ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్‌! | Infosys Narayana Murthy Warning to Indian Youth Master AI or Miss Out | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్‌!

Feb 26 2026 7:25 PM | Updated on Feb 26 2026 7:35 PM

Infosys Narayana Murthy Warning to Indian Youth Master AI or Miss Out

యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”
జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్‌గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.
“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చ
ఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్‌ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్‌ (Claude) ప్లాట్‌ఫామ్ ఆఫీస్‌ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.

లీగల్‌ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్‌ఫ్లో మేనేజ్‌మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.

“భయపడకండి… సిద్ధం అవ్వండి”
ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement