బాటలో..

లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో గతంలో జరిగిన పాడ్‌కాస్ట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్‌ కోడింగ్‌ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement