breaking news
AI
-
3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే..
ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం, సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవంఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపుమూడో రోజు అసైన్మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.మానసికంగా తీవ్ర ప్రభావంఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.మళ్లీ ప్రయాణం ప్రారంభంఅయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్ఇన్లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.ఏడాదిలో భారీ మార్పుఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.నెటిజన్ల స్పందనలుమౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. -
ఏఐ, ఆటోమేషన్పై పట్టు పెంచుకోవాలి
న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్–బడ్జెట్ వెబినార్లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్లో పాల్గొన్నారు. -
ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!
ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.కైట్లిన్ కలినోవ్స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్వర్క్లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.కైలిన్ కలినోవ్స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!కలినోవ్స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది. -
ఏఐ వాడకం.. అప్పుడొచ్చింది ఒక సందేహం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్ఎండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు. -
ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం
సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్ ప్లాట్ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.డిజిటల్ డిమాండ్ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.2027 నాటికి ఏజెన్సీల విభజనభవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్వర్క్లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్ఫామ్ టూల్స్ను ఉపయోగించి క్లయింట్లకు సేవలను అందిస్తాయని చెప్పింది.వినియోగదారుల అలవాట్లుభారత్లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం -
‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే!
ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల ఆటలకు ఇక కాలం చెల్లింది! పేదల ఆరోగ్యం కోసం కేటాయించిన ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అస్త్రాన్ని ప్రయోగించింది. ఆయుష్మాన్ భారత్లో చోటుచేసుకుంటున్న కోట్లాది రూపాయల క్లెయిమ్ల మోసాలను ‘ఏఐ టెక్నాలజీ’ చిటికెలో కనిపెట్టేస్తోంది. ఆస్పత్రుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లు టైప్ చేసే శ్రమ లేకుండా.. వారు మాట్లాడితే చాలు డిజిటల్ రిపోర్టులు తయారయ్యే విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడికి అందాల్సిన వైద్యం మరింత వేగంగా, నిజాయితీగా అందేందుకు ఈ డిజిటల్ మేధస్సు తోడ్పాటునందిస్తోంది.నకిలీ క్లెయిమ్లపై ఏఐ ‘సర్జరీ’దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) నడుం బిగించింది. ‘నేషనల్ యాంటీ ఫ్రాడ్ యూనిట్’ (NAFU) ద్వారా రంగంలోకి దిగిన ఏఐ ఇంజిన్లు.. ఆస్పత్రులు పంపే ప్రతి క్లెయిమ్ను క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నాయి. అనవసరంగా రోగులను ఆస్పత్రులలో ఉంచుకోవడం, చికిత్స చేయకుండానే బిల్లులు వేయడం లాంటి మోసాలను ఈ వ్యవస్థ ఇట్టే పసిగడుతోంది. ఫలితంగా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగింది.గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్గతంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారానికి 15 నుండి 20 రోజుల సుదీర్ఘ సమయం పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని కేవలం రెండు గంటల్లోనే క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతోంది. క్లౌడ్ డేటాను సెకన్లలో విశ్లేషించే ఏఐ, నిబంధనల ప్రకారం ఉన్న బిల్లులను వెంటనే ఆమోదిస్తుంది. అనుమానాస్పదంగా ఉన్న కేసులను మాత్రమే మానవ పర్యవేక్షణకు పంపి తనిఖీ చేయిస్తారు. దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా అందుతున్నాయి.డాక్టర్ల మాటతో ప్రిస్క్రిప్షన్లు రెడీ!ప్రభుత్వ ఆస్పత్రులలో ఉండే రద్దీ వల్ల డాక్టర్లు కంప్యూటర్ ముందు కూర్చుని ప్రిస్క్రిప్షన్లు టైప్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారంగా ‘వాయిస్-టు-టెక్స్ట్’ (VTT) సాంకేతికతను ప్రవేశపెట్టారు. డాక్టర్ పేషెంట్ను పరీక్షిస్తూ, ఏవైతే సూచనలు చేస్తారో, ఆ మాటలను ఏఐ నేరుగా డిజిటల్ టెక్స్ట్గా మారుస్తుంది. డాక్టర్లు టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే, ప్రిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా తయారై, హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది.మెరుగైన చికిత్సకు మార్గంఈ ఏఐ టూల్స్ వల్ల వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం గణనీయంగా తగ్గనుంది. సాధారణంగా ఒక డాక్టర్ తన సమయాన్ని రిపోర్టులు రాయడానికే ఎక్కువ కేటాయించాల్సి వచ్చేది. అయితే వాయిస్-టు-టెక్స్ట్ విధానం వల్ల ఆ సమయం ఆదా అవుతుంది. ఫలితంగా డాక్టర్లు రోగుల సమస్యలను మరింత ఓపిగ్గా వినేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.డేటా భద్రతతో కూడిన ప్లాట్ఫామ్ఈ వినూత్న మార్పులను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన ‘ఈ-హాస్పిటల్’ ప్లాట్ఫామ్లో అనుసంధానించారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమాచారం అంతా భద్రంగా ఉండటమే కాకుండా, ఏ రాష్ట్రం నుంచైనా డేటాను విశ్లేషించే వీలుంటుంది. ఈ ఏడాది జనవరి 19 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు.వైద్య రంగంలో డిజిటల్ భవిష్యత్తుఇటీవలి ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ప్రదర్శించిన ఈ సాంకేతికతలు ఆరోగ్య రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. టెక్నాలజీ సాయంతో అక్రమాలను అరికట్టడమే కాకుండా, సామాన్యుడికి వేగవంతమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. మానవ తప్పిదాలకు తావులేకుండా, యంత్రాల సాయంతో సాగుతున్న ఈ డిజిటల్ హెల్త్ విప్లవం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించనున్నదనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: రాజ్యసభ బరిలో నితీష్ తనయుడు నిశాంత్? -
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది. -
ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు
ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్స్పీడ్ వెంచర్స్ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడళ్లు, హార్డ్వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది. దిగ్గజాలు ఇలా..ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 110 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2035కల్లా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్ కేటలిస్ట్ ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు కమిట్మెంట్ను ప్రకటించింది. ఈ బాటలో లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్తగా ఇండియా– యూఎస్ సబ్సీ కేబుల్ మార్గంసహా.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్ కంప్యూట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొందరికి శాపంగా మారుతోంది. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్కు కారణం ఇదే.. -
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026 -
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026 -
చేయాల్సింది చాలా ఉంది!
ప్రపంచ ఏఐ యవనికపై శక్తిమంత మైన పాత్ర వహించగల దేశంగా భారతదేశాన్ని రూపు కట్టించడంలో ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్, దానికి సంబంధించి న్యూఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సఫలమై ఉండాల్సింది. కానీ, దేశంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్–డి), నవీ కరణలో వైఫల్యాలకు అది అద్దం పట్టింది. గల్గోటియాస్ అనే ప్రైవేటు విశ్వవిద్యాలయం చైనా నుంచి రోబో డాగ్ను దిగుమతి చేసుకుని, ఏఐ నవీకరణ కేంద్రంగా తనను తాను చాటుకోవాలని ఉబలాటపడటం ఒక ప్రహసనంగా మారింది. దేశ విదేశాల్లో పత్రికలకెక్కి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ ఉదంతం గత కొన్నేళ్లుగా పరిశోధన రంగాల్లో క్షీణిస్తున్న ప్రమాణాలకు పరాకాష్ఠగా నిలిచింది.నిధుల లేమి‘ఆర్–డి’పై భారతదేశ స్థూల వ్యయం, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో కనాకష్టంగా 0.64 శాతంగా ఉంది. అమెరికా (3.48), చైనా(2.43)లతో పోల్చితే ఇది చాలా తక్కువ. పరిశోధ నకు ప్రస్తుతం తరలిస్తున్న నిధులలో చాలా భాగం జాతీయ లాబొరేటరీలు, ఐఐటీల వంటి అగ్రశ్రేణి సంస్థలకు వెళుతు న్నాయి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలు చాలా వెనుకబడి పోయాయి. ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’, ‘రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్’ వంటి నూతన పథకాల ప్రభావం ఇంకా కనపడవలసి ఉంది. ఏఐ, దాని అనుబంధ రంగాలకు చెందిన పేటెంట్లకు దరఖాస్తు చేయడంలో, పరిశోధన పత్రాల సమర్పణలో చైనా చాలా ముందుంది. బోధనా ప్రమాణాలు, పరిశోధనల ఫలితా లపై భారత్ దృష్టి పెట్టడం లేదు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య పొత్తును కూడా సరిగ్గా ఏర్పరచలేకపోతున్నాం. ఫలితంగా, విషయ చౌర్యం, నకిలీ పరిశోధనలు, కుహనా సైన్స్ను ప్రోత్సహించడం, సమర్పించిన పత్రాలను వెనక్కి తీసుకోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహా ఓహో అంటూ ఆకా శానికెత్తేయడం, స్టార్టప్లకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన సంస్థలు గొప్ప వాగ్దానాలు చేస్తున్నాయి; లేదా గల్గోటియాస్లాగా నకిలీ గొప్పలకు పోతున్నాయి.సోషలిస్టు ఏఐ పంథాశాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఆంత్రోపిక్ సంస్థ ఏఐ టూల్స్కు సంబంధించి ఇటీవల క్లాడ్ ఓపస్ సిరీస్ విడుదల చేయడం ద్వారా టెక్నాలజీ మార్కెట్లలో కలకలం సృష్టించింది. దాని ప్రకంపనలు స్టాక్ మార్కెట్లలోనూ నమోదయ్యాయి. ఆ టూల్స్ జటిలమైన ఆర్థిక విశ్లేషణకు, లాంగ్–ఫారమ్ కోడింగ్కు ఉపయోగపడతాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ ఆవిష్కరణకు భయపడి సంప్రదాయ సిద్ధమైన సాఫ్ట్వేర్, లీగల్–టెక్ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్మేశారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ సేవల రంగాన్ని కూడా ఏఐ ఏజెంట్లు అతలాకుతలం చేస్తాయే మోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని అతి పెద్ద ఔట్ సోర్సింగ్ సంస్థలకు కూడాఆంత్రోపిక్ ఏఐ ఏజెంట్లను విక్రయిస్తోంది. అవి పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు దారితీయవచ్చు. కొన్ని భౌగోళిక ప్రాంతాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే ఏఐకేంద్రీకృతమవుతోందని పసిగట్టిన భారత్ ‘ఏఐ ప్రజాస్వామికీక రణ’కు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో సాగుతున్న అంతర్జా తీయ పోటీలో తన స్థానాన్ని చాటుకునేందుకు ఢిల్లీ సదస్సు ద్వారా భారత్ ఒక ప్రయత్నం చేసింది. విద్య, ఆరోగ్యం, పరిపా లన, వస్తూత్పత్తి, వ్యవసాయం వంటి భిన్నమైన రంగాలలో కూడా ఏఐ సేవలను వినియోగించుకునేటట్లు చేయాలన్నది ఈ సమ్మిట్ వెనుక ఉన్న భావన. పాశ్చాత్య దేశాల్లో ఏఐలో ప్రైవేటు పెట్టుబడులు ముందున్నాయి. కానీ, భారత్ సోషలిస్టు పంథాను ఎంచుకుంది. మన దేశంలో ఏఐ అభివృద్ధికి ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. భారత్ జెన్ వంటి వాటిలోనూ ప్రభుత్వ పెట్టుబడులున్నాయి. చాట్ జీపీటీ వంటి కమర్షియల్ మోడళ్లను కాకుండా ‘సావరిన్’ ఏఐ మోడళ్ళను భారత్ అభివృద్ధి చేస్తోంది. బహుళ భాషా, బహుళ సాంస్కృతిక పర్యావరణాలకు అనువైన కొత్త మోడళ్ళను అభివృద్ధి చేస్తోంది. వాటిని ప్రజా శ్రేయస్సుకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎన్నో రకాల సవాళ్లుఅయితే, దార్శనికతను వాస్తవికతగా మార్చడం పైకి కనిపి స్తున్న దానికన్నా ఎక్కువ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన నిపుణులైన సిబ్బంది కొరత అన్నింటి కన్నా పెద్ద సవాల్. దేశంలో ఐటీ సేవల రంగంలో సుమారు 60 లక్షలమంది పనిచేస్తున్నారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్తో చాలా మంది ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. మిగిలినవారికి మళ్ళీ తర్ఫీదు నివ్వడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం చేయాలి. అయితే, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు, అప్లికేషన్లు, భద్రత, నియంత్రణ పార్శా్వలకు సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా అవసరమవుతారు. వాస్తవిక పరిస్థితులు ఇలా ఉంటే, గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు ఏఐ ఇంజినీర్లను సరఫరా చేసే దేశంగా భారత్ అవతరిస్తుందని విధాన నిర్ణేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐటీ సేవల విషయంలో కూడా 1990లలో మనం ఇదే రకమైన తప్పు చేశాం. ఫలితంగా, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో భారత్ వెనుకబడింది. ఏఐ విషయంలో మనం అదే బాట పట్టకూడదు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను డెవలప్ చేసి, తర్ఫీదు నిచ్చేందుకు అత్యుత్తమ శ్రేణి హార్డ్వేర్ అవసరం. ఆ కొరత మరో సవాల్. సావరిన్ ఏఐ మోడల్ను అభివృద్ధి చేసేందుకు ఏఐ మిషన్ జీపీయు క్లస్టర్ ఏర్పాటుపై అహరహం శ్రమిస్తోంది.కానీ, హార్డ్వేర్ వెల అధికంగా ఉండటం, గ్లోబల్ సప్లై చైన్లో జాప్యాలు గణనీయమైన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. వాటిపై చైనా దాదాపు 98 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అలాంటిది మనం 2029 వరకు ఐదేళ్ళ కాలంలో 1.25 బిలియన్ డాలర్లను మాత్రమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. బలమైన, సుస్థిరమైన ఏఐ మౌలిక వసతులను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. కొత్త విధులకు తగ్గట్లుగా ఇపుడున్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించాలి. భారత విధాన నిర్ణేతలు దానికి బదులు, ప్రైవేట్ క్లౌడ్ల రూపంలో క్యాప్టివ్ జీపీయు మౌలిక వసతులను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రైవేటు క్లౌడ్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఇది మరో రకమైన ఔట్ సోర్సింగ్ కిందకు వస్తుంది. ఇది మరింత హానికరమైనది. భారీ డేటా సంస్థలు విద్యుత్తును, నీటిని పెద్ద మొత్తాలలో మింగేస్తాయి. పర్యావర ణాన్ని కూడా పణంగా పెట్టి ట్యాక్స్ హాలిడేల రూపంలో వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. పరిశోధన, నవీకరణను ప్రోత్సహించడంపై ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉంటే, అది ప్రాథమికాంశాలను విస్మరించ కూడదు. మౌలిక, అనువర్తిత ఆర్–డి రెండింటికీ మద్దతు ఇవ్వాలి. విద్యా, నాణ్యతా పరామితులను అమలుపరచాలి. మన విధాన నిర్ణేతలు, మంత్రులు డంబాలకు స్వస్తి చెప్పాలి. ఏఐవంటి నూతన రంగాలు సామాజికంగా కూడా తీవ్ర పర్యవసా నాలకు దారితీసేవిగా ఉన్నాయి కనుక కూలంకషమైన చర్చ అవసరం. పరిశోధన, నవీకరణపై గొప్పలు చెప్పుకోవడం ఆపా లని గాల్గోటియాస్ ఉదంతం గుర్తు చేస్తోంది. -వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మసదస్సుతో ఏం సాధించామంటే...20 దేశాల అధినేతలు, 59 మంది మంత్రులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, దాదాపు 2.5 లక్షల మంది అతిథులతో ఢిల్లీలో ఐదు రోజులపాటు నిర్వహించిన ఏఐ సదస్సు కీలకమైనముందడుగుగా చెప్పాలి. ఫ్యాక్టరీలు, హెల్త్ కేర్ రంగంలో ఉన్న రోబోలు, వ్యాపార రంగంలో ఉన్న డ్రోన్లు, ప్రజలకు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వేరబుల్ డివైసెస్ను ఇక్కడ ప్రద ర్శించారు. 300కు పైగా ఎంపిక చేసిన పెవిలియన్లు, 600 స్టార్టప్లు ఇందులో భాగస్వామ్యం వహించాయి.బెంగళూరు ఆధారిత స్టార్టప్ ‘సర్వం’ ఏఐ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విదేశీ టెక్ కంపెనీలకు సవాలు విసిరేలా తన ప్రత్యే కతను చాటుకుంది. విప్రో సంస్థ ఏఐ ఆధారిత మెడికల్ రోబోను ప్రదర్శించింది. క్వాల్కం ఓపెన్ ఏఐ రోబో పారిశ్రామిక రక్షణ సామర్థ్యాన్ని చాటింది.ఏఐ ఎకో సిస్టంలో చిప్పులు, డేటా సెంటర్లు, సర్వర్లు, ఎనర్జీ మోడళ్ళు, అప్లికే షన్లు అత్యంత ప్రధానమైనవి. ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలంటే మనం వాటిని సొంతంగా నిర్వహించు కునే శక్తిని సంపాదించుకోవలసి ఉంటుంది. ఇందుకు చాలా దూరం ప్రయాణించాలి. ఇప్పుడు అమెరికా నేతృత్వంలోని పార్క్ సిలికా టెక్ కూటమిలో భారత్ చేరింది. దీనివల్ల సెమీ కండక్టర్లు, ఏఐ టెక్నాలజీ, కీలక ఖనిజాల సప్లై చైన్లు, భారత్కు రక్షణ ప్రాధా న్యం లభిస్తాయి.వివిధ దేశాలతో జట్టు కట్టి...ఆఫ్రికాలో ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ డానికి భారత్, ఇటలీ, కెన్యా మధ్య త్రైపాక్షిక కూటమి ఏర్పడింది. ఐరోపా, ఇండో– పసిఫిక్ దేశాల మధ్య భారత్ను ఒక సాంకేతిక వారధిగా నిలపటం ఇటలీ లక్ష్యం. అలాగే ఏఐ భద్రత, ఆన్లైన్ సేఫ్టీ అంశాల పైన భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న సైన్స్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ సహకారం మరింత బలపడుతుంది. పాలన, రక్షణ రంగాల్లో ఏఐ వినియోగంపై భారత్తో కలిసి ఫ్రాన్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది సదస్సులో ఫ్రాన్స్ క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ సేవలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై భారత్తో బ్రెజిల్ తన అనుభవాలను పంచుకుంది. ఇలా వివిధ దేశాలు భారత్తో తమ సంబంధాలను మెరుగు పరచుకోవ డానికి ముందుకు రావడం శుభ పరిణామం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్,స్కిల్లింగ్ కోసం ఇండియాలో 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రకటించింది. ఇది ఆసియాలోనే ఆ సంస్థకు అతి పెద్ద పెట్టుబడి. ఏఐ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ‘భారత్ జెన్’ పేరుతో మల్టీ మోడల్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ప్రారంభించింది. భార తీయ భాషలు, సంస్కృతికి అనుగుణంగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయటం ప్రధాన ఉద్దేశం. దేశంలోని 22 అధికార భాషల్లో ఏఐ మోడల్స్ రూపొందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. భారత్... గ్లోబల్ సౌత్లో మొట్టమొదటి సారిగా, అంతర్జా తీయంగా 4వ సదస్సు నిర్వహణ ద్వారా కొంత ప్రగతిని సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
ట్రంప్ vs ఒబామా: AI చెప్పిన జాతకం.. అమెరికాకి పట్టిన గ్రహణం!
హాయ్ ఫ్రెండ్స్... లోకంలో వింతలు విశేషాలు అయిపోయాయి, ఇప్పుడు విడ్డూరాలు మొదలయ్యాయి. అసలే అమెరికా ఎన్నికలు అంటేనే ఒక పెద్ద జాతర. అక్కడ ఎవరు గెలిచినా మనకేంటి అనుకుంటాం కానీ, అక్కడ తుమ్మితే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ ముక్కు తుడుచుకోవాలి. అయితే తాజాగా మన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గారికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. "ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా తలపడితే ఎవరు గెలుస్తారు?" అని ఎవరో అడిగితే, మన AI గారు కూర్చుని లెక్కలు కట్టేసి ఒక రిజల్ట్ ఇచ్చేసారు. అంటే.. ప్రస్తుతం ఉన్న బైడెన్ గారిని సైడ్ చేసేసి, రిటైర్ అయిపోయిన ఒబామా గారిని మళ్ళీ గోదాలోకి లాగారన్నమాట. ఇది ఎలా ఉందంటే.. రిటైర్ అయిపోయిన సచిన్ టెండూల్కర్ ని పిలిచి, ఇప్పుడున్న బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు కొట్టమన్నట్టు ఉంది!సరే AI విశ్లేషణ ప్రకారం.. ట్రంప్ గారి బలం ఆయన 'బేస్'. అంటే ఆయన ఏం మాట్లాడినా, అది అబద్ధమా, నిజమా అని చూడకుండా జేజేలు కొట్టే ఒక బ్యాచ్. ట్రంప్ మామ స్టైలే వేరు.. "అమెరికా ఫస్ట్" అంటారు, కానీ ఆయన కోపం వస్తే "ట్విట్టర్ ఫస్ట్" అంటారు .ఇక ఒబామా గారి విషయానికి వస్తే.. ఆయన స్పీచ్ ఇస్తుంటే అమెరికా కాదు కదా, పక్కన ఉన్న కెనడా వాళ్ళు కూడా మైమరచిపోతారు. ఆయనకి 'యూత్' లో క్రేజ్ ఎక్కువని AI చెబుతోంది. కానీ పాపం AI కి ఒక విషయం తెలియదు.. ఒబామా గారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ, నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీలు తీసుకుంటూ చిల్ అవుతున్నారు. ఆయన్ని మళ్ళీ వైట్ హౌస్ పిలిచి.. ఆ ఫైళ్లు, ఆ గొడవలు చూడమంటే ఆయన ఒప్పుకుంటారా? ఇంకా AI ఏం చెబుతుందంటే, "ఎకానమీ" విషయంలో ట్రంప్ వైపు మొగ్గు ఉందట. అంటే వ్యాపారవేత్త కదా, పైసల లెక్కలు బాగా తెలుసని AI ఫీలింగ్. కానీ అదే AI "సోషల్ హార్మనీ" (సామాజిక సామరస్యం) విషయంలో ఒబామాకి ఓటు వేసింది. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కావాలంటే ట్రంప్ ని నమ్ముకోండి, ప్రశాంతత కావాలంటే ఒబామాని నమ్ముకోండి అని! కానీ అమెరికా జనాలకి రెండు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు "మాకు ఆ ఇద్దరూ వద్దు.. మాకు కనీసం సరిగ్గా నడవగలిగే, పేర్లు గుర్తుపెట్టుకునే అభ్యర్థి ఉంటే చాలు" అని మొత్తుకుంటున్నారు.ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ పోటీ పడితే సోషల్ మీడియా ఎలా ఉంటుందో ఊహించండి! ట్రంప్ గారు ఒబామాని "స్లీపీ బరాక్" అనో లేక ఇంకేదో వింత పేరు పెట్టి పిలుస్తారు. ఒబామా గారు తనదైన శైలిలో ఒక పెద్ద ఇంగ్లీష్ డిక్షనరీ తిరగేసి కౌంటర్లు ఇస్తారు.మధ్యలో ఎలాన్ మస్క్ వచ్చి.. "నేను ఎవరికీ ఓటు వేయను, నేను అంగారక గ్రహానికి వెళ్ళిపోతున్నా" అని ట్వీట్ చేస్తారు. AI కి ఉన్న ఒకే ఒక సౌలభ్యం ఏంటంటే.. అది మనుషుల ఎమోషన్స్ ని లెక్కించదు. కేవలం డేటా చూస్తుంది. కానీ అమెరికా ఎన్నికల్లో డేటా కంటే 'డ్రామా' ఎక్కువ పని చేస్తుంది. ఆ విషయం పాపం ఆ AI కి ఎవరు చెప్తారు?ఈ కథనంలో అందరూ మర్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు.. ఆయనే జో బైడెన్! పాపం, ఆయన మాజీ ప్రెసిడెంట్. కానీ AI మాత్రం ఆయన పేరు కూడా ఎత్తకుండా ఒబామాని తెచ్చి కూర్చోబెట్టింది. ఇది ఎలా ఉందంటే.. ఇంట్లో పెళ్లి కొడుకు రెడీగా ఉంటే, పాత పెళ్లి కొడుకు ఫోటో చూసి "ఈయనైతే బాగుండు" అని మురిసిపోయినట్టు ఉంది.AI ప్రిడిక్షన్ ప్రకారం.. ఈ ఊహాజనిత పోరులో ఒబామాకి కొంచెం ఎడ్జ్ ఉందట. ఎందుకంటే ఆయనకి నెగటివ్ రేటింగ్ తక్కువంట. ట్రంప్ గారికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, "ఈయన వద్దు బాబోయ్" అనే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో, ఫైనల్ గా తేలిందేంటంటే.. AI దృష్టిలో పాత కాలపు యుద్ధాలే బాగున్నాయి. ఉన్న వాళ్ళతో ఎలాగో వేగలేకపోతున్నాం, పోనీ లేని వాళ్ళని తెచ్చుకుందాం అనే రేంజ్ కి అమెరికా పాలిటిక్స్ వెళ్ళిపోయాయి. అసలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే.. ఈ AI చేసే విశ్లేషణలు మాత్రం మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మరి మీరేమంటారు? ట్రంప్ కావాలా? ఒబామా కావాలా? లేక మన ఊరి సర్పంచ్ నయమా? కామెంట్ చేయండి! -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు. -
‘అది ఇన్వెస్టర్ల ఓవర్ రియాక్షన్’
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) భయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తడమనేది ఇన్వెస్టర్ల ’ఓవర్రియాక్షన్’ అని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి వ్యాఖ్యానించారు. తమ సంస్థ విషయానికొస్తే ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకునేందుకు ఏఐని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.గతంలో ఉన్న సాధనాలతో తయారీ, సరఫరా వ్యవస్థ మొదలైన విభాగాల్లో పరిష్కరించలేకపోయిన సమస్యలను కూడా ప్రస్తుత సాంకేతికతతో పరిష్కరించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తుల విభాగానికి సంబంధించి పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలను మదింపు చేసేందుకు గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులను టెక్నాలజీతో అధ్యయనం చేస్తున్నట్లు పురి చెప్పారు.వ్యాపార ప్రణాళికల విషయానికొస్తే మధ్యకాలికంగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. గతంలోలాగానే ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని వివరించారు. -
ఏఐ మార్కెటింగ్ గిమ్మిక్స్తో జాగ్రత్త!
ఏఐ వినియోగించడం ద్వారా అనూహ్య లాభాలు పేరిట తెరతీసే మార్కెటింగ్ గిమ్మిక్స్పట్ల జాగ్రత్త వహించవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్టైమ్ డైరెక్టర్ అమర్జీత్ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్లపట్ల ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ రిటర్నులు ఆర్జించవచ్చంటూ మార్కెట్ పార్టిసిపెంట్లు కొంతమంది అతిచేయడాన్ని ఈ సందర్భంగా సింగ్ ప్రస్తావించారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, ఐఐఎంకే సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్లో సింగ్ పలు విషయాలను పేర్కొన్నారు.ఏఐ వినియోగించడం ద్వారా సాధించిన అంశాలను కంపెనీలు అర్ధవంత విధానంలో తెలియజేయవలసి ఉంటుందని సూచించారు. అతిగా ఆర్జించినట్లు లేదా కొన్ని రకాల క్లెయిముల ప్రకటనలు ఇన్వెస్టర్లను మార్కెట్లపట్ల తప్పుదోవపట్టించడంతోపాటు.. విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశమున్నట్లు హెచ్చరించారు. నిజానికి విద్య, పరిశోధన, సమాచారం తదితరాలకు ఏఐ శక్తివంతమైన టూల్ అని పేర్కొన్నారు. అయితే ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తికీ వీలున్నదని, వీటిపట్ల అప్రమత్తత అవసరమని తెలియజేశారు. -
ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI
-
ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్ సీ) వేసే కేబుల్ నెట్వర్క్ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.సబ్మెరీన్ కేబుల్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్ సీ కేబుల్, డిజిటల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు డిజిటల్ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. దేశీయంగా డిజిటల్ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు. -
ఇకపై రూ. 1000 కోట్లు అక్కర్లేదు.. రాజమౌళితో పోలుస్తూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
రామ్గోపాల్ వర్మ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ . తాజాగా ఆయన 'సీడెన్స్ 2.0'( Seedance 2.0) అనే ఏఐ(AI) టూల్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగాన్ని ఏఐ ఏ విధంగా 'ఖూనీ' చేయబోతోందో, అదే సమయంలో సామాన్యుడికి ఏ విధంగా ముక్తి ప్రసాదించబోతోందో ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.టెక్నాలజీ మారుతున్న కొద్దీ సినిమా మేకింగ్ విధానం మారుతుందని అందరికీ తెలుసు, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా సినిమా ఇండస్ట్రీ మరణం గురించి జోస్యం చెప్పారు. 'సీడెన్స్ 2.0' వంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ రాకతో, కోట్లాది రూపాయల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో కూడిన ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ 'బ్రూటల్ మర్డర్' కాబోతోందని ఆయన ట్వీట్ చేశాడు.అత్యంత ఖరీదైన సినిమాలు తీసి, అత్యంత విజయవంతమై సినిమాలు తీయడం వల్ల రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు. రూ. 1000 కోట్లు కాదు అంతకంటే ఎక్కువ రాబట్టగలడనే ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. ఇదంతా ఆయనకు ఉన్న అసమానమైన క్రియేటివ్ ఊహాశక్తి వల్లే సాధ్యం అయింది. కానీ ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో, ఎంతమంది రాజమౌళిలు లేదా ఆయన కంటే మెరుగైనవాళ్లు చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు? క్రియేటివ్ విజన్ ఉన్నవాళ్లు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్సెస్ లేనివాళ్లు, డబ్బులు లేనివాళ్లు... వాళ్లకు అవకాశం తలుపు మూసేసి, కీలు కొందరి దగ్గరే ఉంది. కానీ సీడెన్స్ 2.O ఆ తలుపులను తన్ని పారేసింది. ఇక టాలెంట్ ఉంటే చాలు, అవకాశం కోసం ముంబై రానక్కర్లేదు. ఇది కేవలం వాళ్ల డిస్క్రిప్టివ్ ప్రాంప్ట్లు తీసుకొని, సినిమాటిక్గా, మల్టీ-షాట్లతో, సౌండ్ డిజైన్తో, వందల కోట్ల ఖర్చుతో, నెలలు పట్టే సీన్లను క్రియేట్ చేస్తుంది. ఇకపై నటులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, లైట్ బాయ్స్.. ఇలా భారీ సైన్యం అవసరం లేకుండానే థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు వస్తాయి.స్టార్ ఇష్యూస్ లేవు . బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్లు భయపడాల్సిన అవసరం లేదు ."పోస్ట్లో ఫిక్స్ చేద్దాం" అనే పని లేదు. ఒక షాట్ కోసం 300 మంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకరు. ఒక ప్రాంప్ట్. ఒక మైండ్. అడ్వాన్స్డ్ AIలు ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు తయారు చేయగలిగినప్పుడు... యూనియన్లు, కోట్ల ఓవర్హెడ్స్, "మాకే సినిమాలు తీయడం తెలుసు" అనే అహంకారం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మరణిస్తుంది. నెమ్మదిగా కాదు. శాంతియుతంగా కాదు. బ్రూటల్గా మర్డర్ అవుతుంది. కానీ దాని హార్ట్లో... ఇది సినిమాకు నిజమైన లిబరేషన్. డైనోసార్లు 100 ఏళ్లు రాజ్యం చేశాయి. ఇప్పుడు ఆస్టరాయిడ్ వచ్చేసింది. దాని పేరు AI. కొత్త ఎరాకు స్వాగతం. ఇక్కడ టాలెంట్ మాత్రమే ముఖ్యం, యాక్సెస్ కాదు. అదే చంపేస్తుంది. అదే రక్షిస్తుంది. ఇక వెనక్కి తిరిగి రానిది. కాబట్టి ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మరణమా? లేక ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క అల్టిమేట్ డెమోక్రటైజేషనా?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు. SEEDANCE 2.0 , the MURDERER of FILM INDUSTRY Leaving aside its copyright infringements etc which is another matter , here’s my take on Seedance 2.0 @ssrajsmouli is the no. 1 director because he makes the most expensive films and the most successful ..People fund him a 1000…— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2026 -
ఏఐతో ముప్పేమీ లేదు
కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు.పదే పదే పునరావృతమయ్యే కోడింగ్ పనులను మాత్రమే ఏఐ టేకోవర్ చేయొచ్చని, దీనితో ప్రోడక్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, భద్రత మొదలైన వాటిపై ఫోకస్ చేసేందుకు డెవలపర్లకు వీలు చిక్కుతుందని స్మిత్ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించడం కాకుండా వాటిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఏఐ సహాయపడుతుందని చెప్పారు. దీనితో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, వేతనాలు కూడా పెరుగుతాయని స్మిత్ వివరించారు.ప్రజల సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడే టెక్నాలజీని, మెషిన్లను తయారు చేయడమే మైక్రోసాఫ్ట్ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు. సాంకేతికత అనేది ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉంటూనే అత్యంత నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు దోహదపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత -
ముత్యాలూ సజ్జలూ
అమ్మ పాలేరుకు అన్నం పెడుతుంది. కూర పెడుతుంది. అంత పచ్చడి కూడా! తిన్నంత తింటే విసుక్కోకుండా పెడుతుంది. కాని మజ్జిగ మాత్రం పోయదు. అప్పుడే హైస్కూ లుకు వచ్చిన కొడుకు ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు’ అంటే జవాబు చెప్పదు. పాలేరు ఇంట్లోకి రాకూడదు. బయటే కూచోవాలి. తినాలి. వెళ్లిపోవాలి – మజ్జిగ ముఖం చూడకుండా! ఇంట్లో కుండ నిండా మజ్జిగే! అమ్మ ఇరుగూ పొరుగుకు ఇస్తుంది. ఎండనబడి వచ్చిన వాళ్లకు ఇస్తుంది. పాలేరుకు తప్ప. అప్పటికి పాలేరు కులం ఏమిటో మూలం ఏమిటో కొడుకుకు తెలియదు. ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు?’... ‘పోయకూడదు నాయనా... పోస్తే వెన్నలో పురుగులు పడతాయి’. పాలేరుకు మజ్జిగ పోస్తే వెన్నలో పురుగులు పడతాయా? చూద్దాం అని అమ్మ లేనప్పుడు పాలేరు బెదిరిపోతున్నా కొడుకు అతని కంచెంలో మజ్జిగ వొంపేశాడు. మరికొన్ని రోజులకు అమ్మ వెన్న కాచి నెయ్యి చేస్తోంది. కొడుకు తొంగి తొంగి చూస్తున్నాడు. ’ఏమిట్రా?’... ‘పురుగులేమైనా పట్టా యేమోనని’... పకపకా నవ్వాడు.ఒక పిల్లాడిది అడవి దాపు పల్లె. స్కూలుకు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. రెండు చేతులు, రెండు కాళ్లు... పుస్తకాలున్నాయా... లేవు... నోట్బుక్కులు... అయ్యబాబోయ్. అయ్యవారు దయదలిచి పాతవేవో సంపాదించి ఇస్తారు. నోట్ బుక్కులు మాత్రం కొనుక్కోవాల్సిందే! పిల్లాడి దగ్గర అడవి ఉంది తప్ప డబ్బులు లేవు. ప్రతి సంవత్సరం బడి తెరిచాక నోటు బుక్కుల కోసం ఆ పిల్లాడు ఒకటే పని చేస్తాడు. రోజూ అడవికి వెళ్లి రేగుపండ్లు కోసి సంచీ నిండా వేసుకొని వస్తాడు. స్కూల్లో ఆ రేగు పండ్లకు మారుబేరం పెడతాడు. గుప్పెడు రేగుపండ్లు ఇస్తే పిల్లలు తమ నోటు బుక్కులో సెంటర్ పిన్ను దగ్గర ఒక టావు తీసి ఇవ్వాలి. రేగుపండ్లు ఖాళీ అయ్యే కొద్దీ టావులు పోగవుతాయి. ఇంకేమిటి? రేగుపండ్ల నోట్బుక్ తయార్!కానుకలు అందరూ ఇస్తారు. పుచ్చుకుంటారు. కాని కొన్ని కానుకలు జీవితాంతం వెంటాడుతాయి. ఆ టీచరు పాఠాలు చెప్తుంటే ఒక ముసలామె మనవణ్ణి చేత్తో పట్టుకుని వచ్చి బడిలో వదిలింది. ‘ఈ ముసలి ప్రాణం తప్ప వీడికి ఎవరూ లేరు టీచరమ్మా! నాలుగు అక్షరాలు నేర్పించు’... ఆ టీచరు పిల్లాడిని దగ్గరగా పొదువుకుంది. తల నిమిరింది. పాఠాలు ఏం చెప్పిందో కాని తన బాక్స్లోని నాలుగు మెతుకులు పెట్టింది. ఆకు కూరలమ్మే ముసలామె తన మనవడికి టీచరమ్మ దొరికినందుకు ఎంతో సంతోషపడింది. మనవడు మాత్రం సిగ్గుతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అప్పుడు ‘టీచర్స్ డే’ వచ్చింది. స్కూల్లో అందరూ టీచరమ్మకు గ్రీటింగ్ కార్డులు, ఆపిల్స్, గులాబీ పూలు ఇస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక ఆ పిల్లాడు ఒక్కడే మిగిలాడు. ఏదో కానుక తెచ్చినట్టే ఉన్నాడు. ‘ఏంట్రా అది?.. ఇవ్వు’... చాలా బిడియపడుతూ వీపు వెనుక ఉన్న చేతిని ముందుకు సాచాడు. ఆకుకూర! వాడి చిట్టిచేతిలో జీవస్పందన వంటి పచ్చటి ఆకుకూర గుచ్ఛం!జీవితాల్లో గాలికిపోయే ఊకలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి. కొన్ని ఇలా స్వాతిచినుకుల్లా రాలి, కుదురును కదిలించి, ముత్యాలుగా మారతాయి. వాటిని సాహిత్యంగా చేసినప్పుడు మిలమిలమని మెరుస్తూ వేల చేతులు మారి అదే అనుభూతితో తాకుతాయి. ‘నేను రాసింది ఏ.ఐ.కి ఫీడ్ చేస్తాను. అది వెంటనే అర్థం చేసుకొని విడమ ర్చిందంటే రాసింది సాహిత్యం కాదని చించేస్తాను’ అన్నాడు రచయిత గురుచరణ్దాస్. సరళరేఖలు, తెలిసిన గీతలు టక్కున తెలిసిపోతాయి. ఏ.ఐ.కి చిటికెలో పని. కాని సాహిత్యం సరళం కాదు... ఉపరితలమూ కాదు. అది స్పందనల పరావర్తనలు పడే పెరడు. భావోద్వేగాలు నర్తించే ఎరీనా. తుది ఘట్టాన సాక్షాత్కారాలను ఒసగే యుద్ధ క్షేత్రం. సాహిత్యం మనిషికొక అర్థం... మనసుకొక తాత్పర్యం. అంతేతప్ప ఏ.ఐ. చెప్పే మూసకట్టు చిలకజోస్యం కాదు.రాసినదంతా ఏ.ఐ. దగ్గర ఉంది! రాయవలసినదంతా మనిషి వద్ద ఉంది!! మనిషి రాయకపోతే ఏం చేసినాగాని ఏ.ఐ. పైన చెప్పిన మూడు ఘటనలను సృష్టించలేదు. అవి మనిషికే తెలుసు. మనిషి చెయ్యే వాటిని రాయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ.ఐ. మీద చర్చ జరుగుతోంది. రచన, ప్రచురణల్లో ఏ.ఐ. పాత్ర ఏమిటనేది శోధనగా ఉంది. ఏ సాంకేతికతైనా సృజనకు సాయం మాత్రమే! అదే సృజన కాబోదు. రచయితలు జీవన పేటికల మీటలు నొక్కినంత కాలం ముత్యాలకు కొదవలేదు. సజ్జలతో సరిపెడదామను కుంటే ఏ.ఐ. ఉంది పదండి!! -
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.సింగపూర్లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు. -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
ఏఐ సమ్మిట్: దుమారం రేపుతున్న అర్ధనగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్’ వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ నిరసనల వెనుక అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసేందుకు భారీ కుట్ర ఉందని పోలీసులు ఆరోపించారు.శుక్రవారం ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు ఉన్న టీ-షర్టులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ఐవైసీ (ఐవైసీ) నేతలను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నిరసన కార్యక్రమం నేపాల్లో గతంలో జరిగిన ఒక భారీ ఆందోళనను పోలి ఉందని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని పోలీసులు కోర్టుకు వివరించారు. భారత్ మండపంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమయంలో ఇటువంటి నిరసన చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై మసకబార్చేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.ఈ నిరసనల వెనుక ఉన్న కారణాలను వెలికితీసేందుకు తమకు ఐదు రోజుల రిమాండ్ కావాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల తరపు న్యాయవాది పోలీసుల వాదనలను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన కోర్టులో వాదించారు. ‘ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు నిందితులకు ఉంది. ఈ ఆందోళన శాంతియుతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి హింస జరిగినట్లు వీడియో ఆధారాలు లేవని న్యాయవాది పేర్కొన్నారు. నిందితులను పోలీసులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది వాదించారు.ఇది కూడా చదవండి: కెనడా కాల్పులు: పసిగట్టిన ఏఐ.. ఆగని మారణకాండ -
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్–5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గుర్తుతెలియని ఆకతాయి చేష్టలకు జిల్లా ప్రజలు శుక్రవారం భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీని వినియోగించుకొని పెట్రోల్బంక్లోకి పులి వచ్చినట్లు ఏఐ ఫొటో క్రియేట్ చేసి సోషల్మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. శుక్రవారం జిల్లాలో ఇద్దరు కలిస్తే చాలు ఈ విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లోని భారత్ పెట్రోల్ బంకులోకి పులి వచ్చినట్లు ఫొటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. దీనిపై ఎస్సై ఉపేంద్రచారి మాట్లాడుతూ పద్మనగర్కు చెందిన కొందరు యువకులు ఈ తుంటరి పనిచేసినట్లు గుర్తించామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ -
ఏఐ మంత్రిత్వ శాఖ!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కృత్రిమ మేధ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు.మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో వార్ రూమ్ నిర్వహిస్తాం.. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్మ్యాప్ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏఐ యూనివర్సిటీ స్థాపించాలి ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్ల కోసం జాతీయ ఏఐ నిధి స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్! -
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
అదానీ గ్రూప్ అతి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్స్కేల్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు 2035కల్లా 100 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సపోర్టింగ్ పరిశ్రమల ద్వారా మరో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా 250 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు వీలు కలగనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. అదానీ గ్రూప్ (Adani Group) ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా అధిక విద్యుత్ వినియోగ సామర్థ్యం, ఫైబర్ కనెక్టివిటీ, భూసౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి హైపర్స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, వాయు విద్యుత్ ప్లాంట్లతో నేరుగా అనుసంధానం చేసి గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల డిజిటల్ మౌలిక సదుపాయాలను దేశంలోనే సృష్టించడం సాధ్యమవుతుందని సంస్థ పేర్కొంది.ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) ఆధ్వర్యంలో సర్వర్ తయారీ యూనిట్లు, క్లౌడ్ సర్వీసులు, డేటా స్టోరేజ్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు, భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? -
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.డ్రైవర్లెస్ కార్లపై పని..టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలుగత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.యూఎస్-ఇండియా కనెక్ట్ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్వర్క్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే.. -
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026 -
ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ ఏఐ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్లు పాల్గొన్నారు. ఉదయం 9:40 గంటలకు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఐఏ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వంటి టాప్ టెక్ సీఈవోలు ప్రసంగిస్తారు. వీళ్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ పరిశ్రమ నాయకులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తదితరులు కూడా ప్రసగించనున్నారు. మరి ఈ అతిరథమహారథుల కోసం విందు భారత్ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి ఆ నాయకుల లంచ్ మెనూలో ఏయే వంటకాలు సిద్ధంగా ఉన్నాయంటే..లంచ్లో అలెర్జీ రహిత వంటకాలను సర్వ్ చేయనున్నారు. ముఖ్యంగా పాలు, గోధుమ, నట్స్ లేకుండా రెసీపీలు సిద్ధం చేశారు. ఈమెనూలో వందగ్రాముల కేలరీలు,పోషక విలువలు ఉండేలా కేర్ తీసుకున్నారు పాకనిపుణులు. ఇంతకీ ఏమేమి వంటకాలు ఉన్నాయంటే..స్టార్టర్స్ నిమోనా కబాబ్జీలకర్ర, ఆసాఫోటిడాతో టెంపర్ చేసిన పాన్-గ్రిల్డ్ గ్రీన్ బఠానీ కబాబ్. ఇవి బీహార్, ఉత్తరప్రదేశ్లలో ప్రసిద్ధి చెందిన తాజా పచ్చి బఠానీల చేసే శీతాకాలపు వంటకం. వంద గ్రాముల కబాబ్లకు 113 కిలో కేలరీలుఖమ్ ఖతైసున్నితమైన ఆకుపచ్చ మూంగ్ పప్పు ప్యాటీలను తీపి మామిడి చట్నీతో నింపి పాన్-గ్రిల్డ్ చేస్తారు. ఈ శాఖాహార కబాబ్లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి. ప్రతి వందగ్రాములకు 116 కిలో కేలరీలుకాశ్మీరీ నద్రు కుర్కురిసుగంధ ద్రవ్యాలతో చల్లిన క్రిస్పీ ఫ్రైడ్ లోటస్ స్టెమ్ చిప్స్. ఇది కాశ్మీర్ లోయ నుంచి వచ్చిన ప్రసిద్ధ, క్రంచీ స్నాక్. ఇందులో కూడా ప్రతి వంద గ్రాములకు 143 కిలో కేలరీలుప్రధాన కోర్సుజాఫ్రానీ సబ్జ్ పులావ్కాలానుగుణ కూరగాయలు, కుంకుమపువ్వుతో సువాసనగల బాస్మతి బియ్యం. ఇది కుంకుమపువ్వు (జాఫ్రాన్), నట్స్, నెయ్యితో తయారు చేసిన గొప్ప, సుగంధ పులావ్ వంటకం. దీనిని తరచుగా హైదరాబాద్లో విలాసవంతమైన, వేడుక లేదా "నవాబీ" భోజనంలో భాగంగా వడ్డిస్తారు. వందగ్రాములకు 152 కిలో కేలరీలుతందూరీ సలాడ్టమోటాలు, బెల్ పెప్పర్స్, పైనాపిల్లను తందూర్లో మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తారు.వంద గ్రాములకు 78 కిలో కేలరీలుథెప్లామెంతులతో రుచిగల గ్రామ్ పిండి ఫ్లాట్బ్రెడ్, మామిడి రుచిగల క్రీమ్ చీజ్తో సర్వ్ చేస్తారు. థెప్లా అనేది గుజరాతీ గృహాల్లో ప్రధానమైన, ప్రసిద్ధమైన, మృదువైన సన్నని ఫ్లాట్బ్రెడ్.వంద గ్రాములకు 138 కిలో కేలరీలుడెజర్ట్లుగులాబీ అండ్ కొబ్బరి పుడ్డింగ్ఫింగర్ మిల్లెట్ క్రంబుల్తో గులాబీ, కొబ్బరి పాలు పుడ్డింగ్ (ఖీర్). శక్తివంతమైన గులాబీ రంగును కలిగి ఉన్న క్రీమీ డెజర్ట్.వంద గ్రాములకు 167 కిలో కేలరీలురామదాన అంజీర్ లడూపఫ్డ్ మిల్లెట్, ఎండిన అంజూరతో చేసే లడ్డూ. ప్రతి వంద గ్రాములకు 172 కిలో కేలరీలుకాగా ఈ ఐఏ ఇంపాక్ట్ సదస్సు సుమారు 20కి పైగా రాష్ట్రాల అధిపతులు, దాదాపు వంద మందికి పైగా సీఈవోలు, వ్యవస్థాపకులతో సహా 500 మంది అగ్ర నాయకులను ఒక చోటకు చేర్చింది.ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 20 కంటే ఎక్కువ రాష్ట్రాల అధిపతులను మరియు 100 మంది CEOలు మరియు వ్యవస్థాపకులతో సహా 500 కంటే ఎక్కువ ప్రపంచ AI నాయకులను ఒకచోట చేర్చింది.(చదవండి: ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..! జిమ్ లేదు, కనీసం..) -
కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే 12 నుండి 18 నెలల్లో మిలియన్ల సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అమెరికన్ పారిశ్రామికవేత్త, మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ (Andrew Yang) హెచ్చరించారు.ఏఐ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్న ఆయన, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపయోగించిన ఏఐ ప్రోగ్రామ్ కొన్ని నిమిషాల్లోనే ఒక వెబ్సైట్ రూపకల్పన పూర్తి చేసిందని ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా డిజైనర్కు లేదా నిపుణుడికి రోజులు పట్టే పనిని ఏఐ కేవలం నిమిషాల్లో ముగించగలగడం ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం మిడ్-కెరీర్ కార్యాలయ ఉద్యోగులు, కాల్ సెంటర్ సిబ్బంది, సేల్స్ సిబ్బంది, కోడర్లు వంటి వారు నిర్వహిస్తున్న పనుల్లో చాలా భాగాన్ని ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉందని యాంగ్ అభిప్రాయపడ్డారు. డేటా ప్రాసెస్ చేయడం, నివేదికలు తయారు చేయడం మాత్రమే కాకుండా నిర్ణయ ప్రక్రియ కూడా ఆటోమేషన్ వైపు మళ్లవచ్చని ఆయన తెలిపారు.ఈ పరిణామం వైట్-కాలర్ ఉద్యోగాల్లో “గొప్ప విచ్ఛిన్నత”కు దారితీయవచ్చని హెచ్చరించిన ఆయన, ఒక కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభిస్తే, పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని అన్నారు. హెడ్కౌంట్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ ప్రతిఫలం ఇస్తుందనే భావన ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.అమెరికాలో సుమారు 70 మిలియన్ల వైట్-కాలర్ కార్మికుల్లో 20 నుండి 50 శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. డేటా విశ్లేషణ, రిపోర్ట్ తయారీ, కోడింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో ఏఐ సాధనాలు వేగంగా విస్తరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమవుతుందని వివరించారు.ఉద్యోగ నష్టాల ప్రభావం వినియోగదారుల ఖర్చులు, గృహ మార్కెట్, పన్ను ఆదాయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చని యాంగ్ హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (UBI), పునఃశిక్షణ కార్యక్రమాలు, అలాగే ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం వంటి విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు. -
చైనా రోబో డాగ్ వివాదం.. ప్రొఫెసర్ నేహా సింగ్ ఉద్యోగానికి ఎసరు!
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చైనా రోబోడాగ్ వివాదంలో అబాసుపాలైన ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియాస్ యూనివర్సిటీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా రోబో డాగ్ తామే తయారు చేశామని ప్రచారం చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహాసింగ్ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ ఇపాక్ట్ సదస్సును నిర్వహిస్తోంది. అయితే, ఈసదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియాస్ ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అదికాస్తా వివాదం కావడంతో సదస్సు నుంచి గెంటివేయాల్సిన పరిస్థితి తలెత్తింది.చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసింది. యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. ఆ రోబోట్ను తామే తయారు చేశామని గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహాసింగ్ డీడీ న్యూస్తో మాట్లాడారు. యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో రోబోడాగ్ను అభివృద్ధి చేశామని చెప్పారు.ఓరియన్ (orion) అనే పేరు పెట్టామని దానిని ప్రదర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడిన తీరు, ప్రదర్శనకు ఉంచిన రోబోటిక్ డాగ్ వీడియోలు వైరల్గా మారాయి. అయితే, ఆ వీడియోల్లో చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసిన యూనిట్రీ జోవో2 రోబోటిక్ డాగ్గా గుర్తించారు. అందుకు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ రోబోటిక్ డాగ్లను పలు కార్యాక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఏఐ ఇంపాక్ట్ నిర్వహిస్తున్న కేంద్ర ఐటీ శాఖ విభాగం ప్రతినిధులు సైతం స్పందించారు. వెంటనే సదస్సును ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ ప్రతినిధులు సదస్సును ఖాళీ చేశారు. ఈ క్రమంలో ఏఐ సదస్సులో జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతూ ఓ నోట్ను విడుదల చేసింది. ఆ నోట్లో యూనివర్సిటీ గురించి వివాదం తలెత్తడానికి కారణం ప్రొఫెసర్ నేహాసింగ్ది తప్పు. యూనివర్సిటీ తరుఫున సదస్సులో స్టాల్ నిర్వహిస్తున్న మా ప్రతినిధుల్లో ఆమె ఒకరు. సదస్సు గురించి, రోబోటిగ్ డాగ్ గురించి సరైన సమాచారం లేదు. మీడియాతో మాట్లాడే అధికారం కూడా ఆమెకు లేదు’అని పేర్కొంది. ఇదే అంశంపై మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, రోబోట్ డాగ్ను మా యూనివర్సిటీ తయారు చేయలేదని స్పష్టం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీ పరువు పోవడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ప్రొఫెసర్ నేహాసింగ్ను యూనివర్సిటీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. లింక్డిన్ ప్రొఫెల్ సైతం ఆమె మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. People like Galgotias University "professor" Neha Singh are the face of "artificial" intelligence who make a fool of themselves and the entire country. Will talk about the absolute collapse of "cute little and naughty" DD News as India's public broadcaster in the next debate. pic.twitter.com/UdW0psuum6— Piyush Rai (@Benarasiyaa) February 17, 2026 -
ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో ముందడుగు
కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.జియో ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లుజియో ఏఐ స్టాక్లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్ఫార్మ్లు, డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్లు, మల్టీలింగ్వల్ ఇంటెలిజెన్స్ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.జియో ఏఐ స్టాక్ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.భారతీయ భాషలకు ప్రాధాన్యంఈ ప్రాజెక్ట్లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్ఫార్మ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ఢిల్లీ AI సదస్సులో చైనా రోబో వివాదం
-
ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
భారత్లోని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కృత్రిమ మేధ ప్రభావంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఎన్నటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పు క్రమంలో సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని వాస్తవమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందో, నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.సాంప్రదాయ ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పుఏఐ వల్ల పునరావృతమయ్యే పనులు చేసే విభాగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల వల్ల క్లరికల్ పనుల అవసరం తగ్గుతోంది. కస్టమర్ సర్వీసులో చాట్బాట్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు ప్రాథమిక కస్టమర్ సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి సాఫ్ట్వేర్ కోడింగ్ను ఏఐ మోడల్స్ సమర్థవంతంగా చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోటిక్స్ ఏఐ ఏకీకరణ వల్ల మానవ ఆధారిత లేబర్ అవసరం తగ్గుతోంది.కొత్త తరం అవకాశాలుపాత ఉద్యోగాలు పోతున్నా అంతకు రెట్టింపు స్థాయిలో సరికొత్త కెరీర్ మార్గాలు పుట్టుకొస్తున్నాయి. 2026 నాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్ ఇంజినీర్లకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. అల్గారిథమ్స్లో పక్షపాతం లేకుండా చూసేందుకు ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు అవసరం పెరుగుతోంది. ఏఐ మోడల్స్కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను ఉపయోగించేందుకు డేటా క్యూరేటర్లకు డిమాండ్ ఉంది. మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ప్రక్రియను సమన్వయం చేసే మేనేజర్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.ప్రస్తుత పరిస్థితులు: భారత్ సన్నద్ధతప్రస్తుతం భారతదేశం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. సమ్మిట్లో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా ‘రీ-స్కిల్లింగ్’(నైపుణ్యాభివృద్ధి) ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యం లేని చోట మాత్రమే ఉపాధి ముప్పు కనిపిస్తోందని, నైపుణ్యం ఉన్న చోట ఉత్పాదకత పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.సవాళ్లను అధిగమించడం ఎలా?రాబోయే రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే కొన్ని మార్పులు అవసరం.డిగ్రీతో విద్య ముగిసిందని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.సృజనాత్మకత, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ చేయలేదు. వీటిని మెరుగుపరుచుకోవాలి.ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏఐ అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలి.ఉద్యోగాల కోతను అరికట్టేలా కంపెనీలు సామాజిక బాధ్యతతో ఏఐని అమలు చేయాలి.అసలైన సవాలు..ఏఐ అనేది మనిషిని తొలగించే సాధనం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే ఒక ‘సూపర్ పవర్’. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దాన్ని మన ఉపాధికి ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుతం అసలైన సవాలు.ఇదీ చదవండి: దిగొస్తున్న వెండి ధరలు.. ఒకేసారి రూ.5000 -
వేల కోట్ల బడ్జెట్ మూవీ.. ఏఐతో ఒక్కరోజులోనే తీస్తే?
సినిమాల తీయడంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, కలర్ నుంచి యానిమేటెడ్, ఇప్పుడేమో కొత్తగా ఏఐ మూవీస్ రెడీ అయిపోతున్నాయి. ఓవైపు కెమెరాతో ఎప్పటిలానే సినిమాలు తీస్తున్నప్పటికీ కొందరు ఏఐ ఉపయోగించి వందలాది కోట్ల బడ్జెట్ అయ్యే చిత్రాల్ని ఎంచక్కా ఒక్కరోజులోనే తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇదే విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)ఆర్జీవీ లేటెస్ట్గా ఓ ఏఐ మూవీకి సంబంధించిన చిన్న బిట్ని తన ట్విటర్లో షేర్ చేశాడు. 'సినిమాలకు ఇది అంతం కాకపోతే మరేంటి?' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడున్నర నిమిషాలున్న ఈ వీడియో చూస్తే.. ఎక్కడా ఏఐతో తెరకెక్కించారనే సందేహం రాదు. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ స్టైల్లోనే చాలా భారీగా ఉంది. బిల్డింగ్స్ కుప్పకూలడం, ఆకాశం నుంచి విమానం నేలకూలడం, అమెరికాలోని బ్రిడ్జ్ విరిగిపోవడం, ఇలా ప్రతి సీన్ ఎంతో రియలస్టిక్గా అనిపించింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏఐతో సినిమాలకు భారీ ప్రమాదమే పొంచి ఉంది.(ఇదీ చదవండి: హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: సుహాస్)If this is not the end of films , I don’t know what is ?😳 Watch till END https://t.co/MVZA7mJKYH— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2026 -
‘యూపీఐ’ నిరసనలు.. ఔత్సాహికులకు చేదు అనుభవాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026' సందర్శకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతికత, డిజిటల్ వృద్ధి మేళవింపుగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఈవెంట్లో ఫుడ్ కౌంటర్ల వద్ద యూపీఐ (UPI) చెల్లింపులను నిలిపివేయడం సందర్శకులను షాక్నకు గురిచేస్తోంది. క్యూఆర్ కోడ్లు పనిచేయకపోవడం, ఇంటర్నెట్ సిగ్నల్స్ బలహీనంగా ఉండటంతో అతిథులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విదేశీ భాగస్వామ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్లు, 13 దేశాల పెవిలియన్లు ఏర్పాటు చేశారు. అయితే కనీసం యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం లేకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘యూపీఐ’తో చెల్లించే వీలు లేనప్పుడు ఇది డిజిటల్ ఇండియా ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక ‘ఎక్స్’ యూజర్ ప్రశ్నించగా, మరొకరు ఈ సమిట్ను ‘అస్తవ్యస్త నిర్వహణకు నిదర్శనం’ అని అభివర్ణించారు. కనీసం వైఫై సదుపాయం కూడా లేకపోవడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.నియోసేపియన్ సహ వ్యవస్థాపకునికి చేదు అనుభవంనియోసేపియన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ధనంజయ్ యాదవ్, భారతదేశ సాంకేతిక రంగానికి తన వంతు సహకారం అందించాలనే ఆశయంతో 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు వచ్చారు. తన స్టార్టప్ రూపొందించిన ‘వేరబుల్ స్మార్ట్ ఏఐ’ పరికరాన్ని ప్రదర్శించడానికి ఒక చిన్న స్టాల్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రధాని మోదీ రాక సందర్భంగా.. భద్రతా కారణాలతో అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించారు. Bro is Dhananjaya YadavBro is co-founder and CEO of NeoSapienBro came to the AI Impact SummitBro wanted to do something for IndiaBro came to support India’s tech scene and believed in the governmentBro is building a smart AI wearable at NeoSapienBro set up a small… pic.twitter.com/1WFIPTerah— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) February 17, 2026అతని ల్యాప్టాప్లు, ఇతర సాంకేతిక పరికరాలను అక్కడే వదిలి వెళ్ళాలని, సెక్యూరిటీ సిబ్బంది వాటికి బాధ్యత వహిస్తుందని వారు చెప్పడంతో వారి మాటలను నమ్మి బయటకు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ధనంజయ్ యాదవ్ తిరిగి వచ్చి చూసేసరికి అతని పరికరాలన్నీ మాయమయ్యాయి. దీంతో విమాన ప్రయాణం, హోటల్ వసతి, స్టాల్ ఏర్పాటు కోసం భారీగా ఖర్చు చేసిన ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో కష్టపడి రూపొందించిన తన ప్రోటోటైప్ను కూడా ఆయన కోల్పోయారు. ఈ సంఘటన అక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపడమే కాకుండా, భారత్లో ఆవిష్కర్తలకు ఎదురయ్యే సవాళ్లకు ఉదాహరణగా నిలిచింది. Day 1 at the AI Summit:We’re apparently building the future.Meanwhile:– No water.– Traffic like it’s a festival + protest + wedding baraat combined.– AQI doing live demo of “real world simulation.”– Queues so long they need their own breakout session.– Cash only food…— Yavanika Shah (@yavanikashah) February 16, 2026 -
‘భారత ఏఐ రంగంలో వృద్ధి వేగవంతం’
గూగుల్ భారత్తో తన అనుబంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇండియా ఏఐ రంగంలో పురోగతి సాధిస్తున్న తరుణంలో గూగుల్ తన పూర్తి ఏఐవ్యవస్థలను స్థానికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.గూగుల్, ఇండియా ఏఐ భాగస్వామ్యంగూగుల్ కేవలం ఒక టెక్నాలజీ ప్రొవైడర్గానే కాకుండా భారత ఏఐ పర్యావరణ వ్యవస్థలో ఒక సమగ్ర భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకుంది. కంప్యూట్ పవర్, మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రీసెర్చ్ వంటి ఏఐకి సంబంధించిన అన్ని విభాగాల్లో గూగుల్ భారత్తో కలిసి పనిచేయనుంది. గూగుల్ తన గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 185 బిలియన్ డాలర్ల భారీ మూలధన వ్యయ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో గణనీయమైన భాగం భారత్లో డేటా సెంటర్లు, గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, స్థిరమైన ఇంధన వనరుల కోసం కేటాయించనున్నారు.రిలయన్స్ జియో (క్లౌడ్ రీజియన్ల కోసం), అదానీ గ్రూప్, క్లీన్మ్యాక్స్ (పునరుత్పాదక ఇంధనం కోసం) వంటి దిగ్గజ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుంది.ఈ పరిణామం ఎందుకు కీలకం?ఈ భాగస్వామ్యం దేశ డిజిటల్ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక అడుగు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సామాన్యులకు చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ అత్యాధునిక ఏఐ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లు తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ఆవిష్కరణలు చేయవచ్చు. గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్ ద్వారా భారత్ ప్రపంచానికి ఏఐ సేవలను అందించే కేంద్రంగా మారుతుంది. ఇది భారత్-అమెరికా సాంకేతిక సహకారాన్ని మరింత బలపరుస్తుంది.భవిష్యత్తుపై అంచనాలు..ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..‘భారతదేశం ఏఐ రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ పరివర్తనకు అవసరమైన మౌలిక సదుపాయాలను, క్లీన్ ఎనర్జీని, ఏఐకి సంబంధించి ఓపెన్ మోడల్స్ను అందించడమే మా లక్ష్యం’ అన్నారు. గూగుల్ ఇప్పటికే రాజస్థాన్లో 150 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు వంటి వాటితో తన మౌలిక సదుపాయాల కల్పనను ప్రారంభించింది.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ చేరుకున్న పిచాయ్, ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధ భవిష్యత్తుపై చర్చించారు. మరోవైపు ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ భారత్లో ఏఐ ప్రభావంపై మాట్లాడారు. భారత ఐటీ రంగం మన ఎగుమతులకు వెన్నెముక అని, ఏఐ దీనికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అవుట్సోర్సింగ్, ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ అనే మూడు సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ, పర్యావరణహితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు బుధవారం భారతదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 20న ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత మాతృభూమికి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడ లభించిన సాదర స్వాగతం నా మనసుని తాకింది’ అంటూ పిచాయ్ తన 'ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ‘ఇండియా ఏఐ మిషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సామాన్యుల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురావచ్చనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టెక్ సీఈఓలు, దేశాధినేతలు పలు అంశాలపై ఈ వేదికపై చర్చించనున్నారు.ఈ సదస్సు ప్రారంభానికి ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సుందర్ పిచాయ్.. భారత్తో ఏఐ రంగంలో భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ దేశాల్లో భారత్ ఒకటి అని, ఇక్కడ ఏఐ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం సాంకేతికతను అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన ఇంధన వనరుల పెట్టుబడులు, ఓపెన్ డేటాసెట్స్, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తదితర అంశాల్లో భారత్కు గూగుల్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.ఈ మెగా సదస్సులో సుందర్ పిచాయ్తో పాటు ప్రపంచ స్థాయి దిగ్గజాలు తమ గళాన్ని వినిపించనున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు డారియో అమోడై తదితర ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20న ఉదయం 9:30 గంటలకు సుందర్ పిచాయ్ తన కీలక ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు, దీనిపై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు ఉన్నాయి. Nice to be back in India for the AI Impact Summit - a very warm welcome as always and the papers looked great too:) pic.twitter.com/szM9g2wB4d— Sundar Pichai (@sundarpichai) February 18, 2026 -
ఏఐతో అద్భుతం.. రజినీకాంత్ మూవీ టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం కొచ్చాడయాన్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించింది. గతంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కార్టూన్ సినిమాను తలపించేలా ఉందంటూ ఆడియన్స్ ట్రోల్స్ చేశారు.అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్ను రిలీజ్ చేశారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో రూపొందించిన టీజర్ తలైవా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తాన్ని ఏఐ సాయంతో రీ జనరేట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్ఫేక్లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్ఫారమ్లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
టెకీల ప్రైమరీ జాబ్ కోడింగ్ కాదు: నందన్ నీలేకని
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. -
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో.. జియో పెవిలియన్ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. -
ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. బిల్గేట్స్కు నో ఎంట్రీ?
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్గేట్స్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బిల్గేట్స్పై ఏఐ ఇంపాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్స్లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ పలు సందేహాలు లెవనెత్తారు. మరోవైపు, ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న బిల్ గేట్స్కు బిల్ గేట్స్కు చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్ ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రజల నుంచి ఆగ్రహ వ్యక్తమవుతుంది.ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన బిల్గేట్స్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలకుల తీరుపై కూడా నెటిజన్లు పంచ్లు వేస్తున్నారు. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్స్టీన్ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్గేట్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్గేట్స్కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్గేట్స్ తన పొడ్రక్ట్స్కు భారత్ ల్యాబ్గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రెండింగ్లో బిల్గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్టాగ్లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. బిల్ గేట్స్పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. -
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేటికి(మంగళవారం) రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘కృత్రిమ మేధ (ఏఐ)ప్రయోజనాలు ప్రతి పౌరుడికీ అందాలన్నదే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెలివితేటలు, హేతుబద్ధత, నిర్ణయాత్మక సామర్థ్యం మొదలైనవాటిని ఏఐ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘గ్లోబల్ సౌత్’లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సుగా ఇది చరిత్ర సృష్టిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా ఏఐ నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) ఒక ప్రకటనలో ఈ సదస్సు ఇరు దేశాల ఆర్థిక బంధాలను బలోపేతం చేసే కీలక వేదికగా అభివర్ణించింది. बुद्धिमत्ता, तर्कशीलता और निर्णय-क्षमता विज्ञान और टेक्नोलॉजी को जन-जन के लिए उपयोगी बनाती हैं। India AI Impact Summit का उद्देश्य भी यही है कि कैसे एआई का इस्तेमाल सर्वजन के हित में हो।शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणां तथा।ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥ pic.twitter.com/qytLZxv1uh— Narendra Modi (@narendramodi) February 17, 2026సదస్సు రెండో రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చోటు చేసుకునే కలిగే సామాజిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై ఏఐ ప్రభావం, ప్రజారోగ్యం, పిల్లల భద్రత తదితర అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమన్దీప్ సింగ్ గిల్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. అలాగే, విద్యా రంగంలో ఏఐ వినియోగంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తోంది. సదస్సుతో పాటు నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్లు తమ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించేందుకు సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారనే అంచనాలున్నాయి.ఇది కూడా చదవండి: ‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్ -
టీసీఎస్తో ఏఎండీ బంధం బలోపేతం
అమెరికన్ దిగ్గజం ఎన్విడియాకి భారత మార్కెట్లో దీటుగా పోటీనిచ్చేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాయి. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్తో కలిసి అమెరికన్ సంస్థ ఏఎండీ తమ హీలియోస్ ప్లాట్ఫాం ఆధారంగా పెద్ద కంపెనీలకు అవసరమయ్యే ‘ర్యాక్–స్కేల్ ఏఐ’ మౌలిక సదుపాయాలను డిజైన్ చేయనుంది. పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు, ఎంటర్ప్రైజ్ ఏఐని అమలు చేసేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా కంపెనీలు దీన్ని ప్రకటించాయి. భాగస్వామ్యం ప్రకారం ఏఎండీ తమ ఫుల్–స్టాక్ ఏఐ కంప్యూట్ ప్లాట్ఫాంను, టీసీఎస్ తమ డేటా సెంటర్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను ఉపయోగించనున్నాయి. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్, ఏఐ శిక్షణ మొదలైన వాటి కోసం కంపెనీలు, ప్రభుత్వాలు కంప్యూట్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఏఐ మౌలిక సదుపాయాల సెగ్మెంట్లో ఏఎండీ నేరుగా జీపీయూల తయారీ దిగ్గజం ఎన్విడియాతో పోటీపడనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
జియో ఏఐ పెవిలియన్ సందర్శించిన మోదీ
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు.ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ… pic.twitter.com/oDzwTW4SUg— Sakshi (@SakshiNews) February 16, 2026ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు. -
డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?
పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి.బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. -
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. -
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)
-
ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి, 5వేలకు పైగా శైవభక్తిగీతాలు
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.Zoom వెబినార్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది. -
ఏఐ భయాలు నిజమే.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయంగత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్వేర్ బడ్జెట్ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వేగమే అసలు సవాలుఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.అపరిమిత అవకాశాలుభారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు. यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz— Narendra Modi (@narendramodi) February 16, 2026న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు! -
హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్లో చెప్పిన నిఖిల్.. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా) -
రూ .300 లకు కొన్న 2 అక్షరాలు.. ఇప్పుడు రూ .634 కోట్లు
అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.ఏఐ బూమ్తో పెరిగిన విలువగత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.రూ.634 కోట్ల డీల్2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫారమ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది. -
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్మార్క్” అని పేర్కొంది. ట్రేడ్మార్క్ నమోదు ఇంకా పెండింగ్లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్లోని లోపాలను మాన్యువల్గా టెస్టింగ్లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్లతో సంభాషిస్తూ అవుట్పుట్ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన -
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు. -
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఏఐ వినియోగంలో భారత్ జోరు
దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్ప్రైజ్ విభాగంలో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెర్నిగ్) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఏజెంటిక్ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య జీస్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్ లెరి్నంగ్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఎమోన్ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్–డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్–ఫస్ట్ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్–ఇన్సూరెన్స్ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్ డిమాండ్కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్క్రిమినల్స్, నిఘా గ్రూప్లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్ వేగంతో, భారీ స్థాయిలో సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్లోకి 18,000 టెరాబైట్స్ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్ ఫొటోలకు సమానం. ఏజెంటిక్ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్ జీరో ట్రస్ట్ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక!
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.Today is my last day at Anthropic. I resigned.Here is the letter I shared with my colleagues, explaining my decision. pic.twitter.com/Qe4QyAFmxL— mrinank (@MrinankSharma) February 9, 2026 -
ఒక్కనైట్ హోటల్ రూ. 11 లక్షలు..?
ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI)కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడాబడా కార్పోరేట్ కంపెనీలతో పాటు సాధారణ ప్రజలు సైతం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే భారత్ ఈనెలలో దీనికి సంబంధించి ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. దీంతో దీని కున్న క్రేజ్ దృష్యా ఢిల్లీలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటాయి.సాధారణంగా న్యూఇయర్ సందర్భంగానో లేదా క్రికెట్ మ్యాచులు, సెలబ్రేటీల ఈవెంట్స్ సాధారణంగా ఇటువంటి సందర్భంలోనే హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. అది కూడా వేలల్లో లేదా రూ. లక్ష ఉంటుంది. అయితే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకూ ఢిల్లీలోని భరత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా? ఏఐ సమ్మిట్ దృష్ట్యా ఆ రోజుల్లో అక్కడి ఢిల్లీలోని హోటళ్ల ధరలు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పెరిగిపోయాయి. ది ఇంపీరియల్ అనే ఫైవ్స్టార్ హోటల్లో బాత్హాబ్తో ఉన్న లగ్జరీ సూట్ ధర అక్షరాల రూ. 11.64 లక్షలుగా ఉంది. దీంతో కస్టమర్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. లీలా మహాల్లోని మహారాజ సూట్ ధర రూ.7.34 లక్షలు పలికింది. అదేవిధంగా ఒబేరాయిలో రూ.5.84లక్షలు, తాజ్ ప్యాలెస్లో రూ.4 లక్షలుగా ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్ మేక్ మైట్రిప్లో ధరలు ఈ విధంగా చూపించాయి దీంతో యూజర్స్ ఆ ధరలు చూసి కంగుతిన్నారు.అయితే ఏఐ సమ్మిట్ దృష్యా ఆ ప్రాంతంలోని అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో విపరీతంగా పెరిగాయని ఇక్సిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ బాజ్పేయ్ తెలిపారు.కాగా ఫ్రాన్స్లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్లో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈసమ్మిట్ గ్లోబల్ సౌత్లో నిర్వహించబడుతున్న మొట్టమొదటి గ్లోబల్ AI సమ్మిట్. -
భారత్కు త్వరలో టెక్ కంపెనీ సీఈఓలు రాక
న్యూఢిల్లీ వేదికగా భారత్లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.దిగ్గజ కంపెనీల సారథులుఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్గేట్స్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.దేశీయంగా కూడా ఈ సమ్మిట్పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.సదస్సు ప్రత్యేకతలుప్రభుత్వం ఈ సమ్మిట్ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్ అడ్రస్గా రిజిస్టర్.. ఇప్పుడు రూ. 600 కోట్లు!
పేరులో నేముంది అని అనుకుంటే పొరపాటు. ఒక చిన్న పదం. కేవలం రెండే రెండక్షరాలు. కానీ దాని విలువ భారత కరెన్సీలో అక్షరాల 600 కోట్లు. ఆ రెండక్షరాల పదం ఏంటి? దానిని రూ.600కోట్లకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? దాని కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం పదండి.ఇంటర్నెట్లో డొమైన్ అడ్రస్ చాలా విలువైంది. వెబ్సైట్ డొమైన ట్రెండింగ్లో ఉన్నా డిమాండ్ ఉండే బిజినెస్కు చెందినదైనా దాని ధర కోట్లు పలుకుతుంది. ఎంత ధరపెట్టైనా సరే దాన్ని కొనుగోలు చేస్తారు. అలాంటి వెబ్సైట్ డొమైన్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. క్రిప్టో.కామ్ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఏఐ డాట్ కామ్ను 70మిలియన్ డాలర్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.600కోట్లు.ఇదే అత్యధికర ధర పలికిన డొమైన్లలో తొలి స్థానంలో నిలిచింది.ఏఐ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా క్రిప్టో.కామ్ సీఈవో క్రిస్ మార్జాలెక్ సూపర్ బౌల్ సమయంలో ఏఐ.కామ్ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ వెబ్సైట్లో ఏఐ పర్సనల్ అసిస్టెంట్ లాంచ్ కానుంది. ఈ ఏఐ అసిస్టెంట్ పర్సనల్ మెసేజ్లు పంపడంతో పాటు క్రిప్టో ట్రేడింగ్,యాప్స్ మేనేజ్ చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల్ని చక్కబెడుతోంది. చాట్జీపీటీ రాకతో టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. చాట్జీపీటీ రాకతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరంగంలో ఏఐ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో ఏఐ.కామ్ డొమైన్ను అంత భారీ మొత్తంలో వెచ్చించారు. భవిష్యత్ మొత్తం ఏఐదేనని,అన్నీ రంగాల్లో ఏఐ పెత్తనం చెలాయిస్తుందంటున్నారు.ఇది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ రానున్న 20ఏళ్లలో పెట్టుబడులు అమాంతం పెరుగుతాయని క్రిస్ చెబుతున్నారు. ఏఐతో ప్రిమీయం డొమైన్లు బ్రాండింగ్ను పెంచుతాయని అంటున్నారు.2016లో క్రిస్.. క్రిప్టో.కామ్ను ప్రారంభించారు. అప్పటికే మార్కెట్లో క్రిప్టోఫ్లాట్ఫారమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా వృద్ధి సాధించింది. ప్రస్తుతం, ఏడాదికి 1.5బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్ బ్రాండింగ్పై భారీ ఇన్వెస్ట్ చేసింది.2021లో స్టేడియం బ్రాండింగ్పై సుమారు 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్ మీడియాతో బిజినెస్ డీల్స్ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబుల్ బ్రాండింగ్ రికగ్నైజేషన్ను పెంచాయి. ఇప్పుడు ఏఐ.కామ్ కొనుగోలుతో సరికొత్త రికార్డులు సృష్టించారు క్రిస్ మార్స్జాలెక్.ఇక క్రిస్ మార్స్జాలెక్ ఏఐ.కామ్ డొమైన్ను మలేషియన్ టెక్ ఎంట్రప్రెన్యూర్ అర్స్యాన్ ఇస్మాయిల్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డొమైన్ను ఇస్మాయిల్ 1993లో 100 డాలర్లు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇది సాధారణ వెబ్ అడ్రస్ మాత్రమే. కానీ కాలక్రమేణా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యం పెరిగిన కొద్దీ, ఈ డొమైన్ విలువ ఆకాశాన్ని తాకింది.2025 ఏప్రిల్లో అర్స్యాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్ను క్రిస్ మార్జాలెక్కి విక్రయించారు. ధర? అక్షరాల 70 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు. ఇది ఇప్పటివరకు పబ్లిక్గా వెల్లడైన అత్యధిక ధర పలికిన డొమైన్ ట్రాన్సాక్షన్గా గుర్తింపు పొందింది.ఒకప్పుడు 100 డాలర్ల విలువైన ఈ డిజిటల్ ఆస్తి 30 ఏళ్ల తర్వాత 70 మిలియన్ డాలర్లకు అమ్ముడవడం, ఇంటర్నెట్లో డొమైన్ల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించే అద్భుత ఉదాహరణ. ఏఐ భవిష్యత్తు అన్నీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్న ఈ తరుణంలో ఏఐ.కామ్పై వంటి ప్రీమియం డొమైన్ను సొంతం చేసుకోవడం ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. ఇది కేవలం ఒక వెబ్ అడ్రస్ కాదు, భవిష్యత్ టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే బ్రాండింగ్ ఆస్తి. -
హోటల్లో ఒక్క రోజుకి రూ.30 లక్షలు.. ఎందుకంటే?
భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.ఈ సమ్మిట్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది. -
ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది. -
ఏఐతో టెక్ సర్వీసుల్లో సరికొత్త మార్పులు
న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.#NDTVProfitConclave2026 | V. Anantha Nageswaran, Chief Economic Adviser to @TamannaInamdar on AI and its impact Co-presented by: @NSEIndiaCo-powered by: @LICIndiaForever & @apollotyres Special Partners: @Niva_Bupa, APIS & Adani AirportsEnergy Partner: @kpgroupgujarat NBFC… pic.twitter.com/2LBMuPNI54— NDTV (@ndtv) February 7, 2026 -
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
వైట్ కాలర్ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
Stock Market: ఐటీ షేర్లు తలకిందులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పురోగతి గురించి ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో తలకిందులయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48.45 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 25,776.00 వద్ద, సెన్సెక్స్ 78.56 పాయింట్లు లేదా 0.09 శాతం లాభపడి 83,817.69 వద్ద ముగిసింది. ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ అంతర్గత న్యాయవాదుల కోసం ఉత్పాదకత సాధనాన్ని విడుదల చేసిన తరువాత వాల్ స్ట్రీట్ సాఫ్ట్ వేర్ సంస్థల షేర్లు పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. అటువంటి ఏఐ సాధనాల అభివృద్ధి సాఫ్ట్వేర్ కంపెనీలను దెబ్బతీస్తుందని, పరిశ్రమ అంతటా లాభదాయకతను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీని పక్కన పెడితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 2.6 శాతం, 2 శాతం లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. -
‘భారత్-విస్తార్’తో డిజిటల్ అండ!
భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలను, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) ప్యాకేజీలను ఏఐ సిస్టమ్లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.ఏఐ టూల్ ఎందుకు?ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్లు విత్తన అభివృద్ధి నుంచి సప్లై చైన్ వరకు వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఒకే చోట లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందడం లేదు. భారత్-విస్తార్ ద్వారా ఈ వనరులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అగ్రిటెక్ స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసే భారీ డేటాను ఏఐ విశ్లేషించి రైతులకు అర్థమయ్యేలా వివరిస్తుంది.రైతులకు చేకూరే ప్రయోజనాలుదీని ద్వారా సాధారణ సమాచారం కంటే నిర్దిష్టమైన, ధ్రువీకరించిన శాస్త్రీయ సలహాలు రైతులకు అందనున్నాయి.ఐకార్ శాస్త్రీయ పరిశోధనలను నేరుగా డిజిటల్ రికార్డులతో అనుసంధానించడం ద్వారా పొలంలోని పరిస్థితిని బట్టి సలహాలు అందుతాయి.సంక్లిష్టమైన శాస్త్రీయ డేటాను రైతులకు వారి స్థానిక భాషల్లోనే సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ టూల్ సర్వీసులు అందిస్తుంది.కరువు, వరదలు లేదా తెగుళ్ల దాడుల గురించి అగ్రిస్టాక్ ద్వారా ముందస్తుగా హెచ్చరికలు అందుతాయి.ఇది కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, రుణాలు అందజేయడం, బీమా సేవలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యంఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్ఎస్ఐ), ఏపీఐల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లు కూడా ఈ ప్లాట్ఫారమ్తో అనుసంధానం కావచ్చు. దీనివల్ల మార్కెట్ కనెక్షన్లు మెరుగుపడటమే కాకుండా రైతులకు మరిన్ని వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.డేటా భద్రతకు ప్రాధాన్యంరైతుల డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. డేటాపై పూర్తి హక్కు రైతుకే ఉంటుంది. ఐటీ చట్టం, ఆధార్ చట్టం ప్రకారం ఈ సమాచారం భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ రైతు డేటాను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఆ రైతు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
క్యాన్సర్ చికిత్స.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
ఇప్పటికే క్యాన్సర్ చికిత్సారంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ)ను కనుగొన్న తర్వాత వచ్చిన, వస్తున్న పురోగతులు చెప్పడానికీ, వినడానికీ, చదవడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. ఇది ‘సైన్స్ ఫిక్షన్ కాదు... మెడిసిన్’ అని అనుక్షణం నిరూపితమవుతోంది. ఈ ఏడాది క్యాన్సర్ డే థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’! ఈ నినాదం అర్థమేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ (యునైటెడ్గా) చికిత్స అందేలా చేస్తూనే... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా... వ్యక్తిగతంగా నిర్దిష్టమైన (యూనిక్) చికిత్స అందేలా చూడటం. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’.ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం...ఒక చిన్న అంశాన్ని ఊహించండి... మన దేహమంతా ఓ నగరం అనుకోండి. అప్పుడు మన ఒంట్లోని ప్రతి కణమూ ఒక ఇల్లవుతుంది. అప్పుడు మన ఇంట్లోని జన్యువు (జీన్) స్విచ్ అనుకుందాం...బాగా పనిచేసే ఆ ‘స్విచ్చు’ ఆన్ చేసినప్పుడల్లా ‘లైట్’ వెలుగుతుంది. అది నార్మల్ పెరుగుదలకు సంకేతం! ∙కొన్నిసార్లు వాటిని ఆన్ చేసినప్పుడు అలారం మోగుతుంది. అంటే రిపేర్లు అవసరమనే సూచన. ∙కొన్ని స్విచ్చులు అవసరాన్ని బట్టి పోలీస్ను పిలుస్తాయి. అది కణం మరణం!ఈ పోలికలతో చెప్పాలంటే... క్యాన్సర్ ఎప్పుడు పుడుతుందంటే...?⇒ కొన్ని స్విచ్చులు అలా ఆన్ అయ్యాక ‘స్ట్రక్’ అయిపోయి... ఆఫ్ కాకుండా ఇరుక్కుపోయినప్పుడు... అంటే... ఆన్ అయిన ఆ స్విచ్చు అలాగే జామ్ అయిపోతే... లైట్ అలా కంటిన్యువస్గా వెలుగుతూనే ఉంటుంది!... అది అప్రతిహతమైన పెరుగుదల.... ఎంతకూ ఆగకుండా పెరిగే క్యాన్సర్ పెరుగుదల! ∙అలారం మెకానిజం దెబ్బతిని అలారం మోగకుండా పోవడమంటే... కణంలో ఏదో తప్పు జరిగి... అది జరిగిందనే హెచ్చరికలు అందకుండా పోవడం. ⇒ ఇక సెల్ డెత్కు కారణమయ్యే పోలీస్ ఇన్స్పెక్టర్ తన పని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడూ... అంటే నార్మల్ కణం కాస్తా క్యాన్సర్ కణంగా మారినప్పుడు... అది మరో నార్మల్ కణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకూ, పొరుగుదాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి నిశ్శబ్దంగా తనంతట తానే మరణించడం జరగకపోవడం.ఇలా జీన్ అనే స్విచ్చులో ఏవైనా మార్పులు వచ్చి అది ‘జామ్’ అయిపోయిందంటే... అది క్యాన్సర్కు దారితీసినట్టేనని తెలుసుకోవాలి. ఇలా కణాల్లోని ‘పీ–53’ అనే ఓ ్రపోటీన్... ఈ స్విచ్చులన్నింటికీ ఓ (మాలెక్యులార్) ‘మాస్టర్ స్విచ్’గా పనిచేస్తుంది. అంటే ఇది మెయిన్బోర్డు దగ్గర ఉంటుంది. దీన్నే ‘గార్డియన్ ఆఫ్ జీనోమ్’ గానూ చెప్పవచ్చు. అదే అవసరాన్ని బట్టి డీఎన్ఏ రిపేర్లు జరిగేలా చూస్తుంది. అప్పటికీ పని జరగకపోతే ఆ తప్పుడు కణం తనంతట తానే చనిపోయేలా చూస్తుంది. (దీన్నే ‘్రపోగ్రామ్డ్ సెల్ డెత్’ అంటారు). అలా చేయడం ద్వారా మిగతా దేహాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.అంటే ఇంట్లో షార్ట్ సర్క్యుట్ అయితే... దానివల్ల ప్రమాదం జరగకుండా మెయిన్ బోర్డు దగ్గరే ఆఫ్ అయిపోయే మాస్టర్ స్విచ్లా పనిచేస్తుందన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ తర్వాత క్యాన్సర్ చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కొత్త ఆవిష్కరణలేమిటో... వాటితో వచ్చిన మార్పులేమిటో చూద్దాం. మొదటి ఆవిష్కరణ: ఆలిగో న్యూక్లియటైడ్ థెరపీగతంలో ఒంట్లోని ఏదైనా స్విచ్ చెడిపోయిం దంటే... డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు డాక్టర్గారు తన పరికరాల (కీమోథెరపీ) సహాయంతో ఓ ఎలక్ట్రీషియన్లా లేదా ఓ మేసన్ (మేస్త్రి)లా పనిచేస్తూ చెడిపోయిన స్విచ్ను రిపేరు చేసేవారు. ఆ క్రమంలోనే బోర్డులో మరికొన్ని స్విచ్చులూ మార్చాల్సి వచ్చేది. కానీ ఇప్పటి తాజా ఆవిష్కరణతో... కణం నుంచి అది చెడిపోయినట్లు సిగ్నల్ రాగానే పేషెంటే ఆ చెడిపోయిన కణానికి సందేశాలు పంపుతాడు. ‘‘చెడిపోయినట్లు వస్తున్న ఆ సిగ్నల్స్ను పరిగణనలోకి తీసుకోకు’’ ‘‘నీ సేఫ్టీ రూల్స్కు అనుగుణంగా చెడిపోయిన కణాన్ని రిపేర్ చేయ్యి’’ ‘‘ఇలా చేయడం ద్వారా చెడిపోయిన కణం వరకే పరిమితం అవ్వు. దేహంలోని మిగతా కణాలను చెడగొట్టకు’’... లాంటి సందేశాలను కణానికీ, కణంలోని రిపేర్లు చేసే అంశాలకు పంపడం ద్వారా...దేహంలోని మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతో క్యాన్సర్ మిగతా కణాలకు వ్యాపించదు. ఇప్పుడు ఇదెలా జరుగుతుందంటే... మానవ కణాల్లో ‘న్యూక్లియటైడ్స్’ అనే ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) ఉంటాయి. అయితే డాక్టర్లు ‘ఆలిగోన్యూక్లియటైడ్స్’ అనే కృత్రిమ ఇటుకలను తయారు చేసి... క్యాన్సర్తో చెడిపోయిన ఇటుకల స్థానంలో వీటిని పెట్టి ఈ రిపేర్లు జరుగుతాయి. ఇంకా మరొక పోలిక చెప్పాలంటే... మనకు ఇష్టం లేనిదీ, ఏదో అశ్లీలమైన ఎస్ఎమ్ఎస్ వచ్చిందంటే... చిరాకు పుట్టి ఫోన్ను విసిరికొట్టి దాన్ని ధ్వంసం చేయడం కంటే... కేవలం ఆ మెసేజ్ వరకే డిలీట్ చేయడం లాంటిదన్నమాట.రెండో ఆవిష్కరణ: కార్టి / ఎన్కే సెల్ థెరపీఅత్యంత కన్నింగ్ మోసగాడు... ఈ క్యాన్సర్ కణం! ఈ నేపథ్యంలో ‘క్యాన్సర్ కణం’ తాలూకు ఓ గుణాన్ని చూద్దాం. క్యాన్సర్ కణమనేది అత్యంత కన్నింగ్ మోసగాడిలాంటిది. వాడెంత కన్నింగ్ అంటే... ఎక్కణ్ణుంచో ఓ ‘ఆర్మీ యూనిఫామ్’ను కొట్టేసి, ఫేక్ ఐడీ కార్డునొకదాన్ని పట్టేసి... తానూ ఓ రక్షణ కణంలా కనిపించేలా మారువేషం వేసుకుని మరీ ఆరోగ్యకరమైన కణాలను ధ్వంసం చేస్తుంటాడు. అయితే ఇప్పటి సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఈ అత్యంత నూతన, అధునాతన చికిత్స ప్రక్రియలో ఎన్కే అంటే... ‘నేచురల్ కిల్లర్’ అని అర్థం. ఇలా పిలిచే ఆర్మీ కమాండోస్ లాంటి ఈ ‘ఎన్కే సెల్స్ థెరపీ’లో ఏం జరుగుతుందో చూద్దాం. ∙గతంలోని ఆర్మీ కమేండోలు డేంజర్ సిగ్నల్స్ వచ్చేదాకా ఆగేవి. కానీ ఇప్పటి ఎన్కే సెల్స్ మాత్రం ఎవరి ఆదేశాల కోసం ఆగవు. అనుమానం వచ్చిందంటే చాలు ఆ క్యాన్సర్ సెల్ను అప్పటికప్పుడు ధ్వంసం చేసేస్తాయి. ∙⇒ నిశితంగా ఎంచుకుని... నిర్దిష్టంగా కేవలం చెడిపోయిన లేదా క్యాన్సర్ కణంగా మారబోతున్న కణాన్నే తుదముట్టించేస్తాయి. ∙ఇమ్యూనిటీ సెల్స్ అయిన బీ సెల్, టీ సెల్ లా తాను రక్షణ కవచాన్ని అని చెప్పే యూనిఫామ్ వేసుకోవు. సివిల్ డ్రస్లో ఉన్న సోల్జర్లా విరుచుకుపడి క్యాన్సర్ కణాన్ని ముట్టడించేస్తాయి. ఈ క్రమంలో అవి యూనిఫామ్ వేసుకుని మోసం చేసే క్యాన్సర్ కణం కన్నింగ్ వేషాల ట్రాప్లో పడిపోవు. సదరు క్యాన్సర్ కణాల కుయుక్తులనూ ముందే పసిగట్టేసి... వాటిని తుదముట్టిస్తాయి.మూడో ఆవిష్కరణ: యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) «థెరపీ ఓ పొలంలో చీడ పట్టిందనుకోండి. ఆ చీడపురుగులను అంతం చేయడానికి మొత్తం పొలమంతా మందుకొట్టడం మామూలే. అలాగే ఊళ్లో ఉన్న దోమలను తుదముట్టించడానికి అత్యంత ఘాటుగానూ, ఊపిరి పీల్చుకోడానికే ఇబ్బంది పడేలా సఫకేట్ చేసేసే దోమలమందును ఊరంతా కొట్టడం సాధారణంగా జరిగేదే. తాజా ఆవిష్కరణలతో వచ్చిన చికిత్స ఎలాంటిదంటే... ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే కొరియర్ బాయ్ లాంటిది. ఆ ఊళ్లో ఆ వీధి ఎక్కడుందో... ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని... బాగా ΄్యాక్ చేసి ఉన్న ఆ ‘క్యాన్సర్ మందు’ను సరిగ్గా ఆ ఇంట్లోకి డెలివరీ చేసే ఓ కొరియర్ బాయ్లా పనిచేస్తుంది. ఆ ఇంట్లోవాళ్లు ఆ ΄్యాక్ను తెరవగానే మందునంతా చిమ్మేసి క్యాన్సర్ను కమ్మేసి సైలెంట్గా చంపేస్తుంది. అలా పక్కనున్న ఇంటికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ తరహా కొత్త ఆవిష్కరణ ఫలితంగా బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దాంతో మునపటి కీమోథెరపీల్లోని వేదనలూ, వెతల్లా కాకుండా చికిత్సను తేలిగ్గా తట్టుకోగలగడం సాధ్యమవుతుంది.నాలుగో ఆవిష్కరణ: కృత్రిమ మేధ + జీనోమిక్స్ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లస్ జీనోమిక్స్ (జీనోమ్ చికిత్స)... ఈ రెండింటి సమన్వయంతో అందే అత్యంత అధునాతమైన సరికొత్త చికిత్స ప్రక్రియ.ఈ అంశాన్నీ తేలిగ్గా వివరించాలంటే... గతంలో నగరంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగాక ఫైర్ అలారం మోగగానే ఫైర్ బ్రిగేడంతా నిప్పును ఆర్పడానికి ఉపక్రమించేవారు. ఇప్పుడు అలాకాదు.. ⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సీసీటీవీ లా పనిచేసి... అగ్ని అంటుకునేందుకు అవకాశమున్న చోటిని పసిగట్టినట్టే... క్యాన్సర్ పుట్టే చోటిని ముందే పసిగడుతుంది. ⇒ రక్తం / జెనెటిక్ సిగ్నల్స్... నాయిస్ సెన్సర్ మాదిరిగా పనిచేసి క్యాన్సర్ పుట్టేందుకు అవకాశమున్న ప్రదేశాన్ని ముందే కనిపెట్టేస్తాయి. ∙ఇక్కడ మనుష్యులు ఆ స్వల్పాతి స్వల్పమైన అతి చిన్న తేడాను మిస్ కావచ్చేమోగానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కారణంగా ఆ అతిచిన్న తేడానూ పసిగట్టే వీలుంది.ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే... ⇒ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండి... హై–రిస్క్ ఉన్న కుటుంబాల్లో. ∙చాలాకాలం నుంచి పొగతాగే అలవాటున్న స్మోకర్లలో. ∙మహిళల్లోనే వచ్చే ఉమన్ క్యాన్సర్లను పసిగట్టే విషయంలో. ∙క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న జీవనశైలిని అనుసరించేవారిలో లేదా అలాంటి వాతావరణంలో పనిచేసేవారిలో.ఐదో ఆవిష్కరణ: పర్సనలైజ్డ్ థెరపీ (ప్రెసిషన్ ఆంకాలజీ) గతంలో ఎవరైనా బాధితుడిలో ఒక రకం క్యాన్సర్ను కనుగొన్నారంటే... ఆ రకం క్యాన్సర్ వచ్చినవారందరికీ ఇచ్చే మందును లేదా చికిత్స ప్రక్రియను అతడికి కూడా అందించేవారు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సహాయంతో ఇప్పుడు అతడిలో క్యాన్సర్ కణం ప్రవర్తించే పద్ధతిని (బిహేవియరల్ మేనర్ను) బట్టి, అతడి జీవనశైలి ఆధారంగా, అతడి బ్లడ్ మార్కర్స్, అతడి స్కాన్లూ, అతడికే ప్రత్యేకమైన అతడిలోని ‘పీ–53’ ్రపోటీన్... అంటే... అతడి ‘మాలెక్యులార్ మాస్టర్ స్విచ్’ ఎంత బలహీనంగా ఉందీ, అది ఏ మేరకు పనిచేయడంలేదు... లాంటి అంశాలన్నీ తెలుసుకొని అతడికే ప్రత్యేకమైన, ఎంతో ప్రభావపూర్వకంగా పనిచేసేలా అతడికే వ్యక్తిగతమైన చికిత్స అందించవచ్చు. ఈ అధునిక ఆవిష్కరణలతో లాభాలివి...⇒ చాలా హాస్పిటల్స్లో ఇప్పటికే ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. ∙తమ జీవన నాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్ను) మెరుగుపరచుకుంటున్నారు. ∙ఎంతో డబ్బునూ, టైమ్నూ ఆదాచేసుకోవడమే కాదు... గతంలో పేషెంట్లకు ఉండే ఎన్నో బాధలూ, వెతలూ, వేదనలకు దూరంగా ఉంచగలగడం సాధ్యమవుతోంది.నిర్వహణ: యాసీన్డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కన్వీనర్, ఏఐ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – మెడికల్ సైన్సెస్ -
ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.నిధుల కొరతఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.తొలగింపుల ద్వారా ఎంతంటే..ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.వ్యూహాత్మక మార్పులునిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్వేర్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్లను ఒరాకిల్ కోరుతోంది.భారీ లక్ష్యాలుక్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం
భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఇండియా డిజిటల్ రంగంలో ఇప్పటికే ఆధార్, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్వికసిత్ భారత్ 2047‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్) రంగంలో సంస్కరణలు. -
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
దేశీయంగా ఏజెంటిక్ ఏఐ, స్పెషలైజ్డ్ జెన్ఏఐ నిపుణులకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్–సరఫరా మధ్య 50 శాతం పైగా వ్యత్యాసం ఉండగా, ఆయా ఉద్యోగాల పోస్టింగ్ల ఏటా 35–40 శాతం పెరుగుతోంది. 28,000 జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టు ప్రకారం కంపెనీలు ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐని ప్రయోగాత్మక పరీక్షలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. దీనితో పూర్తి స్థాయి సామర్థ్యాలున్న నిపుణులను నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతీయ ఏజెంటిక్ ఏఐ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఇది 276 మిలియన్ డాలర్లుగా నమోదైంది. సిస్టంలు స్వయంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోగలిగే మరింత అధునాతన కృత్రిమ మేథను ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తున్నారు.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ ఉద్యోగులకు జీతభత్యాలు సగటు స్థాయికంటే 20–28 శాతం అధికంగా ఉంటున్నాయి.70 –75 శాతం జీసీసీలు, భారీ కంపెనీలు అంతర్గతంగా నిర్మాణాత్మక ఏఐ శిక్షణ ప్రోగ్రాంల దన్నుతో 30–35 శాతం అడ్వాన్స్డ్ ఏఐ ఉద్యోగాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం అధునాతన ఏఐ నియామకాల్లో రిమోట్ ఉద్యోగుల వాటా 15–20 శాతం ఉండనుంది.మొత్తం ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వాటా 54 శాతం స్థాయిలో ఉండనుంది.టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్) సంస్థలు తమ ఉత్పత్తుల్లో 68 శాతం ఏజెంటిక్ ఏఐని పొందుపరుస్తున్నాయి.ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ వాటా 70 శాతం పైగా ఉంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారి రిక్రూట్మెంట్ 20 శాతం మేర ఉంటోంది. గవర్నెన్స్, సేఫ్టీ, ప్రోడక్ట్ స్ట్రాటెజీ విభాగాల్లో లీడర్íÙప్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.72 శాతం ఉద్యోగార్హతల్లో టూల్–కాలింగ్, ఆర్కె్రస్టేషన్ మొదలైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 63 శాతం ఉద్యోగాలకు రిట్రీవల్–ఆగ్మెంటెండ్ జనరేషన్ టూల్ సామర్థ్యాలు ఉండాలని కంపెనీలు అడుగుతున్నాయి. లాంగ్గ్రాఫ్, ఆటోజెన్, క్రూఏఐ నైపుణ్యాలకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది.మూడేళ్ల క్రితం కనిపించని చాలా మటుకు ఉద్యోగాలకు ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్ ఇంజినీర్లు, ఏజెంట్ బిహేవియర్ అనలిస్టులు, ఏజెంట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్టులు, వెక్టార్ డేటాబేస్ ఆర్కిటెక్టులు, ఏజెంట్ లైఫ్సైకిల్ మేనేజర్లు, ఏజెంటిక్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.భారత్లో టెక్నాలజీ నిపుణులకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేది కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, కెరియర్కి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రాంతాలవారీగా చూస్తే ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో బెంగళూరు, హైదరాబాద్ల వాటా దాదాపు 62 శాతంగా ఉంది. గవర్నెన్స్, వినియోగం, వర్క్ఫ్లో నిర్వహణలకు కేంద్రాలుగా ఎన్సీఆర్, పుణె, చెన్నై ఎదుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం హైరింగ్లో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, అహ్మదాబాద్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 10 శాతంగా ఉంది. -
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది. -
ఆ ఘటన యావత్ సమాజానికి ఒక హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.కేరళలో ఓ ప్రొఫెసర్కు వీడియో కాల్ వచ్చింది. సాధారణ కాల్ అని వీడియో ఆన్ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్ కట్ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI సృష్టించిన బొమ్మ అని తెలిసి... ప్రొఫెసర్ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్గా మార్ఫ్ చేయడం.... ఛత్తీస్గఢ్ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్ చేసిన కేసు..అస్సాం లో ఇంజినీర్ ఆన్లైన్లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీవిద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాల బారిన పడుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు... సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.సోషల్ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి. బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయంఅం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.ఫరీదాబాద్ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది... టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి.... -
ఏఐ మైక్రోఫిల్మ్ హ్యాకథాన్లో యువ చిత్రకారుల ఉత్సాహం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత కథనానికి దారి చూపిస్తూ సినిక్ సంస్థ ఏర్పాటు చేసిన జెన్ ఏఐ మైక్రోఫిలిం హ్యాకథాన్లో యువ చిత్రకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో నిర్వహించిన ఫిలిం హ్యాకథాన్లో 60 మందికి పైగా ప్రతిభావంతులైన ఫిలిం చిత్రాకారులు పాల్గొని సత్తా చాటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగిన ఈ హ్యాకథాన్లో వారు ఏఐని వినియోగించి 90 సెకన్ల మైక్రో సినిమాలను రూపొందించారు. మొత్తంగా వచ్చిన మైక్రో ఫిలింలలో మూడింటిని ఉత్తమ చిత్రాలుగా గుర్తించి వారికి సినిక్ వ్యవస్థాపకుడు భరత్ గుప్తా, సహ వ్యవస్థాపకులు పద్వీ రెడ్డి దేవిరెడ్డి, ఆకాశ్ చోడే బహుమతులు అందజేశారు. -
అంధులకు చదివే అదృష్టిం!
సాక్షి, హైదరాబాద్: సాధారణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు చదవడం మామూలు విషయమే. కానీ చూపులేని విద్యార్థులకు మాత్రం అదో పెద్ద ప్రహసనం. బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవడమే వారికి వీలవుతుంది. ఒకవేళ బ్రెయిలీలో నూతన ఎడిషన్లు అందుబాటులో లేకపోయినా, పేలవమైన ఆడియో రికార్డింగ్లు ఉన్నా లేక ఖరీదైన సాఫ్ట్వేర్లు అవసరమైనా వారు సర్దుకుపోవాల్సి ఉంటుంది.అయితే ఈ సమస్యకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్–ఐటీ) పరిష్కారం చూపించింది. కృత్రిమ మేధ (ఏఐ), భాషా సాంకేతికతల ఆధారంగా ‘దృష్టి’పేరుతో డిజిటల్ ల్రైబరీని అభివృద్ధి చేసింది. పూర్తిగా ఉన్నత విద్యా సంబంధ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ, ఆడియోబుక్ ఫార్మాట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలా పనిచేస్తుందంటే..: దృష్టి లైబ్రరీలో ఉపయోగించేఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ (ఓసీఆర్) వ్యవస్థ.. బొమ్మలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్ రూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్కాన్ చేసి చూపులేని విద్యార్థులకు అను కూలమైన ఫార్మాట్లలో వాటిని అందిస్తుంది. అంటే వాటిని బ్రెయిలీ లిపితో కూడిన అక్షరాలుగా మారుస్తుంది. అలాగే టెక్స్ట్టు స్పీచ్ టూల్స్ను ఉపయోగించి ఆయా పాఠ్యాంశాలను ఆడియోబుక్స్లాగా మార్పిడి చేస్తుంది. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసిన రీడర్ అప్లికేషన్ ద్వారా ఆడియోబుక్స్ను దృష్టి లైబ్రరీ అందిస్తుంది. 12 భాషల్లో..: ప్రస్తుతం దృష్టి లైబ్రరీలో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, పంజాబీ, తమిళం, ఒడియా భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకాలన్నింటినీ చూపులేని వారు సౌకర్యవంతంగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. అలాగే శ్రవణ అనుభవాన్ని సైతం పొందేందుకు వీలవనుంది. అంతేకాకుండా ఆడియో వేగాన్ని నచ్చినట్లుగా నియంత్రించడంతోపాటు బుక్మార్క్లు, పర్సనలైజ్ సెట్టింగ్స్, వాయిస్ ఆదేశాలతో నావిగేట్ చేసుకోవడం వీలవుతుంది.చూపులేని విద్యార్థులు, ఆయా విద్యాసంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగానే పరిశోధకుడు కృష్ణ తులసియన్ ట్రిపుల్–ఐటీ హైదరాబాద్లో ‘దృష్టి లైబ్రరీ’ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏఐ ఆధారిత భాషా వేదిక ‘భాషిణి’సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ‘దృష్టి’ప్ర«దానంగా యూజీ, పీజీ పాఠ్య పుస్తకాలనే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలు, పుస్తకాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.వినియోగం ఉచితమే.. అంధుల పాఠశాలలు, అభ్యాసకులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎక్కడున్నా కంటెంట్ను పొందేందుకు వీలుగా ‘దృష్టి’ని అభివృద్ధి చేశాం. ఖరీదైన సాఫ్ట్వేర్లను కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వాటిని అంధ పాఠశాలలకు అందిస్తాం. – ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ కంటెంట్ను అందించొచ్చు.. దృష్టి డిజిటల్ లైబ్రరీని ఓపెన్ ప్లాట్ఫాంపై రూపొందించడం వల్ల చూపులేని విద్యార్థులకు అవసరమైన కంటెంట్ను ఎన్జీవోలు, వలంటీర్లు, విద్యాసంస్థలు అందించేందుకు వీలవుతుంది. ఈ లైబ్రరీని విస్తరించాలంటే అందుకు అందరి తోడ్పాటు అవసరం. – ప్రొఫెసర్ జవహర్ -
హైదరాబాద్లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్ -
డేంజర్లో వైట్ కాలర్ జాబ్స్.. బిల్గేట్స్ హెచ్చరిక
ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కృత్రిమ మేధ (AI) నేడు ప్రతి రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తోంది. అయితే ఈ ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ హెచ్చరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."రాబోయే నాలుగైదు ఏళ్లలో అటు వైట్ కాలర్, ఇటు బ్లూ కాలర్ ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ అసమానతల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. న్యూ స్కిల్స్ను నేర్పించడం లేదా పన్ను వ్యవస్థలో మార్పులు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఏఐ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికి.. భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి. ఇప్పటికే ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ సమస్యలను పరిష్కరించకోకపోతే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే వెళ్లిపోతాయి. దీంతో సమాజంలో అసమానతలు పెరిగే అవకాశముంది" అని బిల్గేట్స్ పేర్కొన్నారు. -
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు -
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఏఐ హబ్లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్ఫ్రెండ్ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు.. -
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.ఇంతవరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.Yesterday one of our experienced engineers who works in my R&D team, showed me an assembly and machine code security tool he built in his spare time over the past month. I did not know he was building it. I was blown away by the depth and breadth of the tool. He has developed…— Sridhar Vembu (@svembu) January 8, 2026 -
CES 2026: లాలిపాప్తో మ్యూజిక్.. అదిరిపోయే గాడ్జెట్స్ మీకోసం
వాషింగ్టన్ డీసీ: హలో టెక్ లవర్స్. అమెరికాలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో జరుగుతుంది కదా. మరి ఈ టెక్ షోలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే గాడ్జెట్స్పాటు ఇతర ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, తెలుసుకుందాం పదండి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో సాధారణ గాడ్జెట్లు మాత్రమే కాకుండా, వినియోగదారులను ఆశ్చర్యపరిచే విచిత్రమైన ఉత్పత్తులు చూపరులను కట్టిపడేశాయి.వాటిల్లో ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్మగువుల కోసం ప్రత్యేకంగా ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్ను డిజైన్ చేశారు. ఇదే ప్రపంచంలోనే మొదటి డిజిటల్ మేనిక్యూర్ సిస్టమ్.ఇందులో ప్రెస్-ఆన్ నెయిల్స్లో మైక్రో డిస్ప్లే ఉంది. స్మార్ట్ఫోన్లోని యాప్ సాయంతో 400 షేడ్స్ను వెంటనే మార్చుకోవచ్చు. యాప్లో 400 వేర్వేరు షేడ్స్/రంగులు అందుబాటులో ఉంటాయి. యూజర్ యాప్లో తనకు నచ్చిన రంగును ఎంచుకుంటే, ఆ రంగు వెంటనే నెయిల్పై డిస్ప్లేలో కనిపిస్తుంది.అంటే,నెయిల్ పాలిష్ మార్చుకోవడానికి మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం యాప్లో టచ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా గోళ్ల రంగు డిజిటల్గా మారుతుంది. ఇది ఫ్యాషన్కి టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ.వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్లు C-200 అల్ట్రాసోనిక్ చెఫ్స్ నైఫ్వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్. దీని స్పెషాలిటీ ఎంతో తెలుసా?.ఈ కత్తి సాధారణ కత్తి కాదు. ఇందులో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ టెక్నాలజీ అమర్చబడి ఉంది.సెకనుకు 30వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. కఠినమైన కూరగాయలు, పండ్లు కూడా రెప్పపాటు కాలంలో కోయగలదు. ఆహారం బ్లేడ్కు అంటకుండా సాఫీగా కట్ అవుతుంది.ఈ కత్తి వంటగదిలో సులభంగా, వేగంగా, శుభ్రంగా కట్ చేయడానికి సహాయపడుతుంది. టమోటాలు, స్క్వాష్, దోసకాయ వంటి కూరగాయలు మాంసం, చేపలు,బ్రెడ్, పండ్లు ఇవన్నీ రెప్పపాటు కాలంలో కోయగలదు.సీ-200 అల్ట్రాసోనిక్ చెఫ్ వంటగదిలో టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ. ఇది కేవలం కత్తి మాత్రమే కాదు, వంటను మరింత సులభం, వేగం, శుభ్రంగా చేసే స్మార్ట్ కిచెన్ టూల్. ఇందులో 1100 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, యూఎస్బీ-సీ టైప్ ఛార్జింగ్ సౌకర్యం, అలాగే ఐపీ65 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. వంటగదిలో వినియోగించడానికి ఇది చాలా సులభంగా, సురక్షితంగా ఉంటుంది.లాలిపప్ స్టార్లాలిపాప్. స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చే ఓ తియ్యటి పదార్ధం. పిల్లలు, పెద్దలకు ఫన్ ట్రీట్ ఇచ్చే లాలిపప్కు ఓ టెక్ కంపెనీ బోన్ కండీషన్ టెక్నాలజీని జోడించింది. అంతే ఈ తరహా టెక్నాలజీ ఉన్న లాలిపాప్ను తిన్నప్పుడల్లా పాటలు వినొచ్చు. అదెలా అంటే లాలిపాప్ను కొరుక్కునప్పుడు, దాని హ్యాండిల్లోని చిన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ వైబ్రేషన్లు సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్లు మీ దవడ ఎముకల ద్వారా నేరుగా లోపలి చెవి భాగాలకు చేరుతుంది.పాటలు వినగలుగుతారు.ఎలక్ట్రానిక్ భాగం ఉన్నందున, పూర్తిగా తినకూడదు. కేవలం లాలిపాప్ భాగం మాత్రమే తినదగినది. సాధారణ హెడ్ఫోన్లతో పోలిస్తే శబ్దం తక్కువ స్పష్టంగా ఉండవచ్చు.వీరల్ సోలార్ ఛార్జింగ్ కోప్లౌ పవర్ హాట్ఈకోఫ్లో పవర్ హ్యాట్ (EcoFlow Power Hat) అనేది సోలార్ సెల్స్తో కూడిన వైడ్ బ్రిమ్ హ్యాట్. ఇది కేవలం సూర్యరశ్మి నుండి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, బయట నడుస్తూ లేదా అవుట్డోర్ యాక్టివిటీల్లో ఉన్నప్పుడు స్మార్ట్ఫోన్ వంటి చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హ్యాట్ చుట్టూ అమర్చిన సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి, గరిష్టంగా 12 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్ను యూఎస్బీఏ,యూఎస్బీ సీ పోర్టుల ద్వారా ఒకేసారి రెండు డివైస్లకు అందించవచ్చు. ఈటోపీ తేలికైన మెటీరియల్తో తయారు చేసింది. బరువు అనిపించదు. ఐపీ65 వాటర్ప్రూఫ్, డస్ట్ప్రూఫ్ రేటింగ్తో హైకింగ్, బీచ్ ట్రిప్స్, ఫిషింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీలకు అనుకూలంగా ఉంటుంది. ఔట్డోర్లో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లేకపోయినా, ఈ హ్యాట్ ద్వారా ఫోన్ లేదా చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ హ్యాట్ కేవలం సూర్యరశ్మిలో ఉన్నప్పుడు మాత్రమే పవర్ ఉత్పత్తి చేస్తుంది. 12డబ్ల్యూ పవర్ పరిమితి కారణంగా ల్యాప్టాప్లు లేదా పెద్ద గాడ్జెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదు.ఏఐ స్మార్ట్ క్లిప్పర్Glyde Smart Hair Clipper అనేది ఏఐ ఆధారిత పనిచేసే హెయిర్కట్ పరికరం. ఇది తల ఆకారాన్ని గుర్తించి బ్లేడ్ యాంగిల్, స్పీడ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా విజువల్ గైడెన్స్ అందిస్తూ, ఇంట్లోనే సలూన్-క్వాలిటీ హెయిర్కట్ చేస్తుంది. ఈ ఎయిర్ క్లిప్పర్ను తాజా ఈవెంట్లో పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత హెయిర్ క్లిప్పర్గా గుర్తింపు పొందింది. దీని లక్ష్యం ఒకటే ఎవరైనా, ఎలాంటి అనుభవం లేకపోయినా, 10 నిమిషాల్లో ఇంట్లోనే సెలూన్ క్వాలిటీ హెయిర్కట్ చేసేందుకు ఉపయోగపడటం. ఈ క్లిప్పర్లో ఎఐ స్టైలిస్ట్ అనే సిస్టమ్ ఉంటుంది. ఇది తల ఆకారాన్ని స్కాన్ చేసి, బ్లేడ్ యాంగిల్, స్పీడ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. కాబట్టి కత్తిరింపు సమయంలో పొరపాట్లు జరగకుండా, సాఫ్ట్గా, సమానంగా హెయిర్కట్ అవుతుంది.సాధారణ క్లిప్పర్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. యాప్ లేకుండా పూర్తి ఫీచర్లు ఉపయోగించలేరు. మొదటిసారి ఉపయోగించే వారికి కొంత సమయం పట్టవచ్చు. -
హెల్మెట్తో.. టెక్కీ బ్రిలియంట్ ఐడియా
సాక్షి,బెంగళూరు: ఐటీ ఉద్యోగి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పంకజ్ తన్వర్ తన హెల్మెట్ను వినూత్నంగా మార్చారు. సాధారణ హెల్మెట్ను కృత్రిమ మేధస్సు ఆధారిత రోడ్ సేఫ్టీ టూల్గా మార్చేశారు.పంకజ్ తన్వర్ ఆవిష్కరణ ఒక సాధారణ ఆలోచనతో మొదలైంది. ‘టెక్నాలజీని కేవలం సౌకర్యం కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలి’ అనే సదుద్దేశ్యంతో ఆయన ఈ హెల్మెట్ను రూపొందించారు.ఈ స్మార్ట్ హెల్మెట్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిర్ధారిత ఆధారాలు చేరుతాయి. ఫలితంగా, రోడ్లపై క్రమశిక్షణ పెరుగుతుంది. చిన్న ఆవిష్కరణ కూడా ప్రతిరోజు జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చగలదని నమ్ముతున్నారు.బెంగళూరులో పుట్టిన ఈ ఆవిష్కరణతో ఇన్నోవేషన్, టెక్నాలజీ కలిస్తే సమాజానికి ఎంతటి మేలు జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఒక సాధారణ హెల్మెట్ను ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ సాధనంగా మార్చిన పంకజ్ తన్వర్ ఆవిష్కరణ, రోడ్లపై క్రమశిక్షణను పెంచుతూ, ప్రజల జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చే దిశగా అడుగులు పడినట్లేనని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హెల్మెట్ ప్రత్యేకతలు ఈ స్మార్ట్ హెల్మెట్ రియల్ టైమ్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదువిజువల్స్ను క్యాప్చర్ చేయడంలొకేషన్ వివరాలు నమోదు చేయడం వాహన నంబర్ ప్లేట్ను గుర్తించడం సమాచారాన్ని ధృవీకరించి ట్రాఫిక్ పోలీసులకు పంపించడం విధంగా, రోడ్లపై జరుగుతున్న ఉల్లంఘనలకు తక్షణ సాక్ష్యాలు అందుబాటులోకి వస్తాయి -
ఆస్క్ మీ... ఏనుగంత టాస్క్
ఓపెన్ ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే చిన్న చిన్న సమస్యల్ని కాకుండా, పరిష్కారానికి అత్యంత కష్టంగా ఉండేవాటిని ఎంచుకోవాలని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టుగెదర్ ఫండ్’ కో–ఫౌండర్ మానవ్ గార్గ్ అంటు న్నారు. ఏఐ రంగంలో స్టార్టప్ పెట్టుబడుల వేటలో ఉన్నవారు తమ విజన్ ప్రపంచాన్ని ఎలా మెరుగుపరచ గలదో స్పష్టంగా చెప్పలేకపోతే వెంచర్ క్యాపిటలిస్టు లను ఒప్పించటం చాలా కష్టం అని గార్గ్ సూచిస్తు న్నారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:వస్తున్నది 100... పోతున్నది 110‘‘ప్రస్తుతం దాదాపు అన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. దీనర్థం ఏమిటంటే, మాకు వంద రూపాయల ఆదాయం వస్తే... కేవలం టెక్నాలజీ, కంప్యూటర్ సర్వర్ల కోసమే 110 రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక మార్కెటింగ్, ఉద్యోగుల జీతాల ఖర్చులు దీనికి అదనం. అలాగని ఇది తెలివి తక్కువ తనం కాదు, ఇదొక వ్యూహం. టెక్నాలజీ ఖర్చులు రాను రానూ వేగంగా తగ్గిపోతాయి కాబట్టి, ఇప్పుడు నష్ట మైనా సరే ఎక్కువ మంది వినియోగదారులను, డేటాను సంపాదించుకునే కంపెనీలే భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు మార్కెట్ను ఏలుతాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఖర్చు‘‘ఓపెన్–ఏఐ’ సంస్థ వేల కోట్లు నష్టపోతోందని వినిపి స్తోంది. వారు సుమారు 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడబోతున్నారని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నష్టంలో కేవలం 20 శాతం మాత్రమే కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వల్ల వస్తుంది. అసలైన భారీ ఖర్చంతా– దాదాపు 70 శాతం – ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. పెద్ద ఎత్తున డేటాసెంటర్ల నిర్మాణం, ఎంత వ్యయమైనా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనడం, కరెంట్ బిల్లుల చెల్లింపు వంటివి. గూగుల్ సంస్థలా సొంతంగా చిప్స్ తయారీ, సొంత డేటా సెంటర్లు ఏర్పాటు, ప్రత్యేక విద్యుత్ఒప్పందాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఏఐ వ్యాపారాన్ని లాభదాయకంగా నడపడం సాధ్య మవుతుంది.యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు!‘‘మనం ఇప్పుడు వాడుతున్న సాధారణ యాప్స్ భవి ష్యత్తులో మెల్లగా మరుగునపడిపోతాయి. రాబోయే కాల మంతా ‘ఏఐ ఏజెంట్’ (ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటి సాఫ్ట్వేర్)లదే. మనం గంటల కొద్దీ బ్రౌజింగ్ చేయటం ఉండదు. ఈ ఏఐ ఏజెంట్లకు మీ ఇష్టానిష్టాలు తెలు స్తాయి. మీ తరఫున అవి పనులు చేస్తాయి. మీ క్యాలెండర్ లేదా మీరు ధరించే వాచీలు వగైరాల నుంచి సమా చారాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు మీకు సాయపడ తాయి. ఒక్కసారి ఊహించండి:నా పర్సనల్ ఏఐఏజెంట్ నేరుగా అమ్మకాలు జరిపేవారి ఏఐ ఏజెంట్తో మాట్లాడుతుంది. నా బడ్జెట్ ప్రకారం బేరమాడుతుంది, నా ఆరోగ్యానికి తగిన, నా సమయానికి అనుకూలమైన వస్తువును ఎంచుకుంటుంది. ఆపై నేరుగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇదంతా నేను ఒక్క వెబ్సైట్ కూడా ఓపెన్ చేయకుండానే జరిగి పోతుంది.కొత్తవాటిపై కసరత్తు చేయాలి!‘‘మీరు ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే, అందరికీ తెలిసిన చిన్న చిన్న సమస్యలు కాకుండా, పరిష్కరించ డానికి కష్టంగా ఉండే కొత్త సమస్యలను ఎంచుకోవాలి. అప్పుడే మీ పోటీదారులు మిమ్మల్ని త్వరగా కాపీ కొట్ట లేరు. మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన డేటా ఆధారంగా ఇతరులు సులభంగా తయారు చేయలేని విధంగా మీ వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. ఏఐ రేసులో భారతదేశం శక్తిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఓపెన్–ఏఐ’ని ఎక్కువగా వాడు తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దగ్గర అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు. అంతేకాకుండా, ఇక్కడ చాలా రకాల వ్యాపారాలు ఇంగ్లిష్లోనే జరుగు తాయి కాబట్టి, భారతీయ కంపెనీలు మొదటి రోజు నుండే ప్రపంచ స్థాయిలో కొత్త ఏఐ ఉత్పత్తులను తయారు చేసే గొప్ప అవకాశం ఉంది.-ఎడిటోరియల్ టీమ్ -
ఏఐలో మనమేం చేయాలి?
‘డీప్సీక్’ గుర్తుందా? గడచిన 2025 మొదట్లో ఈ చైనీస్ కంపెనీ కృత్రిమ మేధ రంగాన్ని కుదిపేసింది. తక్కువ ఖర్చుతో అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ‘ఛాట్ జీపీటీ’ని తలదన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. కృత్రిమ మేధలో చైనా ఎంత ముందుందో ప్రపంచానికి చాటిన సందర్భం ఇది. తాజాగా అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ సైతం ‘డీప్సీక్’ ప్రాముఖ్యన్ని గుర్తించింది. కంపెనీ వ్యవస్థాపకుడు లియంగ్ వెన్ఫెంగ్ను గతేడాది టాప్ వ్యక్తుల్లో ఒకరిగా నిలిపింది. ఒకే ఏడాదిలో డీప్సీక్ తాలూకూ జనరల్ పర్పస్ వీ–3 మోడల్ విప్లవాత్మకమైన మార్పునకు కారణమైంది. దీంట్లోని అడ్వాన్స్డ్ మోడల్ ఆర్–1 తర్కానికి సంబంధించినది. ఫలితంగా ఇది గణిత, సాఫ్ట్వేర్ కోడింగులకు సంబంధించిన సంక్లిష్టమైన విషయాలను కూడా మెరుగ్గా చేపట్టగలదు. పైగా ఇది ఓపెన్ మోడల్. అంటే ఎవరైనా స్వేచ్ఛగా దీన్ని వేర్వేరు రంగాల్లో ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వాలంటే అపారమైన సమాచారం అవసరం. ఎంత సమాచారంతో శిక్షణ ఇస్తే అంత మెరుగైన ఫలి తాలు రాబట్టుకోవచ్చు. గతేడాది చైనీస్ ఏఐ మోడళ్లు మార్కెట్లో అన్నింటి కంటే ముందున్నట్లు ఒక సర్వే ద్వారా తెలిసింది. అంత ర్జాతీయంగా 33 శాతం మంది వీటిని వాడుతున్నట్లు అంచనా.ఇంగ్లీషు తరువాత అత్యధిక సంఖ్యలో టోకెన్లు అడిగింది కూడా చైనీస్ భాషలోనే కావడం గమనార్హం. చైనాతోపాటు అంతర్జాతీయంగానూ చైనా మోడళ్లు బాగా పనిచేస్తున్నాయనేందుకు ఇవి నిదర్శ నాలు. శిక్షణ సమయంలో ఏఐ మోడళ్లు ప్రాసెస్ చేసి అర్థం చేసు కోవడం ద్వారా అంచనా కట్టే, తర్కాన్ని అభివృద్ధి చేసుకునే యూనిట్లనే ‘టోకెన్లు’ అని పిలుస్తారు. ఏఐలో స్వావలంబన కోసం...డీప్సీక్ ప్రకటన వెలువడిన వెంటనే భారత్ కూడా ఎల్ఎల్ఎంలతో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాథమిక ఏఐ మోడళ్ల అభి వృద్ధి గురించి వివరాలు వెల్లడించింది. భారతీయ అవసరాలకు తగ్గట్టుగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా భాషిణి’ (భారతీయ భాషలను అను వదించేది), ‘భారత్ జెన్’ (ప్రభుత్వ సేవలను అందించే మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం), పదివరకూ భారతీయ భాషల ఏఐ ఎల్ఎల్ఎం మోడల్గా ‘సర్వం–1’, వీడియోలను సృష్టించే ‘చిత్ర లేఖ’, 35 వరకూ భారతీయ భాషలకు ‘హనూమాన్ ఎవరెస్ట్ 1.0’ పేరుతో ఓ ఏఐ వ్యవస్థ వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ‘భారత్ జెన్’ అభివృద్ధికి పలు టెక్నాలజీ విద్యా సంస్థలు చేతులు కలిపాయి.కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కొన్ని నిధులు సమకూర్చాయి. జాతీయ ఏఐ మిషన్ కింద మరో రూ. 980 కోట్లు కూడా కేటాయించారు. ఈ రకమైన మద్దతు లభించిన, ఒక దేశ లక్ష్యం కోసం ఏర్పాటైన మొట్టమొదటి ప్రాజెక్టు భారత్ జెన్ మాత్రమే అయివుంటుంది.భారత్ జెన్ను చాలామంది డీప్సీక్కు పోటీ అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. డీప్సీక్ పూర్తిగా వాణిజ్యపరమైంది. స్టార్టప్ మాదిరిగా మొదలైంది.భారత్ జెన్... వ్యూహాత్మకమైన జాతీయ మిషన్. సాంకేతిక రంగం విషయంలో స్వావలంబన కోసం ప్రభుత్వ మద్దతుతో మొదలైన ప్రాజెక్టు. డీప్ సీక్, ఛాట్జీపీటీల ముందున్న అతి పెద్ద సవాలు... సంక్లిష్టమైన భారతీయ భాషలను, సంస్కృతులను అర్థం చేసుకోవడం. ఈ అంత రాన్ని ‘భారత్ జెన్’ పూడ్చగలదని అంచనా. 1970, 80లలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సీఎంసీ, సీ–డాట్ కంపెనీల మాదిరిదే ఈ భారత్ జెన్. సీఎంసీ, సీ–డాట్లను దేశీ స్వావలంబన, ఆత్మనిర్భరత లక్ష్యాలతోనే ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం కావడం వెనుక ఐఐటీలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వంటిసంస్థలు కూడా ఉన్నాయి. అవసరమైన మార్గదర్శకాలుఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, భారతీయ టెక్ కంపె నీలేవీ ఏఐ ఫౌండేషనల్ మోడళ్లను అభివృద్ధి చేయకపోవడం. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏఐ వ్యవస్థలకు అవసరమైన డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. భార తీయ టెక్ పరిశ్రమ మొత్తం సేవా రంగం ప్రధానంగానే నడుస్తోంది. సుమారు 200 బిలియన్ డాలర్ల ఆదాయమున్న ఈ రంగం ఏఐ విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం అభిలషణీయం కాదు. నైపుణ్యం, అనుభవం, ఆర్థిక శక్తి కూడా కలిగిన భారతీయ టెక్ రంగం భారత్ జెన్ వంటి వాటి అభివృద్ధికి భాగస్వాములు కావాల్సిన అవసరముంది.ప్రభుత్వ సహకారం లేదు కానీ డీప్సీక్ అభివృద్ధి చేసిన మోడళ్లు చైనా ప్రభుత్వ పర్యవేక్షణకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుత చైనా నియంత్రణల ప్రకారం... అన్ని ఏఐ సేవలు కూడా సోషలిస్ట్ విలువలను పాటించాలి. జాతీయ ఏకతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే తియనాన్మెన్ స్క్వేర్ నిరస నలు, తైవాన్ పరిస్థితి, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై వస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల వంటి అంశాలపై ఈ మోడళ్లు కిమ్మనవు.బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి అన్న నినాదంతో మార్గదర్శ కాలను ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకత, జవాబుదారీ తనం, భద్రత, మానవ పర్యవేక్షణల ప్రాముఖ>్యన్ని, అవసరాన్ని ఈ మార్గదర్శకాలు నొక్కి చెప్పాయి.ప్రభుత్వ సహకారంతో నడుస్తోంది కాబట్టి, అటు ఈ మద్దతును కొనసాగించడం... ఇటు ప్రజా సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకోవడం భారత్ జెన్కు కీలకం. పాశ్చాత్య దేశాల ఏఐ మోడళ్లలో మాదిరి అల్గరిథవ్ుల పరమైన వివక్ష భారత్ జెన్లో ఉండకూడదు. రాజకీయ ప్రభావానికి గురిచేసేలా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొత్తం సామాన్యుల పన్నుల డబ్బుతోనే నడుస్తోంది. వేర్వేరు భాషలకు సంబంధించిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేసే సందర్భంలోనూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్ద పీట వేయాలి. భాషా శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, వేర్వేరురంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి అభివృద్ధి చేస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుందన్నది గుర్తుంచుకోవాలి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
గ్రోక్ను చుట్టుముట్టిన న్యూడ్ ఫోటోల వివాదం
న్యూఢిల్లీ: xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ ను న్యూడ్ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్ను ఆసరాగా చేసుకుని ఆకతాయిలు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రముఖుల ఫోటోలను న్యూడ్గా మారుస్తూ ప్రస్తుత సమాజానికి సవాల్ విసురుతున్నారు. ప్రైవేటు వ్యక్లుల ఫోటోలు ఇచ్చి న్యూడ్ పిక్స్గా ఇమ్మంట ప్రామ్టింగ్ చేస్తున్నారు వీటిని సోషల్ మీడియలో వైరల్ చేస్తున్నారు. దాంతో అమాయిక మహిళలు, చిన్న పిల్లలు ఈ చర్యలకు బలైపోతున్నారు. దీనిపై కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. Grok అనేది ఎలన్ మస్క్ స్థాపించిన xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్. ఇది “truth-seeking AI”గా పిలవబడుతూ, రియల్టైమ్ సెర్చ్, రీజనింగ్, కోడింగ్, విజువల్ ప్రాసిసింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. దీన్ని తప్పుదోవలో ఉపయోగిస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీని ఫలితంగా AI వినియోగంలో నైతికత, భద్రత అంశాలపై చర్చకు కారణమైంది. -
ఆనంద్ మహీంద్రా న్యూ ఇయర్ సందేశం
కృత్రిమ మేథ (ఏఐ)తో ఫ్యాక్టరీ టెక్నీషియన్లు, మెషినిస్టుల్లాంటి బ్లూకాలర్ ఉద్యోగులకు ముప్పేమీ ఉండదని, ప్రాక్టికల్ నైపుణ్యాలను వినియోగించి వారు మరింత ఆదాయం ఆర్జించేందుకు తోడ్పడే యాక్సిలరేటరుగా ఇది ఉపయోగపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఇంటెలిజెంట్ సిస్టమ్లు రొటీన్ పనులను నిర్వహించడం వల్ల ప్రాక్టికల్ నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని, ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఏఐ గురించి ఆందోళన చెందకుండా టెక్నీషియన్లు దానితో ధీమాగా కలిసి పని చేసే విధంగా మార్పులు వస్తాయని వివరించారు. దీన్ని తాము ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ పరమైన పరిణామాలతో బ్లూకాలర్ ఉద్యోగాలు కాస్తా ఆకర్షణీయమైన గోల్డ్ కాలర్ ఉద్యోగాలుగా మారతాయని తెలిపారు.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ: స్పందించిన జొమాటో సీఈఓమారుతున్న టెక్నాలజీ, భౌగోళిక - రాజకీయపరమైన పరిణామాలతో నూతన సంవత్సరంలో సర్వత్రా అనిశ్చితి నెలకొనవచ్చని మహీంద్రా చెప్పారు. అయితే అనిశ్చితిని శత్రువుగా పరిగణించకుండా, మన సత్తా నిరూపించుకునే అవకాశంగా భావించాలని సూచించారు. 2025లో ఎస్యూవీలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, మహీంద్రా ఫైనాన్స్ తదితర వ్యాపార విభాగాల్లో గ్రూప్ గణనీయ విజయాలు సాధించిందని ఆనంద్ మహీంద్రా చెప్పారు. -
పనికిరాని వీడియోలకు వ్యూస్
ప్రపంచంలో అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో విలువ లేని, పనికి రాని వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా బిలియన్ల కొద్దీ మొబైల్ స్క్రీన్పై దర్శనమిస్తున్నాయి. నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే షార్ట్స్లో ఏఐతో తయారైన బ్రెయిన్ రాట్ వీడియోలు అయిదింట ఒక వంతు కైవసం చేసుకున్నాయి. వీటితో వీక్షకులకు సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనంచేకూర్చకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్క్యాప్వింగ్ నివేదిక ప్రకారం... క్లౌడ్ ఆధారిత ఆన్లైన్ వీడియో ఎడిటర్ క్యాప్వింగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 15,000 యూట్యూబ్ చానెళ్లను కంపెనీ అధ్యయనం చేసింది. ప్రతి దేశం నుంచి టాప్–100 చానెళ్లు వీటిలో ఉన్నాయి. 278 చానెళ్లు పూర్తిగా ఏఐ స్లాప్ కంటెంట్ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. ఏఐ స్లాప్ చానెళ్లు 2025 అక్టోబర్ నాటికి 6,300 కోట్లకుపైగా వ్యూస్, 22.1 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించాయి. ఏటా ఇవి సుమారు రూ.1,050 కోట్లు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏఐ స్లాప్ యూట్యూబ్ చానెళ్లలో మన దేశానికి చెందిన ‘బందర్ అప్నా దోస్త్’అత్యధిక వ్యూస్తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ విభాగంలో ఏటా రూ.38 కోట్లకుపైగా ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. నివేదిక హైలైట్స్.. ⇒ 207 కోట్లకుపైగా వ్యూస్తో భారత్కు చెందిన ‘బందర్ అప్నా దోస్త్’ఏఐ స్లాప్ చానెల్ అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. ⇒ ప్రపంచంలో అత్యధికంగా స్పెయిన్కు చెందిన ట్రెండింగ్ ఏఐ స్లాప్ చానెల్స్కు 2 కోట్ల మందికిపైగా సబ్స్రై్కబర్స్ ఉన్నారు. ⇒ దక్షిణ కొరియాలో ప్రముఖ ఏఐ స్లాప్ చానెల్స్ 845 కోట్ల పైచిలుకు వ్యూస్ నమోదు చేశాయి. ⇒ యూఎస్లోని స్లాప్ చానెల్ క్యూంటోస్ ఫాసినాంటెస్ (సిక్) 59.5 లక్షల మంది సబ్స్రై్కబర్స్ కలిగి ఉంది. ⇒ కొత్త యూజర్లకు వచ్చే ఫీడ్లో తొలి 500 యూట్యూబ్ షార్ట్స్లో బ్రెయిన్రాట్ వీడియోలు దాదాపు 33% ఉన్నాయి. ⇒ నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే మొదటి 500 షార్ట్స్లో ఏఐ స్లాప్ వీడియోలు 21% కైవసం చేసుకున్నాయి.ఏఐ స్లాప్ తగినంత శ్రద్ధ, కచ్చితత్వం, ఆలోచన లేకుండా సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ కోసమే ఆటోమేటిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించి రూపొందించి, పంపిణీ చేసిన విలువ లేని, పనికిరాని ఏఐ వీడియోలు. కంటెంట్లో లోపాలకుతోడు ప్రతికూల ప్రభావాలకు ఇవి దారితీస్తాయి.బ్రెయిన్రాట్నియంత్రణ, అర్థం లేని, తక్కువ నాణ్యత గల ఏఐ, ఏఐ రహిత వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు వీక్షకుడి మానసిక, మేధోస్థితిని క్షీణింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. -
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం
ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్వర్డ్లు, హిస్టరీ, బుక్మార్క్లను వదులుకుని కొత్త బ్రౌజర్కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా? -
ఏఐపై అంబానీ ఫోకస్
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ కంపెనీగా మారే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. రిలయన్స్ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు. ఐడియాలకు ఆహ్వానం.. టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్వేర్, రోబోటిక్స్లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.మేనిఫెస్టో ఇలా..మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్ ఫంక్షనల్ కోర్ (డీఎఫ్సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు. -
ఏఐ జోష్ ఎలా బాస్!
కాలంతోపాటు ఉద్యోగుల పనితీరూ మారుతుంటుంది. ఆ పనితీరు ఎలా ఉండబోతుందనేదే అసలు సిసలు ప్రశ్న! ఇంతకీ 2026లో ఎలా ఉండబోతోంది? ‘ కంపెనీ అంటే ఏ.ఐ. మాత్రమే... ఉద్యోగులు నామమాత్రమే!’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఏ.ఐ. తాతలు దిగివచ్చినా ఉద్యోగి ఉద్యోగే’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఎట్ లీస్ట్ 70 అవర్స్ ఏ వీక్’ అంటున్నారు నారాయణమూర్తి.‘ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు... వారానికి ఆరురోజులు మాత్రమే’ అంటున్నారు ఆలీబాబా ఫౌండర్ జాక్ మా. ఈ పెద్దల ప్రతిపాదనలు ఉద్యోగులకు నచ్చాయా? పనితీరును, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం నుంచి ఉద్యోగానికి ఆవలి ప్రపంచాన్ని ఆస్వాదించడం వరకు కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం...భవిష్యత్లో ఉద్యోగుల పనితీరు ఎలా ఉండబోతుంది? కంపెనీలకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? ఉద్యోగులకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? సాంకేతికతే సర్వస్వం అన్నట్లుగా ఉంటుందా? నైతిక విలువలకు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చోటు ఉంటుందా? నిపుణులు చెప్పే సమాధానం మాత్రం ఇది.... ‘ఎంతమాత్రం ఏకపక్షం కాబోదు. కంపెనీకి, ఉద్యోగులకు పరస్పర ప్రయోజనకరంగానే ఉంటుంది’⇒ జీవనోత్సాహ ఉద్యోగంగతంతోపోలిస్తే... ‘ఏదో ఒక ఉద్యోగం లే’ అని సరిపెట్టుకోవడం లేదు యువత. ‘ఈ ఉద్యోగం నా కెరీర్కు ఏ మేరకు ఉపయోగపడుతుంది?’ అనే కోణంలో విశ్లేషించుకుంటున్నారు. ‘ఉద్యోగం అనేది జీవితాన్ని నిర్వీర్యం చేసేది కాదు, జీవనోత్సాహాన్ని ఇచ్చేది’ అనే ఎరుకతో జాగ్రత్తగా ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు. ‘చాలామంది ఉద్యోగులు తమ కెరీర్లో ఉన్నతిని కోరుకుంటున్నప్పటికీ, ఉద్యోగ జీవితానికి ఆవలి ప్రపంచాన్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు’ అంటున్నారు ముంబైకి చెందిన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కోచ్ భక్తి తలాటీ. వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోతే...భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి, వ్యక్తిగత స్చేచ్ఛకు అవకాశం ఇచ్చే చిన్న ఉద్యోగాల్లో సైతం చేరేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పనిగంటలకు సంబంధించి నారాయణమూర్తి, జాక్ మా ప్రతిపాదనలతో ఏకీభవించే వారితోపాటు తీవ్రంగా విభేదించే వారు కూడా యువతరంలో ఉన్నారు.⇒ ఇప్పుడు కావాలి... ఆరోగ్యకరమైన పనితీరు‘ఆరోగ్యకరమైన పనితీరు’కుప్రాధాన్యత పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పనితీరుకు సంబంధించి తమ సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి మిలీనియల్స్ ఆసక్తి చూపుతున్నారు. 2026లో... కంపెనీలలో భారీ జీతానికి ప్రతిభ, శ్రమ మాత్రమే తప్పనిసరి కొలమానం కాబోతోంది. ప్రతిభ కనబరిచే ఉద్యోగులను త్వరగా పై స్థాయికి తీసుకువెళ్లడం, ఉద్యోగులకు అనుకూలమైన లీవ్ పాలసీలు, అనుకూలమైన పనిగంటలు...మొదలైనవి కంపెనీల ప్రాధాన్యత జాబితాలో చేరనున్నాయి.⇒ అది ట్రెండ్ మాత్రమే కాదు...‘ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్... మైక్రోషిఫ్టింగ్ అనేది కేవలం ఫ్లెక్సిబిలిటీ ట్రెండ్ మాత్రమే కాదు. పనితీరును సరిగా అర్థం చేసుకొని, మెరుగైన పనితీరును కనబరచడం’ అంటున్నారు జెన్ జడ్ ప్లాట్ఫామ్ ‘అన్స్టాప్’ ఫౌండర్, సీఈఓ అంకిత్ అగర్వాల్. మరి ఏ.ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాటేమిటి? చాలామంది అనుకున్నట్లు ఉద్యోగాలుపోతాయా? ఎటు చూసినా ‘ఏ.ఐ. మాత్రమే’ అన్నట్లుగా ఉండబోతోందా అంటే– కాదనే అంటున్నారు అగర్వాల్.‘ఏ.ఐ. అనేది ఉద్యోగులు తమను తాము మెరుగుపరుచుకునేలా చేస్తుంది. మరిన్ని పనులు చేసేలా చేస్తుంది. షెడ్యూలింగ్, డాక్యుమెంటేషన్, రిసెర్చ్... మొదలైనవాటికి సంబంధించి మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉద్యోగులకు దొరుకుతుంది. క్రియేటివిటీ థింకింగ్కు సంబంధించి మనిషిని యంత్రం అనుకరించలేదు’ అంటున్నారు అగర్వాల్.⇒ సిద్ధం కావాల్సిందే!సరికొత్త సాంకేతికత సరికొత్త పనితీరుకు కారణం అవుతుంది. ‘ఇంటెలిజెంట్ సిస్టమ్స్తో కలిసి పనిచేయడానికి ప్రతి ఉద్యోగి సిద్ధం కావాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏ.ఐ. అంటే బెదిరిపోవడం కాదు, ఏ.ఐ.తో కలిసి ఆలోచించేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి’ అంటున్నారు సాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సింధు గంగాధరన్.ఏడీపీ... ఇలా చెబుతోంది...2026లో పని ప్రదేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎంత? ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు... మొదలైన విషయాలపై లీడింగ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ‘ఏడీపీ’ ఒక నివేదిక రూపొందించింది. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగుల ముందు అవకాశాలతోపాటు సవాళ్లు కూడా ఉంటాయి. స్కిల్ అనేది సరికొత్త కరెన్సీగా మారనుంది. యాంత్రీకరణ అనేది ఉద్యోగుల పనితీరును మార్చబోతుంది.ప్రోడక్టివిటీకి ఉపయోగపడే, వ్యక్తిగత జీవితానికి భారం కాని పనితీరుకు ఉద్యోగులుప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఏడీపీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్. ‘ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, ఫైనాన్షియల్ప్లానింగ్, కేర్గీవింగ్ రిసోర్సెస్, స్ట్రెస్మేనేజ్మెంట్లాంటి వాటిపై నిర్మాణాత్మక కార్యక్రమాలు మరింతగా విస్తరించనున్నాయి. చాలా కంపెనీలు, చిన్న పట్టణాలలో నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంచుకోవడానికి హబ్–అండ్–స్పోక్ అ్రపోచ్ను అనుసరిస్తున్నాయి’ అని ఏడీపీ సర్వే రిపోర్ట్ చెబుతుంది.హైబ్రీడ్ క్రీప్–2026‘గతంతోపోల్చితే ఇంటినుంచి పనిచేసే వారి కంటే ఆఫీస్కు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య కొత్త సంవత్సరంలో పెరగనుంది. హైబ్రీడ్ క్రీప్ (క్రమంగా పెరుగుతున్న ఇన్–ఆఫీస్ రోజుల సంఖ్య) తీవ్రతరం అవుతుంది’ అంటున్నారు వోల్ ల్యాబ్స్ సీఈఓప్రాంక్ విషాఫ్ట్. ‘ఇంటి నుంచి పని చేసినా ఫరవాలేదు. ఆఫీస్ నుంచి పనిచేసినా ఫరవాలేదు’ అనే వెసులుబాటు ఉద్యోగులకు ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఆఫీసు నుంచి పనిచేయక తప్పదు’ అనే ధోరణి పెరిగింది.నైపుణ్యమే అసలు సిసలు డిగ్రీ‘ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ మాత్రమే ప్రధానం’ అనే నిబంధన రాబోయే రోజుల్లో మరింతగా సడలిపోనుంది. ‘స్కిల్–ఫస్ట్ రెవల్యూషన్’లో డిగ్రీల కంటే నైపుణ్యానికేప్రాధాన్యత పెరగనుంది. కంపెనీలకు సంబంధించి ఆన్–ది–జాబ్ బూట్క్యాంప్స్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానున్నాయి. ‘డిగ్రీ ఆధారిత ఉద్యోగ నియామకాల కంటే, నైపుణ్యాల ఆధారిత ఉద్యోగ నియామకాల ధోరణి 2026 ఊపందుకుంటుంది.అలా అని డిగ్రీ ఉన్న వాళ్లప్రాధాన్యత ఏమీ తగ్గదు’ అంటున్నారు అమెరికాలోని నేషనల్ యూనివర్శిటీలో వర్క్ఫోర్స్ అండ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ గ్రాహం. -
అమెరికన్ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్
అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది. -
ట్రెండ్గా డ్రోన్ స్టైల్ వీడియో..!
డ్రోన్–స్టైల్ వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది. మరి మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో కావాలనుకుంటున్నారా?మీరు ఒకే అంటే ఇలా...గూగుల్ జెమిని ఓపెన్ చేయాలి ∙సెలెక్ట్ చేసుకున్న ఫొటోను అప్లోడ్ చేయాలి ∙ పొడి పొడిగా కాకుండా ప్రాంప్ట్ అనేది స్పష్టంగా, వివరంగా, సాధారణ భాషలో ఉండాలి. మన ప్రాంప్ట్ను అర్థం చేసుకొని షార్ట్ వీడియోను క్రియేట్ చేస్తుంది జెమిని. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేయవచ్చు. ‘రీల్’గా అప్లోడ్ చేయవచ్చు. ట్రెండింగ్ మ్యూజిక్, కాప్షన్స్, హ్యాష్ట్యాగ్ ఉపయోగించవచ్చు.డ్రోన్ షాట్స్ శాంపిల్ ప్రాంప్ట్స్:‘క్రియేట్ ఏ 360 డిగ్రీ డ్రోన్ షాట్ వీడియో’ ∙క్రియేట్ ఏ 360–డిగ్రీ డ్రోన్ షాట్’ ∙‘జనరేట్ ఏ రియలిస్టిక్ ఏరియల్ డ్రోన్ వీడియో’.(చదవండి: Dhurandhars Dhoodh Soda: ధురంధర్ మూవీ క్రేజ్తో వైరల్గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?) -
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా? -
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం -
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. -
నాకా పిల్ల నచ్చింది.. విడాకులివ్వు..
పెద్దాయన్ని చూశారా? చైనాకు చెందిన ఈయన వయసు 75 ఏళ్లు. ఈ ముదిమి వయసులో తన భార్యను విడాకులు ఇస్తావా లేదా అని పదేపదే ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటారా? ప్రేమలో పడ్డాడు మరి. ఈ వయసులో ఎవరితోనబ్బా అంటే.. ఏఐ జనరేటెడ్ ఆన్లైన్ మోడల్తో. జియాంగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏఐ మహిళా అవతార్ను చూశాడు. యువతకైతే అది ఏఐ సృష్టి అని తెలిసిపోతుంది. కానీ ఈయనకు ఆ విషయం తెలియక అమ్మాయి అని భ్రమపడ్డాడు. పైగా ఆమె అందమైన రూపానికి తోడు ఆకట్టుకునే గాత్రం, సంభాషణలు చూసి మరీ ఫిదా అయిపోయాడు. రోజూ గంటల తరబడి ఫోన్లోనే కాలం గడపడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన జియాంగ్ భార్య.. గట్టిగా తిట్టడంతో భార్యతో విడిపోతే ఆమెతో కాలం గడపొచ్చని విడాకులు అడగడం మొదలుపెట్టాడు. చివరకు జియాంగ్ పిల్లలు అది ఏఐ సృష్టి అని.. నిజమైన మనిషి కాదని చెప్పి ఒప్పించేసరికి వారి తల ప్రాణం తోకకొచి్చంది. ఏం ఏఐనో ఏంటో.. ముందుముందు ఏమేం చిత్రవిచిత్రాలు చూడాలో అనిపిస్తోంది కదా? -
శబరిమలకు ఆధునిక సాంకేతికత.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం) -
చిన్న సంస్థలకు ఏఐ దన్ను
కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీఎక్స్), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో 6.4 కోట్ల ఎంఎస్ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.నివేదికలో మరిన్ని అంశాలు..కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు. ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ -
సత్య సారథ్యంలో సమూల మార్పులు!
సాఫ్ట్వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.పాత పద్ధతులకు స్వస్తి‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?
ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక విప్లవంలా దూసుకుపోతోంది. పనులను సులభతరం చేస్తూనే, మరోవైపు డేటా గోప్యత, డీప్ఫేక్స్ వంటి రూపాల్లో సరికొత్త సవాళ్లను విసురుతోంది. సాంకేతికత అందించే ఫలాలను అందుకుంటూనే, దానివల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భారత్లో ఏఐని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన చట్రం, తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.భారత్లో ఏఐ నియంత్రణభారతదేశంలో ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేకమైన ఏకీకృత చట్టం లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం వివిధ ప్రస్తుత చట్టాలు, కొత్త మార్గదర్శకాల ద్వారా ఏఐ వినియోగాన్ని నియంత్రిస్తోంది. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందడానికి, పనిచేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ఈ డేటాను ఎలా సేకరించాలి, ఎలా వాడాలి అనే అంశాలను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP Act), 2023 నియంత్రిస్తుంది. ఏఐ మోడల్స్ వ్యక్తిగత డేటాను ఉపయోగించే ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం డేటా ఉల్లంఘనలు జరిగితే ఏఐ సంస్థలపై భారీ జరిమానాలు (రూ. 250 కోట్ల వరకు) విధించే అవకాశం ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000, 2025 సవరణలుప్రస్తుతానికి ఐటీ చట్టమే డిజిటల్ రంగంలో ప్రాథమిక చట్టంగా ఉంది. 2025లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. తప్పుదోవ పట్టించే ఏఐ కంటెంట్ లేదా డీప్ఫేక్స్ను నిరోధించే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లదే. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం తప్పనిసరి.ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు 2025నవంబర్ 2025లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అధిక రిస్క్ ఉన్న ఏఐ అప్లికేషన్లపై కఠినమైన నిఘా అవసరం. స్టార్టప్లు ఏఐ సాంకేతికతను సురక్షితమైన వాతావరణంలో పరీక్షించుకునేలా ప్రోత్సహించాలి.బ్యాంకింగ్ రంగంలో ఏఐ వాడకంపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా లోన్ అప్రూవల్స్ వంటి వాటిలో ఏఐ వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.ప్రస్తుత చట్టాలు ఏఐకి పూర్తిస్థాయిలో సరిపోవని నిపుణుల అభిప్రాయం. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకోకుండానే ప్రజా భద్రత, గోప్యతను కాపాడటం అనే సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ కోసం మరింత సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు -
భారత్లో చాట్జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు
చాట్జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీలాంటి ప్లాట్ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎల్ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ వివరించింది.టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్ఎల్ఎం ఆధారిత యాప్ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్లో చాట్జీపీటీ అగ్రగామి ఎల్ఎల్ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్లో ఉంటోంది. చాట్జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు. జూలైలో చాట్జీపీటీ డౌన్లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్లో పర్ప్లెక్సిటీ డౌన్లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.ఎల్ఎల్ఎం యాప్ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్ఎల్ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది. స్థానిక ఎల్ఎల్ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్లపై గ్లోబల్ ఎల్ఎల్ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
AI ని అడిగినా చార్ట్ GPT ని అడిగినా చంద్రబాబు స్కామ్ ల బాగోతం చెబుతాయి
-
సామాన్యుడి చేతిలో సమస్తం!
ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్లను డౌన్లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్ఫోన్లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు -
శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!
ఆంధ్రప్రదేశ్లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా?.. శ్రీలీల ఏం చెప్పిందంటే.. సోషల్ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ ఉంది. సోషల్మీడియాలో ట్రోల్స్కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్లైన్లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్ చిన్మయి, హీరోయిన్ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ట్రోల్స్ వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్తో పాటు ఏఐ మార్ఫింగ్ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి ట్రోల్స్ వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
ఏఐ మాయ.. ఆ లిస్ట్లో మరో హీరోయిన్.. ..!
టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.తాజాగా లిస్ట్లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్లో రాసుకొచ్చింది.(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. It has come to my attention that AI-generated images misusing my identity and a recent photograph I shared on my social media are being circulated online.The creation and circulation of such content without consent is deeply disturbing, unacceptable, and unlawful. It…— Nivetha Thomas (@i_nivethathomas) December 17, 2025 -
శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పలు రకాలుగా వినియోగంలోకి వచ్చేసింది. మిగతా విషయాల్లో ఏమో గానీ సినిమా వాళ్లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. దీని బారిన పడగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకెదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కొన్నింటిని చూసి చాలా డిస్ట్రబ్ అయిపోయానని చెప్పింది.'ఏఐ నాన్సెన్స్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. టెక్నాలజీ వినియోగానికి ఓ పద్ధతి అంటూ ఉంది. ఇది మన జీవితాల్ని సులభతరం చేయడానికి. సంక్లిష్టం చేసుకోవడానికి కాదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల బయట జరిగే చాలా విషయాలు నాకు తెలియవు. అయితే ఓ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. చాలావాటిని నేను లైట్ తీసుకుంటాను. కానీ ఇది మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటీ నటీనటులు కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి మాకు అండగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇకపై సంబంధిత అధికారులు ఈ విషయాన్ని చూసుకుంటారు' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.అయితే రీసెంట్ టైంలో శ్రీలీల ఫొటోలని కొన్నింటిని ఏఐ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఇవి నిజమే అని భ్రమపడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తోంది.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
చాట్జీపీటీ 'అడల్ట్ మోడ్'.. పెద్దల కోసం స్పెషల్ కంటెంట్!
దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్ఏఐ (OpenAI) పెద్దలకోసం 'అడల్ట్ మోడ్' అందించడానికి సిద్ధమైంది. ఇది ఎప్పటి నుంచి అంబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.అడల్ట్ మోడ్ ఫర్ చాట్జీపీటీ (ChatGPT) 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. కొత్త GPT-5.2 మోడల్పై బ్రీఫింగ్ సందర్భంగా ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో ప్రకటించారు. ఇది కేవలం వెరిఫైడ్ అడల్ట్స్ కోసం మాత్రమే. వయసు నిర్దారణతోనే ఈ ఫీచర్స్ యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు.చాట్జీపీటీ అడల్ట్ మోడ్.. వినియోగం కేవలం పెద్దలకు మాత్రమే. దీనిని మైనర్లు ఉపయోగించుకుండా ఉండేందుకు సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో వయస్సు అంచనాకు సంబంధించిన విషయాలను ధృవీకరించడానికి టెస్టింగ్ జరుగుతోందని సిమో పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలిఅడల్ట్ మోడ్ ఖచ్చితంగా ఆప్ట్-ఇన్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. కంటెంట్ను అన్లాక్ చేయడానికి వినియోగదారులు స్పష్టంగా అభ్యర్థించి ధృవీకరణను పాస్ చేయాలి. అప్పుడే దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ మోడ్ పరిమితులకు లోబడి ఉంటుంది.We made ChatGPT pretty restrictive to make sure we were being careful with mental health issues. We realize this made it less useful/enjoyable to many users who had no mental health problems, but given the seriousness of the issue we wanted to get this right.Now that we have…— Sam Altman (@sama) October 14, 2025 -
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
గోస్ట్ వేర్హౌస్లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. -
ఆ తల్లి కొడుకు కార్పెంటర్ అయితే చాలు అనుకుంది..! కట్చేస్తే..
తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్ఎహెచ్ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్. అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది. ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్ప్రైజెస్కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది. -
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది. ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్జీపీటీతో ఇంగ్లిష్లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..టాప్–10 (అంచనా వాటా):భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)జపాన్ – ~10% (≈ 80 వేలు)యుకే – ~8% (≈ 64 వేలు)జర్మనీ – ~7% (≈ 56 వేలు)ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)కెనడా – ~6% (≈ 48 వేలు)దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)ఈ సంఖ్య భారత్లో సుమారు 1.44 లక్షలుపురుషులు: ≈ 67,000స్త్రీలు: ≈ 67,000ట్రాన్స్జెండర్లు: ≈ 2,500భారత్లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలుఇంగ్లిష్/హింగ్లిష్: ~55%హిందీ/హింగ్లిష్: ~25%ప్రాంతీయ భాషలు: ~20% (చదవండి: సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..) -
ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!
టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్ స్టాక్ప్రైస్ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.ఏఐ పెట్టుబడులుటెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుఐటీ కంపెనీలు స్టార్టప్లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.మానిటైజేషన్ మోడల్స్ఏఐ ఆధారిత టూల్స్కు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ మోడల్ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్లను కూడా ఆకర్షించవచ్చు.మానవ వనరుల పెంపుఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.సవాళ్లు అధిగమించాలంటే..పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్! -
లైన్ డ్రాయింగ్ కోసం..
బొమ్మల పుస్తకంలోకి వెళితే పుస్తకంలోకి వెళ్లినట్లు మాత్రమే ఉండదు. మరో ప్రపంచంలో అడుగు పెట్టినంత ఆనందంగా ఉంటుంది. బొమ్మల ప్రపంచానికి ‘ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్’ అనేది మైండ్–బ్లోయింగ్ అప్గ్రేడ్. ‘నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. కానీ గీయడం మాత్రం రాదు’ అనేవారికి ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్లు బెస్ట్ ఫ్రెండ్స్! బొమ్మలు గీయడం ఏమాత్రం రాక΄ోయినా తమ ఊహలను ‘ఏఐ లైన్ డ్రాయింగ్’తో బొమ్మలుగా మలచవచ్చు.కొన్ని ఫ్లాట్ఫామ్స్....ఓపెన్ఆర్ట్ (ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) దీనిలో పోర్టయిట్స్, అబ్స్ట్రాక్ట్, ఫ్లోరల్, ఫ్యాషన్ అనే విభాగాలు ఉన్నాయి.ఏఐలైన్ ఆర్ట్.కామ్ పోర్టయిట్.యాప్/ఫొటో–టు–లైన్ ఆర్ట్ ‘కన్వర్ట్ ఇమేజ్ టు లైన్ డ్రాయింగ్ ఇన్ సెకండ్స్’ అంటోంది ఐకలరింగ్ఏఐ ఫోటర్ (ఫ్రీ ఆన్లైన్ ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) న్యూ ఆర్క్.ఏఐ. ప్రోమీఏఐప్రో కాన్వా.కామ్/ఏఐ–ఆర్ట్–జనరేటర్ ఏఐ–డ్రా.టోక్యో (చదవండి: -
డ్రాపౌట్ టు బిలియనీర్
సెల్ఫ్–మేడ్ బిలియనీర్ల సక్సెస్ స్టోరీలు ఎంతో ఆసక్తిగా వినేవాడు ఆదర్శ్ హిరేమర్. ‘మెర్కోర్’ స్టార్టప్తో తాను కూడా సెల్ఫ్– మేడ్ బిలియనీర్ల జాబితాలో చిన్న వయసులోనే చేరిపోయాడు. ఇది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమఫలం. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’తో విశిష్ఠ విజయాన్ని సాధించాడు 22 సంవత్సరాల ఆదర్శ్...ట్రెండన్ ఫుడీ, సూర్య మిదా (ఇద్దరి వయసు 22 ఏళ్లు)తో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’ ప్రారంభించాడు ఆదర్శ్. ఈ స్టార్టప్ ఇటీవల పది బిలియన్ డాలర్ల విజయాన్ని అందుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫేస్బుక్ను ప్రపంచానికి పరిచయం చేసిన ‘టెక్ టైటాన్’ మార్క్ జుకర్బర్గ్ రెండు దశాబ్దాల రికార్డ్ను బ్రేక్ చేసింది. సిలికాన్వ్యాలీలోని బే ఏరియాకు చెందిన ఈ ముగ్గురు స్నేహితులు ఒక స్కూల్లో జరిగిన డిబేట్ సందర్భంగా మొదటిసారిగా కలుసుకున్నారు. బెల్లార్మైన్ కాలేజిలో చదువుకునే రోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన థీల్ ఫెలోషిప్ అందుకున్నారు. ఆ తరువాత కాలేజికి గుడ్బై చెప్పారు.స్టార్టప్ ప్రారంభించారు..డాటా లేబులింగ్, ఏఐ మోడలింగ్ ట్రైనింగ్కు సంబంధించి తక్కువ టైమ్లోనే ఈ స్టార్టప్ మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్స్, బ్యాంకర్ల రూపంలో కంపెనీలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షిక రికరింగ్ రెవెన్యూ(ఏఆర్ఆర్) 500 మిలియన్ డాలర్లు.‘ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ స్టార్టప్ లేకపోతే కాలేజీలోనే చదువుతూ ఉండేవాడిని’ నవ్వుతూ అంటాడు ఆదర్శ్. కాలేజీ రోజుల్లో క్రమశిక్షణ, కొత్త విషయాలపై ఆసక్తితో ఉండేవాడు ఆదర్శ్. ఆ రెండూ తనకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. పని బాగా నచ్చితే పనిలాగా అనిపించదు. ఆదర్శ్ విషయంలోనూ ఇదే జరిగింది. కంపెనీ ప్రారంభించిన తరువాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా పని గురించే ఆలోచిస్తుంటాడు!‘మెర్కోర్’ స్టార్టప్ సూపర్ సక్సెస్కు కారణం ఏమిటి?ఆదర్శ్ మాటల్లో చె΄్పాలంటే.. ‘ఏఐ ల్యాబ్లు, కస్టమర్లు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయం అది. ఆ సమయంలోనే మేము మెర్కోర్తో ఏఐ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. కొద్ది కాలంలోనే వారు ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం మేము కావడం సంతోషంగా ఉంది’ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఆదర్శ్కు మన దేశంతో బలమైన భావోద్వేగ బంధం ఉంది. అతడి తల్లిదండ్రులు కర్నాటకకు చెందిన వారు..‘ఇండియాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు’ అంటాడు ఆదర్శ్. సైజబుల్ ఆపరేషన్స్, ప్రొడక్ట్స్, ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ టీమ్తో గ్లోబల్ ఏఐ టాలెంట్లో తనదైన పేరు తెచ్చుకుంది మెర్కోర్. ‘ఏఐ రెవల్యూషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి’ అనే విమర్శతో ఆదర్శ్ ఏకీభవించడు. ‘ఏఐ ద్వారా సరికొత్త లేబర్ మార్కెట్ ఏర్పడుతుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏఐతో ఎలాంటి భయం అవసరం లేదు. ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని మెరుగుపరిచింది’ అంటాడు ఆదర్శ్.నెక్స్ట్ ఏమిటి!కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆసక్తి నాకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడింది. ఇప్పుడు అసలు సిసలు సవాలు ఏమిటంటే నెక్ట్స్ ఏమిటి? అనేది. ప్రజలు ఇప్పుడు దీని గురించే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందుకే మా ప్రాధాన్యత జాబితాలో....‘నెక్ట్స్ ఏమిటీ?’ అనేది కూడా ఉంటుంది.– ఆదర్శ్ (చదవండి: ఇండిగో...ఇదిగో! నో డిలేస్, నో డైవర్షన్స్...) -
పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ‘ఏఐ’
న్యూయార్క్: ఏఐ. కృత్రిమ మేధ. కొన్నేళ్లుగా ప్రపంచాన్నే ఏలుతున్న సరికొత్త సాంకేతిక విప్లవం. దాని రూపకల్పనలో శ్రమించిన వారందరికీ సమష్టిగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గౌరవం దక్కింది. గురువారం ఒక ప్రకటనలో మేగజైన్ ఈ మేరకు వెల్లడించింది. కృత్రిమ మేధ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని రీతిలో సింహగర్జన చేసిన ఏడాదిగా 2025ను అభివర్ణించింది. ‘సొంతంగా ఆలోచించే యంత్రాలు మొదలుకుని ఒకప్పుడు అసాధ్యమని భావించిన వాటన్నింటినీ సుసాధ్యం చేస్తున్న సాంకేతిక అద్భుతం ఏఐ. దాన్ని స్వప్నించి, శ్రమించి చివరికి సాధించిన వ్యక్తులందరూ 2025కు గాను పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి అర్హులే‘ అని పేర్కొంది. ’వ్యక్తులు మాత్రమే కాదు, సంస్థలు, కాన్సెప్టులను కూడా ఈ పురస్కారానికి ఎంపిక చేశాం’ అని టైమ్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ వివరించారు. -
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు! -
హైదరాబాద్లో లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ల విస్తరణ
గ్లోబల్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ విభాగంలో సర్వీసులు అందిస్తున్న అప్గ్రాడ్ (upGrad) హైదరాబాద్లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీని ద్వారా ‘ఫిజిటల్’(ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్వర్క్ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్ను తీర్చేందుకు ఉపయోగపడుతందని కంపెనీ తెలిపింది.అప్గ్రాడ్ ఇప్పటికే పుణె, కోల్కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ కేంద్రాలను స్థాపించినట్లు చెప్పింది. హైదరాబాద్ ఇప్పుడు ఈ నెట్వర్క్లో కీలక ప్రాంతమని పేర్కొంది. కంపెనీ తన విస్తరణ రోడ్మ్యాప్లో భాగంగా మార్చి 2026 నాటికి ఈ నెట్వర్క్ను 40 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్లో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్తో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్గ్రాడ్ కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించాలని నిర్ణయించింది. కంపెసీ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి ప్రవేశించినప్పటికీ యాజమాన్యాలు ఆశించే నైపుణ్యాలకు, సాంప్రదాయ సంస్థలు అందించే వాటికి మధ్య అంతరం విస్తృతంగా ఉంది. దాన్ని పూడ్చేందుకు మా కేంద్రాలు ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది? -
AI ఎఫెక్ట్ తో కోర్టులను ఆశ్రయిస్తున్న సినీ తారలు
-
ఇంటి కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ..
పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్ వంటగదులనే అందిస్తున్నారు. మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్నెస్ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.వంటలో సహాయం.. కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్ కిచెన్లో హెడ్ చెఫ్కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్ చెఫ్’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్పుట్ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.ఆహార వ్యర్థాల తగ్గుదల.. స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్ కుక్టాప్లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది. సవాళ్లున్నాయ్.. ఏఐ కిచెన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. వంట గదిలో ఆటోమేటెడ్ కుకింగ్ అసిస్టెంట్లు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్ బేస్డ్, విజువల్ గైడ్లు ఏఐ కిచెన్ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. -
ఏఐ చాట్బాట్తో జర జాగ్రత్తోయ్..!
సాంకేతిక అందుబాటులోకి రావడంతో నగరంలో చాట్బాట్ వినియోగం భారీగా పెరుగుతోంది.. ఐటీ, రీసెర్చ్ స్కాలర్స్, జెన్ జీ యువత ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక అవసరానికి ఏఐని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి వివిధ రకాల సాధనాలు అందుబాటులకి రావడంతో సమాచారం కోసం కొందరు.. టైంపాస్ కోసం మరి కొందరు వీటిని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. అయితే ప్రాంప్టింగ్ సరిగా లేకపోతే.. తిప్పలు తప్పవని, సరైన సమాచారం రాబట్టాలంటే.. సరైన ఇన్పుట్ కూడా అవసరమని, ఒకవేళ ప్రాంప్టింగ్ ద్వారా సమాధానం పొందినా.. దీనికి ఫ్యాక్ట్ చెక్ కూడా అవసరం అని చెబుతున్నారు టెక్ నిపుణులు.. దీనిని గుర్తెరిగి సరైన రీతిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా నగర జీవనశైలిపై ఈ చాట్బాట్ వినియోగం ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ప్రతి చిన్నవిషయానికీ వీటిపై ఆధారపడుతున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. సాంస్కృతిక నగరి హైదరాబాద్లో సాంకేతిక వినియోగం పెరుగుతోంది. ఓ వైపు రాయదుర్గ్–ఫైనాన్షియల్–డ్రిస్టిక్ట్లోని ఐటీ కార్యాలయాల్లోని ఉద్యోగులు.. రీసెర్చ్ చేయడానికి నగరానికి వచ్చే విద్యార్థులు, ప్రముఖులు, పనుల్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఏఐ చాట్ ప్లాట్ఫామ్పై ఆధారపడుతున్నారు. గ్లోబల్ స్థాయిలో కొన్ని పెద్ద కన్సూ్యమర్–ఫ్రెండ్లీ చాట్ బోట్స్ (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్ప్లెక్సిటీ)తో పాటు ఉత్సాహభరితమైన స్థానిక–ఇండియన్ సంస్థలతో పాటు ఎన్నో సొల్యూషన్స్ మెరుగైన ఇంటిగ్రేషన్లు అందుబాటులోకి తేవడంతో ఈ తరహా ఎకోసిస్టమ్ వేగంగా పెరుగుతోంది. ఇండియన్ చాట్బాట్ బూమ్.. ప్రధానంగా నగరంలో వినియోగించే వేదికలు రెండో తరానికి చెందినవి. ప్రపంచ స్థాయి జనరల్–పర్పస్ చాట్ ఏజెంట్లు (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్ప్లెక్సిటీ, బింగ్ కాపీలాట్ మొదలైనవి) కాగా.. స్థానిక/ఎంటర్ప్రైజ్ ఆధారిత కన్వర్జేషనల్ ఏఐ ప్లాట్ఫామ్స్ (హాప్టిక్, యెల్లో.ఏఐ, యూనిపోర్) వంటివి.. అలాగే చిన్న స్టార్టప్స్, బాట్స్, వెర్బల్ ఇన్ఫో–సర్వీసులు హైదరాబాద్ వ్యాపారాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల ఇండియన్ మార్కెట్లోనే వందలకొద్దీ ప్లేయర్లు, బిజినెస్–సొల్యూషన్లు అందుబాటులో ఉన్నట్లు అంచనాలు. ఇది భారతీయ చాట్బాట్కి బూమ్ అని పిలుస్తున్నారు. లైఫ్ స్టైల్లో సౌలభ్యాలు.. దీనికి సంబంధించి నగర సౌలభ్యాల్లో భాగంగా పనితీరు పెరుగుతుంది. కోడింగ్–హెల్ప్, డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, ఈ మెయిల్ టెంప్లెట్లు, ఐడియాస్.. అధికారికంగా ఇతరుల సహాయం పొందాల్సిన పనులు, ఇండిపెండెంట్గా వేగంగా చేయొచ్చు. విద్యార్థులు, పరిశోధకుల కోసం 24/7 తక్షణ సమాధానాలు, ట్యుటోరింగ్, అల్గారిథమ్ వివరణలు, పాఠ్యాంశాల ఇతివృత్తాలు సమగ్రంగా అందిస్తుంది.. స్థానిక భాషలకు మద్దతు ఇచ్చేలా కొన్ని ఇండియన్ వేదికలు తెలుగు/హిందీ/తమిళ్/కన్నడ వంటి స్థానిక భాషలను అందజేస్తున్నాయి. షార్ట్–ఫార్మాట్ కస్టమర్–సపోర్ట్ కోసం ఉత్తమమైన మార్గం. నష్టాలు, కొత్త సవాళ్లు.. నగర స్థాయిలో వినియోగం పెరగడంతో మిస్–ఇన్ఫర్మేషన్, ప్రైవసీ సమస్యలు, స్కామ్స్, ఉద్యోగ మార్పులు వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయని ఇటీవల బహుళ–ఆధారాల పరిశోధనలు చెబుతున్నట్లు తెలుస్తోంది. చాట్మోడల్స్ ప్రజానీక అభిప్రాయాలపై ప్రభావం చూపగలవు కానీ, వాస్తవికత (అక్యూరసీ)లో పొరపాట్లు ఉండవచ్చు. దీంతో నగరంలోని డిజిటల్–సోఫిస్టికేషన్లో కొన్ని వర్గాలు జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధాన సమస్య..ఆటోమెషన్. దీని కారణంగా రిటైల్, కాల్–సెంటర్, మొదలైన జాబ్స్లో మార్పులు, ఫ్రోజన్లు (డీప్ ఫెక్), వాయిస్ స్కామ్లు వంటివి సరిగా గుర్తించలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.ప్రాంప్టింగ్ ఎందుకు ముఖ్యం? ప్రాంప్ట్ అనగా మన ప్రశ్నకు–రూపం. కాంటెక్ట్స్ ఇవ్వడంలో మెళకువులు తెలిసి ఉండాలి.. ఇది ఏఐతో అనుసంధానం చేసేటప్పుడు ‘కేమికల్ మిక్స్’ లాగా పనిచేస్తుంది. సరైన ప్రాంప్ట్ ఉంటేనే సమాచారం షార్ప్, యాప్ట్గా వస్తుంది. అదే సమయంలో సరైన మార్గదర్శకాలు లేకపోతే పొరపాట్లు దొర్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు తప్పుడు కంటెంట్ వచ్చే అవకాశాలే ఎక్కువని గుర్తించాలి. వీటిని గమనంలో ఉంచుకోవాలి.. హైదరాబాద్ తరహా నగరాల్లో ఈ ఏఐ చాట్ వేదికలు మన దైనందిన జీవనశైలిని, పని సదుపాయాలను, విద్యా సాధనాల్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. సరైన జ్ఞానం, నైతికత, ఫ్యాక్ట్–చెకింగ్తోనే ఈ టెక్ సదుపాయాన్ని సమర్థవంతంగా మార్చుకోగలం. ఇందులో భాగంగా పనిలో ఎటువంటి ఏఐ టూల్ ఉపయోగించిందో గమనించాలి. ప్రైవసీ సెట్టింగ్స్, డేటా షేరింగ్ స్క్రీన్లు చూస్తూ ఉండాలి. ప్రధాన సమాచారానికి రెండు వేర్వేరు సోర్సుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ప్రాంప్ట్–స్కిల్స్ వల్ల సరైన మార్కెట్ లాభాలు పొందగలం. ‘తెలుగులో స్కోర్–పాస్స్ కోసం 250 పదాల్లో వ్యాసం’ లాంటిది. ఫార్మాట్ గుర్తించడంలో భాగంగా బుల్లెట్ పాయింట్స్, సమ్మరీ, కోడ్ శాంపిల్స్ వినియోగించడం అవసరం. ఇది ఏ స్లాట్స్పై ఆధారపడింది అనే వాలిడేషన్ అడగడం మంచి అలవాటు. సున్నితమైన నిర్ణయాలు (న్యాయ, వైద్య) కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!) -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
ఓపెన్ఏఐని మించిపోనున్న గూగుల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్బాట్లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం -
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
గుండెకు గుండె! వినూత్న పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్టెక్ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.పనిచేస్తుందిలా..వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్ యాప్నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్ -టైమ్లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది. -
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు. -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
నాలుగేళ్లు కష్టపడి రూ.9 వేలు సంపాదన
ప్రియమైన వ్యక్తి కష్టపడి, కన్నీళ్లను దాటి విజయం సాధించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అది కేవలం విజయం కాదు, ఏళ్లుగా పంచుకున్న కలలు, వెన్నుదన్నుగా నిలిచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలంగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి అపురూప క్షణమే ఢిల్లీకి చెందిన ఓపెన్సాక్స్.ఏఐ (Opensox.ai) వ్యవస్థాపకుడు అజిత్ జీవితంలో చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు నాలుగేళ్ల శ్రమ తర్వాత యూట్యూబ్ నుంచి మొదటి సంపాదన అందుకున్నాడు. దీని వివరాలు అజిత్ సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.అనుమానించినా నమ్మకం కోల్పోలేదుఅజిత్ తన తమ్ముడి విజయాన్ని ఆన్లైన్లో పంచుకున్నప్పుడు ఆ పోస్ట్ తక్షణమే వేలమంది దృష్టిని ఆకర్షించింది. ‘నా తమ్ముడు ఈ రోజు కోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు’ అని చెప్పాడు. తన చుట్టూ ఉన్నవారంతా తమ్ముడిని అనుమానించినా అజిత్ మాత్రం నిరంతరం అతనికి వెన్నుదన్నుగా నిలిచారు. ‘అతను తన కలలను పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను’ అని అజిత్ రాశారు. ‘ప్రతి ఒక్కరూ అతనిని చూసి నవ్వినప్పుడు తనకు అండగా నేను మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. యూట్యూబ్ ద్వారా తన తమ్ముడు నాలుగేళ్లు కష్టపడి రూ.9000 సంపాదించినట్లు ఉన్న స్క్రీన్షాట్ను పంచుకున్నారు. ఎంత డబ్బు అకౌంట్లో క్రెడిట్ అయిందనే విషయాన్ని పక్కనుంచితే ఈ పోస్ట్ భావోద్వేగ సంతృప్తిని కలిగించినట్లు చెప్పుకొచ్చారు.my younger brother has been working hard for the last 4 years to see this day.first income from youtube. ❤️still remember when everyone used to laugh at him and i was the only one he had to share things about his dreams.day is made. ❤️ pic.twitter.com/t4TYoiJGAk— Ajeet ( opensox.ai ) (@ajeetunc) December 1, 2025కష్టానికి దక్కిన ప్రతిఫలంతమ్ముడి విజయాన్ని ప్రకటించిన అజిత్ పోస్ట్పై నెటిజన్లు స్పందించారు. ఒక వినియోగదారు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ‘ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేస్తే ప్రజలు ఎలాంటి పాయింట్ లేకుండా విమర్శిస్తారు. కానీ చాలా కష్టపడి పనిచేసిన తర్వాత బహుమతి పొందడం చాలా తృప్తిని ఇస్తుంది’ అన్నారు. మరొక వినియోగదారు ‘గత కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన కృషికి ఇది ప్రతిఫలం. అతనికి ఆల్ ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..!
టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. “When truth can be manufactured, discernment becomes our greatest defence.”AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025 -
యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్: ఎవరీ అమర్ సుబ్రమణ్య?
యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఎంఎల్ రీసర్చ్, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేషన్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.ఎవరీ అమర్ సుబ్రమణ్య?ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ పనిచేశారు.పీహెచ్డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా మైక్రోసాఫ్ట్కు మారాడు. గూగుల్లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్లో సీపీవీగా చేరారు. -
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు. -
ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..
ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్ల వద్ద 3K వీడియో రిజల్యూషన్లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.


