టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే.. | N Chandrasekaran Says TCS To Add AI Agents Alongside Human Workforce, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే..

May 29 2025 9:02 AM | Updated on May 29 2025 10:12 AM

TCS to add AI agents alongside human workforce N Chandrasekaran

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ఏదో ఆషామాషీ టెక్నాలజీ కాదని, మానవ జాతి పురోగమనాన్ని మలుపు తిప్పే ఒక శక్తివంతమైన సాధనమని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ బోర్డు, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. అన్ని పరిశ్రమలకూ ఇది ప్రయోజనకరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీ స్థాయిలో రూపొందిస్తామని చంద్రశేఖరన్‌ చెప్పారు.

భవిష్యత్తులో ‘హ్యూమన్‌ ప్లస్‌ ఏఐ‘ మోడల్‌ కింద సర్వీసులు అందిస్తామని షేర్‌హోల్డర్లకు టీసీఎస్‌ మాతృ సంస్థ టాటా సన్స్‌కి కూడా చైర్మన్‌ అయిన చంద్రశేఖరన్‌ తెలిపారు. అలాగే, ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పారు.

హార్డ్‌వేర్‌ ప్రొవైడర్లు, సొల్యూషన్స్‌ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని వివరించారు. ఏఐ సాంకేతిక వినియోగంలో టీసీఎస్‌ ముందు వరుసలో ఉంటోందని, పలు సొల్యూషన్స్‌లో దీన్ని ఉపయోగిస్తోందని చంద్రశేఖరన్‌ తెలిపారు. ‘టీసీఎస్‌ విజ్‌డంనెక్ట్స్‌’ పేరిట కంపెనీల కోసం జెన్‌ ఏఐ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

👉 ఇది చదివారా? జాబ్‌ చేంజ్‌ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement