-
ఒడిదుడుకులకు సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: కొత్త ఏడాది (2024)లో అంతర్జాతీయంగా గవర్నెన్స్లో సంక్లిష్టత స్థాయి మరింతగా పెరుగుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. మరిన్ని ఒడిదుడుకులు, మరింత విప్లవాత్మక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరివర్తన చెందుతున్న క్రమంలో టాటా గ్రూప్ .. కొత్త ఏడాదిలో ప్రణాళికల అమలు, కస్టమరు సంతృప్తి, టెక్నాలజీ అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని చెప్పారు. భౌగోళిక, రాజకీయ ఆందోళనలు మొదలుకుని జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరకు వివిధ ట్రెండ్స్తో 2023లో ప్రపంచం అస్థిరపర్చే ధోరణులను ఎదుర్కొందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ గవర్నెన్స్ విధానాలను సంక్లిష్టంగా మార్చాయని, మార్పులకు తప్పనిసరిగా అలవాటు పడేలా ఒత్తిడి తెచ్చాయని ఆయన వివరించారు. 2023లో టాటా గ్రూప్ మెచ్చుకోతగిన విధంగా రాణించిందన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో, కొత్త గిగాఫ్యాక్టరీలు మొదలైనవి రాబోయే దశాబ్దాల్లో మరింత వృద్ధికి దోహదపడగలవని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్ టీమ్ కనపర్చిన ఆత్మవిశ్వాసం, చంద్రయాన్ మిషన్ 2023లో గుర్తుండిపోయే రెండు కీలకాంశాలని ఆయన పేర్కొన్నారు. -
భారత వృద్ది, ఏఐపై టాటా చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు
నేడు( ఆగస్ట్ 25న) న్యూ ఢిల్లీలో ప్రారంభమైన మూడు రోజుల B20 సమ్మిట్ ప్రారంభ సెషన్ను ఉద్దేశించి, B20 చైర్ నటరాజన్ చంద్రశేఖరన్ భారతదేశ పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అభివృద్ధి ప్రయాణం ప్రపంచ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ఇది తక్కువ లేదా నైపుణ్యం లేని ఎక్కువ మందికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి సాధికారత నిస్తుందన్నారు. B20 సమ్మిట్ ఇండియా 2023లో జరిగిన ప్యానెల్ చర్చలో, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, భారతదేశం టెక్నో-లీగల్ విధానాన్ని తీసుకోవడం ద్వారా డేటా గోప్యత, రక్షణకు సంబంధించి "అద్భుతమైన పురోగతి"ని సాధించిందన్నారు. గత డిసెంబర్లో 2023కి బి20 చైర్గా ఎంపికైన చంద్రశేఖరన్ ప్రధానమంత్రి గతి శక్తి పథకం, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలు, తక్కువ కార్పొరేట్ పన్నులు, సాలిడ్ డిజిటల్ వంటి అనేక అంశాలు ప్రస్తుతం దేశ వృద్ధిని నడిపిస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ లాంటి జి20 దేశాలలో భారత్ బుల్లిష్ ధోరణికి సహాయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వాస్తవానికి మనలాంటి దేశంలో, ఉద్యోగాలను సృష్టిస్తుందనీ, ఎందుకంటే ఇది తక్కువ నైపుణ్యం లేదా నైపుణ్యం లేని వ్యక్తులను మరింత శక్తివంతం దనీ, వారికున్న సమాచార నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయగలరన్నారు. దీనికి ఒక నర్సు ఉద్యోగాన్ని ఉదాహరణగా చెప్పారు. ఏఐ ద్వారా నర్సు ఒక వైద్యుని పనిభారాన్ని తగ్గించగలదని పేర్కొన్నారు. అయితే దీని వివిధ మార్కెట్లలో మరియు సమాజంలోని వివిధ విభాగాలలో భిన్నంగా ఉంటుందన్నారు. అయితే ప్రతిచోటా (AI) ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇది ఉన్నత స్థాయి ఉద్యోగాలతో ప్రజలను శక్తివంతం చేస్తుందని చంద్రశేఖరన్ నొక్కిచెప్పారు. దేశంలో వందల మిలియన్ల మంది ప్రజలకు ఏఐ అందుబాటులోకి రావాలనేది తమ భావన అనీ, ప్రజలు మార్కెట్లోకి రాబోతున్న 250 - 300 మిలియన్ల మందిరానున్నారి చెప్పారు. వీటికి ఏఐ సేవల్ని వినియోగిస్తే మొత్తం GDPని ప్రభావితం చేస్తుందని, అలాగే వారి తలసరి ఆదాయం పెరుగడం లాంటి చాలా ప్రయోజనాలున్నాయని ఆయన చెప్పారు. అలాగే ఇండియా ఐటీ చట్టంద్వారా డేటా గోప్యత, రక్షణ విషయంలో భారతదేశం పెద్ద పురోగతిని సాధించిందని, మరోవైపు తాము సృష్టించిన DEPA(ప్రైవేట్ యాప్స్కి అవసరమైన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్) రెండూ కలిసి పని చేయడం మంచి పరిణామమన్నారు. కాగా G 20 18 వ సదస్సు భారతదేశం వేదికగా 2023 September లో జరగబోతుంది. -
బ్రిటన్లో టాటా గిగాఫ్యాక్టరీ!
ముంబై/లండన్: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా బ్రిటన్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల తయారీ కోసం గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు తెలిపింది. తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వాహనాలతో పాటు ఇతరత్రా సంస్థల కోసం కూడా ఇందులో బ్యాటరీలను తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 నుంచి ఈ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీల వాటా దాదాపు సగం పైగా ఉంటుంది. వేల కొద్దీ ఉద్యోగాలకు ఊతం.. గిగాఫ్యాక్టరీపై పెట్టుబడులతో స్థానికంగా 4,000 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, సరఫరా వ్యవస్థలో పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించగలదని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి తమకు అవసరమయ్యే బ్యాటరీల్లో ఈ ప్లాంటు దాదాపు సగభాగం ఉత్పత్తి చేయగలదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్లాలన్న తమ లక్ష్యం మరింత వేగవంతంగా సాకారం కాగలదని వివరించారు. భారీగా సబ్సిడీలు.. గిగాఫ్యాక్టరీ కోసం బ్రిడ్జ్వాటర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు జేఎల్ఆర్ మాతృ సంస్థ టాటా సన్స్ తెలిపింది. 40గిగావాట్అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో ఇది యూరప్లోని భారీ గిగాఫ్యాక్టరీల్లో ఒకటిగాను, భారత్కు వెలుపల టాటా గ్రూప్నకు తొలి భారీ గిగాఫ్యాక్టరీగా నిలవనుంది. 1980ల్లో నిస్సాన్ రాక తర్వాత బ్రిటన్ ఆటోమోటివ్ రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం టాటా గ్రూప్నకు ప్రభుత్వం నుంచి వందల కొద్దీ మిలియన్ పౌండ్ల మేర ప్లాంటుకు సబ్సిడీల హామీ లభించి ఉంటుందని పేర్కొన్నాయి. విద్యుత్, గ్రాంటు, సైటుకు రహదారిని మెరుగుపర్చటం తదితర రూపాల్లో 500 మిలియన్ పౌండ్ల మేర సబ్సిడీలు అందించాలని ప్రభుత్వాన్ని టాటా గ్రూప్ కోరినట్లు సమాచారం. అయితే, ఇటు టాటా గ్రూప్, అటు బ్రిటన్ ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. పారదర్శక విధానాల్లో భాగంగా వీటిని తర్వాత ప్రచురించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్లో ప్రస్తుతం ఒక్క బ్యాటరీల తయారీ ప్లాంటు ఉంది. కొత్తగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్లో 35 పైచిలుకు ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తుండగా, కొన్ని నిర్మాణంలోనూ, కొన్ని ప్రతిపాదనల దశల్లోనూ ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు.. ‘బిలియన్ల కొద్దీ పౌండ్ పెట్టుబడులు, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసే ప్లాంటు.. ఆటోమోటివ్ రంగం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లేందుకు తోడ్పడగలదు. ఇప్ప టికే బ్రిటన్లో వివిధ రంగాల్లో మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్రిటన్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపేందుకు తాజా ఇన్వెస్ట్మెంట్ నిదర్శనం‘ అని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ‘భారత్కు వెలుపల తమ తొలి భారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోవడమనేది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, నిపుణులపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా ఆటోమోటివ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది’ – బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
రూ.100 కోట్ల స్కాం: నలుగురు కాదు ఆరుగురు ఉద్యోగులపై టీసీఎస్ చర్యలు
ముంబై: కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలతో కుమ్మక్కై, వాటికి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించినందుకు గాను ఆరుగురు ఉద్యోగులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చర్యలు తీసుకుంది. నైతిక నియమావళిని పాటించలేదని విచారణలో తేలడంతో ఆరుగురు ఉద్యోగులను, అలాగే ఆరు సంస్థలను నిషేధించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపైనా సంస్థ విచారణ జరుపుతోందని ఆయన షేర్హోల్డర్లకు వెల్లడించారు. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్వర్త్) కొందరు ఉద్యోగుల తప్పుడు ప్రవర్తన గురించి ఇద్దరు ప్రజావేగుల నుంచి కంపెనీకి ఫిర్యాదులు రావడం, టీసీఎస్లో ఉద్యోగాలకు లంచాలు తీసుకుంటున్నారని.. తత్సంబంధ వ్యక్తులు ఈ రకంగా కనీసం రూ. 100 కోట్లు సంపాదించారని ఇటీవల మీడియాలో వార్తలు రావడం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, సంపన్న దేశాల్లో అనిశ్చితితో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, అయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా?) -
గ్లోబల్ ఎకానమీపై వడ్డీరేట్ల పెరుగుదల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఎకానమీ వృద్ధిపై వచ్చే యేడాది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లకు తెలిపారు. టాటా గ్రూప్నకు చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2022–23కు సంబంధించిన వార్షిక నివేదికలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి కీలక వ్యాసం రాశారు. వడ్డీరేట్ల పెరుగుదల బ్యాంకింగ్ రంగంపై కనపడని ప్రభావం చూపవచ్చని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆయన సందేశంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీని కట్టడికి వడ్డీరేట్ల పెంపుదలకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే అంశం బ్యాంకింగ్ రంగంపై కొంత ఒత్తిడిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ► ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, మహమ్మారి సవాళ్లు, సైనిక సంఘర్షణలు, పెరుగుతున్న అసమానతలు, సప్లై చైన్ సవాళ్లు వంటి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థలు అలాగే సమాజాలలో నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ► మరోవైపు డిజిటల్ ట్రాన్సిషన్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ ప్రధాన స్రవంతి అవుతున్నాయి. సంస్థ విషయానికి వస్తే, టాటా గ్రూప్ పటిష్ట వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది. టాటా మోటార్స్ అనేక సవాళ్లను అధిగమించి పటిష్ట స్థానానికి వెళ్లడం ప్రారంభించింది. ► రాబోయే సంవత్సరం సంస్థకు చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో మనం గరి్వంచే పనితీరుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇందుకు సంబంధించి సాంకేతిక పురోగతి చోటుచేసుకోనుంది. -
భారత్ నాయకత్వ పాత్ర పోషించాలి
దావోస్: భారత్ ఇటీవలి కాలంలో మార్పు దిశగా చక్కని వైఖరి ప్రదర్శించిందని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలంగా పైకి తీసుకొచ్చేందుకు భారత్ నాయతక్వం పోషించాల్సిన స్థానంలో ఉన్నట్టు టాటా గ్రూపు చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా.. ‘10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మార్గం’ అనే అంశంపై చర్చా కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో భారత్ ప్రావీణ్యం సంపాదించినట్టు చెప్పారు. భారత్ అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని, భారత్ను అనుకూల స్థితిలో ఉంచేందుకు కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటన్నారు. ‘‘భారత్ కరోనా సమయంలో గొప్ప పనితీరు చూపించింది. కావాల్సిన టీకాలను భారత్లోనే తయారు చేసుకోవడాన్ని చూశాం. డిజిటల్ దిశగా అనూహ్యమైన మార్పును చూస్తున్నాం. నా వరకు వృద్ధి, వృద్ధి, వృద్ధి అన్నవి ఎంతో ముఖ్యమైనవి. ప్రపంచం పుంజుకోవాలని చూస్తోంది. సరఫరా వ్యవస్థ సహా నాయకత్వం వహించాల్సిన స్థానంలో భారత్ ఉంది’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. భారత్కు అపార అవకాశాలున్నాయంటూ.. హెల్త్కేర్, పర్యాటకం తదితర రంగాల్లో ముఖ్య పాత్ర పోషించగలదన్నారు. భారత్కు ఏటా కోటి మంది పర్యాటకులు ప్రస్తుతం వస్తుండగా, 10 కోట్ల మందిని ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను నిర్మించాలని, ఎయిర్ పోర్ట్లు, ఉపరితల రవాణా, షిప్పింగ్ విభాగాల్లో ఎన్నో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అన్ని లక్ష్యాలను 25 ఏళ్ల అమృత కాలంలో సాధించొచ్చన్నారు. కరోనా సమయంలో భారత్ ఎన్నో అంశాల్లో తన సామర్థ్యాలను నిరూపించుకున్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను భారత్ సునాయాసంగా సాధించగలదన్నారు. -
‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో సిబ్బంది సరిగా స్పందించలేదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ ఘటన వ్యక్తిగతంగా నాకు, ఎయిరిండియా సిబ్బందికి మనస్తాపం కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాల్సిన, స్పందించాల్సిన తీరును సమీక్షించి, సరిచేస్తాం’’ అన్నారు. నిందితుడి అరెస్ట్.. ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఇదీ చదవండి: Shocking: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్కు లేఖ -
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
బీ20 చెయిర్గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు
ముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ఇయర్ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడారు. టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్లైన్స్ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్లైన్, రెండు ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది. అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు. -
టాటా చేతికి ఎన్ఐఎన్ఎల్, మా లక్ష్యం అదే!
న్యూఢిల్లీ: నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్)ను స్వాదీనం చేసుకున్న తర్వాత వార్షిక తయారీ సామర్థ్యాన్ని ఏడాదిలోనే 1.1 మిలియన్ టన్నులకు చేరుస్తామని టాటా స్టీల్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఇది ఆధారపడి ఉంటుందన్నారు. టాటా స్టీల్ 115వ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడారు. జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ తదతర సంస్థలతో పోటీపడి ఎన్ఐఎన్ఎల్ను టాటా స్టీల్కు చెందిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ దక్కించుకోవడం తెలిసిందే. ఎన్ఐఎన్ఎల్లో 93.71 శాతం వాటాకు టాటా స్టీల్ వేసిన రూ.12,100 కోట్ల బిడ్ అర్హత సాధించింది. లాంగ్ ప్రొడక్ట్స్, మైనింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ విభాగంలో గణనీయమైన కొనుగోళ్లు చేసినట్టు చంద్రశేఖరన్ చెప్పారు. తమ కళింగనగర్ ప్లాంట్కు ఎన్ఐఎన్ఎల్ సమీపంలో ఉండడం తమకు ఎంతో కీలకమైనదంటూ.. అందుకే కొనుగోలు చేసినట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి ఇది కేంద్రంగా నిలుస్తుందన్నారు. -
టాటాసన్స్ చైర్మన్గా మళ్లీ చంద్రశేఖరన్.. జీతం ఎంతో తెలుసా ?
దేశంలోని అతిపెద్ద వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాసన్స్ గ్రూపు చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ తిరిగి నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ 25న జరిగిన షేర్హోల్డర్ల సమావేశంలో చంద్రశేఖరన్ను మరోసారి టాటాసన్స్ గ్రూపు చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో విజయ్ సింగ్, లియో పూరీలకు బోర్డులో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు. గతేడాది టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రేశేఖరన్కు వార్షిక వేతనంగా రూ.91 కోట్లు చెల్లించారు. వేతనంతో పాటు లాభాల్లో వాటా, ఇతర అలవెన్సులు అందించారు. ఎన్ చంద్రశేఖరన్ పనితీరు నచ్చడంతో 2022 ఫిబ్రవరిలో మరో ఏడాది పాటు అతన్నే చైర్మన్గా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వాటాదారులతో 2022 ఏప్రిల్ 25న సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రశేఖరన్కు అనుకూలంగా టాటాలు ఓటేశారు. తాజాగా జరిగిన టాటా వాటాదారుల సమావేవానికి మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. టాటా గ్రూపులో మిస్త్రీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. 2016లో మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించారు. దీనిపై మిస్త్రీ కుటుంబం న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తోంది. చదవండి: టాటా ఎలక్సీ డివిడెండ్ రూ. 42.5 -
మా జీతాలు పెంచండి మహాప్రభో!
కరోనా కాలంలో తగ్గించిన తమ జీతాలను మళ్లీ పెంచాలంటూ ఎయిర్ఇండియా పైలెట్లు ఈ సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కి లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అప్పుడు పైలెట్ల జీతాల్లో 55 శాతం కోత పెట్టారు. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగినా జీతాలు పెంచలేదు సరికదా వివిధ రకాల అలవెన్సులకు కోత పెట్టారు. ఇటీవల ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా సన్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోవిడ్ అనంతర పరిస్థితులు చక్కబడుతుండటంతో క్రమంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి. దీంతో కోవిడ్ సమయంలో తగ్గించిన జీతాలతో పాటు నిలిపివేసిన పలు అలవెన్సులు పునరుద్ధరించాలంటూ పైలెట్లు కొత్త చైర్మన్ను డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ హయంలోనూ ఇదే డిమాండ్లు వినిపించామని అయితే అప్పుల పేరు చెప్పి ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపలేదని పైలెట్ల సంఘం అభిప్రాయపడింది. చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..! -
ఎయిర్ ఇండియా నూతన చైర్మన్గా చంద్రశేఖరన్ నియామకం..!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా నూతన చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్'ను నియామిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఆయన నియమకాన్ని దృవీకరిస్తూ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్ గతంలో టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ప్రకటించింది, కానీ ఈ నియామకం విషయంలో దేశంలో చాలా వ్యతిరేకత రావడంతో టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ టాటా ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉండటానికి నిరాకరించారు. అలా, నిరాకరించిన కొద్ది రోజులకే టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. నటరాజ్ చంద్రశేఖరన్.. ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్గా పని చేస్తున్నారు. చంద్రశేఖరన్ అక్టోబర్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరిన ఒక ఏడాదిలోనే జనవరి 2017లో చైర్మన్గా నియమించబడ్డారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో సహా పలు గ్రూప్ ఆపరేటింగ్ కంపెనీల బోర్డులకు కూడా ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. వీటిలో కొన్నింటికి 2009-17 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. టీసీఎస్'లో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖరన్ 30 ఏళ్లు సేవలందించి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. గతే ఏడాది అక్టోబర్ నెలలో స్పైస్జెట్ కన్సార్షియంతో పోటీపడి మరి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్(టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల ప్రకటించారు. (చదవండి: భారత్లో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అప్పుడే.. రేంజ్ ఎంతో తెలుసా?) -
ఎయిరిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతాం
ముంబై: ఇటీవల వేలంలో దక్కించుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ ఆర్థికంగా పటిష్టంగా చేస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సంస్థకు ఉన్న విమానాలను అప్గ్రేడ్ చేస్తామని, కొత్త విమానాలను తీసుకుంటామని, ఎయిరిండియాను ప్రపంచంలోనే టెక్నాలజీపరంగా అత్యాధునిక ఎయిర్లైన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో చంద్రశేఖరన్ ఈ విషయాలు చెప్పారు. సంస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి భారత్ను అనుసంధానించాలన్నది తమ లక్ష్యమని చంద్రశేఖరన్ వివరించారు. అత్యుత్తమ కస్టమర్ సర్వీసులు అందించడం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విమానాలను ఆధునీకరించుకోవడం, ఆతిథ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై ఎయిరిండియా ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐ–ఎస్ఏటీఎస్లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా.. వర్చువల్ సమావేశంలో 10,000 మంది పైగా పాల్గొన్నారు. -
మరోసారి టాటా సన్స్ ఛైర్మన్గా చంద్రశేఖరన్ నియామకం..!
ముంబై: టాటా సన్స్ చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. "బోర్డు సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పనితీరును ప్రశంసిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలకు ఎన్.చంద్రశేఖరన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తిరిగి నియమించడానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు" కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడైన రతన్ టాటా, ఎన్.చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూపు పురోగతి & పనితీరుపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పునరుద్ధరించాలని ఆయన సిఫారసు చేసినట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. తనను తిరిగి నియమించడంపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. "గత ఐదు సంవత్సరాలుగా టాటా గ్రూపుకు నాయకత్వం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. టాటా గ్రూపుకు మరో ఐదు సంవత్సరాలు నాయకత్వం వహించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిర్ ఇండియాను జనవరిలో టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న కొద్ది వారాలకే చంద్రశేఖరన్ తిరిగి నియామకం కావడం విశేషం. దాదాపు 70 సంవత్సరాల తర్వాత విమానయాన సంస్థ తిరిగి తన సొంత గూటికి చేరుకుంది. గతేడాది అక్టోబర్లో స్పైస్జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే జనవరిలో తెలిపారు. ఈ డీల్ విలువ సుమారు రూ.18,000 కోట్లు. ఇందులో రూ.2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. అయితే, ఎయిరిండియా తిరిగి టాటాల చెంతకు చేరడం.. చంద్రశేఖరన్ సాధించిన విజయాల్లో ముఖ్యమైనది. (చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న పెన్షన్..!) -
ఇక టాటావారి ఎయిరిండియా
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు గురువారం అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిరిండియా తిరిగి ప్రపంచస్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2021 అక్టోబర్లో... గతేడాది అక్టోబర్లో స్పైస్జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలసి టేకోవర్ వివరాలు తెలిపారు.. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య ఏర్పాటును చేపట్టింది.టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మీడియాకు తెలిపారు. ‘‘ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని టాటాలు స్వీకరించారు. ఇక నుంచి ఎయిరిండియా యజమాని టాలేస్’’ అని పాండే ప్రకటించారు ఆపై ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిరిండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రయివేటైజేషన్కు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఎస్ఐబీ కన్సార్షియం నుంచి రుణం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూపునకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతోపాటు, మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పీఎన్బీ, బీవోబీ, యూనియన్ బ్యాంకు ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘‘ఎయిరిండియా రుణ భారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించాయి’’ అని ఓ బ్యాంకర్ తెలిపారు. టాటా వయా న్యూఢిల్లీ టు టాటా టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జేఆర్డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్లైన్స్’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్లైన్స్. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి... ► 1946: టాటాసన్స్ ఏవియేషన్ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు. ► 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్ను ప్రారంభించడం ద్వారా యూరోప్కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. ► 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది. ► 1994–95: ఏవియేషన్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000–01లో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటాగ్రూపు–సింగపూర్ ఎయిర్లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ► 2017 జూన్: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ► 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో ప్రభుత్వం నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంది. ► 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది. కొనుగోలుదారు రూ.23,285 కోట్ల రుణ భారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ► 2020 అక్టోబర్: ఎయిరిండియా రుణ భారం ఎంత స్వీకరించాలన్నది కొనుగోలుదారుల అభిమతానికి విడిచిపెట్టింది. ► 2020 డిసెంబర్: ఎయిరిండియాకు ఆసక్తి వ్యక్తీకరణలు అందుకున్నట్టు దీపమ్ సెక్రటరీ ప్రకటించారు. ► 2021 ఏప్రిల్: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ. ► 2021 సెప్టెంబర్: ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థ నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖ వెసులుబాటు ప్రకటించింది. ► 2021 సెప్టెంబర్: టాటా గ్రూపు, స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నుంచి బిడ్లు వచ్చాయి. ► 2021 అక్టోబర్ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది. ► 2021 అక్టోబర్ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ► 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది. విమానయానం బలపడుతుంది ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు. వారి చేతుల్లో ఎయిరిండియా తప్పకుండా వికసిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగం మరింత బలపడుతుంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనుకున్న వ్యవధిలోపే విజయవంతంగా పూర్తయింది. – జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎయిరిండియా తిరిగి టాటా గ్రూపు కిందకు రావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థ (ఎయిర్లైన్స్)గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఉద్యోగులు అందరికీ టాటా గ్రూపులోకి సాదర స్వాగతం. మీతో కలసి పనిచేయాలనుకుంటున్నాం. సంస్కరణల పట్ల ప్రధాని మోదీ నిబద్ధత, భారత వ్యవస్థాపక స్ఫూర్తి పట్ల నమ్మకాన్ని గుర్తిస్తున్నాం. ఇదే చారిత్రక మార్పునకు దారి చూపింది. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరలకు తీసుకురావాలని, పౌరుల జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రధాని లక్ష్యంతో ఏకీభవిస్తున్నాం. – ఎయిరిండియా ప్రకటన కొత్త అధ్యాయం ప్రారంభం నేడు కొత్త అధ్యాయం మొదలైంది. టాటా గ్రూపు తరఫున నేను ఈ లేఖ రాస్తూ, మీకు (ఎయిరిండియా ఉద్యోగులు) స్వాగతం పలుకుతున్నాను. జాతి మొత్తం మన వైపే చూస్తోంది. మనం కలసికట్టుగా ఏం సాధించగలమన్నది చూడాలి. మన దేశ అవసరాలకు తగ్గట్టు ఎయిర్లైన్ను నిర్మించడానికి మనం భవిష్యత్తు వైపు చూడాల్సి ఉంది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
అధిక వృద్ధికి 4 థీమ్లు..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ రాబోయే రోజుల్లో అధిక వృద్ధి వ్యూహాల్లో భాగంగా ప్రధానంగా నాలుగు అంశాలపై మరింతగా దృష్టి పెట్టనుంది. డిజిటల్, కొత్త ఇంధనాలు, దీటైన సరఫరా వ్యవస్థ, ఆరోగ్యం వీటిలో ఉండనున్నాయి. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశించి ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఇటు సమాజం, అటు వ్యాపారాలు సన్నద్ధమై ఉండాలని ఆయన సూచించారు. గత ఏడాది అనుభవాలను ప్రస్తావిస్తూ.. గ్రూప్ స్వరూపం ప్రస్తుతం మరింత సరళంగా, ఆర్థికంగా పటిష్టంగా మారిందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘కొత్త టెక్నాలజీల తోడ్పాటుతో కర్బన ఉద్గారాలను నియంత్రించడంలోనూ, మన కంపెనీలు ప్రయోజనాలు అందిపుచ్చుకోవడంలోనూ చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగాం. ఎయిరిండియాను దక్కించుకోవడం ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయి. ఇది చరిత్రాత్మక సందర్భం‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త థీమ్లకు టాటా గ్రూప్ సంస్థలు ఇప్పటికే అలవాటుపడుతున్నాయని, పటిష్టమైన పనితీరు కనపరుస్తున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో 5జీ మొదలుకుని టాటాన్యూ (డిజిటల్ ప్లాట్ఫాం), టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ విభాగాలు ఈ నాలుగు థీమ్స్తో గణనీయంగా ప్రయోజనం పొందగలవని చంద్రశేఖరన్ చెప్పారు. వైరస్పై ఆధారపడి ఉంటుంది.. 2024 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న దేశ లక్ష్యాలను సాధించడంలో టాటా గ్రూప్ తన వంతు పాత్ర పోషించగలదని చంద్రశేఖరన్ వివరించారు. ‘సరళతర .. సుస్థిరమైన విధానాలను పాటిస్తూ, అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలి. అలా చేయగలిగితే మన కంపెనీని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. అయితే, ఈ ఆకాంక్షలన్నీ కూడా ఒక అంశంపై ఆధారపడి ఉంటాయి. అదేంటంటే కరోనావైరస్తో కలిసి జీవించడాన్ని నేర్చుకోవడం. కొత్తగా మరింత వ్యాప్తి చెందినా, మరిన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనగలిగేందుకు వ్యాపారాలు, సమాజం అలవాటుపడగలగాలి. సర్వసన్నద్ధంగా ఉండగలగాలి. ఒమిక్రాన్ విషయంలో ఇది కనిపిస్తోంది. దేశీయంగా భారీ స్థాయిలో అమలు చేసిన టీకాల పథకం ఒక రక్షణ గోడను నిర్మించింది. ఇప్పటివరకూ వ్యాప్తి తీవ్రత ఒక మోస్తరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం మంచిది కాదు‘ అని చంద్రశేఖరన్ చెప్పారు. కోవిడ్–19 కారణంగా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటంలో తోడ్పాటునిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. -
ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!
టాటా మోటార్స్ యాజమాన్యంలో గల ఎలక్ట్రిక్ వాహన అనుబంధ సంస్థలో రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ గ్రూప్ నేడు (అక్టోబర్ 12) ప్రకటించింది. వచ్చే 18 నెలల వ్యవధిలో ఈ పెట్టుబడిని విడతల వారీగా పెట్టుబడి పెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ విషయంలో అస్సలు తగ్గేదెలే అనే రీతిలో టాటా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కూడా టాటా దే పై చేయి. "భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మొబిలిటీ వ్యాపారాన్ని సృష్టించడానికి మా ప్రయాణంలో టీపీజీ రైజ్ క్లైమేట్ మాతో చేరడం నాకు సంతోషంగా ఉంది. ఈవీ తయారీకి అనువైన వాతావరణాన్ని సృష్టించేటప్పుడు కస్టమర్లను ఆహ్లాదపరిచే వాటిపై మేం ముందస్తుగా పెట్టుబడి పెడతాం. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించింది. ఆ విషయంలో ప్రముఖ పాత్ర పోషించడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ తెలిపారు. కంపెనీ ఉత్పత్తిలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు. -
ఫోర్డ్ చెన్నై యూనిట్పై టాటా మోటార్స్ కన్ను?!
చెన్నై: చెన్నైలోని మరాయ్ నగర్లో ఉన్న ఫోర్డ్ ఇండియా యూనిట్ను స్వాధీనం చేసుకునే అవకాశంపై తమిళనాడు ప్రభుత్వం టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి తంగం తెన్నారసుతో సమావేశం అయినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో రెండవసారి జరిగిన ఉన్నత స్థాయి చర్చల సమావేశం ఇది. సెప్టెంబర్ 27న టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సీఎంను కలిశారు.(చదవండి: ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!) అయితే, ఈ సమావేశాల వివరాలు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వాటికి అధ్యక్షత వహించినప్పటి నుంచి తుది నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కూడా ముఖ్యమంత్రి నుంచి వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. చంద్రశేఖరన్ తమిళనాడు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు, మిగిలినవన్నీ ఊహాగానాలు అన్నారు. ఫోర్డ్ మరాయిమలాయి నగర్ ప్లాంట్ 2.40 లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 30 దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది. యుఎస్ కార్ల తయారీసంస్థ ఈ ప్లాంట్లో 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. (చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్బ్యాక్!) ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ లో సనంద్ వద్ద ఒక కర్మాగారం కూడా ఉంది. ఫోర్డ్ భారతదేశం నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన తర్వాత పరోక్షంగా 4 వేల మంది జీవితాలపై ప్రభావం పడనుందని తెలుస్తున్నది. ఈ యూనిట్ గనుక టాటా మోటార్స్ కొనుగోలు చేస్తే ఆ యూనిట్లో పని చేస్తున్న 2600 మంది ఉద్యోగులకు ఉపశమనం లభించినట్లే అవుతుంది. అయితే, ఈ విషయం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడా లేదు. కంపెనీ భారతదేశంలో సుమారు 170 డీలర్ భాగస్వాములను కలిగి ఉంది. ఈ డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్ అందించే ప్రపంచ అగ్రగామి సంస్థల్లో టాటా మోటార్స్ ఉండేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశంతో పాటు ఐరోపాలో సెల్, బ్యాటరీ తయారీ కోసం పలు ఒప్పందాలను చేసుకుంటున్నట్లు వివరించారు. టాటా మోటార్స్ గత సంవత్సరం ప్రారంభించిన నెక్సన్ ఈవీ 4,000 యూనిట్లను విక్రయించింది. "రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఈవీ అమ్మకాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఈ మార్పుకు నాయకత్వం వహిస్తుంది. 2025 నాటికి, టాటా మోటార్స్ 10 కొత్త బీఈవీ వాహనాలను మార్కెట్లోకి తీసుకొనిరావలని యోచిస్తుంది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి మేము పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము" అని కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్ 2020-21 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలిపారు. టాటా గ్రూప్ భారతదేశం, ప్రపంచ వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను వేగంగా తీసుకొనిరావడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాగ్వార్ 2025 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వాల్యూమ్ లలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
పరస్పర సహకారంలో నవ శకం : టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభం తాకిడితో.. పరస్పరం సహకరించుకునే విషయంలో యావత్ ప్రపంచం కొత్త శకం ముంగిట్లో నిల్చిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య నిరంతర సహకారం అందించిన ఉద్యోగులుఅందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో ఉద్యోగుల సహకారాన్ని నమ్మకాన్ని ప్రశంసించడమే కాకుండా, మెడిసిన్, పట్టణ ప్రణాళిక, వాస్తుశిల్పం ఇలా లెక్కలేనన్ని అనేక ఇతర రంగాలలో మహమ్మారి పురోగతికి ప్రేరణనిచ్చిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కి, మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలంటే అంతర్జాతీయ సమాజమంతా కృషి చేస్తేనే సాధ్య పడుతుందని టాటా గ్రూప్లోని 7.5 లక్షలమంది ఉద్యోగులకు నూతన సంవత్సర సందేశంలో ఆయన తెలిపారు. కరోనా మహమ్మారితో నిబంధనలన్నీ సమూలంగా మారిపోయాయని.. భద్రతకు ప్రాధాన్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ టీకాలు పంపిణీ చేయడమనేది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. వేగవంతమైన టెస్టింగ్, కొత్త చికిత్సలు కనుగొనడం కూడా ఇలాంటిదే. ప్రపంచమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే మళ్లీ సాధారణ స్థితికి రావడం సాధ్యపడుతుంది‘ అని చంద్రశేఖరన్ తెలిపారు. -
భారత్కు సువర్ణావకాశం
ముంబై: ఏకైక సరఫరా మార్కెట్గా చైనాపై ప్రపంచం అధికంగా ఆధారపడడం కరోనా తర్వాత తగ్గిపోతుందని, ఇది భారత్కు మంచి అవకాశమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. గ్రూపు కంపెనీ టీసీఎస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆన్లైన్లో నిర్వహించగా.. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) విధానానికి మారుతోందని.. టీసీఎస్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. చైనాతోపాటు మరో 50 దేశాల్లో టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆయా దేశాల్లోని ఉద్యోగులను స్థానిక ప్రాజెక్టులతోపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులకూ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఏజీఎంలో వాటాదారులు వర్క్ఫ్రమ్ హోమ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించగా.. ప్రస్తుతం ఈ విధానానికి మళ్లడం అన్నది ఖర్చుతో కూడుకున్నదంటూ.. కరోనా తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంటి నుంచే పని చేయవచ్చని చంద్రశేఖరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీసీఎస్ కేంద్రాల్లో 25 శాతం మందే పనిచేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఊహించి రాసినవిగా పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ను సరికొత్త ధోరణిగా పరిగణిస్తూ దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. అనుసంధానం, కంప్యూటర్ పరికరాలే కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. -
కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..
కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. కరోనా వైరస్ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు. కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్ తెలిపింది. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు. రూ.కోటి చొప్పున బీజేపీ ఎంపీల ఎంపీల్యాడ్స్ కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్డౌన్తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. బీజేపీకి లోక్సభ, రాజ్యసభల్లో కలిపి 386 మంది సభ్యులున్నారు. ఒక్కో ఎంపీకి ఎంపీల్యాడ్స్ కింద ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసే వీలుంది. కేంద్రమంత్రి సురేశ్ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఎంపీలంతా తమ ఎంపీల్యాడ్స్ నుంచి రూ.కోటి విరాళంగా అందించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. సన్ఫార్మా రూ.25 కోట్లు: కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మం దులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తాం: హ్యుండయ్ కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్ మోటార్స్ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది. ఒకరోజు వేతనం ఇవ్వండి: జీఎస్ఐ కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్ఐ డీజీ శ్రీధర్ తెలిపారు. కావాలంటే వెంటిలేటర్లు సరఫరా చేస్తాం: ట్రంప్ కరోనాపై పోరులో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతోపాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన ట్రంప్.. వెంటిలేటర్లు పంపించాలన్న ఒకే ఒక కోరికను బోరిస్ ఈ సందర్భంగా వెల్లడించారని వ్యాఖ్యానించారు. రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయన్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పసిడి.. పండుగ
పదిలోనూ.. బాలికల హవా
పుష్ప సోయగం
15 శాతం డ్రగ్స్ ఆన్లైన్లోనే విక్రయాలు
కార్లలో 764 కిలోల గుట్కా తరలింపు
పరవశించిన మంగళగిరి..పులకించిన నగరి..గర్జించిన కడప
పది పరీక్షల్లో తప్పిన విద్యార్థిని ఆత్మహత్య
ఇంట్లో తొట్టి కట్టి తల్లిని పూడ్చిన కొడుకు
వేలూరు జిల్లాలో 82.07 శాతం
తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement