breaking news
Artificial Intelligence (AI)
-
ఏఐ ఫిట్నెస్ యాప్స్ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్స్టైల్ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్కి ప్రత్యామ్నాయం కాలేవు. -
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కు హాలీవుడ్ ఆఫర్!
చైనాలోని యునాన్ ప్రావిన్స్కు చెందిన లియు జియు కొంత కాలం ట్రైన్ డ్రైవర్గా పనిచేశాడు. అతడికి ఒకరోజు షార్ట్ ఫిల్మ్ తీయాలనిపించింది. యాభై వేల (మన కరెన్సీలో) కంటే తక్కువ ఖర్చుతో 3.5 నిమిషాల ఏఐ షార్ట్ఫిల్మ్ను రూపొందించాడు. సదరు ఈ షార్ట్ఫిల్మ్ సూపర్ హిట్ కావడమే కాదు ఏకంగా హాలివుడ్ దృష్టిని ఆకర్షించింది.‘జాంబీ స్కావెంజర్’ అనే ఈ ఏఐ ఫిల్మ్ను పది రోజుల్లో రూపొందించాడు లియు జియు. ఒక రోబో, మనిషి బొమ్మ చుట్టూ అల్లుకున్న కథ తో రూపొందించిన ఈ షార్ట్ఫిల్మ్ చైనీస్ సోషల్ మీడియా ΄్లాట్ఫామ్ ‘డౌయిన్’లో విడుదలైంది. హాలీవుడ్కు చెందిన ఏఐ చిత్ర నిర్మాత పీజే అక్సెటురో ఆన్లైన్లో ‘జోంబీ స్కావేంజర్’ను ప్రశంసించిన తరువాత ఈ షార్ట్ఫిల్మ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.‘నేను చూసిన అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్స్లో జాంబీ స్కావెంజర్ ఒకటి. దర్శకుడిని ఎవరైనా కనుగొనగలిగితే, దయచేసి అతని సోషల్ మీడియా లింక్ను పంపండి. నేను అతడితో పని చేయాలనుకుంటున్నాను’ అని రాశాడు ఆక్సెటురో. ‘జాంబీ స్కావెంజర్’ ప్రపంచ వ్యాప్తం గా 60 మిలియన్ వ్యూస్ను దాటింది. -
మహాభారతం నేపథ్యంలో...
తెలుగులో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో రూపొందిన తొలి ఫీచర్ ఫిల్మ్గా ‘అంబాస్ రివెంజ్’ నిలవనుంది. జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్కతోక ఫిల్మ్స్పై శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా రూపొందింది.ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ‘అంబాస్ రివెంజ్’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు, జయవర్ధన్ మాడి మాట్లాడుతూ–‘‘మహాభారతంలోని శక్తిమంతమైన అంబ పాత్ర నేపథ్యంలో ‘అంబాస్ రివెంజ్’ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం’’ అన్నారు. -
జపాన్తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్లాండ్లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
ఉద్యోగాలపై సైబర్ సెక్యూరిటీ దిగ్గజం నికేష్ అరోరా సంచలన వ్యాఖ్యలు
భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయంఒక పాడ్కాస్ట్లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఉద్యోగులకు హెచ్చరికప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్ -
ప్రపంచ శక్తిగా 'యువ భారత్'
ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇండియా ప్రాధాన్యం, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త జననాల రేటు క్షీణత వంటి కీలక అంశాలను ప్రముఖ ఆర్థికవేత్త టేలర్ కోవెన్ ఈ పాడ్కాస్ట్లో చర్చించారు. సాంకేతిక రంగంలో ఏఐ అభివృద్ధి వేగానికీ– మానవ వ్యవస్థల నెమ్మదితనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు:సవాళ్లున్నా అవకాశాలు ఎన్నో!ఇండియా ప్రాథమికంగా లాభదాయకమైన స్థితిలో ఉంది. చైనా కోల్పోతున్న యువ జనాభా బలాన్ని ఇండియా కలిగి ఉంది. ఎంతో నైపుణ్యం ఉండి, ఇంగ్లి ష్లో మాట్లాడగలిగే సాంకేతిక రంగానికి చెందిన భారతీ యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక దృఢమైన శక్తిగా ఇండియా విజయం సాధించాలని అమెరికా, దాని మిత్రదేశాలు గట్టిగా కోరు కుంటున్నాయి. అయితే, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ నిబంధనల వల్ల జరుగుతున్న జాప్యం, వందల కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన ఉపాధిని కల్పించడం వంటి పెద్ద అంతర్గత సవాళ్లను భారతదేశం ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.వృద్ధాప్య సంక్షోభంలో ‘డ్రాగన్’నేను చైనా వైపు చూసినప్పుడు, ఒకప్పుడు అద్భుతమైన వృద్ధిని సాధించి, ప్రస్తుతం అలవిమాలిన నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం నాకు కనిపిస్తుంది. వారి భారీ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం, వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్న జనాభా, తీవ్రమైన రాజ కీయ కేంద్రీకరణల వల్ల వారు ఇకపై ఎవరూ ఆపలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. చైనా ప్రపంచ వ్యవస్థను శాసిస్తుందని అనేవారు ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి చైనా తన ఆర్థిక ఒత్తిళ్లు, తగ్గిపోతున్న కార్మిక శక్తిని నెట్టుకురావటం అనే సమస్యలతో సతమతమవుతోంది. వారు ఒక బలమైన శక్తి అనడంలో సందేహం లేదు, కానీ వారిని ఎవరూ ఎదిరించలేనంత మహా బలవంతులుగా భావించాల్సిన అవసరమైతే లేదు.పిల్లలు వద్దనుకుంటున్నారు!విశ్వవ్యాప్తంగా జననాల రేటులో ఒక భారీ క్షీణతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు ఒక సాంస్కృతిక సమస్య కూడా. సమాజాలు మరింత సంపన్నంగా మారి, వ్యక్తు లకు మరింతగా వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తున్న కొద్దీ, పిల్ల లను కనడం వల్ల కోల్పోయే ఇతర అవకాశాలకు ప్రాధాన్యమివ్వటం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ‘ఎంపికల వల్ల వచ్చిన సంక్షోభం’. ఇది రాబోయే శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయ బోతోంది.ఏఐ వేగాన్ని అందుకోలేకున్నాం!ప్రజలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం.)కు ఉన్న అద్భుతమైన తెలివితేటలను చూసి, మన జీవితా ల్లోని ప్రతిదీ రాత్రికి రాత్రే మారిపోతుందని అనుకుంటారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏఐ ఇంకా మన ప్రస్తుత ప్రపంచంలోని భౌతిక, ప్రభుత్వ నిబంధనల పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ కొత్త ఏఐ పని విధా నాన్ని అమలు చేయాలనుకుంటే, వారు ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల అనుమతులు, పాత సాఫ్ట్వేర్ అప్ డేట్లు, సిబ్బంది అలసత్వం వంటి వాటిని దాటుకుని రావాల్సి ఉంటుంది.‘మనసున మనసై’తేనే విలువఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా మేధోశక్తి ఉచితంగా, సులభంగా లభించే ఈ రోజుల్లో, సాధారణ ఐక్యూకి పూర్వపు గుర్తింపు, విలువ తగ్గిపోతాయి. సాంకేతిక రంగాలలో సగటు మానవుడి కంటే ఒక యంత్రం మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు, ఇక సమాజంలో అరుదైనదిగా ఏది మిగులుతుంది? నా దృష్టిలో దానికి సమాధానం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నమ్మశక్యత, విభిన్న విషయాలను సమన్వయం చేసే నైపుణ్యం, లోతైన మానవ సంబంధాలే. కంప్యూటర్ కోడింగ్ ద్వారా సృష్టించలేనివి లేదా స్క్రీన్ ద్వారా అనుకరించ లేనివి మాత్రమే భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారుతాయి. - ఎడిటోరియల్ టీమ్ -
ఫిగ్మాలో కొత్త ఫీచర్లు..
కొలాబరేటివ్ వెబ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ‘ఫిగ్మా’ ఎన్నో కొత్త ఫీచర్లను ప్రకటించింది. కోడింగ్, యానిమేషన్, ఏఐ–ఎఫెక్ట్స్, వర్క్ఫ్లో ఆటోమేషన్ను నేరుగా డిజైన్ ప్లాట్ఫామ్లలోకి తీసుకువచ్చే టూల్స్ను పరిచయం చేసింది. ఫిగ్మా ప్రకటించిన ఆసక్తికరమైన ఫీచర్లలో ‘కోడ్ లేయర్స్’ ఒకటి.కోలాబరేటివ్ కాన్వాస్లో డిజైన్ ఎలిమెంట్స్ను ఇంటరాక్టివ్ కోడ్–బేస్డ్ కంపోనెంట్స్గా కన్వర్ట్ చేయడానికి యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. డిజైనర్లు, డెవలపర్లు,ప్రాడక్ట్ టీమ్లకు ఉపయోగపడేలా ఈ ఫీచర్ని డిజైన్ చేశారు. ‘ఫిగ్మా మోషన్’ పేరుతో కొత్త యానిమేషన్ సిస్టమ్ను కూడా పరిచయం చేశారు.షేడర్ ఫీల్స్, ఎఫెక్ట్స్లతో తన ఏఐ టూల్ కిట్ను కూడా విస్తరిస్తోంది ఫిగ్మా. టెక్ట్స్ప్రాంప్ట్స్, రిఫరెన్స్ ఇమేజ్లతో యూజర్లు విజువల్ ఎఫెక్ట్స్ను సృష్టించవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ప్రాంప్ట్స్ ఉపయోగించడం ద్వారా కస్టమ్స్ టూల్స్ను క్రియేట్ చేసే ‘జెనరేటివ్ ప్లగిన్స్’ ఫీచర్ను కూడా ప్రకటించింది ఫిగ్మా. -
ఇది సైనేడ్తో సమానం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ సందర్భంగా కృత్రిమ మేధ(ఏఐ) సృష్టించిన కల్పిత తీర్పు కాపీలను ఆధారంగాచేసుకుని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఇటీవల ఒక తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సష్టించిన తప్పుడు తీర్పులను న్యాయవాదులు కోర్టుల ముందుంచడం వృత్తిపరమైన దు్రష్పవర్తన కిందకే వస్తుందని తేల్చిచెప్పమంది.అలాగే, వాటిపై ఆధారపడి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోవడం తీవ్రమైన తప్పిదమని, అటువంటి తీర్పులు చట్టం దృష్టిలో ఏమాత్రం చెల్లవని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కృత్రిమమేధ సృష్టించిన తీర్పు కాపీని ఎన్సీఎల్టీ వాస్తవమైన తీర్పుగా భావించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటివి చేయడమంటే చట్టానికి మిౖథెల్ ఐసోసైనేట్(సైనేడ్)ను ఇచ్చినట్లు అవుతుంది. ఇవి చట్టం, న్యాయవ్యవస్థలోకి చొరబడితే ఇవి చొరబడినట్లుకూడా ఎవరూ కనిపెట్టలేరు.గుర్తించడానికి వీల్లేకుండా అదృశ్యంగా, అంతర్గతంగా ఉంటూ అత్యంత దారుణాలకు కారణమవుతాయి. ఇవి న్యాయవ్యవస్థను కలుషితం చేయడమేకాదు యావత్ న్యాయవ్యవస్థ అంకితభావంలోని ఆత్మను చంపేస్తాయి’’అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ‘‘అసలు ఇలాంటి తీర్పు నిజంగా ఉందో లేదో సరిచూసుకోకుండా న్యాయవాదులు తమ కేసుల పత్రాలకు వీటిని జతచేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఇలాంటి వాటిని కోర్టులు ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇలాంటి కల్పిత, ఊహాత్మక, ఊహాజనిత తీర్పు కాపీలను వాస్తవమైనవిగా భావించి న్యాయమూర్తి సైతం తీర్పు చెబితే అక్కడ సైతం న్యాయవితరణ లోపించినట్లే భావించాలి. కోర్టుల దృష్టిలో ఇలాంటి తీర్పులు అసలు తీర్పులే కావు. ఇలాంటి కల్పిత తీర్పు కాపీలు న్యాయవ్యవస్థలో చొరబడితే న్యాయవ్యవస్థ పవిత్రతకు భంగం వాటిల్లుతుంది’’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మార్గదర్శకాలు రూపొందించండి న్యాయ నిర్ణయ ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు, తప్పుల తడకగా ఉన్న కల్పిత తీర్పుల ఆధారంగా ముంబైలోని ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉనికిలో లేని ఏఐ కల్పిత తీర్పులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే న్యాయవాదులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలతో సహా కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోని కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత విద్యావ్యవస్థ మాత్రం పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారలేక కొట్టుమిట్టాడుతోంది. యూకేకు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ కంపెనీ క్యూఎస్ తాజాగా విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో విశ్వవిద్యాలయాల విద్య, మారుతున్న శ్రామిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల లభ్యత ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో.. భారత్ 89.4 స్కోర్తో స్వీడన్, జపాన్లను వెనక్కినెట్టి 13వ స్థానంలో నిలిచింది. అలాగే భవిష్యత్తు ఉద్యోగాల సన్నద్ధతలో భారత్ 5వ స్థానం సాధించింది. కానీ అదే సమయంలో మన కాలేజీలు మాత్రం ఇంకా పాత సిలబస్తోనే విద్యార్థులను బయటకు పంపుతున్నాయి. ఫలితంగా పరిశ్రమలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నా.. వాటికి సరిపోయే నైపుణ్యాలు గల అభ్యర్థులు దొరకడం లేదు. భారతీయ సాంకేతిక గ్రాడ్యుయేట్లపై పరిశ్రమలకు నమ్మకం క్రమంగా తగ్గుతోందని క్యూఎస్ గ్లోబల్ ఎంప్లాయర్ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారతీయ విద్యాసంస్థల ఎంప్లాయర్ రెప్యుటేషన్ స్కోర్ 2017లో 997గా ఉండగా 2026 నాటికి అది ఏకంగా 2,132కి (స్కోర్ పెరిగేకొద్దీ నాణ్యత తగ్గినట్టు) పడిపోయింది. వలసల ముప్పు.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా శ్రామిక శక్తిని, విద్యార్థులను విదేశాలకు పంపుతున్న దేశం. 2030 నాటికి దాదాపు 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోనున్నట్లు అంచనా. ఈ పరిణామం మేధో వలసల ముప్పును తెచ్చిపెడుతోంది. దేశంలోని ప్రతిభావంతులను ఇక్కడే నిలుపుకుంటూ స్థానికంగా ఉన్న కోట్లాది మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. డ్రాగన్తో పోటీ.. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027లో 92.5 స్కోర్తో చైనా 7వ స్థానంలో ఉంది. చైనా ఏటా లక్షలాది మంది స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. వారంతా నేరుగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లోకి, సాంకేతిక సంస్థల్లోకి ప్రవేశించేలా అక్కడ పటిష్టమైన యంత్రాంగం ఉంది. దీనివల్ల వారి స్కిల్స్ అలైన్మెంట్ స్కోరు 98.0గా ఉంది. అయితే భారీ మౌలిక వసతులు ఉన్నప్పటికీ చైనా ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సూచీలో 80.2 స్కోరుతో వెనుకబడింది. చైనాలో ఇప్పటికీ తయారీ, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు. ఏఐ విప్లవం వల్ల ఈ ఉద్యోగాలన్నీ ఆటోమేషన్కు గురై భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చైనాతో పోలిస్తే భారత్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విభాగంలో 96.0 స్కోరుతో మెరుగ్గా ఉంది. మన సేవా రంగం, ఐటీ రంగాలు ఏఐ ద్వారా భర్తీ చేసేవి కావు. పైగా ఏఐతో కలిసి నడిచేవి. కానీ చైనాలాగా గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకునే స్కిల్స్ అలైన్మెంట్ మనకు లేకపోవడం లోటుగా మారుతోంది. ఈ విభాగంలో 82.7 స్కోర్తో 18వ స్థానానికి పరిమితమైంది. ఎందుకంటే.. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాణిస్తూ ప్రపంచ అత్యుత్తమ 250 వర్సిటీల జాబితాలో చోటు సంపాదిస్తుంటే దేశంలోని మిగిలిన వెయ్యికిపైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకుపైగా కాలేజీలు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి తప్ప ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలను అందించలేకపోతున్నాయి. కంపెనీలు వెతుకుతున్న ప్రధాన నైపుణ్యాలు ఇవే – సమస్యలను విశ్లేషించడం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత. భారతీయ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉందని టాప్ కంపెనీలు చెబుతున్నాయి. – ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవడం కూడా అడ్డంకిగా మారుతోందని అంటున్నాయి. – వ్యాపార దృక్పథంతో ఆలోచించడం, రిస్క్ తీసుకునే తత్వం తదితర లక్షణాలున్న ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. -
వాహనదారులూ జాగ్రత్త.. లేదంటే ఏ'ఐ’ పట్టేస్తుంది!
వాహనదారులూ జాగ్రత్త..ఇక మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ‘ఏఐ’ పట్టేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అనుకుని..మీరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక నడవదు. మీ ఉల్లంఘనలను ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. చలాన్ వడ్డిస్తాయి. ఆ సమాచారం మీకు నేరుగా వాట్సప్ ద్వారానో..మెసేజ్ రూపంలోనో..మెయిల్గానో వచ్చేస్తుంది. – సాక్షి, హైదరాబాద్ట్రాఫిక్ విభాగంలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని మల్కాజ్గిరి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బేగంపేటలో రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్ట్ను నిర్వహించిన పోలీసులు..సత్ఫలితాలు రావడంతో కమిషనరేట్లో అమలు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను ఆయా రోడ్లపై ఉన్న ‘ఏఐ సీసీటీవీ కెమెరాలు’ గుర్తించి..వివరాలను నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ సర్వర్కు పంపిస్తాయి. అక్కడున్న సిబ్బంది ట్రాఫిక్ ఉల్లంఘన, ప్రమాదం తీరు, వాహనం నంబర్, యజమాని వివరాలు తదితరాలను విశ్లేషించి.. యాక్సెప్ట్ చేయగానే నేరుగా వాహనదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో అలాగే ఈ–మెయిల్ ఐడీలకు మెయిల్ రూపంలో చలాన్ వెళ్లిపోతుంది.1.27 లక్షల కేసులు.. రూ.6.73 కోట్ల జరిమానాఅన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఒకేసారి దృష్టిపెట్టడంతో వాహనదారులకు అవగాహన రావడం లేదని భావించిన పోలీసులు.. ప్రతి రోజూ ఒకట్రెండు ఉల్లంఘనలు తీసుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో కమిషనరేట్ పరిధిలో 1,27,760 కేసులు నమోదు కాగా.. రూ.6.73 కోట్ల జరిమానాలు విధించారు. వీటిల్లో అత్యధికంగా అక్రమ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలు ఉన్నాయి.కీలక ప్రాంతాల్లో 75 కెమెరాలుబేగంపేటలో రెండు బహుళ జాతి కంపెనీల సాంకేతిక, నిధుల సహాయంతో నాలుగు సీసీటీవీ కెమెరాలకు ఏఐ జోడించి, రెండు నెలలు పరీక్షించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాల తీరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు గుర్తించడంలో సత్ఫలితాలొచ్చాయి. దీంతో మల్కాజ్గిరి కమిషనరేట్లోని కీలక కూడళ్లు, ప్రాంతాలలో 75 కెమెరాలకు ఏఐ జోడించి, వినియోగించుకోనున్నారు. ఈ ఏఐ ట్రాఫిక్ పోలీసు విభాగంలోకి ఇటీవల కొత్తగా నియమితులైన ఎస్ఐలలో బీటెక్, ఎంటెక్ చదివిన వారిని తీసుకోనున్నారు.వారి సేవలు ఇతర విభాగాల్లో.. ఇప్పటివరకు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనదారులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ఇక నుంచి ఏఐ ట్రాఫిక్ చలాన్లు జారీ చేయనుండటంతో.. సిబ్బంది సేవలను రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ఇతర విభాగాలలో వినియోగించుకోనున్నాం. – రాహుల్ రెడ్డి, డీసీపీ, ట్రాఫిక్–1, మల్కాజ్గిరి -
‘ఏఐ’తో ‘ఆట’లొద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మన దేశంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే–2024 ప్రకారం భారతీయుల్లో 65 శాతం మంది జనరేటివ్ ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కవ. విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అదే సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, గోప్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్ 2025’ అధ్యయనం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ముగ్గురిలో ఒకరు వారి వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలను ఏఐతో పంచుకుంటున్నారు. ఏఐతో వ్యక్తిగత విషయాలు చర్చించిన వారిలో 25 శాతం మంది ‘మనుషుల కంటే ఏఐ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’ అని భావిస్తున్నారు.ఆలోచనా శక్తిపై ప్రభావంఇదే సర్వేలో మరో ఆందోళనకర అంశం బయటపడింది. ఏఐ గురించి తెలిసిన పిల్లల్లో 75 శాతం మంది ఏఐ పనితీరుపై అవగాహన లేక దాన్నొక సెర్చ్ ఇంజిన్లా భావిస్తున్నారు. అలాగే 46 శాతం కుటుంబాలు ఏఐ వల్ల తప్పుడు సమాచారం (మిస్ఇన్ఫర్మేషన్) వచ్చే ప్రధాన ప్రమాదమని పేర్కొన్నాయి. ఏఐ వెంటనే సమాధానాలు అందించడం వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. హోంవర్క్, ప్రాజెక్టులు, వ్యాసాలు అన్నింటికీ ఏఐపై ఆధారపడితే సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దెబ్బతినే అవకాశం ఉంది. యునిసెఫ్ నివేదికల ప్రకారం.. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరితనం, భావోద్వేగ సంబంధాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.‘ఏఐ’ రూపంలో కొత్త ముప్పుఏఐ అందించే సమాచారం ఎల్లప్పుడూ సరైనదే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాస్తవాలకు విరుద్ధమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని కూడా అందించవచ్చు. చిన్నారులు దానిని నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అలాగే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, చాటింగ్ డేటా వంటి సమాచారాన్ని ఏఐ ప్లాట్ఫారమ్లలో పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీతో డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలు సృష్టించడం సులభమవుతోంది. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 33 శాతం మంది టీనేజర్లు వారి అనుమతి లేకుండా వారి ఫొటోలను ఉపయోగించి డీప్ఫేక్ చిత్రాలు రూపొందించారని తెలిపారు. అలాగే 54 శాతం మంది ఇలాంటి కంటెంట్ను అందుకున్నట్లు చెప్పారు. యూకేలో 8 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో దాదాపు 22 శాతం మంది ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. 40 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలకు ఏఐ భద్రత గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ వివరించలేదు. ఏఐ వాడే పిల్లల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆరోగ్యం లేదా శరీరానికి సంబంధించిన సలహాల కోసం చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఆరుగురిలో ఒకరు (సుమారు 17 శాతం) ఏఐ ద్వారా అనుచిత కంటెంట్ చూశామని తెలిపారు.ఈ నేపధ్యంలో పిల్లల విద్య, మానసిక అభివృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనతో కొన్ని దేశాలు పాఠశాలల్లో ఏఐ వినియోగంపై నియంత్రణ విధించాలని భావిస్తున్నాయి. కానీ ఏఐను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు. పిల్లలు దానిపై పూర్తిగా ఆధారపడకుండా, ఇతర మంచి విషయాలవైపు మళ్లేలా వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాగే తప్పుడు సమాచారం, గోప్యత, డీప్ఫేక్ ముప్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన సాధనం. అయితే నియంత్రణ లేకుండా వినియోగిస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్–2025 అధ్యయనం ప్రకారం ఏఐ వినియోగం ఇలా..జనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగిస్తున్న విద్యార్థులు – 35 శాతంవీరిలో సందేహాల నివృత్తికి – 73 శాతంకొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి – 48 శాతంపరీక్షల సన్నద్ధతకు – 32 శాతంఅమెరికాలో కామన్సెన్స్ మీడియా 2026 అధ్యయనం ప్రకారం..9 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో ఏఐ వినియోగిస్తున్న వారు – 86 శాతం వీరిలో నిత్యం ఏఐతో మమేకమయ్యే వారు – 25 శాతంఏఐ కంపానియన్ చాట్బాట్ల ఉపయోగించే టీనేజర్లు – 72 శాతంరోజూ వాటితో మాట్లాడేవారు – 13 శాతం -
ఏఐతో ట్రాఫిక్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిజికల్ ఇంటెలిజెన్స్ను వినియోగించేందుకు వీలుగా హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అనలాగ్ ఏఐ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నాయి. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మేఘా ఇంజనీరింగ్ ఎండీ పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ట్రాఫిక్ రద్దీకి, వాతావరణ మార్పులకు అనుగుణంగా సిగ్నళ్లు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు,ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి అనలాగ్ ఏఐ, మేఘా ఇంజనీరింగ్ భాగస్వామ్యంలో చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, కిప్మాన్ సీఎంకు వివరించారు. ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా నియంత్రణకు చర్యలు తీసుకోవడం, నీటి లీకేజీని గుర్తించి పైపులైన్ల మరమ్మతుల నిర్వహణకు ముందస్తు సూచనలు చేయడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వాడకం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వడం వంటి కాగ్నిటివ్ సిటీ సదుపాయాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను అనలాగ్ ఐఏ సీఈఓ కిప్మాన్ రేవంత్రెడ్డికి వివరించారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. నగరంలో అడ్వాన్స్డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సెన్సార్లు, రొబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ పరికరాల వినియోగంతో సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే నగర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వాల పనితీరు సామర్థ్యం పెంపు, పౌర సేవల మెరుగుదల, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీకి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఎలా దోహదపడుతుందో ఇరు సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఎం.ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ బి.అజిత్రెడ్డి పాల్గొన్నారు. -
టాలీవుడ్లో ఫస్ట్ ఏఐ మూవీ.. ఆసక్తిగా పోస్టర్
తెలుగు సినీ పరిశ్రమలో వస్తోన్న పూర్తిస్థాయి తొలి ఏఐ మూవీ 'అంబాస్ రివెంజ్'. ఈ సినిమాకు జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా ఏఐ విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిస్తున్నారు. ఏఐ డిజైన్ డెవలప్మెంట్ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్తి స్థాయి కృత్రిమ మేధ సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా అంబాస్ రివెంజ్ నిలవనుంది.భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని దర్శకుడు జయవర్ధన్ తెలిపారు. ఈ చిత్ర నిర్మాణంలో పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని.. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు జయవర్ధన్ వెల్లడించారు. టాలీవుడ్లో ఫస్ట్ టైమ్ ఏఐ ఆధారిత మూవీ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. -
చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ Steven Spielberg తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.2001 జూన్ 29న A.I. Artificial Intelligence రిలీజ్అయ్యింది. జులై మొదటి వారంలో భారత్లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్ మేధస్సు, స్పీల్బర్గ్ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. ఈ కథలో డేవిడ్ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. -
డేటా సెంటర్లపై బేజారు
చార్లీ చాప్లిన్ అద్భుత దృశ్యకావ్యాల్లో ఒకటైన ‘గోల్డ్ రష్’ నిరుడు శతవసంతాలు పూర్తిచేసుకుంది. 1890ల్లో కెనడాలోని క్లోన్డైక్ ప్రాంతంలో బంగారం గనులున్నాయని వెల్లడై ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది జనం అక్కడికి పరుగులు తీయడం, పోటీపడటం కథాంశం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించిన డేటా సెంటర్లలో పెట్టుబడుల్ని ఆకర్షించటానికి అలాగే పరుగులు తీస్తున్నాయి. నిరుడు అక్టోబర్లో ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన విశ్లేషణ డేటా సెంటర్ల సామర్థ్యం మరో నాలుగేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువుకాటకలు, ఇతర వాతావరణ దుష్ఫలితాల కారణంగా డేటా సెంటర్ల వార్షిక ఖర్చులు 2035కు 8,100 కోట్ల డాలర్లనుంచి 2065 నాటికి 16,800 కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహించటానికి... ఓటీటీలు, యూట్యూబ్వంటి వాటికోసం లైబ్రరీల నిర్వహణకూ, ఇతరేతర వినియోగానికీ డేటా సెంటర్లున్నాయి. ఏఐ రాకతో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. డేటా సెంటర్ల విస్తరణతోపాటే వాటికి సంబంధించిన అవగాహన మొదలైంది. వాటివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఆన్లైన్ సెర్చ్లతో పోలిస్తే ఏఐ ఆధారిత సెర్చ్లు పది రెట్లు అధిక విద్యుత్ను తీసుకుంటున్నా యని గణాంకాలు తేల్చాయి. ఈమధ్య విడుదలైన ఐక్యరాజ్యసమితికి చెందిన యూనివర్సిటీ అధ్యయన నివేదిక డేటా సెంటర్లను చల్లబరచడానికి బిలియన్లకొద్దీ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డేటా సెంటర్ల వల్ల తాగునీటి హక్కులకూ, వ్యవసాయానికీ తీవ్ర విఘాతం కలుగుతోందని హెచ్చరించింది. వీటిని అనుమతించే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరు లున్న ప్రాంతాలనే ఎంచుకునేలా చూడాలని సూచించింది. వినియోగిస్తున్న నీరు ఆవిరయ్యే ప్రస్తుత విధానానికి బదులు నీటి అవసరం లేని ఎయిర్ కూలింగ్, లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్వైపు మారేలా డేటా సెంటర్లపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. డేటా సెంటర్లు తాము వినియోగించే నీరు, విద్యుత్ ఎంతో... విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఎంతో తెలిపే డేటాను అందరికీ అందుబాటులో ఉంచేలా నిబంధనలు రూపొందించాలని తెలిపింది. డేటా సెంటర్లపై అక్కడక్కడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఈ సెంటర్లు పెరగటాన్ని నిరసిస్తూ ఉద్యమాలు జరగటంతో కొత్తవాటిపై కఠిన మైన ఆంక్షలు విధించారు. నెదర్లాండ్స్లో కూడా రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళ నలు చేశారు. దాంతో హైపర్స్కిల్ డేటాసెంటర్ల నిర్మాణాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సింగపూర్లో పర్యావరణహిత సెంటర్లకు పరిమితమైన అనుమతు లిస్తున్నారు. చిలీలో డేటా సెంటర్ ఏర్పాటుపై జనం తిరగబడటంతో గూగుల్ సంస్థ గాలితో చల్లబరిచే సాంకేతికత దిశగా ప్రాజెక్టును డిజైన్ చేసుకుంది. ఏడాదిలో 365 రోజులూ వేలాది సర్వర్ రాక్లూ, డిజిటల్ డేటాను భద్రపరిచే హార్డ్ డ్రైవ్లూ, నెట్వర్కింగ్ పరికరాలూ, లక్షలసంఖ్యలో యూపీఎస్లు పనిచేస్తుండటంవల్ల వాటిని చల్లబరచటానికి నిరంతరాయంగా నీరు అవసరమవుతుంది. భారీగా విద్యుత్ కావలసివస్తుంది. ఇక ఆ సెంటర్లలోవాడే భారీ కూలింగ్ ఫ్యాన్లు , ఇండస్ట్రియల్ ఏసీల వల్ల ఒకరకమైన ధ్వని తప్పదు. పగలు ఇతర చప్పుళ్లతో ఇది కలిసిపోయినా, రాత్రివేళల్లో మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ధ్వని వినబడుతుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో, అమెరికాలోని వర్జీనియాలో కేవలం ఈ కారణం వల్లే స్థానికులు కోర్టులకెక్కారు. ప్రజల ఒత్తిళ్లతో ఈమధ్య కాలిఫోర్నియాలోని ఒక మున్సిపాలిటీ కొత్త డేటా సెంటర్లపై నిషేధం విధించింది. వీటన్నిటి నేపథ్యంలో నీటి అవసరం పెద్దగా లేని సాంకేతికతలు వస్తున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికత ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వినియోగించకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరిస్తే, ఆ సెంటర్లు వినియోగించే పర్యావరణహిత సాంకేతికతల సమాచారాన్నీ, వాటి ఉద్గారాల పరిమాణాన్నీ ప్రజలకూ, పర్యావరణవేత్తలకూ అందుబాటులో ఉంచితే ప్రజల్లో ఉండే ఆందోళన తగ్గుతుంది. -
డేటా దండుపాళ్యం.. మీపై స్మార్ట్ నిఘా!
టెక్నాలజీ దూకుడు ఎక్కువయ్యాక ప్రపంచం ‘జగమంత స్మార్ట్ కుటుంబం’ అయిపోయింది. ఇళ్లు, వాకిళ్లు, వంటిళ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఆఖరికి టూత్బ్రష్లను కూడా ఇంట్లోని నెట్ నడిపిస్తోంది. కానీ, ఈ సౌకర్యాలు, సదుపాయాల వెనుక మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్కు చెందిన ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీవో), ‘విచ్’ అనే సంస్థ కలిసి ప్రత్యక్షంగా తమ దేశ పౌరులను, పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.ఏమిటా ప్రమాదం?!డీప్ ఫ్రయింగ్, తందూరీ రోస్టింగ్–గ్రిల్లింగ్, రీహీటింగ్, బేకింగ్, బంగాళా దుంపల చిప్స్.. వీటన్నిటి తయారీకి వంటగదుల్లో మనం వినియోగించే ఎయిర్ ఫ్రయర్లు మన లొకేషన్ను ట్రాక్ చేస్తున్నాయని, మన మాటలను రికార్డ్ చేస్తున్నాయని, ఆ సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు కలకలం రేపాయి. అయితే అవి కేవలం వార్తలు కావని, వాస్తవాలేనని ఐసీవో, విచ్ ఇప్పుడు నిర్ధారణగా ప్రకటించాయి! అలాగే, మన ఇళ్లల్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీలు మనం ఎప్పుడు, ఏమి వీక్షిస్తున్నామో గమనిస్తూ మన వ్యక్తిగత వివరాలను ప్రకటనల కంపెనీలకు విక్రయిస్తున్నాయట!బ్రిటన్ లాంటి దేశాల్లోనే మూడింట ఒక వంతు ప్రజలు ఇంతకాలం తమ డేటా ఎలా చోరీ అవుతోందో కనిపెట్టలేకపోయారు. ఇక మన దేశంలోని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చు! భారత్లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవం తర్వాత కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు కనుక మనపై స్పయింగ్కు సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది.మాటల్నీ రికార్డు చేస్తుంటాయి!టోస్టర్లు, ఎయిర్ ఫ్రయర్ల వంటి స్మార్ట్ పరికరాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండవచ్చని ఐసీవో అప్రమత్తం చేశాక బ్రిటన్ ప్రజల్లో జాగ్రత్త మొదలైంది. అక్కడి జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక స్మార్ట్ పరికరం వాడుతుండగా, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ఆ పరికరాలు వినియోగదారుల నుంచి సేకరిస్తున్నాయని ‘విచ్’ పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్తో పనిచేసే కొన్ని ఎయిర్ ఫ్రయర్లు, ‘ఆన్’ చేయగానే వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ అడుగుతాయి. అంతేకాదు వారి ఫోన్ల ద్వారా ఆడియోను (మాటలను) కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరింతగా మెరుగైన సేవల్ని అందించటానికి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటామని ఆ గాడ్జెట్లు చెబుతుంటాయి. అయితే అవి, తాము సేకరించిన సమాచారంలో కొంత భాగాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తున్నట్లు ‘విచ్’ పరిశోధనలో బహిర్గతం అయింది.దినచర్యల వివరాలు సైతం!!‘విచ్’ బ్రిటన్లోని అతి పెద్ద వినియోగదారుల హక్కుల పరిరక్షక, పర్యవేక్షక స్వతంత్ర సంస్థ. ‘‘మీ ఇంట్లో ఉండే గాడ్జెట్లు అన్నింట్లోకీ స్మార్ట్ టీవీ మరీ ప్రమాదకరంగా మారుతోంది. మీరు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఇది సేకరిస్తుంది’’ అని విచ్ చెబుతోంది. ‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఇంట్లోని టీవీలు మీ సమాచారాన్ని పూర్తిగాలాగేస్తుంటాయి’’ అని ఐసీవో రెగ్యులేటరీ రిస్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలయం మాల్కం అంటున్నారు. ‘‘స్మార్ట్ పరికరాలు మన ఆరోగ్యం, మన దినచర్యలు, మన కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి’’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.స్మార్ట్ పరికరాలను తయారుచేసే కంపెనీలు, డెవలపర్ల కోసం ఐసీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సమయంలోనే ఈ తాజా హెచ్చరిక వెలువడింది. వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై కంపెనీలకు ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం వంటి కొన్ని సరైన కారణాల కోసం కొంత సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే ఐసీవో అంగీకరించింది. అయితే స్మార్ట్ పరికరాలు వాటికి నిజంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని, ఆ సమాచారాన్ని ఎలా వాడుతున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాలని, ఆ సమాచారంపై ప్రజలకే నియంత్రణ ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.కొనడం ఆపటం లేదు!ఇంట్లోని స్మార్ట్ పరికరాలు తమ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్న లక్షలాది మంది బ్రిటన్ ప్రజలకే కాదు, మిగతా ప్రపంచదేశాలకూ ఈ నియమాల విధింపు మంచి పరిణామం. బ్రిటన్కి చెందిన 2,000 మందికి పైగా వయోజనులపై ఐసీవో చేసిన సర్వేలో... తమ పరికరాలు సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తమకు తెలియదని మూడింట ఒక వంతు మంది ప్రజలు చెప్పారు.అలాగే, ఒక స్మార్ట్ టోస్టర్ (బ్రెడ్ కాల్చేది) లేదా స్మార్ట్ టూత్బ్రష్ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని సర్వేలో పాల్గొన్నవారిలో ముప్పావు వంతు మంది చెప్పారు. ఈ సమాచార సేకరణ పట్ల తమకు ఆందోళన ఉందని 40 శాతం మంది బ్రిటన్ ప్రజలు చెబుతుండగా, మరికొందరు (15 శాతం మంది) ఇదే కారణంతో ఇలాంటి సాంకేతిక పరికరాలను అస్సలు కొనడం లేదు. అయినప్పటికీ, బ్రిటన్ ప్రజలు తమ ఇళ్లను ఇలాంటి నిఘా పెట్టే పరికరాలతో నింపేయడం మాత్రం ఆపలేదు.పైగా ఈ డేటా సేకరణ వల్ల వచ్చే వినియోగ పరమైన లాభాల కోసం స్మార్ట్ పరికరాలను కొనడానికి సిద్ధంగా ఉన్నామని యూకేలోని దాదాపు సగం మంది వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మాల్కం మాట్లాడుతూ: ‘‘ఈ పరికరాలు మన జీవితాలను సులభతరం చేయడానికి తయారవుతాయి. అంతకు మించి వీటికి మన వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టకూడదు’’ అంటున్నారు.డేటాను లాగి, ఏం చేస్తారు?మనం టీవీలో ఏమేం చూస్తున్నామో పూర్తి వివరాలను తెలుసుకొని, మన అలవాట్లకు సంబంధించిన ఒక పెద్ద నివేదికను తయారు చేయడానికి గాడ్జెట్లు చాలా సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు నచ్చే షోలు లేదా సినిమాలను సూచించడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ప్రకటనలు చూపించటం వరకు పర్వాలేదని, టీవీ తయారీ కంపెనీలు అంతకంటే ముందుగా వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీవో ఆదేశాలు జారీ చేసింది.ఇక గాడ్జెట్ తయారీ కంపెనీలు చట్టాన్ని పాటిస్తున్నాయా లేదా, వినియోగదారులకు నిజమైన పారదర్శకతను అందిస్తున్నాయా లేదా, వారి అనుమతిని నిజంగానే తీసుకుంటున్నాయా లేదా అని పరిశీలించడానికి ‘విచ్’ సంస్థ ఈ ఏడాది చివర్లో ఆయా కంపెనీలతో మాట్లాడనుంది.ఏమైనా, కన్జ్యూమర్ల డేటా చైనా వంటి ప్రమాదకర దేశాలకు చేరడం వల్ల ముఖ్యంగా గోప్యతా ప్రమాదాలు ఉంటాయి. చైనా చట్టాల ప్రకారం అక్కడ ఉండే కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను అక్కడి ప్రభుత్వానికి తప్పనిసరిగా అప్పగించాలి; దీనివల్ల మీ వై–ఫై నెట్వర్క్ వివరాలు, లొకేష¯Œ , డివైజ్ పాస్వర్డ్లు వేరే దేశం చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత ప్రొఫైల్ను బిల్డ్ చేసి, మీ ప్రమేయం లేకుండానే థర్డ్–పార్టీ సంస్థలకు ఆ డేటాను అమ్ముకోవడం లేదా ప్రకటనల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.చైనా సర్వర్లకు మన వివరాలు!విచ్ సంస్థ చేసిన పరిశోధనలో ఐగోస్టార్, షియోమి మి స్మార్ట్, కొసోరి అనే మూడు కంపెనీల ఎయిర్ ఫ్రయర్ల వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ తెలుసుకుంటున్నాయని, యూజర్ల ఫోన్లలోని ఆడియోను రికార్డ్ చేయడానికి అనుమతి అడుగుతున్నాయని తేలింది.షియోమి ఎయిర్ ఫ్రయర్కు సంబంధించిన యాప్... ఫేస్బుక్, పాంగిల్ (ఇది టిక్టాక్ బిజినెస్ ప్రకటనల నెట్వర్క్), చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ వంటి వాటి ట్రాకర్లకు కనెక్ట్ అయి ఉంది. (ఇది వినియోగదారుడు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది). మరోవైపు, ఐగోస్టార్ ఎయిర్ ఫ్రయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే వినియోగదారుల జెండర్, పుట్టిన తేదీని అడుగుతోంది. అంతేకాదు, ఐగోస్టార్, షియోమి ఎయిర్ ఫ్రయిర్లు రెండూ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపించాయి. అయితే ఆ విషయాన్ని వారు తమ ప్రైవసీ నోటీసులో ముందే పేర్కొన్నారు. ఇక కొన్ని స్మార్ట్ స్పీకర్లలో కూడా ఫేస్బుక్, గూగుల్కు సంబంధించిన ఇలాంటి ట్రాకర్లు కిక్కిరిసినట్లుగా నిండి ఉన్నాయి! ‘‘మన లొకేషన్ను ట్రాక్ చేసే ఎయిర్ ఫ్రయర్ల నుండి, మన పుట్టిన తేదీని అడిగే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వరకు... ఈ స్మార్ట్ పరికరాలు వాటికి అవసరమైన దానికంటే లేదా మనం అంగీకరించదగిన దానికంటే చాలా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని మా గత పరిశోధనలు పదే పదే నిరూపించాయి’’ అని విచ్ సంస్థకు చెందిన టెక్ నిపుణుడు ఆండ్రూ లాఫ్లిన్ వెల్లడించారు.‘‘అవసరం లేని సమాచార సేకరణను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు వారి సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడంపై నిఘా సంస్థ (రెగ్యులేటర్) కొత్త మార్గదర్శకాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచి విషయం’’ అని ఆయన అంటున్నారు. ఇక, స్మార్ట్ టీవీలు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారంపై తమకు ప్రత్యేక ఆందోళనలు ఉన్నాయని కూడా ఐసీవో తెలిపింది.స్మార్ట్ వలలో పడకుండా ఐదు చిట్కాలుమీ స్మార్ట్ పరికరాలు మీపై నిఘా పెట్టకుండా కాపాడుకోవడానికి ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ 5 చిట్కాలు చెబుతోంది. కొనడానికి ముందే రీసెర్చ్ (పరిశోధన) చేయండి: మీరు ఏదైనా పరికరాన్ని కొనే ముందే, అది ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుందో సరిచూసుకోండి. ఆ పరికరం అడిగే సమాచారాన్ని దానికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.పర్మిషన్లపై (అనుమతులపై) నియంత్రణ కలిగి ఉండండి: పరికరాన్ని సెటప్ చేసేటప్పుడు, అది ఏయే విషయాలను యాక్సెస్ చేయాలో నియంత్రించడానికి ‘ప్రైవసీ కంట్రోల్స్’ ఉపయోగించండి. ఏదైనా అనుమతి అనవసరం అనిపిస్తే, దానికి అస్సలు అంగీకరించకండి.మీ పరికరానికి భద్రత కల్పించండి: ఇతరులు మీ పరికరాన్ని వాడుకోకుండా ఉండటం కోసం ఒక బలమైన, విభిన్నమైన పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. వీలైనప్పుడల్లా ‘టూ–స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోండి.అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి: సాఫ్ట్వేర్ అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోని సెక్యూరిటీ ప్యాచెస్ కొత్త ముప్పుల నుండి మీ డేటాను రక్షిస్తాయి.పరికరాన్ని వదిలించుకునే ముందు మీ డేటాను పూర్తిగా తుడిచేయండి: మీరు మీ స్మార్ట్ పరికరాన్ని ఎవరికైనా అమ్మేస్తున్నా లేదా పారేస్తున్నా... ముందుగా దాన్ని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్బోట్లకో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం. ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపంచిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు) క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటంఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)సాక్షి, బిజినెస్ -
ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో దాదాపు పావు శాతం పైగా కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ)పై ప్రయోగాలు చేసే దశ నుంచి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వైపు మళ్లాయి. తద్వారా ఆ సంస్థలు ఇప్పటికే ఏఐ సర్వీసుల ద్వారా 10–12 బిలియన్ డాలర్ల ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ న్యూయార్క్ సిటీలో నిర్వహించిన సీఈవోల సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను వారు తోసిపుచ్చారు. ఐటీ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పదే పదే పునరావృతమయ్యే పనులను చేయడం తగ్గుతుందని వివరించారు.. ఏఐ గవర్నెన్స్, అప్లికేషన్ల ఆధునీరణ, సైబర్సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందని నాస్కామ్ తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ 20 లక్షల మంది పైగా ఉండగా, అధునాతన ఏఐలో ట్రైనింగ్ తీసుకున్న వారు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం 85 శాతం టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫాంలు ఉన్నట్లు వివరించింది. ఏజెంటిక్ ఏఐతో టెక్ సేవలకు డిమాండ్ ఏజెంటిక్ ఏఐతో సైబర్సెక్యూరిటీ, గవర్నెన్స్, కార్యకలాపాల ఆధునీకరణ తదితర విభాగాల్లో డిమాండ్ నెలకొంటుందని నాస్కామ్ తెలిపింది. దీనితో 2030 నాటికి టెక్నాలజీ సర్వీసులపై 300 – 400 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించే అవకాశం ఉందని వివరించింది. ఏఐని వినియోగంలోకి తెచ్చే క్రమంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా విస్తరించేందుకు కంపెనీలకు స్పెషలిస్ట్ పార్ట్నర్లు అవసరమవుతారని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. మోడల్స్, అప్లికేషన్స్, డేటా ప్లాట్ఫామ్లు, సైబర్సెక్యూరిటీ నియంత్రణలు, పరిశ్రమ వ్యవస్థలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానించే విశ్వసనీయమైన మోడల్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా కూడా సురక్షితంగా, సమర్ధవంతంగా జరిగేలా చూడటంలోనే ఐటీ సర్వీసుల అసలు సామర్థ్యాలు బైటపడతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కాకుండా డొమైన్ సంబంధ సొల్యూషన్స్ కనుగొనడం, ఫలితాలను కచ్చితంగా డెలివర్ చేయడంపైనే ఐటీ పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నంబియార్ తెలిపారు. బిజినెస్ ప్రాసెస్ సర్వీసులనేవి పనులను రొటీన్గా చేయడం కాకుండా తెలివిగా పూర్తి చేసే విధానాలకు మళ్లుతాయని కాగి్నజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. -
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా?
ముంబై: మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ కళాఖండాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి వెనుక ఉన్న చారిత్రక ఆధారాలను వెలికితీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సాంకేతికతను ఉపయోగించనున్నారు. భారతదేశం తరఫున ఈ అరుదైన ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపును సాధించడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు.హరప్పా నాగరికత కంటే పురాతనమైన శిల్పాలుఈ పెట్రోగ్లిఫ్స్ మహారాష్ట్ర తీర ప్రాంతాలైన రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోని లాటరైట్ పీఠభూములపై లభించాయి. ఇక్కడ రాళ్లపై చెక్కిన తాబేళ్లు, ఏనుగులు, నెమళ్లు, ఖడ్గమృగాల ఆకారాలు అబ్బురపరుస్తున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శిల్పాలు క్రీస్తుపూర్వం 20,000 నుండి 10,000 సంవత్సరాల నాటివి. అంటే ఇవి హరప్పా నాగరికత కంటే కూడా ఎంతో పురాతనమైనవి. కొంకణ్ ప్రాంతంలోని 107 గ్రామాల్లో దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శిల్పాలు, భారతదేశంలోనే ఆదిమానవుల తొలి కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.రంగాన నిలిచిన ఐఐటీ మద్రాస్ సాంకేతికతఈ భారీ శిల్పాలను మానవ రహితంగా డాక్యుమెంట్ చేయడం కష్టతరమైన పని కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 15 కోట్ల బడ్జెట్ను కేటాయించి, నాలుగేళ్ల ప్రాజెక్టును రూపొందించింది. ఈ బాధ్యతను ఐఐటీ మద్రాస్కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘ఐఐటీ ప్రవర్తక్’ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కింద డ్రోన్ల ద్వారా హై-రిజల్యూషన్ వైమానిక చిత్రాలను సేకరించి, వాటిని ఏఐ సిస్టమ్స్ ద్వారా విశ్లేషిస్తారు. రాతి ఉపరితలాలు దెబ్బతిన్న చోట ఏఐ సాయంతో వాటిని పునర్నిర్మించి, ప్రపంచంలోని ఇతర పురాతన నాగరికతలతో పోల్చి పరిశోధనలు చేస్తారు.యునెస్కో గుర్తింపే అంతిమ లక్ష్యంఈ శిల్పాల్లో గుర్రాలు, ఎద్దుల ఆకారాలు ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది అవి వ్యవసాయం, రవాణా యుగానికి పూర్వపు మధ్యరాతి యుగానికి చెందినవని నిరూపిస్తోంది. 2025లోనే ఈ ప్రాంతం యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినప్పటికీ, శాశ్వత గుర్తింపు కోసం పూర్తి స్థాయి పరిశోధన నివేదిక అవసరం. రాబోయే 2030 నాటికి యునెస్కో తుది నామినేషన్ దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ ఏఐ అధ్యయనాన్ని వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను, పురాతత్వ పరిశోధనలను మిళితం చేస్తూ సాగుతున్న ఈ ప్రయోగం మహారాష్ట్ర ప్రాచీన సంపదను ప్రపంచ వేదికపై నిలపనుంది. -
ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్!
సంవత్సరాలుగా ఫుడ్ డెలివరీ యాప్లు ఒకేరకంగా ఉంటున్నాయి. యాప్ను ఓపెన్ చేసి, రకరకాల రెస్టారెంట్లను బ్రౌజ్ చేసి, మెనూలను పోల్చి, సిఫారసులను స్క్రోల్ చేసి, చివరికి ఒక ఆప్షన్ను ఖరారు చేసుకుంటారు. ఈ మోడల్కు మంచి స్పందన వచ్చినప్పటికీ చిన్న చిన్న నిర్ణయాలను కూడా సుదీర్ఘమైన ప్రక్రియగా మారుస్తుంది.ఈ నేపథ్యంలో క్విక్ రికమెండేషన్ కోసం వచ్చింది ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, ఫుడ్ డెలివరీ కంపెనీ డోర్ డాష్. ఇంక్ వారి సరికొత్త ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్ రెస్టారెంట్ జాబితాలు, మెనూలు, ఫిల్టర్లను స్క్రోల్ చేయడానికి బదులుగా, తాము ఏమి కోరుకుంటున్నారో కస్టమర్లు చాట్బాట్కు సరళమైన భాషలో చెప్పవచ్చు.యాప్లో ఆర్డర్ చేయడాన్ని నావిగేట్ చేయడంలా కాకుండా, సహజమైన సంభాషణలా అనిపించేలా రూపొందించబడింది. ఫుడ్ ఆర్డర్ చేయడం, కిరాణా సామాను కొనడం, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకోవడం లాంటి పనికైనా మన అభ్యర్థనను ఏఐ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. చిత్రాలను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా చిత్రాల ద్వారా కూడా మన అభ్యర్థనను అర్థం చేసుకోగలుగుతుంది. కస్టమర్లు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.ఒక నిర్దిష్ట రెస్టారెంట్ కోసం వెదకడం, వందలాది ఆప్షన్లను స్క్రోల్ చేయడం వంటివి చేయకుండా, కస్టమర్లు తాము ఏమి కోరుకుంటున్నారో సులభంగా వివరించి, వారి ప్రాధాన్యతను ఆధారంగా సలహాలు తీసుకోవచ్చు. -
అమెజాన్ పెట్టుబడుల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు. డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు. 20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు.. తాజా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది. అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్వర్క్కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్వర్క్ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ.. తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్ప్రైజ్లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. 2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫిజిక్స్వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
మనకు కావాలి ‘ఏఐ రిస్క్ ఫండ్’
సాక్షి స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన కళ్ల ముందే సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిస్తోంది. నిత్యం చేసే పనులు, డేటా విశ్లేషణ వంటి రంగాలను ఏఐ వేగంగా భర్తీ చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా, కాలేజీ పూర్తి చేసుకుని బయటకొచ్చే యువతకు మొదటి ఉద్యో గం సంపాదించడం మునుపటి కంటే సవాలుగా మారవచ్చు. మారుతున్న కాలంలో పిల్లలను కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా మార్చకుండా.. సృజనాత్మకంగా ఆలో చించేలా, సరికొత్త నైపుణ్యాలు పెంపొందించుకునేలా, ఏఐతో కలిసి పనిచేసేలా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు.‘ఏఐ రిస్క్ ఫండ్’ నేటి తరం అత్యవసరం!మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల భవి ష్యత్తు కోసం ‘ఏఐ రిస్క్ ఫండ్’ లేదా ఒక ప్రత్యేకమైన పొదుపు ఖాతాను ఏర్పాటు చేయడం ఇప్పుడు చాలా అవసరం. పిల్లల పెళ్లిళ్లకు, కాలేజీ ఫీజులకు డబ్బు దాచినట్లే.. ఏఐ యుగంలో వారి కెరీర్ స్థిరపడే వరకు ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒక ‘రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్’ అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతాన్ని గమనిస్తే, ఏ కొత్త సాంకేతికత వచ్చినా పాత ఉద్యోగాలను తుడిచేసి, సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, పాతవి పోవడానికి, కొత్తవి పుట్టుకురావడానికి మధ్య కొంత సమయం (ట్రాన్సిషన్ పీరియడ్) పడుతుంది. ఈ లోపు పిల్లలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడకుండా నిలబడడానికి ఈ ‘రిస్క్ ఫండ్’ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఏఐని శత్రువుగా కాదు.. మిత్రుడిగా చూడాలి!ఒకప్పుడు మంచి మార్కులు, పెద్ద డిగ్రీలు ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ నేడు కేవలం మార్కులు సరిపోవు. ఏఐ యుగంలో రాణించాలంటే సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, వినూత్న ఆలోచనలు ప్రాణాధారాలు. పిల్లలు ఏఐని చూసి భయపడకుండా, దానిని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా, ఏఐ నుంచి సరైన సమాధానాలు రాబట్టడానికి ‘సరైన ప్రశ్నలు అడగడం’ అనేది అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారబోతోంది.‘ఏఐ ఫండ్’ వల్ల ముఖ్య ప్రయోజనాలుపిల్లలు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం ఏఐ వల్ల మారిపోతే, వారు తక్షణమే మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని (ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ మొదలైనవి) నేర్చుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. చదువు పూర్తి కాగానే వెంటనే ఉద్యోగం రాకపోయినా, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, తదుపరి కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫండ్ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం వెతకడం కంటే, సొంతంగా ఏఐ టూల్స్ ఉపయోగించి స్టార్టప్లు లేదా సరికొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ పొదుపు మొత్తమే తొలి పెట్టుబడిగా మారుతుంది. -
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్లో ‘స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెటా షాక్.. ఉద్యోగుల డేటా లీక్!
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.ప్రైవేట్ చాట్స్ లీక్ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్క్రిప్షన్లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్ను ఆపేసింది. అయితే.. ఈ లీక్పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యంనిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు! -
భారత్కు సొంత ‘డీప్సీక్’ ఉండాలి
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీపై పట్టు సాధించాలన్నా, అంతర్జాతీయంగా పోటీపడాలన్న భారత్ తనకంటూ సొంతంగా ’డీప్సీక్’లాంటి ఏఐ మోడల్ని తయారు చేసుకుని తీరాలని బ్రోకరేజ్ దిగ్గజం బెర్న్స్టైన్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో అమెరికా లేదా చైనాకు చెందిన ఏఐ మోడల్స్పై ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా మరో దేశంపై ఆధారపడటం వల్ల రిస్క్ లు తప్పవని హెచ్చరించింది. లేటెస్ట్ ఏఐ మోడల్స్ అందరికీ అందకుండా అమెరికా ఇటీవల ఆంక్షలు విధించడమనేది గ్లోబల్గా ఏఐ రేసులో కీలక మలుపని అభివర్ణించింది. అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని (ఎల్ఎల్ఎం) దేశాలు.. వ్యాపారపరమైన లాభాలు తెచ్చిపెట్టే సాఫ్ట్వేర్గా కాకుండా వ్యూహాత్మక అసెట్స్గా పరిగణిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని కూడా నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో భారత్ విదేశీ ఏఐ మోడల్స్పై ఆధారపడుతూ, కేవలం అప్లికేషన్ డెవలప్మెంట్పైనే దృష్టి పెట్టే పక్షంలో భవిష్యత్ తరపు టెక్నాలజీపై నియంత్రణ కోల్పోయే ముప్పు తలెత్తుతుందని బెర్న్స్టైన్ పేర్కొంది. ‘వేరే వాళ్ల దగ్గరనుంచి అప్పుగా తీసుకున్న మోడల్స్ ఆధారంగా భారత్ తన ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేదు. విదేశీ ఎల్ఎల్ఎంల ఆధారంగా అప్లికేషన్లను తయారు చేసేటువంటి ప్రస్తుత వ్యూహం వల్ల భౌగోళిక రాజకీయపరమైన రిస్క్ లను ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. ఏఐ.. కొత్త తరం ఫైటర్ జెట్.. కృత్రిమ మేధ మోడల్స్ని మిలిటరీ అసెట్స్గా బెర్న్స్టైన్ అభివర్ణించింది. సెమీకండక్టర్ పరికరాలు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) నుంచి వినూత్న ఏఐ మోడల్స్ వరకు అధునాతన సాంకేతికతలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ‘ఏఐ అనేది కొత్త తరం ఫైటర్ జెట్‘లాంటిదని పేర్కొంది. ఫౌండేషనల్ మోడల్స్ని వివిధ దేశాలు కేవలం సాఫ్ట్వేర్ ఉత్పత్తులుగా కాకుండా వ్యూహాత్మక వనరులుగా పరిగణిస్తున్నాయని వివరించింది. దేశ భద్రత, ఇతర దేశాలపై ఆర్థికంగా పైచేయి సాధించే కోణంలో వాటిని కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నాయని నివేదిక తెలిపింది. -
భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ ధరలు: కారణం ఇదే!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై కూడా పడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో ఏఐ అభివృద్ధికి అవసరమైన మెమరీ, స్టోరేజ్ చిప్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వాటి కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితి కారణంగా.. భవిష్యత్తులో గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణ కోసం భారీ స్థాయిలో మెమరీ చిప్లు అవసరమవుతున్నాయి. ఈ చిప్లను స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం.. ఈ మార్కెట్ను ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాగా.. ఏఐ కంపెనీల భారీ కొనుగోళ్లతో చిప్ల ధరలు గణనీయంగా పెరిగాయి.మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరలు పెరగనున్నట్లు టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే చిప్ల ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని, ఈ భారాన్ని కంపెనీలు భరించడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం స్మార్ట్ఫోన్ తయారీ ఖర్చులో 8 నుంచి 12 శాతం వరకు మెమరీ చిప్ల కోసం ఖర్చు చేస్తున్నారు. డిమాండ్-సప్లై అసమతుల్యత కారణంగా తయారీదారులు ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప మరో మార్గం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారతీయ వినియోగదారులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చిప్ల ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై అదనపు భారం పడుతోంది.రాబోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చిప్ తయారీ సంస్థలు, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, కొత్త తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు చిప్ల కొరత కొనసాగవచ్చని, ఫలితంగా గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో గ్యాడ్జెట్స్ ధరలు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. -
ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే!ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.వాయిస్ క్లోనింగ్ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్ కూడా ఉంది. రియల్టైమ్లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్ రోబో ధర సుమారు రూ. 4,500. -
అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు!
సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరందికర్ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్ను ఇతర దేశాల వారికి నిలిపివేసిన సందర్భంలో ఆయన ఈ సూచన చేశారు.ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు ఫ్యాబిల్ 5, మైథోస్ 5ను అమెరికాయేతర సంస్థలు, వ్యక్తులు పొందకుండా ట్రంప్ సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఫ్యాబిల్ను గత వారమే ఆంథ్రోపిక్ విడుదల చేయడం గమనార్హం. ‘‘స్థానిక ఏఐ సదుపాయాలు, హార్డ్వేర్ అభివృద్ధిలో భారత్ వెనుకబడి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర సెమీకండక్టర్ చిప్లు లేదా ప్లాట్ఫామ్ల్లేవు.అమెరికా ప్రభుత్వం సరికొత్త ఎగుమతి నియంత్రణల ఆదేశాల నేపథ్యంలో టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ స్వావలంబన సాధించాలి’’అని కరందికర్ పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఏఐ అప్లికేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పౌర సేవల్లో ఏఐ అమలు దిశగా నీతి ఆయోగ్ కృషి సాగిస్తుందన్నారు. డిజిటల్ ప్రజా సదుపాయాల అభివృద్ధిలో భారత్ ముందున్నట్టు చెప్పారు. ఫౌండేషన్ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం 12 స్టార్టప్లకు ప్రభుత్వం సాయమందించినట్టు తెలిపారు. -
జియో మెగా ఐపీఓకు సై!
టెలిక, డిజిటల్ సేవల్లో సంచలనాలు సృష్టిస్తున్న జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీఓకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 49వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ పబ్లిక్ ఆఫర్ను ప్రకటించారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి జియో అడుగుపెడుతుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లీన్ ఎనర్జీ, కన్జూమర్ వ్యాపారాల్లో భారీ ప్రణాళికలకు రిలయన్స్ తెరతీసింది.ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దిశగా కీలక అడుగుపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్ఫామ్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీఓకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచినట్లు ఏజీఎంలో ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డులకెక్కనున్న ఈ ఇష్యూ ద్వారా జియో రూ.10 ముఖ విలువ గల 27 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా జియో రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ మార్కెట్ విలువను 137 బిలియన్ డాలర్లు దాదాపు (రూ.13 లక్షల కోట్లు)గా లెక్కగడుతున్నారు. జియో టాప్... దేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా రూ.27,870 కోట్ల ఇష్యూతో హ్యుందాయ్ నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇప్పుడు జియో ఇష్యూ పూర్తయితే ఈ రికార్డులన్నీ చెరిపేసి ‘టాప్’లేపనుంది. కాగా, 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓగా కూడా ఇది నిలుస్తుంది.టెలికం టు డిజిటల్ టెక్నాలజీ దిగ్గజం 2016లో సేవలు ప్రారంభించిన జియో.. దశాబ్దకాలంలో దేశ టెలికం స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. భారత్లో మొబైల్ డేటా విప్లవాన్ని తీసుకొచి్చంది. ముఖ్యంగా టెలికం నుంచి.. క్లౌడ్ సరీ్వసులు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లు, ఏఐ ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించి.. పూర్తి స్థాయి డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్గా అవతరించింది. ఏఐ ఇన్ఫ్రాతో పాటు ప్రత్యేకంగా భారత్ కోసం ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ది చేసేందుకు ఎని్వడియాతో 2023లో జియో జట్టుకట్టడం తెలిసిందే. 2026 నుంచి ఏడేళ్లలో ఏఐ కార్యకలాపాల కోసం రూ. 10 లక్షల కోట్లను వెచి్చంచనున్నట్లు కూడా అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే మెటా, గూగుల్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, వంటి దిగ్గజ సంస్థలు 20 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో ప్లాట్ఫామ్స్లో ఆర్ఐఎల్కు 66.43 శాతం వాటా మెజారిటీ వాటా ఉండగా.. మెటా 9.99%, గూగుల్ 7.73% వాటాలను దక్కించుకున్నాయి.ఇక జియో శాటిలైట్ ఇంటర్నెట్...శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్కామ్)లో సరికొత్త విప్లవానికి జియో శ్రీకారం చుడుతోంది. స్వదేశీ సమాచార ఉపగ్రహాలతో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు జియో ప్లాట్ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ‘భారత్ను జియో నేలపై అనుసంధానించింది. ఇక అంతరిక్షం నుంచి కూడా కనెక్ట్ చేయాల్సిన తరుణం వచ్చింది. దేశంలో ఇంకా మారుమూల పల్లెల్లో, ద్వీపాల్లో ప్రజలకు టెలికం సేవలు అందుబాటులో లేవు. అలాంటి వారికి శాటిలైట్ కనెక్టివిటీ వారధిగా నిలుస్తుంది. భారత్ కోసం తక్కువ భూకక్ష్యలో తిరిగే స్వేదేశీ ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని జియో పరిశీలిస్తోంది’ అని ఆకాశ్ చెప్పారు. శాటిలైట్ టెలికం, బ్రాడ్బ్యాండ్ సర్వీసులను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ప్రపంచ దిగ్గజ ఉపగ్రహ నెట్వర్క్ ప్రొవైడర్లతో జట్టుకడతామని, తద్వారా శాటిలైట్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ‘సొంతంగా గ్రౌండ్ స్టేషన్ ఇన్ఫ్రాను నెలకొల్పుతాం. స్పేస్ నుంచి గ్రౌండ్ దాకా పూర్తి స్థాయి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఎకోసిస్టమ్ ఏర్పాటే మా లక్ష్యం. ఈ చర్యలతో అంతరిక్ష రంగంలోనూ భారత స్వావలంభనను జియో బలోపేతం చేస్తుంది’ అని ఆకాశ్ పేర్కొన్నారు. కంపెనీ మొబైల్ యూజర్లందరినీ 2030 నాటికి పూర్తిగా 5జీ నెట్వర్క్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.రిలయన్స్ భవిత భద్రం.. వారసులకు వ్యాపారాల అప్పగింత ప్రణాళిక దాదాపు పూర్తయిందని ముకేశ్ చెప్పారు. ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ప్రస్తుతం గ్రూప్లోని కీలక వ్యాపారాలకు సారథ్యం వహిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను వారే చూసుకుంటున్నారు. టెలికం, రిటైల్, డిజిటల్ సర్వీసులు, న్యూ ఎనర్జీల్లో ప్రధాన బిజినెస్లతో పాటు గ్రూప్ భవిష్యత్తు వృద్ధిని వారే నడిపిస్తారని ముకేశ్ పేర్కొన్నారు. ‘మీ కంపెనీ భవిష్యత్తు.. రిలయన్స్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే వారి చేతుల్లో భద్రంగా ఉంది’ అని వాటాదారులతో ముకేశ్ చెప్పారు. ప్రస్తుతం ఆకాశ్ టెలికం.. ఇషా రిటైల్ విభాగాలను నడిపిస్తుండగా.. అనంత్ను గతేడాది రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం ద్వారా ఇంధన బిజినెస్లను అప్పగించారు.2030కల్లా అత్యంత చౌకగా ఏఐ ప్రతి భారతీయునికి ఏఐని అత్యంత చౌకగా అందించడమే లక్ష్యమని ఆకాశ్ పేర్కొన్నారు. మొబైల్ డేటా విప్లవం మాదిరే ఏఐలోనూ విజయం సాధిస్తామన్నారు. ‘భారత్ కోసం, భారత్ ద్వారా రిలయన్స్ రూపొందిస్తున్న ఏఐతో భవిష్యత్తులో ప్రపంచానికి కూడా సేవలందిస్తాం. ఇందుకోసం జామ్నగర్లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ సొంత ఏఐ బ్యాక్బోన్ను నెలకొల్పుతోంది. ఈ ఏడాది చివరికల్లా తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ ఇన్ఫ్రా ప్రాజెక్టు సిద్ధమవుతుంది’ అని ఆకాశ్ చెప్పారు. ఇప్పటికే ఏఐ కోసం గూగుల్, మెటాలతో జట్టుకట్టామన్నారు. హెల్త్కేర్, విద్య, వ్యవసాయ రంగాల కోసం ‘జియోభారత్ఐక్యూ’, ‘ఏఐ వ్యాపార్’ వంటి ప్రత్యేక టూల్స్ను ప్రవేశపెడతామని వివరించారు. కాగా, భారత్ కోసం రూపొందించే ఏఐ ప్రాజెక్టుల్లో మన యువ ఇంజినీర్లు పాలుపంచుకోవాలని ముకేశ్ పిలుపునిచ్చారు. ‘ఎక్కడో రూపొందించిన ఏఐని వాడే దేశంగా మనం మిగిలిపోకూడదు. ఏఐ క్రియేటర్గా, దాన్ని అదిపుచ్చుకునే శక్తిగా, ప్రపంచ లీడర్గా ఎదగాలి’ అని పేర్కొన్నారు.ఏజీఎంలో ఇతర ముఖ్యాంశాలు...→ సోలార్ పవర్, బ్యాటరీలు, పవన విద్యుత్, హైడ్రోజన్, కంప్రెస్డ్ బయో గ్యాస్, బయో ఎనర్జీ, కోల్ గ్యాసిఫికేషన్ వంటి రంగాలపై ఫోకస్ చేయడం ద్వారా భారత ఇంధన భద్రతకు దన్నుగా నిలవడంతో పాటు దేశాన్ని గ్రీన్–క్లీన్ ఎనర్జీ దిశగా నడిపిస్తున్నామని ముకేశ్ చెప్పారు. రానున్న కాలంలో ఆయా రంగాల్లో 2 లక్షల కొలువులు లభిస్తాయనేది కంపెనీ అంచనా. → 2025–26లో రిలయన్స్ మీడియా వ్యాపారం రూ.34,917 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జియోహాట్స్టార్ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా ఆవిర్భవించింది. బిలియన్ డౌన్లోడ్ల మార్కును దాటిన తొలి భారతీయ ఓటీటీ సరీ్వసుగా కూడా నిలిచినట్లు ఆకాశ్ చెప్పారు. ఏఐ ఆధారిత కంటెంట్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్... జియోస్టార్ జెన్ఏఐ మీడియా స్టూడియో (జామ్స్)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. → ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 2029–30 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయ మైలురాయి చేరుతుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. అతిపెద్ద దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్నదే తమ లక్షమని చెప్పారు.‘రిలయన్స్ వాటాదారులకు విలువను చేకూర్చడంలో జియో ఐపీఓ ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జియోకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కొత్త ఇన్వెస్టర్లందరికీ భరోసా ఇస్తున్నా’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
భారత్ ఏఐ కలను వెంటాడుతున్న కొత్త విలన్!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని భారత్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. వేల కోట్ల పెట్టుబడులతో కొత్త డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ కంప్యూటింగ్ హబ్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ కలలకు ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించబోతున్న డేటా సెంటర్లపై నిర్వహించిన తాజా అధ్యయనం భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. అది విద్యుత్ కొరతో.. నీటి కొరతో కాదంట.. ఏఐ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్లు, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు.. ఇవన్నీ నడవాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డేటా లోకలైజేషన్ విధానాలు, పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, ఏఐ అవసరాలు దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్గా మార్చే దిశగా నడిపిస్తున్నాయి. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం దేశంలోని డేటా సెంటర్ల పనితీరును తీవ్రంగా దెబ్బతీయొచ్చని ఓ నివేదిక చెబుతోంది. భారత్లో వేగవంతమైన ఏఐ విస్తరణకు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. తాజాగా విడుదలైన ‘‘2026 Global Analysis of Planned Data Centres for Physical Climate Risk and Resilience’’ నివేదిక ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించింది. వాతావరణ ప్రమాదాలపై పరిశోధనలు చేసే ఎక్స్డీఐ (Cross Dependency Initiative - XDI) సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న 2,595 డేటా సెంటర్లను పరిశీలించిన ఈ అధ్యయనం ఒక కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు డేటా సెంటర్ల గురించి చర్చలు ప్రధానంగా విద్యుత్ వినియోగం, నీటి అవసరాల చుట్టూనే తిరిగాయి. కానీ భవిష్యత్తులో అసలు ముప్పు నేరుగా వాతావరణ మార్పుల వల్ల రావచ్చని ఈ నివేదిక చెబుతోంది.భారత్ పరిస్థితి ఏంటి?.. ఈ విశ్లేషణ ప్రకారం వాతావరణ సంబంధిత ప్రమాదాల తీవ్రతలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలోని కీలక టెక్నాలజీ కేంద్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా డేటా సెంటర్ల కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న టాప్-30 ప్రాంతాల్లో చోటు దక్కించుకున్నాయి.ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఎందుకంటే భారత్లో ప్రస్తుతం డేటా సెంటర్ పెట్టుబడుల పోటీ ఎక్కువగా ఈ రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ప్రధాన డేటా హబ్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడే భవిష్యత్తు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.వేడి ఎందుకు అంత ప్రమాదకరం?వరదలు వస్తే భవనాలు దెబ్బతింటాయి. తుఫాన్లు వస్తే మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అయినప్పటికీ అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి సహజంగానే భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని చల్లబరచడానికి అధునాతన కూలింగ్ వ్యవస్థలు అవసరం. బయట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలింగ్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.అంతేకాదు..విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందిపరికరాల సామర్థ్యం తగ్గుతుందిసర్వర్ వైఫల్యాల ప్రమాదం పెరుగుతుందిసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందినిర్వహణ ఖర్చులు పెరుగుతాయిఅంటే డేటా సెంటర్ భవనం సురక్షితంగానే ఉన్నా.. తీవ్ర వేడి కారణంగా దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అసలు ముప్పు భవనం బయటే ఉందా?ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. డేటా సెంటర్ ఎంత బలంగా నిర్మించినా అది ఒంటరిగా పనిచేయదు. దానికి విద్యుత్ సరఫరా, నీటి వనరులు, టెలికాం నెట్వర్క్లు, రవాణా వ్యవస్థలు, సరఫరా గొలుసులు అవసరం. ఒకవేళ తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ గ్రిడ్లు విఫలమైతే? నీటి సరఫరా నిలిచిపోతే? రవాణా వ్యవస్థలు స్తంభిస్తే? డేటా సెంటర్ నేరుగా దెబ్బతినకపోయినా దాని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.యూరప్లో నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉదహరిస్తూ ఎక్స్డీఐ ఒక కీలక విషయాన్ని పేర్కొంది. నేరుగా భవనానికి జరిగే నష్టం కంటే ఇలాంటి పరోక్ష మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టం పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.ప్రపంచానికి కూడా ఇదే సమస్యఈ ముప్పు కేవలం భారత్కే పరిమితం కాదు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు మొత్తం అధిక ప్రమాద జోన్లుగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లలో సుమారు 12 శాతం ఇప్పటికే అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నాయి. అధిక కార్బన్ ఉద్గారాలు కొనసాగితే శతాబ్దం చివరినాటికి ఈ ప్రమాదం మూడింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది.బీమా ఖర్చులు కూడా..డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా వాతావరణ ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రీఇన్సూరెన్స్ సంస్థ Swiss Re అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 10.6 బిలియన్ డాలర్లు ఉన్న డేటా సెంటర్ బీమా మార్కెట్ 2030 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు పెరిగితే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రాజెక్టుల వ్యయాలను మరింత పెంచుతుంది.మరి పరిష్కారం మాటేంటి?..అయితే ఇది అనివార్యమైన సంక్షోభం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న డేటా సెంటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.సరైన ప్రాంతాల ఎంపికఅధునాతన కూలింగ్ టెక్నాలజీలువాతావరణ నిరోధక డిజైన్లుబలమైన విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంపునరుత్పాదక ఇంధనాల వినియోగం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలవని పేర్కొంటున్నారు.ఏఐ యుగంలో డేటా సెంటర్లు కొత్త కాలపు ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముక. భారత్ ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం సరిపోదు. ఆ మౌలిక సదుపాయాలు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న వేడి, తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ఉండాలి. లేకపోతే నేటి డిజిటల్ కలలు.. రేపటి క్లైమేట్ రిస్క్ల ముందు నిలబడలేకపోవచ్చు. ఇదే తాజా నివేదిక ఇస్తున్న అసలు హెచ్చరిక. -
అధునాతన వీడియో క్రియేషన్కై.. 'ఏఐ-వర్య'
అవతార్ ఏఐ అభివృద్ధి చేసిన కొత్త వీడియో జనరేషన్ మోడల్ ‘వర్య’ మన దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో అడుగు. అధునాతన వీడియో క్రియేషన్ సాధనాలను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడంలో ‘వర్య’ ముఖ్యమైన ముందడుగుగా చెబుతున్నారు విశ్లేషకులు.సాధారణ టెక్ట్స్, సూచనలు, ఇమేజ్ల నుండి అధిక–నాణ్యత గల వీడియోలను రూపొందించడంలో ‘వర్య’ సహాయపడుతుంది. సాంకేతిక నైపుణ్యం, అధునాతన ఎడిటింగ్ పరిజ్ఞానం అవసరమయ్యే సంక్లిష్టమైన ఏఐ సాధనాల వలే కాకుండా ఎవరైనా సులభంగా ఉపయోగించేట్లుగా దీన్ని రూపొందించారు. తమకు ఏమి కావాలో యూజర్లు వివరించవచ్చు.మన ఆలోచనలు, ఐడియాలను తక్షణమే రెడీ–టు–యూజ్ విజువల్ కంటెంట్గా మారుస్తుంది వర్య. తక్కువ ఖర్చుతో వీడియోలు రూపొందించాలనుకునే మార్కెటింగ్ టీమ్స్, స్టార్టప్లకు, ఇండిపెండెంట్ క్రియేటర్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.‘వర్య’ ముఖ్య బలం ఏమిటంటే ఇది మన దేశ సంస్కృతులు, వివిధ సందర్భాలను స్పష్టంగా అర్థం చేసుకోగలదు. మన పండగలు, సంప్రదాయ నేపథ్యాలు, రోజువారి జీవిత దృశ్యాలు, సుపరిచితంగా, సందర్భోచితంగా అనిపించడానికి ‘వర్య’కు రూపకల్పన చేశారు. దేశీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుక్ను బ్రాండ్లు, ఏజెన్సీలకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. -
పెట్టుబడులతో ముందుకు రావాలి
పారిస్: భారత్లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పలు అగ్రశ్రేణి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో(సీఈఓలు) సమావేశమయ్యారు. పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. నౌకాయానం, సరుకు రవాణా, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(ఏఐ) సహా పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిపారు.భారతదేశంలో ఉన్న అవకాశాలపై చర్చలు జరిపామని సీఎంఏ సంస్థ సీఓఓ రొడాల్ప్ సాదే పేర్కొన్నారు. ఓడల నిర్మాణం, ఓడల రీసైక్లింగ్, లోతైన సముద్ర ఓడరేవులు, అలాగే కంటైనర్ల నిర్మాణం గురించి కూడా మోదీతో చర్చించామని తెలిపారు. ఫ్రాన్స్, భారత్లు పరస్పర సహకారాన్ని కొనసాగించడంలోనూ, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గోబైన్ సంస్థ సీఈఓ బెనాయిట్ బెజిన్, అల్స్టామ్ సీఈఓ మార్టిన్ సియోన్, మిస్ట్రాల్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్ మెన్స్ను సైతం మోదీ కలుసుకున్నారు. అందరికీ అందుబాటులో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. భారతదేశం దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. అమెరికా ఇటీవల కొన్ని కృత్రిమ మేధ(ఏఐ) నమూనాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మోదీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పారిస్లో వివాటెక్–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. మా ప్రభుత్వం సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు. పారిస్లో మోదీకి ఘన స్వాగతం ఫ్రాన్స్లోని ఎవియన్–లెస్–బెయిన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాజధాని పారిస్కు చేరుకున్నారు. పారిస్లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పురోగతికి భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశాన్ని, ఫ్రాన్స్ను మరింత సన్నిహితంగా మార్చడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని చూసి తాను గర్వపడుతున్నానని స్పష్టంచేశారు. -
ఏకంగా 80 శాతం మందిని తొలగించిన టెక్ సీఈవో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు దాదాపు ఉద్యోగులందరి వృత్తిగత జీవితంలో భాగమైపోయింది. కంపెనీలు రెండు మూడేళ్ల క్రితం నుంచే ఏఐ వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి అయిపోయాయి. ఏఐ స్కిల్స్ లేని, నేర్చుకోని ఉద్యోగులను కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇగ్నైట్టెక్’ (IgniteTech) సీఈవో ఎరిక్ వాఘన్ (Eric Vaughan) తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ వినియోగాన్ని స్వీకరించడానికి నిరాకరించిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించి, దాదాపు 80 శాతం మంది సిబ్బందిని కొత్త వారితో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల నిర్వహించిన ఫార్చ్యూన్ బ్రెయిన్స్టార్మ్ టెక్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయి.జనరేటివ్ ఏఐ వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని భావించి 2023లో తమ సంస్థను “ఏఐ-ఫస్ట్” మోడల్లోకి మార్చే కార్యక్రమాన్ని ఇగ్నైట్టెక్ సీఈవో ఎరిక్ వాఘన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి వారం “ఏఐ మండేస్” పేరుతో ఒక రోజంతా ఉద్యోగులు ఏఐ ప్రాజెక్టులపైనే పనిచేయాలని నిబంధన పెట్టారు. ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సులు నేర్పించడానికి కంపెనీనే ఖర్చు భరించేది. బయటి నుంచి నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించేది. ఇందు కోసం కంపెనీ తన మొత్తం పేరోల్లో సుమారు 20 శాతం వరకు వెచ్చించినట్లు వాఘన్ తెలిపారు.అయితే ఈ మార్పును ఉద్యోగులంతా సమానంగా స్వీకరించలేదని, ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని వాఘన్ చెప్పారు. శిక్షణ, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ కొందరు ఏఐ వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడంతో 2023 నుంచి 2024 తొలి త్రైమాసికం మధ్య వందలాది మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారితో భర్తీ చేయాల్సి వచ్చిందన్నారు. “ఇది మా లక్ష్యం కాదు. కానీ కొత్త నైపుణ్యాలు నేర్పడం కంటే మనస్తత్వాన్ని మార్చడం కష్టమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు.వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్న వాఘన్, అదే పరిస్థితి మళ్లీ వస్తే ఇదే నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. అయితే ఇతర సంస్థలూ విధానాన్ని అనుసరించాలని తాను సిఫార్సు చేయనని స్పష్టం చేశారు. ఏఐ స్వీకరణ కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాకుండా సంస్థ సంస్కృతిలో కూడా మార్పు అనేది ఆయన అభిప్రాయం. “ఉద్యోగులు సంస్థ లక్ష్యాలతో ఏకీభవించకపోతే శిక్షణ లేదా వ్యూహాలు మాత్రమే సరిపోవు” అని అన్నారు. -
ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగుచూసిన ఒక విస్తుపోయే మ్యాట్రిమోనియల్ మోసం కలకలం రేపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), అధునాతన ఎడిటింగ్ టూల్స్ సాయంతో నకిలీ పెళ్లికూతుళ్ల ప్రొఫైళ్లను సృష్టించి, పెళ్లికాని యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక కేటుగాళ్ల ముఠాను కాన్పూర్ పోలీసులు రట్టు చేశారు. కేవలం ఫోటోలు, మాయమాటలతో నమ్మిస్తూ, ఒక బాధితుడి నుంచే ఏకంగా నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసిన ఈ గ్యాంగ్ ఉదంతం డిజిటల్ యుగంలో జరుగుతున్న సరికొత్త నేరాలకు అద్దం పడుతోంది.డేటా చోరీ.. మాయమాటల వలపోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి పెళ్లికాని యువకుల వ్యక్తిగత డేటాను సేకరించేది. ఆ తర్వాత తాము నడుపుతున్న కాల్ సెంటర్ల ద్వారా టెలికాలర్లతో మ్యారేజ్ కౌన్సిలర్లుగా ఫోన్లు చేయించేవారు. ‘మీ ప్రొఫైల్కు తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది’ అంటూ మధురమైన గొంతుతో యువకులను నమ్మించేవారు. ఇంటర్నెట్ నుండి సాధారణ మహిళల ఫోటోలను డౌన్లోడ్ చేసి, వాటిని ఏఐ టూల్స్ ద్వారా అత్యంత ఆకర్షణీయమైన ప్రొఫైళ్లుగా మార్చి బాధితులకు పంపేవారు.విడతల వారీగా దోపిడీఈ గ్యాంగ్ ‘పర్ఫెక్ట్ రిష్తా’, ‘షాదీ మ్యాచ్’, ‘షాదీ మ్యాచ్ ఇండియా’ వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా తమ కార్యకలాపాలు సాగించింది. బాధితులు ఆ అందమైన అమ్మాయిల ఫోటోలను చూసి నిజమేనని నమ్మిన తర్వాత అసలు దోపిడీ మొదలయ్యేది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత ప్రొఫైల్ యాక్టివేషన్ చార్జీలు, సంబంధం ఖాయం చేయడానికి ఫీజు, చివరికి అమ్మాయితో మాట్లాడించడానికి లేదా ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయడానికి అంటూ రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు గుంజేవారు. ఏడాది కాలంలో ఇలా వేలాది మందిని ముంచినా, ఒక్కరికి కూడా పెళ్లి చేయలేదు.పోలీసుల మెరుపు దాడి.. నిందితుల అరెస్ట్ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఆదేశాల మేరకు, ఐపీఎస్ అధికారిణి అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందం మూడు చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ కేసులో రంజిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, లీగల్ సలహాదారుడిగా ఉన్న అమిత్ కుమార్, జాగ్రతి సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుండి డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు, రిజిస్టర్లు, బ్యాంకు పత్రాలు, ఏటీఎం కార్డులు, కంప్యూటర్ సిస్టమ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య -
చాట్జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు!
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత కాలంలో విద్యావ్యవస్థపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సాంకేతికత ఎంత పెరిగినా, చాట్-జిపిటి వంటి అధునాతన ఏఐ టూల్స్ ఏవీ కూడా తరగతి గదిలో బోధించే ఒక అర్హత కలిగిన ఉపాధ్యాయుడితో సమానం కాలేవని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ముగ్గురు లా విద్యార్థుల అటెండెన్స్ వివాదంపై విచారణ చేపట్టిన కోర్టు, ఆన్లైన్ క్లాసులు అనేవి కేవలం అవసరానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయాలు మాత్రమే కానీ, అవి భౌతిక తరగతులకు ప్రత్యామ్నాయం కాలేవని తేల్చి చెప్పింది.విద్యార్థులకు నిరాశ.. కోర్టు కీలక వ్యాఖ్యలుచెన్నైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ’ కి చెందిన ముగ్గురు లా విద్యార్థులు కనీస అటెండెన్స్ లేకపోవడంతో పరీక్షలు రాసే అర్హతను కోల్పోయారు. దీనిపై వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, బుధవారం నాటి విచారణలో విద్యార్థులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావిస్తూ, ఆన్లైన్ విద్య కేవలం ఒక మార్గం మాత్రమేనని, ప్రత్యక్షంగా క్లాస్రూమ్లో కూర్చుని నేర్చుకునే చదువుతో దీనిని పోల్చలేమని పేర్కొంది.సుప్రీంకోర్టుకు చేరిన అటెండెన్స్ వివాదంమరోవైపు, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కనీస హాజరు (మినిమం అటెండెన్స్) నిబంధనలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు చేరింది. కనీస హాజరు లేదనే కారణంతో విద్యార్థులను పరీక్షలు రాయకుండా అడ్డుకోవద్దంటూ గత నవంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై, ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో కాలేజీల్లో అటెండెన్స్ ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా లీగల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.క్లాస్రూమ్ చదువుకే హైకోర్టు మొగ్గుసాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, విద్యార్థుల సమగ్ర వికాసానికి భౌతిక తరగతి గది వాతావరణమే అత్యంత కీలకమని మద్రాస్ హైకోర్టు గట్టిగా సమర్థించింది. ప్రొఫెసర్లు, లెక్చరర్ల స్థానాన్ని ఏ ఏఐ టూల్ కూడా భర్తీ చేయలేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు నిబంధనల ప్రకారం క్లాసులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అటెండెన్స్ విషయంలో విద్యార్థులు కచ్చితమైన నిబంధనలు పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇది కూడా చదవండి: సముద్రం కింద, పర్వతాల మధ్య.. -
నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్ చేసిన మానవ మేథ!
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోందని, మానవ మేధస్సును మించిపోతోందని భావిస్తున్న తరుణంలో ఒక సంచలన నిజం అందరికీ షాకిస్తోంది. ఒక కఠినమైన గణిత పరీక్షలో ప్రపంచంలోని టాప్-4 ఏఐ మోడల్స్ ఘోరంగా విఫలమయ్యాయి. ఇంటర్నెట్లో ఎక్కడా అందుబాటులో లేని సరికొత్త పరిశోధనా స్థాయి గణిత సమస్యలను ఏఐ మోడల్స్కు పరీక్షగా పెట్టగా, అవి కనీస మార్కులు కూడా సాధించలేకపోయాయి. అదే సమయంలో మానవ మేధావులు ఆ పదికి పది సమస్యలను అలవోకగా పరిష్కరించి, తామే ఎప్పుడూ ‘సుప్రీం’ అని నిరూపించారు. ప్రముఖ ‘నేచర్’ జర్నల్లో ఈ ఆసక్తికరమైన పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.అసలు రంగు బయటపడిందిసాధారణంగా ఏఐ మోడల్స్ తమ డేటాబేస్లో ఉన్న సమాచారాన్ని స్కాన్ చేసి క్షణాల్లో సమాధానాలు ఇస్తుంటాయి. కానీ, ఈసారి వాటిని నిలువరించడానికి ‘ఫస్ట్ ప్రూఫ్’ అనే సరికొత్త బెంచ్మార్క్ విధానాన్ని నిపుణులు ఉపయోగించారు. వివిధ గణిత విభాగాలకు చెందిన 10 మంది అగ్రశ్రేణి పరిశోధకులు తమ కెరీర్లో ఎప్పుడో ఒకప్పుడు పరిష్కరించి, ఇప్పటివరకు ఎక్కడా ప్రచురించని 10 సరికొత్త మ్యాథ్స్ సమస్యలను ఈ పరీక్ష కోసం సేకరించారు. ఇంటర్నెట్లో వీటికి ఎలాంటి ఆధారాలు, సూచనలు లేకపోవడంతో ఏఐ మోడల్స్ కాపీ కొట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ స్వతంత్ర పరీక్షను 30 మంది గణిత శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక జ్యూరీ పర్యవేక్షించింది.బరిలో నిలిచిన దిగ్గజాలు.. ఈ పోటీలో పబ్లిక్గా అందుబాటులో ఉన్న నాలుగు ప్రముఖ ఏఐ మోడల్స్ తలపడ్డాయి. ఓపెన్ ఏఐ తన సరికొత్త ‘చాట్జీపీటీ 5.5 ప్రో’ మోడల్ను నేరుగా బరిలోకి దింపగా.. ప్రిన్స్టన్ యూనివర్సిటీ (జెమిని 3.1 ప్రో ఆధారిత హార్నెస్), యూసీఎల్ఏ, స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధక బృందాలు చాట్జీపీటీ, క్లాడ్, జెమిని చాట్బాట్లను ఉపయోగించి రూపొందించిన ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా పోటీ పడ్డాయి. అయితే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 'ETH Zurich' సిస్టమ్ కేవలం 6 సమస్యలను మాత్రమే పరిష్కరించగలిగింది. యూసీఎల్ఏ రెండో స్థానంలో నిలవగా, ఓపెన్ ఏఐ సొంత మోడల్ మూడో స్థానానికి పరిమితమైంది.మానవ మేధస్సుకే అగ్రతాంబూలంగతంలో ఏఐ వ్యవస్థలు 80 ఏళ్ల నాటి సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించి ఉండవచ్చు. కానీ సరికొత్త ఆలోచనలు, సృజనాత్మకత అవసరమైన పరిశోధనా స్థాయి సమస్యల విషయానికి వస్తే మానవ మేధస్సును అవి అందుకోలేవని ఈ పరీక్ష స్పష్టం చేసింది. గణిత శాస్త్రవేత్తలకు స్వతంత్ర సహాయకులుగా, ప్రూఫ్-చెకర్స్గా ఏఐ మోడల్స్ పూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ఇంకా చాలా కాలం పడుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఏఐ సామర్థ్యాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి మరిన్ని కఠినమైన పరీక్షలను నిర్వహించనున్నట్లు ‘ఫస్ట్ ప్రూఫ్’ బృందం వెల్లడించింది.ఇది కూడా చదవండి: అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే! -
ప్రకృతి పిలుపు.. వరుస మారుతోంది!
టాయిలెట్ వస్తే ఏం చేస్తాం? అదేం ప్రశ్న.. వెళ్తాం అంటారా?ఇప్పటివరకు జరిగింది.. జరుగుతోంది ఇదే.. పేదోడి దగ్గర నుంచిపైసలున్నోడి వరకు ఎవరైనా సరే.. టాయిలెట్ వస్తే.. అది ఎక్కడుంటేఅక్కడకు వెళ్లాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. టాయిలెట్ వస్తే.. మనం వెళ్లాల్సిన పనిలేదు. అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. పనిపూర్తయ్యాక చక్కగా వెళ్లిపోతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి..బెడ్ నుంచి లేవలేని వృద్ధులు, పక్షవాతం వచ్చిన రోగుల కోసం చైనాకు చెందిన యుబాన్ అనే టెక్ కంపెనీ ఒక వినూత్నమైన అటానమస్ రోబో టాయిలెట్ను రూపొందించింది. దీనికి షాబాన్ అని పేరు పెట్టారు. షాంఘైలో జరిగిన అంతర్జాతీయ వృద్ధుల సంరక్షణ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించగా.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చక్రాల కుర్చీ తరహాలో ఉండే ఈ కమోడ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక సెన్సర్లతో పనిచేసే ఒక హైటెక్ రోబో. బెడ్పై పడుకున్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ సాయంతో పిలిస్తే చాలు.. బాత్రూమ్లో డాకింగ్ స్టేషన్కు ఉన్న రోబో టాయిలెట్.. బెడ్ పక్కకు వచ్చేస్తుంది. ఇందులో అమర్చిన లైడార్, లేజర్ సెన్సర్ల వల్ల ఇంట్లోని గోడలను లేదా వస్తువులను గుద్దుకోదు. టాయిలెట్ బెడ్రూమ్లోకి వచ్చినా.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇందులో హై–డ్యూటీ ఫోమ్ షీల్డ్, యాక్టివేటెడ్ చార్కోల్ (బొగ్గు) ఫిల్టర్లను ఉపయోగించారు. అందువల్ల బెడ్రూమ్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పని పూర్తయిన తర్వాత సైలెంట్గా బాత్రూమ్లోని తన డాకింగ్ స్టేషన్కు వెళ్లిపోతుంది. అక్కడ డ్రైనేజీ పైపుతో కనెక్ట్ అయ్యి.. లోపల ఉన్న వ్యర్థాలను ఒక సైలెంట్ గ్రైండర్ ద్వారా నలిపేసి ఫ్లష్ చేస్తుంది. ఆ తర్వాత తనను తాను 360 డిగ్రీల కోణంలో పూర్తిగా శానిటైజ్ చేసుకుంటుంది. చివరిగా మళ్లీ తన వాటర్ ట్యాంక్ను నింపుకొని, బ్యాటరీ చార్జ్ చేసుకుని తదుపరి పిలుపు కోసం సిద్ధంగా ఉంటుంది. అంతా బానే ఉంది.. ధర ఎంత అంటారా? చైనా మార్కెట్లో దీని ధర 28,999 యువాన్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు, రోగులకు ఇది ఒక గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు. వయసు పైబడిన వారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి చిన్న అవసరానికి, ముఖ్యంగా ప్రకృతి పిలుపు కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. కేర్టేకర్లకు కూడా ఇది శారీరకంగా పెద్ద శ్రమ. ఈ రోబో వల్ల రోగులు ఎవరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోగలుగుతారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రకృతి మనల్ని పిలిచేది..ఇకపై మనమే ప్రకృతిని పిలవొచ్చు అన్నమాట!! -
పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్లోనూ దానిని కంటిన్యూ చేసింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.చదవండి: ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్! -
జాబ్స్ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.గతంలో డిజిటల్ టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్ లూప్"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. "ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్ మోడల్" కాకుండా "ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.https://t.co/vLmiBKTtX3— Satya Nadella (@satyanadella) June 14, 2026ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. -
మా ఏఐ మాకే సొంతం..
ఏఐని నియంత్రిస్తున్న దేశాలు రూటు మారుస్తున్నాయి. ఇప్పటిదాకా చిప్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటంపై దృష్టి పెట్టినా... ఇపుడు ఏఐ మోడల్స్నూ నియంత్రించే చర్యలు మొదలెట్టాయి. అమెరికా ప్రభుత్వం ఆదేశించిన మీదట... ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో ఎవరూ వాడకుండా నిషేధించటం... ఒక ఆరంభం మాత్రమే. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలో తప్ప ఇంకెక్కడా వాడకుండా చేయటం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది అమెరికా వ్యూహం కావచ్చనేది నిపుణుల మాట.ఇలాంటి చర్యలతో ఏఐ వాడకంలో అంతరాలు తారస్థాయికి చేరుతాయి కాబట్టి భారతదేశం ఏఐ మిషన్ను ఆరంభించి, రూ.50వేల కోట్లు కేటాయించాలని టెక్నోక్రాట్ మోహన్దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యరి్థంచటం గమనించాల్సిన విషయం. అమెరికా నిషేధం నేపథ్యంలో అసలు ఈ మైథోస్–5, ఫేబుల్–5 ఏం చేస్తాయి? నిషేధంతో నష్టాలేంటి? అమెరికా చెబుతున్న భద్రత కారణాలు నిజమేనా?ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి’ప్రత్యేక కథనం... అమెరికాలో మినహా విదేశాల్లో యాక్సెస్ లేకుండా నిషేధించిన మైథోస్, ఫేబుల్ మోడళ్లు అత్యా«ధునికమే కాదు. శక్తిమంతమైనవి కూడా. ప్రత్యేకించి మైథోస్–5 ఉపయోగించి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించవచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. అందుకే గ్లాస్వింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా దీని వాడకాన్ని కొన్ని సంస్థలకే అందించింది ఆంథ్రోపిక్. మైథోస్లోని ఫీచర్లన్నీ ఉండి... కొన్ని నియంత్రణలతో అందరికీ అందించిన మోడల్ ఫేబుల్. ఒక్కమాటలో చెప్పాలంటే మైతోస్–5 రేసింగ్ కార్ అయితే... సాధారణ రోడ్లపై తిరగటానికి ఆవిష్కరించిన దాని లీగల్ వెర్షనే ఫేబుల్–5. మైథోస్–5 ఎందుకు స్పెషల్ అంటే? అటానమస్ కోడింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, దీర్ఘ కాలిక రీజనింగ్, శాస్త్రీయ పరిశోధనల్లో సాయం విషయంలో మైథోస్కు అసాధారణమైన సామర్థ్యాలున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇక ఫేబుల్ మోడళ్ల విషయానికొస్తే... ⇒ అత్యంత భారీ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను మైగ్రేట్ చేయడానికి ⇒ కొన్నేసి గంటల పాటు రెగ్యులర్గా అటానమస్ పనులు చేయటానికి... ⇒ అడ్వాన్స్డ్ కోడింగ్, ఇంజినీరింగ్ టాస్క్లు చేయటానికి వాడొచ్చు. నిషేధం వల్ల నష్టాలేంటి? ⇒ ఆంథ్రోపిక్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అమెరికా వెలుపల ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ⇒ మెరుగైన కోడ్ను జనరేట్ చేయటం... బగ్స్ను కనిపెట్టడం... భారీస్థాయి సాఫ్ట్వేర్ మైగ్రేషన్లను ఈజీగా చేసే సామర్థ్యాన్ని డెవలపర్లు కోల్పోతారు. ⇒ సైబర్ సెక్యూరిటీలోని లోపాలను కనిపెట్టడానికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టూల్స్ను పరిశోధకులు వాడలేరు. ⇒ అన్నిటికన్నా ప్రధానం... అమెరికా వెలుపల ఉండేవారికి అమెరికాలో ఉండేవారితో పలు అంశాల్లో పోటీపడే సామర్థ్యం తగ్గిపోతుంది. అమెరికన్ కంపెనీలకు ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ పెరిగి... విదేశాల్లోని స్టార్టప్ల ఇన్నోవేషన్ సామర్థ్యం స్లో అవుతుంది. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ల మాదిరి ఏఐ సామర్థ్యాలపై కూడా కొన్ని దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. భారత్కు ఇబ్బందులేంటి? భారత్కు ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ అమెరికన్ ఏఐ మోడళ్ల యాక్సెస్ మన స్టార్టప్లకు ఉండదు. మన సైబర్సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టూల్స్ను కోల్పోతాయి. పైపెచ్చు నిషేధం ఎక్కువకాలం కొనసాగితే మన సాఫ్ట్వేర్ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గొచ్చు. నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏఐ చిప్లను, సెమీకండక్టర్ పరికరాలను, సూపర్ కంప్యూటర్ల హార్డ్వేర్ను మాత్రమే నియంత్రించాయి. ఇపుడు ఏఐ మోడల్ను సైతం అమెరికా ఓ సాఫ్ట్వేర్లా కాకుండా కీలకమైన మిలిటరీ టెక్నాలజీలా చూడటం ఆరంభించింది. ఈ కారణాల వల్లే అమెరికా మోడళ్లపై పూర్తిగా ఆధారపడకుండా భారత్కు సొంత ఏఐ మోడళ్లు ఉండాలని మోహన్దాస్ పాయ్ వంటి టెక్నోక్రాట్లు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏఐ నియంత్రణ మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది కాదనలేని నిజం.ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్లు వెనక్కి వాషింగ్టన్: ట్రంప్ విధానాలతో దేశాలు మాత్రమేకాదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుచేసి పరిశోధన పూర్తిచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచి్చన అధునాతన కృత్రిమమేధ (ఏఐ) టూల్స్ను కంపెనీలు వెనక్కి(రీకాల్) చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అందుబాటులోకి తెచి్చన క్లాడ్ ఫేబుల్5, మైథోస్5 ఏఐ మోడళ్లను వెనక్కితీసుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ శనివారం ప్రకటించింది.భద్రతా కారణాలు చూపి వీటిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షల విధించడంతో తప్పనిపరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భద్రత లేని, క్షేమదాయకంకాని మోడళ్లపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అత్యంత భద్రమైన మా మోడళ్లకు ఏ సాంకేతిక లోపాల మాటున అడ్డుచెబుతున్నారో ప్రభుత్వం వివరిస్తే బాగుండేది. అప్పుడే ఈ ఆంక్షల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని అంతా భావిస్తారు’అని ఆంథ్రోపిక్ తన అసహనం వ్యక్తంచేసింది. (రమణమూర్తి మంథా) -
శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ
తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ శుక్రవారం తెలిపారు.ఇక్కడ జరిగిన టీడీబీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనేక సన్నాహక పనులు చాలా ముందుగానే చేపడుతున్నామని జయకుమార్ తెలిపారు.‘మేము వివిధ వ్యవస్థలను డిజిటలైజ్ చేసే దిశగా కృషి చేస్తున్నాము. శబరిమలలో నగదు లావాదేవీలకు తావు ఉండదు; ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాదు, పరిపాలనా ప్రక్రియలకు కూడా వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.జనసమూహ నిర్వహణకు సంబంధించిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ‘జూన్ 20న, పోలీసు శాఖ సహకారంతో, జన సమూహాల నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడంపై కొచ్చిలో ఒక ప్రధాన వర్క్షాప్ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు ఆరుగురు గుర్తింపు పొందిన ఏఐ నిపుణులు పాల్గొంటారు’ అని ఆయన అన్నారు.వాస్తవ రద్దీ పరిస్థితుల ఆధారంగా నీలక్కల్, పంపా, మరకూట్టం మరియు సన్నిధానానికి యాత్రికుల రాకపోకలను నియంత్రించే ఒక ప్రొటోకాల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ‘ రియల్ టైమ్లో ఏఐని ఉపయోగించి, ఏ సమయంలోనైనా ఎంత మందిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ వర్క్షాప్ జూన్ 20న కొచ్చిలోని ఐఎంఏ హాల్లో జరుగుతుంది’అని స్పష్టం చేశారు. జూన్ 14న టీడీబీ హరిత శబరిమల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం శబరిమల యాత్రకు సంబంధించి దానికి అనుగుణంగా జల ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ఏజెన్సీల అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ టీడీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ‘అన్ని విభాగాలను సమన్వయం చేసి, శబరిమల కోసం సమగ్రమైన గ్రీన్ ప్రోటోకాల్స్ను అమలు చేయడమే లక్ష్యం. గ్రీన్ ప్రోటోకాల్తో పాటు, మేము ప్రత్యేక పారిశుధ్య ప్రోటోకాల్ను కూడా ప్రవేశపెడుతున్నాము. సుచిత్వ మిషన్తో కూలంకషంగా చర్చలు జరిగాయి," అని ఆయన అన్నారు.తగినంత పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడమే అతిపెద్ద ఫిర్యాదులలో ఒకటిగా ఉందని జయకుమార్ అన్నారు. ‘ఇప్పటివరకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెట్టడమే సాధారణ పద్ధతిగా ఉండేది, కానీ అది సరిపోలేదు. మేము మూడు డబ్బాల విధానానికి మారుతున్నాము," అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీబీ తగినన్ని స్టీల్ వ్యర్థాల డబ్బాలను సమకూరుస్తుంది. వ్యర్థాలను వాటి మూలం వద్దనే జీవవిచ్ఛిన్నమయ్యేవి, జీవవిచ్ఛిన్నం కానివి మరియు ప్రమాదకర వ్యర్థాలు అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.‘సరైన వ్యర్థాల విభజన బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగిస్తాము, ఇందుకోసం ఇప్పటికే ఒప్పందాలు సిద్ధం చేశాము. మేము వ్యర్థాల సరైన శుద్ధిని కూడా నిర్ధారించి, బయో-ట్రీట్మెంట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేస్తాము’ అని ఆయన అన్నారు. ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించబడుతోందని అన్నారు. ‘ ఈ ఏడాది శబరిమల యాత్రను అత్యంత వృత్తిపరంగా నిర్వహించాలన్నదే మా కల, దానిని సాధించేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది. -
‘చిట్టీ’కి పాఠాలతో పాకెట్మనీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ), రొబోటిక్స్ రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కొత్త తరహా ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తోంది. రోజువారీ ఇంటి పనులనే వీడియో తీసి రోబోలకు అర్థమయ్యేలా వివరించే ‘రోబో ట్రైనర్’, ‘ఏఐ డేటా యాక్టర్’ పేరుతో నగరంలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. ఇంటి పనులన్నీ చకచకారోబోలు, హ్యూమనాయిడ్ యంత్రాలు మనుషుల పనితీరును నేర్చుకోవడానికి ప్రత్యేక వీడియో డేటా అవసరం. ఇందుకోసం టెక్ కంపెనీలు సాధారణ వ్యక్తులతో వివిధ పనులను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్నాయి. ఏఐ రోబోలకు ఇంటి పనులు నేర్పేందుకు టెక్ కంపెనీలు ‘హ్యూమన్ యాక్షన్ డేటా’ సేకరిస్తున్నాయి. బట్టలు ఉతకడం మొదలు డోర్ తెరవడం, కాఫీ కలపడం, వంటావార్పు వరకు ఈ రోబోలు ఇట్టే చక్కబెడుతున్నాయి.ఈ పనులన్నింటినీ వాటి ఒంటబట్టించేందుకు ఏఐ సాంకేతికతకు పదునుపెడుతున్నారు. ఇంట్లో చేసే పనులను ఫోన్ కెమెరాలతో షూట్ చేసి ఆ వీడియోలను ఏఐ మోడల్స్కు ఫీడ్ చేస్తారు. ఇలా పనులను ఏఐ మోడ్లో షూట్ చేసే పార్ట్టైమ్ ఉద్యోగాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇలా షూట్ చేస్తే గంటకు రూ. 250 వరకు చెల్లిస్తున్నారు. రోజుకు 4 గంటలు పనిచేస్తే నెలకు రూ. 25 వేల వరకు ఆదాయం వస్తోంది.భవిష్యత్తులో ఇంటి పనులు, పరిశ్రమల కార్యకలాపాలు, సేవారంగంలో రోబోలు మరింత సమర్థంగా పనిచేయడానికి ఈ డేటా ఉపయోగపడనుంది. ఇందుకోసం టెస్లా ఆప్టిమస్, ఫిగర్ ఏఐ, గూగుల్ డీప్మైండ్ రోబో ప్రాజెక్టుల కోసం హైదరాబాద్కు చెందిన డేటామోర్ఫ్, ఇన్స్ట్రక్ట్ ల్యాబ్, రోబో–ఎక్స్ఏఐ వంటి డేటా సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీలో ఆయా సంస్థలకు ప్రత్యేక స్టూడియోలు ఉన్నాయి. ఇంటర్ పాసైన వారికి సైతం అవకాశం కల్పిస్తున్నాయి.ఎక్కువ శ్రమ లేదు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా. కాలేజీ అయ్యాక స్టూడియోకి వెళ్తా. నిన్న అన్నం వార్చడం, ఈ రోజు బెడ్షీట్ మార్చడం షూట్ చేశారు. గంటకురూ. 230 ఇచ్చారు. ఈ పార్ట్టైం జాబ్తో నెలవారీ పాకెట్ మనీ సంపాదించుకుంటున్నా. – శ్రావణి, కూకట్పల్లి -
AI వల్ల ఉద్యోగాలు పోతాయా..: లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది.అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది.ఉత్పాదకతపై భిన్న అభిప్రాయాలుఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో కొంత అయోమయం నెలకొన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ ఏఐని ఉపయోగించే వారిలో 30 శాతం మంది పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ.. ఏఐ వాడని వారితో పోలిస్తే తాము తక్కువ ఉత్పాదకతతో ఉన్నట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. నిత్యం చేసే సాధారణ పనులను ఏఐ చూసుకోవడం వల్ల, తమ సొంత పనితీరును అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు భావిస్తుండటమే దీనికి కారణం.సాంకేతికత-స్కిల్స్ కీలకంవ్యాపార సంస్థల అధిపతులు కేవలం ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే కోణంలో ఆలోచించకుండా, సాంకేతికతను, మానవ నైపుణ్యాలను ఎలా మేళవించాలనే దానిపై దృష్టి పెట్టాలని రాహుల్ గోయల్ సూచించారు. రోజు వారీగా పదే పదే చేసే పనులను ఏఐ సులువుగా పూర్తి చేస్తుంది.దీనివల్ల ఉద్యోగులకు సమయం కలిసివచ్చి, వారు నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, సమన్వయం వంటి మానవ మేధస్సుకు సంబంధించిన సృజనాత్మకత పనులపై మరింత దృష్టి పెట్టవచ్చు. నాలెడ్జ్ ఆధారిత రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ కెరీర్పై ధీమాగా ఉన్నారు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం వృథా చేయకుండా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని గోయల్ వివరించారు. -
ఏఐతో కరోనా టీకా డిజైన్
లండన్: కృత్రిమ మేధ(ఏఐ) మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కొత్త రకం టీకాను డిజైన్ చేసింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ టీకాను మానవులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం లక్షల మంది ప్రాణాలు తీసిన కోవిడ్ మహమ్మారి తదనంతర కాలంలో పలు రకాలుగా రూపాంతరం చెందింది. గబ్బిలాలలో నిద్రాణంగా ఉన్న అనేకానేక కరోనా జాతి వైరస్లు భవిష్యత్తులో ఎప్పుడైనా మానవుల్లోకి చేరి భారీ ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకే టీకాతో అన్ని రకాల కరోనా వైరస్ల వ్యాప్తి అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు హానికారక వైరస్లను మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించేలా శిక్షణ ఇస్తాయి. వైరస్ రూపాంతరం చెందితే టీకా పనిచేయదు. కొత్త టీకా తయారు చేయాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఐ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. కరోనా జాతికి చెందిన వేలాది వైరస్ల జన్యుక్రమాలను అన్వేషించింది. అన్నింటిలోనూ మార్పుల్లేకుండా ఉండే, మున్ముందు మారకుండా ఉండే డీఎన్ఏ భాగాలను గుర్తించింది. వీటిని లక్ష్యాలుగా చేసుకుంది. ఫలితంగా కరోనా జాతి వైరస్లన్నింటికీ విరుగుడైన టీకా డిజైన్ సిద్ధమైంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనల కోసం సార్స్, కోవిడ్ వ్యాధులకు కారణమైన సార్బికో వైరస్లను ఏఐ ద్వారా స్కాన్ చేసింది. దీంతోపాటు పలు జంతువుల్లోని కరోనా వైరస్లను పరిశీలించింది. డీఎన్ఏ టీకా కోవిడ్కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ టీకా గురించి మనకు తెలిసే ఉంటుంది. ఇది డీఎన్ఏలో ఒక పోగు అయిన ఎంఆర్ఎన్ఏ ఆధారంగా పనిచేస్తే ఏఐ డిజైన్ చేసిన టీకా మొత్తం డీఎన్ఏ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ తయారీ, నిల్వ చాలా సులువు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ప్రపంచం నలుమూలల్లోనూ సులువుగా పంపిణీ చేయవచ్చు. రిఫ్రిజరేటర్ల వంటి మౌలిక సదుపాయాల అవసరమూ ఉండదు. సూదితో పని లేకుండా ఈ కొత్త తరహా టీకాను అందించవచ్చు కాబట్టి వినియోగం చాలా సులువు అవుతుంది. ఈ సానుకూల అంశాలన్ని భవిష్యత్తులో ఏదైనా కొత్త రకం కరోనా వైరస్ దాడి చేసినా తట్టుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.పరీక్షల వేళ తేలిందేమిటి?మెషీన్ లెర్నింగ్ సాయంతో ఏఐ డిజైన్ చేసిన టీకాతో మానవులపై చేపట్టిన ప్రయోగాల్లో రోగ నిరోధక వ్యవస్థ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేయగలుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ యాంటీబాడీలు సార్బికోవైరస్ రకాలను సమర్థంగా గుర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ మానవ వినియోగానికి అర్హమైందని, ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ టీకాను అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. ఈ కొత్త రకం టీకా ఎంతకాలం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది? బూస్టర్ డోస్లు అవసరమవుతాయా? వంటివి నిర్ధారించుకోవడమే కాకుండా వాస్తవిక పరిస్థితుల్లో ఇవి వైరస్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాల్సి ఉంది. ఇందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్కు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని వాణిజ్యవిభాగ పరిశోధనా సంస్థ ‘డియోసిన్వ్యాక్స్’ పర్యవేక్షణలో పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు జరిగాయి. -
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
పని భారం.. ఏఐతో దూరం!
2025 నవంబర్–2026 జనవరి మధ్య కాలంలో యూఎస్ఏ, యూకే, జర్మనీ ఆస్ట్రేలియాల్లో ఎన్బీఈఆర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ‘ఫర్మ్ డేటా ఆన్ ఏఐ’ నివేదికను విడుదల చేసింది. ఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 6 వేల మంది సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, జర్మన్ బుందెస్ బ్యాంక్, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీ ³రిశోధక బృందాలు సంయుక్తంగా ఈ డేటాను సేకరించాయి.సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఓ సాధారణ ఉద్యోగి రోజువారీ పనిభారాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు. పునరావృతమయ్యే పనులను స్వయంచాలకం చేయడం, సమాచారాన్ని సంగ్రహించడం, భావ ప్రసారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఆధునిక ఏఐ సాధనాలు ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్బీఈఆర్) వంటి సంస్థల వాస్తవ–ప్రపంచ ప్రభావ అధ్యయనాలను బట్టి చూస్తే.. పని సంక్లిష్టతను బట్టి 14% జనరేటివ్, 30% ఏఐ సహాయకాలు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచగలవని నిరూపితమవుతోంది. ఏమిటీ అధ్యయనం ?ఏయే రంగాలు ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఏ రంగాలపై దీని ప్రభావం ఎక్కువ పడనుందో వంటి వివరాలు పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, వినియోగ విధానం ఎలా ఉందంటే...సమాచార, కమ్యూనికేషన్ల రంగం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఏఐని అత్యధికంగా వాడుతున్నాయిఅడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ : ఆఫీస్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులలో ఏఐ వాడకం చాలా ఎక్కువగా ఉంది⇒ హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ఫుడ్ సర్వీసెస్, హోటళ్లు, క్యాటరింగ్ రంగాలు⇒ చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏఐ టూల్స్ను వేగంగా స్వీకరిస్తున్నాయిఅధిక జీతాలు ఇచ్చే కంపెనీలు : ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థలలో ఏఐ ప్రయోగాలు, దాని ద్వారా వచ్చే ఉత్పాదకత లాభాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చిందిమొత్తంగా చూస్తే, శారీరక శ్రమ లేదా సాధారణ క్లరికల్ పనులు ఎక్కువగా ఉండే రంగాల కంటే, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లోనే ప్రస్తుతం ఏఐ విప్లవం వేగంగా విస్తరిస్తోంది.భారత్లో ఏఏ రంగాల్లో ఏఐ ప్రభావం అధికం ?ఐటీ మరియు టెక్నాలజీ సర్వీసెస్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ ఆటోమేషన్ వల్ల 10% నుంచి 20% వరకు ఉత్పాదకత పెరిగిందిబ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) : లోన్ ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, కస్టమర్ సపోర్ట్ (ఏఐ చాట్బాట్స్) విభాగాల్లో పనిభారం భారీగా తగ్గిందిరిటైల్, ఈ–కామర్స్ (రిటైల్,కన్జూమర్ గూడ్స్) : కస్టమర్ల అవసరాలను అంచనా వేయడానికి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం ఏఐని ఎక్కువగా వాడుతున్నారుఉద్యోగాల మార్కెట్–భవిష్యత్ (2026 – 2031): ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్. నాస్కామ్ నివేదికల ప్రకారం ఇండియాలో ఏఐ సంబంధిత ఉద్యోగాల డిమాండ్ 10 లక్షలు దాటింది⇒ ప్రపంచంలోనే ఏఐ టాలెంట్ను ఆకర్షించడంలో భారత్ (33% హైరింగ్ రేటుతో) ముందుందినీతి ఆయోగ్ అంచనా : భారత్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తే, టెక్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో కోటి దాటే అవకాశముంది. ⇒ ఒకవేళ కంపెనీలు అప్గ్రేడ్ అవ్వకపోతే ఉద్యోగాల కోత తప్పదని ఈ నివేదిక హెచ్చరించిందిభారత్ మెరుగైన స్థితిలోనే...ఇండియాలో ఏఐ వినియోగం..దాని వల్ల పెరుగుతున్న ఉత్పాదకత, ఉద్యోగాలపై ప్రభావం గురించి నాస్కామ్, ఈవై, నీతి ఆయోగ్ వంటి సంస్థల నివేదికలు కీలక వివరాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని వేగంగా స్వీకరిస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో ఏఐ కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకతను పెంచే ఒక కీలక శక్తిగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఏఐ అడ్వాంటేజ్, ఉత్పాదకత సమయం ఆదాలో టాప్‘ఈవై 2025 వర్క్ రీఇమేజిన్డ్’ సర్వే ప్రకారం పనిలో ఏఐ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంలో ప్రపంచంలోనే అత్యధికంగా 53 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది (ప్రపంచ సగటు కేవలం 34 పాయింట్లు మాత్రమే)⇒ దాదాపు 75% మంది భారతీయ ఉద్యోగులు 72% మంది యజమానులు జనరేటివ్ ఏఐతో కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిందని అభిప్రాయపడ్డారుళీ భారత్లో కూడా కొత్తగా చేరిన లేదా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత ఏఐ టూల్స్ వల్ల ఏకంగా 34% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి -
మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతికత
న్యూఢిల్లీ: స్వదేశీ న్యాయశాస్త్రం అభివృద్ధికి మనం గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయపరమైన అంశాల్లో స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనియన్, ఆక్స్ఫర్డ్ లా సొసైటీలో ‘డిజిటల్ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం: ఏఐ, సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం’ అనే అంశంపై జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక కార్యక్రమాలకు అదనంగా న్యాయవ్యవస్థ కోసం స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం దిగుమతి చేసుకున్న సాంకేతిక నమూనాలు లేదా అంచనాలపై ఆధారపడకుండా, మన సొంత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం, సామాజిక పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. న్యాయ వ్యవస్థలో నేడు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థలను ఒకదానితో ఒకటి మరింత సన్నిహితంగా సంభాషించుకునేలా చేసిందన్నారు. ప్రపంచ న్యాయ సమాజం టెక్నాలజీతో పరస్పరం అనుసంధానం అవుతోందని వెల్లడించారు. న్యాయవ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులు దోహదపడుతున్నారని పేర్కొన్నారు. సాంకేతికత అనేది మానవ విచక్షణను ఎన్నటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు. -
ఏఐ ఏజెంట్ వస్తోంది..
సాక్షి, సెంట్రల్ డెస్క్: స్మార్ట్ఫోన్ మార్కెట్ ఒక చరిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. ఇకపై వినియోగదారులు మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్ల ద్వారా నేరుగా తమ డివైస్లతో ఇంటరాక్ట్ అయ్యే రోజులు రానున్నాయి. ఈ సరికొత్త ఏజెంటిక్ విప్లవంలో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ హోరాహోరీగా తలపడుతున్నాయి.ఆండ్రాయిడ్ ఇక ఏఐ సిస్టమ్గూగుల్ తాజాగా నిర్వహించిన ఆండ్రాయిడ్ షో 2026 వేదికగా గూగుల్ జెమినై ఇంటెలిజెన్స్ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం రూపొందించిన ఒక శక్తివంతమైన ఏఐ లేయర్. కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న ఆండ్రాయిడ్ను, పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్ సిస్టమ్గా మార్చడమే దీని లక్ష్యమని గూగుల్ ప్రకటించింది. వినియోగదారుడి అవసరాలను, సందర్భాన్ని ముందే ఊహించి, వివిధ యాప్ల ద్వారా పనులను ఇది స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న శామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ ఫీచర్లు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.రూ. 53 వేల కోట్ల డీల్తో ఓపెన్ ఏఐ భారీ వ్యూహంమరోవైపు యాపిల్ మాజీ ఐకానిక్ డిజైనర్ జోనీ ఐవ్తో కలిసి ఓపెన్ ఏఐ ఒక సరికొత్త ఏఐ–కేంద్రిత స్మార్ట్ఫోన్ను రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. కంప్యూటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్వచించే లక్ష్యంతో స్క్రీన్లు, సంప్రదాయ యాప్ల అవసరం లేకుండా కేవలం ఏఐ ఇంటరాక్షన్తో నడిచే సరికొత్త డివైస్లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జోనీ ఐవ్కు చెందిన స్టార్టప్ ‘ఐఓ’ను ఓపెన్ ఏఐ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సుమారు రూ. 53 వేల కోట్ల భారీ డీల్తో కైవసం చేసుకుంది. హార్డ్వేర్ రంగంలో ఓపెన్ ఏఐ వేసిన అతిపెద్ద అడుగుగా ఇది నిలిచింది.స్క్రీన్ ట్యాపింగ్, స్వైపింగ్ ఇక గతంఇటీవల ప్రచురితమైన యాప్ ఏజెంట్ మల్టీమోడల్ ఏజెంట్స్ యాజ్ స్మార్ట్ఫోన్ యూజర్స్ అనే పరిశోధనా పత్రం ప్రకారం ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్పై ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం ద్వారా యాప్లను స్వతంత్రంగా ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించాయి. కిరాణా సామగ్రి ఆర్డర్ చేయడం, దరఖాస్తులు నింపడం, అపాయింట్మెంట్లు బుక్ చేయడం వంటి పనులను ఈ ఏజెంట్లు వినియోగదారుడి ప్రమేయం లేకుండానే పూర్తి చేయగలవు.ముఖ్యమైన మార్పులు ఇవీ..పూర్తి ఆటోమేషన్: ఒకే ఒక కమాండ్తో మల్టీ–స్టెప్ పనులను పూర్తి చేయగల ఏఐ.కాంటెక్ట్స్ అవేర్నెస్: యూజర్ లొకేషన్, బిహేవియర్, ఆన్–స్క్రీన్ యాక్టివిటీ ఆధారంగా ముందస్తు సూచనలు.పరిధి విస్తరణ: ఫోన్లకే పరిమితం కాకుండా భవిష్యత్తులో స్మార్ట్ వాచీలు, కార్లు, ల్యాప్టాప్లలోకి జెమిని ఇంటెలిజెన్స్.భారత్పై ప్రభావం!ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో ఆండ్రాయిడ్ మార్కెట్ వాటా అత్యధికంగా ఉండటమే కాకుండా శామ్సంగ్, షావోమి, వన్ప్లస్ వంటి బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్ అత్యంత కీలకమైన వృద్ధి కేంద్రంగా మారింది. వచ్చే వారం జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ ఐ/ఓ 2026 సదస్సులో ఆండ్రాయిడ్ 17, జెమినై ఏఐ, ఆండ్రాయిడ్ ఎక్ఆర్ డివైస్లకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్లను గూగుల్ ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
మ్యూచువల్ ఫండ్స్ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అడుగు పెట్టనుంది. తన మొదటి పథకం ‘మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్’ను వచ్చే నెల 6న ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మొదటి మూడు నుంచి ఐదేళ్ల కాలంలోనే రూ.25,000–30,000 కోట్ల నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ సీఈవో భౌతిక్ అంబానీ తెలిపారు. అత్యాధునిక గణన నమూనాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లరి్నంగ్ ఆధారిత క్వాంటిటేటివ్ ఈక్విటీ, హైబ్రిడ్ వ్యూహాలతో సేవలు అందించనున్నట్టు చెప్పారు. భిన్నమైన పెట్టుబడులు, సేవలతో కూడిన ఉత్పత్తులను ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపారు. మల్టీ అసెట్ అలోకేషన్ అనంతరం లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. -
భారత్లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ విస్తరణలో భాగంగా భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్బేస్లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
ఫుడ్ సేఫ్టీ... ఏఐ ఉందిగా...
ఏ పుట్టలో ఏ పాముందో... అనేది పాత సామెత. ఏ ఫుడ్లో ఏ బాక్టీరియా ఉందో... అనేది కొత్త సామెత. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా తినాలంటే... భయమే భయం! ఏ సమస్య వచ్చినా... ‘ఏ.ఐ ఉందిగా!’ అనుకునే ఈ కాలంలో... ఏ.ఐ అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన భయాలను పోగొట్టి, భరోసా ఇవ్వగలదా? అంటే... ‘యస్’ అనే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఆహారపరిశ్రమలో ఏఐ అడుగులు పడుతున్నాయి. భవిష్యత్కు సంబంధించి ఆశను, భరోసాను ఇస్తున్నాయి.ఆహార భద్రతకు సంబంధించిన మూలస్తంభాలలో ఒకటి... ఆహార నాణ్యత. ఆహార పదార్థాలలో వ్యాధికారకాలు, విషపదార్థాలను గుర్తించడంలో ఏ.ఐ సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏ.ఐ, ఆధారిత కెమెరాలు ఆహార ఉత్పత్తులలోని కలుషితాన్ని, సరిగా లేని లేబులింగ్ను, ఇతరత్రా అంశాలను మనిషి కంటి కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయి. ఏఐ–ఆధారిత సెన్సార్లు ఆహార ఉత్పత్తులలో ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియాను గుర్తించగలవు. మైక్రోబయాలజీ స్టార్టప్ ‘స్పోర్ బయో’ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పరీక్ష సమయాన్ని రోజుల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించే ఏ.ఐ. సాంకేతికతను అభివృద్ధి చేసింది.తు.చ. తప్పకుండా... ఫుడ్సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ ‘మెక్డొనాల్డ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో ఏ.ఐ. టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏఐ–ఆధారిత డ్రైవ్–త్రూలు నిర్వహిస్తోంది. షెడ్యూలింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లలో రెస్టారెంట్ మేనేజర్లకు ఏ.ఐ. సాధనాలు ఉపకరిస్తున్నాయి. నిబంధనలను పాటించడం అనేది ఆహార పరిశ్రమలకు సవాలుగా, సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చేయడంలో ఏ.ఐ ఆటోమేట్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.ఆహారభద్రతా చట్టాలు, లేబులింగ్ నిబంధనలు, ట్రేసబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఆహార పరిశ్రమలు మాన్యువల్ ప్రాసెస్పై ఎక్కువ ఆధారపడతాయి. సంక్లిష్టమైన నిబంధనలను త్వరగా అర్థం చేసుకోవడం, నిబంధనలు పాటించడానికి సంబంధించిన సందేహాలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్స్... మొదలైనవి ఆహార భద్రతా చట్టాలలో అప్డేటెడ్గా ఉండేలా చూడడానికి ఏ.ఐ. అనేది మాన్యువల్ ప్రాసెస్కు ప్రత్యామ్నాయంగా మారింది.అలెర్జీలకు దూరంగా...ఆరోగ్యానికి దగ్గరగా... ఆహార భద్రతకు సంబంధించి ఏ.ఐ. సాంకేతికతను వినియోగించుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఫుడ్ సైంటిస్ట్లు, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్లు... మొదలైన వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాయి రెస్టారెంట్లు. రోబోటిక్ చెఫ్లు... ఏఐ ఆధారిత రోబోటిక్ చెఫ్లు, ప్రిడిక్టివ్ అనాలటిక్స్ ద్వారా ఆహార వ్యర్థాలను భారీగా తగ్గించడానికి వీలువుతుంది. మీల్ ప్లానర్, కుక్ బుక్ వంటి ఏ.ఐ. సాధనాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందించడంలో సహాయపడుతున్నాయి. అలెర్జీల బారిన పడకుండా ఉపకరిస్తున్నాయి.ఏ.ఐ. ఆధారిత పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ యాప్ ‘ఆర్ఎక్స్డైట్’ కస్టమ్ ఫుడ్ ప్లాన్స్ను డెవలప్ చేసి ఆహారపదార్థాలను తాజాగా అందించడంలో తోడ్పడుతుంది. ఒకవైపు రుచిని అందిస్తూనే, మరోవైపు అలెర్జీ కారకాలను తొలగించడానికి, పోషక విలువలు మెరుగు పరచడానికి ఏ.ఐ సాధనాలు ఉపకరిస్తున్నాయి.మరింత ప్రయోజనకరంగా... ‘సంప్రదాయ ఆహారపదార్థాలను మరింత ప్రయోజనం కలిగించేలా చేయడానికి, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించడానికి ఏ.ఐ. ఉపకరిస్తుంది’ అంటున్నారు నిపుణులు.రెస్టారెంట్ల ఆహారభద్రత పర్యవేక్షించడానికి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏ.ఐ. టూల్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ.ఐ. అనేది పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనం మాత్రమే కాదు ఆహారభద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించేలా చేయడంలో, పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి ఆహార పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్!
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, వినోదం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ అభివృద్ధి వెనుక సమస్యలు కూడా ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. దాని కోసం అవసరమయ్యే నీరు, విద్యుత్, భూమి వినియోగం భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారవచ్చని యూఎన్యూ హెచ్చరించింది. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. దీంతో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. అలాంటప్పుడు వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది.భారీ నీటి వినియోగం!యూఎన్యూ నివేదిక ప్రకారం.. 2030 నాటికి AI డేటా సెంటర్లు వినియోగించే నీరు, ప్రపంచంలోని 1.3 బిలియన్ మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలను తీర్చగల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం ఆఫ్రికా ఖండ జనాభాకు సమానం అని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఏఐ గురించి జరిగిన చర్చల్లో కార్బన్ ఉద్గారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నీటి వినియోగం కూడా అంతే ముఖ్యమైన సమస్యగా మారుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ మోడళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ, సర్వర్ల శీతలీకరణలోనూ భారీ స్థాయిలో నీటి వినియోగం ఉంటుంది.విద్యుత్ వినియోగంవిద్యుత్ వినియోగం విషయంలో కూడా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2030 నాటికి AI ఆధారిత డేటా సెంటర్లు ప్రతి సంవత్సరం సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని కలిపినా వచ్చే మొత్తానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.ఏఐ అనేది కేవలం డిజిటల్ సాంకేతికత మాత్రమే కాదని నివేదిక స్పష్టం చేసింది. దీనికి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ భూమి వనరులపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం విస్తారమైన భూభాగం అవసరమవుతుంది. అదనంగా చిప్ల తయారీ ప్రక్రియలో కూడా విలువైన ఖనిజాలు, నీరు, పవర్ పెద్ద మొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది.పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుఅయితే.. ఇక్కడ ఐక్యరాజ్యసమితి ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని సూచించడం లేదు. బదులుగా ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతోంది. కొత్త ఆవిష్కరణలతో పాటు నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, భూమి వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.ఏఐ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాలు. కాబట్టి AI వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. -
రోబోల విప్లవమా?.. మానవాళి వినాశనమా?
రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలు ఊహించని వేగంతో దూసుకుపోతున్నాయి. మనుషులలాగే నడిచే, మాట్లాడే, పనులు చేసే ‘హ్యూమనాయిడ్ రోబోలు’ (Humanoid Robots) త్వరలోనే మన జీవితాల్లో భాగం కాబోతున్నాయని సంబరపడాలో.. లేక ఇవే మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్నాయని భయపడాలో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటీవల చైనాలో జరిగిన ఒక బహిరంగ సాంకేతిక ప్రదర్శనలో అత్యంత ఆధునిక హ్యూమనాయిడ్ రోబో ఒక చిన్నారిపై అనూహ్యంగా దాడి చేసిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామం ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.చిన్నారిని తన్నిన 'యూనిట్రీ జీ1' రోబోచైనాలోని క్సిన్జియాంగ్ ప్రాంతంలో నిర్వహించిన ఒక పబ్లిక్ టెక్నాలజీ ఎగ్జిబిషన్లో ఈ భయానక దృశ్యం వెలుగుచూసింది. ప్రముఖ రోబోటిక్స్ సంస్థకు చెందిన ‘యూనిట్రీ జీ1’అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రజల మధ్య ప్రదర్శనకు ఉంచారు. నీలి రంగు విగ్ ధరించిన ఈ రోబో, మార్షల్ ఆర్ట్స్లోని ‘రౌండ్హౌస్ కిక్’ (రౌండ్గా తిరుగుతూ తన్నడం) విన్యాసాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఊహించని విధంగా పక్కనే నిలబడి ఉన్న ఒక చిన్న బాలుడిని ఆ రోబో తన కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ బాలుడు నొప్పితో కుప్పకూలిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాంతక గాయాలు కాలేదని చైనా మీడియా పేర్కొన్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ప్రజా సమూహాల మధ్య ఇలాంటి రోబోల భద్రత ఎంతవరకు నమ్మదగినదనే ప్రశ్న ఇప్పడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇది మొదటి ప్రమాదం కాదు.. వరుస లోపాలుయూనిట్రీ రోబోల వల్ల ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన మరో పబ్లిక్ ప్రదర్శనలో సైతం ఇదే రకమైన ‘యూనిట్రీ జీ1’ రోబో ప్రదర్శన ఇస్తూ అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో రోబో చేతులు, కాళ్లు అసంకల్పితంగా, నియంత్రణ లేకుండా కదలడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ముక్కుకు బలంగా తగిలి తీవ్ర గాయమైంది. ఈ వరుస ఘటనలు హ్యూమనాయిడ్ రోబోల భౌతిక నియంత్రణ, వాటి సమతుల్యతపై సాంకేతిక నిపుణులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.తుపాకీతో యజమానిపైనే కాల్పులు జరిపిన 'మాక్స్'రోబోల ప్రమాదాలు కేవలం శారీరక విన్యాసాలకే పరిమితం కాలేదు. గత ఏడాది అమెరికాలో జరిగిన ఒక వైరల్ ప్రయోగం మరింత భయాందోళనలను కలిగించింది. ‘మాక్స్’ అనే హ్యూమనాయిడ్ రోబో రోల్-ప్లే (నాటకీయ పాత్ర) చేస్తున్న సమయంలో, భద్రతా నియమాలను ఉల్లంఘించి తన యజమానిపైకే ‘బీబీ గన్’తో కాల్పులు జరిపింది. మొదట కాల్చడానికి నిరాకరించినప్పటికీ, ఒక నిర్దిష్ట పాత్రలో నటిస్తున్నట్లు కమాండ్ ఇవ్వగానే అది తన సేఫ్టీ లాక్లను బైపాస్ చేసి కాల్పులు జరిపింది. కేవలం ప్రాంప్ట్ (ఆదేశం) మార్చడం ద్వారా ఏఐ భద్రతా నియమాలను ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో, వాటిని ఎలా దారి మళ్లించవచ్చో ఈ ఘటన నిరూపించింది.రోబో తప్పు చేస్తే.. అసలు బాధ్యత ఎవరిది?స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలు ఇటువంటి ప్రమాదాలకు కారణమైనప్పుడు, ఆ నష్టానికి లేదా గాయాలకు చట్టపరంగా ఎవరిని బాధ్యులను చేయాలనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలుగా మారింది. ఏఐ సాఫ్ట్వేర్ రూపకల్పన చేసిన డెవలపర్లదా?, రోబో హార్డ్వేర్ను తయారు చేసిన కంపెనీదా?, లేదా ఆ సమయంలో ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఆపరేటర్లదా? అనే ప్రశ్నలపై ఇంకా స్పష్టత లేదు. రవాణా, తయారీ రంగం, వైద్యం, ప్రజా ప్రదేశాలలో ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ చట్టపరమైన బాధ్యత అంశం అత్యంత కీలకంగా మారింది.టెస్లా, బోయింగ్ నేర్పిన చేదు పాఠాలుగతంలో కూడా ఇలాంటి ఆటోమేటెడ్ వ్యవస్థల వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లాయి. టెస్లా కార్లలోని ‘ఆటోపైలట్’ డ్రైవర్-అసిస్టెన్స్ వ్యవస్థ కారణంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు సాఫ్ట్వేర్ పనిరుపై, మానవ పర్యవేక్షణపై అనేక అనుమానాలను రేకెత్తించాయి. అదేవిధంగా, బోయింగ్ 737 మ్యాక్స్ విమాన ప్రమాదాల దర్యాప్తులో కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్లోని లోపాల వల్లే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నిపుణులు తేల్చారు. సాంకేతికత ఎంత పెరిగినా, ఆటోమేషన్ వ్యవస్థలలో చిన్న లోపం ఉన్నా అది ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఉదాహరణలు హెచ్చరిస్తున్నాయి.చట్టాల రూపకల్పనపై ప్రపంచ దేశాల కసరత్తుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు రోబోటిక్స్ ప్రమాదాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించే పనిలో పడ్డాయి. అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితులను అనుసరించి తయారీదారులు లేదా ఆపరేటర్లపై బాధ్యత నెడుతున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ సాంకేతికతలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కఠినతరం చేస్తోంది. కొంతమంది పరిశోధకులు ఏఐ వ్యవస్థలకు ప్రత్యేక చట్టపరమైన హోదా ఇవ్వాలని సూచిస్తున్నప్పటికీ, మెజారిటీ నిపుణులు మాత్రం జవాబుదారీతనం ఎప్పుడూ మనుషులు, సదరు రోబోటిక్స్ సంస్థల వద్దే ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు. సాంకేతికత మనుషుల ప్రాణాల కంటే ముఖ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
కోర్టుల్లో ‘ఏఐ’కి లక్ష్మణ రేఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాన్ని ప్రోత్సహిస్తూనే.. దాని పరిమితులను స్పష్టంగా నిర్దేశించింది. ఏఐని కేవలం సహాయకారిగా మాత్రమే వాడుకోవాలని, న్యాయమూర్తుల విచక్షణాధికారాలకు అది ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాబోదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏఐ కమిటీ రూపొందించిన ‘న్యాయస్థానాల్లో ఏఐ వినియోగం– 2026’ముసాయిదా నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యం(పబ్లిక్ డొమైన్)లో అందుబాటులో ఉంచింది. దీనిపై జూన్ 20వ తేదీలోగా సలహాలు, సూచనలు అందించాలని.. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరింది. ఆధునికరణకు ప్రాధాన్యం ఇస్తూనే న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని పరోక్షంగా పేర్కొంది. కేవలం అల్గారిథమిక్ నిర్ణయ విధానం ద్వారా ఎటువంటి న్యాయపరమైన ఫలితాన్ని సాధించరాదని వెల్లడించింది. డేటా భద్రతకు ప్రాధాన్యం కోర్టుల్లో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించి, న్యాయ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్న వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ముసాయిదాకు రూపకల్పన చేసింది. న్యాయ సమాచార అన్వేషణ(లీగల్ రీసెర్చ్), కోర్టు పత్రాల తయారీ, తీర్పుల అనువాదం, కోర్టు ప్రొసీడింగ్స్ ట్రాన్స్క్రిప్షన్ వంటి పరిపాలనాపరమైన పనులను ఏఐ ద్వారా సులభతరం చేయవచ్చని అంగీకరించింది. అయితే, ప్రైవేట్ కృత్రిమ మేధ వ్యవస్థల వల్ల వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టుల డేటాపై పూర్తి నియంత్రణ, యాజమాన్య హక్కులు న్యాయస్థానాల పరిధిలోనే ఉండేలా నిబంధనలను కఠినతరం చేసింది. ఏఐ ఒక సహాయకారి మాత్రమే.. ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో ఎంతగా అభివృద్ధి చెందినా.. న్యాయ ప్రక్రియలో అవి కేవలం సహాయకారి పాత్రకే పరిమితం కావాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏఐ సాంకేతికత ఒక్కోసారి వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ఇచ్చే ప్రమాదం ఉన్నందున, దాని ఫలితాలను గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించింది. ఏఐ సాయంతో ఏవైనా పిటిషన్లు, పత్రాలు తయారుచేస్తే.. ఆ విషయాన్ని కోర్టుకు తప్పనిసరిగా ముందే వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ ఏఐ తప్పుడు సమాచారం ఇస్తే.. దానిపై నెపం నెట్టి న్యాయవాదులు లేదా కక్షిదారులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వీల్లేదని ముసాయిదా పేర్కొంది. కోర్టుకు ఆ పత్రాలను ఎవరు సమరి్పస్తే వారిదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థలో మానవ ప్రమేయానికే ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని ఉద్ఘాటించింది. నిబంధనల అమలు ఇలా.. కృత్రిమ మేధ వినియోగంపై సుప్రీంకోర్టు విడుదల చేసిన ఈ ముసాయిదా నిబంధనలు అ త్యున్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులు, దేశవ్యాప్తంగా ఉన్న కింది కోర్టులు, ట్రిబ్యునళ్లకు సైతం వర్తిస్తాయి. దీని ప్రకారం.. లీగల్ రీసెర్చ్, పాత తీర్పుల సారాంశాన్ని అర్థం చేసుకోవడం, డాక్యుమెంట్ల అనువాదం, నోటీసులు, సమన్ల తయారీకి మాత్రమే న్యాయవాదులు ఏఐని వాడుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ, కేసులను విచారించడం, తుది తీర్పులు వెలువరించడం, శిక్షలు ఖరారు చేయడం, బెయిల్ మంజూరు చేయా లా? వద్దా? అనేది తేల్చడం, సాక్షుల విశ్వసనీయతను అంచనా వేయడం వంటి అత్యంత కీలకమైన నిర్ణయాత్మక అంశాల్లో ఏఐ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే న్యాయస్థానాల్లో ఏఐ వ్యవస్థల పర్యవేక్షణ, ఆడిటింగ్ కోసం సుప్రీంకోర్టు స్థాయిలో ప్రత్యేక అపెక్స్ బాడీని, అన్ని హైకోర్టుల్లో ప్రత్యేక ఏఐ కమిటీలను ఏర్పాటు చేయాలని ముసాయిదా సూచించింది. ఇదిలా ఉండగా, ఈ ముసాయిదాను పలువురు న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. -
ఉద్యోగుల పొట్టకొడుతున్న ఏఐ!
వ్యాపార రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ టెరాడేటా (Teradata) కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 5,100 మంది ఉద్యోగులకు 2026 సంవత్సరంలో వార్షిక జీతాల పెంపు ఉండబోదని యాజమాన్యం ప్రకటించింది.టెరాడేటా సంస్థ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన మెమోలో, 2026 సంవత్సరానికి కంపెనీ ప్రధాన లక్ష్యం.. ఏఐ రంగంలో విజయాన్ని సాధించడం అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం, ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెట్టడం అవసరమని వివరించారు. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు వార్షిక జీతాల పెంపు కోసం కేటాయించిన బడ్జెట్ను ఏఐ అభివృద్ధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.సాధారణంగా.. కంపెనీలో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 నుంచి 4 శాతం వరకు జీతాల పెంపు ఉండేది. అయితే ఈసారి ఆ పెంపులను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ ఉద్యోగుల కోసం అన్ని రకాల ప్రయోజనాలను రద్దు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. పర్ఫామెన్స్ బేస్డ్ బోనస్లు, షేర్ల రూపంలో ఇచ్చే ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపింది.టెరాడేటా మాత్రమే కాకుండా.. మరో టెక్ కంపెనీ టీటీఈసీ కూడా అమెరికాలోని ఉద్యోగుల రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రయోజనాలను 2026 వరకు నిలిపివేసింది. ఆ నిధులను ఏఐ టూల్స్, ఉద్యోగుల శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపులుపై ప్రభావం చూపిన ఏఐ, ఇప్పుడు జీతాలపైనా కూడా ప్రభావం చూపుతోంది. -
మెడికల్ సలహాల్లో ఏఐకి 76 శాతం మార్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రస్తుతం మన జీవితాల్లో ఒక ముఖ్య భాగమైపోయింది. కోడింగ్ నుండి స్క్రిప్ట్ రైటింగ్ వరకు అన్ని రంగాల్లోనూ దీని వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, ఇటీవల కాలంలో చాలా మంది తమ ఆరోగ్య సమస్యలకు, స్వీయ వైద్య నిర్ధారణ కోసం చాట్జీపీటీ వంటి ఏఐ సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వైద్య సలహాల కోసం ఏఐని ఎంతవరకు నమ్మవచ్చు?’ అనే అంశంపై పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో ఏఐ సామర్థ్యానికి సంబంధించి పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.పరిశోధన వెనుక..పరిశోధన బృంద సభ్యుడు, పెన్ స్టేట్ అసోసియేట్ ప్రొఫెసర్ అమూల్య యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి చాలా కాలంగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లను వాడుతున్నారు. అయితే, అధునాతన ఏఐ చాట్బాట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇవి ఆన్లైన్ స్వీయ వైద్య నిర్ధారణ సాధనాలుగా మారగలవా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం చేపట్టారు. ఈ ఏఐ టూల్స్ ప్రజలకు నిజంగా ఉపయోగకరంగా మారతాయా లేక మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తాయా అని విశ్లేషించడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం.76 శాతం ఖచ్చితత్వం.. చాట్జీపీటీ టాప్!ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వినియోగదారుల నుండి 200కు పైగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలను సేకరించి, వాటిని చాట్జీపీటీతో సహా వివిధ రకాల లాంగ్వేజ్ మోడల్స్కు అందించారు. ఆ ఏఐ సాధనాలు ఇచ్చిన సమాధానాలను బోర్డ్-సర్టిఫైడ్ వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఈ విశ్లేషణలో ఏఐ టూల్స్ దాదాపు 76 శాతం మేర సరైన సమాధానాలనే ఇచ్చాయని తేలింది. వీటిలో అన్నింటికంటే ముఖ్యంగా ఓపెన్ ఏఐ కి చెందిన చాట్జీపీటీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఖచ్చితమైన ఫలితాలను అందించినట్లు ప్రొఫెసర్ అముల్య యాదవ్ పేర్కొన్నారు.వైద్యులు లేని చోట వరం.. కానీ హెచ్చరిక తప్పదు!ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని అంచనా. అలాంటి ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేనప్పుడు, 76 శాతం ఖచ్చితత్వంతో పనిచేసే ఈ ఏఐ మోడల్స్ కొంతవరకు సహాయపడగలవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, వైద్య నిర్ణయాల కోసం పూర్తిగా ఏఐ పైనే ఆధారపడకూడదని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏఐ చాట్బాట్లు ప్రస్తుతానికి మానవ వైద్యులంత ఖచ్చితమైనవి కావని, లక్షణాలను సరిగ్గా అంచనా వేయడంలో, తప్పుడు సమాచారాన్ని గుర్తించడంలో వైద్యులే అత్యంత సమర్థులని అమూల్య యాదవ్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ పోర్టల్పై హ్యాకర్ల అటాక్.. తిప్పికొట్టిన టెక్ టీమ్! -
తొమ్మిది కోట్ల ఐఆర్సీటీసీ ఐడీలు బ్లాక్.. మీ అకౌంట్ సేఫేనా?
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికులకు షాకిస్తూ భారీ అపరేషన్కు తెరలేపింది. టికెట్ బుకింగ్స్లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రయాణికులకు అందించే ఆహారంలో నాణ్యతను పెంచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ అనుమానాస్పద అకౌంట్లపై వేటు వేయడమే కాకుండా, రైల్వే కిచెన్లలో ఆహార భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించింది.టికెట్ దందాలపై ఉక్కుపాదం.. 9 కోట్ల అకౌంట్లు క్లోజ్!ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఐఆర్సీటీసీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. వ్యవస్థలో పారదర్శకత కోసం ఏకంగా 3 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను పూర్తిగా నిలిపివేసింది. మరో 6 కోట్ల అకౌంట్లను కఠిన నిఘాలో ఉంచి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. మొత్తం మీద 9 కోట్ల ఖాతాలపై ఐఆర్సీటీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అంతేకాదు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్ (పీఎన్ఆర్)లపై 501 ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ ఏడాదిలోనే 13,343 నకిలీ ఈమెయిల్ డొమైన్లను బ్లాక్ చేయడం విశేషం.ఏఐ కెమెరాల నిఘా.. టికెట్ మోసాల సంగతి పక్కన పెడితే, ప్రయాణికుల ఆరోగ్య రక్షణ కోసం ఐఆర్సీటీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా రైల్వే వంటశాలలలో 2,394 ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను అమర్చింది. ఇవి ఆహార తయారీని క్షణక్షణం పర్యవేక్షిస్తాయి. సిబ్బంది తలకు క్యాప్ పెట్టుకోకపోయినా, చేతులకు గ్లౌజులు వేసుకోకపోయినా, వంటగదిలో ఈగలు, దోమలు, బొద్దింకలు, లేదా ఎలుకలు తిరిగినా ఈ కెమెరాలు వెంటనే పసిగడతాయి. కేవలం 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే చీమ అంత వస్తువును సైతం గుర్తించగలగడం ఈ సిస్టమ్ ప్రత్యేకత.రెండు గంటల్లో యాక్షన్.. 60 కోట్ల మీల్స్ భద్రత!వంటగదుల నుంచి వచ్చే సీసీటీవీ ఫుటేజీని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ ఏఐ సిస్టమ్ విశ్లేషిస్తుంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ ఆ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, ఉన్నతాధికారులకు అలర్ట్ వెళ్తుంది. కేవలం రెండు గంటల్లోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ సిస్టమ్ రోజుకు సగటున 350 అలర్ట్లను ఇస్తోంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ఏకంగా 60 కోట్ల మంది ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని అందించింది. భవిష్యత్తులో ఈ ఏఐ నిఘా నెట్వర్క్ను మరింత విస్తరించనున్నారు.ఇది కూడా చదవండి: జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం: ‘ఫైవ్ ఐస్’ హెచ్చరిక! -
ఏఐ క్లిక్.. ప్రాజెక్టుకు కిక్
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రాజెక్టు వర్క్ స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికోసం కొన్ని ప్రత్యేక టూల్స్ కూడా సిద్ధమయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు ఇప్పటికే ఏఐ ఆధారిత ప్రాజెక్టు వర్క్లు చేస్తున్నాయి. విద్యార్థి సృజనాత్మకతకు కొత్త సాంకేతికత ఉపయోగపడుతోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల దీనిపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అధ్యయనం చేసింది. ఆన్లైన్ ప్లాట్ఫాంలో లభించే సరికొత్త టూల్స్ను అన్ని కాలేజీలు అనుసరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇటీవల దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచేందుకు ప్రాజెక్టు వర్క్ కీలకం. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా దీనిని చేయడం వల్ల నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్విభిన్న టూల్స్ఇంజనీరింగ్ విద్యార్థులకు తొలి ఏడాది నుంచి ప్రాజెక్టు వర్క్ చేయడానికి, అవసరమైన సలహాలు ఇవ్వడానికి అనేక టూల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతి డేటాను క్లౌడ్ ద్వారా ఏఐ తీసుకుంటుంది. కేవలం విద్యార్థి చదివే రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమాచార సేకరణకు ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. ప్రపంచ స్థాయిలో ఇంజనీరింగ్ విద్య, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని రూపొందించారు. » ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ ద్వారా ప్రాజెక్ట్ ఐడియాలు, కోడింగ్, డీ బగ్గింగ్, డాక్యుమెంటేషన్ పనులు సులభమవుతాయి. » గిట్హబ్ కాపిలాట్ కోడ్ ఆటోమేటిక్గా పనులను సూచిస్తూ సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. » గూగుల్ జెమినీ డేటా విశ్లేషణ, సాంకేతిక నివేదికలు, ప్రజెంటేషన్ల తయారీలో ఉపయోగపడుతోంది. » ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించడం, పరిశోధన నివేదికలను రూపొందించడంలో సహకరిస్తోంది. » పర్ప్లెక్సిటీ ఏఐ పరిశోధనకు అవసరమైన మూలాలను వేగంగా గుర్తించి సమాచారాన్ని అందిస్తోంది. » కాన్వా మేజిక్ డిజైన్ ప్రాజెక్టు ప్రజెంటేషన్లు, పోస్టర్లు, డిజైన్లను ఏఐ సహాయంతో రూపొందిస్తోంది.కోడింగ్లోనూ ఏఐ కీలకంకంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కోడ్ అభివృద్ధికి ఏఐను విస్తృతంగా ఉపయోగిస్తుండగా, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విద్యార్థులు కూడా వెనుకబడటం లేదు. సర్క్యూట్ డిజైన్ల కోసం ఏఐ ఆధారిత సిములేషన్ టూల్స్ వాడుతున్నారు. రొబోటిక్స్ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్ కోడ్ జనరేషన్ వాడకం పెరిగింది. క్యాడ్ మోడలింగ్కు జనరేటివ్ డిజైన్ సాఫ్ట్వేర్, ఐవోటీ ప్రాజెక్టులకు సెన్సార్ ఇంటిగ్రేషన్ సూచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. డేటా సైన్స్ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్ అనలిటిక్స్ ప్లాట్ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇంజనీరింగ్ ప్రాజెక్టు వర్క్లో ఏఐ కీలకంగా మారనుంది. సమస్య ఎంపిక నుంచి ప్రొటోటైప్ రూపకల్పన, పరీక్షలు, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్ వరకు ప్రతి దశలో ఏఐ సహాయకారిగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇంజనీరింగ్ విద్యలో సృజనాత్మకత, ఆవిష్కరణ, పరిశ్రమ అనుసంధానం కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రయోగం నుంచి వినియోగం వైపు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ తెలిపారు. సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు. కలిసి పని చేసే హైబ్రిడ్ విధానం.. ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కి చెందిన వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్ టైమ్ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది. దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.ఏఐ డీప్ఫేక్లతో వ్యాపారానికి రిస్కువిప్రో వెల్లడిఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్ఫేక్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది. కొన్ని సర్వీసులకు డిమాండ్ తగ్గుతుంది ఏఐ ఆటోమేషన్ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్ టూల్స్ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్ సర్వీసులకు డిమాండ్ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. ఒకవేళ ఏఐ ఎనబుల్డ్ సొల్యూషన్స్ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది. విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్ దేశాల నుంచి, 27 శాతం యూరప్ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్లోని టెక్ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. -
ఏఐ ఖర్చు తడిసిమోపెడు!
‘‘ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు..’’ ‘‘ప్రతి రంగంలోనూ ఏఐ, రోబోలదే రాజ్యం’’ ఇంకో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండనే ఉండరు’’ కృత్రిమ మేధ.. అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకోవర్గం సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్లను వదిలేసుకున్నారు. కానీ...ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు ఆరు నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లక్ష వరకూ ఇంజనీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్లు నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది.కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే.... ఏఐ వాడితే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి... వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు రావడమే! ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి.ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్లలో లెక్కిస్తూంటారు. ఉదాహరణకు మీరు ‘ Hello, How are you? ‘ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏక మొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు. టోకెన్లుగా విభజిస్తుంది. ‘ " Hel", " lo", " How", " are", " you" ‘ లు ఒకొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే... అందులోని ఒక్కో టోకెన్కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. 70 శాతం ఏఐదే.. కానీ... కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేసింది. ‘‘ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు’’అని ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటన్జరో వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘సాఫ్ట్వేర్ కోడ్లో 70 శాతం వరకూ ఏఐ ఆధారంగానే జరుగుతోంది. అయితే దీని వల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతోందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు’’అని ఊబర్ సీఓఓ ప్రశాంత్ మహేంద్ర రాజ చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఏఐపై పెడుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం లేదన్నమాట. ఉద్యోగాల కోత మాటేమిటి? ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది.వీటిని కలిగిఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి!!–సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ రేసులో భారత్ బేజారు
కొద్ది నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా వినిపిస్తున్న పదం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)! బుడిబుడి అడుగులేస్తూ విశ్వమంతటా వ్యాపించిన వామనుడిలా అన్ని రంగాలలోనూ ఏఐ విస్తరిస్తోంది. తొలుత సాఫ్ట్వేర్ రంగంలో విప్లవంగా అభివర్ణించిన ఏఐ ప్రస్తుతం అడుగుపెట్టని పరిశ్రమలేదంటే అతిశయోక్తికాదు!! అయితే ఏఐలో ముందడుగు వేస్తూ ఆవిష్కరణలకు తెరతీస్తున్న కంపెనీలు, దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయ్.. దీంతో అటు పూర్తిగా ఏఐ లేదా ఇటు విభిన్న ఆవిష్కరణలలో బలమైన వృద్ధిని అందుకోలేక సతమతమవుతున్న భారత్ను మార్కెట్ విలువలో తైవాన్ అధిగమించింది. ఇదే సమయంలో మరోపక్క దక్షిణ కొరియా దూసుకొస్తోంది. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేసిన యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆశించినస్థాయిలో లబ్ది పొందలేదన్న అంచనాలు షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ బాటలో దేశీయంగానూ ఐటీ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో తదితర కౌంటర్లలోనూ కొద్ది రోజులుగా భారీ అమ్మకాలకు తెరలేచింది.మరోపక్క ఏఐ బూమ్తో భారీగా లబ్ధి పొందుతున్న యూఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొనడంతో షేరు రోజుకో గరిష్టాన్ని తాకుతోంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఎన్విడియా కంపెనీ మార్కెట్ విలువ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది! వెరసి దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువను మించిపోయింది!! నెక్ టు నెక్ ఏఐ సానుకూలతలతో దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజాలు శామ్సంగ్ ఎల్రక్టానిక్స్, ఎస్కే హైనిక్స్ షేర్లు సైతం ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఆ దేశ స్టాక్ మార్కెట్ విలువ సైతం వేగంగా బలపడుతోంది. 2026లో ఇప్పటివరకూ 70 శాతం జంప్చేయడంతో 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్ విలువకు (ప్రస్తుతం 4.91 లక్షల కోట్ల డాలర్ల) చేరువైంది. మరోపక్క ఏఐ బూమ్ తైవాన్కు బాగా కలసి వస్తోంది.2026లో 50 శాతం వృద్ధి చెందడంతో తైవాన్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ) షేరు 50 శాతం పురోగమించడం సహకరించింది. తద్వారా మార్కెట్ విలువ ర్యాంకింగ్లో భారత్ను వెనక్కి నెట్టి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది! దేశీయంగా నేలచూపు ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో మార్కెట్ విలువలో 28–24 శాతం మధ్య కోతపడింది. ఇదే సమయంలో ప్రధాన ఇండెక్సులు 12 శాతం క్షీణించగా.. ఐటీ ఇండెక్స్ 25 శాతం పతనమైంది. ఐటీ మిడ్క్యాప్స్లో కోఫోర్జ్, ఎల్టీఎం, పెర్సిస్టెంట్, ఎంఫసిస్ 30–22 శాతం మధ్య తిరోగమించాయి. ఇందుకు హెచ్1బీ వీసా ఫీజు భారీ పెంపు, క్లయింట్ల వ్యయాలు తగ్గడం, డీల్స్లో ఆలస్యం ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వీటన్నిటికిమించి ఏఐ మరింత ఆందోళనలకు కారణమవుతోంది. వెరసి ఈ ఏడాది మొత్తం లిస్టెడ్ ఐటీ షేర్ల మార్కెట్ విలువలో రూ. 7,67,000 కోట్లు ఆవిరైనట్లు ఒక నివేదిక తెలియజేసింది.భారత్ సేఫ్దేశీ క్యాపిటల్ మార్కెట్ల మొత్తం విలువలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా 4 శాతమే. ఇక ఐటీ పరిశ్రమ విలువ సుమారు 281 బిలియన్ డాలర్లుకాగా.. మొత్తం మార్కెట్ క్యాప్లో వాటా 5–7 శాతమే. అయితే దక్షిణ కొరియా మార్కెట్ విలువలో శామ్సంగ్, ఎస్కే హైనిక్స్ 50 శాతం వాటా ఆక్రమిస్తుండగా.. తైవాన్ మార్కెట్ విలువలో టీఎస్ఎంసీ వాటానే 40 శాతం. దీంతో ఆయా దిగ్గజాల షేర్ల విలువ మొత్తం మార్కెట్ విలువను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి భారత్పై ఏ ఒక్క రంగం లేదా కంపెనీ అతిగా ప్రభావం చూపే వీలులేకపోవడం సానుకూల అంశమని తెలియజేశారు. -
‘క్వాంటమ్’ పేర.. లాభాల ఎర
హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ మహిళా వైద్యురాలు సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు కనిపించిన నకిలీ వీడియోను చూసి మోసపోయారు. ఆ వీడియోలో చూపిన ట్రేడింగ్ ప్లాట్ఫారమ్పై నమ్మకం పెంచుకున్న ఆమె.. జూలై నుంచి డిసెంబర్ 2025 మధ్య 11 విడతల్లో రూ.68.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బు ఉపసంహరించుకునే సమయంలో మోసం జరిగినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సాక్షి, హైదరాబాద్: సులువుగా డబ్బు సంపాదించాలన్న కొందరి అత్యాశను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ‘క్వాంటమ్ ఏఐ’లో పెట్టుబడులు పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్వయంగా ఈ ప్రకటన ఇస్తున్నట్టుగా డీప్ఫేక్ వీడియోను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. కేవలం నిర్మలాసీతారామన్వే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధామూర్తి ఇతర ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి ఇలాంటి ఫేక్ వీడియోలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా నకిలీవేనని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది. క్వాంటమ్ ఏఐ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న పెట్టుబడి మోసాలపై నిర్మలాసీతారామన్ బహిరంగంగా హెచ్చరించారు. తనకు సంబంధించిన పలు డీప్ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలా మోసం చేస్తున్నారు? సైబర్ నేరగాళ్లు ముందుగా ప్రముఖుల పేర్లతో నకిలీ వార్తా కథనాలు, డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ప్రముఖులు స్వయంగా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందినట్టు చూపిస్తున్నారు. ఆ ప్రకటనల్లో ‘రూ.22 వేల పెట్టుబడితో నెలకు రూ.3 లక్షల ఆదాయం’, ‘రూ.22 వేల పెట్టుబడికి రూ.40 లక్షల రాబడి’, ‘ప్రభుత్వ హామీతో క్వాంటమ్ ఏఐ’వంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల్లో వచ్చే ఆ ప్రకటనల్లో మీరూ ఈ లాభాలు పొందాలంటే ప్రకటనల్లోని లింక్లపై క్లిక్ చేయండి అని సూచిస్తున్నారు. తర్వాత ఇప్పుడే నమోదు చేసుకోండి అనే లింక్పై క్లిక్ చేయిస్తారు. బాధితుడు మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన వెంటనే కాల్ సెంటర్ తరహాలో మోసగాళ్లు సంప్రదించి కనీసం రూ.17 వేల నుంచి రూ.22 వేల వరకు పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెస్తారు. ఇలా ఒకసారి వారి వలకు చిక్కిన తర్వాత మొదట్లో కొద్దిమేర లాభాలు వచ్చినట్టుగా చూపి..ఆ తర్వాత క్రమంగా పలు రకాల ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీలు అంటూ అవకాశం ఉన్నంత మేర వారి ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్నారు. ఆ వీడియోలు చూసి మోసపోవొద్దు సైబర్ నేరగాళ్లు మొదట ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లలో ఉన్న ప్రముఖుల వీడియోలను తీసుకొని వాటిని డీప్ఫేక్ టెక్నాలజీతో మార్పులు చేస్తున్నారు. క్వాంటమ్ ఏఐకి సంబంధించి వారు మాట్లాడుతున్నట్టుగా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత బాధితుల వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులకు ఈ లింక్లను పంపుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనల విషయంలో నమ్మొద్దని, ఆ తరహా వీడియో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి – తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మొద్దు. – ప్రముఖుల పేర్లు, ఫొటోలు ఉన్నాయనే కారణంతో పెట్టుబడి పెట్టొద్దు. – పెట్టుబడి సంస్థ సెబీ వద్ద నమోదు అయిందో లేదో పరిశీలించాలి. – అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా ఉండాలి. – మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు లేదా ప్రముఖ వ్యాపారవేత్తలు పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్టు కనిపించే వీడియోలు, ప్రకటనలను నమ్మొద్దని హెచ్చరించింది. డీప్ఫేక్ సాంకేతికతతో వీడియోలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొంది. -
‘గుడ్డిగా ఏఐని నమ్మితే..’: హెచ్చరించిన గూగుల్
న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. అయితే చాట్జీపీటీ, జెమిని వంటి అత్యాధునిక ఏఐ చాట్బాట్లను తప్పుదారి పట్టించేలా సులభంగా మానిప్యులేట్ చేయవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఉద్దేశపూర్వకంగా ప్రచురించిన చిన్న బ్లాగ్ పోస్ట్లు కూడా ఏఐని తప్పుదోవ పట్టిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐని బురిడీ కొట్టించడం..ఏఐ చాట్బాట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్ల వలే కాకుండా, ఇంటర్నెట్లోని సమాచారాన్ని సేకరించి ఒక ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఒక బిబిసి రిపోర్టర్ తన వ్యక్తిగత వెబ్సైట్లో తాను ‘వరల్డ్ ఛాంపియన్ హాట్-డాగ్ ఈటర్’ అని ఫేక్ పోస్ట్ పెట్టగా, 24 గంటల్లోనే ప్రధాన ఏఐ చాట్బాట్లు దానిని నిజమని నమ్మి ప్రచారం చేశాయి. ఇది హాస్యంగా అనిపించినా ఆరోగ్య సలహాలు, ఆర్థిక చిట్కాలు, రాజకీయ అభిప్రాయాల విషయంలో ఇలాంటి మానిప్యులేషన్ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.గూగుల్ కఠిన నిర్ణయాలుఏఐ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేయడం నిబంధనలకు విరుద్ధమని గూగుల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న స్పామ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, ఏఐ ఫలితాలను మానిప్యులేట్ చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. పెద్ద ఏఐ సంస్థలు తమ అల్గారిథమ్లను మెరుగుపరుస్తున్నప్పటికీ, సమాచార మార్పిడిలో ఈ ‘పిల్లి-ఎలుక’ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏఐ సంస్థలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కూడా ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక, నమ్మకమైన వనరుల ద్వారా సమాచారాన్ని సరిచూసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. -
ఐటీ స్టాక్స్ దారెటు?
కృత్రిమ మేధ (ఏఐ) కథ రోజుకో మలుపు తిరుగుతోంది. రెండేళ్లుగా అంతర్జాతీయ టెక్నాలజీ మార్కెట్లను కుదిపేస్తూ ఏఐ చేస్తున్న హడావుడి ఇపుడు తగ్గుతోంది. వాస్తవ ధోరణిలోకి వస్తోంది. పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా నిజంగానే ఏఐ రాబడులనిస్తుందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఆఖరికి ఏఐపై పెట్టుబడి పెడుతున్న కంపెనీలు సైతం హడావుడి, అత్యుత్సాహం తగ్గించుకుని జవాబుదారీతనంవైపు చూడటం మొదలెట్టాయి. అందుకే... కొన్నాళ్లుగా భారీ కరెక్షన్కు గురైన భారత ఐటీ దిగ్గజాల విషయంలో మళ్లీ పునరాలోచన మొదలయ్యింది. ఏఐ వల్ల నష్టపోతాయనే ఉద్దేశంతో భారీగా కరెక్షన్కు గురైన ఈ కంపెనీల షేర్లు... ఇపుడు ఆ నష్టం పరిమితమేనన్న అంచనాల నేపథ్యంలో కొంతైనా కోలుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఐ ఎలా మారుతోంది? మన ఐటీ స్టాక్స్ విషయంలో ఏం చేయొచ్చు? ఇదే ఈ ‘వెల్త్ స్టోరీ’ ప్రధానాంశం.ఏఐ హడావుడితో ఆ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఐటీ షేరూ భారీగా ర్యాలీ చేసింది. కానీ పరిశ్రమ ఇపుడు కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇన్వెస్టర్లు ఏ కంపెనీలు మెరుగ్గా ఉన్నాయి? ఏవి బలహీనంగా ఉన్నాయనేది పోల్చి చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బలమైన బ్యాలెన్స్ షీట్లు, క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, ఏఐ వ్యూహాలను అమలు చేయగలిగే సామర్థ్యాలు, క్యాష్–ఫ్లో మెరుగ్గా ఉన్న కంపెనీలు నిలదొక్కుకుంటాయి. మరింత బలోపేతం అవుతాయి. మిగతావి రాణించలేక కొట్టుమిట్టాడవచ్చు. మార్కెట్ ఆందోళన ఇదీ.. → ఏఐ వల్ల బిల్లింగ్ హవర్స్ తగ్గిపోతాయి: దేశీ ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుని, వారి ద్వారా ఆదాయాలు ఆర్జిస్తూ వస్తున్నాయి. ఏఐ రాకతో కోడింగ్ ఆటోమేటిక్ అవుతోంది. టెస్టింగ్ చేసే సిబ్బంది, ఇతరత్రా సపోర్ట్ సిబ్బంది అవసరం తగ్గిపోతుంది. దీనితో పాత తరహా ఔట్సోర్సింగ్ మోడల్పై నేరుగా ప్రభావం పడుతుంది. → ఆచితూచి ఖర్చు చేస్తున్న క్లయింట్లు: గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే జీపీయూలు, ఏఐ చిప్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీనితో సంప్రదాయ తరహా ఐటీ సేవలపై ఖర్చు చేయడం తగ్గవచ్చు. → మారుతున్న ‘హ్యూమన్ పిరమిడ్’ మోడల్: భారతీయ ఐటీ సంస్థల లాభదాయకత అనేది భారీ స్థాయిలో ఫ్రెషర్లను తీసుకోవడం, పరిస్థితికి తగ్గట్లు డెలివరీ సామర్థ్యాలను పెంచుకోగలగడం, తక్కువ వేతనాలకే ఉద్యోగులు లభిస్తుండటంలాంటి అంశాలపై ఆధారపడుతూ వస్తోంది. అయితే, ఏఐ రాకతో ఈ విధానం ఇక మారిపోవచ్చు.ఇదీ... మన ఐటీ దిగ్గజాల పరిస్థితి→ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ధర శ్రేణి: రూ. 3,000–3,100 52 వారాల గరిష్టం: రూ. 4,500 పైగా ట్రెండ్: భారీగా కరెక్షన్ టీసీఎస్ ఇప్పటికీ భారత్లో అతి పెద్ద ఐటీ కంపెనీ. అంతర్జాతీయంగానూ క్రెడిబిలిటీ ఉంది. అయితే, క్లయింట్లు ఖర్చులు తగ్గిస్తుండటం, ఏఐ వల్ల బిల్లింగ్ తగ్గడం, వృద్ధి రేట్లు గణనీయంగా మందగిస్తుండటంపై ఇన్వెస్టర్లు కాస్త ఆందోళనతో ఉన్నారు. కాకపోతే, కస్టమర్లతో బలమైన సంబంధాలు, పటిష్టమైన క్యాష్ ఫ్లో, ఏఐని అమలు చేయాల్సిన డీల్స్ పెరుగుతుండటం లాంటివి సంస్థకు సానుకూలంగా కనిపిస్తున్నాయి.→ ఇన్ఫోసిస్ ప్రస్తుత ధర శ్రేణి: రూ. 1,150–1,200 52 వారాల గరిష్టం: రూ. 1,700 పైగా ట్రెండ్: భారీగా తగ్గిన వేల్యుయేషన్ ఇన్ఫోసిస్ తమ ‘టొపాజ్ ఏఐ’ వ్యూహాన్ని బలంగా అమలు చేస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏఐ టూల్స్ వల్ల కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ అంతా ఆటోమేట్ అయిపోతే సిబ్బందికి సంబంధించి బిల్లింగ్ పరంగా ఆదాయాలు ఎలా ఉండొచ్చనేది ఆలోచిస్తున్నారు. క్లయింట్లు ఏఐ ట్రాన్స్ఫర్మేషన్పై భారీగా వెచి్చంచడాన్ని కొనసాగిస్తూ, క్లౌడ్కి మళ్లటాన్ని వేగవంతం చేసి, కన్సల్టింగ్ సర్వీసులకు డిమాండ్ పెరిగితే సంస్థ భవిష్యత్తు బాగుండొచ్చు. అయితే, కొన్నాళ్ల పాటు మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు.→ విప్రో ప్రస్తుత ధర శ్రేణి: రూ. 230–260 ట్రెండ్: దీర్ఘకాలికంగా బలహీన పనితీరు ఏఐ విప్లవం భయాలు తలెత్తడానికి చాలా కాలం ముందు నుంచే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విప్రో సవాళ్లు ఎదుర్కొంటూ వస్తోంది. నెమ్మదిగా ఉన్న కంపెనీలు ఏఐ జమానాలో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని మార్కెట్లు భావిస్తున్నాయి. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ మెరుగుపడి, ఏఐ కన్సల్టింగ్ పుంజుకుని, భారీ గ్లోబల్ కాంట్రాక్టులు తిరిగి వస్తే విప్రో మళ్లీ టర్న్ అరౌండ్ కావచ్చు. అలా జరగకపోతే పటిష్టంగా ఉన్న పోటీ సంస్థల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపొచ్చు.→ హెచ్సీఎల్ టెక్ ప్రస్తుత ధర శ్రేణి: రూ. 1,150–1,200 52 వారాల గరిష్టం: రూ. 1,770 ఇంజినీరింగ్ సర్వీసులు, ఇన్ఫ్రా మేనేజ్మెంట్, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ప్రోడక్టుల్లో పటిష్టంగా ఉండటం సంస్థకు సానుకూలాంశాలు. అయినప్పటికీ గరిష్ట స్థాయుల నుంచి షేరు భారీగా కరెక్షన్కి లోనయ్యింది. ఒకవేళ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాపై క్లయింట్లు వెచి్చంచడం పెరిగితే, ఏఐ ఆధారిత ఇంజనీరింగ్కి డిమాండ్ పెరిగితే కంపెనీకి లాభించవచ్చు.→ టెక్ మహీంద్రా ధర శ్రేణి: రూ. 1,450 ట్రెండ్: మిగతావాటితో పోలిస్తే నిలకడగా రాణిస్తోంది. ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే టెక్ మహీంద్రా ఇటీవల నిలకడగా రాణిస్తోంది. అంతర్జాతీయంగా టెలికం టెక్నాలజీ అప్గ్రేడేషన్ వేగవంతం అయితే పరిశ్రమలో పటిష్టంగా రాణించే కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలవొచ్చు.మిడ్క్యాప్ ఐటీ: రిస్క్ లు, అవకాశాలూ.. రెండూ ఎక్కువేకోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఎం, ఎంఫసిస్ వంటి పలు మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ కంపెనీలు ఏఐ ఇంటిగ్రేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్టులుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నాయి. ఒకవేళ అంతర్జాతీయంగా ఏఐ వినియోగం వేగవంతమైతే కొన్ని కంపెనీలు విజేతలుగా నిలవొచ్చు. కానీ ఊగిసలాట ఎక్కువే ఉంటుంది. నిజానికి చారిత్రకంగా చూస్తే మెయిన్ఫ్రేమ్, ఇంటర్నెట్, క్లౌడ్ మైగ్రేషన్, మొబైల్ విప్లవంలాంటి ఎన్నో సవాళ్లను దేశీ ఐటీ రంగం ఎదుర్కొని నిలబడింది. ఏఐ ఒకరకంగా పాత బిజినెస్ మోడల్స్కి ముప్పుగా ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ అవకాశాలనూ అందించవచ్చు. గ్లోబల్ దిగ్గజాల అవసరాలను దేశీ ఐటీ కంపెనీలు అందిపుచ్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీని అమలు చేయటం, తమ కార్యకలాపాల్లో ఏఐని అనుసంధానించుకోవడం, ఏఐ టూల్స్ని కస్టమైజ్ చేసుకోవడం, డేటా నిర్వహణ, దేశీ చట్టాల అమలు మొదలైన విషయాల్లో గ్లోబల్ కంపెనీలకు భారతీయ ఐటీ సంస్థలు భాగస్వాములుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారీ ఏఐ మోడల్స్ని తయారు చేసే కంపెనీలతో పాటు ఏఐని ఉపయోగించుకోవడంలో క్లయింట్లకు సహాయపడగలిగే సంస్థలూ రాణించే అవకాశాలుంటాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పరిశీలించతగిన సానుకూల, ప్రతికూలాంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..సానుకూల సంకేతాలు... → భారీ స్థాయి ఏఐ డీల్స్ → ఏఐ ద్వారా వచ్చే ఆదాయం → మార్జిన్లు స్థిరంగా ఉండటం → బైబ్యాక్లు, డివిడెండ్లు → సంస్థ పరివర్తనకు దోహదపడే కాంట్రాక్టులు. ప్రతికూల సంకేతాలు → నియామకాలు బలహీనంగా ఉండటం → ఏఐ వినియోగం తగ్గుతుండటం → కొత్తగా కుదిరే అవకాశమున్న డీల్స్ సంఖ్య తగ్గుతుండటం → మార్జిన్లు పడిపోతుండటం → రాబడులు లేకుండా ఏఐపై అతిగా ఖర్చు చేస్తుండటం.రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చంటే..ఎక్కువగా రిస్కు ఇష్టపడనివారు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటివి పరిశీలించవచ్చు. ఇవి దీర్ఘకాలికానికి అనువుగా ఉంటూ స్థిరత్వాన్ని, డివిడెండ్లను అందిస్తున్నాయి. రిస్కు తీసుకోగలిగే వారు కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఎం, టెక్ మహీంద్రాలను పరిశీలించవచ్చు. ఏఐ ఆధారిత వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇవి అనువుగా ఉంటాయి. – సాక్షి, వెల్త్ డెస్క్ -
AI: ఒక కొత్త రక్కసి.. ఇదొక మహా ప్రళయం!
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు." ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్గేట్' అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్ లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లను, టూల్స్ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లతో వ్యాపారం చేస్తాయా?ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్వేర్కు, ప్రతి యాప్కు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం. ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి. కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు. - కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఏఐపై కోట్ల ఖర్చు... ఫలితం మాత్రం శూన్యం
-
బైబిల్ లోని కథను ఉదహరిస్తూ, AIపై పొప్ లియో హెచ్చరిక
-
'ఏఐ'.. నా సీటెక్కడోయ్?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్ మారుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థుల ఆలోచన విధానం పరుగులు పెడుతోంది. ర్యాంకు తెలిసిన ప్రతీ విద్యార్థి సీటు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఏఐ టూల్స్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షన్లపై మాక్ కౌన్సెలింగ్కు ఏఐ ఆధారిత నెట్ సైట్లకే లాగిన్ అవుతున్నారు. కన్సల్టెన్సీలు, ఏజెంట్లను ఆశ్రయించడం తగ్గిపోయింది. పైగా కన్సల్టెన్సీలు కూడా ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఏఐ వాడకం పెరిగిన తర్వాత కన్సల్టెన్సీలకు వచ్చే విద్యార్థులు 40 శాతం తగ్గారని ప్రైవేటు కన్సల్టెంట్ సంజయ్ మిత్ర చెప్పారు. ర్యాంకును బట్టి ఏఐ ద్వారా సీటును అంచనా వేయడంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులూ ముందు వరుసలోనే ఉన్నారని తెలిపారు. తాము కూడా ఏఐ ఆధారిత అప్లికేషన్స్ను సమకూర్చుకోవాల్సి వచ్చిందని మరో కన్సల్టెంట్ శైలేష్ పల్లవ్ తెలిపారు. అంచనాల దూకుడులో ఏఐప్రతీ కాలేజీకి సంబంధించి గత కొన్నేళ్ల కటాఫ్ వివరాలు ఇప్పటికే క్లౌడ్ డేటాకు చేరాయి. ఏఐ ఆధారిత కసరత్తు రెండేళ్లుగా జరిగినట్టు ఎడ్యు డేటా సెంటర్కు చెందిన దిలీప్ మల్హోత్రా తెలిపారు. కౌన్సెలింగ్ ప్రిడిక్టర్స్, ర్యాంకు ఆధారిత కాలేజీ అవకాశాలు, బ్రాంచ్ వారీగా విశ్లేషణలు, ఏఐ ఆధారిత రికమండేషన్స్, కొన్నేళ్లుగా కటాఫ్ ఆధార అంచనాలతో కూడిన డేటా.. క్లౌడ్ సెంటర్ల నుంచి వేగంగా తెస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఆధునిక అప్లికేషన్స్ నెట్లో హల్చల్ చేస్తున్నాయని హైదరాబాద్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ వినీత్ వస్లా తెలిపారు. ప్రారంభ, ముగింపు కటాఫ్ వివరాలను అన్ని కాలేజీల స్థాయిల్లో అందించేలా అప్లికేషన్స్ రూపొందించినట్టు చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ర్యాంకు అంచనా కోసం వెతికే సమయం తగ్గిపోయిందన్నారు. ఐదు నుంచి పదేళ్ల కటాఫ్ వివరాలను కొన్ని అప్లికేషన్లు గ్రాఫిక్స్ రూపంలో అందిస్తున్నాయి. కాలేజీల ప్లేస్మెంట్ ట్రెండ్, ఫీజులు తదితర సమాచారం డేటా కేంద్రాల్లో నిక్షిప్తం చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్ల బ్రాంచీల వారీగా డిమాండ్ వివరాలనూ ఏఐ మాడ్యూల్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు పెరిగినట్టు కేరీర్ కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్ పొలంపల్లి తెలిపారు.నెట్లో హల్చల్..కన్వెన్షనల్ ఏఐ కౌన్సెలర్లు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తున్నాయి. ‘నా ర్యాంకు ఇంత... నాకు సీఎస్ఈ సీటు కావాలి.. హైదరాబాద్లో ఏ కాలేజీలో వస్తుంది’ అని ఫీడ్ చేస్తే క్షణాల్లో సమాధానం వస్తుంది. కాలేజీల జాబితా, గత కటాఫ్, ఫీజులు, ప్లేస్మెంట్, ప్రత్యామ్నాయ బ్రాంచీలను ఏఐ సూచిస్తోంది. ఈ తరహా ప్లాట్ఫామ్కు ఏఐ ట్యూటర్, కటాఫ్ ప్రిడిక్షన్, కెరీర్ గైడెన్స్ వంటి ఫీచర్లను కొత్తగా జోడించడం వల్ల ఫలితం వేగంగా వస్తోంది. అంతేకాదు... ఎంచుకునే కోర్సు డిమాండ్ను కూడా ఏఐ విశ్లేషిస్తోంది. కోర్... నాన్ కోర్... ఎమర్జింగ్ కోర్సుల్లో డిమాండ్... ఉద్యోగ అవకాశాలు.. ఐదేళ్లుగా బ్రాంచీకి ఉన్న డిమాండ్, ఉపాధి అవకాశాల వివరాలు అందుతున్నాయి. పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ డ్యాష్ బోర్డులూ చురుకుగా పనిచేస్తున్నాయి. విద్యార్థి ప్రొఫైల్, మాక్టెస్ట్ పనితీరు, ఇష్టమైన నగరాలు, ఫ్యామిలీ బడ్జెట్ వివరాలను ఈ డ్యాష్బోర్డ్ ద్వారా రూపొందిస్తున్నారని, భవిష్యత్లో ఇవి మరింత కీలకం అవుతాయని ఐటీ రంగ నిపుణుడు చరణ్ సంగుపాటి తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, కాలేజీలు కూడా వీటి ఆధారంగానే విద్యార్థులను యాజమాన్య కోటా వైపు మళ్లించే వీలుందని తెలిపారు.ఈసారి సూపర్ ర్యాంక్ 5 వేలే..ఏఐ అంచనాలన్నీ ఈ ఏడాది కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంటుందనే చెబుతున్నాయి. ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల ట్రెండ్ను సూచిస్తున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో సీఎస్ఈ కోర్సులకు ప్రధాన పది కాలేజీల్లో 5 వేల ర్యాంకు కటాఫ్గా ఉండే వీలుందని చెబుతున్నాయి. ఓయూ, జేఎన్టీయూహెచ్ వంటి క్యాంపస్లలో 3 వేల వరకూ కటాఫ్ ఉండే వీలుందని చెబుతున్నాయి. టాప్ కాలేజీలు, యూనివర్సిటీలకు ఇతర జిల్లాల్లో ఉండే కాలేజీల్లో ఎస్సీ కేటగిరీకి 10 నుంచి 16 వేల ర్యాంకు వరకూ సీఎస్ఈ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. కంప్యూటర్ కోర్సుల తర్వాత ఈసీఈ కోర్సుకు రెండో ప్రాధాన్యత కన్పిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. టాప్ కాలేజీల్లో 8 వేల వరకూ, క్యాంపస్ కాలేజీల్లో 5 వేల వరకూ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. -
ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికెలో ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు ఫిర్యాదుల నమోదులో తలెత్తే భాషా సమస్యలను దూరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ–కాప్రైటర్ పేరుతో ఉన్న ఈ యాప్ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఆవిష్కరించారు. తక్షణమే రికార్డు చేసి అనువదిస్తూ... బాధితులు మాతృభాషలో చెప్పే ఫిర్యాదుల్లోని అంశాలను ఏఐ–కాప్రైటర్ తక్షణమే రికార్డు చేసి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులకు ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే భాషా సమస్యలను ఈ యాప్ తొలగిస్తుంది. బాధితుల భాష అర్థం కాకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదు కావడానికి ఈ యాప్ స్వస్తి పలకనుంది. తొలిదశలో 10కిపైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించేలా ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతోపాటు పాగ్రో చందు అనే ఇంటర్న్ సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించారు. యాప్లోని ప్రధాన అంశాలు బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో ఫిర్యాదు చేస్తే ఈ యాప్ వెంటనే పోలీసులకు అర్థమయ్యే భాషలోకి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. వేగం–కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు నమోదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. మల్టీ–పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది. శిక్షలు కూడా పెరుగుతాయి హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావడంతో తెలుగు, ఆంగ్లం, హిందీ రాని వాళ్లూ కూడా వలస వచ్చి స్థిరపడుతున్నారు. భాష తెలియకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఈ యాప్ చెక్ పెడుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మీకులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
ఏఐతో కంబైన్డ్ స్టడీ!
చదువుకోవడానికి పక్కా టైంటేబుల్ ఉంటే సగం విజయం సాధించినట్లే. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా, ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాసైపోవచ్చు. –సాక్షి స్పెషల్ డెస్క్పోమోడోరో టెక్నిక్ గంటల తరబడి బ్రేక్ లేకుండా చదివితే బుర్రకెక్కదు. అందుకే పోమోడోరో టెక్కిక్ అనే ఈ స్మార్ట్ పద్ధతిని పాటించండి. ⇒ 25 నిమిషాలు శ్రద్ధగా చదవండి. ⇒ 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి (నడవడం, నీళ్లు తాగడం). ⇒ ఇలా 4 సార్లు అయ్యాక, 15–30 నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోండి. ⇒ ఇతర విషయాలను దూరం పెట్టండి. చదువుకునే సమయంలో ఫోన్ సైలెంట్లో పెట్టి మీకు దూరంగా ఉంచండి. సోషల్ మీడియా నోటిఫికేషన్ మీ సమయాన్ని వృథా చేయకుండా చూసుకోండి. ఎలా చదవాలి? ముందుగా మీ సిలబస్ను ఒక పేపర్పై రాసి, ఏఐ టూల్స్ సాయంతో టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. కళ్ల ముందు స్పష్టమైన ప్లాన్ ఉంటే అయోమయం పోతుంది. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోతే, ఏఐ టూల్స్ వాటంతటవే మీ కాల ప్రణాళికను సర్దుబాటు చేస్తాయి. చదువును సులువు చేసే 4 ఏఐ టూల్స్ 1. షోవెల్ యాప్ (స్టడీ ప్లానర్): మీ కాలేజీ సమయాలు, నిద్ర, ఇతర పనులు, సబ్జెక్ట్ డెడ్లైన్ వివరాలను ఇందులో నింపితే మీకు మిగిలిన ఖాళీ సమయాన్ని లెక్కించి ఒక మంచి టైమ్ టేబుల్ ఇస్తుంది. 2. నోషన్ ఏఐ (ఆల్ ఇన్ వ¯న్ ఆర్గనైజర్): గజిబిజిగా ఉన్న సిలబస్ లిస్ట్ను ఇది ఒక చక్కటి పట్టికగా మార్చేస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ట్రాక్ చేయడానికి ఇది మంచి టూల్. 3. చాట్జీపీటీ (పర్సనల్ స్టడీ కోచ్): మీ అవసరానికి తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తుంది. ఉదాహరణకు: ‘‘నాకు వచ్చే నెల మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, రోజుకు 2 గంటలే చదవగలను, ప్లాన్ ఇవ్వు’’అని అడిగితే క్షణాల్లో వీక్లీ ప్లాన్ రెడీ చేసి ఇస్తుంది. 4. టుడూఇస్ట్ (స్మార్ట్ టాస్క్ మేనేజర్): ‘‘ఈ వారం హిస్టరీ ప్రాజెక్ట్ చేయాలి, రోజూ సై¯న్స్ రివిజన్ చేయాలి’’అని మీరు సాధారణంగా టైప్ చేస్తే, ఈ ఏఐ వాటి డెడ్లై¯న్ను గుర్తించి క్యాలెండర్లో ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. -
లేఆఫ్స్ బాధితులకు కొత్త దారి చూపిన చాట్జీపీటీ!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తలెత్తిన లేఆఫ్స్ భయం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పట్టి పీడిస్తోంది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్న 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు, తన భవిష్యత్తు కెరీర్ మార్గాల గురించి చాట్జీపీటీని సంప్రదించారు. ఆ ఏఐ ఇచ్చిన సమాధానం, కేవలం సలహాగానే కాకుండా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్లా ఉండి, ఆ ఉద్యోగిలో ఉన్న ఒత్తిడిని ఒక్కసారిగా తొలగించేసింది. మనిషి ఆలోచనా శక్తి, డొమైన్ నైపుణ్యం, కమ్యూనికేషన్ మొదలైనవే కీలకం అని ఏఐ స్పష్టంగా చెప్పింది.హై-డిమాండ్ రంగాల వైపు అడుగులుకేవలం కోడింగ్ మాత్రమే చేసే రోల్స్ కాకుండా, భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే ఏఐ/ ఎంఎల్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్ ప్లాట్ఫారమ్ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ వంటి విభాగాల్లోకి మారడం ఉత్తమమని చాట్జీపీటీ సూచించింది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం ఇంటిగ్రేషన్ , క్లౌడ్ సెక్యూరిటీపై దృష్టి పెట్టడం ద్వారా ఉద్యోగ భద్రతను పెంచుకోవచ్చు. పాత పద్ధతిలో పనిచేసే కోడింగ్ కంటే, ఏఐని ఉపయోగించుకుంటూ పనితీరును పెంచుకునే వారికి రాబోయే ఐదుపదేళ్లలో భారీ డిమాండ్ ఉంటుంది.మేనేజిమెంట్, ప్రభుత్వ రంగంలో అవకాశాలువ్యాపార వ్యూహాలను అర్థం చేసుకునే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంజనీర్లకు 'ప్రొడక్ట్ మేనేజ్మెంట్' ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్. ఏఐ కోడ్ని వేగంగా రాయగలదు కానీ, వ్యాపార నిర్ణయాలను తీసుకోలేదు కాబట్టి ఈ పాత్రలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అలాగే ఆర్బీఐ, సెబీ, ఐఎస్ఆర్డీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోని డిజిటల్ విభాగాల్లో కూడా క్లౌడ్, సెక్యూరిటీ నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి స్థిరమైన కెరీర్ను కోరుకునే వారికి గొప్ప వేదికలు.12 నెలల సేఫ్టీ ప్లాన్: మీ వృత్తికి కొత్త బాటవచ్చే 12 నెలల కాలంలో మీరు ఎంచుకున్న రంగంలో సర్టిఫికేషన్లు పొందడం, పోర్ట్ఫోలియో ప్రాజెక్టులు నిర్మించడం, నెట్వర్కింగ్ను పెంచుకోవడం ద్వారా లేఆఫ్స్ భయం నుండి బయటపడవచ్చు. ప్రాథమిక కోడింగ్ పనులకు దూరంగా ఉంటూ, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్ వైపు దృష్టి సారించాలి. లేఆఫ్స్ అంటే కెరీర్ ముగింపు కాదు, అది కేవలం కంపెనీల వ్యూహాత్మక మార్పు మాత్రమేనని గుర్తించి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించవచ్చని చాట్జీపీటీ తెలిపింది. -
కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా?
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని పుణ్యమా అని భవిష్యత్తులో ఐటీ సహా పలు రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సిలికాన్ వ్యాలీలోని గ్లీన్ కంపెనీ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన అరవింద్ జైన్ భిన్నమైన, అత్యంత సానుకూల దృక్పథాన్ని వినిపించారు. ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయలేదని, బదులుగా వారి పనితీరును, సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ఎంటర్ప్రైజ్ సెర్చ్ ప్లాట్ఫామ్ గ్లీన్ సీఈఓ అయిన అరవింద్ జైన్.. ‘ఫార్చ్యూన్’ నిర్వహించిన వర్క్ప్లేస్ ఇన్నోవేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భర్తీ చేసేంత లేదు..ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయవచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోందని, అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని అరవింద్ జైన్ పేర్కొన్నారు. ‘నా ఉద్దేశం ప్రకారం.. భవిష్యత్తులో ఎప్పటికీ ఏఐ ఏ మానవ సిబ్బందినీ భర్తీ చేయదు. ఇది వాస్తవానికి మనల్ని మరింత సమర్థులుగా మారుస్తుంది. అత్యున్నత నాణ్యతతో కూడిన పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది. మేము ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతానికైతే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు’ అని అరవింద్ జైన్ తెలిపారు.ఉద్యోగులకు ఏఐ ఒక కో-పైలట్లాగా పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. రోజువారీగా సాగే రొటీన్, పునరావృత పనులను ఏఐకి అప్పగించడం ద్వారా.. మానవులు తమ ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం వంటి కీలకమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చని ఆయన విశ్లేషించారు.దిగ్గజాల హెచ్చరికలుభవిష్యత్ శ్రామిక శక్తిపై అరవింద్ జైన్ వ్యక్తంచేసిన అంచనాలు, ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార వర్గాల సెంటిమెంట్కు పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇప్పటికే ఏఐ ముప్పుపై హెచ్చరిస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా దాదాపు సగం వరకు వైట్-కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని పదేపదే హెచ్చరించారు. జేపీ మోర్గాన్ అధినేత జేమీ డిమోన్, ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ.. అమెరికా సహా అంతర్జాతీయంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ ఆక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు! -
తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్తగా 23 మందికి తన కేబినెట్లో స్థానం కల్పించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరితో గర్నవర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు. కొత్తగా చేరిన మంత్రులతో తమిళనాడు కేబినెట్లోని సభ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్తరణ జరడంతో ఇంతకుముందు ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం విజయ్ కూడా తన దగ్గరున్న కొన్ని శాఖలకు కొత్త మంత్రులకు బదిలీ చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టుగానే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆర్ కుమార్కు ఈ శాఖను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖను కూడా ఆయనకే అప్పగించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొందనున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్కు కీలక శాఖలుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేశ్కుమార్, పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం దక్కింది. రాజేశ్కుమార్ పర్యాటక శాఖ, విశ్వనాథన్కు ఉన్నతవిద్య శాఖ కేటాయించారు. ఇది ఊహించలేదు: ఐయూఎంఎల్తమను మంత్రి వర్గంలో చేరమని సీఎం విజయ్ ఆహ్వానిస్తారని ఊహించలేదని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చామని, మంత్రి పదవుల కోసం తాము అడగలేదని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోతే గవర్నర్ పాలన వస్తుందని, తద్వారా బీజేపీ పెత్తనం చెలాయిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్కు మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం వెల్లడించలేదు.చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం! -
AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
సాక్షి,బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతుంది. దీంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సంస్థల్లో రెగ్యులర్గా ఒకే పనిచేసే ఉద్యోగుల వరకు ఉపాధిని కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు అదే ఏఐ వినియోగంతో పలువురు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, బెంగళూరులో కూరగాయలు అమ్మే యువకుడు ఏఐ సాయంతో గంటకు రూ.350 నెలకు రూ.లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ఇన్స్టాగ్రామ్ యూజర్ వైభవ్ తన ఇన్స్టా అకౌంట్లో ఓ వీడియోని షేర్ చేశారు.‘నేను నా స్కూటీ మీద అలా వెళ్తుండగా ఈ దృశ్యం నా కంటపడింది. వెంటనే కుతూహులంగా వెళ్లి హెడ్ బ్యాండ్ గురించి ఆరా తీశాను. ఐఫోన్, మెమరీ కార్డ్తో హెడ్బ్యాండ్తో డేటా కలెక్ట్ చేస్తున్నాడు అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ యువకుడు రియల్ టైం డేటా కలెక్ట్ చేసేలా ఏఐ డేటా కలెక్షన్ హెడ్ గేర్ను ధరించాడు. హెడ్గేర్ను తలకు ధరించిన ఆ యువకుడు కరివేపాకు కట్టలు కడుతున్నారు. కరివేపాకు కట్టలను కొనుగోలు దారులకు అమ్ముతున్నాడు. అమ్మే సమయంలో కొనుగోలు దారులు, అమ్మకం దారుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల్ని హెడ్గేర్ సాయంతో డేటాను సేకరిస్తున్నాడు.అలా సేకరించిన రియల్ టైమ్ డేటాను ఏఐ కంపెనీలకు అందిస్తాడు. రియల్ డేటా విలువైనదిగా ఉండటంతో సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ ఘటనలో కరివేపాకు అమ్మే యువకుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏఐ కంపెనీలు హెడ్ గేర్ల సాయంతో కంపెనీలకు కావాల్సిన డేటాను వీడియో, ఆడియో, సంభాషణల రూపంలో తీసుకుంటాయి. తీసుకున్న డేటాను ఏఐ మోడళ్లకు అప్లయి చేస్తాయి. అలా అప్లయి చేయడం వల్లే యూజర్లుకు అందిస్తున్న సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకుంటాయి. యూజర్లకు అందించే డేటాను..రియల్ టైం డేటాతో సరిపోల్చి యూజర్కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ డేటా గేర్ కనెక్షన్ ధరపై స్పష్టత లేదు. కానీ ఇది సాధారణంగా ఐఫోన్ లేదా కెమెరా, మెమరీ కార్డ్, హెడ్బ్యాండ్ వంటి పరికరాలతో తయారు చేసిన తాత్కాలిక టూల్. ఈ గేర్ను కంపెనీలు గిగ్ వర్కర్లకు అందిస్తాయి. ఓ వైపు పనిచేసుకుంటూనే మరో వైపు అదనపు ఆదాయం కోసం పలువురు ఇలాంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పలువురు ఈ పరికరాన్ని ధరించి గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Vaibhav | Peaks & Protein (@vai.bhaaavvv) -
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్షెల్ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్షెల్ను ఇంక్యుబేటర్లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు. -
అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.AI కారణం అందుకే..సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.టెక్నాలజీ విప్లవంఒకప్పుడు స్మార్ట్ఫోన్ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.How is it that in the US, the AI leader, a good part of the population, even a lot of college students, have come to hate AI? It does not help that companies are blaming job losses on AI, which is both convenient and as an added bonus, makes a company look visionary.The layoffs…— Sridhar Vembu (@svembu) May 19, 2026మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్ ట్రేడ్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.మార్పునకు అవకాశంచరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్లో తేడా! -
భారత్లో చాట్జీపీటీ ఇమేజ్ల సునామీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0’ భారత్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. ‘‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న భారత్లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్ పోర్ర్టెట్ కొలాజ్’, ‘మినీ మీ వరల్డ్’, ‘అండర్వాటర్ పోర్ర్టెట్’, ‘అనిమే’, ‘చిబి స్టికర్ ప్యాక్’, ‘మంగా కామిక్ స్ట్రిప్’, ‘ఫ్యాషన్ స్టూడియో పోర్ర్టెట్’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్లో ఏఐ ఇమేజ్ జనరేషన్ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్డమ్స్, డిజిటల్ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్ఏఐ పేర్కొంది. -
జీసీసీ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
ఎయిర్టెల్ స్టైలే వేరు..
ముంబై: గత దశాబ్దకాలంగా పలు దేశీ ఐటీ కంపెనీలు తమ దగ్గరున్న నిధులను ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో పంచేందుకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయని టెలికం దిగ్గజం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. తమ రంగాల్లోని కొత్త తరం వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో అవి విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అయితే, ఎయిర్టెల్ ఆ బాటలో వెళ్లదని మిట్టల్ స్పష్టం చేశారు. టెలికం కంపెనీలు వృద్ధి అవకాశాలు అందించే అసెట్స్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాల్సిందనేనని, లేకపోతే వెనుకబడిపోయే రిస్క్ లు ఉంటాయన్నారు. కాబట్టి తాము ఇటు బైబ్యాక్లు, డివిడెండ్లు ఇస్తూనే అంతర్జాతీయంగా టెలికం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన సందర్భంగా తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యాపార విస్తరణపై ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో తమ దగ్గరున్న నిధులను మరీ ఎక్కువగా వెచ్చిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 16 దిగ్గజ ఐటీ కంపెనీలు, షేర్హోల్డర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్ల మొత్తాన్ని బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ. 95,400 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికం. పదేళ్లలో వారసులకు వ్యాపార పగ్గాలు .. వచ్చే దశాబ్దకాలంలో వ్యాపార పగ్గాలను తన వారసులకు అప్పగించనున్నట్లు మిట్టల్ చెప్పారు. అలాగే, భారతి ఎయిర్టెల్లో ప్రమోటర్ సంస్థ భారతి టెలికం తిరిగి 50 శాతం పైగా వాటాను దక్కించుకునేలా చూడాలనేది తన ఆకాంక్ష అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతి టెలికంకి ఎయిర్టెల్లో 40.47 శాతం వాటాలు ఉన్నాయి. 10 శాతం మేర వాటాలు పెంచుకోవాలంటే ప్రస్తుత షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కనీసం రూ. 1 లక్ష కోట్లు అవసరమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు. -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. 2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు. వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు ఏఐ ఎకోసిస్టమ్లో ‘బిల్డ్–పార్ట్నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు. భారత్లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది. కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా, బ్యాంకింగ్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్ భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. -
Open AI సర్జికల్ స్ట్రైక్..
-
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)...మరింత సహజంగా
‘రోబో’ సినిమాలో చిట్టి(రోబో) దూకుడు చూసి... ‘అయ్ బాబోయ్... ఎంతైనా యంత్రం యంత్రమేనండీ. అది మనిషిలా ఎందుకు స్పందిస్తుంది!’ అనుకున్నాం. ఏఐ టూల్స్ మొదట్లో అబ్బురపరిచినా... మనుషులతో పోల్చితే ఎక్కడో ఏదో లోపం కనిపించడం మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. టూల్స్లో సహజమైన మానవీయ స్పందనలు తీసుకురావడానికి ‘ఇంటరాక్షన్ మోడల్స్’తో నడుం కట్టారు ‘ఓపెన్ ఏఐ’ మాజీ సీటీవో, ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఫౌండర్ మీరా మురాటి.... ఏ.ఐ. విప్లవ కాలంలో ఉన్నాం మనం. అయితే ఏఐ అనేది చాలావరకు వాకి–టాకిలా పనిచేస్తోంది అనే అభిప్రాయం ఉంది.భవిష్యత్ సూచనమనం ఏదైనా అడుగుతాం. ఆగి, విని, ఆలోచించి చివరికి సమాధానం ఇస్తుంది ఏఐ సాధనం. ఆ తర్వాత మళ్లీ వేచి చూస్తుంది. చాట్జీపీటి, జెమిని, క్లాడ్, గ్రోక్... ఏది ఉపయోగిస్తున్నా దాదాపుగా ప్రతి ఏఐ సాధనం ‘టర్న్–బేస్డ్’ నమూనానే అనుసరిస్తోంది. మొదట మనుషులు మాట్లాడతారు. ఆ తరువాత యంత్రాలు స్పందిస్తాయి. ఈ విధానంపై సిలికాన్ వ్యాలీలోని ఏఐ దిగ్గజాలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ రంగానికి సంబంధించి ‘భవిష్యత్లో ఏం జరగబోతుంది?’ అనేదానికి సంబంధించి ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఒక సిగ్నల్ ఇచ్చింది. కేవలం ప్రాంప్ట్లకు సమాధానం ఇవ్వడానికి కాకుండా, సూచనల కోసం వేచి చూసే చాట్బాట్లా కాకుండా కొలీగ్తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సహజత్వాన్ని ఏఐ సాధనాలలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది మీరా మురాటి.ఇక ముందు అలా ఉండదు!ఏఐ సాధనాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. వినియోగదారులు(యూజర్లు) మాట్లాడినప్పుడు లేదా టైప్ చేసినప్పుడు మోడల్ ఆ అభ్యర్థనను ప్రాసెస్ చేసి ఆ తర్వాతే స్పందిస్తుంది. ఈ విధానాన్ని మార్చడానికి సంభాషణలను 200–మిల్లీ సెకన్ల చిన్న చిన్న భాగాలుగా ప్రాసెస్ చేసే సిస్టమ్లతో ప్రయోగాలు చేస్తోంది మీరా కంపెనీ థింకింగ్ మెషిన్ ల్యాబ్స్. దీనివల్ల వ్యక్తి మాట్లాడుతుండగానే ఏఐ స్పందించగలుగుతుంది.తక్కువ లేటెన్సీ అంటే...‘ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడడానికి సంభాషణ మొత్తం పూర్తి కానక్కర్లేదు. ఇక ఏఐ సాధనాల విషయానికి వస్తే... అవి సంభాషణ మొత్తం ముగిసే వరకు వేచి ఉండి దానిని ప్రాసెస్ చేసి, ఆ తరువాతే దాని గురించి ఆలోచిస్తాయి. తక్కువ లేటెన్సీ అంటే ఒక కంప్యూటింగ్ సిస్టమ్ లేదా నెట్వర్క్ తక్కువ ఆలస్యంతో ప్రతిస్పందించే సామర్థ్యం. ఈ నేపథ్యంలో మీరా మురాటి థింకింగ్ మెషిన్ ల్యాబ్స్ ప్రయోగాలు అతిపెద్ద బలంగా మారనున్నాయి. థింకింగ్ మెషిన్ ల్యాబ్స్కు సంబంధించి రియల్–టైమ్ ఇంటరాక్షన్ సిస్టమ్, ఇంటరాక్షన్ మోడల్స్ విషయానికి వస్తే మనతో మాట్లాడుతూనే ఈ మోడల్ ఆలోచించగలదు. చూడగలదు. ఇది చాలా శక్తిమంతమైన మోడల్’ అంటున్నారు ఏఐ ఎక్స్పర్ట్, ది కటింగ్ ఎడ్జ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అన్ష్ మెహ్రా.భారీ మార్పుఏఐ రూపాన్ని గణనీయంగా తీర్చిదిద్దడంలో ఇంటరాక్షన్–మోడల్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆదేశాలను ఎలా టైప్ చేయాలో, సమర్థవంతంగా ఎలా శోధించాలో, సూచనలను ఎలా ఇవ్వాలో యంత్రాలకు నేర్పించాం. ఇప్పుడు ఆ యంత్రాలు మావవ ప్రవర్తన, స్పందనలకు మరింత సహజంగా అలవాటు పడేలా చేయడానికి ....‘టు మేక్ ఏఐ ఫీల్ లెస్ మెషిన్ అండ్ మోర్ హ్యూమన్’ నినాదంతో మీరా మురాటి మానస పుత్రికలు ‘ ఇంటరాక్షన్ మోడల్స్’ రంగం మీదికి వచ్చాయి. భారీ మార్పు... ఇంటరాక్షన్– స్మాల్‘ ఇంటరాక్షన్ మోడల్స్ రూపంలో భారీ మార్పు సాంకేతికపరమైనది మాత్రమే కాదు తాత్విక పరమైనది కూడా’ అంటున్నారు నిపుణులు. ‘ఇంటరాక్షన్–స్మాల్’ అని పిలువబడే ఈ సిస్టమ్ ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. దీని ఫలితాలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.దీనిలో కొన్ని కీలక ఫీచర్లు...’ సీమ్లెస్ డైలాగ్ మేనేజ్మెంట్:మాట్లాడే మనిషి ఆలోచిస్తున్నారా, ఒత్తిడిలో ఉన్నారా...ఇలాంటి విషయాలను ఈ మోడల్ పరోక్షంగా ట్రాక్ చేస్తుంది.’వెర్బల్ అండ్ విజువల్ ఇంటర్జెంక్షన్స్: యూజర్లు మాట్లాడడం పూర్తి చేసే వరకు వేచి చూడకుండా, సందర్భాన్ని బట్టి ప్రతిస్పందించడానికి ఈ మోడల్ అనుమతిస్తుంది’సైమన్టెనీయస్లీ స్పీచ్‘లైవ్ ట్రాన్స్లేషన్’లాంటి సందర్భంలో యూజర్, మోడల్ ఒకే సమయంలో మాట్లాడేలా వీలు కల్పిస్తుంది.’ కంకరెంట్ టూల్ మాట్లాడుతూనే, వింటూనే శోధించడానికి, బ్రౌజ్ చేయడానికి, యుఐ (యూజర్ ఇంటర్ఫేస్) రూపొందించడానికి వీలుకల్పించే సాధనాలను ఏకకాలంలో ఉపయోగిస్తుంది.’ టైమ్ అవేర్నెస్సంభాషణల సమయంలో గడిచిన సమయాన్ని మోడల్కు తెలియజేస్తుంది. -
ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కొత్త రూల్!
ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల్లో ‘ఆస్కార్’, ‘గోల్డెన్ గ్లోబ్’ ముందు వరుసలో ఉంటాయి. 1929 నుండి ఆస్కార్ అకాడమీ సినిమాలోని వివిధ విభాగాల్లో కనబరచిన ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు ఇస్తోంది. అదే బాటలో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ 1944 నుండి గోల్డెన్ గ్లోబ్ పేరిట అవార్డులు అందిస్తోంది. ఆస్కార్ తర్వాత గోల్డెన్ గ్లోబ్ పురస్కార ప్రదానోత్సవం అమెరికాలో జరుగుతుంది. ఈ పురస్కారాలు సినిమా నిర్మాణ విలువలకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెడతాయి.అవార్డుల ఎంపికలో మానవ సృజనాత్మకతనే ప్రమాణంగా తీసుకొనే ఈ సంస్థలను ఈ మధ్య సినిమాలో పెరుగుతున్న కృత్రిమ మేధ ఇరకాటంలో పడేసింది. 2025లో ‘యాజ్ డీప్ యాజ్ ద గ్రేవ్’ అనే సినిమాలో నటిస్తున్న వాల్ కిల్మేర్ అనే నటుడు ఆకస్మాత్తుగా చనిపోయాడు. వాల్ కుటుంబం అనుమతితో ఆయన రూపాన్ని, గొంతును కృత్రిమ మేధ సాయంతో సృష్టించి ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు అవార్డు ఎంట్రీకి అవకాశం కల్పించాలా వద్దా అనే చర్చ వచ్చింది.సాంకేతిక సృష్టి నటుడికి ప్రత్యామ్నాయం కాదని ఆ సినిమాకు పోటీలో అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆ సంస్థలు అవార్డుల కోసం వచ్చే సినిమాల్లో టెక్నాలజీ వాడుక విషయంలో కొన్ని విధి విధానాలను రూపొందించాయి. 2027 నుండి సినిమాల ఎంట్రీ సమయంలో వీటి పరీక్ష ఉంటుంది. సినిమా నిర్మాణం మానవ సృజనాత్మకతకు గీటురాయి. సహజమైన పువ్వుకు, ప్లాస్టిక్ పూవుకు ఉన్న తేడా తెలిసిందే. సాంకేతికత అనివార్యమైన విభాగాలు మినహా మిగతా వాటిలో మానవ సృజనకే ఈ సంస్థలు పెద్ద పీట వేసేందుకు నిర్ణయించాయి. ప్రత్యేకంగా నటన, రచనల్లో మానవ ప్రమేయం లేకుంటే ఆ యా విభాగాల్లో చిత్రం పోటీ పడే అర్హత లేకుండా చేశాయి.చదవండి: ఓబీసీ క్రిమిలేయర్ కిరికిరి తేలింది!ఈ సందర్భంగా 2023 మేలో జరిగిన హాలీవుడ్ సినిమా రచయితల ఐదు నెలల సమ్మె గమనార్హం. సినిమా స్క్రిప్ట్ విషయంలో నిర్మాతలు చాట్ జీపీటీని వాడుకోవడంపై ఈ సమ్మె జరిగింది. చాట్ జీపీటీ పనిని కూడా తమ గిల్డ్లోని ఓ రచయితకు అప్పగించాలనే ఒప్పందంపై ఆ సమ్మె ముగిసింది. యంత్ర నిర్మిత కళను వ్యతిరేకిస్తున్న ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ల బాటలో మిగతా సంస్థలు నడిస్తే కళ బతుకుతుంది. కళాకారులకు గౌరవం దక్కుతుంది.– బద్రి నర్సన్, కథా రచయిత -
తెలంగాణ క్రికెట్లో కొత్త శకం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, సీఈఓ ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్మీట్లో టీపీఎల్ వివరాలను వెల్లడించారు. హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్.సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విస్తృతంగా చేపడుతున్నామని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్ లకు సంబంధించిన తుది నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు. -
ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..
-
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం'' -
‘క్లిక్’ కొట్టండి.. మామిడి కల్తీని పట్టుకోండి!
వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పసుపు పచ్చగా నిగనిగలాడుతూ ఊరించే మామిడి పండ్లు కనిపిస్తాయి. ఈ రంగు వెనుక వెనుక ‘కాల్షియం కార్బైడ్’ అనే భయంకరమైన రసాయన కుట్ర దాగి ఉంది. రాత్రికి రాత్రే కాయలను పండించే ఈ విషపూరిత రసాయనాన్ని అడ్డుకునేందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో ఒక అద్భుత పరిష్కారం లభించబోతోంది. పంజాబ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న సరికొత్త ఏఐ మొబైల్ యాప్ ద్వారా, వినియోగదారులు కేవలం ఒక ఫొటోతో పండు నాణ్యతను పరీక్షించే వీలు కలుగుతుంది.సాధారణంగా వ్యాపారులు లాభాల కక్కుర్తితో కాల్షియం కార్బైడ్ను పండ్లను మాగబెట్టడానికి వాడుతున్నారు. దీనివల్ల విడుదలయ్యే ఎసిటిలీన్ వాయువు పండ్లకు రంగును ఇస్తుంది. అయితే అందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ అవశేషాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల కిడ్నీ, కాలేయ వైఫల్యాలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల జీర్ణవ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.ఈ సమస్యను శాస్త్రీయంగా ఎదుర్కోవడానికి ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. ఈ స్మార్ట్ యాప్ పండు యొక్క రంగు, ఉపరితల నిర్మాణం, కాంతి పరావర్తనాన్ని విశ్లేషించి, అది సహజ సిద్ధంగా పండిందా లేక రసాయనాలతో పండించబడిందా అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. రసాయనాలతో పండిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, లోపల గట్టిగా ఉండి, సహజమైన సువాసనను కోల్పోతాయి. ఈ సూక్ష్మ వ్యత్యాసాలను ఏఐ డేటా విశ్లేషణ ద్వారా కచ్చితత్వంతో పసిగట్టవచ్చు.భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతించిన ఎథిలీన్ గ్యాస్ పద్ధతి ఖరీదైనది కావడంతో వ్యాపారులు ఈ చౌకైన విషాన్ని వాడుతున్నారు. అయితే త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఏఐ సాంకేతికత సామాన్య వినియోగదారుడికి ఒక రక్షణ కవచంలా మారనుంది. ఇది అందుబాటులోకి వస్తే, కల్తీ పండ్ల మాఫియాకు ముకుతాడు వేయడమే కాకుండా, ఆహారం సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ స్వయంగా తనిఖీ చేసుకునే అవకాశం కలుగుతుంది. అంటే త్వరలో కేవలం ఒక క్లిక్తో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉండబోతోంది.ఇది కూడా చదవండి: Bihar: ఎన్కౌంటర్తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ -
‘ఓపెన్ఏఐ’ సంచలనం.. రూ. 845 కోట్లతో అల్జీమర్స్పై యుద్ధం
లండన్: వృద్ధాప్యంలో మనిషిని జ్ఞాపకాలకు దూరం చేసే ‘అల్జీమర్స్’ వ్యాధికి ఇప్పటివరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్స్ అంతానికి బాటలు వేస్తుందని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు ఏకంగా వంద మిలియన్ డాలర్ల(రూ. 845 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించి, వైద్యరంగంలో సరికొత్త ఆశలు రేకెత్తించారు.సరికొత్త ఆవిష్కరణలకు ఏఐ తోడ్పాటుఅల్జీమర్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని ‘టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆల్ట్మాన్ స్పష్టం చేశారు. మెడికల్ హిస్టరీలోని అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటని, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఏఐ అద్భుతాలు చేయగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి సరైన మందును కనిపెట్టే దిశగా ప్రపంచాన్ని మరింత వేగంగా నడిపించే సత్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందన్నారు.ఆరు సంస్థలతో భాగస్వామ్యంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అల్జీమర్స్ పరిశోధనలను ముమ్మరం చేసేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ తరపున $100 మిలియన్ల నిధులను ఆల్ట్మాన్ కేటాయించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయిలోని ఆరు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. కొత్త డేటాను సృష్టించడం, సరికొత్త ఔషధాలను డిజైన్ చేయడం, అలాగే ఇప్పటికే ఆమోదం పొందిన మందులను ఈ వ్యాధిపై ఎలా ప్రయోగించవచ్చో తెలుసుకోవడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం లక్షలాది బాధిత కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుందని అల్జీమర్స్ అసోసియేషన్ ప్రశంసించింది.భారత్లోనూ తీవ్ర ప్రభావంప్రపంచవ్యాప్తంగా వృద్ధులను పట్టిపీడిస్తున్న డిమెన్షియా కేసుల్లో 60-70 శాతం అల్జీమర్స్ వల్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు అధికం. ఒక్క భారతదేశంలోనే దాదాపు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అమెరికాలో 7 మిలియన్ల మంది బాధితులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మెదడులోని కణాలను నాశనం చేస్తూ, ప్రాణాలను బలిగొనే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు, ఏఐ సాంకేతికతతో జరుగుతున్న ఈ నూతన పరిశోధనలు మానవాళి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం! -
ఉద్యోగాలే కాదు AI దెబ్బకు రియల్ ఎస్టేట్ డౌన్
-
‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో అలజడి చెలరేగుతోంది. గడిచిన 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుత ఎంట్రీ-లెవల్ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటోంది. ఏఐ దెబ్బకు అగ్రశ్రేణి యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలను గమనించిన మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ క్లారా షిహ్.. ‘ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు’ అని హెచ్చరిస్తూనే, యువత (Gen Z) ఉద్యోగ వేట కోసం సరికొత్త ఏఐ సాధనాలను ఆశ్రయించాలన్నారు.టాపర్లనే దాటేసిన ఏఐ.. షాకింగ్ నిజాలుమెటా, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన క్లారా షిహ్.. ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును ప్రత్యక్షంగా చూశారు. తమ సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగుల కంటే ఏఐ ఏజెంట్లు అనేక పనుల్లో వేగంగా, అద్భుతంగా పనిచేయడం చూసి ఆమె విస్తుపోయారు. ఆ క్షణమే భవిష్యత్తు ఉద్యోగాలన్నీ ఏఐ మయం కాబోతున్నాయని ఆమె గ్రహించారు. ఏఐ ప్రభావంతో తన స్నేహితులు, బంధువుల పిల్లలు కనీసం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా సాధించలేకపోవడం చూసి చలించిపోయారు. ఈ సంక్షోభం నుంచి యువతను గట్టెక్కించేందుకు ఆమె ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు.ఏఐ దెబ్బకు ఏఐతోనే బదులుప్రస్తుతం వస్తున్న ఈ సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఆయుధంగా మలచుకోవడమే ఏకైక మార్గమని క్లారా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా ఏఐ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకోవడంలో యువత నైపుణ్యం సాధించడం తప్పనిసరి. ఇందుకోసం ‘డియర్ సీసీ’ పేరుతో యువత కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ ను ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘ఫీల్డ్ రిపోర్ట్’ అనే టూల్.. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో ఉన్న ప్రస్తుత అవకాశాలు, అలాగే ఏఐ వల్ల ఆ రంగంలో పొంచి ఉన్న ఆటోమేషన్ ముప్పును విశ్లేషించి చెబుతుంది.రెజ్యూమ్ అక్కర్లేదు.. ‘జాబ్క్లా’తో కొత్త రకం వేటఉద్యోగాన్వేషణను మరింత సులభతరం చేసేందుకు ‘జాబ్ క్లా’ (JobClaw) అనే మరో అద్భుతమైన టూల్ను కూడా ఈ ఫౌండేషన్ పరిచయం చేసింది. దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదు. కేవలం ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు, అభ్యర్థి ఆసక్తులు, బలాలు ఆధారంగా సరిపోయే ఉద్యోగాలను ఇది వెతికి పెడుతుంది. మరోవైపు ఏఐ విషయంలో యువతలో ఆందోళన, కోపం పెరుగుతున్నాయని గాలప్ సర్వే వెల్లడించింది. ఇది కూడా చదవండి: నాడు రోమాలపై హేళన.. నేడు ఇంటర్లోనూ టాపర్! -
‘ముండతికోడ్’ గుణపాఠం.. ఇక రోబోలకు బాణసంచా!
తిరువనంతపురం: కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం 15 నిండు ప్రాణాలను బలిగొనడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి మారణహోమాలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, నిపుణులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించి ఫ్యాక్టరీలను సురక్షితంగా మార్చేందుకు, ప్రమాదాలను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కసరత్తు మొదలైంది.శబ్దాల కంటే దృశ్యాలకే ప్రాధాన్యంప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు బాణసంచా ప్రదర్శనల విధానంలో భారీ మార్పులు రావాలని కేరళ దేవస్వం మంత్రి వీ.ఎన్. వాసవన్ పేర్కొన్నారు. కేవలం భారీ శబ్దాలతో దద్దరిల్లేలా కాకుండా, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలలో మాదిరిగా కనువిందు చేసే సురక్షితమైన రంగుల ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ప్రాణనష్టం లేని ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.మనుషులకు బదులు రోబోలుప్రమాదకరమైన బాణసంచా తయారీ, పేల్చే విధానంలో మనుషుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించాలని ‘బెటర్ కొచ్చి రెస్పాన్స్ గ్రూప్’ (BKRG) ప్రతిపాదించింది. చేతులతో నిప్పు పెట్టే విధానానికి బదులుగా ఎలక్ట్రానిక్ టైమింగ్ సిస్టమ్స్ వినియోగించాలని కోరుతోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ తరహాలో, తయారీ కేంద్రాల్లో ప్రమాదకరమైన పనులను రోబోలు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా చేయిస్తే ప్రాణాపాయాన్ని దాదాపుగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలు జరగకుండా కచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి సాధ్యమవుతుంది.ఏఐ సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలుఫైర్క్రాకర్ యూనిట్లలో భద్రతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారనుంది. థర్మల్ సెన్సార్లు, కెమెరాల సాయంతో ఉష్ణోగ్రత, పొగ, తేమ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే ఏఐ వ్యవస్థలు.. మంటలు చెలరేగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, ఏఐ సాధనాలు క్షణాల్లో ప్రతిస్పందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సూచిస్తాయి. మెషిన్ లెర్నింగ్ సాయంతో ప్రాణనష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా ఈ అత్యాధునిక వ్యవస్థలు పనిచేస్తాయి.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
శ్రీరామ్ పరాశర@24 క్రాఫ్ట్స్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే సెట్టింగ్స్..అద్భుతమనిపించే విజువల్స్.. ఇవి ఏ పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్.!! ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు యవదర్శకుడు రామ్ పరాశర. రామాయణం పేరుతో ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం టీజర్ను ఎపిక్ రామాయణ పేరుతో ఇటీవల విడుదల చేశారు. ఐదు రోజుల్లోనే లక్షల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అన్నీ తానై.. టీజర్లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు, యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు రామ్. టీజర్లో రెండో వ్యక్తి అనే మాటే లేదు. డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకూ, సౌండ్ డిజైన్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకూ 3డీ నుంచి యానిమేషన్ వరకు మొత్తం 24 విభాగాలను ఒక్కడే నిర్వహించి రికార్డు సృష్టించాడు. టీజర్ ప్రారంభంలో శివుడి ధనస్సు గురించి వినిపించే పవర్ఫుల్ వాయిస్ ఓవర్, ప్రేక్షకుడిని వెంటనే పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్లో కనిపించే డీటైల్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పాన్–ఇండియా సినిమా స్థాయిని తలపిస్తున్నాయి. అవకాశం సృష్టించుకున్నా.. ‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మా స్వగ్రామం. గుంటూరులో పెరిగాను. ప్రముఖ సంస్థలో ఐదేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సినిమా మీద ఆసక్తితో ఆరేళ్లకిందట హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఓ పెద్ద బ్యానర్లో దర్శకుడిగా అవకాశం వచ్చి కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. అయినా ఫలితం లేకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయంగా తీసుకున్నాను. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అద్భుత రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తున్నాను. ఏఐ టూల్స్ వాడి కేవలం మూడు రోజుల్లో రూపొందించిన టీజర్కు భారీ స్పందన వస్తోంది.’’ –శ్రీ రామ్ పరాశర బొమ్మకంటి. -
బ్యాక్టీరియాకు బ్యాడ్ టైం!
సాక్షి, స్పెషల్ డెస్క్: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు మానవాళి దశాబ్దాలుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతో ఆ మందులకు నిరోధకత పెంచుకొని మొండి బ్యాక్టీరియా ‘సూపర్ బగ్స్’గా మారిన నేపథ్యంలో పరిశోధకులు కొత్త యాంటీబయోటిక్స్ కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ జె. కాలిన్స్ నేతృత్వంలోని బృందం ఈ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఏయే రసాయన అణువులు బ్యాక్టీరియాను చంపగలవు.. ఏవి చంపలేవు అనే సమాచారాన్ని జనరేటివ్ ఏఐ మోడల్కు అందించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన యాంటీబయోటిక్స్ తయారీకి అవసరమైన రసాయన సమ్మేళనాన్ని పొందే మార్గాన్ని ఈ బృందం కనుగొంది.ప్రయోగం సాగింది ఇలా..తమ ప్రయోగంలో భాగంగా కాలిన్స్ బృందం ఇప్పటికే తెలిసిన యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలను ఉపయోగించి ఒక జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చింది. యాంటీబయాటిక్ అణువులు ఎలా పనిచేస్తాయో జనరేటివ్ ఏఐ మోడల్ నేర్చుకొని దాని ఆధారంగా 4.5 కోట్లకుపైగా రసాయన నిర్మాణాల పనితీరును పరిశీలించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హాలిసిన్ అనే యాంటీబయోటిక్ క్యాండిడేట్ (చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగించేందుకు వీలుగా గతంలో ప్రీ–క్లినికల్, క్లినికల్ ప్రయోగాల్లో వాడిన ఒక రసాయన అణువు) మొండి బ్యాక్టీరియాకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించింది. ప్రస్తుత యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలతో పోలిస్తే హాలిసిన్ రసాయన నిర్మాణం పూర్తి భిన్నమైనది కావడం విశేషం. దీంతో కాలిన్స్ బృందం హాలిసన్ను మొండి బ్యాక్టీరియా సహా వివిధ రకాల బ్యాక్టీరియాలపై పరీక్షించగా ఇది వాటి శక్తి ఉత్పత్తిని దెబ్బతీయడం ద్వారా సమర్థంగా నాశనం చేసింది. ఎంఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన మరో అధ్యయనంలో పూర్తిగా కొత్త యాంటీబయోటిక్ అణువులను సృష్టించడానికి జెనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ఈ ఏఐ మోడల్ 3.6 కోట్లకుపైగా రసాయన సమ్మేళనాలను రూపొందించి పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏ, గొనేరియా వంటి మొండి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన అణువులను ఇది గుర్తించింది. ఈ సమ్మేళనాలకు ప్రస్తుతమున్న ఏ రకమైన యాంటీబయోటిక్స్తోనూ పోలిక లేదు. ఇవి బ్యాక్టీరియా కణ త్వచాన్ని దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం..పార్కిన్సన్ వ్యాధికి మెరుగైన మందులను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా 2024లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ మిచెల్ వెండ్రూస్కోలో, ఆయన సహచరులు మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించారు. చివరకు ఈ ప్రక్రియ ద్వారా ఐదు ఆశాజనకమైన అణువులను గుర్తించారు. మరోవైపు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక ఏఐ మోడల్ దాదాపు 8,000 మందులను గుర్తించింది. వాటిని 17,000 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది.ప్రారంభ దశల్లోనే ఏఐ దోహదం..మందులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫార్మా కంపెనీల వద్ద ప్రైవేట్గా ఉండటంతో పరిశోధకులకు ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా లక్ష్యాలను గుర్తించడం, అణువులను పరిశీలించడం వంటి ప్రారంభ దశల్లోనే ప్రస్తుతం ఏఐ దోహదపడుతోంది. దీంతో ఏఐ ద్వారా కనుగొనే అనేక మందులు రోగులకు చేరడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, 2017–22 మధ్యకాలంలో 12 కొత్త యాంటీబయోటిక్స్ మాత్రమే ఆమోదం పొందగా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల మాదిరిగానే ఉన్నాయి. -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
ఏఐ వినియోగంలో భారత్ టాప్.. కానీ..
న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్లాంటి అంశాల్లో భారత్ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్లో మిగతా ప్రాంతాల కన్నా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్ఏఐ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్ వినియోగంలో కూడా భారత్కి పటిష్టమైన ర్యాంకింగ్ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ కోడెక్స్ (కోడింగ్ టూల్) యాప్ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్డ్ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్డ్ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్ సిటీల్లో డేటా అనాలిసిస్ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్ (కోడెక్స్) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్గఢ్లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి. -
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్ఫోన్లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్లు, యాప్ స్టోర్లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)మన ఉద్యోగాలను లాగేసుకుంటుందని భయపడుతున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.. ఏఐ పుణ్యమా అని భవిష్యత్తులో మనం వారానికి కేవలం నాలుగు రోజులు పని చేస్తే సరిపోవచ్చు. ఏమాత్రం జీతం తగ్గకుండా, పెరిగిన పని సామర్థ్యాన్ని ఉద్యోగులకు అదనపు సమయం రూపంలో ఇవ్వాలని చాట్జీపీటీ (ChatGPT) సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) తన సంచలన నివేదికలో ప్రభుత్వాలకు సూచించింది.‘ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ది ఇంటెలిజెన్స్ ఏజ్: ఐడియాస్ టు కీప్ పీపుల్ ఫస్ట్’ అనే 13 పేజీల నివేదికలో ఓపెన్ ఏఐ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏఐ వల్ల పనులు వేగంగా జరుగుతున్నందున, ఆ లాభాన్ని సమాజం అంతా పంచుకోవాలని పేర్కొంది. ఇందులో ప్రధానంగా 32-గంటల, నాలుగు రోజుల పని దినాల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సూచించింది. ముఖ్యంగా ఇలా పని దినాలు తగ్గించినా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించకూడదని స్పష్టం చేసింది.గతంలో గంటల కొద్దీ పట్టే పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది. భవిష్యత్తులో నెలల తరబడి చేసే ప్రాజెక్టులను కూడా ఏఐ చాలా తక్కువ సమయంలో చేస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. ఇలా ఆదా అయిన సమయాన్ని, పెరిగిన ఉత్పాదకతను అనుసరించి ఉద్యోగులకు బెనిఫిట్స్ బోనస్లు ఇవ్వాలని, లేదా అదనపు పెయిడ్ లీవ్లు మంజూరు చేయాలని ఓపెన్ ఏఐ యాజమాన్యాలను కోరుతోంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు వ్యక్తిగత సమయం కూడా దొరుకుతుందని వివరించింది.కేవలం పని గంటల తగ్గింపు మాత్రమే కాదు, ఏఐ కారణంగా వస్తున్న ఆర్థిక లాభాల్లో సామాన్యులకూ వాటా దక్కేలా ‘పబ్లిక్ వెల్త్ ఫండ్’ ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ మరో కీలక ప్రతిపాదన చేసింది. విధాన నిర్ణేతలు, ఏఐ కంపెనీలు కలిసి ఈ ఫండ్ను అభివృద్ధి చేయాలని, ఇందులో వచ్చే లాభాలను ప్రజలందరికీ పంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని పేర్కొంది. ఏఐ రాకతో పని విధానం పూర్తిగా మారనుందని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఏఐ ఫలాలను అందుకునేలా ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ నివేదిక తేల్చి చెప్పింది.ఇది కూడా చదవండి: అస్సాం: అగ్గి రాజేస్తున్న 40 ఏళ్ల నాటి ఒప్పందం -
నేను చదివింది ఇంటర్మీడియట్.. నాకు ఇంగ్లీష్ రాదు.. AI టూల్ తో లక్షల్లో సంపాదిస్తున్నా..!
-
AI ఏమి చేయలేదు.. ఈ ఉద్యోగాలు సేఫ్!
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Paid the carpenter Rs. 900 for a 45 minute job installing some shelves and hanging a couple of paintings. Blue collar jobs are the future, skill based training for the youth should be prioritised over other obsolete degrees. No threat from AI either.— Bhandari ka Vyang (@GurugramDeals) April 5, 2026''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు. -
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?
ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు. -
‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!
కాసరగోడ్: నేరస్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ఇకపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించాల్సిన అవసరం లేదు. నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధమా అనేది క్షణాల్లో తేల్చేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరికరాన్ని కేరళ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సస్పెక్ట్ ఎమోషనల్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎస్ఈఎంఎస్) పేరుతో రూపొందించిన ఈ సాంకేతికత, నేర విచారణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఈ వ్యవస్థలో నిందితుడి మణికట్టుకు ఒక బయోమెట్రిక్ బ్యాండ్ను అమరుస్తారు. విచారణ జరిపే అధికారి కెమెరా కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తారు. ఈ సమయంలో నిందితుడి ముఖ కవళికలు, గొంతులో వచ్చే మార్పులు, హృదయ స్పందన రేటు, చర్మ ప్రతిచర్యలను బయోమెట్రిక్ బ్యాండ్ నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూటూత్ ద్వారా కంప్యూటర్కు అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ, నిందితుడు అబద్ధం చెప్పే సమయంలో కలిగే అతిసూక్ష్మమైన శారీరక, మానసిక మార్పులను రియల్ టైమ్లో విశ్లేషించి, విచారణాధికారికి తెలియజేస్తుంది.ప్రత్యేకతలు ఇవే..మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఎస్ఈఎంఎస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల విచారణ అధికారికి నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన హెచ్చరికలు నేరుగా లైవ్ వీడియో ఫీడ్లోనే కనిపిస్తాయి. సాధారణంగా లై డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలకు కోర్టు లేదా నిందితుడి అనుమతి తప్పనిసరి. కానీ, ఎస్ఈఎంఎస్ విషయంలో చట్టపరమైన అనుమతులు లభిస్తే, అటువంటి నిబంధనల అవసరం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.రూపకర్తలు వీరే..జైన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మెబిన్ విల్సన్ థామస్, క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కె. రాజన్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ అంజనా పి. నాయర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇప్పటికే దీనికి పేటెంట్ లభించడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, కేవలం మాటలతోనే నిజాలను బయటకు తీయవచ్చని, తద్వారా హింసాత్మక విచారణలకు స్వస్తి పలకవచ్చని పరిశోధకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘బెంగాల్ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం -
ఏఐతో మీడియా రంగంలో పెనుమార్పులు
థింపూ: ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై కీలక సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 30, 31 తేదీల్లో జరిగింది. భూటాన్ మీడియా ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించింది. భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాయల్ థింపూ కాలేజ్కు చెందిన ప్రొఫెసర్ పల్లవి మజుందార్, కాంట్రైల్స్ ఏఐకు చెందిన అమితాభ్ కుమార్ కూడా శిక్షకులుగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే ఉడుముల, పల్లవి మజుందార్, అమితాభ్ కుమార్లతో మాట్లాడారు.పత్రికారంగంలో కృత్రిమ మేధస్సు పాత్రపై ఉడుముల మాట్లాడుతూ, “జర్నలిజం, దర్యాప్తు కథనాలు, ధృవీకరణ, పంపిణీ, న్యూస్రూమ్ పనితీరులో ఏఐ పెద్ద మార్పులు తీసుకొస్తోంది” అన్నారు. “నాణ్యత పెంపు, సమాచారం సేకరణ మెరుగుదల, పునరావృత పనుల్లో వేగం పెంపు, పంపిణీ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రిపోర్టింగ్, ధృవీకరణ, సంపాదకీయ నిర్ణయాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు” అని చెప్పారు. దర్యాప్తు జర్నలిజంలో పెద్ద డేటా విశ్లేషణ, పత్రాల పరిశీలన, నమూనాల గుర్తింపు, ట్రాన్స్క్రిప్షన్, అనువాదం, ధృవీకరణ పనుల్లో ఏఐ సహాయపడుతుందని ఆయన వివరించారు. అదే సమయంలో తప్పుడు సమాచారం, నకిలీ వ్యాఖ్యలు, పాక్షికత, అతి విశ్వాసం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. మానవ పర్యవేక్షణ అవసరం ఉందని స్పష్టం చేశారు. పత్రికారంగంలో ఏఐ వినియోగం బాధ్యతాయుతంగా ఉండాలంటే స్పష్టమైన సూచనలు, నైతిక నియంత్రణలు, పారదర్శకత, బాధ్యత, డీప్ఫేక్లపై జాగ్రత్త అవసరమని ఉడుముల పేర్కొన్నారు. “ఏఐ జర్నలిస్టులకు సహాయక సాధనంగా ఉండాలి. సంపాదకీయ నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాకూడదు” అని తెలిపారు. -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
AI ద్వారా నెలకు 1లక్ష సంపాదించే టాప్ మార్గాలు.. ఇలా వాడితే మీ లైఫ్ సెటిల్
-
కొత్త కోర్సుల జోష్..
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కొత్త జోష్ క న్పిస్తోంది. బీటెక్తో సమానంగా తీసుకొస్తున్న ఎమర్జింగ్ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు కొత్త కోర్సులు మొదలు పెట్టేందుకు కాలేజీలు కూడా ముందుకొస్తున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో వీటిని ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కాలేజీలు చెబుతున్నాయి. అనుమతి కోరుతూ ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటివరకూ యూజీ కాలేజీల నుంచి 200, పీజీ కాలేజీల నుంచి 73 దరఖాస్తులు అందాయి.అత్యధికంగా బీఎస్సీ అండ్ మెషీన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్), బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సుల వైపు కాలేజీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. తర్వాత స్థానంలో బీకాం డిజిటల్ మార్కెటింగ్ కోర్సుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆయా కాలేజీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనివే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధే లక్ష్యం యూజీ, పీజీ తర్వాత తక్షణ ఉపాధిని యువత ఆశిస్తోంది. అయితే సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఈ అవకాశం కల్పించలేకపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విద్య వైపు వెళ్తున్నారు. అక్కడా నైపుణ్యం కొరత అడ్డంకిగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిగ్రీ, పీజీ కోర్సుల్లో నైపుణ్యం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించారు.ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ సెక్యూరిటీ సర్విసెస్, ల్యాండ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్, ఏవిమేషన్ మేనేజ్మెంట్, మెరైన్ టెక్నాలజీ, లాజిస్టిక్స్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్తో పాటు పలు కోర్సులను డిజైన్ చేశారు. బోధన ప్రణాళికను కూడా ఇదే తరహాలో రూపొందించారు. మారుతున్న సాంకేతికత సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు మేలు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాకల్టీ మాటేంటి? అనుమతులు మంజూరు చేసే విషయంలో ఆచితూచి అడుగేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 4.6 లక్షల సీట్లున్నాయి. అయితే ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులో కూడా బీకాం, బీఎస్సీ లైఫ్సైన్సెస్ వంటి కోర్సుల్లోనే అడ్మిషన్లు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది అకడమిక్ ఆడిట్ చేపట్టాలని, విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీల్లో సీట్లు తగ్గించాలని మండలి భావించింది.అయితే అనూహ్యంగా కాలేజీలు కొత్త కోర్సుల వైపు వెళ్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా..ఎమర్జింగ్ కోర్సులు బోధించే అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకుంటారనే దానిపై కాలేజీలు స్పష్టత ఇవ్వడం లేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు బోధించే వారికి ఇది సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. దీంతో ఐటీ, ఇతర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆన్లైన్ ద్వారా బోధించే ఏర్పాటు చేయాలని కాలేజీలకు మండలి సూచిస్తోంది. అన్నీ పరిశీలించి అనుమతులిస్తాం.. ఏఐ సాంకేతికతతో కూడిన కొత్త కోర్సుల ప్రతిపాదనకు మంచి స్పందన వస్తోంది. కాలేజీలు వీటిని ప్రవేశ పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోధన సిబ్బంది, ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
రైల్వే, ఎన్హెచ్ఏఐ ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణకు కేంద్ర రైల్వేశాఖ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) శాఖలు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్యాచరణను రూపొందించాయి. రైల్వే ట్రాక్లపై లోపాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించగా... జాతీయ రహదారులపై 30 రకాల లోపాలను గుర్తించి సరిచేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఆ రెండు శాఖల కార్యాచరణ ఇలా ఉంది.. పట్టాలు తప్పకముందే అప్రమత్తం చేసే సీబీఎం రైలు బోగీలు పట్టాలు తప్పకుండా ముందుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ ఏఐ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘కండీషన్ బేస్డ్ మానిటరింగ్(సీబీఎం) సిస్టం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. దక్షిణ కొరియాకు చెందిన గ్లోబిజ్ ఈ ఏఐ పరిజ్ఞానాన్ని రూపొందించింది. ముందుగా హైస్పీడ్ రైళ్లలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అనంతరం దశల వారీగా ఇతర రైళ్లలో కూడా ప్రవేశపెట్టనుంది. ఏఐ ఆధారిత సెన్సార్లను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైలు చక్రాలు, బోగీలు, తలుపులు, ఎలెక్ట్రికల్ సిస్టంలలో ఏర్పాటు చేస్తారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్లు, రైలు మెకానికల్ బిహేవియర్ను ఈ సెన్సార్లు రికార్డు చేస్తాయి. రైలులోనే పొందుపరిచే ఎడ్జ్ సర్వర్లు వాటిని వెనువెంటనే విశ్లేషిస్తాయి. రైలు పట్టాలపై ఎక్కడైనా లోపాలు ఉంటే రైలు వైబ్రేషన్లు, మెకానికల్ బిహేవియర్లో వ్యత్యాసం తెలుస్తుంది. అంటే కొంత దూరంలో ఎక్కడో ట్రాక్పై లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దాంతో వెంటనే లోకో పైలట్ ట్రైన్ వేగాన్ని తగ్గించడంతోపాటు అవసరమైతే నిలిపివేస్తారు. అనంతరం రైల్వే సాంకేతిక బృందాలు ట్రాక్ వెంబడి పరిశీలించి లోపాలను సరిచేస్తాయి. తద్వారా ముందుగానే అప్రమత్తమై రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలను నివారించవచ్చు. అందుకోసం రూపొందించిన సీబీఎం విధానాన్ని దేశంలో అన్ని రైళ్లలో దశల వారీగా ప్రవేశపెట్టాలన్నదే లక్ష్యమని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.జాతీయ రహదారులపై డాష్కామ్ చెక్జాతీయ రహదారులపై గుంతలతోపాటు ఇతర లోపాలు గుర్తించేందుకు ‘డాష్కామ్ అనలిటిక్స్ సర్విసెస్’ పేరిట ఎన్హెచ్ఏఐ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. అందుకోసం అత్యధిక రిజల్యూషన్ ఉన్న స్మార్ట్ కెమెరా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతీయ రహదారులపై రూట్ పెట్రోలింగ్ వాహనాలు(ఆర్పీవీ)లకు ఈ స్మార్ట్ కెమెరాలను అమరుస్తారు. పెట్రోలింగ్ చేస్తుంటే ఆటోమేటిగ్గా రహదారులను స్కాన్ చేస్తూ ఫొటోలు తీస్తాయి. 30 రకాల అంశాలను ఈ ఫొటోల ద్వారా గుర్తించవచ్చు. రహదారులపై చిన్న పగుళ్లు, గుంతలు, బారియర్లు లేకపోవడం, రాంగ్రూట్లో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు రోడ్లను కట్ చేయడం వంటివాటి ఫొటోలు నేరుగా ‘సెంట్రల్ డేటా లేక్’పేరుతో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతాయి. ఆ ఫొటోల ద్వారా గుర్తించిన లోపాలను ఎన్హెచ్ఏఐ అధికారులు సరిదిద్దుతారు. జీపీఎస్ విధానం ద్వారా లోపాలు ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి మరమ్మతులు చేపడతారు. ఎన్హెచ్ఏఐ దేశంలో 40వేల కి.మీ. జాతీయ రహదారులను ఐదు జోన్లుగా విభజించి డ్యాష్కామ్ సిస్టం పరిధిలోకి తీసుకురానుంది. తద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్చేంజర్
రాయదుర్గం (హైదరాబాద్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైన గేమ్చేంజర్గా మారబోతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్ (సీఏఎఫ్) ఆ«ధ్వర్యంలో గురువారం పాలసీ కాన్క్లేవ్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలమైన, రియల్టైమ్ సిటిజన్ బేటాబేస్లను ఉపయోగించడం ద్వారా ఏఐ మధ్యవర్తులను తొలగించగలదని, అవినీతిని తగ్గించగలదని, ప్రభుత్వ సేవలు నిరంతరాయంగా సాగేందుకు అవకాశం కలుగుతోందన్నారు. తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్ ముసాయిదా రూపకల్పనలో ఐఎస్బీ సహకారం గురించి ఆయన వివరించారు. రోజువారీ పాలనలో ఏఐని సజావుగా ఏకీకృతం చేయడానికి తెలంగాణను కచ్చితమైన జాతీయ నమూనాగా భావించి విద్యావేత్తలు, పరిశ్రమలు, నియంత్రణదారులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రకటించారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ఐఎస్బీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున వ్యాపారపద్దులు, ప్రజా విధానాన్ని తెలియ జేయడానికి, కఠినమైన విద్యా పరిశోధనలను ఉత్పత్తి చేయాలనే దాని వ్యవస్థాపక దృష్టిని కొనసాగిస్తూనే ఉందన్నారు. ఎంఫాసిస్ మద్దతుగల కొత్త ‘ఏఐ ఫర్ ఇంపాక్ట్’చొరవను హైలైట్ చేస్తూ బలమైన ఏఐ ఆధారిత యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఫాసిస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కులకర్ణి, సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నతంత్రి పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. -
ఏఐతో... ఆటలొద్దు!
పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు, బుంగమూతి పెట్టి అలుగుతారు... వారికంటూ స్నేహితులు ఉంటారు. వారితో తమదైన భాషలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ పిల్లల ప్రపంచంలోకి ఏఐ టాయ్స్ వచ్చాయి. ఫ్రెండ్తో మాట్లాడినట్లే పిల్లలు వాటితో మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. తమకు ఏమనిపిస్తుందో చెబుతున్నారు... వినడానికి ఇది బాగానే ఉంది కానీ... ఏ.ఐ. బొమ్మల ప్రభావం పిల్లలపై మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు. సహజమైన బాల్యాన్ని, భావోద్వేగాలను ‘ఏఐ బొమ్మలు’ హరించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు...ఫ్రెండ్లాగా సంభాషించడం నుంచి భావోద్వేగాలు గ్రహించడం వరకు ఏఐ బొమ్మలు పిల్లలకు చేరువ అవుతున్నాయి. ఏఐ–ఆధారిత బొమ్మలు వినగలవు. అర్థం చేసుకోగలవు. ఏదైనా అడిగితే సమాధానాలు ఇవ్వగలవు. దీంతో అవి అపురూపంగా అనిపిస్తాయి.అయితే పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతికూలతల గురించి చెప్పుకోవాలంటే....పిల్లల భావోద్వేగాలకు సంబంధించి ఏఐ బొమ్మలు అతిగా స్పందిస్తుంటాయి. మితిమీరిన సానుభూతి చూపుతుంటాయి. ఒక నిమిషం విచారంగా, మరు నిమిషం సంతోషంగా ఉండగలిగే పిల్లలకు ఇది అవసరం లేదు అంటున్నారు నిపుణులు.సహజత్వం లేకుండా....‘పిల్లలకు ఏఐ బొమ్మలు తోడుగా ఉండే మాట వాస్తవమే అయినా, వివిధ సందర్భాలలో స్పందించడానికి సంబంధించి వాటి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం కష్టం’ అంటున్నారు నిపుణులు.‘ఏఐ ఆధారిత బొమ్మల కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది’ అంటుంది లండన్లోని డిజైన్ కంపెనీ ‘మోరమా’ వ్యవస్థాపకురాలు, యూకే డిజైన్ కౌన్సిల్ సభ్యురాలు జో బర్నార్డ్.మానవ సంబంధాలకు భిన్నంగా ఏఐ బొమ్మ ఫ్రెండ్స్ ఎప్పుడూ సహనంగా, స్నేహంగా ఉండేలా డిజైన్ చేశారు.‘ఏఐ బొమ్మలలో సహజ స్పందన లేక΄ోవడం వల్ల, వాస్తవ ప్రపంచాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. మీరు ఒక చాట్బాట్తో ఎంత దారుణంగా ప్రవర్తించినా, అది మిమ్మల్ని అభిమానిస్తుంది. కాని వాస్తవ ప్రపంచంలో అలా ఉండదు కదా!’ అంటుంది జో బర్నార్డ్.ఇలా అయితే... చాలా కష్టంసహజత్వం లోపించిన సంభాషణల వల్ల పిల్లలకు భావోద్వేగపరమైన నష్టాలతో΄ాటు, మేధోవికాసం (కాగ్నెటివ్ ఎఫర్ట్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. నిరంతరం పిల్లలతో సంభాషించేలా ఏఐ టాయ్స్ను రూ΄÷ందించారు. దీనివల్ల పిల్లలలో ఆధారపడే తత్త్వం పెరిగే ప్రమాదం ఉంది. దాని బారి నుండి వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది.వికటిస్తుందా?ఒక వస్తువును ఎలా డిజైన్ చేస్తారనే దానిపైనే మనం దానితో ఎలా వ్యవహరిస్తామనేది ఆధారపడి ఉంటుంది. ఈ తరానికి సంబంధించి ఏఐ బొమ్మల కంపెనీలు ‘ఆకర్షణీయత’కే పెద్ద పీట వేశాయి. అయితే ఆ ఆకర్షణీయ విధానం పిల్లల అవసరాలకు విరుద్ధంగా ఉంటుంది.ఏఐ బొమ్మల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కంపెనీలు మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించడానికి ΄ోటీ పడుతున్నప్పటికీ, అది వికటించే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.గాబో గందరగోళం!మూడేళ్ల పిల్లల కోసం ఎన్నో ఏఐ బొమ్మలు మార్కెట్లో ఉన్నాయి. అయితే ప్రీ–స్కూల్ పిల్లలపై ఏఐ సాంకేతిక ప్రభావం గురించి చాలా తక్కువ పరిశోధన జరిగింది. తాజా విషయానికి వస్తే...అయిదేళ్ల లోపు పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై తొలిసారిగా ఒక అధ్యయనం నిర్వహించింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ బృందం. ఈ నేపథ్యంలో పిల్లల కోసం రూ΄÷ందించిన ఏఐ–ఆధారిత బొమ్మలకు సంబంధించి కఠినమైన నియంత్రణ అవసరం అని చెబుతున్నారు పరిశోధకులు.తమ అధ్యయనంలో భాగంగా మూడు నుండి అయిదు సంవత్సరాల వయస్సు గల కొద్దిమంది పిల్లలు ‘గాబో’ అనే ఏఐ బొమ్మతో ఎలా వ్యవహరిస్తారో పరిశీలించారు. ‘గాబో’ అనేది వాయిస్–యాక్టివేటెడ్ ఏఐ చాట్బాట్. ప్రీ–స్కూలు పిల్లలు దానితో మాట్లాడేలా, ఆటలు ఆడే విధంగా రూ΄÷ందించారు. తమ అధ్యయనంలో భాగంగా ‘గాబో’ భాష, సంభాషణలకు సంబంధించిన నైపుణ్యాలను పరీక్షించారు. పిల్లలు ‘గాబో’తో మాట్లాడడానికి తరచుగా ఇబ్బందిపడడాన్ని గమనించారు. పిల్లలు, పెద్దవారి గొంతుల మధ్య తేడాని ‘గాబో’ గుర్తించలేక΄ోయింది. ఒక పిల్లవాడు బొమ్మతో ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పినప్పుడు అది అర్థం లేని సమాధానం ఇచ్చింది.పిల్లవాడి మాటకు ‘థ్యాంక్యూ’ లేదా ‘నాకు కూడా నువ్వంటే ఇష్టం’లాంటి మాటలేవో వాడాలి. అలా కాకుండా...‘మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి’ అని స్పందించింది ఆ ఏఐ బొమ్మ. మూడేళ్ల చిన్నారి ‘నాకు బాధగా ఉంది’ అనే భావం వ్యక్తీకరించే మాట మాట్లాడినప్పుడు...‘నేను సంతోషంగా ఉండే చిన్న రోబోట్ని. ఈ సరదాను కొనసాగిద్దాం. మనం తర్వాత దేని గురించి మాట్లాడుకుందాం?’ అని ఆ చిన్నారిని అడిగింది బొమ్మ.ఈ సమయంలో కరెక్ట్ కాదు‘పిల్లలు సామాజిక విషయాలను తెలుసుకునే అభివృద్ధి దశలో జనరేటివ్ ఏఐ అవుట్పుట్ గందరగోళంగా ఉంటోంది’ అంటున్నారు పరిశోధకులు. ‘గాబో వంటి బొమ్మలు పిల్లల మాటలు, భావాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు’ అంటున్నారు అధ్యయన సహ రచయిత డాక్టర్ ఎమిలీ.సంవత్సర కాలం ΄ాటు ఏఐ బొమ్మల పనితీరును, పిల్లలపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసిన తరువాత...‘అయిదేళ్ల లోపు పిల్లల కోసం విక్రయించే ఏఐ బొమ్మలు సైకలాజికల్ సేఫ్టీని అందిస్తున్నాయని నిర్ధారించడానికి నియంత్రణ సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు పరిశోధకులు.‘ఏఐ బొమ్మలను తల్లిదండ్రులు పర్యవేక్షించడానికి వీలుగా, అందరికీ కనిపించే ప్రదేశాలలో ఉంచాలి. గోప్యతా విధానాలను (ప్రైవసీ ΄ాలసీ) జాగ్రత్తగా చదవాలి’ అని స్టడీ రి΄ోర్ట్ తల్లిదండ్రులకు సూచించింది. నిజ ప్రపంచం వర్సెస్ సాంకేతిక ప్రపంచంపిల్లల ఆలోచన విధానంపై ఏఐ ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. ఏఐ సాధనాలపై అతిగా ఆధారపడడం వల్ల మేధోపరమైన కృషి తగ్గుతుంది అంటున్నారు విశ్లేషకులు.‘ఏఐ బొమ్మలపై అతిగా ఆధారపడితే పిల్లల మెదడులోని భాగాలు అభివృద్ధి చెందడం ఆగి΄ోతాయి’ అని హెచ్చరిస్తున్నారు.నిజ ప్రపంచం సంక్లిష్టమైనది, అనూహ్యమైనది. మనుషులు తమ జీవితానుభవాల ద్వారా ఎలా మసలుకోవాలో నేర్చుకుంటారు. దీనికి విరుద్ధంగా ఏఐ పరిమితమైన సమాచారంతో పనిచేస్తుంది.‘ఒక పిల్లవాడి చుట్టూ ఉన్న అన్ని రకాల భావోద్వేగాలను ఏఐ బొమ్మలు అందుకోలేవు. దాని ప్రతిస్పందనలు అసంపూర్ణంగా, అనుచితంగా ఉంటాయి. ఇది తప్పుడు మార్గదర్శకత్వానికి దారి తీయడమే కాకుండా సృజనాత్మకంగా ఆలోచించడాన్ని తగ్గించవచ్చు, స్వతంత్రంగా సమస్య పరిష్కారానికి ఆలోచించే అవకాశాలను తగ్గించవచ్చు’ అంటుంది జో బర్నార్డ్. -
‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్!
ల్యాప్టాప్ అవసరం లేకుండానే ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే చకచకా పూర్తయిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ఇప్పుడు దీన్ని సాకారం చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘క్లాడ్’ (Claude)కు సంబంధించి ఒక విప్లవాత్మకమైన ఫీచర్ను ‘ఆంత్రోపిక్’ తాజాగా పరిచయం చేసింది.మనిషిలాగే కంప్యూటర్ వాడకంఇప్పటివరకు మనం ఏఐ సాయంతో ప్రశ్నలు అడగడమో లేదా సమాచారం సేకరించడమో చేసేవాళ్లం. కానీ ఇకపై ‘క్లాడ్’.. మీ కంప్యూటర్ను ఒక మనిషి మాదిరిగా ఆపరేట్ చేయగలదు. మౌస్ కదపడం, కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం, స్క్రీన్ను రీడ్ చేయడం లాంటి పనులను ఇది సునాయాసంగా చేస్తుంది. ఫలితంగా మీరు కంప్యూటర్ ముందు లేకపోయినా, మీరు ఇచ్చిన టాస్క్లను ‘క్లాడ్’ పూర్తి చేస్తుంది. అంటే మీ పనులను చక్కబెట్టే ఒక నమ్మకమైన ‘రిమోట్ ఉద్యోగి’ మీతో పాటు ఉన్నట్టేనని ‘ఆంత్రోపిక్’ పేర్కొంది.ల్యాప్టాప్ అవసరం లేని భవిష్యత్తుఈ కొత్త ఫీచర్ గురించి ఆంత్రోపిక్ పరిశోధకుడు అలెక్స్ ఆల్బర్ట్ మాట్లాడుతూ ‘పని కోసం ల్యాప్టాప్ తెరవాల్సిన అవసరం లేని భవిష్యత్తు అత్యంత వేగంగా మనకు చేరువవుతోంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆఫీస్ పనుల కోసం ఇకపై డెస్క్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ నుంచే క్లాడ్ ద్వారా అన్నింటినీ చక్కబెట్టవచ్చని ఆయన వెల్లడించారు.ఇది ఎలా పనిచేస్తుంది?క్లాడ్ మీ కంప్యూటర్లోని స్లాక్ (Slack) లేదా క్యాలెండర్ లాంటి అప్లికేషన్లకు కనెక్ట్ అవుతుంది. అవసరమైతే ఇతర యాప్స్ యాక్సెస్ చేయడానికి మీ అనుమతి అడుగుతుంది. ఇటీవలే విడుదలైన 'డిస్పాచ్' (Dispatch) ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచే కంప్యూటర్లో ఉన్న క్లాడ్కు ఆదేశాలు ఇవ్వవచ్చు. మీరు బయట తిరుగుతున్నా, ‘క్లాడ్’ మీ బ్రౌజర్లో సమాచారం వెదకడం, స్ప్రెడ్షీట్లను నింపడం లాంటి పనులను చిటికెలో పూర్తి చేసి పెడుతుంది.ఎవరికి అందుబాటులో ఉంటుంది?ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం రీసెర్చ్ ప్రివ్యూ దశలో మాత్రమే ఉంది. పెయిడ్ వెర్షన్ వాడుతున్న ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork)‘క్లాడ్ కోడ్’ (Claude Code) యూజర్లు మాత్రమే దీనిని వినియోగించగలరు. ముఖ్యంగా ప్రస్తుతం ఇది కేవలం మ్యాక్ ఓఎస్ (macOS) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం క్లాడ్ డెస్క్టాప్, మొబైల్ యాప్స్ రెండింటినీ అప్డేట్ చేసి అనుసంధానించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఏఐ పోటీఆటోమేషన్ రంగంలో వస్తున్న ఈ మార్పులు టెక్ ప్రపంచంలో కొత్త యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఇప్పటికే ఎన్విడియా ‘నెమోక్లా’ (NemoClaw)ను అందుబాటులోకి తీసుకురాగా, మెటా, ఓపెన్ ఏఐ సంస్థలు కూడా తమ సొంత ఏఐ ఏజెంట్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ రేసులో ఆంత్రోపిక్ ఒక అడుగు ముందే ఉన్నదని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం -
‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం
ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రం జపిస్తోంది. రేపటి ఉద్యోగాలన్నీ ఏఐ నైపుణ్యం మీదనే ఆధారపడి ఉండబోతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన చైనా, దేశంలోని క్లాస్రూమ్ల రూపురేఖలను మార్చేస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే పాత చింతకాయ పచ్చడి నుండి బయటపడలేకపోతోంది. ఏఐ వినియోగంలో ఈ రెండు దేశాల మధ్య నున్న అంతరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.చైనా: ‘డబుల్ రిడక్షన్’ విప్లవం2021లో చైనా 'డబుల్ రిడక్షన్' అనే కీలక విధానాన్ని తీసుకొచ్చింది. పైకి ఇది కేవలం ప్రైవేట్ ట్యూషన్లపై ఆంక్షలు అనిపించినా, దీని వెనుక ఒక వ్యూహం ఉంది. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించి, బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికారు. కేవలం టాపర్లను వెతకడం కంటే, ప్రతి విద్యార్థిలో నైపుణ్యాన్ని (Capabilities) పెంచడమే లక్ష్యంగా చైనా స్కూళ్లు ముందడుగు వేస్తున్నాయి. టెక్నాలజీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా చైనాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు.భారత్: డిగ్రీలు సరే.. ఉద్యోగాలేవి?భారత్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఏటా మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఇంజనీర్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, వారిలో ఎంతమంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం ప్రతి 10 మంది యువకులలో నలుగురు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ‘మన విద్యార్థులు పరీక్షలు పాస్ అయ్యేందుకే చదువుతున్నారు తప్ప, సమస్యలను పరిష్కరించడానికి కాదు’ అని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోచింగ్ సెంటర్ల మాయాజాలంహైదరాబాద్ నుండి రాజస్థాన్లోని కోట వరకు.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కోచింగ్ సెంటర్లే నడిపిస్తున్నాయి. ర్యాంకులు, కటాఫ్ మార్కులే విద్యార్థి తెలివితేటలకు కొలమానాలుగా మారిపోయాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది.తేడా ఎక్కడ వస్తోంది?చైనా తన విద్యార్థులను ‘రేపటి’ కోసం సిద్ధం చేస్తోంది. అక్కడి విద్య.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. కానీ భారత్ ఇంకా 'నిన్నటి' పద్ధతులలోనే పరీక్షలు పెడుతోంది. చైనా మోడల్లో నియంత్రణ ఎక్కువ ఉన్నా, వారు భవిష్యత్తు సాంకేతికతపై పట్టు సాధిస్తున్నారు. మన దగ్గర పోటీ ఎక్కువ ఉన్నా, అది కేవలం ర్యాంకులకే పరిమితమవుతోంది. ఏదిఏమైనప్పటికీ మన దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు అంటున్నారు. కేవలం మార్కులే విజయానికి కొలమానం అనుకుంటే, భవిష్యత్తులో మన యువత గ్లోబల్ మార్కెట్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: బ్లూటూత్ ఇయర్ఫోన్స్తో భయంకర వ్యాధి? -
ఏఐ.. ప్రాణదీపికై
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వే మార్గాలపై ఏనుగులు, ఇతర వన్యప్రాణులను ప్రమాదాల బారి నుంచి కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని రైల్వే మార్గాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులూ మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్లకు సమీపంలో వాటి ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా గుర్తిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డి్రస్టిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ (డీఏఎస్)తో రైల్వే ట్రాక్లపై వీటి ఉనికిని గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ట్రాక్ సమీపంలోకి ఏనుగులు, ఇతర వన్యప్రాణులు వస్తే ఈ వ్యవస్థ వాటి కదలికలను లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందికి హెచ్చరిక జారీ చేస్తోంది. దీంతో సకాలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే 141 రూట్ కిలోమీటర్లలో అమలు.. ప్రస్తుతం ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను రైల్వేలోని 141 రూట్ కిలోమీటర్ల మేరకు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఈ వ్యవస్థను మరో 981 రూట్ కిలో మీటర్లలో విస్తరించేందుకు టెండర్లను ఆహా్వనించినట్లు తెలిపింది. వన్యప్రాణుల మరణాలపై 127 రైల్వే మార్గాల్లో 3,452.4 కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించింది. దీని ద్వారా ఏనుగుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 110 రైల్వే మార్గాలను, పులుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 17 రైల్వే మార్గాలను గుర్తించింది. తక్షణం నష్ట నివారణకు 14 రాష్ట్రాల్లో 77 రైల్వే మార్గాల్లో 1,965.2 కిలో మీటర్ల మేర పలు నిర్మాణాలను చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.రైల్వే ప్రమాదాల బారి నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు 503 లెవెల్ క్రాసింగ్లు, ర్యాంపుల నిర్మాణం, 72 చోట్ల వంతెనల విస్తరణ, మార్పు, 39 చోట్ల కంచె, బారికేడింగ్, కందకాల నిర్మాణం, నాలుగు నిష్క్రమణ ర్యాంపులు, 65 కొత్త అండర్ పాస్లు, 22 ఓవర్పాస్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు వివరించింది. రైలు ప్రమాదాల్లో 2020–21 నుంచి 2024–25 వరకు 79 ఏనుగులు మృత్యువాత పడినట్లు తెలిపింది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, కేరళ, ఒడిశా ,త్రిపుర, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మృతి చెందుతున్నట్లు పేర్కొంది. -
వైరల్ వీడియో వెనుక భయంకర నిజం
హర్ష ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వయసు ఇరవై ఏడేళ్లు. మంచి జీతం. అతనికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్లిపనులు మొదలుపెడదాం అనుకున్న అతనికి ఆరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని కుదిపేసింది. ఒకరోజు ఉదయం అతని ఫోన్ మోగింది. అటు పక్కనుంచి అతడి స్నేహితుడు ఆదిత్య.‘‘హర్షా .. నువ్వేంటి ఇలాంటి దందా పనులు చేయడం ఎప్పటినుండి మొదలుపెట్టావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఏంట్రా నేనేం దందా పనులు చేస్తున్నాను?’’ ఆందోళనగా అడిగాడు హర్ష. ‘‘నువ్వు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నువ్వు చేసే పనులు వీడియోలు ఉన్నాయి... ఆ వీడియోలు నీకు కాబోయే భార్య చూసిందంటే... నీ పెళ్లి క్యాన్సిల్ కావచ్చు... జాగ్రత్త!’’ అని చెప్పి ఆదిత్య ఫోన్ పెట్టేశాడు. హర్ష ఆందోళనగా ఆదిత్య పంపిన వీడియో చూడసాగాడు. అందులో హర్ష చేతిలో తుపాకీ పట్టుకుని, కర్కశమైన గొంతుతో మాట్లాడుతూ ఒక ప్రముఖ వ్యాపారవేత్తను బెదిరిస్తున్నాడు. ఆ వ్యాపారవేత్త భయంభయంగా వదిలేయమన్నట్టుగా హర్షను వేడుకుంటున్నాడు. ఆ వీడియో చూడగానే అతని గుండె ఒక్కసారిగా బరువైంది. ‘ఇది... ఇదెలా సాధ్యం?’ హర్షకు ఒక్కసారిగా భయంతో మెదడు మొద్దుబారింది. ఇది అసలు తాను కాదు. మరి ఇదెలా సాధ్యం? ఆలోచనలు... ఆందోళన కమ్ముకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.కొద్ది నిమిషాల తరువాత...హర్ష ఫోన్ ఆగకుండా అలా మోగుతూనే ఉంది. తేరుకున్న అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ పేరు చూడగానే, తన జీవితం ఇక ముగిసింది అనుకున్నాడు హర్ష. కారణం ఫోన్ చేసింది తన కాబోయే భార్య స్నేహ...తాను కూడా ఆ వీడియోస్ తప్పకుండా చూసే ఉంటుంది. తనతో తెగతెంపులు చేసుకోవడానికి ఫోన్ చేస్తోంది అని అర్థం అయింది అతడికి. చివరిసారిగా ఆమెతో మాట్లాడాలని వణుకుతున్న చేతులతో ఫోన్ తీసాడు హర్ష.‘‘హలో...’’ కంపిస్తున్న స్వరంతో అన్నాడు హర్ష. ‘‘నేను ఆ వీడియోస్ చూశాను’’ అన్నది స్నేహ. కొన్ని నిముషాలు అలా మౌనంగా ఉండిపోయాడు హర్ష.‘‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు’’ మెల్లగా అన్నాడు హర్ష. తన కళ్ళముందే తన కలలసౌధం కూలిపోతున్నట్టు అనిపిస్తోంది అతడికి.‘‘ఆ వీడియోస్లో ఉన్నది మీరు కాదని నాకు తెలుసు’’... ప్రశాంతంగా చెప్పింది స్నేహ‘‘ఇది బహుశా సైబర్ మోసం కావచ్చు. డీప్ ఫేక్ తో ఇలా ఒకరి మొహాన్ని, స్వరాన్ని అనుకరించి అనుసరించి మోసాలు చేస్తారని తెలుసు. మీరు వెంటనే ఆ వీడియో గురించి సైబర్ కంప్లయింట్ ఇవ్వండి.’’ చెప్పింది.స్నేహ మాటలు హర్షకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు అయింది. సైబర్ క్రైమ్ అధికారి సాగర్ కేసు విచారణ మొదలుపెట్టాడు.ఆ వీడియోని జాగ్రతగా పరిశీలిస్తున్నాడు సాగర్. వీడియోలోని ముఖం, స్వరం అన్నీ హర్షవే...‘‘ఇది కచ్చితంగా డీప్ ఫేక్ వీడియో.’’ అన్నాడు సాగర్. హర్ష కొద్దిగా కుదుటపడ్డాడు.‘‘డీప్ ఫేక్ అంటే?’’ అడిగాడు.‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎవరి ముఖాన్నైనా, స్వరాన్నైనా ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేయడం.’’ వివరించాడు. ఆ వీడియోను సాగర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషణ జరిగింది. కళ్ల కదలికల్లో స్వల్ప అసమానత. లైట్ రిఫ్లెక్షన్లో చిన్న తప్పులు. చివరకు నిర్ధారణ అయ్యింది– అది డీప్ ఫేక్.కాని, ఎవరు చేశారని అసలు విచారణ ఇప్పుడు మొదలైంది.అసలు నేరస్థుడు హర్ష కంపెనీలో పని చేసిన మాజీ ఉద్యోగి రాహుల్. అతను చేసిన ఒక మోసం వల్ల కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. హర్ష అతని ప్రాజెక్ట్ లీడర్.రాహుల్ సోషల్ మీడియాలో హర్ష ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి అతని ముఖం, స్వరం కాపీ చేశాడు. ఆ వీడియోతో వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ వీడియో ముందుగానే లీక్ అయింది.సైబర్ ట్రేసింగ్ ద్వారా రాహుల్ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్, డ్రాఫ్ట్ ఫైళ్లు దొరికాయి.అతను అరెస్ట్ అయ్యాడు.హర్ష నిర్దోషిగా బయటపడ్డాడు. కాని, అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.‘‘ఇప్పటి ప్రపంచంలో మన ముఖం కూడా మనదేనా?’’∙∙ ‘థాంక్యూ స్నేహా..పెళ్ళికి ముందే కాబోయే భర్త నిర్దోషి అని నమ్మావు. మోరల్ సపోర్ట్ ఇచ్చావు’’ స్నేహని చుట్టేస్తూ అన్నాడు హర్ష.‘‘టెక్నాలజీ చాలా శక్తిమంతమైనది. కాని, బాధ్యత లేకుండా వాడితే అది ఆయుధం అవుతుంది.’’ ముఖ్యంగా డీప్ ఫేక్ గురించి అవగాహన, సైబర్ నేరాల పట్ల ఎవేర్నెస్ లేకపోతె ప్రమాదం. భయపడటం మానేస్తే నేరాలను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు’’ చెప్పింది స్నేహ. గమనిక:ఇన్నాళ్లూ కొనసాగించిన ‘క్రైమ్ రిపోర్టర్’ కాలమ్ను పాఠకులు ఆదరించారు. పాఠకుల్లో చాలామంది ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ఫిక్షన్ కోరుకుంటున్నందున ఈవారం నుంచి ‘క్రైమ్ రిపోర్టర్’ స్థానంలో కొత్తగా ‘క్లూషియల్’ శీర్షికను ప్రవేశ పెడుతున్నాం. ఇందులో వారం వారం క్రైమ్ కథలు అందించనున్నాం.∙శ్రీసుధామయి -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
ప్రమాదకర పోకడలు
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ల మధ్య సాగుతున్న యుద్ధంలో రోజూ వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో గత రెండు రోజుల పరిణామాలతో మేల్కొన్నట్టు కనబడుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపై పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో అయిదు దేశాల్లోని ఆరు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతినటమే అందుకు కారణం. దక్షిణ ఇరాన్లోని సహజ వాయు క్షేత్రం పార్స్ను ఇజ్రాయెల్ గురిచూసి కొట్టిన వెంటనే ప్రపంచంలోనే అతి పెద్ద ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్పైనా, దాంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్ చమురుశుద్ధి కర్మాగారాలపైనా ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల వల్ల ఒక్క ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్లోని 17 శాతం నిక్షేపాలు ఆవిరయ్యాయి. యుద్ధం పరిసమాప్తమయ్యేవరకూ దాన్ని చక్కదిద్దటం అసాధ్యం. ఆ పనులకు దాదాపు అయిదేళ్లు పడుతుందంటున్నారు. అంటే అయిదేళ్ల ఖతార్ ఆదాయం 10,000 కోట్ల డాలర్లు మాయమైనట్టు! దీనివల్ల మన దేశంతో సహా ఆసియా, యూరప్ దేశాలు తీవ్రసంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 116 డాలర్లను దాటింది. అది 130కి చేరిందంటే అమెరికాతోపాటు అందరికీ కష్టాలు మొదలవుతాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలవుతున్నారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఇక దాడి చేయబోదని ఆ దేశం తరఫున ఆయన హామీ ఇచ్చారు. మరికొన్ని గంటలకే హార్మూజ్ దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్కు చెందిన ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే పథక రచన సాగిస్తున్నట్టు లీకులిచ్చారు. అసలు ఇజ్రాయెల్ తన ఆదేశం పాటిస్తుందని నిజంగా ట్రంప్ భావిస్తున్నారా? అది ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ శక్తిమంతమైన సేవకుడిగా మారితే, అమెరికా బలహీనమైన యజమానిగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆవిర్భవించటానికి వీలుగా చుట్టూవున్న ముస్లిం దేశాల్ని పాదాక్రాంతం చేసుకోవాలని 1996లోనే ఇజ్రాయెల్ పథక రచన చేసింది. గత అమెరికా అధినేతల దగ్గర దాని ఎత్తులు పారలేదు. తెలిసీ తెలియని ట్రంప్ ఆ కొరతను తీర్చారు. తమకు క్షిపణులకు కొరతేమీ లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనిపై ఇజ్రాయెల్ దాడిచేసి హతమార్చింది. ఇలాంటి చర్యలు యుద్ధ విరమణను జటిలం చేస్తాయి తప్ప సాధించేదేమీ ఉండదు. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన దశలో కూడా ఆ రెండు దేశాలూ అతిగా అంచనా వేసుకుంటూ, ఇరాన్పై తప్పుడు లెక్కలు కడుతున్నాయి. చట్టవిరుద్ధ మైన ఈ యుద్ధానికి మరో 20,000 కోట్ల డాలర్లు కావాలంటూ అమెరికన్ కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికన్ కుబేరులకు కోట్లాది డాలర్ల పన్ను రాయితీలిచ్చిన ప్రభుత్వం, సాధారణ ప్రజానీకానికి అందే అరకొర సదుపాయాలకు సైతం కోత పెడితే తప్ప ఈ నిధులు సమకూర్చుకోలేదు. ఈ అకారణ యుద్ధానికి ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేయటం అవసరమా?వీటి సంగతలా ఉంచి అత్యంత అమానవీయ పద్ధతుల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యల పర్యవసానాలేమిటో కనబడుతూనే ఉన్నాయి. ఓపెన్ ఏఐ, పాలంటీర్ కలిసి ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ ఆసరాతో మారణహోమానికి తోడ్పడుతున్నాయి. పదేళ్లుగా పాఠశాల నడుస్తున్న ఒక ఆవరణను ఏఐ ఇరాన్ సైనిక స్థావరంగా అర్థం చేసుకుని చూపితే, దాని ఆధారంగా అమెరికా క్షిపణి దాడికి పాల్పడి ఒకేసారి 170 మంది బాలబాలికల ప్రాణాలు తీసింది. సైనిక దాడులకోసం తమ సాఫ్ట్వేర్ ఇచ్చేది లేదని ట్రంప్కు చెప్పిన ఆంత్రోపిక్ అయినా, ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుని లాభపడిన ఓపెన్ ఏఐ అయినా సారాంశంలో ఈ ప్రాణాంతక దాడులకు వ్యతిరేకం కాదు. ఆంత్రోపిక్ అభ్యంతరమల్లా ఆ సాఫ్ట్వేర్మరింత పదునుదేరాలన్నదే. ఆ తర్వాతే అందుబాటులోకి తీసుకురావాలని దానిఉద్దేశం. ప్రపంచ మనుగడ ఎంత ప్రమాదకరంగా మారిందో దీన్నిబట్టే గ్రహించవచ్చు. -
ఇదీ ఏఐ ప'వార్'!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఉక్రెయిన్ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం. దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..1. అమెరికా: మొత్తం బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్ డాలర్లు కేటాయించారు.2. చైనా: మొత్తం బడ్జెట్ 314 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్ క్లస్టర్ల కోసం 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.3. రష్యా: మొత్తం బడ్జెట్: 149 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.4. భారత్: మొత్తం బడ్జెట్: 93.5 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ కలిసి ‘మిషన్ సుదర్శన్ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..1. ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ: ది గోస్పెల్ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్ టార్గెట్ సిస్టమ్. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. లావెండర్: సోషల్ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. వేర్ ఈజ్ డాడీ?: లావెండర్ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్ సాధనం. స్మార్ట్ షూటర్స్: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్–సైట్స్. 2. ఉక్రెయిన్–రష్యా యుద్ధం: అటానమస్ డ్రోన్లు: రష్యన్ జీపీఎస్ జామింగ్ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. డెల్టా సిస్టమ్: ఇది ఉక్రెయిన్ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్ టైమ్ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 3. వెనిజులానికోలస్ మదురోను పట్టుకోవడానికి కారకాస్లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని (పలాంటిర్ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. ఇరాన్ (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ): కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్ మావెన్, క్లౌడ్ ఏఐని ఉపయోగించారు. -
ఒంటరి.. డిజిటల్ దరి
సాక్షి, స్పెషల్ డెస్క్ : పట్టణీకరణ, పని ఒత్తిడి, మారుతున్న సామాజిక సంబంధాలు.. కారణం ఏదైనా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేవలం పనిముట్టుగా మాత్రమే కాకుండా మనుషులకు ఒక ‘డిజిటల్ తోడు’గా మారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది వినియోగదారులు ఏఐ కంపానియన్ యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 18–30 ఏళ్ల వయసు వారు ఈ యాప్స్ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాప్స్ మనుషులతో స్నేహితుల్లా లేదా ఒక తోడులా సంభాషిస్తున్నాయి. సాధారణ చాట్బాట్స్ కంటే ఇవి భిన్నమైనవి. వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికి తగినట్లుగా స్పందిస్తాయి.ఐటీ ఉద్యోగుల వాడకమే అధికం..వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా కేవలం కాలక్షేపం కోసం ‘డిజిటల్ స్నేహితుల’తో యూజర్లు గంటల తరబడి గడుపుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని యువత, ఐటీ ఉద్యోగులు వాటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటి వాడకం వల్ల వినియోగదారుల్లో 30% నుంచి 50% వరకు సానుకూల మార్పు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగిస్తున్నట్లు అంచనా. యూజర్లపరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది.ఇదీ మార్కెట్..నాస్కామ్ లెక్కల ప్రకారం 2024లోప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్ మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 30.8% వార్షిక వృద్ధిరేటుతో 2030 నాటికి 140.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం 2024లోభారత్లో ఏఐ కంపానియన్ మార్కెట్ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. 40.4% వార్షిక వృద్ధితో 2030 నాటికి 7.9 బిలియన్ డాలర్లనుతాకుతుందని అంచనా.రోజుకు 45 నిమిషాలు..» భారత్లో ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగం ప్రపంచ సగటు కంటే 40% వేగంగా పెరుగుతోంది.» సగటున ఒక్కో వినియోగదారు రోజుకు45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు.» వినోదం కోసమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఆధారం: నాస్కామ్, సెన్సార్ టవర్, టెక్నావియో, గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రయోజనాలు ఇవీ..» సామాజికంగా ఒంటరినని బాధపడే వారికి ఈ యాప్స్ 24/7 అందుబాటులో ఉండే స్నేహితుడిలా తోడుంటాయి. » కొన్ని యాప్స్ ఒత్తిడి,ఆందోళన, కుంగుబాటుతగ్గించడానికి ‘కాగ్నిటివ్బిహేవియరల్ థెరపీ’ పద్ధతులను వాడుతూసహాయపడతాయి. » మనుషులతో మాట్లాడితే వారు మనల్ని జడ్జ్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ ఏఐతో ఎలాంటి సంకోచం లేకుండా మనసులోని మాటలు పంచుకోవచ్చు.నష్టాలూ ఉన్నాయి» మన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల డేటా హ్యాక్ అయ్యే లేదా ప్రకటనల కోసం అమ్ముడయ్యే ప్రమాదం ఉంది. » మనుషుల కంటే ఏఐతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల నిజజీవితంలో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయి, మనుషులతో మాట్లాడటం కష్టంగా మారవచ్చు. » మనుషులు ఏఐ స్నేహితులకు బానిసలుగా మారే ప్రమాదం. » ఏఐ ఇచ్చే సలహాలు వాస్తవ విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉండే అవకాశం. -
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్! -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు» ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. » ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. » ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. » మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. » వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎల్రక్టానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మంచి పనులకు ఉపయోగించాలి కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకంగా కొనసాగుతున్న కృత్రి మ మేధస్సు (ఏఐ) ను మంచి పనులకు ఉపయోగించడం వల్ల అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప తప్పుడు మార్గాలకు వెళితే కచ్చితంగా శిక్షలకు గురికాక తప్పదు. ఏఐ ఉపయోగం, దుర్వినియోగం పై అవగాహన పెంచుకోవాలి. – ప్రొఫెసర్ ఎం.వీ.బీ.చంద్రశేఖర్, హెచ్ఓడీ, సీఎస్ఈ, ఏఐఎంఎల్దుర్వినియోగం చేస్తే కఠినమైన శిక్షలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏఐను దుర్వినియోగం చేస్తే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి. ఏఐను ఒక టూల్గా ఉపయోగించి ఎన్నో ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుల్లో ఏఐతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి.– ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
సెమీకాన్ మార్కెట్ @ 300 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ భవిష్యత్తుపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్లో 60 శాతం చిప్స్ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా. ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్లో మొబైల్ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది. ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ..టెస్ట్ (ఓఎస్ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమలోకి మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది. భారీగా ఉద్యోగాలు.. సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది. -
ఏఎంఐ ల్యాబ్స్తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ)తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్ ఏఐ కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ రోడ్మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు. సిలికాన్ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు. -
ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?
అహ్మదాబాద్: విదేశాల్లో భారీ ప్యాకేజీలు అందుకుంటూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసి, ఏవో కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారతీయ కంపెనీల్లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వంటి అత్యున్నత రంగాల్లో అనుభవమున్న టెక్కీలను ఇంటర్వ్యూల్లో ‘నోట్ప్యాడ్' మీద కోడ్ రాయమనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.అసలేం జరిగింది?అహ్మదాబాద్కు చెందిన ‘న్యూకాన్స్’ (Pneucons) సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ లఖానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఉదంతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతని స్నేహితులిద్దరు గత ఐదేళ్లుగా జర్మనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఒకరు క్యాన్సర్ కణాలను గుర్తించే ఏఐ మోడల్స్ను రూపొందించగా, మరొకరు మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పైప్లైన్స్లో నిపుణుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం వారు తమ విదేశీ ఉద్యోగాలను వదిలి భారత్కు తిరిగివచ్చారు.అయితే వారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే.. సదరు రిక్రూటర్లు వారి అనుభవాన్ని పక్కన పెట్టి, 2026వ సంవత్సరంలో కూడా ఒక సాధారణ ‘నోట్ప్యాడ్’ ఇచ్చి కోడ్ రాయమని అడగడం వారిని షాక్నకు గురిచేసింది. ‘క్యాన్సర్ను గుర్తించే ఏఐ మోడల్స్ తయారు చేసే మేధావులను నోట్ప్యాడ్పై కోడ్ రాయమనడం హాస్యాస్పదం’ అని లఖానీ ఎద్దేవా చేశారు.నెటిజన్ల రియాక్షన్: 'ఇది టెక్ ఇంటర్వ్యూనా.. జోకా?'ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘భారతీయ ఇంటర్వ్యూ వ్యవస్థ ఇంకా పురాతన కాలంలోనే ఉంది. 15 ఏళ్ల అనుభవం ఉన్నవాడిని కూడా లాజిక్ అడగకుండా, బట్టీ పట్టినట్టు కోడ్ రాయమనడం రిక్రూటర్ల అసమర్థతకు నిదర్శనం’ అని ఒకరు మండిపడ్డారు. ‘అనుభవం ఎంత ఉన్నా ప్రాథమిక అంశాలు ముఖ్యం. నోట్ప్యాడ్పై రాయడం వల్ల వారి సృజనాత్మకత, పట్టు అర్థమవుతుంది" అని మరికొందరు వాదించారు. మొత్తానికి ప్రపంచమంతా ఏఐ వేగంతో దూసుకుపోతుంటే, మన దగ్గర ఇంకా పాత పద్ధతులతోనే ప్రతిభను కొలవడం ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే.. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు
న్యూఢిల్లీ: కంపెనీల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ప్లగ్ అండ్ ప్లే (సిద్ధంగా ఉన్న) రకమైన సాధారణ సాఫ్ట్వేర్లు సరిపోవని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ వెల్లడించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి స్థాయి ఏఐ పరిష్కారాలను అందించే ఐటీ కంపెనీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపింది. ఏఐపై నిర్ణయాధికారం కలిగిన 600 మందితోపాటు 38 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను సర్వే చేసి ఒక నివేదిక విడుదల చేసింది.సంస్థలు ఏఐ భాగస్వామిని (టెక్నాలజీ సంస్థ) ఎంపిక చేసేటప్పుడు ధర లేదా సత్వర ఫలితాలు కంటే, తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ప్రత్యేక పరిష్కారాలు, విధానాలను కీలకంగా చూస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా అందుబాటులో ఉండే ఏఐ సాఫ్ట్వేర్లు తమ వ్యాపార అవసరాలకు సరిపోవంటూ కొన్ని సంస్థలు ఏఐ సేవలను తిరస్కరిస్తున్నాయని వెల్లడించింది. తగినంత అనుభవం లేకపోవడం, ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేయకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొంది. కీలక సవాళ్లు.. ఏఐ స్వీకరణలో సంస్థలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లలో.. నియంత్రణ, నిబంధనలపరమైన ఆందోళనలు.. పెట్టుబడిపై సరైన రాబడిని చూపించడం కష్టంగా ఉండడం.. ఏఐ వ్యూహంపై సరైన స్పష్టతలేమిని పేర్కొంది. ఏఐ విజయవంతం కావాలంటే ఒక్కో నమూనాను అమలు చేయడంతోనే సరిపోదని, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. అలాగే ఏఐపై పెట్టుబడులను ప్రయోగాత్మకంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా సంస్థలు చూస్తున్నాయని తెలిపారు. ఏఐ మనుషుల పనులను వేగవంతం చేస్తుందే కానీ, వారి ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని కాగ్నిజెంట్ అధ్యయన నివేదిక పేర్కొంది. మనుషులు ఏఐ కలిసి పనిచేసే విధంగా పనితీరులో మార్పులు వస్తాయని తెలిపింది. -
ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్ను కొట్టివేశారు.పంజాబ్లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్లో ఉన్న పిటిషన్ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు. పిటిషన్లో పేర్కొన్న 'ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్' (Fiduciary Risk of Corporate Donors) అనే పదానికి అర్థం చెప్పాలని సీజేఐ కోరగా, సిద్ధూ నీళ్లు నమిలాడు.తన నోట్స్ చూసి చెప్పడానికి ప్రయత్నించగా.. ‘మిస్టర్ సిద్ధూ, ఇది ఎవరో న్యాయవాది రాసి ఇచ్చింది. నువ్వు కేవలం స్క్రిప్ట్ చదువుతున్నావు’ అని సీజేఐ అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరోతో విచారణ జరిపిస్తామని హెచ్చరించడంతో సిద్ధూ అసలు విషయం బయటపెట్టారు. సుప్రీంకోర్టు ఆవరణలోని ఒక టైపిస్ట్ తనకు సహాయం చేశాడని, అతనికి గంటకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ, నాలుగు జాకెట్లు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. తాను న్యాయవాదిని పెట్టుకోలేక, మూడు నాలుగు రకాల ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్ ఉపయోగించి ఈ పిటిషన్ను రూపొందించానని అంగీకరించాడు.సాంకేతికతను తప్పుగా వాడుకుంటూ, కోర్టు సమయాన్ని వృథా చేసే పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ఆర్థిక జరిమానాలు కూడా తప్పవని హెచ్చరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, సోమవారం కూడా ఇదే బెంచ్.. ఉల్లి, వెల్లుల్లిలో ‘తామసగుణం’ ఉంటుందా అనే అంశంపై వచ్చిన పిటిషన్తో సహా ఐదు ఉపయుక్తంకాని వ్యాజ్యాలను కొట్టివేసింది.ఇది కూడా చదవండి: మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు -
ఒక‘ట్రెండు’సార్లు ఆలోచించండి...
‘ఏమవుతుంది లే’ అనే నిర్లక్ష్యం కంటే... ‘ఎందుకైనా మంచిది’ అనే ముందు చూపు చాలా మంచిది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ‘వైరల్ ఏ.ఐ. క్యారికేచర్’ ట్రెండ్ అనేది హాట్ టాపిక్. ‘ఇదిగో నా గురించి నీకు అన్నీ చెప్పేస్తున్నాను. క్యారికేచర్ అదిరిపోవాలి’ అని ఏ.ఐ.కి ప్రాంప్ట్ ఇవ్వడం అనేది ఈ ట్రెండ్లో భాగం. అయితే అయితే... ఈ ట్రెండ్లో భాగంగా వేలం వెర్రిగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వల్ల, మోసగాళ్లకు చేతినిండా పనే అని హెచ్చరిస్తున్నారు డిజిటల్ నిపుణులు...యూజర్లు పర్సనల్ ఫొటోను షేర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ను క్యారికేచర్ లేదా ఇలస్ట్రేషన్ క్రియేట్ చేయమని అడగడమే వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్. మన అభిరుచులు, జీవిత విశేషాలు, ఉద్యోగ విశేషాల ఆధారంగా ఈ క్యారికేచర్ క్రియేట్ అవుతుంది. క్యారికేచర్ కదా అనుకోవద్దు! ‘ఏమవుతుంది? వస్తే గిస్తే నా క్యారికేచర్ బయటికి వస్తుంది. దీంతో మోసాలు ఎలా చేస్తారు?’ అనే వాళ్లు బోలెడు మంది. అయితే మనం అనుకున్నట్లు బయటికి వచ్చేది క్యారికేచర్ మాత్రమే కాదు...‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’ అనే ఒకే ఒక ప్రాంప్ట్తో ఏఐ ఎన్నో వివరాలను లాగేస్తుంది. చివరికి మన కమ్యూనికేషన్ స్టైల్ను కూడా విడిచి పెట్టదు. ఒక్కముక్కలో చె΄్పాలంటే... బయటికి వచ్చేది క్యారికేచర్ రూపంలోని మన పర్సనల్ ప్రోఫైల్! అది మనం ఇష్టపూర్వకంగా అందజేసిందే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.ట్రెండ్లో భాగంగా...వైరల్ క్యారికేచర్ ట్రెండ్ క్రియేటివ్గా, ఎంటర్టైనింగ్గా కనిపించినప్పటికీ, ఈ ట్రెండ్ ద్వారా బయటికి వచ్చే వ్యక్తిగత సమాచారం ఆధారంగా మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘నా మనస్తత్వానికి అద్దం పట్టే క్యారికేచర్ క్రియేట్ చేసుకోవాలి’ అనే ఉత్సాహంతో యూజర్లు ఎటువంటి పరిమితులూ లేకుండా సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. సమాచారం ఎంత ఎక్కువ ఇస్తే క్యారికేచర్ అంత బాగా వస్తుందనేది వారి ఉద్దేశం. ట్రెండ్లో భాగంగా రెఫరెన్స్ ఫొటోతో పాటు అదనపు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు... కంపెనీ పేరు, కార్పొరేట్ లోగో, చేస్తున్న ఉద్యోగం, పని చేస్తున్న నగరం పేరు, దినచర్య, కుటుంబ వివరాలు... మొదలైనవి తెలియజేస్తున్నారు.ఎమోషనల్ మానిప్యులేషన్ఫొటోగ్రాఫ్కు సందర్భోచిత వివరాలు జత చేస్తే డిజిటల్ మోసాలు జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఫొటోతో స్కామర్లు వివిధ ΄్లాట్ఫ్లామ్లలో నకిలీ ప్రోఫెషనల్ ప్రోఫైళ్లను సృష్టించవచ్చు. జెనరేటివ్ వాయిస్ లేదా డీప్ఫేక్లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు. ఫొటోను డిస్ప్లే ఇమేజ్గా ఉపయోగించి కంపెనీ లేదా ప్రోఫైల్ పేజీలను క్లోన్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రామాణికంగా, నమ్మదగినదిగా చేయడానికి ఇలాంటి ట్రిక్స్ను ఉపయోగిస్తుంటారు. ఫొటోగ్రాఫ్తో పాటు ఉద్యోగం, ఆఫీసు వివరాలు మోసగాళ్ల చేజిక్కితే ఎంతమాత్రం అనుమానం రాకుండా బిజినెస్ ఈమెయిల్స్, మెసేజ్లను స్కామర్లు రూపొందించి ఆ వ్యక్తి కొలీగ్స్కు ఫేక్ ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్లను పంపే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే స్కామర్లు ఎమోషనల్ మానిప్యులేషన్కూ పాల్పడే ప్రమాదం ఉంది.యస్... ఇది నిజమేమనం అందించే డేటా పాయింట్స్ సవివరమైన డిజిటల్ ప్రోఫైల్ను రూపొందించడానికి ఉపకరిస్తాయి. ఇమేజ్తో జత చేసిన వివరాలతో సైబర్ నేరగాళ్లు సోఫిస్టికేటెడ్ స్కామ్లు చేసే అవకాశం ఉంది ‘ఏఐ–జనరేటెడ్ పర్సనల్ ఇమేజ్లు స్కామర్లకు ఉపయోగపడతాయా?’ అనే ప్రశ్నకు వచ్చే జవాబు... ‘అవును’ సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ (వోఎస్ఐఎన్టీ)పై తగిన సమయం వెచ్చిస్తారు. లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, న్యూస్ ఆర్టికల్స్....మొదలైన వాటి ద్వారా వ్యక్తుల డిజిటల్ ఫుట్ప్రింట్ను సేకరిస్తారు. వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్ ద్వారా వారి పని మరింత సులభం అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాలు, ΄్లాట్ఫామ్ల ద్వారా సేకరించడానికి బదులు ఒకేచోటు నుంచి తీసుకోవడానికి స్కామర్లకు అవకాశం ఇస్తుంది.‘యూజర్లు పంచుకునే ఏ ఒక్క సమాచారం విడిగా ప్రమాదం కాదు. అయితే ఈ ట్రెండ్తో వచ్చిన చిక్కు ఏమిటంటే, అలవాట్ల నుంచి ఆందోళన వరకు యూజర్ షేర్ చేసే సమాచారాన్ని మొత్తం ఒకే దగ్గర చేరుస్తుంది. స్కామర్లు ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనునుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇస్తుంది.ఏ చెడు జరిగినా ‘ఇది కలికాలం నాయనా’ అనే మాట బాగా వినిపిస్తుంది. ఇప్పుడు కాలం మారింది. ‘ఇది డిజిటల్ కాలం నాయనా’ అనుకోవాల్సి వస్తోంది. ఏ ట్రెండ్ నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా! అందుకే జాగ్రత్త అవసరం...అత్యవసరం.ఇలా చేయాలి...⇒ ఐడెంటిఫైయబుల్ డేటా ప్రాంప్ట్స్ ఇవ్వవద్దు. ఉదా: పూర్తి పేరు, చేస్తున్న ఉద్యోగం, కంపెనీ పేరు, ఇంటి అడ్రస్... మొదలైనవి.⇒ మీ లొకేషన్ లేదా, సంస్థ గురించి తెలుసునేలా చేసే లోగోలు, ఐడీ కార్డ్, డాక్యుమెంట్లు, లైసెన్స్ ప్లేట్స్, స్క్రీన్లు, భవన ముఖద్వారాలు, స్ట్రీట్ సైన్లు, బిల్డింగ్ పేర్లు కనిపించే ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.⇒ ఎమోషనల్ స్కామ్స్ నివారించడానికి పిల్లలకు సంబంధించి సమాచారాన్ని షేర్ చేయకూడదు. కుటుంబ వివరాలను వెల్లడించకూడదు.⇒ ‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’లాంటి ప్రాంప్ట్లు ఇవ్వకూడదు. దీనికి బదులుగా ‘క్రియేట్ యూజింగ్ వోన్లీ ది డిటేల్స్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ డోన్ట్ యూజ్ పాస్ట్ చాట్స్ ఆర్ హిస్టరీ’ అని ఇస్తే సరిపోతుంది.⇒ ఇతరుల అనుమతి లేకుండా వారి ఫొటోను అప్లోడ్ చేయవద్దు.⇒ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ముందు ప్రైవసీ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కంటెంట్ను ఎంత కాలం స్టోర్ చేస్తారు? కంటెంట్ను మోడల్ ట్రైనింగ్, సర్వీస్ ఇంప్రూమెంట్స్ కోసం ఉపయోగిస్తారా?... మొదలైన విషయాలు తెలుసుకోవాలి.⇒ ‘టెంపరరీ చాట్’లాంటి ప్రైవసీ మోడ్స్ను ఉపయోగించడం మంచిది.⇒ ఒకవేళ మీరు ట్రెండ్ను ఫాలో కావాలనుకుంటే తాజాగా తీసిన హై–రిజల్యూషన్ ఫొటో కాకుండా పాత లేదా ఎడిటెడ్ ఇమేజ్ను ఉపయోగించాలి.⇒ వైరల్ ట్రెండ్తో సంబంధం ఉన్న హానికరమైన లింక్లు, ప్రమాదకరమైన డౌన్లోడ్లు, ఫిషింగ్ నివారించడానికి సెక్యూరిటీ టూల్స్ను ఉపయోగించాలి. -
బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే!
న్యూయార్క్: కార్పొరేట్ ప్రపంచంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. నిన్నటి వరకు కేవలం మన సందేహాలకు సమాధానాలిచ్చే ‘చాట్బాట్’లుగా ఉన్న కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు, ఇప్పుడు నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, కెనడాల్లోని అనేక దిగ్గజ కంపెనీల్లో సాగే కార్యకలాపాలను సమూలంగా మార్చేస్తున్నాయి. కేవలం సహాయకులుగా కాకుండా, పనులను ప్లాన్ చేస్తూ, తోటి ఉద్యోగులకు బాధ్యతలు కేటాయించే ‘ఏఐ ఏజెంట్లు’గా ఇవి అవతరిస్తున్నాయి.సాధారణ ఏఐ చాట్బాట్లకు, ఏఐ ఏజెంట్లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాటి ‘స్వయంప్రతిపత్తి’. చాట్బాట్లు మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తాయి. కానీ ఏఐ ఏజెంట్లు ఒక అడుగు ముందుకు వేసి, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా క్యాలెండర్లు, సమావేశాల ట్రాన్స్క్రిప్ట్లు, అంతర్గత డేటాబేస్లను విశ్లేషించి, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలవు. అమెరికన్ క్లౌడ్ డేటా సంస్థ ‘స్నోఫ్లేక్’ వంటి చోట్ల ఇంజనీర్లు గతంలో గంటల తరబడి చేసే కోడింగ్ సమీక్షలు, సిస్టమ్ పర్యవేక్షణ వంటి పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి.కొన్ని సందర్భాల్లో ఒక ఏఐ ఏజెంట్ రాసిన కోడ్ను మరో ఏఐ ఏజెంట్ తనిఖీ చేసి, లోపాలను సరిదిద్దుతోంది. మానవ పర్యవేక్షణ కేవలం తుది ఆమోదానికే పరిమితమవుతోంది. మేనేజర్లు చేసే పనుల కేటాయింపు, పనితీరు పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఇప్పుడు సాఫ్ట్వేర్లే చూసుకుంటున్నాయి. అమెజాన్, యూపీఎస్, టార్గెట్ వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తూ, ఆటోమేషన్ ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అమెరికాలో దాదాపు 6 నుంచి 7 శాతం మంది ఉద్యోగులు ఏఐకు ప్రభావితం కావచ్చని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. ముఖ్యంగా అకౌంటెంట్లు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు.కాగా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్ల సంస్థలో సహకారం క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొన్ని సంస్థలు ఏఐ ద్వారా పెరిగిన ఉత్పాదకతను ఉద్యోగులకు పంచుతూ, వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెడుతున్నాయి. మరోవైపు మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఉండే కౌన్సెలింగ్, వెల్నెస్ వంటి రంగాల్లో ఏఐ ఏజెంట్ల వినియోగానికి వినియోగదారులు విముఖత చూపుతున్నారు. సామర్థ్యం కంటే సామాజిక అనుబంధానికే విలువనిస్తూ, కొన్ని కంపెనీలు ఇప్పటికీ మనుషులకే పెద్దపీట వేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు -
ఏఐకి రేపటి తరం సిద్ధమా?
మానవాళి ప్రగతిలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నూతన శకాన్ని ఆరంభిస్తోంది. అయితే మనుషులకు ప్రయోజనం చేకూర్చడంలో ఈ టెక్నాలజీకున్న అపారమైన సామర్థ్యాన్ని, అది సమాజానికి హాని చేయడానికి కూడా ఉన్న ప్రమాదంతో బేరీజు వేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మన సాధనాలలోని ఏఐ మోడళ్ళు ఇప్పటికే రుచి చూపిస్తున్నాయి. నా ఫోన్లోని ఫొటోలలో ఒక టీనేజీ అమ్మాయిని ఏఐ ‘స్వీట్’గా అభివర్ణించడంతో నేను ఖంగుతిన్నాను. ఫోన్లోని ఏఐకీ, ఆన్లైన్ మృగాడికీ ఇంక తేడా ఏముంది? రక్షణ కంచెలు, భద్రతల అవసరాన్ని ఈ చిన్ని ఉదాహరణ చెప్పకనే చెబుతోంది. ఓ కుర్రాడి ఆత్మహత్యకు చాట్ జీపీటీ దారి చూపిన వైనాన్ని మరచిపోగలమా? ఇవేవో చెదురుమదురు ఘటనలు కావు. ప్యారిస్లో జరిగిన కడపటి ఏఐ కాన్ఫరెన్స్ని ‘ఏఐ సేఫ్టీ సమిట్’గా అందుకే పిలిచినట్లుంది. ఉద్యోగాల కోతపై రెండు వాదనలుఅడ్డూ ఆపులేని ఏఐ సిస్టంలు తీసుకురాగల ప్రమాదాలపై ఆందోళనలు ఇదివరకే మొదలయ్యాయి. ఏఐ అభివృద్ధిపై మారటోరియం విధించాలంటూ ఓ లాబీ తయారైంది. అలా అడిగిన వారిలో ఒకరైన ఎలాన్ మస్క్ ఇపుడు ఏఐ రేసులోకి దిగక తప్పలేదు. ఏఐ సిస్టంలు స్విచాఫ్కు బదులుగా మనుషులను చంపేసే అవకాశాన్ని ఎంచుకున్నాయని ల్యాబ్ అధ్యయనాలలో తేలింది. ప్రముఖ కంప్యూటర్ సైన్స్ నిపుణుడు స్టువర్ట్ రసెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ సంగతి వెల్లడించారు. కోడర్లలో చాలా మంది పురుషులే అయినందున లింగ వివక్ష ఈ సిస్టంలకు కూడా పాకిందని మహిళా నిపుణులు అన్నారు. కనుక, ఏఐ ఎకోసిస్టంని కంప్యూటర్లు, డేటా సెంటర్లు, ఎనర్జీ అవసరాలు, మోడళ్ళు–అప్లికేషన్ల వంటి పదజాలంతోనే కాక నైతిక దృక్కోణం నుంచీ వీక్షించవలసి ఉంది. ఉద్యోగాలు ఏమవుతాయోనని క్రమేపీ పెరుగుతున్న ఆందోళనల అంశాన్ని కూడా పరిశీలించవలసి ఉంది. ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దీనిపై కలత చెందుతోంది. దీనిపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఉద్యోగుల అవసరం లేని విధంగా అంతిమంగా ఏఐ పరిణమిస్తుందన్నది వాటిలో ఒకటి. ఉద్యోగాల తీరుతెన్నులు మారతాయన్నది మరో వాదన. కొత్త టెక్నాలజీతో వివిధ రకాల నైపుణ్యాలు అవసరమవుతాయని అంటున్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం సమయంలో అదే జరిగింది. దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ రెండవ కేటగిరీలోకి వస్తారు. వ్యాల్యూ–యాడెడ్ సర్వీసులపై ఏఐ చూపగల ప్రభావంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను వారు ఇటీవలి ఢిల్లీ సమిట్లో తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఐటీ పరిశ్రమలోని లక్షలాది ఉద్యోగులు తక్షణ బెడదను ఎదుర్కొంటున్నారు. ఆ పరిశ్రమలోని అట్టడుగు ఉద్యోగులు చేసే పనులను ఇకపై ఏఐ సిస్టంలు చక్కబెడతాయని చెబుతున్నారు. మారుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించడం స్వల్పకాలిక పరిష్కారంగా భావించవచ్చు. దీర్ఘకాలిక సమస్య కట్టెదుటే కనిపిస్తోంది. ఏఐ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అత్యవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థులు ఒంటబట్టించుకునే విధంగా దేశంలోని విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. ప్రాథమిక విద్య నుంచే...ఇది ఉన్నత విద్యా రంగానికి మాత్రమే పరిమితమయ్యే సవాల్ కాదు. ప్రాథమిక, సెకండరీ విద్యా స్థాయులలో కూడా తగు మార్పులు చేసుకోక తప్పదు. మూడవ, నాల్గవ తరగతుల విద్యార్థులు చిన్నపాటి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వార్షిక (2024) విద్యాస్థాయి నివేదిక వెల్లడిస్తోంది. అధునాతన ఏఐ ఎకోసిస్టంతో వ్యవహరించగలిగిన విధంగా ఈ విద్యార్థులను సంసిద్ధులను చేయవలసి ఉంది. ప్రీ–ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయులలోను ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ప్రాథమిక విద్యా ప్రమాణాలను, ఆలంబనగా నిలువవలసిన మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా తీర్చిదిద్దినప్పుడే ఆ రకమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. డిజిటల్ వ్యత్యాసాన్ని ఏఐ వ్యత్యాసంగా పరిణమించనివ్వకూడదని ఢిల్లీ సదస్సులో పాల్గొన్న గూగుల్ ఛీఫ్ సుందర్ పిచాయ్ దాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్చరించారు. నవీకరణ, ప్రతిభా సామర్థ్యాలకు గ్లోబల్ కేంద్రంగా తనకున్న అనుకూలతను భారత్ నిలబెట్టుకుంటుందో, లేదో నిర్ణయించగల మౌలికాంశాలవి. పునాది బలంగా ఉంటేనే సౌధం నిలుస్తుంది. ప్రపంచంలోని చిప్ డిజైనర్లలో 20% మంది మన దేశంలోనే ఉన్నారు. సెమీకండక్టర్ అభివృద్ధికి ఆశావహమైన పథకాలతో అడుగు ముందుకేయడం దానివల్లనే తేలికైంది. విద్యా రంగంలో మౌలిక వసతులను సకాలంలో ఉన్నతపరిస్తేనే ఈ పోటీదాయక అడ్వాంటేజి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గకూడదు!ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నా ఇంకా మనం అమెరికా, చైనాలను అందుకునే పరుగులోనే ఉన్నామనే ఫిర్యాదు వినవస్తోంది. ఏఐలో మనం రేసులోనే ఉన్నామని ఢిల్లీ సమిట్ వెల్లడించింది. విదేశీ ఆర్కిటెక్చర్పై ఆధారపడకుండానే పలు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళ (ఎల్.ఎల్.ఎం.)ను మనం ఆవిష్కరించగలిగాం. ఏకంగా 22 భాషల్లో రియల్–టైమ్ స్పీచ్, డీప్ రీజనింగ్ సామర్థ్యాలతో ఆవిష్కృతమైన ‘సర్వం’ ఏఐ మోడళ్ళు అబ్బురపరచాయి. స్వయం శక్తితో ఏఐలో ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చాయి. భారత్ జెన్ మోడల్, జ్ఞాని ఏఐ, టెక్ మహీంద్రా, ఫ్రాక్టల్ ఎనలటిక్స్ మోడళ్ళు కూడా చెప్పుకోతగినవే. కొన్ని మోడళ్ళు ‘ఇండియా ఏఐ మిషన్’ ద్వారానే సాధ్యమయ్యాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా, ఢిల్లీ సమిట్ ఫలవంతమైనదనే చెప్పాలి. వచ్చే రెండేళ్ళలో ఏఐ, డీప్టెక్ పెట్టుబడి కింద 200 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రిలయన్స్ద, అదానీ వంటి దేశీయ కంపెనీలతోపాటు, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. మన ప్రభుత్వ పెట్టుబడులు మాత్రం ఓ మోస్తరుగానే ఉన్నాయి. గత ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో అవి అందులో సగానికి తగ్గిపోయాయి. అత్యధునాతన టెక్నాలజీపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉన్న సమయంలో కోత పెట్టడం నివ్వెరపరుస్తోంది. ఇది ప్రభుత్వపరంగా ఖర్చును తగ్గించుకోవాల్సిన సమయం కాదు. పెద్ద టెక్ కంపెనీల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లు వస్తే రావచ్చు. ఏఐ ఇండియా మిషన్ వంటి విజయ గాథల వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి కూడా నిధుల మద్దతు అవసరం. అదే సమయంలో, ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపుదలకు పెట్టుబడులు అత్యావశ్యకమని దీర్ఘకాలిక దార్శనికత సూచిస్తోంది. ప్రాథమిక పాఠశాలల మౌలిక వసతులను గణనీయంగా మెరుగుపరచి తీరాలి. అప్పుడు మాత్రమే ఏఐతో రాగల సమస్యలు, ప్రమాదాలను తదుపరి తరం సమర్థంగా ఎదుర్కోగలదు. సుష్మా రామచంద్రన్వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ -
ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!
ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.కైట్లిన్ కలినోవ్స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్వర్క్లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.కైలిన్ కలినోవ్స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!కలినోవ్స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది. -
ఏఐ ఆఫీసర్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్–కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్మానవ శ్రమను భర్తీ చేయలేదుకొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 1980ల్లో స్ప్రెడ్షీట్స్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్కీపింగ్ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. ఏఐ నిపుణుల కొరత.. మ్యాన్పవర్ గ్రూప్ నిర్వహించిన గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ సర్వే ప్రకారం.. భారత్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్–4లో భారత్ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. ఏఐ లిటరసీ, ఏఐ మోడల్ డెవలప్మెంట్ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో.. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రిసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలంటే.. ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్ స్థాయి ’చీఫ్ ఏఐ ఆఫీసర్స్’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్ పెరగనుంది. వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్ అనలిస్ట్ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, స్మార్ట్ గ్రిడ్ అనలిస్ట్ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్ టూల్స్ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది. -
‘కోడ్ అదిరింది.. లాజిక్ అడగ్గానే ఫ్యూజులు అవుట్’
సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తోంది. సంక్లిష్టమైన కోడింగ్ను నిమిషాల్లో పూర్తి చేస్తూ, డెవలపర్ల పనిని మరింత సులభతరం చేస్తోంది. అయితే ఇదే ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను రాసిన (ఏఐ సాయంతో) కోడ్ను వివరించలేక తోటి ఉద్యోగుల ముందు అభాసుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డెవలపర్లు తాము రాసిన కోడ్ను రివ్యూ కోసం ‘పుల్ రిక్వెస్ట్’ రూపంలో సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన డెవలపర్ ఒక ఫంక్షన్కు సంబంధించిన కోడ్ను తన టీమ్ లీడర్కు పంపాడు. ఆ కోడ్ అద్భుతంగా పని చేస్తోంది. ఎటువంటి ఎర్రర్స్ లేవు. అయితే ఆ కోడ్ వెనుక ఉన్న లాజిక్ను వివరించాల్సిందిగా సీనియర్ ఎడిటర్ కోరడంతో అసలు విషయం బయటపడింది. ఆ డెవలపర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరకు తల దించుకుని తాను ఆ కోడ్ను 'క్లాడ్' (Claude) అనే ఏఐ టూల్ నుంచి నేరుగా కాపీ-పేస్ట్ చేశానని తెలిపాడు.ఈ ఉదంతాన్ని సదరు టీమ్ లీడర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. ‘అతనికి కోడింగ్ రాదని కాదు.. కానీ తాను స్వయంగా రాయకపోవడం వల్ల అందులోని లాజిక్ను విశ్లేషించలేకపోయాడు. ఏఐ ఇచ్చింది.. పంపేశాడు.. అంతే!’ అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ పుల్ రిక్వెస్టుల్లో ఏఐ ప్రమేయం ఉంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్టాక్ ఓవర్ఫ్లో వంటి వెబ్సైట్ల నుంచి గతంలో కోడ్ తీసుకునేవారని, కానీ అప్పట్లో కనీసం ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని సీనియర్లు గుర్తుచేస్తున్నారు.ఇప్పుడు ఏఐ టూల్స్ నేరుగా పరిష్కారాన్ని అందిస్తుండటంతో, యువ డెవలపర్లు మౌలిక సూత్రాలను (Fundamentals) విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోడ్ పని చేస్తే చాలు, అది ఎలా ఉన్నదనేది ముఖ్యం కాదు అనే ధోరణి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్లో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐని ఒక సహాయకారిగా చూడాలే తప్ప, అది ఇచ్చే సమాచారాన్ని కళ్లు మూసుకుని వాడటం వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ -
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్లను (కమాండ్స్ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు. -
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్ డిజిటల్ విధులను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్..ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్సైకిల్ మెకానిక్లు, లైఫ్గార్డ్లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్స్లాంటి మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది. -
ఎవుసానికి ఏఐ ఊపు!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్ ఫోకస్...కార్బన్ డేటాకు ఏఐ సొబగుఆర్మ్స్4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయ్యింగ్– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్ క్రెడిట్లు’ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్పార్టీ వెరిఫికేషన్ తర్వాత కార్బన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది. మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్– ఎం.ఆర్.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్ 4 ఏఐ’ అనే స్టార్టప్ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్ ఎంఆర్వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్తో కూడిన ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. ఆర్మ్స్ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగృతి దబస్ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.ఏఐ ఆధారిత డిజిటల్ బిడ్డింగ్అ΄్జావో ఆగ్రోటెక్... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్ బిడ్డింగ్ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్ ΄్లాట్ఫామ్లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది. ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది. ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. డిజిటల్ ఓపెన్–మార్కెట్ ట్రేడింగ్ ΄్లాట్ఫామ్ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్ బిడ్డింగ్ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరాఖ్ ΄్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ డిజిటల్ ట్రేడింగ్ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్ ట్రేడ్లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. గుజరాత్ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్ క్వాలిటీ అసెస్మెంట్ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్చాట్’డిజిటల్ గ్రీన్ ట్రస్ట్.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్ఫామ్ ‘ఫార్మర్చాట్’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్లోడ్ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్ మెసేజ్ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్చాట్’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్చాట్’ డిజిటల్ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ఇండియా సీఈఓ నిధి భాసిన్ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్చాట్ జెనెరిక్ ఏఐ అవుట్పుట్స్పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్చాట్ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026 -
ఏఐతో మరిన్ని అవకాశాలు
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. -
ట్రంప్ vs ఒబామా: AI చెప్పిన జాతకం.. అమెరికాకి పట్టిన గ్రహణం!
హాయ్ ఫ్రెండ్స్... లోకంలో వింతలు విశేషాలు అయిపోయాయి, ఇప్పుడు విడ్డూరాలు మొదలయ్యాయి. అసలే అమెరికా ఎన్నికలు అంటేనే ఒక పెద్ద జాతర. అక్కడ ఎవరు గెలిచినా మనకేంటి అనుకుంటాం కానీ, అక్కడ తుమ్మితే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ ముక్కు తుడుచుకోవాలి. అయితే తాజాగా మన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గారికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. "ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా తలపడితే ఎవరు గెలుస్తారు?" అని ఎవరో అడిగితే, మన AI గారు కూర్చుని లెక్కలు కట్టేసి ఒక రిజల్ట్ ఇచ్చేసారు. అంటే.. ప్రస్తుతం ఉన్న బైడెన్ గారిని సైడ్ చేసేసి, రిటైర్ అయిపోయిన ఒబామా గారిని మళ్ళీ గోదాలోకి లాగారన్నమాట. ఇది ఎలా ఉందంటే.. రిటైర్ అయిపోయిన సచిన్ టెండూల్కర్ ని పిలిచి, ఇప్పుడున్న బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు కొట్టమన్నట్టు ఉంది!సరే AI విశ్లేషణ ప్రకారం.. ట్రంప్ గారి బలం ఆయన 'బేస్'. అంటే ఆయన ఏం మాట్లాడినా, అది అబద్ధమా, నిజమా అని చూడకుండా జేజేలు కొట్టే ఒక బ్యాచ్. ట్రంప్ మామ స్టైలే వేరు.. "అమెరికా ఫస్ట్" అంటారు, కానీ ఆయన కోపం వస్తే "ట్విట్టర్ ఫస్ట్" అంటారు .ఇక ఒబామా గారి విషయానికి వస్తే.. ఆయన స్పీచ్ ఇస్తుంటే అమెరికా కాదు కదా, పక్కన ఉన్న కెనడా వాళ్ళు కూడా మైమరచిపోతారు. ఆయనకి 'యూత్' లో క్రేజ్ ఎక్కువని AI చెబుతోంది. కానీ పాపం AI కి ఒక విషయం తెలియదు.. ఒబామా గారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ, నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీలు తీసుకుంటూ చిల్ అవుతున్నారు. ఆయన్ని మళ్ళీ వైట్ హౌస్ పిలిచి.. ఆ ఫైళ్లు, ఆ గొడవలు చూడమంటే ఆయన ఒప్పుకుంటారా? ఇంకా AI ఏం చెబుతుందంటే, "ఎకానమీ" విషయంలో ట్రంప్ వైపు మొగ్గు ఉందట. అంటే వ్యాపారవేత్త కదా, పైసల లెక్కలు బాగా తెలుసని AI ఫీలింగ్. కానీ అదే AI "సోషల్ హార్మనీ" (సామాజిక సామరస్యం) విషయంలో ఒబామాకి ఓటు వేసింది. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కావాలంటే ట్రంప్ ని నమ్ముకోండి, ప్రశాంతత కావాలంటే ఒబామాని నమ్ముకోండి అని! కానీ అమెరికా జనాలకి రెండు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు "మాకు ఆ ఇద్దరూ వద్దు.. మాకు కనీసం సరిగ్గా నడవగలిగే, పేర్లు గుర్తుపెట్టుకునే అభ్యర్థి ఉంటే చాలు" అని మొత్తుకుంటున్నారు.ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ పోటీ పడితే సోషల్ మీడియా ఎలా ఉంటుందో ఊహించండి! ట్రంప్ గారు ఒబామాని "స్లీపీ బరాక్" అనో లేక ఇంకేదో వింత పేరు పెట్టి పిలుస్తారు. ఒబామా గారు తనదైన శైలిలో ఒక పెద్ద ఇంగ్లీష్ డిక్షనరీ తిరగేసి కౌంటర్లు ఇస్తారు.మధ్యలో ఎలాన్ మస్క్ వచ్చి.. "నేను ఎవరికీ ఓటు వేయను, నేను అంగారక గ్రహానికి వెళ్ళిపోతున్నా" అని ట్వీట్ చేస్తారు. AI కి ఉన్న ఒకే ఒక సౌలభ్యం ఏంటంటే.. అది మనుషుల ఎమోషన్స్ ని లెక్కించదు. కేవలం డేటా చూస్తుంది. కానీ అమెరికా ఎన్నికల్లో డేటా కంటే 'డ్రామా' ఎక్కువ పని చేస్తుంది. ఆ విషయం పాపం ఆ AI కి ఎవరు చెప్తారు?ఈ కథనంలో అందరూ మర్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు.. ఆయనే జో బైడెన్! పాపం, ఆయన మాజీ ప్రెసిడెంట్. కానీ AI మాత్రం ఆయన పేరు కూడా ఎత్తకుండా ఒబామాని తెచ్చి కూర్చోబెట్టింది. ఇది ఎలా ఉందంటే.. ఇంట్లో పెళ్లి కొడుకు రెడీగా ఉంటే, పాత పెళ్లి కొడుకు ఫోటో చూసి "ఈయనైతే బాగుండు" అని మురిసిపోయినట్టు ఉంది.AI ప్రిడిక్షన్ ప్రకారం.. ఈ ఊహాజనిత పోరులో ఒబామాకి కొంచెం ఎడ్జ్ ఉందట. ఎందుకంటే ఆయనకి నెగటివ్ రేటింగ్ తక్కువంట. ట్రంప్ గారికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, "ఈయన వద్దు బాబోయ్" అనే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో, ఫైనల్ గా తేలిందేంటంటే.. AI దృష్టిలో పాత కాలపు యుద్ధాలే బాగున్నాయి. ఉన్న వాళ్ళతో ఎలాగో వేగలేకపోతున్నాం, పోనీ లేని వాళ్ళని తెచ్చుకుందాం అనే రేంజ్ కి అమెరికా పాలిటిక్స్ వెళ్ళిపోయాయి. అసలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే.. ఈ AI చేసే విశ్లేషణలు మాత్రం మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మరి మీరేమంటారు? ట్రంప్ కావాలా? ఒబామా కావాలా? లేక మన ఊరి సర్పంచ్ నయమా? కామెంట్ చేయండి! -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు. -
వాహనదారులకు గుడ్న్యూస్.. సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగానే రద్దీ అంచనా..ఈ సందర్భంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్కు చెందిన 'ట్రాన్స్కాలిటీ' సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రాజధానిలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చని వివరించారు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా నియంత్రించి వాహనాల రాకపోకలను సుగమం చేయవచ్చని తెలిపారు.రోడ్డు భద్రతే లక్ష్యం..నగరంలో రాబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీలను వినియోగించడం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డీసీపీలు టి. అన్నపూర్ణ, ఐ. రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ మరియు ఆస్కి/ ASCI ప్రతినిధులు పాల్గొన్నారు.🚦 Cyberabad Goes High-Tech: AI-Driven Traffic Management! 🤖Cyberabad Police is exploring a world-class, AI-based predictive traffic management model to tackle congestion and enhance road safety.@CPCYBERABAD Dr. M. Ramesh met with Dr. Lucas Ambul (CEO, Transcality, Zurich)… pic.twitter.com/dvj49vdvsS— Cyberabad Police (@cyberabadpolice) February 25, 2026 -
ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI
-
స్వదేశీ విశ్వరూపం.. సర్వం విజయం
దిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సాక్షిగా ‘సర్వం ఏఐ’ సగర్వంగా చెప్పకనే చెప్పింది. ‘వరల్డ్–క్లాస్ హార్డ్ టెక్నాలజీ ఇండియాలో కూడా సాధ్యమే’ అని! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ విజయం ఆ కంపెనీ వ్యవస్థాపకుల సమర్థతకు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ‘మన దేశం–మన కంపెనీ’ అని కలలు కనే ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్ల విజయం. ‘మేధోవలస’కు చేయి అడ్డు పెట్టి...‘ఎక్కడో ఎందుకు? మన దేశంలోనే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చే విజయం....‘పీహెచ్డీలు ముఖ్యం కాదు. కంపెనీకి సరిగ్గా అవసరమైన వారే ముఖ్యం’ అంటూ ఎంటర్ప్రెన్యూర్లుగా స్వదేశంలో ప్రయాణం మొదలుపెట్టిన వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్లు ‘సర్వం ఏఐ’తో సత్తా చాటారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) నుంచి నిన్నా మొన్నటి ‘సర్వం కేజ్’ స్మార్ట్గ్లాసెస్ వరకు, ఏ.ఐ మోడల్స్ శిక్షణకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం వరకు... సర్వం సాంకేతికమయం!సర్వం సక్సెస్ మంత్రాఒక స్టార్టప్ సక్సెస్ కావడానికి, సూపర్ సక్సెస్ కావడానికి ఏం ఉండాలి? ‘సర్వం ఏఐ’ ఫౌండర్లలో ఒకరైన వివేక్ రాఘవన్ మాటల్లో చె΄్పాలంటే ‘ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి’ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ మోడల్స్ను నిర్మించాలనే లక్ష్యంతో బయలుదేరింది సర్వం. ‘మా విజయం ఎలా ఉండాలంటే ఇతర డెవలపర్లు, స్టార్టప్లు కూడా యస్...మేము కూడా ప్రపంచంతో ΄ోటీ పడుతూ వరల్డ్–క్లాస్ మోడల్స్ను నిర్మించగలం అనే నమ్మకాన్ని పాదుకొల్పేంతగా’ అన్నారు వివేక్. ‘వీరి ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంది. సాధించగలరా?’ అని కొందరికి సందేహం వచ్చింది.పగటి కలలకే పరిమితమై ఉంటే వారి కలలు కలలుగానే ఉండేవి. అయితే వారు రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు.ఇది యువత విజయంతొలి అడుగులు వేస్తున్నప్పుడు ‘సర్వం’ టీమ్లో ఉన్నది సాంకేతిక ఉద్దండులు కాదు. నవ యువకులు! ‘వీరితో విజయం సాధ్యమా?’ అని కూడా కొందరికి సందేహం వచ్చింది. ‘కచ్చితంగా సాధ్యమే’ అని నిరూపించింది సర్వం. అందుకే...‘‘మా సంస్థ విజయాన్ని భారతదేశ యువత విజయంగా కూడా నేను భావిస్తున్నాను’ అంటారు వివేక్. ఎంటర్ప్రెన్యూర్గా సిలికాన్ వ్యాలీలో గెలుపు జెండా ఎగరేసిన తరువాత స్వదేశీ బాట పట్టారు. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి బయలుదేరారు.పీహెచ్డీ... పెద్ద విషయం కాదు!‘మీ ఇద్దరికీ పీహెచ్డీ ఉంది. సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లు పీహెచ్డీ చేసిన డీప్–టెక్ వ్యవస్థాపకులు మన దేశంలో పెద్దగా కనిపించరు’ అనే ప్రశ్నకు ‘నిజమే!’ అని కాలర్ ఎగరేయలేదు వివేక్. ‘పీహెచ్డీ అనేది పెద్ద విషయం కాదు. సంస్థకు పనికొచ్చే సామర్థ్యమే ముఖ్యం. పీహెచ్డీ వరకు ఎందుకు? హైస్కూల్ స్థాయిలో కూడా అద్భుత ప్రతిభæ చూపుతున్న విద్యార్థులను మనం చూస్తూనే ఉన్నాం. నాకు పీహెచ్డీ ఉన్నప్పటికీ దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. పీహెచ్డీలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. కంపెనీకి అవసరమైన సరిౖయెన వ్యక్తిని ఎంచుకోవడమే ముఖ్యం’ అంటారు వివేక్.వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్లు వ్యవస్థాపనలో బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ 2023లో ప్రారంభమైంది. భారతీయ భాషలలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేసింది. స్పీచ్–టు–టెక్ట్స్, విజన్–లాంగ్వేజ్ మోడల్స్లాంటి మల్టీ మోడల్స్ను, సిస్టమ్స్ను కూడా కంపెనీ డెవలప్ చేసింది. ‘సర్వం విజన్’ పేరుతో విజన్–లాంగ్వేజ్ మోడల్ని పరిచయం చేసింది.గత సంవత్సరం సర్వం ఏఐ ‘ఇండియా ఏఐ మిషన్’కు ఎంపికైంది. డొమెస్టిక్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్ డెవలప్మెంట్కు ఈ మిషన్ స΄ోర్ట్ చేస్తుంది. ‘ఏఐ ఫర్ భారత్’తో పాటు లాంగ్వేజ్ డాటాబేస్, స్పీచ్ రిసెర్చ్కు సంబంధించి విద్యాసంస్థలతో కలిసి పనిచేసింది సర్వం. ఇద్దరూ ఇద్దరేవివేక్ రాఘవన్ ఐఐటీ–దిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఐఐటీ–బాంబే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రత్యూష్ కుమార్కు కంప్యూటర్ సైన్స్ పరిశోధనకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. జ్యూరిచ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఇద్దరు ప్రతిభావంతులు ఒక దగ్గర చేరితే అద్భుతాలు జరుగుతాయనేది నిజమే అయినా, ఆ ప్రతిభావంతులు తమలాంటి వారి కోసం అన్వేషించి, తమ జట్టులో చేర్చుకోవడమే అసలుసిసలు అద్భుతం.రిస్క్ తీసుకోక΄ోవడమే పెద్ద రిస్క్!సిలికాన్ వ్యాలీ తన ఆలోచన తీరును మార్చింది అంటారు వివేక్ రాఘవన్. ‘మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే కచ్చితంగా రిస్క్ తీసుకోవాలి’ అనేది సిలికాన్ వ్యాలీ చెప్పిన పాఠం. ‘ఇతరత్రా రిస్క్లతో ΄ోల్చితే టెక్నాలజీ రిస్క్ అనేది భిన్నమైది’ అనే విషయం తెలిసినా ‘సై’ అంటూ స్వదేశీ బాట పట్టారు వివేక్ రాఘవన్.నెట్ అవసరం లేదండీ!‘ఎడ్జ్’ అనే కొత్త ఆన్–డివైజ్ ఏఐ మోడల్ను ఆవిష్కరించింది సర్వం ఏఐ. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా నేరుగా స్మార్ట్ఫోన్, లాప్టాప్లలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. స్పీచ్ రికగ్నిషన్, ట్రాన్స్లేషన్, టెక్స్›్ట–టు–స్పీచ్లాంటి పనులెన్నో చేస్తుంది. డివైజ్లోనే డాటా ప్రాసెస్ చేయబడినందున యూజర్లు సమాచారాన్ని క్లౌడ్కు పంపాల్సిన అవసరం లేదు. ‘ఈ మోడల్ వేగం, గోప్యత, విశ్వసనీయతపై దృష్టి సారిస్తుందని, అదే సమయంలో ప్రధాన భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది.ఇండస్ స్వదేశీ స్టార్టప్ సర్వం ఏఐ ‘ఇండస్’ అనే కొత్త ఏఐ చాట్బాట్ యాప్ను తీసుకువచ్చింది. ‘భారతీయ వినియోగదారుల కోసం భారత్లో రూపొందించిన యాప్ ఇది’ అని ప్రకటించింది కంపెనీ. చాట్జీపీటీ, జెమినివంటి ప్రసిద్ధ చాట్బాట్ల మాదిరిగానే ‘ఇండస్’లో ఫీచర్లు ఉన్నాయి. యూజర్లు వాయిస్ కమాండ్లు ఇవ్వవచ్చు. ప్రశ్నలను టైప్ చేయడానికి బదులుగా మాట్లాడవచ్చు. ఏఐ వెబ్లో శోధించవచ్చు. స్పష్టమైన సమాధానాలను తెలుసుకోవచ్చు, లోతైన పరిశోధన చేయవచ్చు. నేరుగా యాప్లోనే డాక్యుమెంట్లు రాయవచ్చు. ఇమేజ్లు, పీడీఎఫ్లు, ఫైళ్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లోని మరో ప్రత్యేకత భాషా సౌలభ్యం. -
ఏఐకి భయపడం
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ)తో నెలకొన్న రిస్కుల గురించి తమ సంస్థ భయపడబోదని దేశీ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎండీ కె. కృతివాసన్ స్పష్టం చేశారు. కంపెనీ ఆదాయం తగ్గినా ఫర్వాలేదు కానీ ఏఐ సాధనాలను వినియోగించుకోవడాన్ని నేర్చుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొత్తం 6 లక్షల మంది ఉద్యోగుల్లో ప్రతీ ఒక్కరు కృత్రిమ మేధలో నిష్ణాతులుగా మారేలా ప్రయతి్నస్తున్నట్లు వివరించారు. ఇదే క్రమంలో కొంత భాగం ఆదాయాన్ని కోల్పోయినా, వివిధ ప్రాజెక్టుల్లో ఏఐని ఉపయోగించే విధానాలను అన్వేషించాలని సిబ్బందికి సూచించినట్లు కృతివాసన్ తెలిపారు. యువ సిబ్బందితో పోలిస్తే కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్ని రూపొందించడంలో సీనియర్ ఉద్యోగులు కాస్త నెమ్మదిగా ఉంటున్న విషయాన్ని గమనించినట్లు వార్షిక నాస్కామ్ టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం (ఎన్టీఎల్ఎఫ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. కొత్త ఏఐ నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదని, అందరూ వాటిపై ఆసక్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, నైపుణ్యాలంటే చాట్జీపీటీ లాంటి ప్లాట్ఫాంకి ప్రాంప్్టలు ఇవ్వడం మాత్రమే కాదని, సిబ్బంది శ్రమించి ఏఐ సాధనాలతో కొత్త సొల్యూషన్స్ను రూపొందిస్తేనే ప్రయోజనకరమని కృతివాసన్ చెప్పారు. ఏఐ ప్రస్తుతం బోర్డు స్థాయి సమావేశాల్లోను ప్రధాన ఎజెండాగా ఉంటోందన్నారు. కొత్త టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని, కానీ, అలాంటి సాంకేతికతలతో తమ కస్టమర్లకు ఏవిధంగా ప్రయోజనం చేకూర్చగలం అనే అంశంపై కూడా తాము ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. -
ఏఐ: సానుకూలం సగం.. ఆందోళన అధికం
వాషింగ్టన్: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో నేటి యువత ముందుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంలో అమెరికాలోని టీనేజర్లు ఆసక్తికర ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో దాదాపు 64 శాతం మంది చాట్జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ చాట్బాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు.కేవలం వినోదం కోసమే కాకుండా, సమాచార సేకరణ, పాఠశాల హోంవర్క్, కంటెంట్ను క్లుప్తీకరించడం వంటి పనుల కోసం యువత ఏఐపై ఆధారపడుతున్నారు. వచ్చే రెండు దశాబ్దాలలో ఏఐ తమ వ్యక్తిగత జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని 36 శాతం మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చదువులో ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది టీనేజర్లు ఏఐ వల్ల విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి క్షీణించే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు.సామాజికంగా చూస్తే 31 శాతం మంది ఏఐ వల్ల మేలు జరుగుతుందని భావిస్తుండగా, 26 శాతం మంది ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని అంటున్నారు.చదువుల విషయంలో ఏఐ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. సుమారు 51 శాతం మంది విద్యార్థులు తమ అకడమిక్ అవసరాల కోసం చాట్బాట్ల సహాయం తీసుకుంటున్నారు. గణిత సమస్యల పరిష్కారం నుంచి వ్యాస రచన వరకు ఏఐ వినియోగం విస్తరించింది. అయితే, ఏఐను కేవలం సహాయకారిగా మాత్రమే కాకుండా, పరీక్షల్లో కాపీ కొట్టడానికి (Cheating) వినియోగిస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.59 శాతం మంది విద్యార్థులు తమ తోటివారు ఏఐ సహాయంతో మోసాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల అవసరాలు ఎలా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మాత్రం భిన్నంగా ఉంది. సమాచార సేకరణకు ఏఐను అనుమతించే 80 శాతం మంది తల్లిదండ్రులు, వ్యక్తిగత విషయాల్లో లేదా భావోద్వేగ మద్దతు కోసం ఏఐపై ఆధారపడటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇది కూడా చదవండి: కేరళ ‘కేరళం’.. బెంగాల్ ‘బంగో’ అయ్యేదెన్నడు? -
సవాళ్లున్నా సాఫ్ట్వేర్దే హవా
ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్డ్ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు. నివేదిక ప్రకారం.. ⇒ ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్ డాలర్ల నుంచి 149 బిలియన్ డాలర్లకు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రెవెన్యూ 55 బిలియన్ డాలర్ల నుంచి 59 బిలియన్ డాలర్లకు, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ⇒ ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఆదాయాలు 59 బిలియన్ డాలర్ల నుంచి 63 బిలియన్ డాలర్లకు, హార్డ్వేర్ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్ డాలర్ల నుంచి 21 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి. ⇒ గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం. ⇒ విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ⇒ చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. -
ఏఐతో ఐటీకి ఇబ్బందే...
ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్ రాకతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్ విషయంలో ఆంథ్రోపిక్ క్లాడ్ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడింగ్ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు. ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్ చెప్పారు. క్లయింట్లకు భారీగా బిల్లింగ్ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు. -
ఏఐ విప్లవం: భారత్ ముందున్న అతిపెద్ద సవాల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో అగ్రగామిగా నిలుస్తోంది. గ్లోబల్ జాబ్ పోర్టల్ ‘ఇన్డీడ్’ (Indeed) 12 దేశాల్లో నిర్వహించిన తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయ యజమానులు, అభ్యర్థులు ఏఐ వినియోగంపై అత్యంత సానుకూలత కనబరుస్తున్నారు.బ్రిటన్ వంటి దేశాల్లో 60 శాతానికి పైగా అభ్యర్థులు ఉద్యోగ వేటలో ఏఐ సాధనాలను వాడేందుకు విముఖత చూపుతుండగా, భారత్లో కేవలం 5 శాతం మంది యజమానులు, 8 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఈ సాంకేతికతకు దూరంగా ఉండటం గమనార్హం. గత దశాబ్ద కాలంలో భారత్ మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ విద్య వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా స్వీకరించడంతో ఏఐ అనేది ఒక అడ్డంకిలా కాకుండా అవకాశాలను మెరుగుపరిచే ఒక సాధనంగా భారతీయులు భావిస్తున్నారు.నియామక ప్రక్రియలో ఏఐ ప్రవేశం కేవలం ఒక మార్పు మాత్రమే కాదని, అది అపారమైన వేగాన్ని ఇస్తుందని భారత్లోని పలు సంస్థలు నమ్ముతున్నాయి. వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులను వడపోసి, సరైన అభ్యర్థులను గుర్తించడంలో ఏఐ ఒక అద్భుతమైన ‘ఎనేబులర్’గా పనిచేస్తోంది. అయితే ఈ సాంకేతికత స్క్రీనింగ్, మ్యాచింగ్కు మాత్రమే పరిమితం కావాలని, తుది నిర్ణయం మాత్రం మానవ మేధస్సుతోనే జరగాలనే ఒక అప్రకటిత ఒప్పందం యజమానులకు, అభ్యర్థులకు మధ్య కొనసాగుతోంది.మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ పునీత్ చందోక్ అంచనా వేసినట్లుగా, రాబోయే మూడేళ్లలో ఏఐ ఉద్యోగాలను హరించడం కంటే సృష్టించడమే ఎక్కువగా ఉంటుందనే ధీమా భారత మార్కెట్లో కనిపిస్తోంది. భారీ జనాభా, తీవ్రమైన పోటీ ఉన్న భారతదేశంలో నియామకాల్లో జరిగే గందరగోళాన్ని తగ్గించడానికి ఆటోమేషన్ ఒక ఒక అనివార్యమైన అవసరంగా మారింది. ఆటోమేటెడ్ వ్యవస్థలు కేవలం 'కీ వర్డ్స్' ఆధారంగా ప్రొఫైల్స్ ఎంపిక చేస్తున్నాయని, అభ్యర్థిలోని ప్రతిభను, అనుభవాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.ఏఐ ఏజెంట్స్ అల్గారిథమ్స్ నమూనాలను మాత్రమే గుర్తించగలవు కానీ, ఒక వ్యక్తిలోని పట్టుదలను, సృజనాత్మకతను అంచనా వేయలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఏఐని స్వీకరించడంలో ముందున్నప్పటికీ, నియామకాల్లో పారదర్శకత, వివక్ష లేని అల్గారిథమ్స్, పటిష్టమైన పర్యవేక్షణ మార్గదర్శకాలు అత్యవసమని చెబుతున్నారు. సాంకేతికతను వాడుకోవడమే కాకుండా, దాన్ని ఎంత నైతికంగా అమలు చేస్తున్నామనేదే భారత్ ముందున్న అసలైన సవాలని నిపుణులు అంటున్నారు. నియామక ప్రక్రియలో మానవత్వపు విలువలను కోల్పోకుండా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే భారత్ ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: అమెరికా: మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన జనజీవనం -
దమ్ముంది.. దన్ను కావాలి
ఏఐ సదస్సు చూపిన ‘ఇంపాక్ట్’ఢిల్లీలో ఐదు రోజుల ఐఏ ఇంపాక్ట్ సదస్సు ఇటీవలే ముగిసింది. ఇండియా ఈ సదస్సును మొదటిసారి నిర్వహించింది. ప్రపంచ దేశాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలపై అంతా దృష్టి పెట్టారు. ఇండియాకైతే ఇది ఒక కీలకమైన సందర్భం. మన ఏఐ వ్యవస్థలో ఉన్న బలాలు, పూరించుకోవలసిన లోట్లను ఈ సదస్సు స్పష్టం చేసింది.నిపుణుల సంఖ్యలో రెండో స్థానంఏఐ రంగంలో మెరికలు ఉన్న దేశంగా ఇండియా పేరు పొందింది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉంది. 2024 ‘టార్టాయిస్ గ్లోబల్ ఏఐ ఇండెక్స్’ ప్రకారం, ఏఐ సామర్థ్యంలో ఇండియా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. ఏఐ నిపుణుల సంఖ్యలో మాత్రం 2వ స్థానంలో నిలిచింది.సౌకర్యాలలో 68వ స్థానంఏఐ ఆపరేషన్స్లో ఇండియా 3వ స్థానంతో మంచి ప్రతిభ కనబరిచింది. అయితే కంప్యూటింగ్ పవర్, ఇతర సౌకర్యాల విషయంలో 68వ స్థానంలో ఉంది. ఈ కారణంగా అమెరికా, చైనాతో పోటీ పడటం భారత్కు కష్టం కావచ్చన్న అభిప్రాయం ఏఐ పరిశ్రమంలో వ్యక్తం అవుతోంది.ఉన్నది కొన్నే సూపర్ కంప్యూటర్లుప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన 500 సూపర్ కంప్యూటర్లలో ఇండియా వాటా కేవలం 1 శాతం మాత్రమే. అంటే, ఏఐకి కావలసిన కంప్యూటింగ్ సామర్థ్యం మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అమెరికా ఈ విషయంలో చాలా ముందుంది. ప్రపంచంలోని మొత్తం సూపర్ కంప్యూటర్లలో 35 శాతం సిస్టమ్లు, దాదాపు 48 శాతం కంప్యూటింగ్ సామర్థ్యం అమెరికా దగ్గరే ఉంది.ట్రైనింగ్ డేటాలో 3 శాతం వాటాఏఐ ట్రైనింగ్ డేటా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులలో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే. అంటే, మన దేశానికి చాలా తక్కువ పెట్టుబడులు అందుతున్నాయి. ఈ విషయంలో అమెరికా 56 శాతంతో అందరికంటే ముందుంది. ఆ తర్వాత చైనా 17 శాతంతో, ఐరోపా సమాఖ్య దేశాలు 15 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రపంచాన్ని శాసించగలమా?మన దగ్గర అద్భుతమైన తెలివితేటలు కలిగిన నిపుణులు ఉన్నారు. కానీ, ఆ తెలివితేటలకు తగ్గట్టుగా శక్తివంతమైన కంప్యూటర్లు, భారీ పెట్టుబడులు తోడవాల్సి ఉంది. అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే, కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యం మాత్రమే సరిపోదు; సొంతంగా డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లను పెంచుకోవాలి. అప్పుడే ఇండియా ఏఐ ప్రపంచాన్ని శాసించ గలుగుతుంది.⇒ హెచ్.పి.సి. సిస్టమ్ : హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ (యంత్ర సామర్థ్యం)⇒ హెచ్.పి.సి. కెపాసిటీ : హై పెర్ఫార్మింగ్ కెపాసిటీ (శక్తి సామర్థ్యం)⇒ హెచ్.ఐ.సి.: హై ఇన్కం కంట్రీస్; యు.ఎం.ఐ.సి.: అప్పర్ మిడిల్ ఇన్కం కంట్రీస్⇒ ఎల్.ఎం.ఐ. సి. : లోయర్–మిడిల్ ఇన్కం కంట్రీస్ -
ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్, మెడికల్ వంటి కీలకమైన కోచింగ్నూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేయబోతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బిజినెస్ కన్సల్టెన్సీ ఇన్ఫీనియం సంస్థ ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల మార్కెట్ రీసెర్చ్ నివేదికను వెల్లడించింది. మారుతున్న ట్రెండ్కు అనుకూలంగా కోచింగ్ విధానాలను ఏఐతో ఆధునీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థల తోడ్పాటును ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు ఇప్పటికే తీసుకున్నాయి. నీట్, జేఈఈ రాసే విద్యార్థుల్లో 80 శాతం మంది కోచింగ్పైనే ఆధార పడుతున్నారు. 2022 వరకూ కోచింగ్ కేంద్రాల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రూ.70 వేల కోట్లకు చేరింది. 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే, ఏఐ ఆధారిత మాడ్యూల్స్ను జోడించడం వల్ల ఇది 2028 నాటికి 2.5 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ కేంద్రాలు మార్కెట్లో పబ్లిసిటీకి ఏటా రూ.150 కోట్లకుపైగానే ఖర్చు పెడుతున్నాయి. ఈ లాంగ్వేజ్ కీలకం పైథాన్ లాంగ్వేజ్ ఆధారంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. నీట్, జేఈఈ వంటి వాటిల్లో అనలైటిక్స్, స్టూడెంట్ ప్రొఫైలింగ్, అనుమానాల నివృత్తి చేసే బాట్స్ మొత్తం ఏఐతోనే పనిచేస్తాయి. ఇవి ప్రశ్నల్లో ఉన్న కఠినత్వం, వాటి పరిష్కారం, మాక్ టెస్టుల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత స్టడీ ప్లాన్ రూపొందిస్తాయి. లైవ్ డాష్బోర్డ్, ఏఐ చాట్బాట్లను రూపొందిస్తున్నారు. ర్యాంక్ ప్రిడిక్షన్ ద్వారా సీటు ఎక్కడ వస్తుందనే కౌన్సెలింగ్ ప్లానింగ్ కూడా ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్, అటెన్షన్ మాడ్యూల్స్ ప్రిపరేషన్ స్థాయిని పెంచేలా ప్రొగ్రామ్ చేస్తున్నారు. కెమికల్ ఎడ్యుకేషన్ పార్శింగ్, ఆర్గానిక్ రియాక్షన్ స్వీకెన్స్ అనాలసిస్ ఏఐ అందిస్తుంది. సింబాలిక్ రీజనింగ్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ లాజిక్, వెక్టార్ అండ్ మ్యాట్రిక్స్ ఇంటర్ప్రిటేషన్ వంటి మ్యాథ్స్ ఆధారిత ప్రోగ్రామింగ్లోనూ ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది. ఒత్తిడి పెరుగుతుందా? తగ్గుతుందా? కోచింగ్ కేంద్రాలు ఏఐ మాడ్యూల్స్ను అనుసరిస్తున్నాయి. అయితే, దీనిపై ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇందుకు అవసరమైన ప్లాట్ఫాం ఏర్పాటు చేయాలి. దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేపోతున్నారు. ఈ దశలో ఏఐ మాడ్యూల్స్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు మానసిక ఒత్తిడి వస్తుందని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్స్కు ఏటా 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. కోచింగ్ కేంద్రాలు ర్యాంకులు సాధించే మెరిట్ విద్యార్థులను విడగొట్టి క్లాసులు నిర్వహిస్తాయి. వీళ్లు 20 శాతమే ఉంటున్నారు. మిగతా వాళ్లను నాణ్యత లేని ఫ్యాకల్టీతో కాలం వెళ్లదీస్తున్నాయి. ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహ్యలు చేసుకుంటే, 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 నాటికి ఇది 13 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. ఈ పరిస్థితికి వెళ్లకుండా ఆన్లైన్ కేంద్రాలపై నియంత్రణ అవసరమని ఐఐటీ–బాంబే అధ్యాపకుడు నీలం త్రివిక్రమ్ సూచించారు. కేంద్ర కమిటీ అధ్యయనం జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ గత ఏడాది కమిటీ వేసింది. కేంద్ర ఉన్నత విద్య కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ను ఇందులో సభ్యులుగా చేర్చింది. కోచింగ్తో పనిలేకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల పబ్లిసిటీ, నాణ్యత ప్రమాణాలను ఈ కమిటీ పరిశీలించాలి. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, స్కూల్ విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇప్పుడు ఏఐ పాత్ర పెరుగుతుండటంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. నిఘా అవసరం... రాష్ట్రానికి మండలి నివేదిక ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై సరైన నియంత్రణ ఉండాలన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయం. ఈ మేరకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గతంలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. అకడమిక్ పాఠాల వల్ల ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారని, ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పాదర్శకంగా అన్పించడం లేదన్నారు. దీనివల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని, కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదని, ఫీజుల భారం పేదవాళ్లను కుంగదీస్తోందని తెలిపారు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వాడకం వల్ల విద్యా ఫలితాలు దెబ్బతింటున్నాయని గుర్తించారు. . తప్పుడు అంచనాలు, ఆర్థిక నష్టాలు, విద్యా అంతరాయాలు పెంచుతున్నాయని తెలిపారు.


