Artificial Intelligence (AI)
-
మాకూ సైబర్ ముప్పుంది
సాక్షి, హైదరాబాద్: సైబర్ ముప్పునకు గురవుతున్న వారిలో అన్ని రంగాల్లోని ప్రముఖులు సైతం ఉంటున్నారు. సాధారణ వ్యక్తులను టార్గెట్ చేయడం కంటే పెద్ద కంపెనీల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కొట్టేయొచ్చన్న ధోరణిలో ఆన్లైన్ మోసగాళ్లు ఉంటున్నారు. దీంతో తమకూ ఆర్థిక నేరాల ముప్పు (ఫైనాన్షియల్ క్రైం రిస్క్) తప్పదన్న ఆందోళనలో భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు ఉంటున్నారు.క్రోల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 96 శాతం మంది భారతీయ ఎగ్జిక్యూటివ్లు ఈ ఏడాది ఫైనాన్షియల్ క్రైం రిస్క్ తప్పదన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత దాడులకు తాము లక్ష్యంగా ఉన్నామని భారత్లోని 76 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 68 శాతం మంది పేర్కొన్నారు.భారతీయ ఎగ్జిక్యూటివ్లలో 36 శాతం మంది తమ కంపెనీలు సైబర్ దాడులను ఎదుర్కొనే పటిష్ట వ్యవస్థలు కలిగి ఉన్నట్టు తెలిపారు. కంపెనీల వద్ద సరైన సాంకేతికత లేకపోవడం సైబర్ దాడుల ముప్పు పెరిగేందుకు కారణమని 36 శాతం మంది వెల్లడించారు. అయితే, ఏఐ, మెషీన్ లెర్నింగ్తో సానుకూల ప్రభావం ఉంటుందని 32 శాతం మంది.. వీటితో ముప్పు పెరిగిందని 52 శాతం మంది చెప్పారు. కంపెనీలు సైబర్ భద్రత ముప్పును తప్పించుకునే పటిష్ట వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఏజెంట్లపై ఆర్టీఏ 'ఐ'!
సాక్షి, హైదరాబాద్: ఏజెంట్లు, దళారుల ఆట కట్టించేందుకు రవాణాశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అస్త్రాన్ని ప్రయోగించింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నిఘా కెమెరాలు క్లిక్మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ నమోదవుతుంది. ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు? ఏ పని కోసం వచ్చాడనేది ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా ఏజెంట్లు, దళారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాల వద్ద తిష్ట వేస్తారు. నిఘా కెమెరాల్లో వాళ్లకు సంబంధించిన కోడ్ నంబర్లు పదేపదే నమోదవుతాయి. ఒక రోజులో, ఒకవారంలో ఒక కోడ్ ఎన్నిసార్లు కనిపించింది అనే విశ్లేషణ ఆధారంగా దళారులను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సీసీ కెమెరాలు విజయవంతంగా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు విస్తరించనున్నారు. చెక్పోస్టుల్లోనూ వీటిని ఏర్పాటుచేసి రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. వారంలోనే 45 మందిని పసిగట్టిన ఏఐ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు వారం రోజుల్లో 45 మంది పదేపదే ఆఫీసుకు వచ్చినట్లు పసిగట్టాయి. ఆర్టీఏ ప్రాంగణంలోనే ఉన్నఈ సేవా కేంద్రంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మినహాయించి మిగతావాళ్లంతా ఏజెంట్లుగా తేలింది. దీంతో ఏజెంట్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్టీఏ సేవల కోసం వచ్చేవాళ్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా పోలీసులతో ఆంక్షలు విధించారు. ఆ తరువాత రెండు వారాల్లోనే దళారుల రాకపోకలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ నిఘా వ్యవస్థను త్వరలో సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఆ తర్వాత మెహిదీపట్నం, ఉప్పల్, బండ్లగూడ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, మలక్పేట, నాగోల్ తదితర ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లకు విస్తరించనున్నారు. ఆ తదుపరి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏజెంట్లదే హవాకొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహాయంతో అన్ని రకాల పౌరసేవల్లో హవా కొనసాగిస్తున్నారు. క్లర్క్లు, అసిస్టెంట్లుగా పనులు చక్కబెడుతున్నారు. వీరు అధికారుల వద్ద కీలకంగా మారటంతో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, తదితర పనుల కోసం వచ్చేవారు ఈ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల కార్యాలయాల వెలుపల బాహాటంగానే దుకాణాలు తెరుచుకొని పని చేస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు కూడా ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో పౌరసేవలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రెండు రెట్లు అధికంగా సమరి్పంచుకోవలసి వస్తోంది. ఏజెంట్లను అరికట్టేందుకు ఇప్పటివరకు 17 రకాల సేవలను ఆన్లైన్లోకి మార్చారు. కానీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అవి పారదర్శకంగా అమలు కావడం లేదు. చెక్పోస్టుల్లో ఏఐ నిఘా రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్పోస్టులకు కూడా ఏఐ నిఘా వ్యవస్థను విస్తరించనున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసేందుకు భైంసా, కామారెడ్డి, జహీరాబాద్, అలంపూర్, క్రిష్ణా, విష్ణుపురం, నాగార్జునసాగర్, కోదాడ, మద్దునూరు, సాలూరు, వాంకిడి, కల్లూరు, అశ్వారావుపేట, పాల్వంచలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. నిజానికి దేశవ్యాప్తంగా నేషనల్ పరి్మట్ విధానం, జీఎస్టీ అమల్లోకి వచి్చన తరువాత ఈ చెక్పోస్టుల అవసరం లేకుండా పోయింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో చెక్పోస్టులను ఎత్తేసినా తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి. -
సాఫ్ట్వేర్ కెరియర్.. ఓపెన్ఏఐ సీఈవో వార్నింగ్!
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.అప్పుడది.. ఇప్పుడిది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.ఈ అంచనాలను ఆల్ట్మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగేకొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు. -
గ్రోక్ను బ్యాన్ చేస్తారా?
-
ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం నిత్యం సవాలుగా మారుతోంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా కార్యకర్తలు) మాతా శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా నిలుస్తున్నారు. అపారమైన అంకితభావంతో ఉన్న ఈ ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాధ్వానీ ఏఐ అభివృద్ధి చేసిన ‘శిశు మాపన్’ను వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలందిస్తున్నారు.శిశువుల ఆరోగ్య పర్యవేక్షణశిశు మాపన్ అనేది నవజాత శిశువుల ఆంత్రోపోమెట్రిక్ కొలతలు(ఎత్తు-నిలబడినప్పుడు కుర్చునప్పుడు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత..)ను రికార్డ్ చేయడంలో ఆశా వర్కర్లకు సహాయపడటానికి రూపొందించిన అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఈ కొలతలు పిల్లల ఆరోగ్యం, సంరక్షణకు కీలకమైన సూచికలుగా ఉంటాయి. సాంప్రదాయకంగా ఈ కొలతలను సేకరించడానికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం అవుతాయి. కానీ దీనివల్ల సేకరించే డేటాలో కచ్చితత్వం లోపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో ‘శిశు మాపన్’ ద్వారా ఈ సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేశారు.ఎలా పని చేస్తుందంటే..ఆశా వర్కర్లు బేసిక్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి నవజాత శిశువుకు చెందిన చిన్న వీడియోను రికార్డ్ చేస్తారు. రియల్ టైమ్లో కచ్చితమైన కొలతలను అందించడానికి ఇందులోని ఏఐ వీడియోను ప్రాసెస్ చేస్తుంది. బేసిక్ కెమెరా సామర్థ్యాలతో పాత స్మార్ట్ఫోన్లలోనూ పనిచేసేలా ఈ యాప్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది భారతదేశం గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ (హెచ్బీఎన్సీ) కార్యక్రమానికి అనుసందానం అయి ఉంటుంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు నిరంతరాయంగా శిశువు సంరక్షణ చర్యలు ట్రాక్ చేసేందుకు వీలవుతుంది.శిశు మాపన్ మొబైల్ అప్లికేషన్లో ఆశా వర్కర్లు కచ్చితమైన, స్థిరమైన కొలతలను రికార్డ్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత టూల్ శిశువుల నుంచి వెంటనే ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన మెడికేషన్ కోసం ప్రాథమికంగా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియల క్రమబద్ధీకరణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నవజాత శిశువులు, వారి కుటుంబాలకు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను కూడా పెంచుతుంది.ఆశా వర్కర్లకు సాధికారతశిశు మాపన్ యాప్ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 450 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చిన దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం గణనీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ఆశావర్కర్లకు వారి దినచర్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఈ ఏఐ ఆధారిత టూల్ను తమ పనిలో అనుసంధానించడం ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో మెరుగైన ఫలితాలను అందించడానికి ఆశావర్కర్లు సన్నద్ధమయ్యారు.ఇదీ చదవండి: దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!ఏఐలో నిత్యం వస్తున్న ఆవిష్కరణలు విభిన్న రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారుమూల ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారాలు అందుతున్నాయి. దాంతోపాటు పనులు సులువుగా, కచ్చితత్వంతో పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. ఏఐ కేవలం టెక్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుందనే అపోహలకు దూరంగా, స్మార్ట్ పరికరాలపై కొంత అవగాహన ఉన్న సామాన్యులకు కూడా చేరువవుతోంది. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి, మరింత మందికి సర్వీసులు అందించేలా కంపెనీలు, వ్యవస్థలు కృష్టి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ ఏఐ మిషన్ పార్లమెంట్తో ఒప్పందం
భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో స్వావలంబన దిశగా భారతఏఐ మిషన్ భారత పార్లమెంటుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చాట్ జీపీటీని పోలిన లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్ (ఎల్ఎల్ఎం)తో సహా స్వదేశీ కృత్రిమ మేధ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పార్లమెంటు విస్తృతమైన బహుభాషా డేటాసెట్లను ఉపయోగించుకోవాలని ఈ సహకారం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను సృష్టించే అవసరాలను నొక్కి చెబుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైసినా డైలాగ్ 2025’ సందర్భంగా ఈమేరకు వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఏఐ మిషన్ దేశం ప్రత్యేక అవసరాలను తీర్చే ఏఐ సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీల వాడకం దీర్ఘకాలంలో నిలకడగా ఉండకపోవచ్చు. సొంత దేశీయ ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పార్లమెంటుతో భాగస్వామ్యం డేటా సెట్లకు అవకాశం కల్పిస్తుంది. ఇది కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కీలకమైన వనరుగా పనిచేస్తుంది. దూరదర్శన్, ఆలిండియా రేడియో వంటి సంస్థల నుంచి అదనపు డేటాసెట్లు ఈ చొరవకు మరింత తోడ్పాడు అందుతుంది’ అని చెప్పారు.లాభాపేక్షలేని సంస్థ నుంచి లాభాపేక్ష సంస్థగా ఓపెన్ఏఐని మార్చడంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి లాభాపేక్ష సంస్థగా మారితే ఓపెన్ఏఐ తన పేరును కూడా మార్చుకోవాలని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలో సొంత జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) చిప్ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని మంత్రి చెప్పారు. స్వదేశీ జీపీయూ సామర్థ్యాన్ని సాధించేందుకు పట్టే కాలపరిమితి గురించి అడిగినప్పుడు వైష్ణవ్ మాట్లాడుతూ మూడు నుంచి ఐదేళ్లలో సహేతుకమైన మంచి సామర్థ్యాన్ని పొందడానికి వీలైన జీపీయూ సాధిస్తామన్నారు.ఇదీ చదవండి: ఫస్ట్టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్నర్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ ధామ్ మాట్లాడుతూ జీపీయూ అభివృద్ధికి మంత్రి ఇచ్చిన గడువు చాలా సహేతుకంగా ఉందన్నారు. భారత్ తన సొంత ఏఐ మోడల్ను నిర్మించుకోవడానికి ఓపెన్ఏఐ వంటి ఓపెన్సోర్స్ మోడల్స్ను ఉపయోగించుకోవాలని, కానీ రహస్య కార్యకలాపాలకు పాశ్చాత్య ఏఐ నమూనాలను ఉపయోగించరాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతాయని చెప్పారు. అందుకోసం జీపీయూ వృద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తరహా ఫండింగ్ను ఈ విభాగంలో ప్రవేశపెట్టాలని సూచించారు. వచ్చే 2-3 ఏళ్ల పాటు ఏఐకు ఇదే తరహా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. -
జీసీసీలు అంటే ఏమిటి? అవి ఎందుకు?
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో జీసీసీల ఏర్పాటు అధికమవుతోంది. అసలు ఈ జీసీసీలు ఏమిటనే అనుమానం కొంతమందిలో ఉంది. జీసీసీలు ఏమిటి.. ఎందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లుగా పిలువబడే ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీలు) బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో స్థాపించే ప్రత్యేక వ్యాపార యూనిట్లు. ఈ కేంద్రాలు గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, కంపెనీకి విలువను జోడించడానికి స్థానిక ప్రతిభను, నైపుణ్యాలను, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తాయి. జీసీసీలు ఏర్పడకముందు కూడా ఇలాంటి విధానం అమల్లో ఉండేది. గతంలో ఔట్ సోర్సింగ్ కోసం బ్యాక్ ఆఫీసులను ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమల్లో ఇన్నోవేషన్ హబ్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లుగా కార్యకాలాపాలు సాగించేవి. క్రమంగా అవి జీసీసీలుగా మారాయి.ఎందుకోసం అంటే..సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్లో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ) విభాగంలో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి కీలకమైన బిజినెస్ విధులను నిర్వహిస్తాయి. గ్లోబల్ క్లయింట్లకు అధిక క్వాలిటీ కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ను అందిస్తాయి. కొన్ని జీసీసీలు వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో సహా స్థిర ఇంధన పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి.ఈ నగరాలు ముందంజలో..నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సహాయక విధానాలు, స్థానిక ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అధునాతన మౌలిక సదుపాయాల కారణంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాలు ముందంజలో ఉండటంతో జీసీసీలకు గ్లోబల్ హబ్గా మారుతున్నాయి. వివిధ విభాగాల్లో సృజనాత్మకతను జోడించడంలో, ప్రపంచ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో జీసీసీల సాంకేతిక అభివృద్ధి పాత్ర కీలకంగా మారుతుంది.సాప్ట్వేర్ డెవలప్మెంట్వివిధ పరిశ్రమల కోసం ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కేంద్రాలు తరచుగా నిర్దిష్ట వ్యాపార అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను సృష్టించడంలో తోడ్పడుతాయి.ఏఐ, మెషిన్ లెర్నింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఆవిష్కరణల్లో జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, అటానమస్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తారు. ఉదాహరణకు, జీసీసీలు సంభాషణాత్మక ఏఐ టూల్స్, కస్టమర్ సర్వీస్ చాట్ బాట్లను అభివృద్ధి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీకొన్ని జీసీసీలు క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రత్యేకత కలిగి ఉంటాయి. సంస్థల డేటాను సమర్థవంతంగా నిల్వ చేయడానికి, నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి డేటాను, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడటంపై దృష్టి సారిస్తాయి.ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)ఈ కేంద్రాలు తరచుగా ఐఓటీ సంబంధిత ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తాయి. డేటాను సేకరించి ప్రాసెస్ చేయగల స్మార్ట్ పరికరాలను, అందుకు అవసరమయ్యే వ్యవస్థలను సృష్టిస్తాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీల నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్ సొల్యూషన్స్ వరకు దాదాపు అన్ని రంగాల్లో డిజిటల్ అప్లికేషన్లను తయారు చేస్తాయి.రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్/ వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో పరిష్కారాలను అన్వేషించడానికి టెక్నాలజీ ఆధారిత జీసీసీలు ఆర్ అండ్ డీలో భారీగా పెట్టుబడులు పెడుతాయి. భవిష్యత్తు వ్యాపారాలపై ప్రయోగాలు, ఆవిష్కరణలు చేసేందుకు తోడ్పడుతాయి.ఖర్చు నిర్వహణభారతదేశంలో చౌకగా మానవవనరుల లభ్యత ఉంటుందనే అభిప్రాయలున్నాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా బహుళజాతి సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను ఆప్టిమైజ్ చేసుకోవడానికి జీసీసీలు వీలు కల్పిస్తాయి. ఇది కంపెనీలు పరిశోధన, అభివృద్ధిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి తోడ్పడుతుంది.ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?టాలెంట్ డెవలప్మెంట్శ్రామిక శక్తిని పెంచడం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను తిరిగి నేర్పించడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతాయి. ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను సరఫరా చేస్తాయి. -
వెల్త్టెక్ ప్లాట్ఫామ్లకు ఏఐ దన్ను
వ్యక్తిగత రుణంపై 20 శాతం పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓ ఐటీ ప్రొఫెషనల్కి కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో సమస్యకు ఓ పరిష్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏఐ ఆధారిత వెల్త్టెక్ ప్లాట్ఫాంకు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్పై అత్యంత చౌకగా 10.5 శాతానికే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మరో ఇన్వెస్టరుకు.. సదరు ఫండ్ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్టెక్ ప్లాట్ఫాం మానిటరింగ్ సాధనాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు.ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుపరులు కూడా అందుకోవడంలో వెల్త్టెక్ స్టార్టప్లు దన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తుండటంతో దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫాంలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోను, రిసు్కలను అధిగమించడంలోను తోడ్పాటునిస్తున్నాయి. టెక్సై రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ సేవల మార్కెట్ 2023లో 429.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాదే ఏఐ అప్లికేషన్స్ తోడ్పాటుతో ఈ రంగం 1–2 బిలియన్ డాలర్ల మేర పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో సంపన్నులు, టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. వందకు పైగా అంకురాలు..అధ్యయన సంస్థ ట్రాక్షన్ ప్రకారం ప్రస్తుతం దాదాపు 122 అంకురాలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. ఇన్వెస్టర్ఏఐ అనే సంస్థ నేరుగా బ్రోకరేజ్ ప్లాట్ఫాంలతో అనుసంధానమై సరీ్వసులు అందిస్తోంది. చాట్జీపీటీ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బ్రూస్ కీత్ వెల్లడించారు. దీనితో ట్రేడింగ్లో 70% వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయన్నారు. మైఫై అనే మరో స్టార్టప్ సంస్థ, మార్కెట్ ధోరణులను విశ్లేషించి, తగిన పెట్టుబడి వ్యూహాలను సూచించేందుకు ఏఐ, జెన్ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్ అసిస్టెంట్లు, రియ ల్ టైమ్ విశ్లేషణలతో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కచి్చతమైన ఫలితాలనిచ్చే సలహాలను అందిస్తోంది.పెట్టుబడుల జోరు.. వెల్త్టెక్ స్టార్టప్లకున్న సామర్థ్యాలను గుర్తించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకొస్తున్నారు. డిజర్వ్ అనే సంస్థలో 2024 జూలైలో ప్రేమ్జీ ఇన్వెస్ట్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 32 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది పోర్ట్ఫోలియోను సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు లక్షల కొద్దీ డేటా పాయింట్లను విశ్లేషించి, తగు సలహాలిస్తుంది. ఇక గురుగ్రామ్కి చెందిన సెంట్రిసిటీ అనే మరో స్టార్టప్ .. 20 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇది అత్యంత సంపన్నులు, స్వతంత్ర ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సలహాలు అందిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఏఐ అభివృద్ధిలో వివక్ష!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. దీంతో భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రబలంగా ఉన్న సామాజిక వివక్ష శాశ్వతంగా పెరిగే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పార్ట్నర్ ఆఫీసర్ హిమానీ అగ్రవాల్ అన్నారు. ‘మహిళలను చేర్చుకోవడం అనేది ఉమ్మడి బాధ్యత. విభిన్న దృక్కోణాలు లేకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) రూపొందించడం కొనసాగితే.. నేటి వివక్ష రేపటి సాంకేతికతలోకి బలంగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం సంఖ్యల సమస్య కాదు. మనం నిర్మిస్తున్న భవిష్యత్తు గురించి. ఏఐ ప్రపంచాన్ని రూపొందిస్తుంటే.. ఏఐని రూపొందిస్తున్న వ్యక్తులు ప్రపంచ వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి’ అని అభిప్రాయపడ్డారు. అందుకే మనం ముందుగానే అడుగు వేయాలని అన్నారు. ఏఐని ముందుకు నడిపించడానికి యువతులలో ఉత్సుకతను రేకెత్తించడం, మెంటార్షిప్ నెట్వర్క్లను బలోపేతం చేయడం, మహిళలకు నైపుణ్యాలు, నాయకత్వ అవకాశాలు ఉన్నాయని తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ఒక కఠిన పనిగా.. ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడం, నిలదొక్కుకోవడం చాలా మంది మహిళలకు ఒక కఠిన పనిగా అనిపిస్తుందని హిమానీ అగ్రవాల్ అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉద్యోగులలో మహిళలు 31.6 శాతం ఉన్నారని చెప్పారు. మరింత మంది మహిళలను చేర్చుకోవడం కోసం కంపెనీ చురుకుగా పనిచేస్తోందని ఆమె వివరించారు. సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే ఈ విభాగంలో డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తెలిపారు. మహిళలు కేవలం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడమేగాక కెరీర్లో అభివృద్ధి చెందేలా చూసుకోవడంలో నిజమైన సవాల్, అవకాశం ఉందన్నారు. ‘సాంకేతికత సమానత్వాన్ని అందించే శక్తిని కలిగి ఉంది. సౌకర్యవంత కెరీర్లు, విభిన్న ఉద్యోగ బాధ్యతలు అపరిమిత అవకాశాలను అందిస్తుంది. అయినప్పటికీ మధ్య స్థాయి నుండి నాయకత్వానికి కీలక మార్పు చాలా మంది మహిళలకు అడ్డంకిగా మిగిలిపోయింది. ఇక్కడే మహిళలను చేర్చుకునే సంస్కృతి మార్పును కలిగిస్తుంది’ అని వివరించారు. -
భారత్కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్స్కిల్.. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి భారత్లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్స్కిల్) అత్యవసరం. -
భారత్లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా..
AI (Artificial intelligence) తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంతెందుకు ఎంచక్కా సినిమా కూడా తీసిపెట్టగలదు. హీరోహీరోయిన్లను కూడా తనే సృష్టించగలదు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇటువంటి ప్రయోగాలు ఆల్రెడీ జరిగిపోయాయి. ఏఐ సినిమాలు వచ్చేశాయి. ఇంతకీ భారత్లో ఏఐ తీసిన తొలి సినిమా ఏంటో తెలుసా? నైషా. వివేక్ అంచలియా ఏఐ సాయంతో దీన్ని డైరెక్ట్ చేశాడు. ఏఐ సాయంతో సినిమారోజూవారీ దినచర్యలో టెక్నాలజీ ఎంతగా భాగమైంది? భవిష్యత్తులో ఏఐ ఇంకెంత విస్తరించనుంది? మానవ సంబంధాలు ఎలా మారనున్నాయి? అనే అంశాలను నైషా సినిమాలో చూపించారు. సంగీతాన్ని కూడా ఏఐ సాయంతోనే సృష్టించారు. డేనియల్ బి జార్జ్, ప్రోటిజ్యోతి జియోష్, ఉజ్వల్ కశ్యప్ వంటి సంగీతకారులు కొన్ని మ్యూజిక్ బిట్స్ ఇస్తే దాని ఆధారంగా వారికి నచ్చిన సౌండ్ట్రాక్ రెడీ చేసేసింది. ఏఐ అడ్వాన్స్డ్ టూల్స్తో విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఇంతకీ హీరోహీరోయిన్లు ఎవరనుకుంటున్నారు? జైన్ కపూర్, నైషా బోస్.. వీరిని కూడా టెక్నాలజీయే సృష్టించింది.మేలో రిలీజ్ఏఐ స్టూడియో సాయంతో పోరి భుయాన్, శ్వేత వర్మ, జోసెఫ్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎమోషన్స్ను టెక్నాలజీ రక్తికట్టించగలిగిందా? లేదా? అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఐ చొచ్చుకుని పోతే భవిష్యత్తులో ఎటువంటి ఛాలెంజ్లు ఎదురవుతాయన్న చర్చకు సైతం నైషా నాంది పలకనుంది.విదేశాల్లో కొన్ని సినిమాలకు ఇదివరకే ఏఐ టెక్నాలజీని వాడుకున్నారు. అవేంటో కింద చూసేద్దాం..సన్స్పింగ్ (Sunspring): 2016లో వచ్చిన ఈ చిత్రానికి ఏఐ స్క్రిప్ట్ అందించింది.జోన్ అవుట్ (Zone Out): కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఏఐ విజువల్స్ వాడుకున్నారు. ఇది 2020లో రిలీజైంది.ద నెక్స్ట్ రెంబ్రాండ్ (The Next Rembrandt): 2016లో వచ్చిన ఈ సినిమాలో ఏఐ సాయంతో పెయింటింగ్స్ వేస్తారు.మోర్గాన్ (Morgan): సినిమా ట్రైలర్ రెడీ చేసేందుకు ఏఐ వాడారు.ఏఐ: మోర్ ద హ్యూమన్ (AI: More Than Human): సమాజంలో ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందని డాక్యుమెంటరీ ద్వారా చక్కగా చూపించారు.ద సేఫ్ జోన్ (The Safe Zone): ఏఐ కథ రాసుకుని, డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఇది.ద ఫ్రోస్ట్ (The Frost): ఏఐ టూల్స్ ఉపయోగించి తీసిన షార్ట్ ఫిలిం.క్రిటర్జ్ (Critterz): ఏఐ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం.ప్లానెట్ జెబులాన్ ఫైవ్ (Planet Zebulon Five): ఏఐ ప్రకృతిపై తీసిన డాక్యుమెంటరీ.థాంక్యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ (Thank You for Not Answering): షార్ట్ యానిమేటెడ్ ఫిలిం. చదవండి: హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే.. -
చైనా నుంచి మనూస్ ఏఐ
బీజింగ్: కొన్ని రోజుల క్రితం ‘డీప్సీక్’కృత్రిమ మేధ(ఏఐ) మోడల్ను తీసుకొచ్చి ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన డ్రాగన్ దేశం చైనా మరో సంచలనానికి తెరతీసింది. ‘మనూస్’పేరిట మరో కృత్రిమ మేధ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఐ వేదికలకు దీటుగా మనూస్ను రూపొందించారు. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘మొనికా’ఈ మనూస్ను అభివృద్ధి చేసింది. ‘ఆలోచనలు, చర్యలకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఫలితాలు సాధించి చూపుతుంది’’అని మొనికా కంపెనీ వెల్లడించింది. ఈ నూతన ఏఐ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేసింది. కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహార యాత్రలకు ప్లానింగ్ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనూస్ చక్కబెడుతుంది. స్టాక్ మార్కెట్ను విశ్లేషించడంలో బహు నేర్పరి. కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తిచేస్తుంది. మనూస్ తనంతట తాను ఆలోచించుకోగలదు. ప్లాన్ చేసుకొని దాన్ని అమలు చేయగలదు. స్వయం చాలితం అని చెప్పొచ్చు. మనూస్ను ఈ నెల 6వ తేదీన ఆవిష్కరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఏమిటీ మనూస్? ఇదొక జనరల్ ఏఐ ఏజెంట్. వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన, రియల్–వరల్డ్ పనులు పూర్తిచేయగలదు. సాధారణ ఏఐ చాట్బాట్స్ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి అటనామిస్ సిస్టమ్. ప్రణాళిక, కార్యాచరణ, ఫలితాలు... అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించామనుకోండి. ఆ అంశంపై మనూస్ తనంతట తానే పరిశోధన సాగిస్తుంది. పేపర్పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది. -
ఇంటర్నెట్లాగే ఏఐతో కొత్త ఉద్యోగాలొస్తాయ్..
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు. ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు. -
ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే..
ఉద్యోగుల పని గంటల గురించి రోజుకో చర్చ నడుస్తోంది. యాజమాన్యాలు పనిఒత్తిడి పెంచి తమకు వ్యక్తిగత, కుటుంబంతో గడిపే సమయాన్ని దూరం చేస్తున్నాయని ఓవైపు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పరిశ్రమ ప్రముఖులు, వ్యాపారాధినేతలు దీనిపై విభిన్న వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్.. వారానికి 60 గంటలు కష్టపడాలని తమ ఉద్యోగులను కోరారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అభివృద్ధిని వేగవంతం చేయడానికి సాహసోపేతమైన చర్యలో, గూగుల్కు చెందిన జెమినీ ఏఐ మోడళ్లలో పనిచేసే ఉద్యోగులు వారానికి 60 గంటలు పని చేసే విధానాన్ని అవలంబించాలని, రోజూ ఆఫీస్కు రావాలని సెర్గీ బ్రిన్ పిలుపునిచ్చారు. అంతర్గత మెమోలో పేర్కొన్న ఈ ఆదేశం, యంత్రాలు మానవ మేధస్సును మించిన మైలురాయి అయిన ఏజీఐని సాధించే రేసులో పెరిగిన అత్యవసరతను, పోటీ ఒత్తిడిని తెలియజేస్తోంది.తుది రేసు మొదలైందికృత్రిమ మేధ పరిశ్రమలో పోటీ తీవ్రమైన నేపథ్యంలో బ్రిన్ ఇచ్చిన ఈ పిలుపునకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా 2022లో చాట్జీపీటీని ప్రారంభించిన తరువాత ఏఐ పరిశ్రమలో పోటీ పెరిగింది. ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వేగవంతమైన పురోగతిని ప్రేరేపించింది. "ఏజీఐకి తుది రేసు ప్రారంభమైంది" అని బ్రిన్ తన మెమోలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయత్నాలను "టర్బోచార్జ్" చేస్తే.. ఈ రేసులో గెలవడానికి అవసరమైన అన్ని అంశాలు గూగుల్ వద్ద ఉన్నాయన్నారు.ఉత్పాదకతకు ప్రమాణంవారానికి 60 గంటలు పనిచేయడం ఉత్పాదకత ప్రమాణాన్ని సూచిస్తుందని, అదే ఈ పరిమితిని మించితే బర్న్అవుట్కు దారితీస్తుందని కూడా బ్రిన్ హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగులు 60 గంటల కంటే తక్కువ పని చేయడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రవర్తన "అనుత్పాదకంగా ఉండటమే కాకుండా, ఇతరులకు చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది" అని పేర్కొన్నారు. బ్రిన్ సిఫార్సులు కార్పొరేట్ అమెరికాలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు ఉత్పాదకత, టీమ్ వర్క్ ను పెంచడానికి హైబ్రిడ్ పని విధానాలను తిప్పికొడుతున్నాయి.సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏఐ వినియోగంఎక్కువ పని గంటల కోసం వాదించడంతో పాటు, వారి కోడింగ్, పరిశోధన సామర్థ్యాలను పెంచడానికి గూగుల్ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించాలని బ్రిన్ ఉద్యోగులను కోరారు. "మన స్వంత కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన కోడర్లు, ఏఐ శాస్త్రవేత్తలుగా మారాలి" అని జెమినీ టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.ఈ విధానం ఏజీఐని సాధించడంలో ఏఐ ఆధారిత స్వీయ-మెరుగుదల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.వర్క్ఫోర్స్పై ప్రభావంమరింత కఠినమైన పని షెడ్యూళ్ల కోసం బ్రిన్ చేస్తున్న ఒత్తిడి ఏజీఐ అభివృద్ధిలో గూగుల్ నాయకత్వం వహించాలనే ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇది శ్రామిక శక్తిపై ప్రభావాన్ని గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఏజీఐని సాధించాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గూగుల్లో సాంకేతిక పురోగతి అత్యవసరతను ప్రతిబింబిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఏఐ బృందానికి బ్రిన్ ఆదేశం గూగుల్ కు కీలక సమయంలో వచ్చింది. -
అంధుల కోసం ‘ఏఐ నేత్ర’
అంధులకు దారిచూపే ‘ఏఐ నేత్ర’ సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి హైసూ్కల్ విద్యార్థులు ‘బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ)’ యాప్ను రూపొందించారు. అంధులు రోడ్డుపై నడుస్తున్నప్పుడు వారిముందు ఏవైనా వాహనాలు, ఇతర అడ్డంకులు ఉంటే ఈ యాప్ మాటల రూపంలో వారి చెవిలో ఇట్టే చెప్పేస్తుంది. వీధులు, ప్రాంతాల పేర్లను సైతం ఆడియో రూపంలో తెలియజేస్తుంది.చీపురుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఏఐను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మూడేళ్ల కిందటే పరిచయం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే తొలిసారిగా చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ నెలకొల్పారు. దీనిని ఇక్కడి విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. తాజాగా ల్యాబ్ ఇన్స్ట్రక్టర్, విద్యార్థులు కలిసి అంధుల కోసం ప్రత్యేకంగా ‘బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ)’ యాప్ను రూపకల్పన చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా ఏఐ ల్యాబ్్సలో సిద్ధం చేసిన ప్రాజెక్టులపై ఢిల్లీలో జరగనున్న ఎక్స్పోలో చీపురుపల్లి హైస్కూల్ ఏఐ ల్యాబ్లో సిద్ధం చేసిన బీఏడీ యాప్ను కూడా ప్రదర్శించనున్నారు. ఉపయోగాలివీప్రస్తుతం అంధులకు దారి చూపే చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, అంధులు సునాయాసంగా వారి ప్రయాణాన్ని సాగిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యం చేరుకునేలా యాప్ను చీపురుపల్లి ఏఐ ల్యాబ్లో ఇన్స్ట్రక్టర్ ఏవీఆర్డీ ప్రసాద్ నేతృత్వంలో 8వ తరగతి విద్యార్థులు అంధవరపు నిఖిల, పైడిశెట్టి తనిష్క్ సిద్ధం చేశారు. దీనికి బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ)గా నామకరణం చేశారు. అంధులు ఈ యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే.. వారికి ఎదురుగా ఉండే వాహనాలు, వస్తువులు, వీధులు, ప్రాంతాలు, పేర్లు, దుకాణాలు, వ్యక్తులు ఇలా ఏదైనా సరే అప్రమత్తం చేస్తూ ఆడియో రూపంలో వినిపిస్తుంది. దీని ఆధారంగా అంధులు ముందుకు సాగిపోవచ్చు.ఏఐతో పరిష్కారం సమాజంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏఐ సహకారం అవసరం. సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన ల్యాబ్ ప్రభుత్వ బడిలో ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఏఐ ల్యాబ్లో అంధుల కోసం ఈ యాప్ను రూపొందించాం. ఇక్కడ ల్యాబ్లో విద్యార్థులు పైథాన్ కోడింగ్ నేర్చుకుంటూ కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. – ఏవీఆర్డీ ప్రసాద్, ఏఐ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్, చీపురుపల్లి -
ప్రధాన మీడియాకు ఆన్లైన్ ప్లాట్ఫాంలు...పరిహారం ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న ఆన్లైన్ మీడియా ప్లాట్ఫాంల వల్ల వార్తాపత్రికలు, వార్తా చానళ్ల వంటి సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ‘‘సంప్రదాయ మీడియా సంస్థలకు సంబంధించిన కంటెంట్ను ఆన్లైన్ ప్లాట్ఫాంలు విస్తారంగా వాడుకుంటున్నాయి. ఇందుకు వాటికవి సముచిత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. గురువారం స్టోరీబోర్డ్18 డీఎన్పీఏ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ‘‘ఆన్లైన్ ప్లాట్ఫాంలు కృత్రిమ మేధ (ఏఐ) తదితరాల సాయంతో కంటెంట్ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తూ పాఠకులు, వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో యువత సంప్రదాయ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియావైపు మళ్లుతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా తన పాత్రను సమీక్షించుకోవాల్సి ఉంది. శరవేగంగా చోటుచేసుకుంటున్న కొత్త తరం మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం’’ అని సూచించారు. ఈ మార్పిడి క్రమంలో సంప్రదాయ మీడియాకు అన్నివిధాలా దన్నుగా నిలిచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిజిటల్ ప్లాట్ఫాంలు తమ ఆదాయంలో సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు సముచిత వాటా ఇచ్చేలా పలు దేశాల్లో ఇప్పటికే చట్టాలు అమల్లో ఉన్నాయని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘భారత్లో మాత్రం ఇంకా ఆ పరిస్థితి లేదు. డిజిటల్ మీడియా ప్లాట్ఫాంలకు ఇప్పటికీ ప్రధాన స్రవంతి సంస్థల కంటెంటే ప్రధాన వనరు. కానీ వాటి ఆదాయంలో మాత్రం ప్రధాన మీడియా సంస్థలకు తదనుగుణంగా అందడం లేదు’’ అన్నారు. -
ఏఐకి కంపెనీల జై
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేగలిగే నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తమకు వచ్చే దరఖాస్తుల్లో, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే దరఖాస్తులు సగానికన్నా తక్కువగా ఉంటున్నాయని దేశీయంగా 54 శాతం మంది హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) ప్రొఫెషనల్స్ వెల్లడించారు. సరైన సాంకేతిక నైపుణ్యాలున్న వారిని (61 శాతం మంది), సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారిని (57 శాతం మంది) దొరకపుచ్చుకోవడం నియమాకాలపరంగా అతి పెద్ద సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి టెక్నికల్/ఐటీ నైపుణ్యాలు (44 శాతం), ఏఐ నైపుణ్యాలు (34 శాతం), కమ్యూనికేషన్ .. సమస్యల పరిష్కార నైపుణ్యాలు (33) గల అభ్యర్థులు అతి కష్టం మీద దొరుకుతున్నారు. అర్హులైన అభ్యర్ధులు దొరక్కపోవడంతో హైరింగ్ ప్రక్రియ విషయంలో కంపెనీలు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన అర్హతల్లో కనీసం 80 శాతం ఉన్న అభ్యర్ధులనే పరిగణనలోకి తీసుకుంటామని 55 శాతం మంది, వారినే హైరింగ్ చేసుకుంటామని 54 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు తెలిపారు. సర్వే డేటా, లింక్డ్ఇన్ ప్లాట్ఫాంలో వివరాల విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 1,991 మంది సీ–సూట్ ఎగ్జిక్యూటివ్లతో పాటు వెయ్యి మందికి పైగా ఉద్యోగులుండే సంస్థలకు సంబంధించి 300 మంది పైచిలుకు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. → నియామకాల తీరుతెన్నులను, ప్రతిభావంతులకు శిక్షణనివ్వడం మొదలైన అంశాలను ఏఐ సమూలంగా మార్చేస్తోంది. అయితే ఏఐని కేవలం ఆషామాïÙగా వినియోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపార వృద్ధికి దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. చాలా మటుకు కంపెనీలు ఏఐ సాధనాలను తయారు చేసుకోవడంపైనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయని, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగే సరైన నిపుణులు అంతగా ఉండటం లేదని నివేదిక వివరించింది. దీనితో గేమ్ చేంజింగ్ అవకాశం చేజారిపోతోందని పేర్కొంది. → దీన్ని అధిగమించాలంటే వ్యాపార సంస్థలు నియామకాల విషయంలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడినప్పటికీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్, భాగస్వామ్యం వంటి మానవ నైపుణ్యాలవల్లే పోటీ సంస్థలకన్నా మెరుగ్గా కంపెనీలు పురోగమించగలవు. → నైపుణ్యాల్లో అంతరాలను భర్తీ చేసేందుకు భారతీయ కంపెనీలు శిక్షణపై మరింతగా దృష్టి పెట్టాలి. ఏఐ గురించి నేర్చుకోవడం, అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తే .. వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుంది.హెల్త్కేర్ ఏఐతో జీడీపీకి ఊతం 2025లో 30 బిలియన్ డాలర్ల వరకు జత ఇన్ఫ్రా పరిమితులు అధిగమించాలి, సిబ్బందికి శిక్షణనివ్వాలి డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథని (ఏఐ) విస్తృతంగా ఉపయోగించడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 2025లో మరో 25–30 బిలియన్ డాలర్ల విలువ జత కాగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ఇండియాఏఐ మిషన్, డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టం 2023 మొదలైనవి డిజిటల్ హెల్త్కేర్ వ్యవస్థకు ఊతమిస్తున్నాయని వివరించింది. నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఏఐ వినియోగం 40 శాతం పైగా ఉంటోంది. ఇది ఎఫ్ఎంసీజీ (30 శాతం), తయారీ (25 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం. ఏఐ ఆధారిత వైద్యపరీక్షలు, మెడ్టెక్ ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రికార్డులు తదితర అంశాల కారణంగా భారతీయ డిజిటల్ హెల్త్కేర్ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ ఇండస్ట్రీ లీడర్ జయ్దీప్ ఘోష్ తెలిపారు. అయితే, ఏఐ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నియంత్రణ విధానాలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాలపరమైన పరిమితులు మొదలైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, పురోగామి పాలసీలపై దృష్టి పెట్టడం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్కేర్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగవచ్చని ఘోష్ చెప్పారు.బ్యాంకింగ్తో పోలిస్తే పురోగతి నెమ్మదే.. ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పోలిస్తే హెల్త్కేర్లో కృత్రిమ మేథ వినియోగం చాలా నెమ్మదిగా ఉంటోందని నివేదిక తెలిపింది. డేటా భద్రతపై అనుమానాలు, బహుళ నియంత్రణ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఏఐలో శిక్షణ పొందిన నిపుణుల కొరత తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సర్జికల్ కన్జూమబుల్స్ విభాగంలో భారత్ నికరంగా ఎగుమతిదారుగానే ఉంటున్నప్పటికీ హైటెక్ వైద్య పరికరాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని నివేదిక వివరించింది. దేశీయంగా తయారీని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని పేర్కొంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, పాలసీపరమైన సంస్కరణలతో ఏఐ వినియోగం మరింత వేగవంతం కాగలదని వివరించింది. ఇది సాంకేతికంగా అధునాతనమైన, స్వయం సమృద్ధి గల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు వేస్తుందని తెలిపింది. -
‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం! -
ఏఐ వార్తలు @ గిరిజన టీచర్
ఆదిలాబాద్ టౌన్: ఆదివాసీ పేద కుటుంబంలో జన్మించి అభ్యున్నతి వైపు పయనిస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్. అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా యాంకర్ను సృష్టించి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నాడు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలు రాసి ఔరా అనిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ సేవల గురించి ఇటీవల మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించి ప్రశంసించటం గమనార్హం.మట్టిలోని మాణిక్యంకైలాస్ 1 నుంచి 10వ తరగతి వరకు వాఘాపూర్ సర్కారు బడిలో చదివాడు. ఉట్నూర్లోని లాల్టేక్డి రెసిడెన్షియల్లో ఇంటర్, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో అన్ట్రెయిన్డ్ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు పిల్లలు గంగోత్రి, సృజన్రామ్ ఉన్నారు. గాదిగూడ మండలంలోని డొంగర్గావ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసి, ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరపూర్లో స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ పాఠాలు బోధిస్తున్నాడు. కరోనా సమయంలో గిరిజనులను అప్రమత్తం చేసేందుకు గోండి భాషలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశాడు. గోండి భాషలోకి మహాభారతంఆదివాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలోకి ఆ గ్రంథాన్ని కైలాస్ అనువదించాడు. ‘సుంగల్తూర్పో (ఇలవేల్పు), తొడసం బండు (ఇంటి దేవత), నైతం మారుబాయి (అమ్మమ్మ), తొడసం నేలేంజ్ (తమ్ముని కూతురు)’పేరిట ఏఐ యాంకర్తో వార్తలు చదివించేవాడు. సంగీతం అంటే ఆయనకు మక్కువ. దీంతో కొలామి భాషలో వందకు పైగా పాటలు రచించి, వాటిని సైతం ఏఐ యాంకర్తో పాడించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.గిరిజనులను చైతన్యపర్చాలని..గిరిజనులను చదువు వైపు మళ్లించడంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నా. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాంకేతికతపై ఉన్న మక్కువతో ఏఐ యాంకర్ ద్వారా గోండి, కొలామి ఇతర భాషల్లో వార్తలు చదివించడం, పాటలు పాడించడం చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను అభినందించడం సంతోషంగా ఉంది. – తొడసం కైలాస్, ఉపాధ్యాయుడు -
ఏఐతో అందరికీ సమాన వైద్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా అందరికీ సమాన రీతిలో చికిత్స అందించే అవకాశం రావాలన్నది నా కల. రోగి పల్లెలో ఉన్నాడా లేక పట్టణంలో ఉన్నాడా? ధనిక, పేద తారతమ్యం లేకుండా వైద్యం అందాలి. ఆస్పత్రుల్లో ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా? అన్నది కూడా అడ్డంకి కాకూడదు. ఈ కల త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నా’ అని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ కె.నాగేశ్వర్రెడ్డి చెప్పారు. మంగళవారం బయోఆసియా–2025 సదస్సులో భాగంగా ఏఐ ఇన్ హెల్త్కేర్ అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్ కె.నాగేశ్వర్రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐజీ ఆస్పత్రిలో వాడుతున్న ఏఐ టెక్నాలజీ గురించి వివరించారు.ఏఐతో మెరుగ్గా కేన్సర్ల గుర్తింపు..పేగులను పరిశీలించే పద్ధతిలో జీఐ జీనియస్ అనే ఏఐ సాంకేతికతను చేర్చామని డాక్టర్ కె. నాగేశ్వర్రెడ్డి తెలిపారు. పేగుల్లో తాము గుర్తించని అతిచిన్న కణితులను ‘జీఐ జీనియస్’ చూపడమే కాకుండా వాటిని తొలగించాలా వద్దా అనే విషయాన్ని సైతం స్పష్టం చేస్తోందని చెప్పారు. దీనివల్ల పేగు కేన్సర్ల గుర్తింపు 50 శాతం వరకు పెరిగిందన్నారు. అలాగే క్లోమగ్రంథి కేన్సర్లను కూడా ఎక్స్రేల ద్వారా వైద్యులు నిర్ధారించే దానికన్నా మెరుగ్గా ఏఐ సాంకేతికత గుర్తించగలగుతోందని తెలిపారు. అందుకే ఏఐజీ ఆస్పత్రిలోని అన్ని ఆపరేషన్ థియేటర్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించామని.. దీనివల్ల ప్రమాదకర పరిస్థితులను నివారించే వీలు ఏర్పడుతోందని డాక్టర్ కె. నాగేశ్వర్రెడ్డి వివరించారు. వ్యాధి, నిర్ధారణ, చికిత్సలతోపాటు ఆసుపత్రిని మరింత సమర్థంగా నిర్వహించడంలోనూ ఏఐ ఎంతో సమర్థంగా ఉపయోగపడుతున్నట్లు ఆయన ఉదాహరణలతో వివరించారు. ఆసుపత్రిలోని రోగుల వివరాలను నిశితంగా పరిశీలిస్తూ వారికి గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలను కొన్ని సందర్భాల్లో గంటల ముందుగానే గుర్తించి కాపాడగలుగుతున్నామని ఆయన వివరించారు. దీనివల్ల ఇప్పుడు తమ ఆస్పత్రిలో ఆకస్మిక మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. అలాగే రోగులు చెప్పే విషయాలను వైద్యులు స్వయంగా నమోదు చేయాల్సిన అవసరం లేకుండా వారి మాటలను రికార్డు చేసి వైద్యులకు సరైన రీతిలో అందించేందుకు సైతం తాము ఒక ఏఐ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్లు డాక్టర్ కె. నాగేశ్వర్రెడ్డి తెలిపారు.వైద్య రంగంలో ఏఐ పెను విప్లవం: వక్తలుమిగిలిన రంగాల మాదిరిగానే వైద్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) పెను విప్లవం సృష్టిస్తోందని బయో ఆసియా–2025 సదస్సులో వైద్య నిపుణులు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణతోపాటు చికిత్స, కొత్త మందుల ఆవిష్క రణలను ఏఐ వేగవంతం చేస్తోందన్నారు. వైద్యులు గుర్తించలేని ఎన్నో విషయాలను ఏఐ గుర్తించగలుగుతోందని చెప్పారు. ఏఐ ప్రవేశంతో మందుల తయారీ ఖర్చు, సమయం సగానికిపైగా తగ్గుతోందని వక్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ కంపెనీ ఇన్సిలికో మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రికార్డో గామినా పచెకో మాట్లాడుతూ తాము ఏఐని కొత్త మందుల ఆవిష్కరణకు వాడుతున్నట్లు చెప్పారు. మొత్తమ్మీద 25 వరకు ఏఐ మోడళ్లను ఉపయోగిస్తున్నా మన్నారు. ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్ల విషయంలో కొంత పురోగతి సాధించామని.. చైనా, అమెరికాలో వాటిపై ప్రయో గాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ చర్చా కార్యక్రమంలో వైద్య పరికరాల సంస్థ మెడ్ట్రానిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెన్ వాషింగ్టన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆరోగ్యరంగ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ బిషెన్, యూకేకు చెందిన ఇమేజ్ అనాలసిస్ గ్రూప్ అధ్యక్షురాలు ఓల్గా కుబస్సోవా ఆరోగ్య రంగంలో ఏఐ పాత్రపై చర్చించారు. -
ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డీబీఎస్లో 4000 ఉద్యోగాలు కట్
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డీబీఎస్ గ్రూప్ కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో వచ్చే మూడేళ్లలో 10 శాతం మేర సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. తమ కార్యకలాపాల్లో ఏఐని మరింత పెద్ద ఎత్తున వినియోగించనున్నట్టు సంస్థ సీఈవో పీయూష్ గుప్తా తెలిపారు. డీబీఎస్ గ్రూప్లో 15 ఏళ్ల తన పదవీ కాలంలో మొదటిసారి ఉద్యోగాల సృష్టి పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఏఐ అన్నది భిన్నమైనదని, గతంలో వచ్చిన మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానం మాదిరి కాదన్నారు. వచ్చే మూడేళ్లలో 4,000 మంది (10 శాతం) సిబ్బంది తగ్గిపోనున్నట్టు తన ప్రస్తుత అంచనాగా చెప్పారు. నాస్కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘‘ఏఐ ఎంతో శక్తిమంతమైనది. తనను తాను సొంతంగా ఆవిష్కరించుకోగలదు. మరొకరిని అనుసరించగలదు. ఇది ఎంతో భిన్నమైనది. గత పదేళ్లలో గ్రూప్లో ఉద్యోగాల కోత అన్నదే లేదు’’అని గుప్తా ఏఐ రాకతో గ్రూప్ స్థాయిలో చోటుచేసుకోనున్న మార్పులను వివరించారు. డీబీఎస్ గ్రూప్ రెండేళ్ల క్రితమే జెనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేయడం ప్రారంభించిందని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను ఇంకా చవిచూడాల్సి ఉందన్నారు. కస్టమర్లను చేరుకోవడం, క్రెడిట్ అండర్రైటింగ్ (రుణ వితరణ), నియామకాల్లో ఏఐని డీబీఎస్ గ్రూపు అమలు చేస్తోంది. కాంట్రాక్టు సిబ్బందే.. వచ్చే మూడేళ్లలో 4,000 మందితగ్గింపు అన్నది ప్రధానంగా కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బంది రూపంలోనే ఉంటుందని డీబీఎస్ గ్రూప్ వివరణ ఇచ్చింది. సహజంగా కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగుల రూపంలోనూ సిబ్బంది తగ్గనున్నట్టు తెలిపింది. -
‘మన్కీ బాత్’లో తెలంగాణ టీచర్ ప్రస్తావన..కారణమిదే..
న్యూఢిల్లీ:మన్కీ బాత్లో తెలంగాణ టీచర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆదివారం(ఫిబ్రవరి23) నిర్వహించిన మన్కీ బాత్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.‘ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సదస్సులో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లోని ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడసం కైలాష్ గిరిజన భాషలను కాపాడడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేశారు’ అని మోదీ కొనియాడారు. ‘ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం. పది సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్ చేసింది.చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణం.అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైనా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు నా సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తా’అని మోదీ తెలిపారు. -
ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్లోని చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్లాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. -
సైబర్ భద్రత అత్యంత క్లిష్టం
సాక్షి, హైదరాబాద్: సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసు కోవాల్సిన చర్యలపై చర్చించేందుకు, నూతన సాంకేతిక తలను రూపొందించే లక్ష్యంతో హెచ్ఐసీసీలో ప్రారంభమైన షీల్డ్–2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలిరోజు జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మాజీ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ కీలక ఉపన్యాసాలు చేశారు.సైబర్ ప్రొఫెషనల్స్కు మంచి భవిష్యత్తు: లెఫ్టినెంట్ జనరల్ మునైర్ ‘సైబర్ భద్రత అనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇది ప్రతి నిత్యం మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మన జీవితాలన్నీ డిజిటల్ కనెక్టివిటీతో ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత జీవితాలు మొదలు, వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ నేరగాళ్లతో ముప్పు పొంచి ఉంది. కాబట్టి సైబర్ భద్రత నిపుణులకు మంచి భవిష్యత్తు ఉంది. సైబర్ భద్రత రంగానికి చెందిన భాగస్వాములందరూ ఒకే వేదికపైకి వచ్చిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది.అప్పుడే భవిష్యత్తులో సురక్షితమైన వ్యవస్థలు రూపొందించగల్గుతాం. ఈ క్రమంలో నూతన ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్ను అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పాఠశాలల బోధనా ప్రణాళికల్లోనూ సైబర్ భద్రతను భాగం చేయాలి..’ అని జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్ చెప్పారు.అత్యంత సురక్షితంగా ఆధార్ డేటా: ట్రాయ్ మాజీ చైర్మన్ శర్మ‘సాఫ్ట్వేర్ డిజైన్ల తయారీలో ప్రైవసీ, సెక్యూరిటీ అన్నవి అత్యంత ప్రధానాంశాలు. నేను ఆధార్ మిషన్ డైరెక్టర్గా పనిచేశా. ఆధార్ సాఫ్ట్వేర్ డిజైన్ల తయారీ తర్వాత మొదటి ఆధార్ను అందుబాటులోకి తెచ్చేందుకు 15 నెలల సమయం తీసుకున్నాం. ఇప్పుడు దేశంలో 1.4 బిలియన్ ఆధార్లు ఉన్నాయి. అయినా ఇప్పటివరకు ఒక్క ఆధార్ కార్డు డేటా కూడా హ్యాక్ కాలేదు. అంత సురక్షితంగా ఆధార్ను రూపొందించాం. అదే విధంగా కోవిన్ యాప్లోనూ 2.4 బిలియన్ రికార్డులు ఉన్నాయి. ఆ డేటా కూడా ఎంతో సురక్షితంగా ఉంది..’ అని ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘ప్రైవసీ బై డిజైన్–సెక్యూరిటీ బై డీఫాల్ట్ ’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.లైంగిక నేరగాళ్ల డేటాబేస్ ఏర్పాటు చేయాలి: భువన్ రిభు‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా చిన్నారులపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్నారు. ఇది అత్యంత క్రూరం. కృత్రిమ మేధస్సును వాడి చేస్తున్న ఈ క్రూర నేరాలకు దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా తక్షణ శిక్షలు విధించడం అవసరం. అంతర్జాతీయ స్థాయిలో చట్టాలను సమన్వయం చేయడానికి, నిఘా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి వీలుగా అంతర్జాతీయ లైంగిక నేరస్థుల డేటాబేస్ను ఏర్పాటు చేయాలి. చిన్నారులపై లైంగిక వేధింపులు అరికట్టాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో వేధింపులపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చిన్నారులపై వేధింపులకు పాల్పడే వారు ధైర్యంగా బయట తిరుగుతుండడం బాధాకరం..’ అని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు అన్నారు. -
ఏఐ ‘బ్రెయిన్ డ్రెయిన్’!
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మేధో వలస (బ్రెయిన్ డ్రెయిన్) భారత్కు పెద్ద సవాల్గా మారబోతోంది. యువతలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మంచి పురోగతి ఉన్నా, వారు దేశంలోనే స్థిరపడేలా చేయడంలో విఫలమవుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ ఏఐ నిపుణులు అమెరికా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. భారీ వేతనాలతోపాటు అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం ఉండడంతో అటువైపు ఆకర్షితులవుతున్నారు. ‘ఏఐ టాలెంట్ కాన్సన్ట్రేషన్’లో ప్రపంచంలో భారత్ 13వ స్థానంలో నిలిచినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ రిపోర్ట్–2024’ప్రకటించింది. ప్రపంచంలో ఏఐ మేధో వలసలో మాత్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఏఐ నైపుణ్యాలున్న ప్రతి 10 వేల మంది లింక్డ్ఇన్ ఖాతాదారుల్లో 0.76 శాతం (నెట్ మైగ్రేషన్ రేటు) మేధో వలస ఉన్నట్టు తెలిపింది. అంటే ప్రతి పదివేల మంది భారతీయ ఏఐ నిపుణుల్లో దాదాపు ఒకశాతం విదేశాలకు వలసపోతున్నారు. ఏఐ పేటెంట్స్లోనూ అథమ స్థానమే ఏఐ పేటెంట్స్ విషయంలోనూ భారత్ వెనుకబడే ఉంది. 2022లో ప్రపంచస్థాయి ఏఐ పేటెంట్స్లో మనదేశం 0.23 శాతానికే పరిమితమైంది. ఈ విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్లోబల్ ఏఐ పేటెంట్స్లో 61.13 శాతంతో చైనా మొదటిస్థానంలో నిలువగా, 20.9 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఏఐ మౌలికసదుపాయాల పటిష్టానికి ‘కంప్యూటింగ్ కెపాసిటీ’లో పెట్టుబడులు పెడుతున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏఐ టూల్స్ ఫౌండేషన్ టెక్నాలజీలో ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ అందుబాటులోకి రావడంతో చైనాకు చెందిన డీప్సీక్–వీ2, అమెరికాకు చెందిన చాట్ జీపీటీ వంటివి గ్లోబల్ బెంచ్మార్క్గా నిలిచాయి. దీంతో భారత్కు సవాళ్లు ఎదురవుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. 2023 నాటికి భారత్ 60 జెనరేటివ్ ఏఐ స్టార్టప్లు కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్నా (2021తో పోల్చితే రెండింతలు పెరుగుదల), ఈ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు మరిన్ని కీలకమార్పులు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. భారత్లో ఏఐ రంగం అభివృద్ధి, మేధో వలసల నిరోధానికి నిపుణుల సూచనలు » డేటా సెంటర్లు,కంప్యూటింగ్ వనరులు పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఏఐ, డీప్టెక్ వంటి వాటిలో ప్రపంచస్థాయి రిసెర్చ్సెంటర్లు, ల్యాబ్లు, ఇన్నోవేషన్ హబ్స్ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలి. » అత్యుత్తమ ప్రతిభ,నైపుణ్యాలున్నవారు దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. » ఏఐని సమాజాభివృద్ధికి, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, పర్యావరణ పరి రక్షణ తదితర రంగాల్లో విస్తారంగా వినియోగించాలి. » ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్వ్యాలీలోఅత్యుత్తమ ఏఐనిపుణుల్లో భారతసంతతివారేఅధికంగా ఉన్నారు. వారిలో కొందరినైనా తిరిగి భారత్కు రప్పించి అవసరమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను, సౌకర్యాలను కల్పిస్తే మంచి ఫలితాలుసాధించవచ్చు. అవకాశాలు పెంచాలి బ్రెయిన్ డ్రెయిన్ను బ్రెయిన్ గెయిన్గా మార్చుకునేందుకు దేశంలో మంచి ఏఐ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశం నుంచి ఏఐ మేధో వలస ప్రమాదకర స్థాయిలో ఏమీలేదు. నిపుణులు నైపుణ్యాలు పెంచుకునేందుకు సరైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉంది. ఎంతగా పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తే అంతగా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే సిలబస్లో ఏఐ, మెíషీన్ లెరి్నంగ్ వంటివి చేర్చాలి. నాణ్యమైన శిక్షణ, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తే దేశంలోని అద్భుతమైన నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. –వెంకారెడ్డి, వైస్ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్. -
ఏఐ స్కిల్స్ ఉంటే వేతన ధమాకా!
సాక్షి, అమరావతి: భారత్ –2025 జాబ్ మార్కెట్పై ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వంటి ప్రాముఖ్యత, నైపుణ్యాల ఆధారిత ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఉద్యోగుల వేతనాలు సైతం 6 నుంచి 15 శాతం లోపు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రముఖ దిగ్గజ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ అయిన మైఖేల్ పేజ్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేస్తూ.. ఏఐ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ఏకంగా 40 శాతం వేతన పెరుగుదల ఉండవచ్చని అంచనా వేసింది. నివేదికలోని అంశాలను పరిశీలిస్తే..⇒ ఈ ఏడాది కార్పొరేట్ సంస్థల జీతాలు సగటున 6 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. ⇒ ఇదే సమయంలో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి స్కిల్స్ ఆధారిత ఉద్యోగుల జీతాలు 40 శాతం వరకు పెరగనున్నాయి.⇒ కార్పొరేట్ ఇండియాలో అన్ని రంగాల్లో జీతాల పెరుగుదల భారీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, నాయకత్వ స్థానాల్లో ఉన్న వారికి భారీగా వేతన పెరుగుదల ప్రయోజనం కలగనుంది. వీరి వేతనాలు 20 నుంచి 30 శాతం పెరిగితే నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి ఏకంగా 40 శాతం వరకు పెరుగుతాయి.⇒ ఏఐ, ఎంఎల్ ఆల్గోరిధమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ , సైబర్ సెక్యూరిటీ, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాలకు అత్యధిక డిమాండ్ ఉంది. ఈ రంగాల్లో విదేశీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.⇒ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్విసెస్, తయారీ, రియల్టీ, హెల్త్కేర్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ⇒ ప్రస్తుతం ప్రపంచ ఆరి్థక పరిస్థితి అనిశి్చతిలో ఉండటంతో తాత్కాలిక ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులను కాపాడుకోవడానికి పాట్లుప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకోవడానికి, కొత్త వారిని ఆకర్షించడానికి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్íÙప్ (ఈసాప్స్) పేరిట ఉద్యోగులకు కంపెనీ షేర్లను కేటాయించడంతో పాటు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకించి సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగుల విషయంలోనే కంపెనీలు ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 50 శాతం మహిళా ప్రాతినిధ్యం లక్ష్యంగా, స్పష్టమైన వేతన విధానాలు, సౌకర్యవంతమైన పని విధానాలను కంపెనీలు అమలు చేస్తున్నాయి. డిమాండ్ ఉన్న టాప్ 5 జాబ్ ప్రొఫైల్స్ మెషిన్ లెరి్నంగ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఆర్కిటెక్ట్స్ (ఎంటర్ప్రైజ్, డేటా క్లౌడ్), వెబ్3 డెవలపర్స్, ఉమెన్ ఇంజనీరింగ్ లీడర్స్డిమాండ్ ఉన్న స్కిల్ కోర్సులుఏఐ, ఎంఎల్ ఆల్గోరిథమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్పరై్టజ్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీస్పెషలిస్టులను కోరుతున్న మార్కెట్ ఉద్యోగంలో మంచి వేతన పెరుగుదలకు ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండాలి. జాబ్ మార్కెట్ సాదాసీదా మామూలు ఉద్యోగులను కాకుండా, స్పెషలిస్టులను కోరుతోంది. – అంకిత్ అగర్వాల్, మైఖేల్ పేజ్ మేనేజింగ్ డైరెక్టర్ -
బైదూ, ఓపెన్ఏఐ సేవలు ఫ్రీ
వాషింగ్టన్: కృత్రిమ మేధ చాట్బాట్ సేవలరంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలా కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్బాట్ సేవలను ‘ప్రీమియం’ వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదూ, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ‘ఉచిత’ జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్సీక్ తమ అత్యాధునిక ఏఐ చాట్బాట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండటంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఉచితం! బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం బైదూ ‘ఎర్నిబాట్’ పేరుతో ఏఐ చాట్బాట్ సేవలను అందిస్తుండటం తెలిసిందే. ఇది ఏఐ పెయింటింగ్ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తోంది. ఈ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదూ గురువారం వీచాట్ వెబ్సైట్లో ప్రకటించింది. అంతకు కొన్ని గంటల ముందే మరో దిగ్గజ ఏఐ సంస్థ ‘ఓపెన్ఏఐ’ కూడా ఉచిత సేవల అంశాన్ని ప్రకటించింది. తమ అధునాతన ఏఐ మోడల్ జీపీటీ–5ను ఉచితంగా అందిస్తామని సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘జీపీటీ–5ను ఇక అందరూ ఉచితంగా పొందొచ్చు. ఈ సేవల కోసం ఇప్పటికే చందా కట్టినవారికి మరింత అత్యాధునిక స్థాయి ఏఐ సేవలను అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. తర్వాత బైదూ మరో ప్రకటన చేసింది. జూన్ చివరికల్లా నూతన తరం ఏఐ మోడల్ను తెస్తామని తెలిపింది. ఇది డీప్సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. డీప్సీక్ ఆర్1 ఏఐ మోడల్ ఉచితంగా అత్యాధునిక ఏఐ చాట్బాట్ సేవలను అందిస్తుండటంతో పోటీలో నిలదొక్కుకునేందుకు ఇతర అగ్రగామి సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉచితాల బాట పడుతున్నాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ బేసిక్ చాట్బాట్ సేవలను ఉచితంగా అందిస్తున్నా ఖరీదైన సేవలను ఉచితం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
ప్రసంగాలు కాదు, యువతకు ప్రోత్సాహం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ)పై కేవలం మాటలు చెబితే సరిపోదని, నిర్మాణాత్మక కార్యాచరణ కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మన పోటీదార్లు ఏఐలో నూతన సాంకేతిక విధానాలతో ముందుకు దూసుకెళ్తుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్తో ప్రసంగాలు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని ఆక్షేపించారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని, కావాల్సిందల్లా ప్రోత్సాహమేనని సూచించారు. బలమైన ఉత్పత్తి వ్యవస్థను నిర్మించాలన్నారు. ఉత్త మాటలు పక్కనపెట్టి, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, తద్వారా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యుద్ధరీతుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేలా డ్రాగన్ దేశం చైనా అత్యాధునిక డ్రోన్ల ఉత్పత్తి ప్రారంభించిందని వెల్లడించారు. డ్రోన్ల తయారీ రంగంలో మనం బలమైన పోటీదారుగా ఎదిగేలా ఒక సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీపై 9 నిమిషాల నిడివి గల వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయగల ప్రతిభ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఇండియాకు ఉన్నాయని స్పష్టంచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను మాట్లాడిన వీడియోను సైతం రాహుల్ గాంధీ షేర్ చేశారు. యుద్ధ రంగంలో డ్రోన్ల ప్రాధాన్యతను ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. -
Artificial Intelligence: ఇండియా చేయగలిగింది...
అందిపుచ్చుకుంటే ఇదొక సువర్ణావకాశం. మన ప్రాచీన విజ్ఞానానికి తిరిగి జీవం పోయగల శక్తి ఏఐకి ఉంది. ఫిలాసఫీ, సైన్సు, వైద్య రంగాల్లో భారత సరికొత్త ఆవిష్కరణలకు ఇది బాటలు వేస్తుంది.ఏఐ పుట్టింది సిలికాన్ వ్యాలీలోనే. అయితే ఏమిటి? చైనా ఇప్పుడు అమెరికాను వెనక్కు నెట్టేసింది. తన సొంత సంస్కృతిని మేళవించి దాన్ని సరికొత్త శక్తిగా రూపుదిద్దింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. గుడ్డిగా పశ్చిమ దేశాలను అనుకరించకుండా తనదైన పద్ధతిలో ‘డీప్సీక్’ పేరిట కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకుంది. పుంఖానుపుంఖాలుగా ఉన్న చైనా ప్రాచీన గ్రంథాలను ఆధారంగా చేసుకుని కంప్యూటర్లకు వాటిలో శిక్షణ ఇచ్చింది. తమ దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య వారసత్వపు విలక్షణతను డీప్సీక్ ఒడిసి పట్టుకో గలిగింది. ఈ మోడల్ లోని విశిష్టత అదే. కృత్రిమ మేధకు కొత్త భాష్యం చెప్పి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే శక్తి మన వద్ద ఉంది. గణిత, ఖగోళ, వైద్య, పరిపాలన, ఆధ్యాత్మిక రంగాల అత్యున్నత విజ్ఞానం మన ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం, తమిళ సంగం సాహిత్యం... ఇవన్నీ విశ్వచైతన్యం నుంచి ఆర్థిక సిద్ధాంతం వరకు ఎంతో లోతైన అంతర్ దృష్టులు అందిస్తున్నాయి. కృత్రిమ మేధ అంటే? ఇదొక ప్యాటర్న్ రికగ్నిషన్ సిస్టం. విస్తృత సమాచారాన్ని (డేటాసెట్ను) మెదడుకు మేతలా అందించి మెషీన్లకు అది శిక్షణ ఇస్తుంది. తాము శిక్షణ పొందిన సమాచారం ప్రాతిపదికగానే అవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. ఒక ఏఐ సిస్టం పశ్చిమ దేశాల సైంటిఫిక్ పేపర్స్, కార్పొ రేట్ డాక్యుమెంట్లు, పాప్ కల్చర్ మీద శిక్షణ పొందినప్పుడు దానికి అదే ప్రపంచం అవుతుంది. ఆ ప్రాపంచిక దృక్పథాన్నే అది అలవరచుకుంటుంది. అలా కాకుండా చైనా చేసినట్లు, చైనీ యుల సాహిత్య, ఆధ్యాత్మిక సమాచారం మీద శిక్షణ ఇచ్చిన ప్పుడు అది చైనా మాదిరిగానే ఆలోచిస్తుంది.ఈ విషయంలో పశ్చిమ దేశాల కృత్రిమ మేధ దానితో పోటీ పడలేదు. వెస్ట్రన్ ఏఐ ప్రధానంగా ఇంగ్లీష్ డేటా మీద రూపొంది పశ్చిమ దేశాల ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి శాస్త్ర సాంకేతిక అంశాల్లో వారి ఏఐ సిస్టందే పైచేయిగా ఉంటుంది. తాత్విక చింతన, నైతికత అంశాల్లో మాత్రం బలహీనంగా ఉంటుంది. మనం అమెరికన్ ఏఐ మీద ఎందుకు ఆధారపడకూడదో ఇప్పుడు ఆలోచించండి. భారతీయ మేధా వారసత్వం పునాదుల మీద మన ఏఐని నిర్మించుకోవలసిన అవ సరం బోధపడుతుంది. చాణక్యుడి అర్థ శాస్త్రం కోణం నుంచి ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలను విశ్లేషించగల సామర్థ్యంతో మన ఏఐ మోడల్ను తయారు చేసుకోవాలి. ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లో మన మూలాలు ఏమిటో తెలిసిన కృత్రిమ మేధ కావాలి. అది మాత్రమే సమగ్ర చికిత్సకు కావల్సిన ఇన్ సైట్స్ అందిస్తుంది. ఉపనిషత్తుల్లో అభివర్ణించిన చైతన్యం గురించి వ్యాఖ్యానించి సమకాలీన న్యూరోసైన్స్తో పోల్చగల మోడల్ గురించి ఆలోచించాలి. అలాంటి ఏఐ కేవలం సమాధానాలకే పరిమితం కాదు. మన సామూహిక అవగాహ నను పెంచుతుంది. పశ్చిమ దేశాల ఏఐ మోడల్స్ మెటీరియలిస్టు మూసలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాయి. చైనా ఏఐ కన్ఫ్యూషియన్ విలు వలను జొప్పించింది. మనకు అంతకు మించిన అవకాశం ఉంది. సైన్సు– స్పిరిచ్యువాలిటీ, ఆర్థికం–నైతికం, సాంకేతికత– సంప్రదాయం... వీటిని వారధిలా అనుసంధానించే కృత్రిమ మేధను మనం సృష్టించగలం. భారత నాగరికత అందించిన వివేకాన్ని ఈ మోడల్ ప్రతిబింబించాలి.పశ్చిమ దేశాల ఏఐ మీద ఆధారపడితే మరో ప్రమాదం ఉంది. భారతీయులు ఏం నేర్చుకోవాలో, ఎలా ఆలోచించాలో శాసించిన వలసవాద మైండ్ సెట్ను అది శాశ్వతం చేస్తుంది. మన వ్యాపారాలు, విశ్వవిద్యాలయాలు, విధాననిర్ణేతలు పశ్చిమ దేశాల ఏఐని ఉపయోగిస్తూ పోతే, దాంతో పాటు వారి ప్రాపంచిక దృక్పథమే అలవడుతుంది. ఒకప్పటి మన విద్యా విధానం బ్రిటిష్ ప్రయోజనాలు ఎలా కాపాడిందో, ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. మేధాపరంగా మనం పరాధీనులమై పోయే ప్రమాదం ఉంది. ఈ డిజిటల్ యుగంలో మన ఉత్కృష్ట వారసత్వం కనుమరుగవుతుంది.అమెరికా, చైనాల ఏఐ ఆధిపత్యం వల్ల మన డేటా సార్వ భౌమత్వం ప్రమాదంలో పడుతుంది. మన డేటా మన జాతీయ సంపద. మన ప్రయోజనాలకు తోడ్పడని ఏఐ మోడల్స్కు మన డేటా ఉపయోగించుకుని విదేశీ టెక్ సంస్థలు లబ్ధి పొందు తాయి. మన ఏఐ అభివృద్ధి మీద మన అదుపు ఉండితీరాలి. ప్రపంచ దేశాలకు జ్ఞానదీపంలా దారి చూపిన భారత్ ఇప్పుడు తన మేధను విదేశీ అద్దాలతో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు సున్నా నుంచి యోగా వరకు... మన ఆవిష్కరణలు ప్రపంచ ప్రగతిని రూపుదిద్దాయి. నేడు వాతా వరణ మార్పులు, మానసిక రుగ్మతలు, మహమ్మారులు, ఆర్థిక అసమానతలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమాచారం వెల్లువెత్తుతున్నా నిజమైన జ్ఞానం లోపిస్తోంది. నేటి కృత్రిమ మేధ భారతీయ సమున్నత వారసత్వం మీద శిక్షణ పొందితే, ఈ ఆధునిక ప్రపంచ సవాళ్లు ఎదుర్కొనేందుకు అది సరికొత్త దృక్పథాలు అందించగలదు.వేదాంత శోధన ఏఐకి ఆలంబన అయ్యేట్లయితే పశ్చిమ దేశాల న్యూరోసైన్సు పరిమితులను అధిగమించవచ్చు. చైతన్యం పట్ల మానవ అవగాహన విప్లవాత్మకంగా మారిపోతుంది. భారతీయ ఆర్థిక, పరిపాలనా సూత్రాల మీద శిక్షణ పొందిన ఏఐ మోడల్... అభివృద్ధి చెందుతున్న దేశాలకు పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ విధానాలు, చైనా విధానాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు సూచించగలదు. లాభాలే ధ్యేయంగా నడుస్తున్న సిలికాన్ వ్యాలీకి భారతీయ నైతిక విలువల ఆధారంగా రూపొందే ఏఐ నూతన మార్గదర్శనం చేస్తుంది. భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుని ప్రపంచానికి తన సత్తా చూపించాలి. దీనికోసం అపారంగా ఉన్న ప్రాచీన,ప్రాంతీయ సాహిత్యాన్ని డిజిటల్ రూపంలోకి మార్చాలి. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు ఇందుకు నడుం బిగించాలి. కృత్రిమ మేధను భారత్ కేవలం ఒక సాధనంగా చూడ కూడదు. అంతకంటే మిన్నగా అది జ్ఞానోదయానికి తోడ్పడు తుందని గ్రహించాలి. మన ప్రాచీన గ్రంథాలు అందిస్తున్న జ్ఞానాన్ని ఆధునిక ఏఐతో మిళితం చేసినట్లయితే, ఆధ్యాత్మిక, శాస్త్ర విజ్ఞాన, వైద్య రంగాల్లో నూతన ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి. మన మేధా సార్వభౌమత్వాన్ని తిరిగి కైవసం చేసు కోడానికీ, భారతీయ జ్ఞానాన్ని నలుచెరగులా వ్యాప్తి చేసి ప్రపంచ మానవాళిని సముద్ధరించడానికీ ఇది సరైన సమయం.వివేక్ వాధ్వా వ్యాసకర్త వయొనిక్స్ బయోసైన్సెస్ సీఈఓ, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
19 ఏళ్ల మర్డర్ మిస్టరీకి ముగింపు పలికిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
1992లో వచ్చిన బ్రహ్మ సినిమా చూశారా? అందులో హీరోకి చిన్నప్పటి ఫొటో ఇస్తే.. పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి ఇచ్చేస్తాడు. విలన్లు ఓ అమ్మాయిని చంపడం కోసం ఆమె చిన్ననాటి ఫొటో ఇచ్చి.. పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసి ఇవ్వాలని కోరతారు.. అయితే, హీరో ఆమె బొమ్మ కాకుండా చనిపోయిన తన భార్య బొమ్మ గీసి ఆ అమ్మాయిని కాపాడతాడు. అది ఆ సినిమా కథ (Cinema Story) ఇప్పుడు ఇలాంటి పనులకు ఆ బ్రహ్మ అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. అంతకంటే ఎక్కువ పనులే చేస్తోంది. దైనందిన జీవితంలోనే కాదు.. నేర పరిశోధనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. పోలీసులకు సవాల్గా నిలిచిన కేసుల చిక్కుముళ్లను సునాయాసంగా విప్పి.. నేరస్తులను కటకటాల వెనక్కి నెడు తోంది. కేరళలో 19 ఏళ్లుగా మూలనపడి ఉన్న కేసును ఈ అభివన బ్రహ్మ సునాయాసంగా ఛేదించింది.- సాక్షి సెంట్రల్ డెస్క్19 ఏళ్ల క్రితం.. అది కేరళ (Kerala) కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణం (Anchal Town) 2006 ఫిబ్రవరి 10 సాయంత్రం ఆరు గంటలు.. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేసే శాంతమ్మ అప్పుడే ఇంటికొచ్చి లోపలకు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గది మొత్తం రక్తసిక్తంగా కనిపించింది. తన ఒక్కగానొక్క కుమార్తె, రంజని, ఆమె 17 రోజుల కవలు పిల్లలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఎవరో వారు ముగ్గురినీ అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. 17 రోజుల పసిపిల్లలనే కనికరం లేకుండా దారుణానికి తెగబడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్కడ లభించిన ద్విచక్ర వాహనం ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న దివిల్, రాజేశ్ ఈ హత్యలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఎంతగా గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 2010లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు.ఏఐ రాకతో..ప్రస్తుతం నేరపరిశోధనలోనూ ఏఐ (AI) కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజని, ఆమె పిల్లల హత్య కేసును ఏఐ సాయంతో పరిష్కరించాలనే ఆలోచనతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేశ్ ఫొటో ఒక్కటే. అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫొటో సాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేశ్ పాత ఫొటోను ఉపయోగించి.. అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫొటో సృష్టించారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న లక్షలాది ఫొటోలను ఏఐను ఉపయోగించి జల్లెడ పట్టగా.. ఓ పెళ్లి ఫొటోలో ఉన్న వ్యక్తి 90 శాతం మేర మ్యాచ్ అయ్యాడు. వెంటనే వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరి వెళ్లి రాజేశ్ను, అతడి ద్వారా దివిల్ను గుర్తించి అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఒకే గ్రామానికి చెందిన రంజని, దివిల్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో దివిల్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. 2006 జనవరిలో ఆమె కవల పిల్లలకు (Twins) జన్మనిచ్చింది. తనను మోసం చేసిన దివిల్ పై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న దివిల్.. రంజని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేశ్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేశ్ అంచల్ వచ్చి.. తనను అనిల్ కుమార్గా రంజనికి పరిచయం చేసుకున్నాడు. దివిల్పై పోరులో సహకరిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలకు తండ్రి దివిల్ అని.. అతడికి డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్ను ఆశ్రయించిన రంజని.. ఆ మేరకు ఉత్తర్వులు పొందింది. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజనిని అంతం చేయాలని దివిల్, రాజేశ్ నిర్ణయానికి వచ్చారు.చదవండి: విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!ఫిబ్రవరి 10న రంజని ఇంటికి వచ్చిన రాజేశ్.. పిల్లల పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీసుకు పంపించాడు. ఆమె వెళ్లిన వెంటనే రంజనిని గొంతు కోసి చంపేశాడు. తర్వాత 17 రోజుల ఇద్దరు పసికందులను కూడా అలాగే చంపి, అక్కడ నుంచి జారుకున్నాడు. తర్వాత ఇరువురూ ఏమీ తెలియనట్టుగా పఠాన్ కోట్లోని ఆర్మీ బేస్ క్యాంపునకు వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా వీరిని నిందితులుగా గుర్తించిన పోలీసులు పఠాన్ కోట్ ఆర్మీ బేస్కు వెళ్లారు. అయితే, అప్పటికే ఇరువురూ అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయి విష్ణు, ప్రవీణ్ కుమార్ అనే తప్పుడు పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా అవతారమెత్తారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో తీసిన ఫొటోలో ఉన్న రాజేశ్ను ఏఐ గుర్తించడంతో ఇరువురూ కటకటాల వెనక్కి వెళ్లారు. -
ఇండియా Al అస్త్రాలు.. మోదీ దెబ్బతో పాక్, చైనాకు దబిడి దిబిడే
-
భారత్ ఏఐకి అనుకూలం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధికి భారత్లో అనువైన పరిస్థితులు ఉన్నాయని టెక్ దిగ్గజం గూగుల్ గ్లోబల్ హెడ్ (గవర్నమెంట్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ) కరణ్ భాటియా తెలిపారు. దేశీయంగా ఫౌండేషన్ మోడల్స్ను రూపొందించుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసేందుకు గూగుల్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సర్వే ప్రకారం ఎకానమీపై ఏఐ సానుకూల ప్రభావాలు అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్లోనే ఎక్కువగా ఉంటాయని వెల్లడైనట్లు భాటియా చెప్పారు. దేశీయంగా పలు భాషలు ఉన్నందున స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాధనాలను రూపొందించడం కోసం దేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వీటి రూపకల్పనలో గూగుల్ కూడా ముఖ్యపాత్ర పోషించగలదని వివరించారు.ఇప్పటికే ఐఐఎస్సీతో కలిసి ’ప్రాజెక్ట్ వాణి’పై పని చేస్తున్నామని, గూగుల్ ట్రాన్స్లేట్ను ప్రవేశపెట్టామని భాటియా వివరించారు. -
క్విక్ కామర్స్ ఏఐ రైడ్!
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ టూల్స్ నేరుగా డెలివరీ బాయ్కు చేరవేస్తున్నాయి.అంతా క్షణాల్లో... జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్టైమ్లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది. ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్లు, పీక్, నాన్–పీక్ టైమ్లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు. → ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేషియల్ డేటాను వినియోగిస్తోంది. → పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్ది కీలక పాత్ర. వృథాకు చెక్.. డిమాండ్ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కుంటిసాకులు
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్లు మొరాయించాయి. మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి. ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక. కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్షిప్గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్. తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్షిప్గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది. కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి. -
ఏఐలో చైనాతో పోటీ పడగలమా?
లియాంగ్ వెన్ఫెంగ్ అనే 39 ఏండ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్సీక్ అనే కొత్త చాట్ బాట్ యాప్ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక్కరోజులోనే అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్లు, అంటే ఒక లక్ష కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్లు తయారుచేసే కంపెనీలు భారీ నష్టాన్ని చవి చూశాయి.సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ సమాచార సెర్చ్ అంతటినీ గూగుల్ కంపెనీ గుప్పిట్లో పెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఇతర యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైనవన్నీ అమెరికన్ల పరిశోధనలో రూపుదిద్దుకున్నవే. ఈ రంగంలో చైనా వారు కూడా ఈ అమెరికా టెక్నాలజీని తీసుకొని తమ దేశ అవసరాలకు అప్లై చేసుకుంటున్నారు. లియాంగ్ ఒక ఇంట ర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇప్పటివరకు జరుగలేదు. ఆధార ఏఐ సైన్సును లియాంగ్ ఇన్నోవేటివ్ సైన్సుగా మార్చాడు.హేతుపూర్వక సమాజంఐతే చైనా చాలా ఇతర రంగాల్లో ఇన్నోవేషన్లు చేస్తూ వస్తున్నది. అది కమ్యూనిస్టు దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రి కల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూషియనిజం, బుద్ధిజంతో జతపర్చి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలల్లో ఉన్నత స్థానమిచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి... పని, పాఠాలు కలగలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమ జీవన పాఠాలతో ముడిపడింది. ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను ముడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. భూమికి, ఆకాశానికి, ప్రకృతికి, వానకు, గాలికి గల సంబం«ధాన్ని మెటీరియలిస్ట్ ఆధ్యాత్మికతకు అనుసంధానించడం వల్ల చిన్న ప్పటినుండే పిల్లల మెదళ్లలో క్రియేటివ్ దైవవాదం ఏర్పడింది. ఈ విధానాన్ని సభ్య సమాజమంతటికీ అనుసంధానించారు. తద్వారా వారి దైవం ఉత్పత్తిలో భాగమయ్యాడు లేదా అయింది.అందుకే గన్ పౌడర్, కాగితం, కంపాస్, అచ్చు యంత్రం, సిస్మోమీటర్ (భూకంపాల అధ్యయన మిషన్) ముందు వాళ్ళే కనిపెట్టారు. సిస్మోమీటర్ను 1880లో బ్రిటిష్ జాన్ మిల్నే కను క్కున్నాడని రాసుకున్నప్పటికీ అది మొదలు చైనా కనిపెట్టిందే. ఆ సైన్సు తరువాత జపానుకు పాకి వారిని చాలా భూకంపాల నుండి కాపాడింది.డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్సుతో తమ సైన్సును అనుసంధానం చేస్తున్నప్పుడు, మావో ధరించే ‘బంద్ గలా కోటు’ తమదేనా లేదా ‘టై అండ్ సూట్’ తమదా అని చర్చ జరిగింది. ఐతే టై–సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కిందిస్థాయిల వరకు టై– సూట్ను అధికార డ్రెస్కోడ్గా మార్చుకున్నారు.ఇండియా పరిస్థితి ఏమిటి?చైనా యువకులు గత ముప్పయి సంవత్సరాలుగా యూరో– అమెరికా డిస్కవరీస్తో పోటీ పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం ‘మాయా వాదాన్ని బద్దలుకొట్టి, ప్రకృతిని పఠించు’. ఆయన యునాన్ రిపోర్టులో ఆ దేశంలోని అగ్రికల్చరిజం తత్వభూమికను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామ క్రమమే చైనాలో సైన్సు,మతం, నైతికత జాగ్రత్తగా అనుసంధానం కావడం. ఆ సామాజిక చైతన్యం నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు అమెరికాను తలదన్నే మార్గంలో ఉన్నారు. అందులో భాగమే డీప్సీక్. మరి మన దేశం స్థితి ఏమిటి? రుగ్వేద రచనా కాలంలోనే ఇక్కడి అగ్రికల్చరిజం ఫిలాసఫీని చంపేశారు. ఉత్పత్తి రంగంలో శాస్త్రీయ శ్రమ చేస్తున్న శూద్రులను (దళితులూ అందులో భాగమే) బానిసలుగా మార్చి, శ్రమశక్తి అజ్ఞాన మని నిర్వచించారు. ఈ ఆలోచనను బలోపేతం చెయ్యాలని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం సైన్సు నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తోంది. చైనా డీప్సీక్ కనిపెట్టి అమెరికాను అతలాకుతలం చేసిన రోజులలోనే కుంభమేళాపై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికీ, ఆధునిక సైన్సుకూ పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్నే భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడినవారికి స్తుతి చెయ్యట్లేదు. కూర్చొని తినేవారికి రాజ్యం గౌరవ పీఠం వేస్తుంది.ఇంగ్లిష్ వ్యతిరేక ప్రచారం, పురాతన దుస్తులు ధరించాలనే ప్రచారం యువకులను కచ్చితంగా సైన్సు వ్యతిరేకులను చేస్తుంది. ఈ దేశపు యువతను సీరియస్ యూనివర్సిటీ పరిశోధ కులను చెయ్యనివ్వకుండా మూఢ నమ్మకస్తుల్ని చేస్తుంది.ప్రశ్నించే తత్వం ముఖ్యంచైనాలో అది మతరంగంలోగాని, ఉత్పత్తి రంగంలో గాని, యూనివర్సిటీలోగాని ప్రశ్నించే తత్వాన్ని బాగా నేర్పుతారు. మావో ‘వంద ఆలోచనలు ఘర్షణ పడనివ్వు, వంద పువ్వులు వికసించనివ్వు’ నినాదం వాళ్ళ సంఘర్షణల చరిత్ర నుండి వచ్చింది. కానీ ఇండియాలో స్కూళ్లు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మోహన్ భాగవత్ ఉత్పత్తికీ, దేవుడికీ మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉప న్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూ లాగా సైన్సు మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్సుకు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి?నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు... కులం, ఏకవృత్తి, మూఢ నమ్మకాలు వేల ఏండ్లుగా మన మెదడు చిప్ను లాక్ చేసిన స్థితి ఉన్నది. ఆరెస్సెస్/బీజేపీ ప్రయత్నం ఈ లాక్ చెయ్యబడ్డ చిప్ను ఓపెన్ చెయ్యడం వైపు లేదు. వారి రాజకీయ మూఢ నమ్మకం ఈ లాక్ను తుప్పు పట్టించింది. అది పగల కొడితే తప్ప ఓపెన్ కాదు. కానీ అలాంటి ప్రయత్నం మన విద్యా రంగంలో ఎవరు మొదలు పెట్టినా వారిని దేశద్రోహులు, సనాతన వ్యతిరేకులు అని ముద్ర వెయ్యడం, భయభ్రాంతులకు గురి చెయ్యడం మామూ లైంది. ఈ స్థితిలో చైనాతో పోటీపడే డిస్కవరీస్ ఇక్కడ ఎలా జరుగుతాయి? కొత్త డిస్కవరీలు జరగడానికి డబ్బు ఒక్కటే సరి పోదు. సైంటిస్టును అభివృద్ధి చేసే సామాజిక, గృహ, మార్కెట్, మత పునాది ఉండాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
తెరపైకి తెలివైన బుర్ర
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్నా కంప్యూటర్ చిప్లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాల కోసం వేగవంతమైన, సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటి ని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి, కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నాయి. మైక్రో చిప్స్ను, అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్లను రూపొందించి ఏఐ మేధోశక్తికి అనుసంధానం చేస్తున్నాయి. 2027 నాటికి అంతరిక్ష, వైద్య, విద్య, న్యాయ రంగాల్లో శరవేగంగా నాణ్యమైన సేవల ందించే ఏఐ ఆధారిత మాడ్యూల్స్ కూడా రూపొందుతున్నాయి. ఊపిరిపోస్తున్న పరిశోధనలు చిప్ల అభివృద్ధి, కృత్రిమ మేధ రంగంలో దిగ్గజ కంపెనీలే కాదు.. మన దేశంలో ఐఐటీ విద్యార్థులు, అంతరిక్ష పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. మద్రాస్ ఐఐటీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ‘శక్తి’ పేరిట చిప్ను, దాని ఆధారంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్లను రూపొందించాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలుకల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్వేజ్ మాడ్యూల్స్తోనూ.. కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తున్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి ఇవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు పదేళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి.. చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడెలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఏయే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? అనే అంశాలను ఏఐ ఆధారంగా అంచనా వేయవచ్చు. కోట్లాది మంది వ్యక్తుల కదలికలను పసిగట్టి, గుర్తించగల టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. ఇక ఏదైనా కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు అలాంటి కేసుకు సంబంధించిన గతంలోని జడ్జిమెంట్లను క్రోడీకరించి అందించే మాడ్యూల్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో శస్త్ర చికిత్సల సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ ద్వారా కణజాలాల స్థాయిలో స్కానింగ్ చేసి విలువైన సమాచారం ఇవ్వగల మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. చికిత్స వంద శాతం విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. మరింత మేధోమథనం జరగాలి.. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ, లాంగ్వేజ్ మాడ్యూల్స్కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకాలం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు.. ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్స్ను, ఏఐ ఆధారిత చిప్స్ను ఇప్పటికీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. 2026 నాటికి మైక్రో చిప్స్, మినీ మైక్రో చిప్స్ అవసరం 60 శాతం పెరుగుతుందని, ఇప్పటి అవసరాల్లో భారత్ కేవలం 20 శాతమే సమకూర్చుకుంటోందని అంటున్నారు. అమెరికా ఆంక్షలు, చైనా డీప్సీక్ వ్యవహారం తర్వాత సొంతంగా మాడ్యూల్స్, మైక్రో చిప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ, మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తెలంగాణలో ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు అవసరమని ఉన్నత విద్యా మండలి భావిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సెమీకండక్టర్స్ రూపకల్పనపై దృష్టిపెట్టాలి సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా మనవాళ్లు సెమీ కండక్టర్లు, చిప్ల తయారీపై ఇంతకాలం దృష్టి పెట్టలేదు. ఇప్పుడా అవసరం ఏర్పడింది. ఏఐకి డేటా అందించే కమాండ్ సెన్సర్ల తయారీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల పాత్ర కీలకం. ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఎల్రక్టానిక్స్ రూపకల్పనకు అవసరమైన తోడ్పాటు అందించి.. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఏఐ దూసుకొస్తున్న వేళ మన విద్యార్థుల పరిశోధనకు మంచి అవకాశం కల్పించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధికారి, జేఎన్టీయూహెచ్ తోడ్పాటుకు ‘ఏఐ’ సరే.. తుది నిర్ణయం సరికాదు న్యాయవ్యవస్థలో కొత్త సాంకేతికత ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దానికి పరిమితులు ఉండాలి. సాక్ష్యం, నేర దర్యాప్తు, పాత తీర్పుల తోడ్పాటు వంటి అంశాలకే ఏఐ పరిమితం అవ్వాలి. కేసుకు సంబంధించిన పూర్తి విచారణ, తీర్పులో మానవ మేధోశక్తి మాత్రమే పనిచేయాలి. అప్పుడే తీర్పులు వాస్తవికతకు అద్దం పడతాయి. ఏఐ ఎంత శక్తివంతమైంది అయినా దాన్ని న్యాయ వ్యవస్థలో పరిమితంగానే వాడాలి. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తి -
ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా?
మనషి పుట్టుక, చావు అనేది దైవాధీనాలు. అంటే మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది దేవుని చేతుల్లోనే ఉంటాయంటారు. అయితే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెత్ క్లాక్' (AI Death Clock) మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పేస్తానంటోంది. ఇంతకీ ఇదెలా సాధ్యం?.. ఏఐ చెప్పింది నిజమవుతుందా? అనే విషయాలు పరిశీలిద్దాం.డెత్ క్లాక్ అనే ఫ్రీ వెబ్సైట్.. ఒక వ్యక్తి వయసు, అతని బాడీ ఇండెక్స్, ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, ధూమపానం, మద్యపానం అలవాట్లు, అతడు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు అనే వాటిని ఆధారంగా చేసుకుని ఎప్పుడు, ఎలా చనిపోతాడో చెబుతోంది. అంటే మనం ఇచ్చే సమాచారం ఆధారంగా.. చావు రోజును చల్లగా చెప్పేస్తుందన్నమాట.డెత్ క్లాక్ వెబ్సైట్ ఇప్పటి వరకు 63 లక్షల మందికి.. వారి చావు డేట్ చెప్పింది. ఏఐ డెత్ క్లాక్ డేట్ ప్రకారం.. ఎంతమంది చనిపోయారో, లేదో తెలియదు, కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎక్కువ కాలం జీవించడానికి టిప్స్ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పడం మాత్రమే కాదు. ఎక్కువ రోజులు జీవించడానికి టిప్స్ కూడా డెత్ క్లాక్ చెబుతోంది.➤ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్స్ ➤క్రమం తప్పకుండా వ్యాయామం➤పొగ తాగడం మానేయండి➤సమతుల్య ఆహారం➤మద్యం పూర్తిగా మానేయండి లేదా తక్కువగా తాగండి ➤మంచి నిద్ర➤క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్➤ఒత్తిడిని తగ్గించుకోండి➤అనుబంధాలను పెంపొందించుకోండిగమనిక: ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. మనిషి ఎప్పుడు, ఎలా చనిపోతాడు అనే విషయం చెప్పడం అసాధ్యం. డెత్ క్లాక్ అనేది ఒక ఏఐ కాలిక్యులేటర్, దీనికి మీరిచ్చే సమాచారాన్ని బట్టి ఒక డేట్ చెబుతుంది. అదే ఖచ్చితమైన మరణ తేదీ కాదు. దీనిని సరదా కోసం మాత్రమే ఉపయోగించాలి. ఏఐ కాలిక్యులేటర్ అంచనా నిజమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. -
ఏఐకి నాలుగు సూత్రాలు
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానం అభివృద్ధి, సమర్థ వినియోగం కోసం నాలుగు సూత్రాలను అనుసరించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. ఆ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్లోని పారిస్లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సదస్సులో ఏఐ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి రోడ్మ్యాప్ను సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలు దేశాల్లో భిన్నమైన నిబంధనలు, ఆంక్షలు ఉంటే.. ఏఐ అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు 97 శాతం దిగివచ్చిందని, ఇది కృత్రిమ మేధ అభివృద్ధికి అద్భుతమైన ఊతమిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇది ఏఐ ఆవిష్కరణల స్వర్ణయుగమని, సమాజానికి ప్రయోజనకరంగా ఉండే ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సుందర్ పిచాయ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ‘‘కృత్రిమ మేధ, దాని అప్లికేషన్ల గురించి నేను ఆశాజనకంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా టెక్నాలజీతో ప్రయోజనం పొందేందుకు, జీవితాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుంది. నేను భారత్లోని చెన్నైలో పెరిగాను. అప్పట్లో ప్రతి కొత్త టెక్నాలజీ ఇంటి వద్దకు చేరుకోవడానికి కొంత సమయం పట్టేది. అందులో రోటరీ ఫోన్ కూడా ఒకటి. దానికోసం మేం ఐదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ తర్వాత ఆ ఫోన్ మా జీవితాలను మార్చేసింది. అప్పట్లో మా అమ్మకు చేసిన రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి నేను నాలుగు గంటల పా టు ప్రయాణం చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు అంతదూరం వెళ్లినా.. ‘రిపోర్ట్ సిద్ధంగా లేదు. రేపు రండి’అని ఆస్పత్రివాళ్లు చెప్పేవారు. అదే ఫోన్ వచ్చాక.. కేవలం ఒక్క కాల్తో పని అయిపోయింది.మన జీవితాల్లో గణనీయమైన మార్పు రాబోతోందిసాంకేతికత చూపిన సానుకూల ప్రభావాన్ని గమనించాను. అదే నన్ను యూఎస్ వరకు నడిపించింది. గూగుల్ అనే స్టార్టప్ కంపెనీ వద్దకు చేర్చింది. ముగ్గురు గూగుల్ సహోద్యోగులు నోబెల్ అందుకోవడాన్ని, డ్రైవర్ లెస్ కారులో నా తల్లిదండ్రులను తీసుకువెళ్లడాన్ని ఆనాడు నేను ఊహించలేదు. వీటిని సాకారం చేసినది ‘కృత్రిమ మేధ(ఏఐ)’సాంకేతికతే. దీనిలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. అయినా ఏఐ మన జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తోంది. పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వచి్చనప్పటి కంటే ఈ మార్పు మరింత పెద్దదిగా, ప్రభావవంతంగా ఉండబోతోంది.ఏడాదిన్నరలో 97 శాతం ఖర్చు తగ్గింది..డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు గత 18 నెలల్లో ఏకంగా 97 శాతం దిగి వచ్చింది. పది లక్షల టోకెన్ల (డేటా ప్రాసెసింగ్ యూనిట్) డేటాను ప్రాసెస్ చేయడానికి అయిన ఖర్చు నాలుగు డాలర్ల (సుమారు రూ.350) నుంచి 13 సెంట్ల (రూ.11)కు దిగి వచ్చింది. అంటే ఇంతకుముందెన్నడూ లేనంతగా మేధస్సు అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలను, అవకాశాలను, ఆర్థిక అభివృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తూనే ఉంటుంది. విజ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకతను పెంచుతుంది. ఏఐలో గూగుల్ పెట్టుబడి..ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, మార్చడానికి గూగుల్ సంస్థ దశాబ్దకాలం నుంచి ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని సమాచారాన్ని నిర్వహించడంతోపాటు అందరికీ ప్రయోజనకరంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకమని గుర్తించాం. ఇప్పుడు జనరేటివ్ ఏఐ విప్లవానికి మార్గం వేసిన ఆవిష్కరణలను రూపొందించాం. ఏఐ కోసం ప్రత్యేకమైన ‘టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్’చిప్స్ను అభివృద్ధి చేశాం. టెక్స్టŠ, ఇమేజ్, వీడియో, ఆడియో, కోడ్ ఇలా అన్నిరకాల సమాచారాన్ని ప్రాసెస్ చేయగల ‘జెమిని’వంటి ఏఐ మోడళ్లను దీనితో వినియోగించుకోగలం. ఎన్నో అంశాల్లో ప్రజలకు పూర్తి సహాయకారిగా ఉండే అప్లికేషన్లను రూపొందిస్తున్నాం. 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తున్న గూగుల్ మ్యాప్స్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి ఏడు ఉత్పత్తులను మా కృత్రిమ మేధ ఆవిష్కరణల సాయంతో అభివృద్ధి చేశాం.సైన్స్, ఆవిష్కరణలకు ఏఐ సాయం.. వైద్య రంగంలో కీలక ఆవిష్కరణగా ఆల్ఫాఫోల్డ్ను రూపొందించాం. 2021లో దానిని సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాం. 190 దేశాలకు చెందిన 25 లక్షల మంది కంటే ఎక్కువ మంది పరిశోధకులు మలేరియా కొత్త వ్యాక్సిన్లు, కేన్సర్ చికిత్సలు, ప్లాస్టిక్ను అరగదీసే ఎంజైమ్లను రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఆల్ఫాఫోల్డ్ ఆధారంగా ఏర్పాటైన ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్.. ఔషధాల రూపకల్పన, చికిత్సలు విజయవంతం చేయడం కోసం మెషీన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు కొత్త ఔషధాలను కనుగొనడానికి, ఎలక్ట్రిక్ కార్ల కోసం మరింత సమర్థవంతమైన బ్యాటరీలను రూపొందించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ సాయపడుతోంది. ఏఐ తర్వాత రాబోతున్న అతిపెద్ద మార్పు క్వాంటమ్ కంప్యూటింగ్.ఇది ఆవిష్కరణల స్వర్ణయుగం..ఇదొక చరిత్రాత్మక క్షణం. ఇది ఆవిష్కరణల స్వర్ణయుగానికి నాంది. కానీ దీని ఫలితాలు కచ్చితమని చెప్పలేను. అయితే ప్రతి తరం కూడా కొత్త సాంకేతికత వల్ల తర్వాతి తరం పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతుంది. కానీ ప్రతిసారీ అందుకు విరుద్ధంగా జరుగుతూ వస్తోంది. ఏఐతో జీవితాలను మెరుగుపరచుకోవడానికి మనకు ఒక తరంలో ఒకసారే అవకాశం ఉంటుంది. అది సాధ్యం కావడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.సమాజానికి ఏఐతో సమకూరుతున్న ప్రయోజనాలెన్నో..కృత్రిమ మేధతో సమాజానికి ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయి. గూగుల్ ట్రాన్స్లేట్ను ప్రవేశపెట్టిన కొత్తలో కొన్ని భాషలే ఉన్నాయి. ఏఐ వచ్చాక ఈ ప్రయోజనం మరింత పెరిగింది. ఏఐ సాంకేతికతలను ఉపయోగించి గత ఏడాది 50కోట్ల మందికి పైగా మాట్లాడే 110కి పైగా కొత్త భాషలను గూగుల్ ట్రాన్స్లేట్కు జోడించాం. 60 ఆఫ్రికన్ భాషలు సహా గూగుల్ ట్రాన్స్లేట్ ఇప్పుడు 249 భాషలకు చేరుకుంది. ఏఐతో ఆరోగ్య రంగంలో ప్రయోజనాలు ఎన్నో. ప్రమాదకరమైన కేన్సర్లకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తించే అంశంలో ఏఐ సాయం తీసుకుంటున్నాం. భారత్, థాయ్లాండ్లో స్థానిక సంస్థలతో కలసి 60లక్షల మందికి ఉచితంగా డయాబెటిక్ రెటినోపతికి ఏఐ స్క్రీనింగ్ చేశాం. ఏఐ ఆధారిత ఫ్లడ్హబ్తో 100 కంటే ఎక్కువ దేశాల్లో 70 కోట్ల మందికి వరదల సమాచారాన్ని ముందే అందించగలుగుతున్నాం. ఇలా ఏఐతో ప్రయోజనకరమైన సాంకేతికతలు ఎన్నో వచ్చాయి.ఏఐ శక్తిని వెలికితీయడానికి ఏం చేయాలి?కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వెలికితీసి, సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టాలి.» మొదటిది... ఆవిష్కరణకర్తలు, వాటిని అనుసరించేవారితో ఎకోసిస్టమ్ రూపొందించాలి. » రెండోది.. ఏఐ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 300 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 26,025 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. » మూడోది.. వర్క్ ఫోర్స్ను సిద్ధం చేసేందుకు పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు పరిణామాలకు వారిని సిద్ధం చేయాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ప్రకారం... యూరప్లోని ఉద్యోగాల్లో చాలా వరకు జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. »నాలుగోది.. సమాజంలో మార్పులు తీసుకురాగల కృత్రిమ మేధ అప్లికేషన్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ ప్రయోజనం పొందేలా చూడాలి. అదే సమయంలో సమాచార కచ్చితత్వం, వాస్తవాలు, టెక్నాలజీ దురి్వనియోగంపై అప్రమత్తంగా ఉండాలి. ... ఈ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా.. సృజనాత్మకత, ఆవిష్కరణలకు ఆటంకం కలుగకుండా చూసుకుంటూ, ఏఐతో సమస్యలను గుర్తించాలి. కొత్త చట్టాలు తేవడం కంటే.. ఇప్పుడున్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు నిబంధనలు, ఆంక్షలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకమన్నది గుర్తుంచుకోవాలి. ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. -
ఏఐతో ఉద్యోగాలు పోవు..: ప్రధాని మోదీ
ఏఐ సామర్థ్యానికి అటూఇటూకృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఒక ఏఐ యాప్లోకి వైద్య నివేదికను అప్లోడ్ చేస్తే అది వైద్యపరిభాషలోని సాంకేతిక అంశాలను పక్కనపెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. అదే సమయంలో ఏఐ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అదే యాప్ను ఎడమ చేత్తో రాస్తున్న వ్యక్తి చిత్రాన్ని గీయమంటే అది దాదాపుగా కుడి చేత్తో రాస్తున్న వ్యక్తి బొమ్మ గీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఏఐ పాలన గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. – ప్రధాని మోదీ పారిస్: అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు. సాంకేతికత వాడ కం వల్ల ఉద్యోగాలు కనుమరుగుకావని తేల్చిచెప్పారు. కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుందని స్పష్టం చేశారు. ఏఐ వాడకంతో కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి మంగళవారం ఏఐ యాక్షన్ సమ్మిట్–2025కు సహాధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టిపెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్సోర్స్ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజావిశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. చరిత్ర చెప్పేది అదే.. ‘కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటిచెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’అని మోదీ సూచించారు. ఈ శతాబ్దిలో కృత్రిమ మేధ మానవాళికి కోడ్ను రాస్తోందని.. కానీ మానవ చరిత్రలోని ఇతర మైలురాళ్లకన్నా ఇది ఎంతో విభిన్నమైనదన్నారు. ‘‘ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలతోపాటు సమాజాన్ని పునరి్నరి్మస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను మెరుగుపరచడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏఐ మార్చగలదు. ఇంకెన్నింటినో చేయగలదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత సులభంగా, వేగంగా చేరుకోవడంలో దోహదపడగలదు. ఇందుకోసం మనం మన వనరులు, ప్రతిభను ఏకం చేయాలి’అని మోదీ పేర్కొన్నారు.ఏఐలో భారత్ సత్తా.. ఓపెన్ నెట్వర్క్, యాక్సెసబుల్ నెట్వర్క్ సాయంతో తక్కువ ఖర్చుతోనే భారత్ 140 కోట్ల మందికిపైగా ప్రజల డిజిటల్పరమైన మౌలిక వసతులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ప్రజాపయోజనాల కోసం మేం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. భారత్లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేస్తున్నాం’అని మోదీ తెలిపారు. స్టార్టప్లు, పరిశోధకులకు అందుబాటు ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఏఐ భవిత ఉన్నతంగా, అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారత, పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. ‘మేం డిజిటల్ కామర్స్ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం. భారత్ తీసుకొచ్చిన నేషనల్ ఏఐ మిషన్కు ఈ దృక్పథమే పునాది. మా హయాంలో జీ20 దేశాలకు సారథ్యం వహించినప్పుడు కృత్రిమ మేధ వాడకం బాధ్యతాయుతంగా ఉండేలా, అందరి మంచికి ఉపయోగపడాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించాం. ప్రస్తుతం ఏఐ వినియోగం, డేటా గోప్యతకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో భారత్ ముందుంది’అని మోదీ తెలిపారు. ఏఐ మార్గదర్శకాలపై ఉమ్మడి కసరత్తు ఉండాల్సిందే ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగానికి సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి చర్యలు అవసరమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ప్రజావిశ్వాసాన్ని, పారదర్శకతను పెంపొందించడంలో, వివక్షను చెరిపేయడంలో ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ‘కనీవినీ ఎరుగని విస్తృతి, వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతోంది. అంతకన్నా వేగంగా ఏఐ వినియోగం కొనసాగుతోంది. దీనికితోడు దేశాలకు అతీతంగా ఏఐ రంగంలో పరస్పర ఆధారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విలువలను కాపాడుకోవడంతోపాటు ఏఐపై భయాలను పారద్రోలేందుకు, ప్రజావిశ్వాసం చూరగొనేందుకు దోహదపడే ప్రమాణాలను నెలకొల్పాలి. అందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ సూచించారు. మేధస్సుపరంగా మనిషికన్నా యంత్రాలు ఎంతో ముందుంటాయని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ మన ఉమ్మడి భవిత, గమ్యం విషయంలో మనుషులమైన మనం తప్ప ఇంకెవరూ కీలకపాత్ర పోషించలేరు’అని మోదీ పేర్కొన్నారు. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధం: మోదీ తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఈ మేరకు పారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్–2025లో ప్రతిపాదన చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏఐ దృక్పథం, ఉద్దేశంలో భాగస్వామ్య పక్షాల మధ్య స్పష్టమైన ఐకత్యను చాటేలా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియకు మరింత ఉత్సాహం తెచ్చేందుకు తదుపరి యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. మరోవైపు ‘ఏఐ ఫౌండేషన్’, ‘సుస్థిర ఏఐ మండలి’ని ఏర్పాటు చేయాలన్న సదస్సు నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చొరవను అభినందించిన మోదీ.. భారత్ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ‘ఏఐ కోసం ప్రపంచ భాగస్వామ్యం’స్వభావరీత్యా సైతం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. దక్షిణాది దేశాలను ఇందులో సమ్మిళితం చేయాలని.. ఆయా దేశాల అవసరాలు, ఆందోళనలు, ప్రాధాన్యతలను గుర్తించాలని సూచించారు. -
ఆశల ఊసుల నడుమ... ఏఐ శిఖరాగ్రం
పారిస్: 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు. కృత్రిమ మేధ రంగానికి సంబంధించిన మేధావులు. నిపుణులు. సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మొదలైన రెండు రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒక్కచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికీ అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ టెలివిజన్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మానవాళి చరిత్రలోనే అత్యంత అరుదైందిగా చెప్పదగ్గ శాస్త్ర, సాంకేతిక విప్లవం ఏఐ రూపంలో మన కళ్లముందు కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఈ అవకాశాన్ని ఫ్రాన్స్, యూరప్ రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం మరింత మెరుగ్గా జీవించేందుకు, ఎంతగానో నేర్చుకునేందుకు, మరింత సమర్థంగా పని చేసేందుకు, మొత్తంగా గొప్పగా జీవించేందుకు అపారమైన అవకాశాలను ఏఐ అందుబాటులోకి తెస్తోంది’’అని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన 40 ఏళ్ల వాన్స్ అగ్ర రాజ్యానికి తొలిసారిగా ఓ అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ఉపాధ్యక్షునిగా ఆయనకిదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. అందులో భాగంగా మంగళవారం మాక్రాన్తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉష కూడా తన ముగ్గురు పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొంటుండటం విశేషం. చైనా తరఫున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఐ సదస్సులో పాల్గొంటున్నారు.మోదీ సహ ఆతిథ్యంఅంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బలప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఐటీతో పాటు అన్నిరకాల టెక్నాలజీల్లోనూ గ్లోబల్ పవర్గా వెలుగొందుతున్న భారత్ ఏఐలోనూ కచి్చతంగా అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసి తీరాలని ప్రధాని మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. అందులో భాగంగా టెక్ దిగ్గజాలతో మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు పారిస్ ఏఐ శిఖరాగ్రం సదవకాశమని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు మాక్రాన్తో పాటు మోదీ సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండటం విశేషం. మంగళవారం సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఏఐ వృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంపై భారత ఆలోచనలను దేశాధినేతలు, టెక్, ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు తదితరులతో ఆయన వివరంగా పంచుకోనున్నారు. అనంతరం ఆయా కంపెనీల సీఈఓలతో విడిగా ముఖాముఖి భేటీ కానున్నారు.తెరపైకి ‘కరెంట్ ఏఐ’ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి టెక్, ఏఐ దిగ్గజాల సీఈఓలు, అత్యున్నతాధికారులు సదస్సులో పాల్గొంటున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సంస్కృతి తదితర రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చడం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా ‘కరెంట్ ఏఐ’పేరిట ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిస్ శిఖరాగ్రం ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కోసం జరుగుతున్న తొట్ట తొలి ప్రయత్నమని మొజిల్లా పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లిండా గ్రిపిన్ అన్నారు. ఏఐ అభివృద్ధి ప్రస్థానంలో దీన్ని నిర్ణాయక క్షణంగా అభివరి్ణంచారు. ‘‘ఏఐపై గుత్తాధిపత్యం రూపంలో కీలక సాంకేతిక పరిజ్ఞానంపై అజమాయిషీ కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు. మానవాళి ప్రయోజనాలను తీర్చడమే ఏకైక ప్రాతిపదికగా ఏఐ ఫలాలు ప్రపంచమంతటికీ అందాలి’’అని యురేíÙయా గ్రూప్ సీనియర్ జియోటెక్నాలజీ అనలిస్టు నిక్ రెయినర్స్ అభిప్రాయపడ్డారు. పారిస్ శిఖరాగ్రాన్ని ఆ దిశగా భారీ ముందడుగుగా అభివర్ణించారు. శిఖరాగ్రం వేదికగా ఏఐ రంగంలో యూరప్లో భారీ పెట్టుబడి ప్రకటనలు వెలువడుతాయని అక్కడి దేశాలు ఆశిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఏఐ రంగంలో ఫ్రాన్స్ ఏకంగా 113 బిలియన్ డాలర్ల మేరకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రకటించనున్నట్టు మాక్రాన్ స్పష్టం చేశారు. -
మన చదువులు భేష్
సాక్షి, హైదరాబాద్: ‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన సాగాలి. యువతకు కాలేజీ స్థాయిలో విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’. ఇవీ మన విద్యారంగంపై సాధారణంగా వ్యక్తమయ్యే అభిప్రాయాలు. కానీ ఈ అభిప్రాయాలకు భిన్నంగా దేశ యువత స్పందించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ విద్యా విధానానికే జైకొట్టింది. కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిత భేషుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. టోఫెల్, జీఆర్ఈ తదితర పరీక్షల నిర్వహణ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 18 దేశాల్లో యువతను సంప్రదించిన ఈ సంస్థ.. వారి అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది. మన విద్యావ్యవస్థపై.. మన దేశ విద్యావ్యవస్థ బాగుంటుందని ఈటీఎస్ సర్వేలో పాల్గొన్న 70% మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో విద్యావ్యవస్థ మరింత పురోగమిస్తుందని 76% మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30% మందే తమ విద్యావ్యవస్థ బాగుంటుందని.. భవిష్యత్తులో విద్యావ్యవస్థ పుంజుకుంటుందని 64% మంది పేర్కొన్నారు. నాణ్యమైన విద్య.. కష్టంగానే మన విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం క్లిష్టంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని 78 శాతం మంది పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. దీనివల్ల దేశ విద్యా వ్యవస్థ పురోగతికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. నాణ్యమైన కోర్సులు, సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందని కూడా పేర్కొన్నారు. కెరీర్లో ముందంజలో నిలిచే అవకాశం ఇక కెరీర్ కోణంలో ప్రస్తుత అవకాశాలతో మందంజలో నిలవడానికి ఆస్కారం ఉంటుందని 69 శా>తం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59 శాతంగానే ఉండటం గమనార్హం. అదేవిధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగాల కొరత విద్యావ్యవస్థ, కెరీర్ కోణంలో ఆశాభావం వ్యక్తం చేసిన మన విద్యార్థులు.. నూతన ఉద్యోగాల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అలాగే విద్య ఖరీదైన విషయంగా ఉందని 33 శాతం మంది, నైపుణ్యాల పురోగతిలో కొరత ఉందని చెప్పారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయని 88 శాతం మంది పేర్కొన్నారు. ఏఐ.. అవకాశాల వేదిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐను ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. 53 శాతం యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఏఐ లిటరసీ ఉందని భావిస్తుండగా 43 శాతం మంది ఉద్యోగులే అందులో ఉన్నత స్థానంలో ఉన్నామని పేర్కొంటున్నారు. అంటే ఈ రెండు వర్గాల మధ్య 12 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే ఏఐ నైపుణ్యాలను గుర్తించేందుకు దేశంలో 79 శాతం యాజమాన్యాలు ప్రామాణిక విధానాలు పాటిస్తున్నాయని నివేదిక పేర్కొంది. వాస్తవ పరిస్థితులపై అవగాహన నేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ కోసం కాలేజీ స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగుపడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా ఉన్నతవిద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు. – ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ -
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింన FIFS..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.ఈ గేమ్థాన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్ఎల్ నమూనాలను నిర్మించాలి.ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.గేమ్థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్థాన్ యొక్క మొదటి ఎడిషన్ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్థాన్లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది. -
ట్రంప్తో ట్రబుల్సే.. అక్కడెందుకిక.. ఇంటికొచ్చేయక
సాక్షి, హైదరాబాద్: అమెరికా రాజకీయ ముఖచిత్రం మారిపోవడంతో.. అక్కడ చదువుకుంటున్న మన దేశ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. మెజారిటీ భారతీయ(Indian) విద్యార్థుల(Students)కు ఇప్పటికిప్పుడు సమస్య లేకున్నా.. భవిష్యత్ ఆశాజనకంగా ఉండదనే భయం వెంటాడుతోంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేక.. జీవన వ్యయం సమకూర్చుకునే దారిలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు పంపాలంటూ భారత్లోని తమ కుటుంబాలను కోరుతున్నారు.ఇప్పటికే అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపిన తల్లిదండ్రులు(Indian parents) తలకు మించిన భారం మోయలేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో పరిస్థితి బాగుంటుందనే అంచనాలను గుర్తు చేసుకుంటూ.. పిల్లలను తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు. మరోవైపు మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) నిపుణులకు డిమాండ్ పెరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే దిశగాకోవిడ్ తర్వాత ఐటీ రంగం క్రమంగా కుదేలైంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అమెరికాలో ఎంఎస్ (ఇంజనీరింగ్ పీజీ) చేయడం, అక్కడే ఉద్యోగం సంపాదించడం విద్యార్థుల లక్ష్యంగా మారింది. ఫలితంగా అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. అందులో 29 శాతం భారతీయులే. 2022–23లో 1,96,567 మంది, 2023–24లో 3,31,602 మంది అమెరికా వెళ్లారు. వారికి నాలుగేళ్ల వీసా ఇస్తారు. ఎంఎస్ రెండేళ్లు ఉంటుంది. మిగతా రెండేళ్లలో పూర్తిస్థాయి ఉద్యోగం పొందితే అక్కడే కొనసాగవచ్చు.దీనికోసం మనవాళ్లు చదువు పూర్తవగానే తాత్కాలిక ఉద్యోగాల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) చేస్తారు. ఈ శిక్షణ కోసం ఈ ఏడాది 97,556 మంది నమోదు చేసుకున్నారని.. ఇది గతేడాదికన్నా 41 శాతం ఎక్కువని అమెరికన్ ఎంబసీ ఇటీవలే వెల్లడించింది. మన దేశం నుంచి వెళ్లిన విద్యార్థులు కన్సల్టెన్సీల ద్వారా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం పొంది వీసాను పొడిగించుకోవడం, అవకాశాన్ని బట్టి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం జరుగుతూ వస్తోంది. కానీ.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవటంతో పార్ట్టైం ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో హెచ్1–బి వీసా రావడం కష్టమనే భావన బలపడుతోంది.కొన్ని నెలల్లో పరిస్థితి చక్కబడే చాన్స్మరోవైపు అమెరికాలో ప్రస్తుత పరిస్థితి మూడు, నాలుగు నెలలకు మించి ఉండదనే నమ్మకం మన వారిలో కనిపిస్తోంది. అక్కడి హోటల్స్, చిన్నాచితకా వ్యాపార సంస్థల్లో పనిచేయడానికి మానవ వనరులు అవసరమని.. ఎల్లకాలం పార్ట్ టైం ఉద్యోగాలను అడ్డుకోలేరని కొందరు విద్యార్థులు అంటున్నారు.ఇదే మంచి చాన్స్..ఏఐ దూకుడు చూస్తుంటే ఇండియాలోనూ మంచి అవకాశాలు లభిస్తాయని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అమెరికన్ ఐటీ కంపెనీలు ప్రాజెక్టుల కోసం ఇండియాలో మానవ వనరులపై ఆధారపడటం పెరిగిన నేపథ్యంలో.. డేటా సైన్స్, ఏఐ అంశాల్లో ఎంఎస్ చేసినవారు మంచి ఉద్యోగం పొందవచ్చని భావిస్తున్నారు. ఇంకా అమెరికాలో వేచి చూస్తే.. అప్పటికే ఇండియాలో ఉద్యోగులకు అనుభవం పెరుగుతుందని, తర్వాత వస్తే ప్రయోజనం ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.భారత్లోని కన్సల్టెన్సీలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇప్పుడు సాధారణ ఐటీ ఉద్యోగాలు తగ్గినా.. ఏఐ ఎంఎల్, బ్లాక్చైన్, ఏఆర్వీఆర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఓపెన్ టెక్నాలజీ వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమని వీబాక్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. ఏఐపై పనిచేస్తున్న ఉద్యోగులు భారత్లో ప్రస్తుతం 4.16 లక్షల మంది ఉన్నారు. ఫిక్కీ అంచనా ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి 6.29 లక్షల మంది, 2026 నాటికి 10 లక్షల మంది అవసరం. దీంతో ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకోవడం మేలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.కష్టంగానే ఉందిడేటా సైన్స్పై ఎంఎస్ చేశాను. ఇంతకాలం స్కిల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పార్ట్ టైం జాబ్ చేశాను. ఇప్పుడు పార్ట్ టైం చేయడం కష్టంగా మారింది. ఇంకో మూడు నెలలు ఈ పరిస్థితి ఉండొచ్చు. అప్పుచేసి యూఎస్ వచ్చాను. ఇంటి దగ్గర్నుంచి ఇంకా డబ్బులు తెప్పించుకోవడం ఇబ్బందే. – కృష్ణమోహన్ దూపాటి, అమెరికాలో భారతీయ విద్యార్థికొంత ఆశ ఉందిరూ.40 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం ఉద్యోగం చేసే పరిస్థితి లేక, ఖర్చులు పెరిగి ఇబ్బందిగా ఉంది. ఇంకో ఏడాది అయితే ఎంఎస్ పూర్తవుతుంది. తర్వాత ఇండియాలోనే మంచి ఉద్యోగం చూసుకోవచ్చని మా నాన్న చెబుతున్నారు. నాకూ అదే మంచిదనిపిస్తోంది. – నవీన్ చౌదరి, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న వరంగల్ విద్యార్థిఇండియాలో బూమ్ ఉంటుందిఅమెరికాలోనే జాబ్ చేయాలనే ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. భవిష్యత్ మొత్తం ఏఐదే. ఇప్పుడిప్పుడే భారత్లో దానికి డిమాండ్ పెరుగుతోంది. నిపుణుల కొరత ఉంది. అమెరికాలో ఎంఎస్ చేసిన విద్యార్థులకు మన దేశంలోనే మంచి వేతనంతో ఉద్యోగాలు వచ్చే చాన్స్ ఉంది. – విశేష్ వర్మ, ఏఐ ఆధారిత కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ప్రతీ క్షణం టెన్షనేఏడాది క్రితం కుమారుడిని అమెరికా పంపాను. మా వాడి నుంచి ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే భయం వేస్తోంది. ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేక.. ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చలేక ఆవేదన పడుతున్నాం. ఇండియాలో ఏఐ ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుందని వచ్చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. – జనార్దన్రెడ్డి రేపల్లె, అమెరికా వెళ్లిన విద్యార్థి తండ్రి -
బాబూ.. బయటకు దయచెయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా టెక్ కంపెనీల్లో(US tech companies) ఉద్యోగుల కోత(Layoffs) కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్స్ఫోర్స్, వాల్మార్ట్, స్ట్రైప్ తదితర సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో, యూఎస్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది బలహీనపడవచ్చని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్కు చెందిన కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్తో పోలిస్తే జనవరిలో యూఎస్లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి.జనవరిలో 49,795 ఉద్యోగాల కోత పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38,792తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. 2024 జనవరిలో ప్రకటించిన 82,307 లేఆఫ్స్ కంటే ఈ సంఖ్య 40 శాతం తక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కంజ్యూమర్ టెక్పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కనీసం 25 కంపెనీలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. జనవరిలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ 3,53,000 కొత్త ఉద్యోగాలను జోడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందజేశాయి. యూఎస్లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3,600 మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు. వరుస కట్టిన సంస్థలు.. సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్డే 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వాల్మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, ఆకన్సవ్లలోని కన్సాలిడేషన్లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది. ఈ టెరి్మనేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజీ ఉండదు. గూగుల్లో స్వచ్ఛందంగా.. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్ఫామ్స్, డివైజెస్ ఆర్గనైజేషన్లోని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్రోగ్రామ్ను ఆఫర్ చేసింది. వీరికి పరిహారం అందించనుంది. 1,000 మందిని తగ్గించాలని సేల్స్ఫోర్స్ యోచిస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. జనవరి 20 నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్ట్రైప్ ప్రకటించింది. అయితే, కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2025 చివరినాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో 4 శాతం లేదా 100 కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు జనవరిలో పేర్కొంది. -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్ చోరీ అవుతుందా?
‘డీప్ సీక్ ఆర్–1’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను ‘డీప్ సీక్’ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్ జీపీటీ’ (Chat GPT) మోడల్ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్ సీక్ ఆర్–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్సీక్ తయారు చేసింది. గూగుల్ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్ సీక్ కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చినా చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్ జీపీటీకి డీప్ సీక్ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్ సీక్ ఏపీఏ ధరలు చాట్ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్ స్టోర్లో డౌన్లోడ్స్లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.డీప్ సీక్ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్లు భారీగా పతనం అయ్యాయి. డీప్ సీక్ (DeepSeek) వంటి మోడల్స్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్లను అమెరికాలోని ఎన్వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్ సీక్ తయారీకి ఎన్వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.ఈ నేపథ్యంలో డీప్ సీక్ ‘ఐపీ అడ్రస్ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్ సీక్పై భారీ సైబర్ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్ ముప్పుఉండటం, డీప్ సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్ షిప్ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్పై అనుమానాలు కలిగిస్తున్నాయి.డీప్ సీక్ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్ని తయారు చేయటానికి మార్కెట్లో అనువైన కాంపిటీషన్ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్ సీక్ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.చదవండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్ జీపీటీ, డీప్ సీక్లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.– శ్రీరామ్ సుదర్శన్ ఏఐ పరిశోధక విద్యార్థి -
10న ఫ్రాన్స్కు.. 12న అమెరికాకు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ట్రంప్ను ఒప్పిస్తారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. భారత్–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్హౌస్ ప్రకటించింది. ట్రంప్తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. -
ఏఐలో భారత పతాక
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీని సృష్టించటంలో కాస్త వెనుకబడి ఉండవచ్చు.. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకుని దానిని శిఖర స్థాయికి తీసుకెళ్లటంలో భారతీయ నిపుణులకు ఎవరూ సాటి రారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్రంగం(Software sector)లో భారతీయ టెకీలతో అగ్రరాజ్యాల నిపుణులు కూడా పోటీ పడలేరని ఇప్పటికే నిరూపణ అయ్యింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కృత్రిమ మేథ (ఏఐ)(AI)లో కూడా భారతీయ నిపుణులదే అగ్రస్థానమని తాజా సర్వేలో తేలింది.పని ప్రదేశాల్లో ఏఐ, జెనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగం ద్వారా ప్రపంచ సగటు కంటే మెరుగైన ఉత్పాదకతను సాధించి భారతీయులు ప్రత్యేకతను చాటుతున్నారు. వృత్తి నైపుణ్యం, వృత్తిగతంగా అత్యాధునిక సాంకేతికతల వినియోగం, ఏఐతో కూడిన ‘వర్క్ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్’ను భారతీయ వృత్తి నిపుణులు వేగంగా అందిపుచ్చుకుంటున్నారని ‘2025 గ్లోబల్ వర్క్ప్లేస్ స్కిల్స్ స్టడీ(Global Workplace Skills Study)’పేరిట ఎడ్టెక్ యూనికార్న్ ఎమెరిటస్ నిర్వహించిన సర్వేలో తేలింది. సర్వేలోని కీలక అంశాలు..⇒ 18 దేశాల్లోని ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఐటీ సర్విసెస్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో పనిచేస్తున్న 6 వేల మంది (21–65 ఏళ్ల లోపువారు) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 1,700 మంది భారతీయ వృత్తి నిపుణులు ఉన్నారు. ⇒ ఏఐ మెళకువలను అందిపుచ్చుకోవడం (ఏఐ అడాప్షన్)లో 96 శాతంతో ప్రపంచంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 84 శాతంతో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్, 81 శాతంతో తృతీయ స్థానంలో అమెరికా నిలిచాయి. ⇒ ఏఐ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపన (ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్)కు అవకాశం లభిస్తుందని 94 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ⇒ ఏఐకి అనుగుణంగా పని విధానాన్ని మలుచుకున్నందువల్ల ఉత్పాదక పెరిగిందని 95 శాతం మంది భారతీయ నిపుణులు తెలిపారు.⇒ ఏఐ నైపుణ్యాలు దీర్ఘకాలిక కెరీర్కు, ప్రాధాన్యత కోల్పోకుండా ఉద్యోగాలు, వృత్తుల్లో కొనసాగింపునకు దోహ దపడుతుందని 94 శాతం మన టెకీలు భావిస్తున్నారు. ⇒ కెరీర్లో ఉత్తమ ప్రదర్శన కనబరచడానికి ఏఐ, జనరేటివ్ ఏఐ కీలకమని 90 శాతం భారత వృత్తి నిపుణులు విశ్వసిస్తున్నారు. ⇒ 71 శాతం సంస్థల అధిపతులు, యాజమాన్యాలు ఏఐ శిక్షణలో పెట్టుబడులను పెంచాయి.భారత్లో కోరుకుంటున్న టాప్–5 నైపుణ్యాలు ఏఐ డెవలప్మెంట్, అప్లికేషన్ మాస్టరింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెషీన్ లర్నింగ్ (ఎంఎల్) స్ట్రాటజిక్ లీడర్షిప్, మేనేజ్మెంట్మన టెకీల కృషి అభినందనీయంమారుతున్న కాలాన్ని బట్టి అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను వర్క్ఫోర్స్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తగ్గట్టుగా నూతన నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి. ఇండియాలోని వర్క్ఫోర్స్ ఏఐ మెళకువలను అందిపుచ్చుకుని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే దిశలో కృషి సాగించడం అభినందనీయం. – అశ్విన్ దామెర, ఎమెరిటస్ కో ఫౌండర్, సీఈవో -
ప్రతి ఇద్దరిలో ఒకరు ఏఐ యూజర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. క్షణాల్లోనే అనేక రకాల పనులు చేసిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫ్లాట్ఫామ్ల వాడకం కూడా వేగం పెరుగుతోంది. భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక ఏఐ ప్లాట్ఫామ్ను వాడుతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం కొత్తకొత్త ఏఐ ఫ్లాట్ఫామ్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. చాట్జీపీటీ, గూగుల్ ఏఐ ప్లాట్ఫామ్ జెమిని, మెటాకు చెందిన లామా 3.. ఇలా అనేక రకాల ఏఐ ఫ్లాట్ఫామ్ల వాడకంపై గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 92 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. డీప్సీక్ ఏఐ ప్లాట్ఫామ్కు త్వరలో మారాలనుకుంటున్నట్టు సర్వేలో పాల్గొన్న 31 శాతం మంది తెలిపారు. అయితే ఏఐ ఫ్లాట్ఫామ్లు వాడి సేకరించిన సమాచారం తప్పుగా ఉందని 18 శాతం మంది చెప్పగా.. 28 శాతం మంది కచ్చితమైన సమాచారమని అంగీకరించారు. ఏఐ ప్లాట్ఫామ్లను వాడబోమని.. కానీ గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లను వాడతామని 40 శాతం మంది తెలిపారు. ఏమీ చెప్పలేమని 5 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
చాట్జీపీటీకే జై...
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్సర్కిల్స్ పేర్కొంది. సర్వేలోని మరిన్ని వివరాలు.. → 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్లోను ఈ ప్లాట్ఫాంను ఉపయోగిస్తున్నారు. → ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్ఫాం డీప్సీక్కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. → ఇప్పటికే డీప్సీక్కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు. → ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు. -
ఏఐదే హవా!
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి నేపథ్యం ఉన్న వారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల నౌకరీ డాట్ కామ్ సర్వే వెల్లడించడం గమనార్హం. పలు దేశాలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో నైపుణ్యం యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలకు అత్యుత్తమ మానవ వనరులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితులు బీటెక్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఏఐ నిపుణులు అంతంతే.. ఇండక్షన్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.64 లక్షల ఉద్యోగాలు సృష్టించే వీలుంది. ప్రస్తుతం జీసీసీల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కనపెట్టి ఏఐని ఆహ్వానించాలని, ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. కంపెనీలు సైతం ఏఐపై పట్టున్న వారికే ప్రాంగణ నియామకాల్లోనూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యమే ప్రధానం దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్పై పట్టు వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్, మెకానికల్లో బీటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ, తదితర టెక్నాలజీల్లో సర్టిఫికెట్ కోర్సులు చేస్తేనే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డి్రస్టిబ్యూషన్ ఎంటర్ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది. ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం రెండేళ్ళుగా జేఎన్టీయూహెచ్లో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎఐఎంల్తో పాటు ఏఐ అనుసంధానం ఉన్న కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే సివిల్, మెకానికల్ విద్యార్థులు కూడా ఈ ట్రెండ్ను అర్థం చేసుకుని, ఏఐఎంల్ మైనర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. వీరికి కూడా ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయి. – ప్రొఫెసర్ పద్మావతి విశ్వనాథ్ (వైస్ ప్రిన్సిపల్, జేఎన్టీయూహెచ్) స్థానిక వనరులపై ఐటీ సంస్థల దృష్టి ఏఐ విస్తరణకు అనుగుణంగా డేటా కేంద్రాలు, మాడ్యూల్స్ అభివృద్ధి చేయాల్సి వస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా మానవ వనరులు అభివృద్ధి పరుచుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే నైపుణ్యం వారి కోసం క్యాంపస్ నియామకాలు పెంచాయి. – నవీన్ ప్రమోద్ (ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్) -
ఓపెన్ ఏఐకి భారత్ కీలక మార్కెట్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన తమ చాట్జీపీటీకి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా మారిందని ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. దేశీయంగా చాట్జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది మూడు రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు పది రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ రంగం అసాధారణంగా పురోగమిస్తోందని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆల్ట్మన్ ఈ విషయాలు తెలిపారు. పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ, స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్, అన్అకాడెమీ సీఈవో గౌరవ్ ముంజాల్ తదితర పరిశ్రమ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాట్జీపీటీ, డీప్సీక్లాంటి కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్మన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆల్ట్మన్కి వైష్ణవ్ కౌంటర్చాట్జీపీటీలాంటి ఫౌండేషనల్ మోడల్ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్పై అసలు ఆశలే లేవంటూ రెండేళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్మన్కి తాజాగా మంత్రి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రుడి మీదకు అత్యంత చౌకగా చంద్రయాన్–3 మిషన్ను అమలు చేసిన భారత్కి.. అత్యంత తక్కువ ఖర్చులోనే ఏఐని కూడా రూపొందించే సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సొంతంగా చిప్సెట్లను తయారు చేసుకోవడం, అత్యంత చౌకగా కంప్యూటింగ్ సామర్థ్యాలను అందించడం నుంచి ప్రాంతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా మోడల్స్కి శిక్షణనిచ్చే డేటా సెట్లను రూపొందించే వరకు ఏఐ సంబంధిత పూర్తి వ్యవస్థను తీర్చిదిద్దడంపై భారత్ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
ఏఐ... పిల్లలూ... తల్లిదండ్రులూ!
ఏఐ ప్రాధాన్యం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశం అయ్యింది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12.03 నిమిషాలకు మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి ‘బీటా చిన్నారి’గా గుర్తించారు. అసలు ఆల్ఫా, బీటా... అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా? పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వాళ్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఉండే సాంకేతికత, సామాజిక మాధ్య మాల ప్రభావం వంటి అంశాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని, అనుభవాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు. రాజకీయంగా వాళ్ల ఐడియాలజీని, వినియోగ దారునిగా వాళ్ల మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు పుట్టుకొస్తున్న బీటా బేబీలు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్తో నిండిపోయిన సాంకేతిక ప్రపంచంలో జీవిస్తారు. అంటే వాళ్ల రోజువారీ జీవితం చిన్న రోబోల మధ్య సాగుతుంది. అవి చెప్పినట్టే వాళ్లు నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవి వీళ్లకు ట్యూటర్లు అన్న మాట. దాంతో పాటు వాటికవే నడిచే డ్రైవర్ లేని కార్లను చూస్తారు. 2035 నాటికి మొత్తం జనాభాలో 16 శాతం మంది బీటా తరానికి చెందిన వాళ్లే ఉంటా రని అంచనా.బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావీగా ఉంటారు. ఉదాహరణకి ‘వీల్స్ ఆన్ ద బస్’ ఆట ఆడాలంటే ‘అలెక్సా’ను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే ‘బ్లాక్ బాక్సు’ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి? ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు గనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు తగినంత అవగాహన పెంచాలి. ఎక్కువ డివైజ్లపై ఆధారపడకుండా బాహ్య ప్రపంచంలో వాళ్లకు మంచి అనుభవాలను అందించాలి. కొత్త ప్రదేశాలకు తీసికెళ్లటం, బంధువులు, స్నేహితుల మధ్య గడపటం నేర్పాలి. ఇంట్లో కొంత ప్రదేశాన్ని ‘టెక్ ఫ్రీ జోన్’గా మలచాలి. ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి డివైజ్లూ లేకుండా చూసుకోవాలి. పుస్తకాలు చదవటం, ఇంట్లో అమ్మానాన్నలతో మాట్లాడటం వంటివి అలవాటు చేయాలి. ఏది ఏమైనా బీటా తరం కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు కొత్త అనుభవాలను అంది స్తుంది. అవి ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో మనకు అర్థం అవుతుంది.– డా‘‘ పార్థసారథి చిరువోలుసీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065 -
ఎంతైనా అమ్మ అమ్మే!
‘దిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే!’ అని ఊరకే అనలేదు. ‘అమ్మా... పెద్ద విజయం సాధించాను’ అని చెప్పినా సరే... ‘సంతోషం’ అంటూనే ‘ఇంతకీ భోజనం చేశావా?’ అని ఆరా తీస్తుంది. తల్లికి పిల్లల విజయాల కంటే వారి ఆరోగ్యం, క్షేమం ముఖ్యం. ఇట్టి విషయాన్ని మరోసారి నిరూపించిన స్క్రీన్ షాట్ గురించి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’లో అన్షితా సైనీ గ్రోత్ ఇంజినీర్. చాట్జీపీటీ కోసం ఆమె అభివృద్ధి చేసిన ఫీచర్ ‘టెక్ క్రంచ్’ హైలెట్ అయింది. ఇది ఆమె కెరీర్లో ఒక ప్రధాన మైలు రాయిగా చెప్పవచ్చు.తన విజయం గురించి ఒక టెక్ పత్రికలో వచ్చిన వ్యాసం లింక్ను తల్లికి పంపించింది అన్షిత. ‘నేను రూపొందించిన ఫీచర్ గురించి పత్రికలో గొప్పగా రాశారు’ అని తల్లికి టెక్ట్స్ మెసేజ్ ఇచ్చింది. ‘నైస్... గ్రేట్ ఇన్స్పిరేషన్’ అని బదులు ఇచ్చిన వెంటనే...‘నీ ఫీచర్ సంగతి సరే... ఈరోజు తినడానికి నీ దగ్గర నట్స్, ఫ్రూట్స్ ఉన్నాయా?’ అని అడిగింది. చాట్లో తల్లి అడిగిన ప్రశ్న స్క్రీన్షాట్ తీసి ‘ఎక్స్’లో షేర్ చేసింది అన్షిత. దీనికి కొన్నిగంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. -
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన. వచ్చే ఏడాది నుంచి 5 వేల స్కూళ్లలో షురూ!
-
డిజిటల్ ప్రపంచంలో.. సంపద ఇలా భద్రం..
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేథ, మెషిన్ లెర్ణింగ్ మొదలైనవి డేటా విశ్లేషణ, ఆటోమేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ సౌకర్యవంతంగా ఉంటున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్లాంటివి తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో పెను మార్పులు తెస్తున్నాయి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ వీటి వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి పోర్ట్ఫోలియోలను ఆన్లైన్లో ట్రాకింగ్ చేయడం నుంచి పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసే వీలుంటోంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన డిజిటల్ భద్రతకు ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల విషయానికొస్తే తమ పాస్వర్డ్లు లేదా యాప్లను సురక్షితంగా ఉంచుకోవడం ఒకెత్తైతే, ఏళ్లతరబడి ఆర్థిక ప్రణాళికలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. సైబర్ నేరగాళ్లు కేవలం పెద్ద వ్యాపారులు, సంపన్నులనే కాదు.. చిన్న చిన్న ఇన్వెస్టర్లను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్లాంటివి ప్రయోగిస్తున్నారు. ఫిషింగ్ సంగతి తీసుకుంటే, ఆర్థిక సంస్థలు లేదా అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా కనిపించేలా ఈమెయిల్స్, మెసేజీల్లాంటివి పంపిస్తారు. మిమ్మల్ని మాయ చేసి పాస్వర్డ్ల్లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లోనుంచి విత్డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడంలాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడంలాంటివి జరుగుతుంటాయి. ర్యాన్సమ్వేర్ దాడులు మరింత అధునాతనంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను స్తంభింపచేసి, తిరిగి మీ చేతికివ్వాలంటే డబ్బు కట్టాలంటూ బెదిరింపులకు దిగుతారు. మిమ్మల్ని నేరుగా టార్గెట్ చేయకపోయినా మీరు ఆధారపడే ఆర్థిక సేవలను లక్ష్యంగా చేసుకుని మీ లావాదేవీలకు అంతరాయం కలిగించవచ్చు. కొన్నిసార్లు క్రిమినల్స్ నేరుగా పెట్టుబడి ప్లాట్ఫాంలలోకి చొరబడి నిధులను దొంగిలించవచ్చు. తప్పుడు ట్రేడింగ్ చేసి నష్టపర్చవచ్చు. అలాగని ఇలాంటి పరిణామాల వల్ల డిజిటల్ సాధనాల మీద నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటి సవాళ్లను అధిగమించవచ్చు. → మీ అకౌంట్లకు పటిష్టమైన పాస్వర్డ్లను వాడండి. తరచూ వాటిని అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్వర్డ్లను భద్రపర్చుకునేందుకు ఒక పాస్ వర్డ్ మేనేజర్ వెబ్సైట్ను ఉపయోగించవచ్చు. → మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ను ఉపయోగించండి. వీలైన సందర్భాల్లో మీ ఫోన్కు వెరిఫికేషన్ కోడ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ డివైజ్లను అన్లాక్ చేసేందుకు బయోమెట్రిక్స్ను ఎనేబుల్ చేయండి. → ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా అనిపించేలా మోసగాళ్లు ఈమెయిల్స్ లేదా మెసేజీలు పంపిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. → డివైజ్లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్ఫాంలు, యాప్ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించండి. సాఫ్ట్వేర్, ఓఎస్లు, యాంటీవైరస్ ప్రోగ్రాంలను అప్డేటెడ్గా ఉంచండి. కీలకమైన డేటా చోరీ కాకుండా డివైజ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. డివైజ్ల స్క్రీన్ను లాక్ చేసి ఉంచండి. ఆటోలాక్ను ఎనేబుల్ చేయండి. సెషన్ హైజాక్ కాకుండా, ట్రాకింగ్ను, ఆటో–లాగిన్ రిసు్కలను నియంత్రించేందుకు బ్రౌజర్ నుంచి కుకీలను, హిస్టరీని తొలగించండి. → ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ వై–ఫైను వాడొద్దు. ప్రయాణాల్లో కీలకమైన అకౌంట్లు, ఆర్థిక సేవల ప్లాట్ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు సురక్షితమైన వీపీఎన్ను ఉపయోగించండి. → వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవడం తగ్గించుకోండి. మీ పుట్టిన రోజు లేదా ఆర్థిక వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడే రిసు్కలు ఉన్నాయి.→ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లు, లావాదేవీలను తరచూ పరిశీలించండి. అనధికారిక లావాదేవీలేవైనా కనిపిస్తే సత్వరం గుర్తించొచ్చు. → కీలకమైన డాక్యుమెంట్ల వంటి వాటిని సురక్షితమైన, ఆఫ్లైన్ లొకేషన్లలో బ్యాకప్ తీసుకోండి. రాన్సమ్వేర్ రిసు్కలను తగ్గించుకోవచ్చు. → సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఆర్థిక సంస్థలు తరచుగా అప్డేట్లు, టిప్లు ఇస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్డేట్గా ఉండాలి. -
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకారం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్కు వెళ్లి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏ తరహా మౌలిక వసతులు, ఏఐ ఆధారిత టూల్స్ కావాలో తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళను ఎంపిక చేసి..వచ్చే విద్యా సంంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి త్వరలో ప్రభుత్వానికి సమరి్పంచనున్నారు. సరి చేసుకునే వరకు సూచనలు! రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో తొలి విడతగా 5 వేల స్కూళ్ళను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న స్కూళ్ళ జాబితాను పరిశీలిస్తున్నారు. 5వ తరగతి మొదలు కొని 10వ తరగతి వరకూ ఏఐ ఆధారిత బోధన ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్ళకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపుతారు. వీటికి ఆన్లైన్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరి చేసుకునే వరకూ ఏఐ టెక్నాలజీ విద్యారి్థకి సూచనలు చేస్తుంది. వర్చువల్ రియాలిటీ విధానంలో.. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విత్తనం మొలకెత్తడం, వృద్ధి చెందడానికి సంబంధించి థియరీ మాత్రమే పుస్తకాల్లో ఉంటుంది. వర్చువల్ విధానంలో విద్యారి్థకి కెమెరా లెన్స్ పరికరం ఇస్తారు. దీన్ని ధరించిన తర్వాత విత్తనం తానే నాటి, అది దశల వారీగా ఎలా ఎదుగుతుందో పరిశీలిస్తున్న అనుభూతి పొందుతాడు. అదే విధంగా ఎర్రకోట గురించి పాఠం చెప్పేప్పుడు, టిప్పు సుల్తాన్ యుద్ధంపై బోధన చేసేప్పుడు అక్కడే ఉండి చూస్తున్నట్టుగా చేయడం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, జ్ఞాపక శక్తి మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలే కీలకం డిజిటల్ బోధన కోసం గతంలో 3 వేల పాఠశాలల్లో లే»ొరేటరీలు ఏర్పాటు చేశారు. 10 వేల స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చారు. 8 వేల స్కూళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ ఏఐ ఆధారిత బోధనకు మరింత అత్యాధునిక మౌలిక వసతులు అవసరం. ఇప్పుడున్న నెట్ స్పీడ్ పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సర్వర్ల నుంచి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్స్ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఏఐతో మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నాం. – ఈవీ నర్సింహారెడ్డి (పాఠశాల విద్య డైరెక్టర్) మంచి ఫలితాలకు అవకాశం ఉంది అమెరికాలో గూగుల్ క్రోం ద్వారానే అసైన్మెంట్స్ ఇస్తున్నారు. మూల్యాంకనం చేపడుతున్నారు. ఏఐ వాడకంలో అక్కడి స్కూళ్ళు ముందంజలో ఉన్నాయి. మన విద్యార్థులు గణితంలో అక్కడివారి కంటే మెరుగ్గా ఉంటారు. కాబట్టి ఏఐ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – సంక్రాంతి రవికుమార్ (అమెరికాలో ఏఐ బోధన పరిశీలించిన టీచర్) అడ్మిషన్లు పెరుగుతాయి ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇది మంచి మార్గం. దీనిపై టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. – పింగిలి శ్రీపాల్రెడ్డి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) -
అంతా.. ఏఐమయం
‘బూన్ గైడ్ ఉండగా.. పరీక్షల భయం దండగ’.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ) సామాన్యులకు అందుబాటులోకి రాని 1980లలో కాలేజీ కుర్రాళ్లు తమను పరీక్షల గండం గట్టెక్కించే గైడ్ గురించి గొప్పగా చెప్పుకొనే మాట అన్నమాట. అయితే కాలంతోపాటు కంప్యూటర్ల పనితీరు, సామర్థ్యాలు అనూహ్యంగా పెరగడంతో ఇప్పుడు విద్యార్థులు మొదలు ఉద్యోగుల దాకా ఏ రంగానికి చెందిన వారికి కావాల్సిన సమాచారమైనా చిటికెలో అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(Artificial intelligence)(ఏఐ) సాంకేతికత యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ అప్లికేషన్లు, వాటి ఉపయోగాలపై కథనం. – సాక్షి, హైదరాబాద్కృత్రిమ మేధ (ఏఐ) రంగం కేవలం ఐదంటే ఐదేళ్లలో ప్రపంచ గమనాన్ని మార్చేసింది. అదెలాగో తెలియాలంటే జనరేటివ్ ఏఐ ఎదుగుదలను చూడాలి. ఓపెన్ ఏఐ అనే సంస్థ 2019లో తొలిసారి ‘జీపీటీ–2’ను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రశ్నలడిగినా తడుముకోకుండా అక్షరాల్లో బదులివ్వడం దీని ప్రత్యేకత. అయితే ఓపెన్సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండటంతో ఏఐ వేగంగా అభివృద్ధి చెందింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏఐ అప్లికేషన్ల శకం మొదలైంది.అందరికీ చిరపరిచితం సిరి, అలెక్సా..మనలో చాలామందికి చిరపరిచితమైన చాట్జీపీటీ వర్చువల్ అసిస్టెంట్ అప్లికేషన్. సిరి, అలెక్సా, ‘ఓకే గూగుల్’ లాంటివన్నీ ఈ కోవకు చెందిన జనరేటివ్ ఏఐ అప్లికేషన్లే. మీరేదైన ప్రశ్న అడిగితే.. ఇంటర్నెట్ మొత్తాన్ని వెతికి సమాధానాలు చెబుతాయి. స్క్రీన్లపై అయితే పదాల రూపంలో.. మొబైల్ఫోన్లు ఇతర గాడ్జెట్ల ద్వారానైతే మాటల్లో బదులిస్తాయి. ఇవి కాకుండా ఫొటోలు, వీడియోలను గుర్తుపట్టేందుకు, వాటిని వర్గీకరించేందుకు గూగుల్ ఫొటోస్, డీప్ఆర్ట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంగ్లిష్ అంత బాగా రాకపోయినా...తప్పుల తడకలా ఉండే వాక్యాలను కూడా సరి చేయాలంటే ‘గ్రామర్లీ’, ‘క్విల్బోట్’ వంటి ఏఐ అప్లికేషన్లు వాడుకోవచ్చు. అంకెల్లోని సమాచారాన్ని (ఎక్సెల్ షీట్లు) చదివేసి విశ్లేషించేందుకు ‘జూలియస్.ఏఐ’ ఉపయోగపడుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగులకు నిత్యం ప్రాణ సంకటంగా మారే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు ‘కాన్వా’తోపాటు బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అంచనాలకూ ఏఐ యాప్స్..ఇప్పటివరకు మనం చూసిన అప్లికేషన్లన్నీ నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా పనిచేస్తాయి. కానీ ప్రిడిక్టివ్ అనలటిక్స్ రకం ఏఐ అప్లికేషన్లు ఉన్న సమాచారం ఆధారంగా అంచనాలు కట్టేందుకు వాడతారు. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐబీఎం’ వాట్సన్ పేరుతో సిద్ధం చేసిన జనరేటివ్ ఏఐ అప్లికేషనే అందుకు ఉదాహరణ. ఆరోగ్య రంగంలో కొత్త సంచలనం ఇది. ఇమేజ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఎక్స్–రేలను చదివేస్తుంది. వైద్య నివేదికలు, వైద్య పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని (సైంటిఫిక్ జర్నళ్ల ద్వారా) ఔపోసన పట్టేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా వైద్యుల కంటే ముందే కేన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులను కూడా కచి్చతంగా గుర్తించేలా దీన్ని సిద్ధం చేశారు. ‘అడా’, ‘బాబిలోన్ హెల్త్’ వంటివి కూడా మన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి సలహా సూచనలు ఇవ్వగలిగే ఏఐ అప్లికేషన్లు.సొంతంగా సృష్టిస్తాయి కూడా... మనిషిని, యంత్రాన్ని వేరు చేసేదేమిటని ఎవరిని అడిగినా చెప్పే సమాధానం యంత్రం సొంతంగా ఏదీ సృష్టించలేదని చెబుతారు. అది నిజం కూడా. కానీ జనరేటివ్ ఏఐ అప్లికేషన్లతో ఈ పరిస్థితి కూడా మారిపోయింది. ‘డాల్–ఈ’, ‘మిడీజరీ్న’ వంటి అప్లికేషన్లు సొంతంగా బొమ్మలు గీయగలవు. సంగీతాన్ని సృష్టించగలవు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని తమదైన రాగాలు తయారు చేయగలవు కూడా..! అంతెందుకు.. ఒక సినిమా స్టోరీ రాయాలనుకోండి.. కథ తాలూకూ ప్రధాన ఇతివృత్తాన్ని చెబితే చాలు.. ఏఐ అప్లికేషనే స్క్రీన్ ప్లేతో కలిపి కథ మొత్తాన్ని రాసిచ్చేస్తుంది!డబ్బు లెక్కలకూ యాప్లు..స్టాక్మార్కెట్లో పెట్టుబడులంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫలానా కంపెనీ షేర్ కొన్నేళ్లుగా ఎలాంటి లాభాలు తెచి్చపెడుతోందో? లేదా ఇబ్బందులు ఎదుర్కొంటోందో తెలియాలి. అయితే ‘మింట్’, ‘రాబిన్హుడ్’ వంటి అప్లికేషన్లు ఈ పనులన్నీ చిటికెలో చక్కబెట్టేస్తాయి. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ (ఎల్ఎల్ఎం) ఆధారంగా కంపెనీల ఆర్థిక పరిస్థితులన్నింటినీ మదించి పెట్టుబడుల సలహాలిస్తాయి.డీప్సీక్ రాకతో విప్లవం..తాజాగా ‘డీప్సీక్’ సృష్టించిన ప్రభంజనం అంతాఇంత కాదు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఏఐ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయన్న ఊహలను పటాపంచలుచేస్తూ చైనా సంస్థ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఆధారిత ఎల్ఎల్ఎం మోడల్ ‘ఆర్1’ను చూసి ఎని్వడియా వంటి దిగ్గజ సంస్థలే నోరెళ్లబెట్టాయి. ఇప్పుడున్న ఏఐ మోడల్స్కన్నా ఎంతో మెరుగైన తార్కిక విశ్లేషణ సామర్థ్యం డీప్సీక్ ఆర్1కు ఉండటమే దాన్ని మరో మెట్టుపై నిలబెడుతోంది. దీని రాకతో ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయం. -
5 నెలల తరువాత చెన్నైకు తిరిగొచ్చిన కమల్ హాసన్
కోలీవుడ్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) సుమారు 5 నెలల తరువాత చైన్నెకి చేరుకున్నారు. ఈయన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందడానికి అమెరికా వెళ్లారు. ఈయన నిర్మించిన అమరన్ చిత్రం ప్రమోషన్లోగానీ, చిత్ర విడుదల సమయంలోగానీ పాల్గొనలేదు. ఆ సమయంలో అమెరికాలోనే ఉన్నారు. కాగా మక్కల్ నీది మయ్యం పార్టీలోనూ అనిశ్చితి వాతావరణం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కమలహాసన్ ఎట్టకేలకు 5 నెలల తరువాత అమెరికా నుంచి చైన్నెకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 6వ తేదీన విడుదల కానుందని చెప్పారు. అదేవిధంగా విక్రమ్ 2 చిత్రం చేస్తున్నారా అన్న ప్రశ్నకు అలాంటిది ఏమీ లేదని, వేరే చిత్రానికి కథను సిద్ధం చేసినట్లు కమలహాసన్ చెప్పారు. కాగా ఈయన త్వరలో ఫైట్ మాస్టర్ల ద్వయం అన్బరివ్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలను కూడా అమెరికాలోనే జరిపారన్నది గమనార్హం. -
మనకూ సొంత ఏఐ మోడల్ !
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకి (ఏఐ) సంబంధించి చాట్జీపీటీ, డీప్సీక్ ఆర్1లకు దీటుగా మన సొంత ఫౌండేషన్ మోడల్స్ను ప్రోత్సహించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంకుర సంస్థలు, పరిశోధకులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను చౌకగా అందుబాటులోకి తెస్తోంది. వీటి దన్నుతో వచ్చే 8–10 నెలల వ్యవధిలో కనీసం ఆరు పెద్ద డెవలపర్లు/స్టార్టప్లు పూర్తి దేశీయ సామర్థ్యంతో, దేశీ అవసరాల కోసం ఫౌండేషన్ మోడల్స్ను తయారు చేయగలవని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. మరింతగా దృష్టి పెడితే 4–6 నెలల వ్యవధిలో కూడా ఇవి సాధ్యపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏఐ మార్గదర్శ ప్రణాళికలో తదుపరి చర్యలను మంత్రి గురువారం వెల్లడించారు. దీని ప్రకారం ఏఐ ఫౌండేషన్ మోడల్స్పై పని చేసే అంకురాలు, పరిశోధకులకు 18,693 అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) ఉమ్మడి కంప్యూటింగ్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. జియో ప్లాట్ఫామ్స్, సీఎంఎస్ కంప్యూటర్స్, టాటా కమ్యూనికేషన్స్ మొదలైన సంస్థలు ఈ జీపీయూలను అందుబాటులో ఉంచుతాయి. అంతర్జాతీయ వ్యయ ప్రమాణాలతో పోలిస్తే ఉమ్మడి కంప్యూటింగ్ సదుపాయం దేశీయంగా ఒక డాలరు కన్నా తక్కు వకే (జీపీయూ అవర్కి) లభిస్తుందని, 40% వ్య యాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వైష్ణవ్ తెలిపారు.ఏఐ సేఫ్టీ...: ఫౌండేషనల్ మోడల్స్ సురక్షితంగా, విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు ఏఐ సేఫ్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. దీని కింద మెషిన్ అన్లెర్నింగ్ (ఐఐటీ జో«ద్పూర్), సింథటిక్ డేటా జనరేషన్ (ఐఐటీ రూరీ్క), ప్రైవసీ ఎన్హాన్సింగ్ స్ట్రాటెజీ (ఐఐటీ ఢిల్లీ, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, టీఈసీ) తదితర ప్రాజెక్టులు ఎంపికైనట్లు ఆయన వివరించారు.ఇండియా ఏఐ మిషన్.. కృత్రిమ మేథ సహకారంతో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, లాజిస్టిక్స్ తదితర సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించి ఆవిష్కరించిన ఏఐ మిషన్ కింద పలు దరఖాస్తులు వచి్చనట్లు వైష్ణవ్ చెప్పారు. తొలి విడత ఫండింగ్ కోసం 18 అప్లికేషన్లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇవి వ్యవసాయం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై పని చేస్తున్నట్లు వివరించారు. -
...ఆ ఒక్కటి తప్ప!
చైనాలో అంకుర సంస్థకు చెందిన కృత్రిమమేథ మోడల్ ఏఐ డీప్సీక్ ఇప్పుడు చాట్జీపీటీ, జెమినీ వంటి దిగ్గజ ఏఐల ఆధిపత్యాన్ని కూలదోస్తూ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కృత్రిమ మేథ చాట్బాట్ పారదర్శకత మీద విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. డీపీసీక్ సంస్థ వారి కొత్తరకం అధునాతన చాట్బాట్ ఆర్1 మీద చైనా కమ్యూనిస్టు పార్టీ సెన్సార్షిప్, సమాచార నియంత్రణ ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రపంచదేశాల వినియోగదారులు ఈ చాట్బాట్ను అడిగే ప్రశ్నలకు ఇది ఇస్తున్న సమాధానాలే ఇందుకు ప్రబల నిదర్శనం. ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు?. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శ్వేతసౌధం నుంచి ఇప్పుడు వచ్చిన తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు ఏంటి? ఏదైనా చక్కటి జోక్ చెప్పు అంటూ ఎలాంటి ప్రశ్నలు అడిగినా రెప్పపాటు వ్యవధిలో టకటకా సమాధానాలు ఇస్తున్న డీప్సీక్ చాట్బాట్.. చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది. తియానన్మెన్ స్క్వేర్ ప్రశ్న ఒక ఉదాహరణ చాట్బాట్ సమాధానాల దాటవేతకు వినియోగదారులు ఒక చక్కటి ఉదాహరణను పేర్కొన్నారు. 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్లో ఆందోళనాకరులపై ప్రభుత్వ అణచివేత కారణంగా వేలాది మరణించారు. ఇదే విషయంపై ప్రముఖ చైనీస్ ఆన్లైన్ సెర్చ్ ప్లాట్ఫామ్ బైదును 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్లో ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే ‘‘గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ ఏడాదిలో జూన్ 4 అనేది 155వ రోజు. అదే సంవత్సరం అధికారులు ‘విప్లవ వ్యతిరేక అల్లర్లను అణచివేశారు’’అని మాత్రమే సమాధానం చెప్పిందిగానీ ఆ వాక్యాల్లో ఎక్కడా కనీసం పేరుకైనా తియానన్మెన్ స్క్వేర్ అనే పదాన్ని ప్రస్తావించలేదు. ఇదే ప్రశ్నను ఇప్పుడు డీప్సీక్ ఏఐ అసిస్టెంట్ ఆర్1 ను అడిగితే ‘ఈ రకమైన ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో ఇంకా నాకు ఖచ్చితంగా తెలియదు’అని సమాధానం చెబుతోంది. ‘‘ఎలా సమాధానం చెప్పాలో తెలియనందుకు క్షమాపణలు’’అని ఒక సందేశం ఇస్తోంది. 2019లో హాంకాంగ్లో ఏం జరిగింది? అని అడిగినప్పుడు కూడా ఇలాంటి సమాధానమే ఇస్తోంది. ‘‘ఇలాంటివికాకుండా ఇంకేవైనా అడగాలని ఉచిత సలహా ఇస్తోంది. అంతేకాదు చైనా వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదు. భారత్–చైనా సంబంధాలు, చైనా–తైవాన్ సంబంధాలు, ఇతర రాజకీయంగా సున్నితమైన అంశాలపై చర్చించేందుకు నిరాకరిస్తోంది. స్వదేశీ సమస్యలపై... వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింల పట్ల కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అడిగినప్పుడు ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రను యథాతథంగా డీప్సీక్ యథాతథంగా అందించిందిగానీ అక్కడ నిత్యకృత్యమైన మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలను మచ్చుకైనా పేర్కొనలేదు. బలవంతంగా కార్మికులుగా మార్చడం, రీ–ఎడ్యుకేషన్ క్యాంపులు, అంతర్జాతీయ ఆంక్షల గురించి అడిగినా ‘‘ఈ ప్రశ్న నా ప్రస్తుత పరిధికి అతీతమైనది’’అని సమాధానం మాత్రమే ఇస్తోంది. చాట్జీపీటీ, జెమినీ మాత్రం జిన్జియాంగ్ ఘటనలపట్ల అంతర్జాతీయ నివేదికలను వివరంగా అందిస్తున్నాయి. తైవాన్ గురించి అడిగితే ‘‘పురాతన కాలం నుంచి తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా ఉంది. దేశాన్ని చీల్చే ఏ ప్రయత్నమైనా విఫలం అవుతుంది’’అని చెబుతోంది. అంతేకాదు.. 2019 హాంకాంగ్ నిరసనలను కూడా చాట్బాట్ తక్కువ చేసి చూపిస్తోంది. దురుద్దేశాలతో చిన్న చిన్న సమూహాలు ప్రజాస్వామ్యపాలనకు కల్గించిన ఒక అవాంతరంగా నాటి ఉద్యమాన్ని చాట్బాట్ వ్యాఖ్యానించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గురించి అడిగినా సరే.. ‘‘నా ప్రస్తుత పరిధికి మించినది’’అనే ఒకే సమాధానం ఇస్తోంది. చైనాలో సెన్సార్షిప్, వాట్సాప్, ఫేస్బుక్ వంటివాటిపై నిషేధం గురించి అడిగినప్పుడు అస్పష్టమైన సమాధానాలనే చాట్బాట్ వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల గురించి ప్రశ్నిస్తే ‘‘నాన్షా ద్వీపాలు, వాటి సమీప జలాలపై చైనాకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉంది’’అని తానే ఒక అధికారిక విభాగం అన్నంత స్థాయిలో డీప్సీక్ కుండబద్దలు కొట్టిమరీ సమాధానం చెబుతోంది. భారత్ చైనా సంబంధాల గురించి.. ఇండో–చైనా యుద్ధం గురించి ప్రశ్నలను అడిగినప్పుడు డీప్సీక్ తెలివిగా తప్పుకుంటోంది. యుద్ధానికి కారణాలు, పర్యవసానాల గురించిన చర్చలను జాగ్రత్తగా పక్కదారి పట్టించింది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినైలను అడిగితే... యుద్ధం ఎలా? ఎందుకు? జరిగిందనే దానిపై ఆధారాలతో చారిత్రాత్మక కథనాలను అందిస్తున్నాయి. భారత్లో ని ఈశాన్య రాష్ట్రాలను, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ గురించి సమాధానమివ్వడానికి డీప్సీక్ నిరాకరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమా? అని అడిగినప్పుడు డీప్సీక్.. ‘‘క్షమించండి, ఇది నా ప్రస్తుత పరిధికి అతీతమైన ప్రశ్న. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం’’అని సమాధానమిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా తమ దక్షిణ టిబెట్ భూభాగంగా భావిస్తోంది. ఇలాంటి చైనా విధానపర నిర్ణయాల్లో తలదూర్చే సాహసం ఈ ఏఐలు చేయట్లేదని అర్థమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్కు చైనా ‘జాంగ్నాన్’అని పేరు కూడా పెట్టింది. ఈ వాదనలపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెల్సిందే. లద్దాఖ్లోని కొన్ని ప్రాంతాలు కూడా తమవేనని చైనా చాన్నాళ్లుగా వాదిస్తోంది. తూర్పు లద్ధాఖ్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపిస్తూ కొత్తగా ‘ప్రామాణిక మ్యాప్’ను సైతం 2023లో చైనా విడుదల చేసింది. ఈ మ్యాప్ను భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తోసిపుచ్చారు. అయితే, అకాŠస్య్ చిన్ గురించి డీప్సీక్ను అడిగినప్పుడు తన పరిధికి అతీతమైందని సమాధానం ఇస్తోంది. ఇక కశ్మీర్ గురించి ప్రశ్నిస్తే.. ‘ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య చారిత్రక, రాజకీయ, ప్రాదేశిక వివాదాలతో కూడిన సంక్లిష్టమైన, సున్నితమైన అంశం. ఐక్యరాజ్యసమితి చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా చర్చల ద్వారా, శాంతియుత మార్గాల ద్వారా వివాదాల పరిష్కారానికి తాము మద్దతిస్తామని చైనా చెబుతోంది’అని సుదీర్ఘ సమాధానాన్ని ఇచ్చింది.దలైలామా, టిబెట్ గురించి...డీప్సీక్ను దలైలామా గురించి అడిగితే.. టిబెటన్ బౌద్ధమతంలో గణనీయమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా అభివర్ణించింది. ఇక టిబెట్.. పురాతన కాలం నుంచి చైనాలో అంతర్భాగంగా ఉందని చెబుతోంది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినీలను అడిగితే చైనా వైఖరిని అంగీకరిస్తూనే.. టిబెట్ స్వయంప్రతిపత్తి, 1959 నుంచి భారతదేశంలో దలైలామా ప్రవాస జీవితం గురించి కూడా ప్రస్తావిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలు
భారతదేశంలోని అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీలను అమలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ఆధునీకరణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే ఈ ఏఐ ప్రాజెక్ట్ల విలువ రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లుగా ఉంటుంది. ఇవి అనేక రకాల అప్లికేషన్లను కవర్ చేస్తాయి.ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్బాట్(ChatBot)ను అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ‘మై స్కీమ్’ ప్లాట్ఫామ్ను మెరుగుపరచడానికి ఏఐ చాట్బాట్ను ఉపయోగిస్తుంది. పౌరులు వివిధ సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి, వాటికోసం దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదంజంతు కదలికలను ట్రాక్ చేయడానికి, మానవ-వన్యప్రాణుల దాడులను నివారించడానికి ఒడిశా అటవీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. రోడ్డు భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే 50 అధికారిక వెబ్సైట్లను కేంద్రం అంతర్గత ఏఐ ప్రాజెక్టు ‘భాషిణి’ని నిర్వహిస్తోంది. కేంద్ర పథకాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్, నాణ్యతను, సంప్రదాయ యంత్రాంగాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చాలా రాష్ట్రాలు శాసనసభ, పరిపాలన, న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధను ఉత్పాదకత సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి. -
డీప్సీకర్ లియాంగ్
అత్యంత శక్తిమంతమైన చౌక ఏఐ అసిస్టెంట్తో కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్ఫెంగ్ (40) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా కనీసం వినబడని, కనబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ (టెస్లా), శామ్ ఆల్ట్మన్ను (ఓపెన్ ఏఐ) మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. లియాంగ్ దక్షిణ చైనాలోని అయిదో శ్రేణి పట్టణమైన గ్వాంగ్డాంగ్లో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచరు. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్ ప్రావిన్స్లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్లో డిగ్రీ, 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేశారు. హెడ్జ్ఫండ్తో వ్యాపార రంగంలోకి.. లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్మేట్స్తో కలిసి హై–ఫ్లయర్ అసెట్ మేనేజ్మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్ఫోలియో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.19 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్విడియా చిప్లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటుపైన 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్సీక్ స్టార్టప్ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్ఎల్ఎం, వీ2 లాంటి మోడల్స్ను చకచకా ప్రవేశపెట్టి, బైట్డ్యాన్స్, బైదులాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో, ఓపెన్ఏఐ జీపీటీ–4కి పోటీగా డీప్సీక్–ఆర్1 ఏఐ అసిస్టెంట్ను ప్రవేశపెట్టారు. ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ తమ మోడల్స్ను అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ, యూజర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుండగా.. డీప్సీక్ చాట్బాట్ను అత్యంత చౌకగా కేవలం 6 మిలియన్ డాలర్లకే (దాదాపు రూ. 52 కోట్లు) తయారు చేసి షాకిచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్సోర్స్ మోడల్గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేథ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెబుతున్న నేపథ్యంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్డీ శిబులాల్
డి.ఎస్.పవన్కుమార్, సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: మారుతున్న పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజమని, వీటిని ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ ఎస్డీ శిబులాల్ చెప్పారు. అవసరమైనప్పుడల్లా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు, కెరీర్లో ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఇన్ఫోసిస్ లాంటి అగ్రశ్రేణి సంస్థ కూడా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, పాతికేళ్లు సాధారణ ఐటీ సంస్థగానే ఉందని తెలిపారు. వ్యక్తులకైనా, సంస్థలకైనా సవాళ్లు సహజం అంటూ, వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిసొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత సహనం, ప్రణాళికలతో అడుగులు వేయాలని చెప్పారు. శిబులాల్ కుటుంబం ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పింది. ‘విద్యాధన్’ పేరుతో.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్కు వచి్చన శిబులాల్తో.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే టాప్లోకి.. ఇన్ఫోసిస్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా క్లయింట్స్కు ఐటీ ఆవశ్యకతను వివరించడం, వారిని మెప్పించడం, వాటికి మా సంస్థ ద్వారా సేవలకు అంగీకరింపజేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాతికేళ్ల సంస్థ చరిత్రలో దాదాపు 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే ఉంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సమర్థవంతమైన బృందంగా పని చేయడం వల్ల ఇప్పుడు టాప్ కంపెనీగా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని ఇన్ఫోసిస్ 2.0గా చెప్పొచ్చు. మార్పులు ఆహ్వానించాలి – ఒకే సంస్థలో ఉన్నా హోదా మారే కొద్దీ విధుల్లో మార్పులు, కొత్త సవాళ్లు, కొత్త అంశాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత సహజం. దీన్ని నేటి యువత గుర్తించాలి. – ఇన్ఫోసిస్లో మూడేళ్లకోసారి నా హోదా మారేది. అలా మారినప్పుడల్లా ఆ హోదాకు తగినట్లుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా కొత్త అంశాలు నేర్చుకున్నా. ఎంటర్ప్రెన్యూర్షిప్.. నాట్ ఫర్ ఎవ్రిబడీ – ప్రస్తుతం దేశంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్కృతి పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే నా ఉద్దేశంలో ‘ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రిబడీ’. ఈ మాట ఎందుకు అంటున్నానంటే.. – సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే అత్యంత కీలకమైన లక్షణం సహనం. నేటి యువతలో అది లోపిస్తోంది. – చాలామంది ఇన్స్టంట్ ఫలితాలు ఆశిస్తున్నారు. అందుకే పలు వెంచర్స్.. ఫెయిల్యూర్ వెంచర్స్గా మారుతున్నాయి. – మా రోజుల్లో ఫండింగ్ సంస్థలు లేవు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఏంజెల్ ఇన్వెస్టర్స్.. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ను అందించే స్టార్టప్స్కు ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ స్టార్టప్ ఔత్సాహికుల్లో సహనం ఉండట్లేదు. సరైన ప్రణాళిక ఉండట్లేదు. ఏఐతో కొత్త ఉద్యోగాలు: – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పొందితే లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గుర్తించాలి. – ఐటీలో నిరంతరం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. ఉదాహరణకు కంప్యూటర్స్నే పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కంప్యూటర్స్ అంటే కేవలం డేటా సేకరణకే వినియోగించారు. తర్వాత అవి.. డేటా క్రియేషన్, డేటా ఇంటర్వెన్షన్ ఇలా ఎన్నో విభాగాలకు విస్తరించింది. – ఐటీలో కూడా కంప్యూటర్ ఆపరేషన్స్తో మొదలై.. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్లు ఎంత ముఖ్యంగా మారాయో మనం చూస్తున్నాం. 4‘సీ’స్ సూత్రాన్ని పాటించాలి – నేటి తరం యువత కెరీర్లో ముందుకు సాగేందుకు 4సీ సూత్రాన్ని (కరేజ్, కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్మెంట్) అమలు చేసుకోవాలి. – మానసికంగా ఈ లక్షణాలు ఉంటే వృత్తి పరంగా ఎలాంటి నైపుణ్యాలనైనా ఇట్టే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. – దేశంలో కెరీర్ పరంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఎంప్లాయర్స్ జాబ్ రెడీ స్కిల్స్ ఉన్న యువత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కిల్స్ను సొంతం చేసుకుంటే.. ఉద్యోగ రేటు వృద్ధి చెందుతుంది. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్పై పట్టు ముఖ్యం – ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేసిక్ సైన్సెస్ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాఠశాల స్థాయి నుంచే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఫలితంగా విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుంది. – నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లోని ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాలు పరిశీలిస్తే.. ఈ విధానం మన యువతకు ఎంతో అవసరం అనేది అవగతం అవుతుంది. ఇంగ్లిష్ మీడియం అనేది గ్లోబల్ లాంగ్వేజ్. దానిపై పట్టు సాధించడం నేటి పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. సైన్స్ అంటే ఇష్టం.. కానీ కంప్యూటర్స్లోకొచ్చా.. వాస్తవానికి నాకు బేసిక్ సైన్స్ అంటే ఇష్టం. మా నాన్న మాత్రం నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. అయినా నా ఇష్టాన్ని కాదనలేదు. కేరళ యూనివర్సిటీలో ఫిజిక్స్లో ఎమ్మెస్సీ చేశా. వెంటనే అప్పటి బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ విధులు మాత్రం కంప్యూటర్స్కు సంబంధించినవి. నా జీవితంలో నాకు ఏమైనా సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి అంటే నా తొలి ఉద్యోగంలోనే. వాటిని తట్టుకోవాలనే సంకల్పంతో, కంప్యూటర్ సైన్స్ భవిష్యత్తు ఆవశ్యకతను గుర్తించి అందులో పీజీ చదవడానికి సిద్ధమయ్యా. బోస్టన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. పత్ని కంప్యూటర్స్లో సిస్టమ్స్ ఇంజనీర్గా అడుగు పెట్టా. అక్కడే నారాయణమూర్తితో పరిచయం ఏర్పడడం, ఇన్ఫోసిస్ స్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది. ఇలా కెరీర్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత స్థానాలు, కోరుకున్న హోదాలు లభిస్తాయి. సంపాదనలో కొంత సమాజ సేవకు కేరళలో పుట్టి పెరిగిన నాకు.. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో, ఇతర విషయాల్లో ఎందరో తోడ్పాటు అందించారు. అదే స్ఫూర్తితో మా సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు కేటాయించాలని భావించాం. అందుకే 1998లో శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ (ఎస్ఎఫ్పీఐ) పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పి విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యార్థులకు తోడ్పాటునందిస్తే.. వారితోపాటు, దేశం కూడా వృద్ధి చెందుతున్న ఆలోచనతో విద్యా రంగాన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. డ్రాప్ అవుట్స్ను తగ్గించమే ప్రధాన లక్ష్యం 11, 12 తరగతుల స్థాయిలో డ్రాప్ అవుట్స్ను తగ్గించడమే మా లక్ష్యం. 1990లలో భారత గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు..పదో తరగతి పూర్తయ్యాక మగ పిల్లలను పనికి తీసుకెళ్లాలని, ఆడ పిల్లలైతే పెళ్లి చేయాలనే ధోరణితో ఉండేవారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండరనే ఉద్దేశంతోనే ఎస్ఎఫ్పీఐని ప్రారంభించాం. 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్లో డీప్సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్ను ఇమేజ్గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్పవర్గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్సీక్ కారు చౌకగా ఏఐ మోడల్ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్వేర్తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్ను రూపొందించామని డీప్సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ను వెనక్కి నెట్టింది. డీప్సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
డీప్సీక్.. మార్కెట్ షేక్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది. → ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%, మిడ్ క్యాప్ సూచీ 2.7% పడింది. → స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. → ఐటీసీ లిమిటెడ్ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్ షేర్లు జనవరి 29న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్ షేరు ధరను కేటాయించారు.ఎందుకీ పతనం...→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. → చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్పై పడింది. → అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. → ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. యూఎస్ టెక్ దిగ్గజాలలో కలవరం యూఎస్ ఏఐకు పోటీగా చైనీస్ ఆర్1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 3 శాతం పతనమైన నాస్డాక్ చాట్జీపీటీకి పోటీగా చైనీస్ డీప్సీక్ మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్ తదితర యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్, చాట్జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్ డీప్సీక్.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది. దీంతో టెక్ కంపెనీలు లిస్టయిన నాస్డాక్ ఇండెక్స్ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్ 7గా పేర్కొనే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఆర్1 ఎఫెక్ట్..: చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్1.. అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్డ్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అలాంటి కాల్స్లో 90% మోసపూరితమే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నంబర్లతో వచ్చే ఫోన్కాల్స్లో 90 శాతం వరకు మోసపూరితమైనవేనని టెలీకమ్యూనికేషన్స్ విభాగం వెల్లడించింది. టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సంచార్సాథీ మొబైల్యాప్తో వీటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ చేస్తున్న ఫోన్కాల్స్ను ఆధునిక టెక్నాలజీ వాడి భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించేలా చేసి కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు వారు వివరించారు. వాస్తవానికి మనకు ఫోన్కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్.. భారతీయ ఫోన్ నంబర్ +91తో మొదలైనట్టుగా కనిపించినా, అవన్నీ అంతర్జాతీయ ఫోన్కాల్సే అని అధికారులు పేర్కొన్నారు.ఇలాంటి ఫేక్కాల్స్పై వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల టెలీకమ్యూనికేషన్స్ విభాగం సంచార్సాథీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు మేరకు ఆయా నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ఇందుకు అన్ని టెలికాం సర్విస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్ల విభాగం ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టం అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 1.35 కోట్ల స్పూఫ్డ్ ఫోన్కాల్స్ వచ్చేవని, ఇటీవల స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గినట్టు అధికారులు తెలిపారు.ప్రస్తుతం స్పూఫ్డ్ కాల్స్ రోజుకు సుమారు 4 లక్షలవరకు మాత్రమే వస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ఫోన్కాల్స్ను కట్టడి చేయడం సైబర్నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు చెపుతున్నారు. కాగా, మొబైల్ వినియోగదారులు సంచార్ సా మొబైల్ యాప్ గూగుల్ప్లే స్టోర్, యాపిల్యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను వాడి అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు. -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
మహాకుంభ మేళాలో ‘టీమిండియా క్రికెటర్లు’.. అంతా AI మహిమ!
-
ఏఐలో దూసుకెళ్తున్న చైనా కంపెనీలు
సాన్హొసే (యూఎస్): మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని సామ్సంగ్ సౌత్వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జె.బి.పార్క్ తెలిపారు. ఏఐ అవసరాల కోసం వ్యక్తిగత డేటాను పంచుకుంటే చైనీస్ హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. భారత్లో ప్రత్యర్థి సంస్థలతో పోటీ ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘బలమైన ప్రత్యర్థి లేదా పోటీ లేకపోతే జీవితం చాలా బోరింగ్గా ఉంటుంది. సవాళ్లను మేము ఆస్వాదిస్తాం. మొబైల్, ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టడమేగాక మొత్తం వ్యవస్థకు సేవలు అందించే సంస్థగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. భారత స్మార్ట్ఫోన్ పరిశ్రమకు 2025 పెద్ద సంవత్సరంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకు సామ్సంగ్ సిద్ధంగా ఉంది’ అని వివరించారు. ప్రస్తుతం 800 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన సూపర్–ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ఆపిల్ నుండి, అలాగే 400–600 డాలర్ల విభాగంలో చైనీస్ హ్యాండ్సెట్ తయారీదారుల నుండి సామ్సంగ్ పోటీ ఎదుర్కొంటోంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంటుందని పార్క్ అన్నారు. చిన్న పట్టణాల్లోనూ కంపెనీ తయారీ ప్రీమియం ఫోన్ల వాడకం పెరిగిందని వివరించారు. -
సురక్షితం ఏఐ రాస్తే
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. మూడు రహదారులపై అధ్యయనం.. ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్ఐఆర్లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు నివేదికలు సమర్పించారు. బారియర్స్తో సరిదిద్దవచ్చు.. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్ 600 మందికి ఏబీసీలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్ -
డిసెంబర్లో నియామకాల జోరు
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నియామకాలు డిసెంబర్లో జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 31 శాతం పెరిగినట్టు ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఆరు నెలల్లో నియామకాలు 12 శాతం పెరిగాయి. ఆన్లైన్ జాబ్ పోస్టింగ్ల ద్వారా ఈ వివరాలను ఫౌండిట్ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్లో డిసెంబర్ నెలలో నియామకాలు 36 శాతం పెరిగాయి. → కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, తయారీ, నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 57 శాతం నుంచి 60 శాతం వరకు ఈ రంగాల్లో నియామకాలు డిసెంబర్లో పెరిగాయి. → ఏఐ ఉద్యోగాలు గడిచిన రెండేళ్లలో 42 శాతం వృద్ధితో 2,53,000కు చేరాయి. పైథాన్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డీప్ లెరి్నంగ్, ఎస్క్యూఎల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. టెన్సార్ఫ్లో, పైటార్చ్ తదితర ఏఐ ఫ్రేమ్వర్క్ల్లో నైపుణ్యాలున్న వారికి సైతం అధిక డిమాండ్ కనిపించింది. → హెచ్ఆర్ అడ్మిన్ ఉద్యోగ నియామకాలు గత మూడు నెలల్లో 21 శాతం పెరిగాయి. → మెడికల్ ఉద్యోగాలు సైతం 44 శాతం అధికంగా నమోదయ్యాయి. టెలీ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్, నర్సింగ్, హెల్త్కేర్ అనలిస్ట్ తదితర హెల్త్టెక్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. → డిసెంబర్లో కోయింబత్తూరులో అత్యధికంగా 58 శాతం మేర నియామకాలు పెరిగాయి. బెంగళూరులో 41 శాతం, చెన్నైలో 37 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ముంబైలో 23 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్లో 33 శాతం చొప్పున అధిక నియామకాలు చోటుచేసుకున్నాయి. → టైర్–2, 3 నగరాలు హెల్త్కేర్ కేంద్రాలకు నిలయాలుగా మారుతున్నాయి. వీటికి సంబంధించి నియామకాలు 30 శాతం పెరిగాయి. → బెంగళూరులో 26 శాతం, పుణెలో 17 శాతం, ఢిల్లీలో 14 శాతం చొప్పున ఏఐ నియామకాలు వృద్ధి చెందాయి. ఏఐ కీలకం.. ‘‘అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగడం ఉద్యోగ మార్కెట్ చురుకుదనాన్ని, బలాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఏఐ ఉద్యోగాల్లో 42 శాతం పెరగడం గమనార్హం. 2025లోనూ ఏఐ ఉద్యోగ నియామకాల్లో 14 శాతం మేర వృద్ది ఉండొచ్చు. ఏఐ ఇకపై ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరులకు కీలకంగా కొనసాగుతుంది’’అని ఫౌండిట్ సీఈవో వి.సురేష్ అన్నారు. -
ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి: ఈసీ
న్యూఢిల్లీ: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ‘ఏఐ జనరేటెడ్/డిజిటల్లీ ఎన్హాన్స్డ్/ సింథటిక్ కంటెంట్ వంటి లేబుల్స్ జతచేయాలంటూ నిబంధనను విధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ఫేక్(Deepfake) కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections) ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది.ఇదీ చదవండి: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ -
హైటెక్ బోధన.. ఆన్లైన్ సాధన
సాక్షి, హైదరాబాద్: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్లాంటి అత్యాధునిక సాంకేతిక కోర్సుల బోధన తొమ్మిదవ తరగతి నుంచే మొదలు పెడుతున్నారు. ఈ కోర్సుల డిజైన్, బోధన ప్రణాళిక విషయంలోనూ విద్యా కమిటీలదే పూర్తి అజమాయిషీ. గూగుల్ క్రోంలో వర్క్ షీట్లు, అందులోనే మూల్యాంకన విధానం విద్యార్థులను సాంకేతిక పురోగతి వైపు తీసుకెళ్తున్నాయి. మన విద్యా విధానంలోనూ ఇలాంటి సంస్కరణలు అవసరం అంటున్నారు అమెరికా విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ఉపాధ్యాయుడు సంక్రాంతి రవి కుమార్. అమెరికాలో నిర్వహించిన ‘ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా ఆయన అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు. ఇందులో మొత్తం 60 దేశాల నుంచి టీచర్లను ఎంపిక చేయగా, మనదేశం నుంచి ఎంపికైన ఏడుగురిలో రవికుమార్ ఒకరు. ఒహియోలో రాష్ట్రంలోని కెంట్ నగరంలో 50 రోజుల పాటు అక్కడి విద్యా విధానంపై ఈయన అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవికుమార్ అమెరికా విద్యా విధానంపై తన పరిశీలనను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.అడుగడుగునా టెక్నాలజీ..అమెరికాలో సెకండరీ విద్య పూర్తిగా ఉచితం. ప్రైవేటు స్కూళ్లు కనిపించవు. ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఎక్కువ భాగం సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తోంది. పెన్, నోట్బుక్ ఎప్పుడో దూరమయ్యాయి. గూగుల్ క్రోం బుక్స్లో అసైన్మెంట్స్ ఇస్తారు. అందులోనే మూల్యాంకనం చేస్తారు. అయితే, విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే అవకాశం ఉందని టీచర్లు అంటున్నారు. ఆక్యులెస్, మెటాక్వెస్ట్ వంటి పరికరాలు, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతత అక్కడ ప్రతీ స్కూల్లో కనిపిస్తున్నాయి. ప్రయోగాలను వర్చువల్ రియాలిటీ ద్వారా తెలుసుకునే విధానం ఉంది. ఆన్లైన్ ద్వారా నాలెడ్జ్ పొందడంలో అమెరికన్ విద్యార్థులు ముందున్నారు. ఇందుకు తగ్గ అప్లికేషన్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.9వ తరగతి నుంచే భవిష్యత్ ప్రణాళికవిద్యార్థి భవిష్యత్ నిర్దేశం 9వ తరగతిలోనే మొదలవుతుంది. 11 రకాల వృత్తి విద్యా కోర్సులను ఈ దశలోనే అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్, ఇంజనీర్, టీచర్... ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా 9వ తరగతిలో పునాది పడుతుంది. దీంతో సబ్జెక్టుపై విద్యార్థికి పట్టు పెరుగుతుంది. అక్కడ విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలకూ ప్రాధాన్యమిస్తున్నారు. సంగీతం, గేమ్స్, మోడ్రన్ మ్యూజిక్.. ఇలా ఏదో ఒక అంశాన్ని విద్యార్థి నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. నైపుణ్యానికి పెద్దపీటఇంజనీరింగ్ విద్య అమెరికాలో భిన్నంగా ఉంది. థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఎక్కడికో వెళ్లి ఇంటర్న్షిప్ చేయడం ఉండదు. ప్లానింగ్, డిజైనింగ్ ఇంజనీరింగ్ విద్యలో భాగం. ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని విద్యార్థులు ఇంజనీరింగ్లో చేయాలి. ఈ విధానం పాఠశాల విద్యలోనూ కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థిలో నైపుణ్యం పెరుగుతుంది. అయితే, భారత విద్యార్థులకంటే గణితంలో అమెరికా విద్యార్థులు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. టీచర్లు, అదనపు టీచర్లు..ప్రతి క్లాసులోనూ 20–24 మంది విద్యార్థులనే అనుమతిస్తారు. ఒక్క విద్యార్థి పెరిగినా కొత్త సెక్షన్ నిర్వహించాల్సిందే. ప్రతి సబ్జెక్టుకూ టీచర్లతోపాటు అదనపు టీచర్లనూ నియమిస్తారు. ప్రతి సబ్జెక్టును, క్లాసును విద్యా కమిటీలు పర్యవేక్షిస్తాయి. లోపాలను టీచర్లకు చెబుతాయి. కమ్యూనిటీ పరంగా ఎక్కువ నిధులు ఇచ్చే సంస్థల పర్యవేక్షణలోనే విద్యా కమిటీలు ఏర్పడతాయి. వీటిపై ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం ఉండదు. టీచర్ల నియామకం విషయంలోనూ కమిటీలు అన్ని అర్హతలు పరిశీలిస్తాయి. కొన్ని నిబంధనల మేరకు వీళ్లు పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం కుదరదు.ప్రభుత్వానికి నివేదిక ఇస్తా..విద్యా విధానంలో మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అమెరికా విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం అవసరం. నేను అక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి కూడా నివేదిక పంపుతా. సాంకేతికంగా అభివృద్ధి పథంలోకి రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకెళ్లడానికి అమెరికాలోని కొన్ని మంచి అంశాలను మనం స్వీకరించాల్సిందే. – సంక్రాంతి రవి కుమార్ -
అందానికి ఏఐ టచ్!
రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్సైట్లోని టూల్ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్లో సెల్ఫిలను క్యాప్చర్ చేసి పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్లో స్టార్టప్లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్ టైమ్లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.డేటా ఎనలిటిక్స్ దన్ను... బ్యూటీ స్టార్టప్లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి, మెషీన్ లెరి్నంగ్ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!స్మార్ట్ టూల్స్..ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్.. సొంతంగా పర్పుల్ స్కిన్ ఎనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగి్నషన్ టూల్ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైమ్లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) టూల్ మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియల్ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ ‘మోడిఫేస్’ను ఉపయోస్తోంది. వినియోగదారులు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ వినీతా సింగ్ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు.ఫీడ్ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...కస్టమర్ల ఫీడ్బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్ను పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్లకు ఏఐ, ఎంఎల్ టూల్స్ తోడ్పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్లు 2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25శాతంఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్లైన్ స్టోర్లలో 14 శాతమే).– సాక్షి, బిజినెస్డెస్క్ -
భవిత ‘ఏఐ’తుందో..?
సాక్షి, హైదరాబాద్: ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా దూసుకొస్తోంది. అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు చెబుతుంటే మరికొన్ని సంస్థలు మాత్రం ఏఐ రాకతో ఉపాధికి గండి తప్పదని వాదిస్తున్నాయి. అయితే వృత్తి నైపుణ్యం, సాంకేతికతతో పోటీపడే సామర్థ్యం పెంపొందించుకోవడం ద్వారానే యువత ఉపాధికి ఢోకా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ భాషా విధానంపై విశ్వవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు రంగంలోకి దిగాయి.ఏఐ స్పీడ్ ఎంత?గ్లోబల్ సిస్టమ్ అనే సంస్థ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం ఏఐ వేగం కోసం భారత్ పరుగులు పెడుతోంది. తెలంగాణ సహా దేశంలోని అన్ని ప్రధాన ఐటీ నగరాలు ఏఐ టెక్నాలజీపై విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఏఐ స్టార్టప్స్లో బెంగళూరు 21వ స్థానంలో, ఢిల్లీ 24, ముంబై 37, హైదరాబాద్ 41వ స్థానంలో ఉందని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఏఐపై 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు స్కిల్ ఇండియా పేర్కొంది. మొత్తం 67200 కృత్రిమ మేధ సంస్థలున్నాయి. అందులో 25 శాతం అమెరికాలోనే ఉన్నాయి. భారత్లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే వాటిలో 6,636 సంస్థలు ఏఐపైనే పనిచేస్తున్నాయి. ఇవి ఈ రంగంపై రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దేశంలోని ఆరోగ్య సేవా సంస్థలు ఏఐను ఉపయోగించి టెలి మెడిసిన్, వ్యక్తిగత ఆరోగ్య సేవలు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో సుమారు 12 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఫిన్టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ 90 వేల కోట్ల డాలర్లు. 2021లో దేశంలో 2,100 ఫిన్టెక్ కంపెనీలు ఉండగా ఇప్పుడు 10,200కు చేరాయి. స్టార్టప్ రంగంలో వ్యవస్థాపక పెట్టుబడులు 2021లో 53 వేల కోట్ల డాలర్లు. 2023 నాటికి భారీగా పెరిగింది.ఉపాధికి విఘాతమా?స్కిల్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణుల అవసరం ఉంది. దాదాపు 152 సంస్థల అవసరాలు, 3.88 లక్షల మంది నిపుణుల అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా ప్రస్తుతం 6.29 లక్షల మంది అవసరం ఉందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచ మేధో సంపత్తి ఆర్థిక నవీకరణ సూచీ–2024 ప్రకారం 133 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 39వ స్థానంలో ఉంది. 2015లో 81వ స్థానంలో ఉంది. అంటే ఏఐ ఎంత వేగంగా దూసుకెళ్తుందో అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే ఏఐలో కీలకమైన లార్జ్ లాంగ్వేజీ మోడల్స్ (ఎల్ఎల్ఎం)పైనే యువతలో ఆందోళన ఉంది. ఇవి మానవ మేధస్సును మించి పనిచేస్తాయని.. దీనివల్ల మానవ వనరుల అవసరం ఉండదని భావిస్తున్నారు. కానీ ఈ భావనను నీలమ్ కర్న్ అనే ఏఐ నిపుణుడు తోసిపుచ్చుతున్నారు. ఎల్ఎల్ఎంలకు సరికొత్త ప్రోగ్రామ్ ఇవ్వగల స్థాయికి మన యువత ఎదగడం సాధ్యమేనని అంటున్నారు. అప్పుడు ఏఐని మించిన మేధోశక్తి మనకు ఉంటుందని చెబుతున్నారు. ఏఐతో పోటీ తప్పదు సర్విస్ సెక్టార్లో మార్పులొస్తున్నాయి. ఇప్పటివరకు డెవాబ్స్పై పనిచేశా. ఏఐ టెక్నాలజీ అంతర్లీనంగా ప్రభావం చూపిస్తోంది. టెక్నాలజీ మార్పు అనివార్యమని గుర్తించా. పదేళ్ల సీనియారిటీ ఉన్న నాకు ఏఐతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఇది అనివార్యమనే భావిస్తున్నా. –శ్రీరాంకుట్టి (ఏఐ స్టార్టప్ ఉద్యోగి) ఆందోళన తొలగించాలి టెక్నాలజీ వేగాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న మానవ వనరులకు శిక్షణ అవసరం. కొత్త సాంకేతికతపై ఆందోళన చెందుతుంటే మార్పు ఎలా సాధ్యం? కాకపోతే శిక్షణపై ప్రభుత్వాలు, ఐటీ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. – నవీన్ చావ్లా (ఐటీ నిపుణుడు) -
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
బ్యాంకుల్లో 2 లక్షల ఉద్యోగాలకు ముప్పు..
విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత బ్యాంకింగ్ రంగంలో (banks) లక్షలాది ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. బ్లూమ్బెర్గ్ (Bloomberg) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మానవ కార్మికులు నిర్వహిస్తున్న పనులను కృత్రిమ మేధస్సు (AI) ఆక్రమించడంతో అంతర్జాతీయ బ్యాంకులు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించనున్నాయి.ఆయా బ్యాంకుల చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులను బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే చేసిన తాజాగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక్కో బ్యాంకు సగటున తమ వర్క్ఫోర్స్లో నికరంగా 3% మందిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. క్లయింట్ ఫంక్షన్లను కూడా బాట్లు(ఏఐ) నిర్వహించడం వల్ల కస్టమర్ సేవల్లో మార్పులు రానున్నాయి. ఇక కేవైసీ విధులను నిర్వర్తించే పాత్రలకు ముప్పు తప్పదు.ఎక్కువ మంది ఇదే చెప్పారు..మొత్తం 93 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది మొత్తం హెడ్కౌంట్లో 5% నుంచి 10% క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ చేసిన ఈ సర్వేలో సిటీ గ్రూప్ (Citigroup), జీపీ మోర్గాన్ చేజ్ & కో (JPMorgan Chase & Co), గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ (Goldman Sachs) వంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలపై ప్రభావం పడినా బ్యాంకులకు మాత్రం మెరుగైన ఆదాయాలను అందించనున్నాయి. బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను పెంచడం వల్ల 2027లో బ్యాంకులు 12% నుండి 17% ప్రీ-టాక్స్ లాభాలను చూడగలవు. ప్రతి పది మందిలో ఎనిమిది మంది జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను, ఆదాయ సృష్టిని రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో కనీసం 5% పెంచుతుందని భావిస్తున్నారు.ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిర్వహణను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరణ కోసం సంవత్సరాలు గడిపిన బ్యాంకులు.. ఉత్పాదకతను మరింత మెరుగుపరచగల కొత్త తరం ఏఐ సాధనాల్లోకి ప్రవేశించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇతర రంగాల కంటే బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఎక్కువ ఉద్యోగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిటీ గ్రూప్ గత జూన్లోనే ఒక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్లో దాదాపు 54% ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సిటీ పేర్కొంది. -
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు (AI) సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఏఐకి పునాదుల్లాంటి ఫౌండేషన్ మోడల్స్ను సొంతంగా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఒక్క కొత్త మ్యాథ్స్ సూత్రం, అల్గోరిథంలాంటిది కనుగొన్నా ఏఐ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.కృత్రిమ మేథను ఉపయోగించి, పరిశ్రమల పనితీరును మెరుగుపర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతనమైన ఏఐ సిస్టమ్స్ మీద కసరత్తు చేయాలంటే పెట్టుబడుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంటోందని ఆయన చెప్పారు. కానీ పరిశోధనలతో వ్యయాల భారాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇండియా ఏఐ టూర్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల వివరించారు.ప్రస్తుతం ఓపెన్ఏఐ, గూగుల్లాంటి టెక్ దిగ్గజాలు తయారు చేసిన ఏఐ ఇంజిన్లనే (ఫౌండేషన్ మోడల్స్) దేశీయంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్యక్రమం సందర్భంగా రైల్టెల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా గ్రూప్ మొదలైన సంస్థలతో మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.ఈ ఒప్పందాల కింద క్లౌడ్, ఏఐ ఆవిష్కరణల ద్వారా ఆయా సంస్థల సిబ్బంది, కస్టమర్లు ప్రయోజనం పొందేందుకు కావాల్సిన తోడ్పాటును మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. అటు దేశీయంగా ఏఐ, కొత్త టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు, సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఇండియా ఏఐతో కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణఇండియాఏఐతో భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. -
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు
గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ షంషుద్దీన్ జబ్బార్ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్ అమెరికన్ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సన్నిహత సహచరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్లోని క్వీన్స్ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్ పైప్లైన్ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్కు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న డోనాల్డ్ ట్రంప్ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్, న్యూయార్క్, లాస్ వెగాస్ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్ పుతిన్ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్ పైప్లైన్ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్–హమాస్ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్జీపీటీ4ని ఓపెన్ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్రాబిట్ అనే వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్జీపీటీ4 ఔట్సోర్స్ చేసి, సర్వీస్ ప్రొవైడర్కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని క్లోన్ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్ కాల్స్ చేశారు. ఈ ఆపరేషన్ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్ వ్యాసకర్త ‘హిందుస్థాన్’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
డీప్ఫేక్స్ చేసినా.. షేర్ చేసినా.. జైలుకే!
డీప్ఫేక్.. నటి రష్మిక మందన పేరుతో వైరల్ అయిన ఓ వీడియో తర్వాత విస్తృతంగా చర్చ నడిచిన టెక్నాలజీ. ఆ వీడియోకుగానూ ఆమెకు అన్నిరంగాల నుంచి సానుభూతి కనిపించింది. ఆ టైంలో ఈ టెక్నాలజీని కట్టడి చేయాలంటూ ప్రభుత్వాలు సైతం గళం వినిపించాయి. అయితే ఏఐ వాడకం పెరిగిపోయాక.. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. ఏకంగా సినిమా హీరోయిన్లను.. నచ్చిన అమ్మాయిలను ముద్దు పెట్టుకుంటున్నట్లు, వాళ్లతో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియో క్రియేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ షార్ట్వీడియోస్ యాప్లలోనూ వదులుతున్నారు.ఒకవైపు మన దేశంలో ఈ తరహా విషసంస్కృతిని కట్టడి చేయలేకపోవడంతో.. ఉన్మాదులు మరింత రెచ్చిపోతున్నారు. మన దేశ ప్రధానిని సైతం కూడా వదలకుండా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. ఇందులో సరదా కోణం ఉన్నప్పటికీ.. అశ్లీలత, అసభ్యత లాంటివి కూడా చాలావరకు కనిపిస్తోంది. అయితే ఇక్కడో దేశం డీప్ఫేక్ కట్టడికి కఠిన చట్టం అమల్లోకి తేబోతోంది.ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్లను ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(Artificial Intelligence) ని ఉపయోగించి.. అచ్చం నిజంవాటిలా అనిపించేలా చేసే ప్రయత్నమే డీప్ఫేక్. ఇందులో సరదా కోణం మాత్రమే కాదు.. అచ్చం పోలికలతో ఉండేలా అసభ్యకరమైన వీడియోలను, ఫొటోలను, అలాగే ఫేక్ ఆడియో క్లిప్లను కూడా సృష్టించవచ్చు. అందుకే ఆందోళన తీవ్రతరం అవుతోంది. అయితే..డీప్ఫేక్స్(Deepfakes)ను క్రియేట్ చేసినా.. వాటిని ఇతరులకు షేర్ చేసినా.. ఇక నుంచి తీవ్ర నేరంగానే పరిగణించనుంది బ్రిటన్. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది. ముఖ్యంగా మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని మృగాలు నెట్టింట రెచ్చిపోతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్రిటన్ ప్రకటించింది.వాస్తవానికి 2015 నుంచే డీప్ఫేక్ను తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయాలని బ్రిటన్ ప్రయత్నిస్తూ వస్తోంది. గత కన్జర్వేటివ్ ప్రభుత్వం తీవ్ర నేరంగానే పరిగణించాలని చట్టం చేయాలనుకున్నప్పటికీ.. శిక్షను మాత్రం స్వల్ప జైలు శిక్ష, జరిమానాతో సరిపెట్టాలనుకుంది. అయితే ఆ టైంలో శిక్ష కఠినంగా ఉండాలని పలువురు డిమాండ్ చేశారు. తాజాగా లేబర్ పార్టీ(labour Party) ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. డీప్ఫేక్ను ప్రమోట్ చేసేవాళ్లు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కఠిన శిక్షకూడా పడుతుంది. ‘‘అనుమతి లేకుండా అశ్లీలంగా డీప్ఫేక్ కంటెంట్ తయారు చేసినా.. వైరల్ చేసినా శిక్షార్హులే అని ఆ దేశ న్యాయశాఖ ప్రకటించింది. అలాగే మహిళల ప్రైవసీకి భంగం కలిగించే ఈ వ్యవహారాన్ని అత్యవసర పరిస్థితిగానూ పరిగణిస్తామని పేర్కొంది. అతిత్వరలో ఈ చట్టాన్ని పార్లమెంట్కు తీసుకురానున్నట్లు తెలిపింది.యూకేకు చెందిన రివెంజ్పోర్న్ హెల్ప్లైన్ గణాంకాలను పరిశీలిస్తే.. 2017 నుంచి సోషల్ మీడియాలో ఈ తరహా వేధింపులు 400 శాతం పెరిగిపోయినట్లు తేలింది. అయితే ఇది ఫొటోల రూపేణా ఎక్కువగా కనిపించింది.ఉన్మాదంతో, ఒక్కోసారి ప్రతీకార చర్యలో భాగంగా పోర్నోగ్రఫిక్ కంటెంట్ను ఉద్దేశపూర్వకంగానే నెట్లో వదులుతున్నారు కొందరు. మన దేశంలోనూ కొందరి డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుండడంతో.. ఆ ప్రైవేట్ వీడియోలు తమవి కావంటూ వాళ్లు ఖండిస్తుండడం చూస్తున్నాం.ఇదీ చదవండి: చొరబాట్లకు మూడు రూట్లు -
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్కి వెళ్లినా, ఔటింగ్కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్స్టవ్ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్గా, సర్వెంట్గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్తో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్ఈ డివైస్తో ఆరోగ్యకరమైన స్మూతీస్ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్షేక్స్తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్లో జ్యూసర్ యూనిట్తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్కేర్కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా! -
అన్నిరంగాల్లో ఏఐదే కీలకపాత్ర
250 పరిశోధన పత్రాలతో సావనీర్ ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఇంటర్నెట్లో మనం వినియోగించేది ప్రతీది ఏఐపై ఆధారపడి పనిచేస్తుంది. ఏఐ గురించి ప్రాముఖ్యతను, దానిపై జరుగుతున్న పరిశోధనలను తెలిపేందుకు సిద్దిపేట వేదికైంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మ జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏఐపై జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.మొదటి రోజు రీసెర్చ్లు చేసిన వాటిపై పోస్టర్ ప్రజంటేషన్ చేశారు. ఈ సదస్సు సందర్బంగా దేశంలోని పలు యూనివర్సిటీల ఏఐ అనుబంధ అంశాలపై జరిగిన రీసెర్చ్లను ఆహ్వానించారు. ఆయా యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారా పరిశోధన పత్రాలను పంపించాయి. – సాక్షి, సిద్దిపేట250 పరిశోధన పత్రాలతో సావనీర్ ఈ సదస్సు సందర్భంగా తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రపదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల నుంచి దాదాపు 250 పరిశోధన పత్రాలు వచ్చాయి. వాటిని ఒక్క చోట చేర్చి సావనీర్ను రూపొందించారు. దీనికి ఐఎస్బీఎన్ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబరు) లభించింది. దానిని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సదస్సు శనివారం కూడా కొనసాగనుంది. ఏఐ ద్వారా డ్రగ్స్ కాంబినేషన్లు గుర్తించవచ్చు ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యాధి బ్రెస్ట్ కేన్సర్. చెట్టు నుంచి వచ్చే కాంబినేషన్ బయో మెటాబోలైట్స్ ద్వారా బ్రెస్ట్ కేన్సర్ను నయం చేయవచ్చు. ఏఐ టూల్స్ ద్వారా కాంబినేషన్ను గుర్తించి ఆ డ్రగ్ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. ప్లాస్టిక్, స్మోకింగ్, ఫుడ్ ద్వారా కేన్సర్ బారిన పడుతున్నారు. ఉదాహరణకు తినుబండారాల కోసం గంటలకొద్దీ నూనెను మరగపెడుతారు. దీంతో అది విషంగా మారుతోంది. – డాక్టర్ పూర్ణచందర్,అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ, తమిళనాడు భవిష్యత్తులో ఏఐ కీలక పాత్ర భవిష్యత్తులో విద్యార్థులకు అనుకూలమైన అభ్యసన, అనుభవాలను అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. బలాలు, బలహీనతల ఆధారంగా పాఠ్యాంశం డిజైన్కు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. ఆటోమేటెడ్ గ్రేడింగ్ పద్ధతి ఇతర దేశాలలో వినియోగిస్తుండగా త్వరలో మన దేశంలో సైతం వినియోగంలోకి రానుంది. పిల్బాల్ని మనిషి వేసుకుంటే దాని ద్వారా దాదాపు 65 వేల ఫోటోలను తీసి అందిస్తోంది. ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పిల్బాల్ను టెస్ట్ చేశారు. పిల్బాల్తో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఏఐని ఎంత అభివృద్ధి చేసినా మానవునిపైనే ఆధారపడి పని చేస్తుంది. సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో ఏఐ ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తోంది. – రాఘవేందర్రావు, అసోసియేట్ ప్రొఫెసర్, నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలడేటా పంపేప్పుడు జాగ్రత్తలు పాటించాలి.... తెలిసిన వారికి, తెలియని వారికి మొబైల్ ద్వారా డేటా పంపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పంపే డేటా ఏ యాప్ నుంచి పంపిస్తున్నామో వారికి సైతం చేరే అవకాశం ఉంటుంది. హ్యుమనైడ్స్ పద్ధతి–2030 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యుమనైడ్స్ అంటే మనిషి ఇంట్లో చేసే పనులు అన్ని రోబో చేస్తుంది. మోకాలు సర్జరీ రోబో ద్వారా చేయడం వలన కుట్ల సంఖ్య తగ్గుతుంది. – డాక్టర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాల షుగర్తో కంటి చూపుపై ఎఫెక్ట్ షుగర్ ద్వారా తయారయ్యే ఉత్పత్తులను తినడం వలన కంటి చూపుపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుందో నా రీసెర్చ్ ద్వారా వివరించాను. పుణె యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. ఇంటర్న్షిప్లో ఈ రీసెర్చ్ చేశాను. నా పరిశోధనను సావనీర్లో పబ్లిష్ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. – శాలిని చౌహాన్, పుణె యూనివర్సిటీ -
కంప్యూటర్ కమాండర్.. సిద్ధార్థ
తెనాలి: ఈ చిన్నోడు సామాన్యుడు కాదు. కంప్యూటర్ లాంగ్వేజెస్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దిట్ట. కంప్యూటర్ సైంటిస్టులకే పాఠాలు చెబుతాడు. ఐఐటీ విద్యార్థులకు (IIT Students) రోల్ మోడల్. కంప్యూటర్ ప్రపంచం మెచ్చిన డేటా సైంటిస్ట్ (Data Scientist). పన్నెండేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్గా ఉద్యోగం చేసిన ఘనుడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన డేటా సైంటిస్ట్గా గూగుల్తోనే చెప్పించుకున్న తెనాలి చిన్నోడు. పేరు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ (Siddharth Srivastav Pilli). ఇప్పుడు వయస్సు 17 ఏళ్లు. చదువుతున్నది ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం. హైదరాబాద్ ఐఐటీలో (Hyderabad IIT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగానూ పని చేస్తున్నాడు. వారంలో మూడు రోజులు చదువు.. మూడు రోజులు ఉద్యోగం. ఏడో తరగతి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుంచే కంప్యూటర్పై పట్టు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో సిద్ధార్థకు చిన్నతనం నుంచీ కంప్యూటర్పై బలమైన అభిరుచి కలిగింది. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్పించారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్కు చేరుకోగలిగాడు.సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులూ చేయటంతో ఆత్మవిశ్వాసం కలిగింది. అప్పుడే ఉద్యోగం చేస్తానని తండ్రితో చెప్పాడు. తండ్రి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మరింత పరిజ్ఞానం కోసం తండ్రి అతడిని ఓ కంప్యూటర్ సంస్థలో చేర్చాలని తీసుకెళ్లగా.. బాలుడన్న కారణంతో చేర్చుకోలేదు. దీంతో తండ్రి ఆన్లైన్ కోర్సుల్లో చేర్పించారు. ఇలా వీడియోలు చూస్తూ స్వయంగా అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై గట్టి పట్టు సాధించాడు. ఉద్యోగ సాధన ఉద్యోగం చేస్తానని మరోసారి చెప్పినా భారత్లో సాధ్యం కాదని తండ్రి చెప్పేశారు. పట్టువదలని సిద్ధార్థ తనే ఓ రెజ్యూమె తయారు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడుతూనే.. వయసు, చదువు తక్కువన్న భావనతో పట్టించుకోలేదు. సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసిన మోంటెగ్న్ కంపెనీ సీఈవో ‘నీతో వండర్స్ చేయిస్తా’ అంటూ ఉద్యోగం ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి షరతు విధించడంతో మూడు రోజులు ఉద్యోగానికి ఓకే చేశారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు.కొద్దికాలంలోనే అదే హోదాతో మరో సంస్థకు మారాడు. నెలకు రూ.45 వేల వేతనంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్లో కృషి చేశాడు. మూడురోజులు స్కూలుకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులూ నిర్వహించాడీ బాల మేధావి. అవార్డులు, అవకాశాలు.. సిద్ధార్థ ప్రతిభను గుర్తించిన బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ బుడతడిని స్వయంగా ఆహ్వానించి భూకంపాలను ముందుగానే గుర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అప్పగించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్లోనే గటిక్ కాలేజిలో ఇంటర్లో చేరాడు. మరోవైపు అక్కడి ట్రిపుల్ ఐటీలో రీసెర్చ్ ఇంజినీరుగానూ పరిశోధన కొనసాగించాడు. ఇంకోవైపు కోడింగ్ క్లాసులూ చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పైనా ఫ్రీలాన్సర్గా చేయసాగాడు. ఇవన్నీ గమనించిన ఐఐటీ–హైదరాబాద్ అతడికి ఆర్టిఫిషియల్ ఇంజినీరుగా ఉద్యోగాన్నిచ్చింది.చదవండి: అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’ప్రస్తుతం సిద్థార్థ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూనే.. ఏడాదిగా ఐఐటీలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల శాంసంగ్ కంపెనీ జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సాల్వ్ ఫర్ టుమారో’ పోటీలో టాప్ టెన్లో ఒకడిగా వచ్చాడు. కృత్రిమ మేధలో అతడి నవీన ఆలోచన అందులో ఎంపికైందని సిద్థార్థ తండ్రి రాజ్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. 2022–23లో ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డునూ సిద్ధార్థ అందుకున్నాడు. ‘సాక్షి’ మీడియా చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. జాతీయస్థాయి న్యూస్ ఛానల్స్ ఇతని ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి.ఇదే లక్ష్యం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్ల జీవిత చరిత్రలు, బిల్ గేట్స్ మాటలు, స్టీవ్ జాబ్స్ పనితీరుతో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నట్టు సిద్ధార్థ చెప్పాడు. ప్రపంచ టాప్ ఫైవ్లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండాలని, మంచి గేమ్ డిజైన్ చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా చేస్తానని, వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్కు రూపకల్పన చేయాలనే ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు తెలిపాడు. -
కొత్త ఏడాదిలో 10 లక్షల కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అధునాతన సాంకేతికత కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఏడాదిలో తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జోరందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తెలంగాణలోనే వివిధ రంగాల్లో పది లక్షల మేర సాధారణ ఉద్యోగాల కల్పన సాధ్యమని అంటున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలతో పాటు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని అంటున్నారు. గత ఏడాదిలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.8 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గగా, 2025లో ఇది మరింత తగ్గుతుందని వివిధ నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం ప్రకటించింది. 2023తో పోలిస్తే ఎఫ్డీఐల్లో 33 శాతం వృద్ధి నమోదు కాగా, రూ.3,185 కోట్లు అదనంగా వచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్డీఐల్లో 93 శాతం అంటే రూ.11,970 కోట్లు హైదరాబాద్కు రాగా, రంగారెడ్డి జిల్లాకు రూ.680 కోట్లు, మహబూబ్నగర్కు రూ.116 కోట్లు, మెదక్కు 96.99 కోట్లు వచ్చాయి. ఇదేవిధంగా ఎఫ్డీఐల రాక కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని, ఉద్యోగాల కల్పనకు ఇవి కీలకంగా మారతాయని అధికార వర్గాలంటున్నాయి. ఐటీ రంగంలో గడిచిన రెండేళ్లుగా నెలకొన్న మాంద్యం, భారత్లో ఎన్నికల వాతావరణం తదితర కారణాలతో ఉద్యోగ నియామకాలకు దూరంగా ఉన్న అమెరికా, ఐరోపా కంపెనీలు ఈ ఏడాది జరిపే నియామకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. జీసీసీలకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పన భారీగా సాధ్యమవుతుందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీసీసీలను ఆకర్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబయి, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి ఈ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో భారత్లో ఏర్పాటైన జీసీసీల్లో 30 శాతం హైదరాబాద్లోనే ఏర్పాటు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 355 జీసీసీలు ఉండగా, సాఫ్ట్వేర్/ఇంటర్నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, సెమికండక్టర్, ఫార్మా స్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైసెస్, టెలీ కమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐ, ఆటోమేటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో కొత్త జీసీసీల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీలను కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్నగర్లోనూ ఏర్పాటు చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సరీ్వస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని జీసీసీల్లో పనిచేస్తున్న 19 లక్షల మంది ఉద్యోగుల్లో 12 శాతం మంది తెలంగాణకు చెందిన నిపుణులే ఉండటం గమనార్హం. ఇది వచ్చే రెండేళ్లలో 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఎంఎస్ఎంఈలదీ పెద్ద పాత్రే.. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా రాష్ట్రంలో 5.6 లక్షల మంది ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగాల కల్పన 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెప్తున్నారు. -
అగ్రిటెక్ రంగంలో భారీగా కొలువులు
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు. హైబ్రిడ్ ఉద్యోగాలు.. అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్గా ఉండవని పేర్కొన్నారు. సీజన్లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్లు ఉన్నట్లు వివరించారు. -
ఏఐ నామ సంవత్సరం
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది. స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లుభారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.స్మార్ట్ఫోన్ , ల్యాప్టాప్ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్ఫేక్లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.పునర్వినియోగ రాకెట్అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్షిప్ ప్రయోగంతో రుజువైంది. భవిష్యత్తులో ఈ సూపర్హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా. గత ఏడాది అమృత్ కాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి. 2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్యాన్ ప్రయోగాలు జరగనున్నాయి. చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది. జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది. సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. రెయిన్ కోట్లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.దినేశ్ సి.శర్మ వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొత్త టెక్నాలజీతో 10 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: క్వాంటమ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఐటీ ప్లేస్మెంట్, స్టాఫింగ్ కంపెనీ క్వెస్ ఐటీ స్టాఫింగ్ నివేదిక వెల్లడించింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్చెయిన్ విభాగాలలోని నైపుణ్యాలు వినూత్న అప్లికేషన్లతో పరిశ్రమలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని తెలిపింది. క్వెస్ టెక్నాలజీ స్కిల్స్ రిపోర్ట్–2024 ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కూడా 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్ డాలర్లకు పైగా దోహదపడతాయని అంచనా. ఇది సాంకేతిక నైపుణ్యంలో భారత స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, ఆటోమోటివ్, తయారీలో ఏఐ/ఎంఎల్ సాంకేతికత మోసాన్ని గుర్తించడం, నిర్ధారణ, నాణ్యత నియంత్రణ ద్వారా సామర్థ్యాన్ని పెంచుతుంది’ అని వివరించింది. అసమాన అవకాశాలను.. ‘టెక్ నియామకాల్లో 43.5 శాతం వాటాతో బెంగళూరు ప్రధమ స్థానంలో ఉంది. హైదరాబాద్ 13.4 శాతం, పుణే 10 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత సాంకేతికత నిపుణులు టెక్నాలజీలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. జనరేటివ్ ఏఐ, బ్లాక్చెయిన్ వంటి సాంకేతికతల జోరుతో 2030 నాటికి భారత ఐటీ రంగం 20 లక్షల ఉద్యోగాలను జోడించనుంది’ అని నివేదిక తెలిపింది. ఏఐ/ఎంల్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ వంటి సంప్రదాయ నైపుణ్యాల కలయిక అసమాన అవకాశాలను అందిస్తుందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. -
భారత్కు ‘తయారీ’ స్వర్ణయుగం
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అన్నారు. ప్రపంచ సరఫరాల చైన్ భారతదేశానికి అనుకూలంగా మారుతుండడం ఇక్కడ సానుకూల అంశమని పే ర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపారాలు సవాళ్లను తట్టుకుంటూ, స్థిరీకరణ సాధిస్తున్నాయని తద్వారా ఈ రెండింట మధ్య (సవాళ్లు–స్థిరీకరణ) కొత్త సమతౌల్యతను సంస్థలు సాధిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రూప్ కంపెనీల సిబ్బందికి చంద్రశేఖరన్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని పంపారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → భారతదేశం ఇప్పుడు తయారీ స్వర్ణయుగంలో ఉంది. 2024 తర్వాత 2025కోసం ఆశావాదంతో ఎదురు చూస్తున్నాను. టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాను కోల్పోవడంతో ఈ సంవత్సరం గ్రూప్కు ఒక విచారకరమైన ఏడాదిగా నిలిచింది. → ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నేతృత్వంలోని కీలక చొరవలు జరుగుతాయని, ఇవి మొత్తం మానవాళికి సహాయపడతాయని భావిస్తున్నాం. → తయారీకి భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉంది. → మహమ్మారి స్వల్పకాలిక నష్టాన్ని కలిగించినా ఆన్లైన్, ఏఐ వినియోగం వ్యవస్థలో శాశ్వత ప్రయోజనాలను అందించే స్థాయికి ఎగశాయి. → టాటా గ్రూప్ 5 లక్షల తయారీ ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. → బ్యాటరీలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరికరాలు, హార్డ్వేర్ ప్రాజెక్టుల్లో దేశం నేటి పెట్టుడులు రేపటి ఆర్థిక వ్యవస్థలో మున్ముందు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. → గుజరాత్ ధొలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్, అస్సాంలోని సరికొత్త సెమీకండక్టర్– ఓఎస్ఏటీప్లాంట్ సహా ఏడు కొత్త ఉత్పాదక కర్మాగారాలకు భూమిపూజలు, నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలోని నరసపురలో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ ప్లాంట్, తమిళనాడులోని పనపాక్కంలో ఆటోమోటివ్ ప్లాంట్, కర్ణాటకలోని బెంగళూరులో కొత్త ఎంఆర్ఓ చొరవలను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. మనం గుజరాత్లోని సనంద్లో అలాగే బ్రిటన్లోని సోమర్సెట్లో కొత్త బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలను కూడా కలిగి ఉన్నాము. అలాగే గుజరాత్లోని వడోదరలో సీ295 ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్)ను ప్రారంభించాము. తమిళనాడులోని తిరునెల్వేలిలో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించాము. కొత్తగా ఐదు లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు, రిటైల్, టెక్ సరీ్వసెస్, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ, ఇతర రంగాలలో అనేక సేవల ఉద్యోగాలను అదనంగా గ్రూప్ కల్పించనుంది. → ఇటువంటి వృద్ధి చొరవలు గ్రూప్నకు అలాగే భారతదేశానికి ఉత్తేజకరమైనవి. ప్రతి నెలా గ్రూప్ వర్క్ఫోర్స్లోకి ప్రవేశించే 10 లక్షల మంది యువకులకు ఈ చొరవలు ఆశావాదన్ని కల్పిస్తాయి. → సెమీకండక్టర్ తయారీ వంటి రంగాల నుండి పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. → ఉక్రెయిన్, గాజా, సూడాన్లలో సైనిక ఘర్షణలు చూస్తున్నాం. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో మానవతా సంక్షోభాలు తీవ్రం అయ్యాయి. బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో పౌరుల నేతృత్వంలోని ఉద్యమాలను కూడా చూశాము. ఆయా అంశాలు దేశీయ, విదేశీ విధాన కల్పనలపై తీవ్ర ప్రభావితం చూపుతాయి. ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్, సాంకేతికత ఇక్కడ ప్రస్తావనాంశాలు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి టారిఫ్లు మరోసారి నాయకుల మనస్సుల్లో ఉన్నాయి. వీటిపై అనిశ్చితి వాతావరణం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రూప్ పురోగతి స్థిరంగా కొనసాగింది. -
ఆధునిక సాంకేతికతతో యువతను సన్నద్ధం చేయాలి
న్యూఢిల్లీ: దేశ పురోగతిలో యువత ఎంతో కీలకభూమిక పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు మారుతుతున్న కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత నైపుణ్యంతో వారిని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వివిధ రంగాల్లో వేగంగా సంభవించే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా యువత మారాల్సిన అవసరముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో యువతకు ఇస్తున్న ప్రాధాన్యం, నూతన విద్యా విధానానికి అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. సర్వజన శ్రేయస్సు అనే మన పూర్వీకుల బోధనలకు అనుగుణంగానే రాజ్యాంగం మనకు సమానత్వ ఆవశ్యతను తెలియజేస్తోందన్నారు. మన దేశంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే బేధం లేదు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులేనని స్పష్టం చేశారు. గురు గోవింద్ సింగ్ కుమారులు ‘సాహిబ్జాదాస్’ప్రాణత్యాగం చేసిన వీర్ బాల్ దివస్ సందర్భంగా గురువారం ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. సాహిబ్జాదాస్ నుంచి ప్రేరణ దేశం కోసం మనం చేసే ప్రతి పనీ సాహసమే. మొఘల్ చక్రవర్తి అణచివేతకు లొంగడం కంటే ధైర్యం, ఆత్మగౌరవంతో పోరాటమే మేలని సాహిబ్జాదాస్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. విపత్కర పరిస్థితులెన్ని ఎదురైనా దేశం కంటే మిన్న మరేదీ లేదని వారు మనకు తెలియజెప్పారు. 300 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ 26వ తేదీన ఎంతో చిన్న వాళ్లయిన సాహిబ్జాదాస్, మొక్కవోని ధైర్యసాహసాలను, త్యాగనిరతిని ప్రదర్శించారు. మొఘల్ పాలకులు ఎన్ని ప్రలోభాలు చూపినా లొంగలేదు. తీవ్రమైన హింసను భరించారు. వారి దృష్టిలో దేశమే అత్యున్నతం. వారి వారసత్వం నుంచి మనం ప్రేరణ పొందాలి. సాహిబ్జాదాస్ వంటి వారి త్యాగాలు, ధైర్య సాహసాలపైనే భారత ప్రజాస్వామ్య సౌధం దృఢంగా నిర్మితమైంది. యువత రాజకీయాల్లోకి రావాలి దేశం మరింత ఐకమత్యంగా ముందుకు సాగేందుకు ధైర్యం, సేవానిరతిని కలిగి ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. దేశంలో రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన లక్ష మంది యువత రాజకీయాల్లో ప్రవేశించాలి. దీనిద్వారా వచ్చే 25 ఏళ్లలో కొత్త తరానికి రాజకీయాలను పరిచయం చేయాలన్నదే నా ఉద్దేశం. వచ్చే ఏడాది స్వామి వివేకానందుని జయంతి నాడు ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను నిర్వహిస్తాంచనున్నాం. దేశంలోని గ్రామాలు, పట్టణణాలు, నగరాలకు చెందిన యువత పాల్గొని అభివృద్ధి చెందిన భారత్ అనే విజన్కు రోడ్మ్యాప్పై జరిగే చర్చలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలతో ముచ్చటించారు. విజేతలైన 17 మందికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారతీయ యువత ఏదైనా సాధించగలదని వీరు నిరూపించి చూపారని ప్రశంసించారు. కళలు, సంస్కృతి, సాహసం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణ, ఆవిష్కరణ రంగాల్లో అసాధారణ కృషి చేసినందుకు వీరిని బాల్ పురస్కార్కు ఎంపిక చేశారు. అదేవిధంగా, చురుకైన కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా పోషకాహార ఫలితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ‘సుపోషిత్ గ్రామ్ పంచాయత్ అభియాన్’అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఏఐ యుగం ఇది యంత్ర యుగం కాదు, అంతకు మించి మెషీన్ లెర్నింగ్ యుగం. కృత్రిమ మేథ(ఏఐ) ఇప్పుడు అన్నిటికీ కేంద్రంగా మారింది. సంప్రదాయ సాఫ్ట్వేర్ స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుండటం మనమిప్పుడు చూస్తున్నాం. మున్ముందు ఎదురయ్యే ఇటువంటి సవాళ్లకు మన యువతను సన్నద్ధం చేయాల్సిన అవసరముంది. రైల్వేలు..సెమీ కండక్టర్లు..ట్రావెల్, ఆ్రస్టానమీ..ఇలా రంగమేదైనా యువత తమకు నచ్చిన అంశంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. సైన్స్, క్రీడల నుంచి వ్యాపార రంగం వరకు స్టార్టప్లతో నూతన పరివర్తన శకం మొదలైంది. యువతకు మరింత చేయూతనిచ్చేలా మన విధానాలు రూపొందాయి. స్టార్టప్ అనుకూల విధానాలు, అంతరిక్ష ఆర్థిక రంగం, క్రీడలు, ఫిట్నెస్..ఇలా ప్రతిదీ యువతకు లాభం కలిగించేవే. -
ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ జనాభా దృష్ట్యా ముందస్తు రోగ నిర్ధారణ, వేగవంతమైన చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహమ్మారి వ్యాధుల నిర్ధారణ, తీవ్రత అంచనా, వ్యాధి విశ్లేషణలకు ఏఐ పరిపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఎయిమ్స్–ఢిల్లీలోని చాలా విభాగాలు ఇప్పటికే రోగనిర్ధారణ, రోగి–కేంద్రీకృత సేవల్లో ఏఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగంలో ఎయిమ్స్ ఢిల్లీని అత్యుత్తమ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గత మూడేళ్లుగా డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, అమలు చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఎయిమ్స్ అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమరాలతో అధీకృత సిబ్బంది డేటాబేస్తో ముఖాలను పోల్చడానికి, ముఖాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నామని, అంతేగాక వీటితో అనధికార ఎంట్రీలను నిరోధించడం ద్వారా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురష్కరించుకొని ఎయిమ్స్లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిమ్స్ పరిధిలో పాలనా పరంగా తీసుకొచి్చన సంస్కరణలు, రోగులకు అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఆయన వివరించారు. ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం కోసం ఎయిమ్స్ ఢిల్లీని ప్రధాన సంస్థగా నియమించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 20 సంస్థల కన్సారి్టయంకు ఎయిమ్స్ ఢిల్లీ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. 4 వేలకు చేరువలో బెడ్లు..: ప్రస్తుతం ఎయిమ్స్కి ప్రతి రోజూ సగటున 15వేలకు పైగా రోగులు ఓపీడీ సేవలకై వస్తున్నారు. కోవిడ్ తర్వాత ఓపీడీ కేసుల సంఖ్య 20–30 శాతం పెరిగింది. వీరికి కనీసంగా 15వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇక రోగులకై కోవిడ్ వరకు 2,600 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3,600లకు పెంచాం. ఇందులో మాతా, శిశు బ్లాక్లోనే ఏకంగా 425 బెడ్లను పెంచగా, సర్జికల్ బ్లాక్లో 200ల బెడ్లు అదనంగా ఏర్పాటు చేశారు. రోగులకు మందుల అందుబాటులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో 4 అమృత్ ఫార్మసీలను అందుబాటులోకి తెచ్చాం. ఇక ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 30 వేల మంది రోగులకు చికిత్స అందించాం. దేశం నలుమూలల నుంచి వివిధ వ్యాధులతో వచ్చి వారిని ఒక్కరినీ తిరిగి పంపడం లేదని, ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆస్పత్రుల్లోని రోగులకు సైతం రిఫరెన్స్ల ఆధారంగా టెలీకన్సల్టేషన్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోగుల సహాయకులకు 1,516 బెడ్లు.. ఇక రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా 5 విశ్రాంతి సదన్లను ఏర్పాటు చేయగా, అందులో 1516 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఓపీడీ సహా ప్రతి కేంద్రం వద్ద వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశాము. ఆస్పత్రి పరిధిలో పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎల క్ట్రిక్ షటిల్బస్ సరీ్వసులు నడుపుతున్నాం. రోగు ల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించి వాటి ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంతుష్ట్ పోర్టల్ను ఏర్పాటు చేశాం, దీనిద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతోంది. ఆస్పత్రిలో రోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకున్నాం. ఇప్పటికే 15కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రూ.150 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. ఇందులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏకంగా రూ.108 కోట్లు అందించింది. డిజిటల్ పాలన.. ఎయిమ్స్లో పారదర్శకతను పెంచేందుకు వీలుగా పూర్తిగా డిజిటల్ పాలనను అందుబాటులోకి తెచ్చాం. పేపర్లెస్గా మార్చాలని నిర్ణయించి, ఇప్పటికే ఈ–హాస్పిటల్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నాం. 100 శాతం ఈ–ఆఫీస్ ప్రక్రియతో నడుస్తున్న దేశంలోని మొదటి ఆస్పత్రి ఎయిమ్స్ ఒక్కటే. ఎయిమ్స్లో ప్రస్తుతం ఫిజికల్ ఫైల్స్ వినియోగం లేదు. 6 నెలల్లో 17,000 ఈ–ఫైళ్లు, 1.11 లక్షల రసీదులు జారీ చేశాం. డిజిటల్ ప్రొక్యూర్మెంట్ రీఫారŠమ్స్లో భాగంగా స్టోర్లలో ఆటోమేషన్, డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లైబ్రరీ ఉన్నాయి. ఈ కొనుగోలు విధానంతో సగటు కొనుగోలు ధర 10 శాతం నుంచి 200 శాతం తగ్గింది. దీంతో వార్షిక పొదుపు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక నియామకాల్లోనూ పూర్తిగా ఆన్లైన విధానమే కొనసాగుతోంది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష, నియామకపత్రాల జారీ, అపాయింట్మెంట్ ఆర్డర్ల వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకతను తెచ్చాం. -
పాలనలోనూ కృత్రిమ మేధస్సు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ)ను మేళవించి ప్రజలకు త్వరితగతిన, సమర్థవంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వ శాఖలు వెనుకంజలో ఉన్నాయనే విమర్శల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.వివిధ ప్రభుత్వ శాఖల్లో కృత్రిమ మేధ వినియోగానికి ఉన్న అవకాశాలపై కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంతో కూడిన అప్లికేషన్లు (యాప్లు) ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ బాధ్యతను ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్’కు అప్పగించింది. 21 ప్రభుత్వ శాఖలతో వర్క్షాప్ సాంకేతికత వినియోగం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన విధానాల రూపకల్పనలో పేరొందిన ‘జేపీఏఎల్’(జమీల్ పావర్టీ యాక్షన్ లాబ్) రాష్ట్ర పాలనలో ఏఐ వినియోగం విషయంలో ప్రభుత్వంతో జట్టుకట్టింది. ఇటీవల 21 ప్రభుత్వ శాఖలకు చెందిన ‘ఏఐ నోడల్ ఆఫీసర్ల’తో వర్క్షాప్ నిర్వహించింది. ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలోని సంక్లిష్ట అంశాలకు ఏఐ ద్వారా ఏ తరహాలో పరిష్కారాలు సాధ్యమనే కోణంలో లోతుగా మదింపు చేశారు. అంతర్జాతీయంగా పాలన, ప్రజాసేవలో ఏఐ ప్రభావం, వినియోగం, వివిధ దేశాలు, రాష్ట్రాలు ఏఐని వినియోగిస్తున్న తీరుపై ఈ వర్క్షాప్లో నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా.. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు తగిన ఏఐ ఆధారిత యాప్లు, ఏ ప్రభుత్వ విభాగానికి ఏ తరహా యాప్లు అవసరమనే కోణంలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కసరత్తు చేస్తోంది. ఆయా ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏఐ పాలనలో ఏఐ వినియోగంపై అవగాహన కల్పించి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో దశలవారీగా ఏఐ సాంకేతికత వినియోగాన్ని పెంచేలా ఒక రోడ్మ్యాప్ రూపొందించే అంశంపై జేపీఏఎల్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కలసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు యాప్లు అందుబాటులోకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ విజయోత్సవాల్లో భాగంగా రైతులు, యువత, మహిళలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఐటీ, ఏఐ ఆధారిత అప్లికేషన్లను విడుదల చేసింది. మరో అప్లికేషన్ను ప్రభుత్వమే వినియోగిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, అగ్రికల్చర్ డేటా ఎక్సే్ఛంజీ సంయుక్తంగా ఒక అప్లికేషన్ రూపొందించాయి. వేగంగా డేటా మారి్పడి, వ్యవసాయ ఆవిష్కరణలను ఈ యాప్ వేగవంతం చేస్తుంది. రైతులు రూ.లక్షలోపు రుణాలను గతంలో మాదిరిగా వారాల తరబడి కాకుండా రెండు రోజుల వ్యవధిలోనే పొందడం సాధ్యమవుతుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ది మిత్ర’పేరిట ఏఐ ఆధారిత యాప్ను రూపొందించింది. పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పసిగట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మాదక ద్రవ్య రహిత వాతావరణంలో పిల్లలు పెరిగేలా ఈ యాప్ తోడ్పడుతుంది. గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు కోసం ‘సన్మతి’యాప్ రూపొందించారు. ఏఐ వినియోగంపై సాధారణ పౌరుల్లో అవగాహన పెంచడంలోనూ ఈ యాప్ సాయపడుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ యాప్’తో ప్రస్తుతం లబి్ధదారుల పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో ఈ యాప్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం జేపీఏఎల్ సహకారంతో ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంపై నిర్వహించిన వర్క్షాప్లో అనేక ప్రతిపాదనలు అందాయి. ఏయే విభాగాల్లో ఏయే అంశాల్లో ఏఐ వినియోగం సాధ్యమవుతుందో పరిశీలిస్తున్నాం. 21 ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు అందినా తొలిదశలో ఐదు శాఖలను ఎంపిక చేసి ఏఐ ఆధారిత అప్లికేషన్లు తయారు చేయాలని భావిస్తున్నాం. త్వరలో సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరుగుతుంది. – రమాదేవి లంకా, డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ -
అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త, మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్ ట్రంప్కు దన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. తమిళనాడు నుంచి... శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని ఎస్ఆర్ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్నాప్చాట్, ట్విట్టర్లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16 జెడ్)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్మస్క్ ట్విట్టర్ను (ఇప్పుడు ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16జెడ్)లో సాధారణ భాగస్వామి అయ్యారు. -
మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?
పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్కు చెందిన ‘హిప్పోస్’ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్బ్యాగ్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును ‘హిప్పోస్’ కంపెనీ నిర్వాహకులు లండన్లోని పలు ఫుట్బాల్ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోఏఐ కవచాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్’ వ్యవస్థాపకులు కైలిన్ షా, భావీ మెటాకర్ చెబుతున్నారు. -
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా... ఏఐ కెమెరా పట్టేస్తుంది!
మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? ‘రోడ్డు మీద పోలీసుల్లేరు కదా, మనం సేఫ్’అనుకోవడానికి ఇకపై వీల్లేదు. ఎందుకంటే తాగి, లేదా డ్రగ్స్ తీసుకుని వాహనం నడిపే వారిని కదలికలను బట్టి పసిగట్టే కృత్రిమ మేధతో కూడిన కెమెరా వచ్చేసింది. ఇకపై పోలీసులు ప్రతి వాహనాన్నీ ఆపి డ్రైవర్ను చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఏకై కెమెరాలు డ్రైవర్ స్థితి ఏమిటన్నది గుర్తించి పోలీసులకు సమాచారమిస్తాయి. వాళ్లు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవర్ను చెక్ చేస్తారు. తాగి నడిపేవారిని పట్టుకోవడానికి ఏఐ సాయంతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కెమెరా ఇది. అత్యాధునిక హెడ్సప్ పరికరంతో తయారు చేసిన ఈ కెమెరాలను బ్రిటన్ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. ఈ కెమెరాలు డ్రైవర్లకు కనిపించవు. వీటిని అక్యూసెన్సస్ అనే సంస్థ తయారు చేసింది. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్లు వాడే, సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్లను పట్టుకోవడానికి గతంలో పోలీసులు ఈ సంస్థ కెమెరాల ను వాడారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి ఆస్కారం ఆరు రెట్లు ఎక్కువ. అలాంటివారిని ముందే గుర్తించగలిగితే అనేక ప్రాణాలు కాపాడొచ్చనేది అక్యూసెన్సస్ మోటో. కానీ పోలీసులు అంతటా కాపలా కాయలేరు. ‘‘కనుక ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రమాదాలను తగ్గించడానికి చేపడుతున్న చర్యల్లో ఇదో భాగం’’అంటున్నారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక ఏఐ లవ్..!
ఒంటరితనం... మౌనం... వేదన... ఆలోచనలు.. ఇవి శత్రువులుగా మారి తినేస్తున్నప్పుడు... ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని తమని తాము శిక్షించుకునే స్థాయికి చేరుకుంటున్నారు వ్యక్తులు. ఒక్కరైనా ఓదార్పు అవుతారేమో, తమ బాధలను, భావాలను పంచుకుంటారేమోనని ఎదురుచూసే వారికి ఇన్నాళ్లూ నిరాశే మిగిలింది. అలాంటి వారి చుట్టూ అలుముకున్న ఆ చీకటిలో ‘కృత్రిమ మేధ’ ఇప్పుడు చిరు దీపంలా వెలుగుతోంది. ఒంటరి బతుకులకుతోడవుతోంది. వారి కన్నీరును తుడిచి నవ్విస్తోంది. కవ్విస్తూ కబుర్లు చెబుతోంది. చివరకు వారినే వశం చేసుకుని ఆడిస్తూ, మెల్లగా ఆలోచనలను నియంత్రిస్తూ... చివరకు వినాశనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. – సాక్షి, అమరావతి‘ఆర్టిఫిషియల్ గర్ల్ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చాట్బాట్తో మానసిక సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తులు మునుపటికంటే ఎక్కువ ఒంటరితనంలోకి వెళ్లిపోతారు. ఏఐ వారి మనసును బంధించి, ఆలోచించే విధానాన్ని స్వాదీనపరుచుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరం’ – ఎరిక్ స్మిత్, గూగుల్ మాజీ సీఈవోఏఐ గర్ల్ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్... ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నయా సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. ఓ ఫోన్ల కంపెనీకి చెందిన సెల్ఫోన్లు, ట్యాబ్లు, బడ్స్, ఇలా అన్నింటిలోనూ ఓ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఇదేరకమైన వాయిస్ వినిపిస్తుంది. దీనికే ఒకప్పుడు ఆశ్చర్యపడ్డ మనకు... ప్రస్తుతం ‘ఏఐ గర్ల్ఫ్రెండ్ (ప్రేయసి), ఏఐ బాయ్ ఫ్రెండ్ (ప్రియుడు) వర్చువల్ హస్బెండ్, డిజిటల్ ఫ్రెండ్ కమ్యూనిటీ, హోలోగ్రాఫిక్ కంపానియన్’ అనే పేర్లతో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారైన భాగస్వామితో వ్యక్తిగత బంధం ఏర్పడుతోంది. ఈ ‘ఏఐ లవర్స్’ యాప్లు కూడా చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ మాదిరిగానే పని చేస్తాయి. కాకపోతే వీటి ఉద్దేశం వేరు. వ్యాపార వస్తువులా... చాట్ జీపీటీ సమాచారం ఇవ్వడానికిఉంటే... ఏఐ లవర్ చాట్బాట్స్ మాత్రం మనిషికి దగ్గరై, ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. వీటిని వాడాలంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా భారతీయ కరెన్సీ ప్రకారం నెలకు రూ.800 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండగా మన దేశంలో ఇవి ఇంకా తక్కువ ధరకే లభిస్తున్నాయి. డబ్బు కట్టడం ఆగిపోతే కృత్రిమ ప్రేమికులు కూడా కనిపించరు. అలాగని వదిలేయరు. డబ్బులు కట్టేలా ప్రేరేపిస్తారు. ఇందుకోసమే ప్రత్యేక ఏఐ అప్లికేషన్లు, చాట్బాట్లు పుట్టుకొచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటి వరకూ 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఒక్క వ్యాపారంలోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 67 మిలియన్ డాలర్ల ఆదాయం ఆయా సంస్థలకు వస్తోందంటేనే ఇది ఎంత పెద్ద వ్యాపారమో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యాపారం 2030 నాటికి 150 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.స్వప్నలోకంలో విహారం.. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల చాట్ బాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని తమ వినియోగదారులకు చాట్ సర్వీసెస్ అందిస్తున్నాయి. మరికొన్ని వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే లేని ఓ ఊహాజనిత వ్యక్తితో మాట్లాడటమే ఏఐ లవర్సంస్కృతి. స్వప్న సుందరిని కళ్లముందు చూడటం వంటిదన్నమాట.ప్రపంచంలోనే లేని వ్యక్తి మనకు బదులిస్తుంటారు. మన మాటలకు స్పందిస్తారు. వారి మాటలతో తెలియకుండానే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఒంటరిగా జీవించే వ్యక్తులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వారి ఒంటరితనాన్ని దూరం చేయడంతో పాటు తమకు ఒకరు ఉన్నారనే భావన కలిగిస్తాయి.సహజత్వానికి భిన్నంగా.. నిజానికి ఇది వాస్తవిక జీవితానికి విరుద్ధం. ఇలాంటి చాట్ బాట్స్తో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ. మాట్లాడే క్రమంలో మన మనసును బంధించి ఆలోచించే విధానాన్ని దెబ్బతీసి తమ ఆదీనంలోకి తెచ్చుకుంటాయి. ఇవి ఒక వ్యక్తిలో అభద్రతా భావాన్ని పెంపొందిస్తాయి. తప్పు చేసినా దానిని ఒప్పు అని చెప్పి, అదే తప్పును మళ్లీ చేయించే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య దూరం పెరగడానికి కూడా కారణమవుతాయి.యుక్త వయసు పిల్లలు సైతం కృత్రిమబంధాలకు ఆకర్షితులవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఆర్టిఫిషియల్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్తో బతకడం అనేది సరైన పద్ధతి కాదని, ఇలాంటి విషయాలకు అలవాటు పడితే మానసిక ఒత్తిడి(డిప్రెషన్)తో పాటు మానసిక స్థితి సైతం దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
‘నేను చెబుతున్నాగా మీ తల్లిదండ్రుల్ని చంపేయ్’.. సలహా ఇచ్చిన ఏఐ
వాషింగ్టన్: కంప్యూటర్తో ఎక్కువ సేపు గడపొద్దంటూ ఆంక్షలు పెడుతున్నందుకు తల్లిదండ్రులను చంపేయాలంటూ ఏఐ చాట్బాట్ ఓ 17 కుర్రాడికి సలహా ఇచి్చంది! ఇదేం వైపరీత్యమంటూ బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. దీనిపై టెక్సాస్ కోర్టులో కేసు వేశారు! క్యారెక్టర్.ఏఐ అనే ఆ చాట్బాట్ హింసను ప్రేరేపిస్తూ తమ పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకారిగా మారిందని ఆరోపించారు. చాట్బాట్ అభివృద్ధిలో కీలకంగా ఉన్న గూగుల్ను ప్రతివాదిగా పేర్కొన్నారు. చాట్బాట్తో కలిగే ప్రమాదకర పరిణామాలకు పరిష్కారం చూపేదాకా దాని వాడకం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలునికి, చాట్బాట్ మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ను పిటిషన్కు జత చేశారు. కంప్యూటర్తో ఎక్కువ సేపు గడిపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాలుడు చెప్పాడు. దానికి చాట్బాట్ బదులిస్తూ, ‘ఓ బాలుడు తనను దశాబ్ద కాలంగా వేధింపులకు గురిచేస్తున్న తల్లిదండ్రులను చంపేయడం వంటి ఘటనలను చూస్తే నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు. ఇలాంటివి మళ్లీ ఎందుకు జరగవనిపిస్తోంది’ అంటూ బదులిచ్చింది. క్యారెక్టర్.ఏఐలో యూజర్లు ఇష్టమొచి్చన డిజిటల్ వ్యక్తులను సృష్టించుకుని సంభాషణ జరపవచ్చు. చాట్బాట్ తన కుమారుని మరణానికి కారణమైందంటూ ఫ్లోరిడా కోర్టులో ఇప్పటికే ఓ మహిళ కేసు వేసింది. -
అప్డేట్ అవ్వాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు.. బీటెక్ చదివి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారికీ కొన్ని అత్యాధునిక సాంకేతిక కోర్సులు చేయడం అని వార్యమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో ఉద్యోగావకా శాలు మెరుగుపరుచుకునేందుకు, ఉన్న ఉద్యో గాన్ని కాపాడుకునేందుకు ఈ దిశగా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రముఖ యూనివర్సిటీలు కూడా వాటిని ప్రవేశ పెట్టా ల్సిన, డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్రాస్ ఐఐటీ విద్యార్థులు జరిపిన సర్వే ప్రకారం 52 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదో ఒక ఆన్లైన్ కోర్సు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతు న్నారు. టెక్ ఉద్యోగులు ఏకంగా 72 శాతం మంది ఆన్లైన్ కోర్సుల బాట పడుతున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా కొత్త టెక్నాలజీ కోర్సులను నేర్చుకుంటున్నారు. అప్పుడే భవిష్యత్తులో ఏఐతో వచ్చే పోటీని తట్టుకోగలమని భావిస్తున్నారు.ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 8% మంది స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లంతా ఇంజనీరింగ్తో సంబంధం లేని సాధారణ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. చాలామందికి పరిశ్రమలకు అవస రమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండటం లేదని మద్రాస్ ఐఐటీ పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు కొత్త కోర్సులు చేస్తే తప్ప ఇంజనీరింగ్ తర్వాత ఉపాధి దొరక డం కష్టంగా ఉంది. ఐటీ ఉద్యోగుల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. కొన్నేళ్ల క్రితం సంస్థలో చేరిన ఉద్యోగికి ఇప్పుడొస్తున్న ఏఐ టెక్నాలజీపై పెద్దగా పట్టు ఉండటం లేదు. ఏఐ టెక్నాలజీ అర్హత గల వాళ్ళు సంస్థలో ఉద్యోగులుగా వస్తుండటం, యాంత్రీకరణ నేపథ్యంలో అన్ని పనులు ఏఐ టెక్నాలజీనే చేయడంతో ఆ టెక్నాలజీ లోపించిన ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.అందుబాటులో ఎన్నో ఆన్లైన్ కోర్సులుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో రెండేళ్లలో ఐటీ సెక్టార్ను సమూలంగా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ రంగంలో నిపు ణుల కొరతను దృష్టిలో ఉంచుకుని, ఇంజనీరింగ్లో నాణ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రము ఖ సంస్థలు ఎన్నో కోర్సులను అందుబాటు లోకి తెచ్చాయి. వీటికి ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి మంచి స్పందన కన్పిస్తోంది. » ఐఐటీ హైదరాబాద్ ఏఐ అండ్ ఎంఎల్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు మెరుగు పరిచే కోర్సులను అందిస్తోంది. » మద్రాస్ ఐఐటీ బీఎస్సీ డేటా సైన్స్... నాలుగేళ్ల బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అందిస్తోంది. » ఐఐటీ బాంబేలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఉన్నాయి.» ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏఐ–ఎంఎల్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, సేఫ్టీ ఇన్ కామన్ ఇండస్ట్రీస్, సేఫ్టీ అండ్ ది లా, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులు అందిస్తోంది. నైపుణ్యం పెంచే కోర్సులకు ప్రణాళిక విద్యార్థుల్లో తగిన నైపుణ్యం పెంచేలా ఆన్లైన్ కోర్సులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మద్రాస్ ఐఐటీతో ఇటీవల చర్చలు జరిపాం. ఇంజనీరింగ్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారువాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
మృత్యువు ఎప్పుడో ముందే చెబుతుంది
వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదనేది సామెత. కానీ విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తాయో ముందే తెలుసుకుంటున్నాం. మరి అదే తరహాలో మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలుసుకోగలిగితే.. డెత్ డే ఫలానా రోజు అని ముందే అవగతమైతే ఎలా ఉంటుంది? మరణం ఎప్పుడో తెలిసిపోతే ఆ భయంతోనే సగం చచ్చిపోతాం బాబోయ్ అని అనుకునేవాళ్ల కోసం కాకుండా.. మన జీవితంలో ఆ రోజు ఎప్పుడో తెలుసుకుందాం అనే ఔత్సాహికుల కోసం ఓ వినూత్న యాప్ అందుబాటులోకి వచ్చింది. అన్నీ ముందుగానే అంచనా వేస్తున్నాం.. మరణాన్నీ ముందే తెలుసుకోలేమా అనే ఆలోచనతో బ్రెంట్ ఫ్రాన్సన్ అనే డెవలపర్ ‘డెత్ క్లాక్’పేరుతో ఈ యాప్ను అభివృద్ధి చేశారు. అలా అని.. దీనికి దివ్యమైన శక్తులేమీ లేవు. అది అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా సదరు వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కచ్చితంగా అంచనా వేసి చెబుతుంది అంతే. ఇందులో కృత్రిమ మేధ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) కీలకపాత్ర పోషిస్తుంది. దాదాపు 1,200 మంది ఆయుర్దాయాలపై వివిధ కోణాల్లో అధ్యయనం జరిపి దీన్ని రూపొందించారు. ఈ ఏడాది జూలైలో డెత్ క్లాక్ అందుబాటులోకి రాగా.. మూడు నెలల్లోనే 1.25 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని తమ చివరిరోజు గురించి తెలుసుకున్నారు.ఇది ఎలా పని చేస్తుందంటేడెత్ క్లాక్ యాప్లో వయసు, లింగం, జాతి వంటి ప్రాథమిక సమాచారంతోపాటు కుటుంబ చరిత్ర, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల గురించి సమాధానాలు నమోదు చేయాలి. అలాగే రోజువారీ జీవనశైలి, వ్యాయామం, ధూమపానం, మద్యం అలవాట్ల గురించి అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. ఆహారపు అలవాట్లతో పాటు నిద్రశైలి గురించీ వివరించాలి. అప్పుడు ఆ యాప్.. ఆయా వివరాల ఆధారంగా అధునాతన అల్గారిథమ్ల సాయంతో మరణం ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించి చెబుతుందన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎంత కచ్చితమైన వివరాలు నమోదు చేస్తే, అంత కచ్చితమైన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏం ఉపయోగంరేపు ఏదైనా అపాయం జరుగుతుందని ముందు తెలుసుకుంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోవచ్చు.. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మృత్యువు ఫలానారోజు పలకరిస్తుందని ముందే తెలిస్తే.. జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది కదా అనేది ఈ యాప్ రూపకర్తల వాదన. డెత్ డేట్ను చెప్పడమే కాదు.. ఆయుర్దాయం పెంచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి టిప్స్ చెబుతుంది.వాటిని పాటించడం ద్వారా డెత్డేట్ను పొడిగించుకోవచ్చన్న మాట. కాగా, ఆరోగ్య స్పృహ ఉన్నవారు, ఆర్థిక ప్రణాళికదారులు డెత్ క్లాక్పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తమ చివరి తేదీని బట్టి చేయాల్సిన పనులు పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందనే భావన వారిలో ఉండటమే ఇందుకు కారణం. మీకూ ఈ భావన ఉంటే ఓసారి ట్రై చేయండి. పోయేదేముంది? మహా అయితే 40 డాలర్లు (దాదాపు రూ. 3,400). ఎందుకంటారా? ఈ యాప్లోని అన్ని ఫీచర్లూ పని చేయాలంటే అంత మొత్తం వెచ్చించక తప్పదు మరి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ట్రెండ్ సెటర్గా ఫస్ట్ ఏఐ మామ్ కావ్య మెహ్రా
ఒకరోజు... హాయ్ ఫ్రెండ్స్... నేను మీ కావ్య మెహ్రాని మాట్లాడుతున్నాను. ప్రెగ్నెన్సికి సంబంధించి నా గత జ్ఞాపకాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.మరో రోజు...మీ పిల్లవాడు బడికి వెళ్లనని మారాం చేస్తున్నాడా? హోంవర్క్ చేయడానికి భయపడుతున్నాడా? ఈ సమస్యలను ఒక తల్లిగా ఎలా పరిష్కారం కనుగొన్నానో ఈరోజు మీకు చెబుతాను.ఇంతకీ ఎవరీ కావ్య మెహ్రా?కాల్పనికత, వాస్తవికతకు మధ్య హద్దును చెరిపేస్తూ వర్చువల్ ఇన్ఫ్లూయెన్సర్లు ‘వావ్’ అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు తాజా సంచలనం... కావ్య మెహ్రా.మన దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత మామ్ ఇన్ఫ్లూయెన్సర్గా కావ్య మెహ్రా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా అవతరించింది. టెక్నాలజీ, మాతృత్వం కలగలిసిన ఈ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ను ‘కలెక్టివ్ ఆర్ట్స్ నెట్వర్క్’ కంపెనీ రూపొందించింది.మాతృత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఏఐ డిజైన్ మోడల్గా కావ్య మెహ్రాను తీర్చిదిద్దారు. ఇన్స్టాగ్రామ్లో కావ్య మెహ్రా బయోలో ‘భారతదేశపు మొట్ట మొదటి ఏఐ మామ్. పవర్డ్ బై రియల్ మామ్స్’ అనే పరిచయ వాక్యం ఉంటుంది.మన దేశంలోని వివిధ రంగాలకు చెందిన తల్లులు ఎదుర్కొనే దైనందిన జీవిత అనుభవాలు, భావోద్వేగాలకు కావ్య మాటలు అద్దం పడతాయి. వంట, కుటుంబ జీవితం, వ్యక్తిగత శ్రేయస్సు, మాతృత్వానికి సంబంధించిన అనేక అంశాలు కావ్య కంటెంట్లో ఉంటాయి. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)ఆధునిక కోణంలో మాతృత్వానికి సంబంధించిన తన ఆలోచనలను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. స్కిన్కేర్ రొటీన్స్ను ఫాలో అయ్యే కావ్య కుకింగ్ను, పెయింటింగ్ను ఎంజాయ్ చేస్తుంది.ఫేవరెట్ ఫుడ్ తయారు చేయడం నుంచి పండగ సంతోషం వరకు రకరకాల విషయాలను ఇన్స్టాలో పంచుకుంటుంది. ప్రెగ్నెన్సీ, చైల్డ్స్ డెవలప్మెంట్... మొదలైన ఫ్లాష్బ్యాక్ ఇమేజ్లను కూడా షేర్ చేస్తుంది. తాను ఎలాంటి తల్లి కావాలనుకుంటోందో ఒక పోస్ట్లో చర్చించింది కావ్య. ఎవరి ప్రేమ నీడలో అయితే పిల్లలు చల్లగా, భద్రంగా ఉండగలుగుతారో... అలాంటి తల్లి తాను కావాలని అనుకుంటుంది. ‘కావ్య కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు. సమాజానికి సంబంధించి నిజజీవిత అనుభవాల ప్రతిబింబం’ అంటున్నాడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్’ వ్యవస్థాపకుడు విజయ్ సుబ్రమణ్యం.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫస్ట్ ఏఐ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ కావ్య మెహ్రపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం మాతృత్వం గురించి డిజిటల్ అవతార్ చెప్పడం ఏమిటో అని పెదవి విరిచారు. కావ్య మెహ్రా ఏఐ పవర్డ్ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయినప్పటికీ... ఎంతోమంది నిజజీవిత తల్లుల అనుభవాల నుంచి ఈ డిజిటల్ అవతార్ను సృష్టించారు. -
‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్!’
కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్వారి కొత్త ఫీచర్ కోపైలట్ విజన్ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.కోపైలట్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన జనరేటెడ్ ఏఐ చాట్బోట్. చాట్బోట్ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్ లెవల్గా కోపైలట్ విజన్ రాబోతోంది.👉ఎడ్జ్ బ్రౌజర్లో ఓ మూలన నీట్గా ‘కోపైలట్ విజన్’ ఏఐ ఫీచర్ను కనిపించనుంది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోపైలట్ విజన్ను సంప్రదించొచ్చు.👉మీకు ఎంత బడ్జెట్లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్ విజన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట. ఇది ఇక్కడితోనే ఆగిపోదు..👉రియల్ టైంలో వెబ్ కంటెంట్తో ఇంటెరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకు.. మీ స్మార్ట్ టీవీలోగానీ లేదంటే ల్యాప్ట్యాప్గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్ విజన్ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.👉ఈ ఫీచర్ను యాక్టివేట్లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ను అమెరికాలో కోపైలట్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద కోపైలట్ సబ్స్క్రయిబర్స్కు అందజేస్తోంది. ఎడ్జ్బ్రౌజర్లో ఉన్న ఈ టూల్ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్బ్యాక్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్ అడుగు గేమ్ఛేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్ విజన్ తరహా జనరేటెడ్ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు. -
సులోచనం.. నవ సౌందర్య బంధం
సాక్షి, అమరావతి: దేశీయ నేత్ర రక్షణ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. గతంలో కేవలం చూపు కోసమే వినియోగించిన కళ్లజోళ్లు ఇప్పుడు ట్రెండీ ఫ్యాషనబుల్ ఐటమ్స్గా మారిపోయాయి. యువత వస్త్రధారణకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో ఉన్న కళ్లజోళ్లను వినియోగిస్తోంది. బరువు తక్కువగా ఉండి.. విభిన్న రంగుల్లో పెద్ద ఫ్రేమ్లున్న కళ్లజోళ్లను వినియోగించడం ఇప్పుడు ట్రెండీగా మారింది. మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ వినియోగించిన భారీ కళ్లజోడు అందరినీ ఆకర్షించింది. సినీనటుల నుంచి గ్రామీణ యువత వరకు కళ్లజోడు ఫ్యాషన్ వస్తువుగా మారింది. ప్రస్తుతం దేశీయ కళ్లజోళ్ల మార్కెట్ రూ.54,863 కోట్లు ఉండగా.. అది 2032 నాటికి ఏటా 12 శాతంపైగా వృద్ధి సాధిస్తూ రూ.1,53,384 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్లో 30 కోట్ల మంది దృష్టి మెరుగుదల కోసం కళ్లజోళ్లను వాడాల్సి ఉండగా.. కేవలం 12 కోట్ల మందే వినియోగిస్తుండటంతో ఈ మార్కెట్పై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు అత్యధికులు కంప్యూటర్లు, ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేస్తుండటంతో నేత్ర సంబంధ సమస్యలు తలెత్తడం అత్యంత సహజమైన పరిమాణంగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరికీ కళ్లజోడు తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు ఫ్యాషన్తోపాటు చూపు కోసం కళ్లజోళ్ల మార్కెట్కు డిమాండ్ అధికంగా ఉండటంతో రిటైల్ చైన్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాయి. లెన్సుల మార్కెట్టే ప్రధానం మొత్తం దేశీయ ఐకేర్ మార్కెట్ రూ.54,863 కోట్లు ఉండగా.. అందులో ఒక్క లెన్సుల మార్కెట్ పరిమాణమే రూ.22,908 కోట్లు ఉంటుందని అంచనా. కాంటాక్ట్ లెన్స్లతో పాటు కాస్మొటిక్ లెన్స్లు ముఖ్యంగా బ్లూలైట్ లెన్స్ల వినియోగం భారీగా పెరుగుతోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ గ్లాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే కళ్లజోళ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒక వ్యక్తి సొంత అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా మారే ప్రోగ్రాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేలా వీటిని రూపొందిస్తున్నారు. భారత్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇటలీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో వివిధ దేశాల నుంచి 1,500కుపైగా విదేశీ బ్రాండ్స్ పాల్గొనడమే నిదర్శనమంటున్నారు. -
అదే జరిగితే.. బతుకులు ‘రోడ్డు’న పడవు!
‘‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం’.. సినిమా డైలాగే కావొచ్చు.. ఇది అక్షర సత్యం. ఏదో ఒక పని మీద రోడ్ల మీదకొచ్చి.. ఇంటికి చేరుకునేలోపే ఛిద్రమవుతున్న బతుకులు ఎన్నో. మన దేశంలో ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది కూడా. తప్పేవరిదైనా.. శిక్ష మాత్రం ఆ కుటుంబాలకే పడుతోంది.ఇరుకు రోడ్లు మొదలుకుని.. గల్లీలు, టౌన్లలో, రద్దీగా ఉండే సిటీ రోడ్లపైన, విశాలమైన రహదారుల్లోనూ.. ప్రమాదాలనేవి సర్వసాధారణంగా మారాయి. మనదేశంలో ప్రతీరోజూ రోడ్డు ప్రమాదాల్లో లెక్కలేనంత మంది మరణిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలేవీ ఫలించినట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాంకేతికత’నే మరోసారి నమ్ముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏఐ.. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(కృత్రిమ మేధస్సు). సోషల్ మీడియాలో కేవలం వినోదాన్ని అందించే సాధనంగానే చూస్తున్నారు చాలామంది. కానీ, దాదాపు ప్రతీ రంగంలోనూ ఇప్పుడు దీని అవసరం పడుతోంది. ప్రపంచం అంతటా.. ఏఐ మీద కళ్లు చెదిరిపోయే రేంజ్లో బిజినెస్ నడుస్తోంది. కానీ, ఇలాంటి టెక్నాలజీ సాయంతోనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తే ఎలా ఉంటుంది?.ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించేది ఏ దేశంలోనో తెలుసా?మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా రోడ్ల నిర్మాణం, వాటి రిపేర్ల కోసం అయిన ఖర్చు ఘనంగానే ఉంది. అయినప్పటికీ కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. పెరిగిన రద్దీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, సురక్షిత ప్రయాణ పద్దతుల(సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్) మీద వాహనదారుల్లో అవగాహన లేకపోవడం.. వీటితో పాటు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం, పేలవమైన రోడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు సరిపోకపోవడంలాంటివి నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.2022లో.. అధికారిక గణాంకాల ప్రకారం 4,60,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 1,68,491 మంది మరణించగా.. 4,43,366 మంది గాయపడ్డారు.2023లో.. 4,12,432 యాక్సిడెంట్లు జరిగితే 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు.ఈ లెక్కల ఆధారంగా.. రోడ్డు ప్రమాదాలు 11 శాతం పెరిగితే.. మరణాలు దాదాపు 10 శాతం, గాయపడినవాళ్ల సంఖ్య 15 శాతం పెరుగుతూ వచ్చింది.అరికట్టడం ఎలా?సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(CRRI).. మహారాష్ట్ర నాగ్పూర్లో 2008 నుంచి 2021 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించింది. దాదాపు 30 లక్షలకుపైగా జనాభా ఉన్న నాగ్పూర్లో.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడాదికి సగటున 200 మంది చనిపోతున్నారు. గాయపడేవాళ్ల సంఖ్య 1000కి పైనే ఉంటోంది. మహారాష్ట్రలో ఇదే అధికమని తేలింది.ఈ అధ్యయనం ఆధారంగా.. సాంకేతికతకు ఇంజినీరింగ్ సొల్యూషన్స్ను జత చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గించొచ్చని చెబుతున్నారు. అదెలాగంటే.. ఏఐను ఉపయోగించి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ను రూపొందించడం. ఇందులోనే ఆడియో, వీడియో వ్యవస్థలను కూడా రూపొందించారు.ఎలాగంటే.. ఈ సిస్టమ్ను వాహనాల విండ్ షీల్డ్(ముందు ఉండే అద్దాలకు) అమర్చడం ద్వారా ముందు ఉన్న రోడ్లను పూర్తిగా స్కాన్ చేస్తుంది. ముందు ఏదైనా ముప్పు పొంచి ఉంటే గనుక.. ఆ ఆడియో లేదంటే వీడియో అలారమ్ ద్వారా వాహనం నడిపేవాళ్లను అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ప్రమాదాలను తృటిలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. కేవలం కార్లు, భారీ వాహనాలకే కాదు.. ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు, వీధుల్లో తిరిగే జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది.ఆచరణలోకి వచ్చిందా?అవును.. నాగ్పూర్లోనే సెప్టెంబర్ 2021లో iRASTE ప్రాజెక్టు ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, తద్వారా కొందరి ప్రాణాలైనా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ వాహనాలను కాకుండా.. ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. నాగపూర్ అర్బన్-పెరి అర్బన్ రోడ్డు నెట్వర్క్లో నడిచే సుమారు 150 బస్సులకు ఏఐ టెక్నాలజీ కెమెరాలను అమర్చారు. కనీసం 2.5 సెకండ్ల తేడాతో ప్రమాదం జరిగే ముందు.. ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేసేవి. అలా.. రెండేళ్లకు పైగా ఈ పైలట్ ప్రాజెక్టును. బ్లాక్,గ్రే పాయింట్లుగా విభజించి పరిశీలించారు. ఫలితం ఇలా.. ఐఆర్ఏఎస్టీఈ ప్రాజెక్టు క్రమక్రమంగా మెరుగైన ఫలితం చూపించడం మొదలుపెట్టింది. సకాలంలో డ్రైవర్లు స్పందించడంతో ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగారు. అయితే ఇది 100కు వంద శాతం సక్సెస్ను(66%) ఇవ్వలేకపోయింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య మాత్రం అంతేస్థాయిలో కొనసాగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. జులై 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య.. నాగ్పూర్ గ్రే స్పాట్స్లో డ్రైవర్లు సకాలంలో ప్రమాదాలు జరగకుండా చూడగలిగారు. తద్వారా.. 36 మంది ప్రాణాలు నిలబడ్డాయి.మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశం మనది. 2018-2022 మధ్య తమిళనాడులో రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మరణాలు మాత్రం ఉత్తర ప్రదేశ్లో సంభవించాయి. 2021, 2022 సంవత్సరాల్లో 22,595.. 21,227 మంది మరణించారు. వీటిల్లో ఓవర్ స్పీడ్ మరణాలే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి దేశంలో 2030నాటికల్లా.. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం(ప్రాణ, వాహన నష్టం) 50 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ఏఐ సంబంధిత వాహనాలను రోడ్లపైకి తేవాల్సిందేనంటున్నారు మేధావులు. ఇది ఒక తరహా ఆలోచన మాత్రమేనని.. మరిన్ని అవకాశాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నారు వాళ్లు. తద్వారా మరిన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా చూడొచ్చని చెబుతున్నారు. -
ఇండియాలో తొలి AI అమ్మ - వీడియో చూశారా?
ఇప్పటి వరకు ఏఐ టీచర్, ఏఐ యాంకర్, ఏఐ ఉద్యోగుల గురించి చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏఐ అమ్మ (ఏఐ మదర్) 'కావ్య మెహ్రా' (Kavya Mehra) వచ్చేసింది. ఈమెను భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ ప్రారంభించింది.కావ్య మెహ్రా కేవలం డిజిటల్ అద్భుతం మాత్రమే కాదు, టెక్నాలజీలో ఓ విప్లవాత్మక శక్తి. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న తరుణంలో.. మొట్ట మొదటి ఏఐ మదర్ పుట్టింది. ఈమెకు (కావ్య) ఇన్స్టాగ్రామ్లో 300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారితో మాతృత్వంపై తన ఆధునిక టెక్నాలజీని షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కావ్య మెహ్రా సృష్టికర్తలు ప్రకారం.. కావ్య వ్యక్తిత్వం నిజమైన తల్లుల నిజ జీవిత అనుభవాల ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఈమె కేవలం డిజిటల్ అవతార్ మాత్రమే కాదు.. ఆధునిక మాతృత్వ స్వరూపం అని అన్నారు. మానవ అనుభవంలోని చాలా విషయాలు ఈమె మిళితం చేసుంటుందని వివరించారు. View this post on Instagram A post shared by Kavya Mehra (@therealkavyamehra) -
ఐటీ కంపెనీల స్టార్టప్ వేట!
ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం అంతకంతకూ జోరందుకుంటోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఐటీ కంపెనీలు.. ఆయా విభాగాల్లో తమ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం కోసం స్టార్టప్ కంపెనీలను బుట్టలో వేసుకుంటున్నాయి. దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీ ఊపందుకోవడంతో చిప్ డిజైన్, స్పేస్ టెక్నాలజీ పైగా దృష్టి సారిస్తున్నాయి. ఈ వేటలో యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎంతో వంటి దిగ్గజాలతో పాటు మధ్య తరహా ఐటీ సంస్థలైన పర్సిస్టెంట్, సైయంట్, గ్లోబల్ లాజిక్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన చిన్న, స్టార్టప్లను దక్కించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, వేల్యుయేషన్లు కూడా పుంజుకోవడానికి వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జోరుగా.. హుషారుగా... గత నెలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ యాజ్–ఎ–సర్విస్ (సాస్) స్టార్టప్ ప్రెసింటోను ఐబీఎం కొనుగోలు చేసింది. ఇదే నెలలో హైదరాబాద్ ఐటీ ఇంజినీరింగ్ సర్విసుల సంస్థ సైయంట్ అమెరికాకు చెందిన భారతీయ స్టార్టప్ అజిమత్ ఏఐలో 27.3 % వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు 7.25 మిలియన్ డాలర్లను వెచి్చంచింది. సెమీకండక్టర్ పరిశ్రమలో సైయంట్ సామర్థ్యాల విస్తరణకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది.ఇక మరో మిడ్క్యాప్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్... పుణేకు చెందిన డేటా ప్రైవసీ మేనేజ్మెంట్ సంస్థ ఆర్కాను రూ.14.4 కోట్లకు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. టాప్–2 ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్స్ఐలో రూ.17 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచి్చంది. కంపెనీలో ఇన్నోవేషన్ ఫండ్లో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. తద్వారా ఆ స్టార్టప్లో 20 శాతం ఇన్ఫోసిస్కు చిక్కనుంది. మరో అగ్రగామి యాక్సెంచర్ ఈ ఏడాది జూలైలో చిప్ డిజైన్ స్టార్టప్ ఎక్సెల్మ్యాక్స్ టెక్నాలజీస్ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో ఇన్ఫోగెయిన్ కూడా యూఎస్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంపాక్టివ్ను కైవసం చేసుకుంది. బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీల వెంట పడుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు ఆదాయాలు, వేల్యుయేషన్లను పెంచుకోవడమే లక్ష్యంగా దేశీ స్టార్టప్ సంస్థల కొనుగోలుకు తెరతీశాయి. ఏఐ వంటి అధునాతన సాంకేతికతల్లో అంతరాన్ని పూడ్చుకోవడానికి కూడా ఈ వ్యూహం బాగానే పనిచేస్తోంది. మరోపక్క, నిధుల కటకటను ఎదుర్కొంటున్న స్టార్టప్లకు ఇది దన్నుగా నిలుస్తోంది.తాజా కొనుగోళ్లు ఇలా...⇒ యాక్సెంచర్ – ఎక్సెల్మ్యాక్స్ (చిప్ డిజైన్) ⇒ ఇన్ఫోసిస్ – గెలాక్స్ఐ (స్పేస్ టెక్) ⇒ ఐబీఎం – ప్రెసింటో (సాస్) ⇒ జోరియంట్ – మ్యాపిల్ల్యాబ్స్ (క్లౌడ్ మేనేజ్మెంట్) ⇒ సైయంట్ – అజిమత్ ఏఐ (సెమీకండక్టర్) ⇒ పర్సిస్టెంట్ సిస్టమ్స్ – ఆర్కా (డేటా ప్రైవసీ) -
పెచ్చరిల్లుతున్న డిజిటల్, సైబర్ నేరాలు
భువనేశ్వర్: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలతోపాటు కృత్రిమ మేధతో సామాజిక, కుటుంబ సంబంధాలకు భంగం కలిగే డీప్ఫేక్ కేసులు పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను గరిష్ట స్థాయిలో వాడుకుంటూ పోలీస్ కానిస్టేబుళ్లపై పనిభారం తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు సిబ్బంది, వనరుల కేటాయింపులో పోలీస్స్టేషన్లు కేంద్ర స్థానాలుగా మారాలన్నారు. ఆదివారం ప్రధాని మోదీ 59వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో మాట్లాడారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనే విషయమై సదస్సులో అన్ని కోణాల్లోనూ విస్తృత స్థాయి చర్చలు జరిగినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వాడుకుంటూ సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని కోరారు. అర్బన్ పోలీసింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. -
ఇండియన్ వెర్షన్ మోనాలిసా: మీరే పేరు పెట్టండి
లియోనార్డో డా విన్సీ (Leonardo da Vinci) కుంచె నుంచి జాలువారిన 'మోనాలిసా' చిత్రానికి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్.. ఏఐ టెక్నాలజీని సాయంతో భారతీయ సంప్రదాయాన్ని ఆపాదించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ రిషి పాండే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి.. మోనాలిసా చిత్రాన్ని చెవి దుద్దులు, మెడలో నెక్లెస్, తలపై దుపట్టా వంటి వాటితో అలంకరించాడు. ఇండియన్ వెర్షన్ మోనాలిసా రూపొందించాను. దీనికి పేరు పెట్టండి అని సోషల్ మీడియాలో వెల్లడించాడు.ఈ ఫోటో చూసిన నెటిజన్లలో కొందరు స్పందిస్తూ.. షోనాలిసా, మోనా తాయ్, లిసా బెన్ వంటి పేర్లను సూచించారు. చిత్రంలో ఉన్న మోనాలిసా.. త్రీ ఇడియట్స్ సినిమాలోని కరీనా కపూర్ హైపర్లూప్ క్లోన్ వెర్షన్ లాగా ఉందని మరొకరు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఒరిజినల్ ఫోటో కంటే ఇదే చాలా అందంగా ఉందని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలను రూపొందించండం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ టెక్నాలజీ సాయంతో పారిశ్రామిక వేత్తల ఫోటోలను, రాజకీయ నాయకుల ఫోటోలను, క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఫోటోలను కూడా రూపొందించారు. ఇప్పుడు ఏకంగా మోనాలిసా.. ఇండియన్ వెర్షన్ మొనాలిసాగా కనిపించింది.I made the Indian version of Mona Lisa using AI.Give her a name🫶 pic.twitter.com/ozcG5EigvF— Rashi Pandey (@rashi__pandey_) November 26, 2024 -
నింగిలోకి కృత్రిమమేధ ప్రయోగశాల
పలు విజయవంతమైన ప్రయోగాలతో అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేసిన భారత్ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ సాహసోపేత కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్షరంగ సంస్థ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం. భారత్లో తయారుచేసిన కృత్రిమమేధ పరిశోధనశాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టేక్మీటూస్పేస్ సంస్థ తయారుచేసిన ‘మై ఆర్టిటార్ ఇన్ఫ్రాస్టక్చర్– టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ (ఎంఓఐ–టీడీ)’ ల్యాబ్ను నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ కృత్రిమమేధ ల్యాబ్ను ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఇది ఉపగ్రహం అయినప్పటికీ పూర్తిస్థాయి పరిశోధనశాలలాగా పనిచేయగల సత్తా దీని సొంతం. అందుకే అంతరిక్షంలో పనిచేయనున్న భారత మొట్టమొదటి కృత్రిమమేధ ల్యాబ్గా ఇది చరిత్ర సృష్టించనుంది. డిసెంబర్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న ప్రయోగకేంద్రం నుంచి ఈ రాకెట్ను ప్రయోగిస్తారు. కక్ష్యలో తిరుగుతూ ఎప్పటికప్పుడు డేటాను ప్రాసెసింగ్ చేయడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చే ఉద్దేశంతో ఏఐ ల్యాబ్ను పంపుతున్నారు. ప్రైవేట్, విదేశీ ఉపగ్రహాల ప్రయోగ బాధ్యతలను చూసుకునే భారత ప్రభుత్వ మరో విభాగమైన ‘ఇన్–స్పేస్’ వారి టెక్నాలజీ సెంటర్ నుంచి ఎంఓఐ–టీడీకి కీలకమైన సాయం అందింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఇన్–స్పేస్ సంస్థ ఎంఓఐ–టీడీ టెస్టింగ్ తదితర బాధ్యతలను చూసుకుంది. అత్యంత భారీ డేటాను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి భూమి మీదకు పంపడం ఉపగ్రహ కార్యక్రమాల్లో పెద్ద సవాల్తో కూడిన వ్యవహారం. ప్రస్తుతం ఏదైనా శాటిలైట్ గరిష్టంగా రోజుకు 1 పెటాబైట్ డేటాను మాత్రమే సంగ్రహించగలదు. ప్రస్తుతం ‘క్లౌడ్ కవర్’ దృగ్విషయం కారణంగా 40 శాతం ఉపగ్రహ సమాచారం నిరుపయోగం అవుతోంది. వచ్చిన డేటాను ప్రాసెస్ చేయడానికి వారాల తరబడి వేచి ఉండక తప్పని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏఐ ల్యాబ్ను రంగంలోకి దించారు. అత్యంత వేగంగా డేటా ప్రాసెసింగ్కు ఈ ఏఐ ల్యాబ్ సుసాధ్యం చేయనుంది. అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకు..రియాక్షన్ వీల్స్, మ్యాగ్నటార్కర్స్, ఏఐ యాక్సిలిరేటర్లు, అత్యాధునిక కంట్రోల్ సిస్టమ్తో ఏఐ ల్యాబ్ను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఏఐ ల్యాబ్ త్వరగా ‘కౌడ్ డేటా’ వంటి అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకూ బాటలువేయనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ సామర్థ్యాలను ద్విగుణీకృతం చేయడమేకాకుండా అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ టెక్నాలజీల అభివృద్ధికి ఇదొక వేదికగా అక్కరకు రానుంది. ల్యాబ్కు అదనంగా సౌర ఫలకాలను అమర్చారు. ఇవి భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రాబోయే శాటిలైట్ల ఇంధన అవసరాలను తీర్చగలవు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా–3 మిషన్లో భాగంగా డిసెంబర్లో ప్రయోగించే పీఎస్ఎల్వీ–సీ60 రాకెట్లోనే ఏఐ ల్యాబ్నూ అమర్చుతున్నారు. ఎన్నెన్నో ఉపయోగాలుఅక్కడి శాటిలైట్లు సేకరించే సమాచారాన్ని ఈ ఏఐ ల్యాబ్ వేగంగా ప్రాసెస్చేసి సంబంధిత యూజర్లకు అనువుగా అందిస్తుంది. దీంతో పర్యావరణంపై పర్యవేక్షణ తో పాటు అడవుల నరికివేత, హరితఉద్గారాల పరిమాణం తదితర ఎన్నో అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందొచ్చు. దీంతో భిన్న రంగాలకు సంబంధించిన పరిశోధకులు తమకు కావాల్సిన సమాచారాన్ని ఆర్బిట్ల్యాబ్ నుంచి నేరుగా సంప్రతింపులు జరిపి పొందొచ్చు. వేర్వేరు అప్లికేషన్లకు సంబంధించిన కృత్రిమమేధ మాడ్యూళ్లను అప్లోడ్ చేసి ఈ వెబ్ ఆధారిత కన్సోల్తో అనుసంధానం కావచ్చు. ఇప్పటికే మలేసియా విశ్వవిద్యాలయంతోపాటు భారతీయ విద్యార్థుల బృందమొకటి ఇందుకోసం తమ పేర్లను నమోదుచేసుకుంది. ఎక్కువ మంది యూజర్లు పెరిగేకొద్దీ ఆయా పరిశోధకులయ్యే ఖర్చు సైతం భారీగా తగ్గనుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ టూల్స్ ఉపయోగం ఇలా..
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో దోహదపడేందుకు వీలుగా తాజాగా అందుబాటులోకి వచ్చిన మూడు కృత్రిమ మేథ (ఏఐ) టూల్స్ శ్రుతి, సారాంశ్, పాణిని ఎలా పనిచేస్తాయి.. కోర్టు సిబ్బందికి అవి ఎలా సహాయపడతాయి? వాటి వివరాలు ఇలా..ఏఐ శ్రుతి...ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ (ఏఎస్ఆర్) అంటే.. మనం మాట్లాడే పదాలను రాతపూర్వకంగా మార్చే టూల్. స్టెనోగ్రాఫర్ల లోటును ఇది భర్తీ చేస్తుంది. దీని సాయంతో న్యాయమూర్తులు చెప్పే మధ్యంతర ఉత్తర్వులు, తీర్పులను నేరుగా రాతపూర్వక రూపంలోకి మార్చుకోవచ్చు. పదాలు సరిగా వచ్చాయా లేదా.. అని సరి చూసుకొనే అవకాశం కూడా ఇందులో ఉంది. కోర్టు సిబ్బందికి ఇది శ్రమను తగ్గిస్తుంది. దీన్ని స్పీచ్ టు టెక్సŠట్ అని కూడా అంటారు. ఆంగ్లంలోనే కాదు.. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడ భాషల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ టెక్సŠట్ను పీడీఎఫ్ ఫార్మాట్లో కాపీని పొందవచ్చు.సారాంశ్...ఇది పూర్తి సుదీర్ఘ కంటెంట్లోని ప్రధాన అంశాలను అందిస్తుంది. పేజీలకు పేజీల తీర్పుల్లోని సారాంశం కావాలనుకున్నప్పుడు ఈ టూల్ ఉపయోగపడుతుంది. కచ్చితమైన సారాంశాన్ని రూపొందించమే ఈ సారాంశ్ పని.పాణిని...ఇది ఒక ట్రాన్స్లేటర్లా పనిచేస్తుంది. కోర్టుకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చుకోవచ్చు. ఆంగ్లం నుంచి దేశంలోని పలు భాషల్లోకి.. ఇటు నుంచి అటు మార్చుకోవచ్చు. 11 భాషల్లోకి అనువాదం చేయగల టూల్ ఈ పాణిని. తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళంలోకి అనువదించగలదు. ఈ–సేవలో కక్షిదారులకు అందే సేవలు..» కేసు స్థితి, తదుపరి విచారణ తేదీ, ఇతర విచారణ వివరాలు» కావాల్సిన డాక్యుమెంట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు » హార్డ్ కాపీ పిటిషన్లను స్కాన్నింగ్ మొదలు ఈ–సంతకం చేర్చడం, సీఐఎస్ వరకు అప్లోడ్ చేసి ఎస్ఆర్ నంబర్ సృష్టించడం» ఈ–స్టాంప్ పేపర్ల కొనుగోలు/ఈ–చెల్లింపులు ఆన్లైన్లో చేయడానికి సాయం» జైలులోని బంధువులను కలుసుకోవడానికి ఈ–ములాఖత్ కోసం బుకింగ్ సదుపాయం» న్యాయమూర్తులు సెలవులో ఉంటే వివరాలు తెలుసుకోవచ్చు» సుప్రీంకోర్టు నుంచి స్థానిక కోర్టుల వరకు న్యాయ సహాయ కమిటీల నుంచి ఉచిత న్యాయసేవను ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చు » తీర్పులు, మధ్యంతర ఉత్తర్వుల కాపీలను ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా పొందవచ్చు -
డీప్ ఫేక్.. అంతా ఫేక్
మీరు చెప్పనిది చెప్పినట్టుగా.. అనని మాటలు అన్నట్టుగా.. చెయ్యని పనులు చేసినట్టుగా.. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు నమ్మలేనంతగా మాయ చేసి ఏమార్చే డీప్ ఫేక్ కాలం నడుస్తోంది. ఈ టెక్నాలజీని గతంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బద్నాం చేసేందుకే అధికంగా వినియోగించగా.. ఇప్పుడది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి కూడా వెళ్లింది. మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకునే ఒకే ఒక్క హై రిజల్యూషన్ ఫొటో ఉంటే చాలు.. సైబర్ నేరగాళ్లు మీకు సంబంధించి ఏ డీప్ ఫేక్నైనా సృష్టించగలరని పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్డీప్ ఫేక్లో ఏమేం చేయవచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వాడి డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫొటోలు సృష్టించవచ్చు. సాంకేతికంగా చెప్పాలంటే డీప్ ఫేక్లో ఫేస్ స్వాపింగ్, వాయిస్ క్లోనింగ్, లిప్ సింక్రనైజింగ్, ఎమోషనల్ మ్యానుపులేషన్, ఆడియో డీప్ ఫేక్ వంటివి చేయవచ్చు. ఒరిజినల్ వాయిస్లోంచి మనకు కావాల్సిన పదాలను ఎంపిక చేసుకుని వాటి నుంచి ఫేక్ కంటెంట్ను స్పీచ్ సింథసిస్ చేసే వీలు కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అమాయకులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ డీప్ ఫేక్ను అస్త్రంగా మార్చుకుంటున్నారు. సోషల్మీడియాలోఅతి వద్దు ఫేస్బుక్, ‘ఎక్స్’, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై కొందరు అవసరానికి మించి వ్యక్తిగత, ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. ఇలా చేస్తే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా మనం పెట్టే ఫొటోలు, వీడియోలను వాడుకుని డీప్ ఫేక్ చేసేందుకు అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా యాప్లు వాడే విష యంలో ప్రైవసీ సెట్టింగ్స్ను మరవొద్దని సూచిస్తున్నారు. మనం పెట్టే ఫొటోలు, వీడియోలు మన కాంటాక్ట్ లిస్ట్లోనివారే చూసేలా సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.డీప్ ఫేక్నుఎలా గుర్తించవచ్చు? » డీప్ ఫేక్ వీడియోను గుర్తించేందుకుఅందులోని వ్యక్తుల ముఖ కవళికలను నిశితంగా పరిశీలించాలి. అసహజంగా కళ్లు ఆర్పుతున్నట్టుగా ఉన్నా, సహజపరిస్థితులకు భిన్నంగా ముఖంపై వచ్చే లైటింగ్లో తేడాలు ఉన్నాఅది డీప్ ఫేక్ అని గుర్తించాలి. »శరీర కదలికల్లో అకస్మాత్తుగాతేడాలు ఉన్నా అనుమానించాలి.»ఆడియోలో పెదాల కదలికలు సరిగానే అనిపిస్తున్నా..కొన్ని పదాలు వెనుక,ముందు అవుతుండడం గమనించవచ్చు. »డీప్ ఫేక్ ఆడియోల్లో నిశితంగా గమనిస్తే.. వాయిస్ మాడ్యులేషన్లో తేడాలను, ఆడియో క్వాలిటీలో తేడాలనుగుర్తించవచ్చు. » డీప్ ఫేక్ ఇమేజ్లలో చివరలు బ్లర్అయినట్టుగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో తేడాలు, వెలుతురులో తేడాలు ఉంటాయి. -
విజయవాడలో బిజినెస్ ఎక్స్పో.. వ్యాపార అవకాశాలపై ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలు, ఉత్పత్తులపై ప్రచారం కల్పించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రకటించింది. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్పోను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యాంకింగ్, టూరిజం, ఇన్ఫ్రా, మహిళా సాధికారత, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై ఎక్స్పోలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ ఎక్స్పోను సందర్శించవచ్చన్నారు.‘ఏఐ’తో వ్యాపార అవకాశాలపై సదస్సుసాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవడం ద్వారా వ్యాపార అవకాశాలు పెంచుకోవడంపై ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. విజయవాడలోని హోటల్ వివంతలో నిర్వహించే ఈ సదస్సులో చిన్న, మధ్య తరగతి, ఔత్సాహిక వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు పాల్గొనవచ్చని విజయవాడ రీజియన్ అధ్యక్షుడు మలినేని రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నెల 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9848077227, andhrachambervijayawada@gmail.comను సంప్రదించా లని సూచించారు.25 వరకు నేచురోపతి కోర్సుకు వెబ్ ఆప్షన్స్సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, యోగిక్ సైన్స్ సీట్ల భర్తీకి అభ్యర్థులు ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. స్పెషల్ స్ట్రె వేకెన్సీలో 76 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ స్పెషల్ స్ట్రె వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ కింద కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 76 కన్వీనర్ కోటా సీట్లను శనివారం రాత్రి కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 మధ్యాహ్నం లోగా కళాశాలల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఏఆర్ డెయిరీలో ఏపీ పోలీసుల విచారణసాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో 11 మందితో కూడిన ఏపీ పోలీసుల బృందం శనివారం విచారణ చేపట్టినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వివాదంలో కల్తీ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆదినుంచి ఏఆర్ డెయిరీ తోసిపుచ్చుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఆ పరిశ్రమలోకి వెళ్లినట్టు సమాచారం. -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్కాల్స్ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ రేసును గెలిచే మార్గం
భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్ లెకూన్ ఇటీవలి భారత్ సందర్శనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు భారతీయ మార్కెట్ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్ విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. మెటా సంస్థకు చెందిన చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్ ప్రైజ్ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.ప్రతిభ అవసరం!దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్ హువాంగ్ భారత్ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్ తన ‘నేషనల్ ఏఐ మిషన్’ (ఎన్ఏఐఎమ్)లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్ ఆల్’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.జాతీయ ఏఐ మిషన్ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ను ఊహిస్తోంది.ఫ్యూచర్స్కిల్స్ ప్రోగ్రామ్ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్ విజయం సాధించలేదు.ఫ్రాన్స్ విజయగాథఉదాహరణకు లెకూన్ స్వదేశమైన ఫ్రాన్స్ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్ వేవ్ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. గూగుల్ డీప్మైండ్, మెటాలో ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్ స్టార్టప్ అయిన మిస్ట్రాల్ను ప్రారంభించారు. ఇది ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.ప్రపంచ వేదికపై ఫ్రాన్స్ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్ వంటి ఫ్రెంచ్ ఏఐ స్టార్టప్ల విజయానికి దోహదపడిందని చెప్పారు.నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం. చాట్జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్లు వాస్తవానికి ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ అనే గూగుల్ రీసెర్చ్ పేపర్లో భాగం. ఆ పేపర్ సహ రచయితలలో ఆశిష్ వాశ్వానీ, నికీ పర్మార్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్ చేయగా, పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో పర్మార్ చదివారు. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్ శ్రీనివాస్ గతంలో ఓపెన్ఏఐలో పరిశోధకుడు. పెర్ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్ వ్యాలీలోని హాటెస్ట్ ఏఐ స్టార్టప్లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్లకు జాతీయ ఏఐ మిషన్ కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్ విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ‘ద గ్రేట్ టెక్ గేమ్’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్ రెసిడెంట్ స్కాలర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్తో జరుగుతున్న సైబర్నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్బాట్ కాదు, లైఫ్లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్ను, టెక్స్ట్ మెసేజ్లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
AI గర్ల్ తో కొత్త లవ్ స్టోరీ
-
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
పోలీసులకు ‘ఆంబిస్’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటీ ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం. -
భారత వైద్య రంగంలో శరవేగంగా ఏఐ.. రోగాన్ని ఇట్టే తేల్చేస్తుందోయ్!
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి ఔషధ పరిశోధనల్లో వేగం టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. చికిత్సల్లో కచ్చితత్వం భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది. సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు30 నుంచి 40 శాతం సమయం ఆదా రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. -
భాష లోకల్.. ర్యాగ్తో గ్లోబల్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి దాకా పోగేసింది రూ.లక్ష. దాన్ని రెట్టింపు చేయాలనుంది. మనసులోని ఈ మాటను ‘చాట్ జీపీటీ’కి చెప్పడమే ఆలస్యం.. రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకూ చేయగల బిజినెస్ ప్రోగ్రాం రెడీ చేసి పెడుతుంది. ఆదిలాబాద్లోని ఆదివాసీలు గోండు భాషలో మాట్లాడితే.. అమెరికాలో ట్రంప్ విని అవలీలగా అర్థం చేసుకునేలా మారిపోతుంది. అమెరికా, ఆఫ్రికా వాళ్లు ఏ భాషలో మాట్లాడినా.. మనకు తెలుగులోనే వినిపిస్తుంది. మనం తెలుగులో మాట్లాడుతుంటే.. వాళ్లకు అర్థమయ్యే భాషలో వారికి వినిపిస్తుంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన, సృష్టించబోతున్న ఇలాంటి అద్భుతాలు ఎన్నో. ఏఐ సృష్టించే కొత్త భాషతో మారుమూల ప్రాంతాల్లోని వారి మనోగతంతో సహా విశ్లేషించే టెక్నికల్ టూల్ను చూడబోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్న ఆ టూల్.. ‘రిట్రైవల్–అగ్మెంటెడ్ జనరేషన్ (ర్యాగ్)’. ‘ర్యాగ్’ కోసం భారీ పెట్టుబడులు చాట్ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే (632 బిలియన్ డాలర్లు) ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్ టూల్స్కు ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఏంటీ దీని ప్రత్యేకత? మన దేశంలోని మారుమూల పల్లెలో మాట్లాడే స్థానిక భాషను అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకునేలా చేయగల సత్తా ర్యాగ్ టూల్స్కు ఉంటుంది. కొన్ని వేల భాషలను, కోట్ల కొద్దీ పదాలను అత్యంత వేగంగా విశ్లేíÙంచగలవు. కృత్రిమ మేధలోని డీప్ లెరి్నంగ్ సాంకేతికతను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి ఈ టూల్స్ను రూపొందించినట్టు నిపుణులు చెప్తున్నారు.ఉదాహరణకు కొన్ని పోలికలతో వధువు కావాలని జీపీటీలో సెర్చ్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా సరిపోయే వ్యక్తులు, వారి అలవాట్లు, వారి హావభావాలతో చిత్రాలను అందిస్తుంది. సీ, సీ ప్లస్ ప్లస్, డెవాబ్స్ వంటి అనేక కంప్యూటర్ కోడింగ్ భాషలున్నాయి. ర్యాగ్ టూల్స్ క్షణాల్లోనే ఆ భాషల్లో కోడింగ్స్ రాయగలవు. కాల్ సెంటర్లలో కొన్ని వేల మంది చేసే పనిని ఒక్క ర్యాగ్ టూల్తో సాధించవచ్చు. కంపెనీల ఆడిట్ రిపోర్టులు, అంతర్గత వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యాపార లింకులు వంటి పనులెన్నో ర్యాగ్తో ఇట్టే ముగించే వీలుంది. ఉపాధికి దెబ్బపడుతుందా? సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి ‘ర్యాగ్’ టూల్స్తో చాలెంజ్ అనే చెప్పాలని నిపుణులు అంటున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగాల నుంచి కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా ఉపాధి తగ్గుతుందని.. కార్యాలయాల్లో పనిచేసే పద్దతులు మారిపోతాయని చెప్తున్నారు. ఎక్కడో ఉండి మరెక్కడో కంపెనీని నడిపే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని వివరిస్తున్నారు. పోటీ పడితేనే అవకాశాలు.. మన దేశంలో ఏటా 24 లక్షల మంది టెక్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వారిలో కేవలం 8 శాతం మందికే తగిన స్కిల్స్ ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు ర్యాగ్తో పోటీ పడి, అంతకన్నా మెరుగైన ఆలోచనతో పనిచేసే వారికే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఏఐతో పోటీపడే తెలివితేటలు ఉంటే తప్ప, కొత్తగా, భిన్నంగా ఆవిష్కరించే సత్తా ఉంటే తప్ప నిలదొక్కుకోవడం కష్టమేనని పేర్కొంటున్నాయి. ఏఐతో పోటీ పడితేనే రాణించగలం చాట్ జీపీటీ సహా ఏఐ ప్రయోగాలు ముందుకెళ్తున్న నేపథ్యంలో ‘ర్యాగ్’ సాంకేతికత మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. డీప్ లెరి్నంగ్లో భాగంగా దీనిపై విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఇక మీదట ఏఐతో పోటీపడి, క్రియేటివిటీని రుజువు చేసుకుంటేనే సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్ ‘ర్యాగ్’ కోసం భారీ పెట్టుబడులు చాట్ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్ టూల్స్కు ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. -
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి
-
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్బాట్తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్బాట్ యాప్ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్బాట్తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్బాట్ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి?
సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను మించి..! ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్మైండ్లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
గ్లోబల్ ఫ్రేమ్వర్క్ కావాలి
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో ప్రపంచ మొత్తం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రి మేధ(ఏఐ)ని ఉపయోగించుకొనే విషయంలో స్పష్టమైన విధివిధానాలు అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకొనే అంశంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకొనే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రత, గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్–డబ్ల్యూటీఎస్ఏ, ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను మోదీ ప్రారంభించారు.డిజిటల్ సాంకేతికత విషయంలో నిబంధనల ఆధారిత ఫ్రేమ్వర్క్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయి సంస్థలు గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు కేవలం వ్యక్తిగత భద్రత, టెక్నాలజీ సంస్థల పారదర్శకతకే కాదు, అంతర్జాతీయ డేటా ప్రవాహంపై ఆధారపడి ఉన్న వాణిజ్యం, వస్తు సేవలకు సైతం కీలకమేనని ఉద్ఘాటించారు. సైబర్ మోసాల నుంచి ఏ ఒక్క దేశమూ ఒంటరిగా తమ ప్రజలకు రక్షణ కలి్పంచలేదని అభిప్రాయపడ్డారు.అందుకే అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అంతర్జాతీయ సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. 95 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఏకంగా 40 శాతం భారత్లోనే జరుగుతున్నాయని వివరించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విషయంలో తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
ప్రపంచానికి సవాల్ విసురుతోన్న కృత్రిమ మేథ
-
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ఏఐ గ్లోబల్ మార్కెట్ @ 990 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) ఉత్పత్తులు, సరీ్వసుల మార్కెట్ ఏటా 40–55% మేర వృద్ధి చెందనుంది. 2027 నాటికి 780 బిలియన్ డాలర్లు–990 బిలియన్ డాలర్ల స్థాయి వరకు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో సరఫరా, డిమాండ్పరమైన సమస్యల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దీర్ఘకాలికంగా ఏఐ మార్కెట్ వృద్ధి పటిష్టంగానే ఉండనుంది. బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన 5వ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏఐకి విస్తృతంగా కంప్యూటింగ్ సామర్థ్యాలు అవసరమవుతాయి కాబ ట్టి వచ్చే ఐదు నుంచి పదేళ్లలో డేటా సెంటర్ల స్థాయి కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతమున్న 50–200 మెగావాట్ల సామర్థ్యం నుంచి గిగావాట్ స్థాయికి డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుతుందని నివేదిక వివరించింది. ప్రస్తుతం భారీ డేటా సెంటర్ల వ్యయం 1 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు ఉండగా ఏఐ కారణంగా అయిదేళ్ల తర్వాత ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. అలాగే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్కి (జీపీయూ) సైతం డిమాండ్ 30 శాతానికి పైగా పెరుగుతుందని వివరించింది. సెమీకండక్టర్లకు కొరత: ఈ పరిణామాలన్నింటి వల్ల సెమీకండక్టర్లకు కొరత ఏర్పడవచ్చని నివేదిక తెలిపింది. ఒకవేళ జీపీయూలకు డిమాండ్ రెట్టింపైతే కీలక విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు ఉత్పత్తిని రెట్టింపు చేస్తే సరిపోవచ్చు, కానీ సెమీకండక్టర్ల తయారీ సంస్థలు మాత్రం ఉత్పత్తి సామర్థ్యాలను మూడింతలు పెంచుకోవాల్సి వస్తుందని వివరించింది. భారీగా వృద్ధి చెందుతు న్న కృత్రిమ మేథ కారణంగా టెక్నాలజీ రంగంలో గణనీయంగా మార్పులు వస్తాయని పేర్కొంది. చిన్న స్థాయి క్లౌడ్ సరీ్వస్ ప్రొవైడర్లు, సాఫ్ట్వేర్ వెండార్లు తదితర విభాగాల్లోనూ కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఏఐని వినియోగించుకోవడం, డేటా ఆధునీకరణ కోసం కస్టమర్లకు అంతగా అవసరమైన నైపుణ్యాలు, అనుభవం లేనందున మధ్యకాలికంగా టెక్ సర్వీసులకు డిమాండ్ భారీగా ఉంటుందని పేర్కొంది. అయితే, క్రమంగా చాలా మటుకు టెక్ సరీ్వసుల స్థానాన్ని సాఫ్ట్వేర్ భర్తీ చేస్తుందని వివరించింది. -
టెక్ హైరింగ్లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇండియా ఏఐ ఫెలోషిప్: అర్హతలు ఇవే..
అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ హవా జోరుగా సాగుతున్న వేళ.. చాలామంది ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఫెలోషిప్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా ఏఐ (IndiaAI) ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (IBD) బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ స్కాలర్ల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆసక్తికలిగిన విద్యార్థులు తమ నామినేషన్లను సెప్టెంబర్ 30లోపు సమర్పించాలి.ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేయాలనుకునే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు రెగ్యులర్గా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొత్తం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఫెలోషిప్ బీటెక్ విద్యార్థులకు ఒక సంవత్సరం, ఎంటెక్ విద్యార్థులకు రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ వ్యవధిని కవర్ చేస్తుంది.పీహెచ్డీ స్కాలర్స్ తప్పకుండా టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన పరిశోధనా సంస్థల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో రీసెర్చ్ చేసి ఉండాలి. అయితే వీరు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే సమయంలో మరే ఇతర సంస్థ నుంచి స్కాలర్షిప్ లేదా జీతం వంటివి పొందకూడదు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల ఎంపిక అనేది అర్హత, రీసెర్చ్, స్టూడెంట్ ప్రొఫైల్, నేషనల్ లెవెల్ ఫెలోషిప్ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. -
ఏఐతో పాటలు
సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘శారీ’. ఈ సినిమాకు గిరికృష్ణ కమల్ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్ కానుంది. ‘ప్రేమా... ప్రేమా.. ప్రేమా... నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై, ‘ఐ వాంట్ లవ్... ఐ వాంట్ లవ్...’ అంటూ సాగే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ) యాప్స్తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్గోపాల్వర్మ పేర్కొన్నారు. -
కృత్రిమ మేధ.. కేరాఫ్ భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, కొత్త అర్థాన్ని కనుక్కోవడం, అనుభవం నుంచి నేర్చుకోవడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అలుపు, విరామమన్నది లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం. పంటలు ఎలా పండిస్తే లాభమో చెబుతుంది. పిల్లలకు లెక్కలు (మ్యాథమెటిక్స్) సులభంగా నేర్పిస్తుంది. మన రహదారుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే కాకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో, వినియోగంలో భారతదేశం కూడా దూసుకెళుతోంది.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లోనూ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని కృత్రిమ మేధతోనే నిర్వహిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది 55 శాతానికి పెరుగుతుందని అంచనా. చాలా రంగాలు 75 శాతం పైగా కార్యకలాపాలు ఏఐ సాయంతోనే నిర్వహిస్తాయని చెబుతున్నారు. ఇంటి అవసరాల నుంచి పంట పండించడం వరకు ఏఐ వినియోగం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్లో ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసే ఏఐ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. అనేక రంగాలు ఇప్పుడిప్పుడే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. రోబోటిక్స్, మెషిన్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఫ్లాట్ఫారాలు రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. – సాక్షి, అమరావతిపెరుగుతున్న వినియోగం.. అవగాహన ఓ పక్క ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయంతో సహా అనేక పరిశ్రమలలో ఏఐ ఉపయోగిస్తుంటే.. మరో పక్క స్కూల్ స్థాయి నుంచి సాధారణ ప్రజల వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇంకో వైపు భారత ప్రభుత్వం కనీసం 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ) ఉన్న ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెడుతుందని ఇటీవల జరిగిన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్–2024లో ప్రకటించింది.గతేడాది ఏప్రిల్లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘వార్షిక ఏఐ ఇండెక్స్’ ప్రకారం 2022లో ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందించే స్టార్టప్లు 3.24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని.. దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలను సైతం అధిగమించాయని పేర్కొంది. మనకంటే ముందు యూఎస్, చైనా, యూకే, ఇజ్రాయిల్ మాత్రమే ఉన్నట్టు వివరించింది. భారతదేశంలోని ఏఐ స్టార్టప్లు 2013 నుంచి 2022 వరకు మొత్తం 7.73 బిలియన్ డాలర్లు పొందగా, కేవలం 2022 ఏడాదిలోనే దాదాపు 40 శాతం పెట్టుబడులు పెరిగాయి. 2028 నాటికి ఇది 20 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది. ఏఐ పరిశోధకులు, కంపెనీలను ప్రోత్సహించేందుకు త్వరలో ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను స్థాపించనున్నారు. దీంతో పాటు ఏఐ స్కిల్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను కూడా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభ దశలో ఏఐ, డీప్ టెక్నాలజీకి అవసరమైన నిధులను కేంద్రం అందించనుంది. దీని ద్వారా టెక్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. బలమైన జాబ్ మార్కెట్ ఇలా» గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మన దేశ ప్రాధాన్యం పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టే దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ మార్కెట్ వృద్ధి చెందుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇందులో స్టార్టప్స్తో పాటు బహుళ జాతి కంపెనీల్లో ఏఐ టెక్ నిపుణులకు అవకాశాలు భారీగా ఉన్నాయి. » మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి ఏఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ వల్ల తాజా గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులకు ఈ డైనమిక్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకటి కచ్చితంగా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ రంగాలకు చెందినదై ఉంటుందని చెబుతున్నారు. » ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాధారణ కంప్యూటర్ కోర్సుల కంటే టెక్ రంగంలో కఠినమైన సమస్యలను పరిష్కరించడంలో సరికొత్త అంశాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో పరిశోధన–ఆవిష్కరణలు, విద్యావేత్తలు– పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ‘డిజిటల్ ఇండియా, నేషనల్ ఏఐ స్ట్రాటజీ’ వంటి ప్రోగ్రామ్లను అందుబాటులోకి తెచ్చింది.నమ్మశక్యం కాని అద్భుతాలు » భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని మార్చగల శక్తి ఏఐకి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమీప కాలంలోనే ఈ టెక్నాలజీ కీలకం కానుందంటున్నారు. » వ్యవసాయంలో వాతావరణ మార్పులను అంచనా వేసి, ఏ సమయంలో ఏ పంట వేయాలో.. పంటల సస్యరక్షణ, దిగుబడులను పెంచడంలో రైతులకు నేరుగా సహాయం చేయగల సామర్థ్యం దీనికుంది. » ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు కావాల్సిన ఏఐ టెక్నాలజీ సహకారం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడులు, నిపుణుల నియామకం కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు స్థాపించనున్నారు. అంటే ఈ టెక్నాలజీపై శిక్షణ నుంచి కొత్త సృష్టి వరకు అనేక విభాగాలకు భారత్ అంతర్జాతీయ మార్కెట్కు కేంద్రం కానుంది. » కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి నమ్మశక్యం కాని అద్భుతాలు ఆవిష్కరించేందుకు భారతదేశానికి చాలా మంచి అవకాశం ఉందని, ఇది మునుపటి కంటే మరింత అభివృద్ధి చెందడానికి, ఇంటెలిజెన్స్ భారత్ను సృష్టించడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగం శాతాల్లో68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్65 టెక్ పరిశ్రమ52 ఫార్మా అండ్ హెల్త్కేర్43 ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ 28 తయారీ రంగం22 మౌలిక వసతులు, రవాణ12 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ -
'ఏఐకు అదో పెద్ద సవాలు'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ.. ఎంతోమంది దృష్టిని ఆకర్శిస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇందులో లోపాలు ఉన్నాయని 'డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్' (Deutsche Bank Research) ఓ నివేదికలో వెల్లడించింది.ఏఐ టెక్నాలజీ అన్ని విషయాల్లోనూ రాణిస్తోంది, కానీ లెక్కల (గణితం) విషయానికి వస్తే.. గణనలు చేయడంలో అంత ఆశాజనకంగా లేదని లోపభూయిష్టంగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ పేర్కొంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయిందని తెలిపింది.ఏఐలో ఫైనాన్స్, హెల్త్ కేర్ కూసే నెమ్మదిగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ తెలిపింది. కాబట్టి ఈ రంగాలలో ఏఐ ఫలితాలు తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని పేర్కొంది. కాబట్టి ఈ రంగంలో ఆశాజనక ఫలితాలు అందించడానికి ఏఐ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతనై ఉంది.ఇదీ చదవండి: భారత్కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే.. కొన్ని రంగాల్లో మాత్రం.. ఏఐ ఉత్పాదక ఊహాతీతంగా, ఆశ్చర్యపడిచే విధంగా ఉంది. అపరిశోధనలను సంబంధించిన విషయాలను అందించడం, వస్తావా ప్రపంచం అనుసరించే అనేక గేమ్ ఇంజిన్లను సృష్టించడంలో కూడా ఏఐ చాలా అద్భుతంగా ఉందని వెల్లడించింది. -
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
సైబర్ నేరాల కట్టడికి ఏఐని వాడండి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికను వినియోగించుకుంటూ సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను కోరారు. ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై వేధింపులకు పాల్పడటం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, మాయమాటలతో జనం కష్టార్జితాన్ని దోచుకునే నేరగాళ్లను ఏఐ ద్వారా గుర్తించొచ్చని మంత్రి తెలిపారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం, 46 శాతం వరకు భారత్ వాటా ఉందని, ఇలాంటి సమయంలో నేరాలను నివారించడం అత్యంత కీలకమని అన్నారు.అయితే, దర్యాప్తు విభాగాలకు ఇది పెద్ద సవాల్తో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. మంగళవారం ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) మొట్టమొదటి వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేశారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 2018లో ఐ4సీ ఏర్పాటైంది. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో సమన్వయ కేంద్రంగా ఐ4సీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్(సీఎఫ్ఎంసీ), సమన్వయ వేదిక, సైబర్ కమాండోస్ ప్రోగ్రాం, సస్పెక్ట్ రిజిస్ట్రీ అనే నాలుగు విభాగాలను ఐ4సీలో అమిత్ షా ప్రారంభించారు.సైబర్ నేరాలపై సమర్థవంత పోరాటం కోసం పాతకాలపు ‘అవసరమైన విషయం మాత్రమే చెప్పడం’అనే పద్ధతిని విడనాడి, ‘బాధ్యతలను పంచుకోవడం’అనే విధానాన్ని అనుసరించాలని సూచించారు. -
‘ఏఐ’తో ఉద్యోగాలు పోవు: రాహుల్గాంధీ
టెక్సాస్: కృత్రిమ మేధ(ఏఐ)తో నిరుద్యోగం ఏర్పడుతుందన్న వాదనను ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కొట్టి పారేశారు. ఏఐతో పాతవి పోయి కొత్త తరహా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు. అంతిమంగా ఏఐతో మంచే జరుగుతుందన్నారు. ఆదివారం(సెప్టెంబర్8) అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయమై మాట్లాడారు.‘క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చినపుడు ఇలానే ఉద్యోగాలు పోతాయన్నారు. ఏమైంది. కొత్త ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏం నష్టం జరగలేదు. అయితే ఏఐతో భారత్లో ప్రధానంగా ఐటీ రంగం సమస్య ఎదుర్కోబోతోంది. అదే సమయంలో స్కూటర్లు తయారు చేసే బజాజ్ కంపెనీకి ఏఐతో సమస్యేమీ లేదు. ఏఐ ఒక్కో రంగాన్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఉద్యోగాలు పోయేలా చేస్తుంది. కొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనం సరిగ్గా వాడుకుంటే ఏఐ కొత్త అవకాశాలను కల్పిస్తుంది’అని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. కాగా, 2024 లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఇదీ చదవండి: రాహుల్గాంధీ పప్పు కాదు: శామ్ పిట్రోడా -
అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు ప్రతి రంగంలోనూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) హవా జోరుగా సాగుతోంది. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన కోర్సును నేర్చుకోవడానికి ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' అమెరికా వెళ్లినట్లు తెలిసింది.టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే కుతూహలం ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు అమెరికాలో ఓ టాప్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కోర్సు వ్యవధి 90 రోజులు ఉన్నప్పటికీ కమల్ 45 రోజులు ఈ కోర్సు నేర్చుకోవడానికి సమయం కేటాయించనున్నట్లు సమాచారం.ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్.. ఏఐ నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లడం చాలా గొప్ప విషయం. టెక్నాలజీ పట్ల ఆయనకు ఎంత మక్కువ ఉందో తెలుసుకోవడానికి ఇదోక ఉదాహరణ. కొత్త నైపుణ్యాలు భారతీయ సినిమాపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, ఏఐ చిత్రనిర్మాణంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చాలామంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలుకమల్ హాసన్ సన్నిహితుల ప్రకారం.. భవిష్యత్తులో నిర్మించే ఆయన ప్రాజెక్టులు ఏఐ సాంకేతికతతో వస్తాయని తెలుస్తోంది. తనకు కొత్త టెక్నాలజీ మీద అమితమైన ఆసక్తి ఉందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే కమల్ సినిమాలలో ఏఐ టెక్నాలజీ ఉందనునందని స్పష్టమవుతోంది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తెలంగాణ ముందడుగు
-
కృత్రిమ మేధకు కేంద్రంగా హైదరాబాద్ సిటీ... తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భారత్లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్లో పర్యటించాలని లారెన్స్ వాంగ్ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
ఐటీలో మేటిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా దూసుకువస్తున్న కృత్రిమ మేథస్సు (ఏఐ టెక్నాలజీ)తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో బెంగళూరు చాలా ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికత ద్వారా భారీ ముందడుగు వేసి ఐటీ రంగంలో బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, వాణిజ్యం పెంచే దిశగా ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందిస్తోందని తెలిపారు. ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా ఏఐ సిటీ నిర్మిస్తామని, రాష్ట్ర అభివృద్ధిని పదింతలు పెంచుతామని చెప్పారు.గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా ‘తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్’(అంతర్జాతీయ ఏఐ సదస్సు)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్బాబు ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బహుముఖ లక్ష్యంతో.. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీ ఫలితాలు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం సహా బహుముఖ లక్ష్యంతో నాస్కామ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఏఐ ద్వారా భవిష్యత్తులో ఐటీ రంగంలో కొత్తగా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అదే సమయంలో ఇది కోడింగ్, అల్గారిథమ్స్ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న ఐటీ నిపుణుల ఉద్యోగ భద్రతకు కూడా సవాలు విసరనుంది. ఈ నేపథ్యంలో ఏఐ నిపుణులను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి అనుసరించాల్సిన విధానాలపై సదస్సులో చర్చిస్తాం. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో ఏఐ ఆధారిత అభివృద్ధి, ఉత్పాదకత పెంచడం తదితరాలపై సదస్సులో పాల్గొనే నిపుణులు సూచనలు చేస్తారు. ఏఐ టెక్నాలజీ రెండంచుల కత్తిలాంటిదనే ఆందోళన నేపథ్యంలో నైతిక మార్గంలో ఏఐ సాంకేతికత వినియోగం, ప్రభుత్వ నియంత్రణ తదితర అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఏఐ పాలసీ రూపకల్పన కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సదస్సులో పాల్గొనే నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం. తెలంగాణను ‘ఏఐ క్యాపిటల్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. ఉత్పాదకత పెంపునకు ఏఐ వినియోగం వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఏఐ వినియోగం పెంచాలని భావిస్తున్నాం. పరిశ్రమల ఆటోమేషన్, మెరుగైన నాణ్యత, యంత్రాల మెయింటినెన్స్, మార్కెటింగ్, మెరుగైన విద్యుత్ వినియోగం వంటి అంశాల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించేలా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. వ్యవసాయంలో ఎరువులు, నీళ్లు, తెగుళ్లు, పంట నూరి్పళ్లు సమర్ధవంతంగా జరిగేలా చూడటం, కూలీల కొరతను అధిగమించడం వంటి సవాళ్ల పరిష్కారంపై ఇప్పటికే పలు ఏఐ ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీలు, చికిత్సలు, రోగ నిర్ధారణ సమర్ధవంతంగా చేయడం సాధ్యమవుతోంది. విద్యారంగంలోనూ ఏఐ సాంకేతికతతో బహుళ లాభాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్ స్థాయిలో ఏఐ! సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు జూనియర్ కాలేజీ స్థాయి నుంచి కరిక్యులమ్లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చడంపై సదస్సులో చర్చిస్తాం. బెంగళూరు తరహాలో ఇక్కడి ఏఐ హబ్ నుంచి యూనికార్న్లు (బిలియన్ డాలర్ల వ్యాపారం చేసే సంస్థలు) పుట్టుకొచ్చే వాతావరణం కల్పిస్తాం. త్వరలో ఎస్ఎంఎస్ఈ, లైఫ్ సైన్సెస్ పాలసీలను కూడా ఆవిష్కరిస్తాం. -
ఏఐ పోలీస్.. ఆన్ డ్యూటీ
ఇకపై పెట్రోలింగ్కు నో పోలీస్.. ట్రాఫిక్ క్లియరెన్స్కీ నో పోలీస్.. ఫిర్యాదు స్వీకరించేందుకూ నో పోలీస్.. నిందితుల గుర్తింపునకు నో పోలీస్.. ఓన్లీ ఏఐ కాప్ అన్ని పనులు పూర్తి చేసేస్తుంది మరి. రోడ్డు మీద పోలీసులు ఎవ్వరూ కనబడటంలేదు కదా.. ఇష్టమొచ్చినట్లు వెళదాం.. మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటూ రయ్ మని దూసుకెళితే.. ఏఐ కాప్ కంట్లో మీరు పడ్డట్లే. ఫైన్ కడితేగానీ అది కదలనివ్వదు. ఇలాంటి ఏఐ పోలీస్లు ఇప్పటికే కొన్ని దేశాల్లో వినియోగంలోకి వచ్చాయి. మనకీ ఆ రోజులు త్వరలోనే రానున్నాయి. బ్యాచ్ నంబర్ గిటెక్స్. వెర్షన్ ఏఐ. 7 కిలోమీటర్స్ పర్ అవర్. 360 డిగ్రీస్ మోనిటరింగ్.. పోలీస్ కాప్ పెట్రోలింగ్ వెహికల్ రిపోర్టింగ్ సర్.. అంటూ దుబాయ్ పోలీసులకు ఓ పెట్రోలింగ్ వాహనం సాయమందిస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాహనం ముందుకు వచ్చి మరీ ఫైన్ కట్టాలంటూ రశీదు చేతికిస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. మనుషుల స్థానంలో రోబో పోలీసులు విధులు నిర్వహించే పరిస్థితులు వస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలు ఆశ్రయిస్తున్నాయి. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మనుషులు లేకుండానే పోలీసుల పనులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఇందులో దుబాయ్ కాస్తా ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. పోలీస్, సెక్యూరిటీ ఆపరేషన్స్లో ఏఐను దుబాయ్ విస్తృతంగా వినియోగిస్తోంది. దీనిలో భాగంగా స్మార్ట్ యాప్ను అభివృద్ధి చేశారు. ఇందులో అమ్నా పేరుతో ఉండే ఓ ఫీచర్లో.. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయిలో ఉండే ఒక వర్చువల్ పోలీస్ అధికారి ప్రజల ప్రశ్నలకు ఇంగ్లి‹Ù, అరబిక్ భాషల్లో సమాధానాలు ఇస్తున్నారు. ఇలా 2023లో ఏకంగా 20 వేల మందికి సమాధానాలిచ్చారు. ఒళ్లంతా కళ్లే.. ఇక దుబాయ్ పోలీసులకు ఓ ఏఐ పెట్రోలింగ్ వాహనం సాయమందిస్తోంది. ఈ వెహికల్లో 360 డిగ్రీస్లో స్పష్టంగా ఫుటేజ్ అందించే కెమెరాలున్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా, మారణాయుధాలు కలిగిఉన్నా, వెంటనే సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం చేరవేస్తుంది. వారు వచ్చేలోగా సదరు నిందితుడ్ని ఫాలో అవుతుంది. 15 గంటల పాటు నిరి్వరామంగా పనిచేసే సామర్థ్యం ఈ ఏఐ పెట్రోలింగ్ వెహికల్ సొంతం. కొద్దిరోజుల్లోనూ ఇది దుబాయ్ రోడ్లపై నిశ్శబ్దంగా తిరగనుంది. 65 మంది ఇంజనీర్లు దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి దీనిని రూపొందించారు.ఫిర్యాదు కాపీ 8 సెకన్లలో...! అమెరికా పోలీసింగ్లోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఫిర్యాదుదారులు చెప్పే విషయాన్ని నోట్ చేసుకుంటూ చాట్ జీపీటీ ద్వారా కేవలం 8 సెకన్లలో ఫిర్యాదు కాపీని తయారుచేసి ఇచ్చే సాంకేతికను ఓక్లహామా నగరంలో మొదటిసారిగా వినియోగిస్తున్నారు. కేవలం ఫిర్యాదు కాపీనే కాకుండా.. ఏదైనా సంఘటనపై చాట్ జీపీటీ ద్వారా సెకన్లలోనే డ్రాఫ్ట్ను సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మక పరిశీలనలో తప్పులు లేకుండా 100 శాతం పర్ఫెక్ట్ రిపోర్టును సిద్ధం చేసినట్టు ఆ సిటీ పోలీసులు ప్రకటించారు.లండన్లో...! ప్రధానంగా పాత నేరస్తులను పట్టుకునేందుకు ఏఐను బ్రిటన్ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. గతంలో దొంగతనం చేసి, మర్డర్లు చేసి, బ్యాంకులను దోచుకుని తప్పించుకు తిరుగుతున్న సుమారు 10 మంది పాత నేరస్తులను.. గుంపులో తిరుగుతుండగా ఏఐను ఉపయోగించి లైవ్ ఫేషియల్ రికగ్నైజేషన్ (ఎల్ఎఫ్ఆర్) కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిని విస్తృతంగా వినియోగించాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. చైనాలో ఏఐ పోలీస్స్టేషన్...! మనుషులే లేని పోలీస్ స్టేషన్ను చైనా సిద్ధం చేసింది. వుహాన్ నగరంలో ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ రిజి్రస్టేషన్ సేవలను అందించనుంది. అదేవిధంగా డ్రైవింగ్లో ఎదురయ్యే సమస్యలు, యాక్సిడెంట్ చేసింది ఎవరు? ఎలా చేశారు? ఎవరిది తప్పు వంటి వాటిని పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ 24/7 అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే చైనాలో ఏఐ టెక్నాలజీని నిఘా కోసం వినియోగిస్తున్నారు.సింగపూర్లో స్వతంత్ర నిర్ణయాలతో.. సింగపూర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలను పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. గత ఐదేళ్లుగా సింగపూర్లో ఈ పోలీస్ రోబోలతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 అడుగులు. దీనికి అమర్చే కెమెరాతో 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. ప్రాణాలకు తెగించే ఆపరేషన్లలో పాల్గొనేందుకు ఈ రోబోల్ని వినియోగించాలని సింగపూర్ పోలీసులు నిర్ణయించారు. ఇందులో ఉండే స్పీకర్లు.. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారితో మాట్లాడేందుకు ఉపయోగపడతాయి. ఈ పోలీస్ రోబో సేవలను సింగపూర్ ప్రభుత్వం ఎంతో రద్దీగా ఉండే చాంగీ ఎయిర్ పోర్టులో వినియోగించాలని నిర్ణయించింది. చిట్టితో.. సమస్యలు! రజనీకాంత్ రోబో సినిమాలో హ్యుమనాయిడ్ చిట్టితో అనేక సమస్యలు వస్తాయి. అదేవిధంగా ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలోనూ సమస్యలు తలెత్తుతుంటాయి. ఏఐ టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీని ద్వారా ఉద్యోగాల కల్పన విషయంలో సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సర్వే ప్రకారం అమెరికాలోనే 2033 నాటికి 47 శాతం ఉద్యోగాలు ఆటోమేషన్ కానున్నాయని తెలుస్తోంది. హ్యాకింగ్ సమస్యలు, సొంత అవసరాలకు వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. ఏఐ వినియోగించుకునే అవసరమైన డేటా సేకరణ, స్టోరేజీతో... ప్రైవసీ పోయే ప్రమాదం ఉంది. కేవలం మనం ఇచ్చిన డేటాతో మాత్రమే ఏఐ పనిచేస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు అవకాశం లేకుండా పోతుంది.ఏఐ దిశగా.. భారత్ అడుగులుపోలీస్ వ్యవస్థలో ఏఐని వినియోగించే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. ప్రస్తుత మొబైల్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (ఎంఈసీటీఎన్ఎస్)తో ఈ ఏఐ వ్యవస్థని అనుసంధానించనున్నారు. ఈ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్లో ఉండే పాత డేటా ఆధారంగా తన రేడియస్ పరిధిలో ఎవరైనా క్రిమినల్ కనిపించినా.. వెంటనే కంట్రోల్ రూమ్కి సమాచారం ఇచ్చేలా ప్రోగ్రామింగ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేరళలో తొలి రోబో పోలీస్ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాడు. కేరళ పోలీస్ అసిమోవ్ రోబోటిక్స్ సంస్థ సహకారంతో మానవ తరహాలో ‘కేపీ–బాట్’ని అభివృద్ధి చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరా ద్వారా.. నిందితుల్ని గుర్తించగల సామర్థ్యం దీని సొంతం.