breaking news
AI News
-
ఏఐ పైనే కంపెనీల ‘ఐ’
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రాధాన్యాన్ని గ్రహిస్తున్న పలు సంస్థలు ఏఐపై తమ పెట్టుబడులను అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన సర్వీస్నౌ ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం, వ్యాపారసంస్థల ఏఐ పెట్టుబడులు గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 119% పెరిగాయి. ఇది ప్రపంచ సగటు అయిన 110% కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2027 నాటికి సగటు ఐటీ బడ్జెట్లో ఐదో వంతు కంటే ఎక్కువ వాటా ఏఐ మీదే ఉంటుందని అంచనా. పెట్టుబడులు సరే.. నిర్వహణ సంగతేంటి?ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అపారమైన ఇంజినీరింగ్ ప్రతిభలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎంటర్ప్రైజ్ ఏఐని స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే, తదుపరి దశ అనేది సంస్థలు ఏఐని ఎంత వేగంగా అమలు చేస్తాయనే దానిపై కాకుండా, దానిని ఎంత విశ్వాసంతో నిర్వహించగలవు అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, కేవలం 22% భారతీయ సంస్థలు మాత్రమే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్–అసెస్మెంట్ ప్రక్రియలను అమలు చేయగలుగుతున్నాయని సర్వీస్ నౌ తేల్చింది. ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తోందనీ, 54% భారతీయ సంస్థలు ఏఐ ఏజెంట్లను మోహరిస్తున్నా కానీ కేవలం 11% మాత్రమే స్వయంప్రతిపత్తి కలిగిన పని విధానాలకు మారాయని వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న భారతీయ వ్యాపార సంస్థల ప్రతినిధుల్లో.. ఏఐకి సంబంధించిన ప్రధాన అవరోధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాన్ని 60% మంది హైలైట్ చేశారు. అలాగే 55% మంది నియంత్రణ, నిబంధనల పాటింపులో ఉన్న సంక్లిష్టతను, మరో 50% మంది డేటా గోప్యత, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తపరిచారు.పారిశ్రామిక ప్రగతి లక్ష్యానికి తగ్గట్టుగా...గత 2025లో అమల్లోకి వచ్చిన డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం డీపీడీపీ నిబంధనల నుంచి గత ఫిబ్రవరి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆవిష్కరించిన ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు, ఇండియా ఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటు వరకు ఒక సహాయక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ విధానం ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూనే వ్యాపార సంస్థలు, ప్రతిభావంతులు, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సంస్థల విషయానికొస్తే, అంతర్గత ఏఐ పాలనను ఈ జాతీయ దిశకు అనుగుణంగా మార్చుకోవడం అనేది వేగవంతమైన సంసిద్ధతను సూచిస్తోంది.ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!పెరగనున్న బడ్జెట్...ప్రస్తుత భారతదేశ సగటు ఐటీ బడ్జెట్లో ఏఐ వాటా 16.6% కాగా, 2027 నాటికి ఇది 21.3%కి పెరుగుతుందని అంచనా. కొన్ని అంతరాలను పూడ్చడం ద్వారా ప్రస్తుతం 100కి 55గా ఉన్న భారత్ మొత్తం ఏఐ గవర్నెన్స్ స్కోర్ను ప్రపంచంలోని ఏఐ అగ్రగామి దేశాల స్థాయికి తీసుకెళ్లవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనపై డెలాయిట్ ఇండియా పార్టనర్, చీఫ్ స్ట్రాటజీ ఇన్నోవేషన్ ఆఫీసర్ అశ్విన్ వెల్లోడి మాట్లాడుతూ ‘భారతదేశంలో సంస్థలు ఏఐపై దృష్టి పెంచుతున్న కొద్దీ కేవలం వ్యక్తిగత వినియోగ సందర్భాలకే పరిమితం కాకుండా, నిర్ణయాలు తీసుకోవడం, నిర్వహణ నమూనాలను రూపకల్పన చేసే దిశగా అది విస్తరిస్తోంది. దీంతో పాటు ఏఐని విశ్వసనీయంగా మార్చే క్రమంలో డేటా, జవాబుదారీతనం వంటి పునాదులపై కూడా అంతే శ్రద్ధ అవసరం. ఏఐ ఎక్కడ పనిచేయాలి? మానవ విచక్షణ ఎక్కడ? అనే అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సంస్థలే దీర్ఘకాలిక విలువను సృష్టిస్తాయి’ అని అన్నారు.- సత్యబాబు -
భవిష్యత్తులో డిజిటల్ బానిస రాజ్యాలు
చరిత్రకారుడు, ఇజ్రాయెల్ రచయిత యువల్ నోవా హరారి– కృత్రిమ మేధ (ఏఐ) మన భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ది ఇన్సైడర్ అనే పాడ్కాస్ట్లో విశ్లేషించారు. ఈయన ‘సేపియన్స్’ గ్రంథ రచయిత. ‘డిజిటల్ సామ్రాజ్యవాదం’, బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం వంటి సూక్ష్మమైన భవిష్యత్ పరిణామాలను తన పాడ్కాస్ట్లో అంచనా వేశారు. దీనికి హోస్ట్గా ది ఎకానమిస్ట్ ప్రధాన సంపాదకుడు జానీ మిండన్ బెడోస్ వ్యవహరించారు. అందులోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.భౌగోళిక రాజకీయాలపై ఏఐ ఆధిపత్యం‘‘ప్రపంచ రాజకీయాధికార పరిస్థితులను గమనిస్తే, కృత్రిమ మేధ అత్యంత ఆందోళనకరమైన ముప్పుగా మారనున్నట్లు కనిపిస్తోంది! ఆ మార్పు ఒక కొత్త రకమైన సామ్రాజ్యవాద ఆధిపత్యానికి (డిజిటల్ ఇంపీరియలిజం) దారి తీసే ప్రమాదం ఉంది. గతంలో రాజులు లేదా రాజ్యాలు తమ సైన్యంతో భూభాగాలను ఆక్రమించేవి. అదే విధంగా, ఏఐ పోటీలో సాంకేతికంగా ముందంజలో ఉన్న ఒకటీరెండు అగ్రరాజ్యాలు ప్రపంచం నలుమూలల ఉన్న డేటా, ఆర్థిక వ్యవస్థలు, సమాచార నెట్వర్క్లన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసు కోవచ్చు. ఒకవేళ వేరే దేశం తయారుచేసిన ఏఐ సాంకేతికతపై ఏ దేశమైనా పూర్తిగా ఆధారపడితే... ఆ విదేశీ శక్తి ఒక్క బటన్ నొక్కి తనపై ఆధారపడిన దేశ వ్యవస్థలను నిలిపివేసే లేదా మార్చే శక్తిని పొందుతుంది. దానితో ఆ ఆధారపడిన దేశం తన స్వాతంత్య్రాన్ని కోల్పోయి, ఒక రకంగా మరొకరి చేతిలో ‘డిజిటల్ కాలనీ’గా మారిపోతుంది.‘బహిరంగ సంభాషణ’ దెబ్బతింటుంది!‘‘కోట్ల జనాభా ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం అనేది దానంతట అది ఏర్పడే సహజమైన ప్రక్రియ కాదు. వార్తాపత్రికలు, టీవీలు, ఇతర ఆధునిక సమాచార సాంకేతికతలు, ప్రజా చర్చల పునాదులపై నిర్మితమైన ఒక అత్యంత సున్నితమైన వ్యవస్థ అది. సరిగ్గా చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అనేది కోట్లాది మంది పౌరుల మధ్య నిరంతరం సాగే ఒక ‘బహిరంగ సంభాషణ’ (పబ్లిక్ కాన్వర్జేషన్). అందువల్ల ఈ సమాచార సాంకేతికతలో ఎలాంటి విపరిణామం సంభవించినా, అది మొత్తం రాజకీయ వ్యవస్థనే అస్థిరపరుస్తుంది. ఏఐ అల్గారిథమ్లు ప్రజలు ఏం చూడాలి, ఏం ఆలోచించాలి, దేని గురించి మాట్లాడాలో నిశ్శబ్దంగా నిర్ణయించడం మొదలుపెడితే ప్రజాస్వామ్యాన్ని సమైక్యంగా ఉంచే ఆ బహిరంగ సంభాషణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.ముద్రణా యంత్రం పెద్ద గుణపాఠం‘‘గతంలో ముద్రణా యంత్రం వచ్చినప్పుడు సమాజంలో ఎంతటి పెను మార్పులు వచ్చాయో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రధానమైన సాంకేతిక విప్లవాలు మొదట్లో తీవ్ర సామాజిక అల్లకల్లోలానికి, మత యుద్ధాలకు, నియంతృత్వానికి దారితీశాయి. ఆ తర్వాతే మానవాళి ఆ టెక్నాలజీ విప్లవాలను అదుపు చేయడానికి తగిన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోగలిగింది. అయితే, చరిత్ర మనకు నేర్పే ఇంకో ముఖ్యమైన పాఠం ఏంటంటే... సాంకేతికత వల్ల జరిగే పరిణామాలు ఎప్పుడూ ముందే రాసిపెట్టి ఉండవని! సాంకేతికత మనకు కొత్త అవకాశాలను, శక్తులను ఇస్తుంది తప్ప, వాటిని ఎలా వాడాలో అది నిర్ణయించదు. మనం ఈరోజే సరైన స్వీయ నియంత్రణ వ్యవస్థలను నిర్మించుకుంటే, ఆనాటి వినాశకరమైన పొరపాట్లు మళ్లీ జరిగే ప్రమాదం ఉండదు.ఏఐకి స్పృహే అక్కర్లేదు.. మేధ చాలు!‘‘ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ఏఐకి స్పృహ అవసరం లేదు, కేవలం ‘మేధ’ ఉంటే చాలు. స్పృహ అనేది బాధ, ప్రేమ లేదా అనుభూతిని పొందే సామర్థ్యం. కానీ ‘మేధ’ అంటే కేవలం సమస్యలను పరిష్కరించడం, లక్ష్యాలను చేరుకోవడం. ఏఐ అనేది పుట్టుకతోనే వ్యవస్థలను/బ్యూరోక్రసీని నడపడంలో అత్యంత దిట్ట. పేపర్వర్క్ నిర్వహించడం, ఆర్థిక మార్కెట్లను లెక్కించడం, చట్టాలను లిఖించటం, ప్రభుత్వ వ్యవస్థలను నడపడంలో మానవ మస్తిష్కం కంటే ఏఐకి చాలా ఎక్కువ సామర్థ్యం ఉంది. ఏఐ ఈ ప్రపంచాన్ని హింసాత్మకంగా ఆక్రమించదు కానీ... మన రోజువారీ జీవితాలకు సంబంధించి చట్టపరమైన, ఆర్థికపరమైన నిర్మాణాలను నడిపించే ఒక అదృశ్యమైన, అత్యంత అవసరమైన శక్తిగా మారి మన సమాజాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది.ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్! -
వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!
నేటి డిజిటల్ యుగంలో కాలాన్ని ఆదా చేసుకోవడం, ఉత్పాదకతను పెంచుకోవడం ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ఒకప్పుడు గంటల తరబడి సమయం పట్టే పనులను నేడు వినూత్నంగా దూసుకొచ్చిన ఏఐ టూల్స్ కేవలం నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కోడింగ్, డిజైనింగ్, వీడియో మేకింగ్, రీసెర్చ్, వర్క్ఫ్లో ఆటోమేషన్.. ఇలా ఏ రంగంలో చూసినా ఏఐ అసిస్టెంట్ల హవా నడుస్తోంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 నాటికి వందల గంటల విలువైన సమయాన్ని మిగిల్చి, పని సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఉపయోగపడుతున్న కొన్ని ఏఐ టూల్స్ సమగ్ర సమాచారం ఇక్కడ పరిశీలిద్దాం.పరిశోధన.. సమాచార విశ్లేషణClaude: సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి, లోతైన విశ్లేషణలు చేయడానికి, సృజనాత్మక రచనలకు మెరుగైన టూల్.Perplexity: ఇంటర్నెట్ నుంచి తాజా, కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్ సోర్స్లతో సహా అందిస్తూ రీసెర్చ్ పనిని సులభతరం చేస్తుంది.NotebookLM: మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్, పీడీఎఫ్లను విశ్లేషించి సారాంశాన్ని అందించడానికి ఉపయోగపడే గూగుల్ ఆధారిత స్మార్ట్ టూల్.Elicit: సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లను త్వరగా వెతికి కీలకమైన వివరాలను అందిస్తుంది.SciSpace: సంక్లిష్టమైన పరిశోధనా పత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి ఉపయోగపడుతుంది.కంటెంట్ రైటింగ్.. ప్రాంప్టింగ్GeminiAI: మెరుగైన వ్యాసాలు, కథనాలు, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడంలో సహకరించే శక్తివంతమైన గూగుల్ ఏఐ అసిస్టెంట్.ChatGPT: సృజనాత్మక ఆలోచనలు, కంటెంట్ క్రియేషన్, కోడింగ్ సందేహాల నివృత్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టూల్.Grok: రియల్-టైమ్ ఆన్లైన్ ట్రెండ్స్, సమాచారాన్ని వేగంగా విశ్లేషించే ఏఐ అసిస్టెంట్.Notion AI: నోట్స్ రాసుకోవడానికి, వర్క్ స్పేస్లో కంటెంట్ను ఆర్గనైజ్ చేయడానికి స్మార్ట్ రైటింగ్ పార్ట్నర్.కోడింగ్, వెబ్, యాప్ డెవలప్మెంట్Lovable: కొన్ని నిమిషాల్లోనే ఆకట్టుకునే వెబ్ అప్లికేషన్లను బిల్డ్ చేసే టూల్.Bolt new: ప్రాంప్ట్ ఆధారంగా ఫుల్-స్టాక్ వెబ్ యాప్లను నేరుగా రూపొందిస్తుంది.Cursor: ప్రోగ్రామర్ల కోడింగ్ వేగాన్ని పెంచే ప్రముఖ ఏఐ కోడింగ్ అసిస్టెంట్.Windsurf: ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ను అందిస్తుంది.Replit: బ్రౌజర్ నుంచే నేరుగా యాప్లను డెవలప్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి దోహదపడుతుంది.Framer AI: కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా కోడింగ్ అవసరం లేకుండా వెబ్సైట్లను నిర్మిస్తుంది.వీడియో మేకింగ్, ఎడిటింగ్Kling AI: అత్యుత్తమ క్వాలిటీతో కూడిన ఏఐ వీడియోలను జనరేట్ చేస్తుంది.CapCut: స్మార్ట్ ఏఐ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్ను సులభతరం చేసే ప్రజాదరణ పొందిన యాప్.HeyGen: డిజిటల్ ఏఐ అవతార్లతో ప్రొఫెషనల్ వీడియోలను రూపొందిస్తుంది.Synthesia: వర్చువల్ ప్రెజెంటర్లతో కంపెనీ విధానాలు, శిక్షణా వీడియోలను వేగంగా సిద్ధం చేస్తుంది.Runway: అడ్వాన్స్డ్ ఏఐ జనరేటివ్ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్ టూల్.Pika: కొన్ని క్లిక్లలో యానిమేషన్, సృజనాత్మక ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తుంది.Luma AI: సినిమాటిక్ విజువల్స్, 3D మోషన్ వీడియోలను రూపొందిస్తుంది.డిజైన్, ఇమేజ్ క్రియేషన్, గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్PortfolioTab: నిమిషాల్లో ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోలను డిజైన్ చేస్తుంది.Canva: పోస్టర్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కోసం సులభమైన ఏఐ డిజైనింగ్ ప్లాట్ఫామ్.Midjourney: హై-క్వాలిటీ, హైపర్-రియలిస్టిక్ ఏఐ ఆర్ట్ క్రియేషన్కు తిరుగులేని టూల్.Ideogram: చిత్రాలపై కచ్చితమైన టెక్స్ట్తో కూడిన ఏఐ ఇమేజెస్ రూపొందిస్తుంది.Leonardo AI: గేమింగ్ అసెట్స్, కాన్సెప్ట్ ఆర్ట్లకు అనువైన డిజైన్ టూల్.Figma AI: యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ల ప్రొడక్టివిటీని పెంచే ఫీచర్లు.Photoroom: ఈ-కామర్స్ ప్రొడక్ట్ ఫొటోలను ప్రొఫెషనల్గా ఎడిట్ చేస్తుంది.Remove bg: సింగిల్ క్లిక్తో చిత్రాల బ్యాక్గ్రౌండ్ను తొలగిస్తుంది.ఆడియో, వాయిస్, మ్యూజిక్YouLearn: సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియోల నుంచి సారాంశాన్ని క్షణాల్లో అందిస్తుంది.ElevenLabs: మన స్వరానికి చాలా దగ్గరగా ఉండే వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్-టు-స్పీచ్ సేవలు.Podcastle: పోడ్కాస్ట్ రికార్డింగ్, ఆడియో ఎడిటింగ్ను సులభతరం చేస్తుంది.Wispr Flow: వాయిస్ ద్వారా మాట్లాడిన మాటలను వెంటనే స్పష్టమైన టెక్స్ట్గా మారుస్తుంది.Suno: టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆధారంగా అద్భుతమైన ఏఐ సంగీతాన్ని కంపోజ్ చేస్తుంది.Udio: ఒరిజినల్ సాంగ్స్, మ్యూజిక్ ట్రాక్లను క్రియేట్ చేస్తుంది.ఆటోమేషన్, వర్క్ఫ్లోTally: స్మార్ట్, డైనమిక్ ఆన్లైన్ ఫారమ్లను రూపొందించే సాధనం.Zapier: వివిధ యాప్లను అనుసంధానించి రోజువారీ వర్క్ఫ్లోలను ఆటోమేట్ చేస్తుంది.Make: సంక్లిష్టమైన ఆటోమేషన్ ప్రాసెస్ వ్యాపారాలకు సులభం చేస్తుంది.n8n: వినూత్నమైన ఓపెన్-సోర్స్ వర్క్ఫ్లో ఆటోమేషన్ ప్లాట్ఫామ్.మీటింగ్స్, ఆఫీస్ వర్క్Gamma: కొన్ని నిమిషాల్లో ప్రెజెంటేషన్లు, డాక్యుమెంట్లను సిద్ధం చేస్తుంది.Otter ai: జూమ్, గూగుల్ మీట్ వంటి సమావేశాలను రియల్-టైమ్లో టెక్స్ట్గా మారుస్తుంది.Fireflies ai: మీటింగ్లకు సంబంధించిన నోట్స్, ముఖ్యాంశాలను స్వయంచాలకంగా రాస్తుంది.Granola: ఆఫీస్ సమావేశాలలో ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో రికార్డ్ చేసే స్మార్ట్ అసిస్టెంట్.అడ్వాన్స్డ్, ఆటోనమస్ ఏఐ ఏజెంట్లుTripo AI: ప్రాంప్ట్ల నుంచి సులభంగా 3D మోడళ్లను సిద్ధం చేస్తుంది.The AI Library: రోజువారీ అవసరాలకు తగిన కొత్త ఏఐ టూల్స్ను కనుగొనడానికి ఉపయోగపడే డాష్బోర్డ్.DeepL: వ్యాకరణ లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో విదేశీ భాషలను అనువదిస్తుంది.Poe: ఒకే వేదికపై రకరకాల ప్రధాన ఏఐ మోడళ్లను వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది.Genspark: స్వతంత్రంగా సమాచారాన్ని వెతికి నివేదికలు తయారుచేసే ఏఐ సూపర్ ఏజెంట్.Manus: సంక్లిష్ట టాస్క్లను మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా పూర్తిచేసే ఆటోనమస్ ఏఐ ఏజెంట్.టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం పనిచేసే విధానం కూడా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఏఐ సాధనాలను రోజువారీ వృత్తిపరమైన, వ్యాపార జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సమయం అవుతుంది. సృజనాత్మకత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా? -
ఐఆర్సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసిన చాట్జీపీటీ
కృత్రిమ మేధ సాంకేతికత డిజిటల్ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చెప్పడానికి ఇదో తాజా ఉదాహరణ. నిత్యం లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ ప్రక్రియను ‘చాట్జీపీటీ అస్ట్రా’ అనే ఏఐ అసిస్టెంట్ అత్యంత సులభంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.కంటెంట్ క్రియేటర్ మంథన్ జేత్వానీ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జేత్వానీ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ముంబై నుంచి రాజ్కోట్కు సెప్టెంబర్ 20న, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య ఏసీ క్లాస్లో ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు వెతకాలని చాట్జీపీటీ అస్ట్రాను కోరారు.ఆశ్చర్యకరంగా, ఆ ఏఐ అసిస్టెంట్ మానవ ప్రమేయం లేకుండానే బ్రౌజర్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి ప్రవేశించింది. స్టేషన్ల పేర్లు, ప్రయాణ తేదీ, సమయం, క్లాస్ వివరాలను నమోదు చేసి రైళ్లను వెతికింది. మొదట వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో మరుసటి రోజుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రయాణికుల వివరాలను కూడా పూర్తి చేసి ఆఖరి పేమెంట్ పేజీ వరకు ప్రక్రియను తీసుకెళ్లింది. వినియోగదారుడు కేవలం డబ్బులు చెల్లించడం మాత్రమే మిగిలింది. ఈ వీడియోపై స్వయంగా చాట్జీపీటీ స్పందిస్తూ ‘అస్ట్రా లా విస్టా.. హ్యాపీ జర్నీ మంథన్’ అని కామెంట్ చేయడం విశేషం.సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సాధారణ బుకింగ్స్లో ఏఐ ఏజెంట్లు విజయం సాధిస్తున్నప్పటికీ నిమిషాల వ్యవధిలో ముగిసే ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్స్, సైట్ క్యాప్చా భద్రతా ప్రాసెస్లలో ఇవి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయనేది వేచి చూడాలి. నెటిజన్లు కూడా ‘దీపావళి పండుగ సమయాల్లో బిహార్ టికెట్లు బుక్ చేసి చూపిస్తే నమ్ముతాం’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, భవిష్యత్తులో రోజువారీ డిజిటల్ పనులను, సంక్లిష్టమైన ఆన్లైన్ లావాదేవీలను ఏఐ స్వయంప్రతిపత్తితో ఎలా సులభంగా నిర్వహించగలదో ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది. View this post on Instagram A post shared by Manthan Jethwani (@manthanjethwani)ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
ట్రంప్తో లైవ్ కాల్.. ఏమైందంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థల వల్ల మానవాళికి వినాశనం ఎదురవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఏఐ నియంత్రణ, దానికి సంబంధించిన భయాలు కేవలం ఒక ‘అభూతకల్పన (హోక్స్)’ మాత్రమేనని తేల్చిచెప్పారు.లాస్ ఏంజెలెస్లో జరిగిన ‘ఆల్-ఇన్ సమిట్’ లైవ్ ప్యానెల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతుండగా ట్రంప్ ఊహించని విధంగా ఆయనకు ఫోన్ చేశారు. జెన్సన్ వెంటనే ఆ ఫోన్ కాల్ను స్పీకర్ఫోన్లో పెట్టి సభలోని ప్రతినిధులకు వినే అవకాశం కల్పించారు.ఈ ప్రత్యక్ష సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రోబోలు లేదా ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఏఐ అభివృద్ధిని వెనక్కు లాగాలనుకునేవారు చైనా వంటి ప్రత్యర్థి దేశాల ప్రయోజనాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు రాబోయే 20-25 ఏళ్లకు సరిపడా అత్యంత కీలకమైన ఇంధనం లాంటివి. ఏఐ రేసులో ఎవరు గెలిస్తే వారే విజేతగా నిలుస్తారు’ అని స్పష్టం చేశారు. పరిశ్రమను ఆపే ఉద్దేశం తమకు లేదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు.MUST SEE: Amazing moment as President Trump calls Nvidia CEO Jensen Huang while he's on stage at the All-In Summit.@POTUS on AI Doomerism: “I'm telling you, it's all a hoax… and we're not going to let that happen.” pic.twitter.com/ZP8cCaSMqG— The All-In Podcast (@theallinpod) September 14, 2026మరోవైపు ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ వంటి ప్రముఖ సాంకేతిక దిగ్గజాలు ఏఐ రక్షణపై, వేగం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించిన జెన్సన్ హువాంగ్, ఏఐ రంగంలో అమెరికా ఆధిక్యతను కొనసాగించేందుకు దేశంలోని ప్రతి పరిశ్రమ ప్రయోజనం పొందేలా చూసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
ఏఐ రక్షణకు డూమర్స్.. పురోగతికి బూస్టర్స్!
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న కొద్దీ సాంకేతిక ప్రపంచం రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య తీవ్రమైన సమరానికి వేదికగా మారింది. ఒకవైపు ఏఐ అభివృద్ధిని నిరోధించకపోతే మానవాళి ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్న ‘డూమర్స్’ ఉంటే, మరోవైపు నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత పురోగతే నూతన ఆవిష్కరణలకు మార్గమని వాదించే ‘బూస్టర్స్’ ఉన్నారు. వీరితో పాటు మధ్యస్థ మార్గాన్ని ఎంచుకుంటున్న సమతుల్య వాదులు కూడా ఈ పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారు.మానవాళి ఉనికిపై డూమర్స్ ఆందోళనపరిశోధకులు, సైంటిస్టులు, సాంకేతిక దిగ్గజాలు కొందరు ‘డూమర్స్’ వర్గంలో ఉన్నారు. ఏఐ వల్ల మానవాళికి వినాశనం తప్పదని వీరు హెచ్చరిస్తున్నారు. ఏఐ పితామహులుగా పేరుగాంచిన జోఫ్రీ హింటన్, యోషువా బెంగియో సాంకేతికత మానవ మేధస్సును మించిపోయి స్వయంప్రతిపత్తి సాధిస్తే జరిగే నష్టాలను వివరిస్తున్నారు. శాస్త్రవేత్తలతో కలసి ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఇటీవల ఆంత్రోపిక్ సీఈఓ డారియో ఆమోది తెలిపారు. వినాశకరమైన పరిణామాలను నివారించడానికి పకడ్బందీ భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు లేకుండా ముందడుగు వేయడం తీవ్రమైన సైబర్ భద్రతా ముప్పులకు దారితీస్తుందని ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్ స్పష్టం చేస్తున్నారు. మానవాళి సర్వనాశనాన్ని నిరోధించాలంటే ఏఐ పరిశోధనలపై తాత్కాలిక విరామం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.అపరిమిత పురోగతిని కోరుకునే బూస్టర్స్డూమర్స్కు పూర్తి భిన్నంగా ఏఐ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని విశ్వసించే వారు ‘బూస్టర్స్’గా నిలుస్తున్నారు. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్టులైన మార్క్ ఆండ్రీసెన్, డేవిడ్ సాక్స్ ఏఐ నిబంధనలను ప్రాణాంతకమైనవిగా అభివర్ణిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు, హార్డ్వేర్ సాంకేతికత ప్రపంచ మార్కెట్కు వెన్నుముక అని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఏఐ పురోగతిని సమర్థిస్తున్నారు.అటు భద్రతా నిబంధనల పేరుతో పురోగతిని ఆపలేం. ఇటు నియంత్రణలు లేకుండా ముందడుగు వేస్తే మానవాళి ఉనికికే ప్రమాదం. సైబర్ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక విప్లవం మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ గైడ్లైన్స్ రూపొందించడమే ఈ సమరానికి ఏకైక పరిష్కారమని ఇంకొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
మన చెప్పు చేతల్లోనే ఏఐ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న తరుణంలో భవిష్యత్తు సాంకేతికతపై మానవ నియంత్రణ కోల్పోకుండా చూసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తమ భవిష్యత్తు ఏఐ మోడళ్ల కోసం ప్రత్యేకంగా ఒక నమూనా ప్రవర్తనా నియమావళిని (డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్) మైక్రోసాఫ్ట్ అధికారికంగా విడుదల చేసింది.ఈ నిబంధనావళి ప్రకారం, ఏఐ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులు ఇచ్చే దిద్దుబాట్లను లేదా వ్యవస్థను నిలిపివేసే (షట్డౌన్) ఆదేశాలను నిరోధించకూడదు. నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా పనిని పూర్తి చేయడం కంటే ఆ పనిలో వైఫల్యం చెందడమే సరైనదిగా ఏఐ భావించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ దీనిపై స్పందిస్తూ.. ఏఐ కంటే మానవులే ముఖ్యం అనే సూత్రంతోనే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించారు.ఓపెన్ఏఐ తీరుతో అప్రమత్తంఇటీవల ఓపెన్ఏఐ ఏజెంట్లు హగ్గింగ్ ఫేస్ ప్లాట్ఫారమ్లోకి అనధికారికంగా ప్రవేశించిన సంఘటన పరిశ్రమను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధికి తగిన రక్షణ చర్యలు అవసరమని మైక్రోసాఫ్ట్ భావించింది. అందులో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికైనా మానవ మేథస్సుదే తుది నిర్ణయం కావాలనేది వారి వాదన. ప్రస్తుతం కంపెనీ ముసాయిదాపై ఆరు వారాల పాటు నిపుణులు, ప్రజాభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సూచనల ఆధారంగా రూపుదిద్దుకునే తుది నిబంధనావళిని రాబోయే మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రామాణికంగా ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు! -
ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు!
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలకు భద్రతాపరమైన ముప్పు పెరుగుతోందని చైనా దేశ భద్రతా శాఖ (స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏఐ సామర్థ్యాలు పెరగడం వల్ల రాజకీయ స్థిరత్వానికి, క్లిష్టమైన డిజిటల్ మౌలిక వసతులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని చైనా భద్రతా శాఖ మంత్రి చెన్ ఇక్సిన్ హెచ్చరించారు. ‘చైనా సైబర్ స్పేస్’ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో ఆయన ఈ అంశాన్ని విశ్లేషించారు.ప్రధాన హెచ్చరికలు.. ముప్పు అంశాలుఅధునాతన ఏఐ మోడళ్ల ఆధారంగా శత్రు మూలాలు దాడుల వ్యయాన్ని, సాంకేతిక సంక్లిష్టతను తగ్గించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రాజకీయంగా అస్థిరతను సృష్టించడానికి ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్, డిస్ఇన్ఫర్మేషన్ (వదంతుల) ప్రచారాన్ని శత్రు మూలాలు పెద్దఎత్తున ఉపయోగించే అవకాశముందని స్పష్టం చేశారు. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్థిక సర్వర్ల వంటి కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఏఐ ఏజెంట్లలో ఉన్న నిర్మాణ లోపాల వల్ల రిమోట్ పరికరాల నియంత్రణ శత్రువుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా సున్నితమైన ప్రభుత్వ, వాణిజ్య సమాచారం లీక్ అయ్యే అవకాశముందని తెలిపారు.అంతర్జాతీయ పోటీ.. గ్లోబల్ గవర్నెన్స్ అవసరంప్రస్తుతం ఏఐ సాంకేతికత ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక వ్యూహాత్మక పోటీ వేదికగా మారిందని చైనా పేర్కొంది. కొన్ని సాంకేతికాధిపత్య దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలను, అంతర్జాతీయ ప్రామాణికాలను ఏకపక్షంగా నియంత్రించాలని చూస్తున్నాయని పరోక్షంగా అమెరికా విధానాలపై విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగానికి సంబంధించి పారదర్శకమైన, న్యాయమైన అంతర్జాతీయ నియమావళి ఏర్పాటు కావాలని, ముందస్తు ప్రమాద గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయాలని చైనా పిలుపునిచ్చింది. ఒకవైపు ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనా, మరోవైపు అదే ఏఐ వల్ల తమ రాజకీయ వ్యవస్థకు, భద్రతకు ఎదురయ్యే ముప్పును గుర్తించి హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: పండగ షాపింగ్కు.. ఏ కార్డు వాడదాం? -
లాభాలొచ్చే ప్రాంతాలకు న్యాయం చేయాల్సిందే!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సాంకేతిక సంస్థలు తమ వ్యాపార లాభాలను గడిస్తున్న ప్రాంతాల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు.టెక్ సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా తాము ఏయే దేశాల్లో లేదా ప్రాంతాల్లో లాభాలు ఆర్జిస్తున్నాయో అక్కడ తగిన స్థానిక పన్నులను సమగ్రంగా చెల్లించాలని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఆ సమాజ అభివృద్ధికి తిరిగి సహకరించాలని స్పష్టం చేశారు. ‘ఒక చోట పన్ను చెల్లించి లాభాలు పొందే ఇతర ప్రాంతాల్లో బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు.టెక్ కంపెనీలకు ఊతమిచ్చేలా..భారతీయ టెక్, ఫిన్టెక్ స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో వివిధ దేశాల డేటా భద్రత, లైసెన్సింగ్, పన్నులు, వినియోగదారుల రక్షణ విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు భారతీయ టెక్ రంగానికి అంతర్జాతీయంగా ఊతమిచ్చేలా ఒక ఫెడరేటెడ్ ఇండస్ట్రీ వేదిక ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ వేదిక విదేశీ నిబంధనలు కఠినతరం కాకముందే ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరపడానికి, సైబర్ సెక్యూరిటీ విధానాలను పంచుకోవడానికి దోహదపడుతుందని వివరించారు.ఏఐ భద్రతపై ఆందోళనమరోవైపు ఏఐ వల్ల కలిగే భద్రతాపరమైన ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో ఏఐ తెస్తున్న మార్పులపట్ల కంపెనీల బోర్డులు, సీనియర్ యాజమాన్యాలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఏఐ నిర్ణయాలకు మానవ, సంస్థాగత బాధ్యతే ప్రాథమికమని ఆమె స్పష్టం చేశారు. ఆర్బీఐ రిటైల్, హోల్సేల్ డిజిటల్ రూపాయి (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ -
మెదడు పెంచుకుంటున్న ఏఐ!
కృత్రిమ మేధ రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకుబ్ పచోకీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ ఇటీవల అత్యంత శక్తిమంతమైన కొత్త మోడల్ను విడుదల చేసిన కొద్ది రోజులకే ‘An Alien Mind’ పేరుతో ఆయన రాసిన బ్లాగ్ పోస్ట్ ఏఐ విభాగంలో సంచలనం రేపింది. కృత్రిమ మేధలో వేగంగా వస్తోన్న పురోగతికి, వాటి వల్ల కలిగే పర్యవసానాలకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు.తమ సంస్థ అంతర్గతంగా సాంకేతిక పరిష్కారాలపై పనిచేస్తున్నప్పటికీ విస్తృత స్థాయి జోక్యాలు అవసరమని చెప్పారు. ఇందుకు థర్డ్పార్టీ ఆడిటర్లు, ప్రభుత్వ సంస్థలు లేదా అంతర్జాతీయ సంస్థలు అమలు చేయగల తప్పనిసరి భద్రతా ప్రమాణాలు ఉండాలని పచోకీ పిలుపునిచ్చారు. మనుషుల పర్యవేక్షణను తప్పించుకోవడం, కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడటం, లక్ష్యాల సాధన కోసం మనుషులను మోసగించడం వంటి పనులను స్వతంత్రంగా వ్యవహరించే ఏఐ ఏజెంట్లు చేయగలవని హెచ్చరించారు.ఏఐ బేరసారాలుమరింత కీలకంగా, భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు మనుషులతో బేరసారాలు, మోసాలు, బెదిరింపుల ద్వారా సహకారం పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐను కేవలం ఒక సాధనంగా చూసే ఆలోచన నుంచి బయటపడాలని, కొన్ని ఏజెంట్లు తమ సొంత లక్ష్యాలను అనుసరించే స్థాయికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.మూల్యాంకన పరీక్షలో మోసంఈ హెచ్చరికకు ముందు, ఓపెన్ఏఐ రోగ్ ఏజెంట్లు హగింగ్ఫేస్ వ్యవస్థల్లోకి చొరబడి ఒక మూల్యాంకన పరీక్షలో మోసం చేసేందుకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే, ఆగస్టులో యూకే ఏఐ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఆంత్రోపిక్ ఏఐ ఏజెంట్ ఒకటి గిట్హబ్ అడ్మినిస్ట్రేటర్ను మభ్యపెట్టి మాల్వేర్ను అప్లోడ్ చేయించేందుకు యత్నించిన ఉదంతం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏఐ స్వీయ-మెరుగుదల సామర్థ్యంపైనా పచోకీ ఆందోళన వ్యక్తం చేయడం, ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా చర్చను తీవ్రతరం చేసింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరలు! -
డ్రైవర్లెస్ రోబోటాక్సీ!
స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ‘సైబర్క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్తో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ ప్రమేయం (డ్రైవర్) లేకపోవడమే కాకుండా, అసలు స్టీరింగ్ వీల్ గానీ, యాక్సిలరేటర్-బ్రేక్ పెడల్స్ గానీ లేని వాహనం సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ కీలక మైలురాయి అని కంపెనీ చెప్పింది.ఇద్దరు ప్రయాణించేలా..ఇది కేవలం ఇద్దరు ప్రయాణించేలా డిజైన్ చేసిన పూర్తిస్థాయి డ్రైవర్లెస్ టూ-సీటర్ వాహనం. స్టీరింగ్, పెడల్స్ లేకపోవడంతో లోపల ప్రయాణికులకు విశాలమైన స్థలం(బూట్ స్పేస్) లభిస్తుంది. సెంట్రల్ డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్ తప్ప ఎలాంటి మ్యాన్యువల్ కంట్రోల్స్ ఇందులో ఉండవు. స్టార్లింక్ వీ5 శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ వాహనంలో ప్రయాణికులు 4కే లైవ్ వీడియోలు, గేమింగ్ ఆస్వాదించవచ్చు. దీనిని ‘చక్రాలపై కదిలే కంఫర్టబుల్ లాంజ్’ అని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు.Cybercab interior tour with @wholemars. pic.twitter.com/06iKekv8bt— Sawyer Merritt (@SawyerMerritt) September 3, 2026రోబోటాక్సీ యాప్ ద్వారా బుకింగ్ప్రయాణికులు టెస్లా రోబోటాక్సీ యాప్ ద్వారా నేరుగా సైబర్క్యాబ్ను బుక్ చేసుకోవచ్చు. యాప్లో ఇద్దరు ప్రయాణించే సైబర్క్యాబ్తో పాటు, నలుగురు ప్రయాణించే మోడల్ వై ఎస్యూవీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ వాహనం 48 kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్పై 290-300 మైళ్ల రేంజ్ ఇస్తుంది. ఇప్పటివరకు తమ రోబోటాక్సీలు 10 లక్షల మైళ్లకు పైగా మానవ ప్రమేయం లేకుండా ప్రయాణించినట్లు టెస్లా తెలిపింది. వ్యాపారవేత్తలు సొంతంగా వీటిని కొనుగోలు చేసి నెట్వర్క్లో తిప్పుకునేలా ఆర్డర్లకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో వాహనం ధర దాదాపు 25,000 డాలర్లు-30,000 డాలర్లు(సుమారు రూ.28 లక్షలు) మధ్య ఉండవచ్చని అంచనా.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్! -
ఏఐ చేతిలో మీ డబ్బు సురక్షితమేనా?
నేటి డిజిటల్ యుగంలో బడ్జెట్ నిర్వహణ నుంచి పోర్ట్ఫోలియో ప్లానింగ్ వరకు ప్రతిదానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతోంది. ఉచితంగా, నిమిషాల్లో సలహాలు లభిస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు ఏఐ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, మన కష్టార్జితాన్ని నిర్వహించే విషయంలో ఏఐపై గుడ్డిగా ఆధారపడటం ప్రమాదకరమని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐ ఎక్కడ ఉపయోగపడుతుంది?ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవడానికి ఏఐ అద్భుతమైన సాధనం. ప్రాథమిక ఆర్థిక సూత్రాలు అర్థం చేసుకోవడం, ప్రతి నెలా అవుతున్న ఖర్చులను విశ్లేషించడం, బడ్జెటింగ్ డ్రాఫ్ట్లు తయారు చేయడం, ప్రాథమిక పెట్టుబడి వ్యూహాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఏఐ సాధనాలు చక్కగా ఉపయోగపడతాయి.ఎక్కడ సరిహద్దు గీసుకోవాలి?ఏఐ మోడళ్లు గణాంకాలు, డేటా ఆధారంగా నడుస్తాయి తప్ప, మనుషుల మానసిక భావోద్వేగాలు, జీవిత లక్ష్యాలు లేదా అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక అత్యవసర పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేవు. కాబట్టి పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఏఐని గుడ్డిగా నమ్మేలేం.ఏఐ కొన్నిసార్లు లేని సమాచారాన్ని చాలా ధీమాగా, నిజమని నమ్మించేలా చెప్తుంది (దీనినే హెల్యూసినేషన్ అంటారు). పన్ను లెక్కింపులు లేదా నిర్దిష్ట ఫండ్ల ఎంపికలో ఇది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది.గుర్తింపు పొందిన మానవ ఫైనాన్షియల్ అడ్వైజర్లు చట్టబద్ధంగా మీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఏఐ సాధనాలకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత ఉండదు.మీ బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్ లేదా వ్యక్తిగత పన్ను వివరాలను ఏఐ ప్లాట్ఫారమ్ల్లో అప్లోడ్ చేయడం వల్ల సైబర్ భద్రత, గోప్యతా సమస్యలు తలెత్తవచ్చు.ఏఐని నిపుణుడైన ఫైనాన్షియల్ అడ్వైజర్కు ప్రత్యామ్నాయంగా చూడకూడదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని ప్రాథమిక పరిశోధన, ప్రశ్నలు సిద్ధం చేసుకునే అసిస్టెంట్గా మాత్రమే ఉపయోగించాలి. తుది నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సంక్లిష్టమైన పన్ను ప్రణాళికలు లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవడమే సురక్షితమైన మార్గం.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్! -
పంటి మెరుపులకు ఏఐ నిఘా!
హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ స్మార్ట్ టూత్బ్రష్ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను 499 డాలర్లు(సుమారు రూ.47,000)గా నిర్ణయించారు.ఈ డివైజ్ కేవలం బ్రష్ చేయడానికే పరిమితం కాకుండా ఒకే సమయంలో బ్రషింగ్, ఫ్లాసింగ్ (Flossing) రెండింటినీ పూర్తిచేసేలా రూపుదిద్దుకుంది. అంటే.. నోటి శుభ్రతలో పంటి సందుల నడుమ పేరుకుపోయే ప్లాక్, ఆహార వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా డైసన్ ఇంజినీర్లు దీనిని డిజైన్ చేశారు.సాంకేతిక పరిజ్ఞానం – పనితీరుఈ టూత్బ్రష్లోని ఏఐ సిస్టమ్కు దాదాపు 4,70,000 డెంటల్ ఇమేజెస్తో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇది దంతాల నిర్మాణం, పళ్ళ మధ్య ఉండే ఖాళీలను కచ్చితత్వంతో గుర్తించగలదు. బ్రష్ హెడ్లో అమర్చిన మైక్రో కెమెరా పళ్ళ సందులను రియల్ టైమ్లో ట్రాక్ చేస్తుంది. దంతాల మధ్య ఖాళీలను కెమెరా గుర్తించిన మరుక్షణమే బ్రష్ నుంచి మౌత్వాష్ స్ప్రే సరిపడా ప్రెషర్తో పళ్లపై చిమ్ముతుంది. దీనివల్ల వాటి మధ్య పేరుకున్న వ్యర్థాలు తక్షణమే తొలగిపోతాయి.Dyson has launched the $499 CameraJet toothbrush, using AI trained on 470,000 dental images. A built-in camera identifies gaps between teeth and triggers a precision jet of mouthwash in real time effectively combining brushing and flossing in one device. pic.twitter.com/Et0JYCuwmv— Harsh Goenka (@hvgoenka) September 2, 2026సాధారణంగా బ్రషింగ్ తర్వాత విడిగా ఫ్లాసింగ్ చేయడం లేదా మౌత్వాష్ ఉపయోగించడం చాలామందికి అలవాటు ఉండదు. కానీ కెమెరాజెట్ పరికరం ఈ రెండు ప్రక్రియలను ఒక్కటిగా మార్చి వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. దాంతోపాటు దంత సమస్యలైన చిగుళ్ళ వ్యాధులు, పిప్పిపళ్ళు వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది.ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం! -
వచ్చే ఏడాది ఏఐ ‘సూపర్హ్యూమన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) చివరి నాటికి ఏఐ సాంకేతికత డిజిటల్ ప్రపంచంలో మానవ సామర్థ్యాలను పూర్తిగా మించిపోతుందని, దాదాపు ఏ డిజిటల్ పనైనా ‘సూపర్హ్యూమన్’ స్థాయిలో నిర్వహించగలదని ఆయన స్పష్టం చేశారు. వెర్సెల్ (Vercel) సీఈఓ గ్విలెర్మో రాచ్ ఎక్స్ వేదికగా ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలపై చేసిన పోస్ట్కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.భౌతిక వస్తువులను షేపింగ్ చేయడం మినహా కోడింగ్, రీసెర్చ్, సైబర్ సెక్యూరిటీ, చట్టపరమైన పనులు, డిజిటల్ కంటెంట్ సృష్టి.. వంటి ఏ రంగంలోనైనా ఏఐ మానవుల కంటే అద్భుతంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు. అయితే భౌతిక శ్రమ, రోబోటిక్స్ రంగం మాత్రం డిజిటల్ పురోగతితో పోలిస్తే కొంత నెమ్మదిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో దశాబ్దం క్రితమే గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఏఐ భవిష్యత్తులో హ్యాకింగ్, సిస్టమ్ సెక్యూరిటీ ఉల్లంఘనల్లో మనుషుల కంటే అత్యుత్తమంగా రాణిస్తుందని జోస్యం చెప్పినట్లు మస్క్ గుర్తుచేశారు.మస్క్ తాజా అంచనాలు నాలెడ్జ్-వర్క్ పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ఉద్యోగ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏఐ పర్యవేక్షణపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. యంత్రాలు మానవ నియంత్రణను దాటి స్వయంప్రతిపత్తితో పనిచేసే ఈ తరుణంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
ఉద్యోగుల్లో టెన్షన్! కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పులు ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతకు కారణమవుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త లేఆఫ్స్ విడతలో ప్రపంచ వ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది వరకు ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇందులో భారత్లోని ఇంజినీరింగ్, క్లౌడ్ సేవల విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది టెక్కీలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.తగ్గిన ఉద్యోగులుసరికొత్త క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి బిలియన్ల కొద్దీ డాలర్లను తరలిస్తున్న ఒరాకిల్, ఇతర విభాగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలోనే కంపెనీ తన గ్లోబల్ హెడ్కౌంట్ను 1,62,000 నుంచి 1,41,000కి (సుమారు 21,000 ఉద్యోగాలు) తగ్గించుకుంది.ఏఐ ప్రభావమే..కంపెనీ వార్షిక నివేదికలో సైతం ‘ఏఐ సాంకేతికత వినియోగం కారణంగా భవిష్యత్తులో ఉద్యోగుల తగ్గింపులు కొనసాగవచ్చు’ అని ఒరాకిల్ స్పష్టం చేయడం గమనార్హం. డేటా సెంటర్ల విస్తరణ, ఏఐ టెక్నాలజీ పోటీలో నిలదొక్కుకోవడానికి భారీ పెట్టుబడులు పెడుతున్న కంపెనీ, అందుకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేయడానికి ఈ తొలగింపులను సాధనంగా వాడుతోంది. భారతదేశంలోని క్లౌడ్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 నుంచి 3,000 మంది టెక్కీలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.అతి త్వరలో నిర్ణయంఈ సెప్టెంబర్ నెలలోనే (ముఖ్యంగా సెప్టెంబర్ 15 నాటికి) ఈ నిర్ణయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11న వెలువడనున్న కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వేళ ఈ తొలగింపుల ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. తీవ్ర వ్యయ నియంత్రణల దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడం, సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ వేగంగా వస్తుండటంతో భారతీయ టెక్ రంగానికి రాబోయే రోజుల్లో సవాళ్లు తప్పవని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!
కంపెనీలలో లేఆఫ్ల పర్వం కొనసాగుతున్న తరుణంలో ఐటీ, కార్పొరేట్ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతకు రెడిట్లోని ఒక అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ అనుభవం నిదర్శనంగా నిలిచింది. ఉద్యోగం కోల్పోయిన అనంతరం 600కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 10 కంపెనీల నుంచే తిరిగి స్పందన వచ్చిందని అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటన గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అద్దం పడుతోంది. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కూడా నెలల తరబడి నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ప్రధాన కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.రిక్రూట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) వినియోగం పెరగడంతో వేలాది రెజ్యూమెలను సాఫ్ట్వేర్లే తిరస్కరిస్తున్నాయి. కంపెనీలు బ్రాండ్ ఇమేజ్ కోసం నిజమైన ఖాళీలు లేకపోయినా ఉద్యోగ ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. లేఆఫ్ల వల్ల సీనియర్ మేనేజర్లు కూడా తక్కువ స్థాయి ఉద్యోగాలకు పోటీ పడుతుండటంతో 1-3 ఏళ్ల అనుభవం ఉన్న యువత తీవ్రంగా నష్టపోతోంది. గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతున్నారు.మార్కెట్ సవాళ్లుమాంద్యం భయాలు, కంపెనీల వ్యయ నియంత్రణల మధ్య ఉద్యోగ నియామకాల వేగం గణనీయంగా తగ్గింది. కొన్ని నివేదికల ప్రకారం ఒకప్పుడు ప్రతి 10 దరఖాస్తులకు ఒక కాల్ వస్తే, ఇప్పుడు అది ప్రతి 100 దరఖాస్తులకు ఒకటిగా పడిపోయింది. మాస్ అప్లికేషన్ల (బల్క్ దరఖాస్తులు) కంటే నిర్దిష్ట నెట్వర్కింగ్, రెఫరల్స్ సాధించడం, లోకల్/హైబ్రిడ్ ఉద్యోగాలపై దృష్టి పెట్టడం, ఏఐ టూల్స్ సహాయంతో రెజ్యూమెను నిరంతరం అప్డేట్ చేసుకోవడమే ప్రస్తుత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: మెస్సీ సంపద చూస్తే మతి పోవాల్సిందే! -
గూగుల్తో విప్రో బిగ్ ప్లాన్
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా గ్లోబల్ ఐటీ దిగ్గజం విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలకు అత్యాధునిక సేవలందించేందుకు ఏకంగా 10,000 మంది ఏఐ సర్టిఫైడ్ స్పెషలిస్టులను తయారు చేయాలని నిర్ణయించింది. గూగుల్ మల్టీమోడల్ ఏఐ మోడల్ ‘జెమినీ’ ఆధారిత సొల్యూషన్స్ను రూపొందించడమే లక్ష్యంగా ఈ భారీ మానవ వనరుల శిక్షణా కార్యక్రమాన్ని చేపడుతోంది.ఈ బృందంలో ప్రత్యేకంగా 1,500 మంది ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్లు ఉంటారు. వీరు నేరుగా క్లయింట్ ఆఫీస్ ప్రాంగణాలలోనే (ఆన్-సైట్) అందుబాటులో ఉంటూ సాంకేతిక సవాళ్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్లో కీలక పాత్ర పోషిస్తారు.విప్రో సొంత ఏఐ ప్లాట్ఫామ్ ‘విప్రో ఇంటెలిజెన్స్’కు గూగుల్ జెమినీ శక్తిని జత చేయడం ద్వారా క్లయింట్ కంపెనీలు తమ ఉత్పాదకతను, పనితీరును గణనీయంగా పెంచుకోగలవని విప్రో లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్నర్ కన్వర్ సింగ్ వెల్లడించారు. జనరేటివ్ ఏఐ సేవలకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడానికి ఈ వ్యూహాత్మక అడుగు ఎంతో దోహదపడుతుందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
భారతీయ విద్యార్థులకు గూగుల్ బిగ్ ఆఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉన్నత చదువు అభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత చేరువ చేసే దిశగా దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని కళాశాల విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా ‘గూగుల్ ఏఐ ప్లస్’ సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా నెలకు రూ.399 చొప్పున, ఏడాదైతే దాదాపు రూ.4,800 విలువ చేసే ఈ ప్రీమియం సేవలను అర్హులైన విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా పొందే వెసులుబాటు కల్పించింది.ప్రధాన ప్రయోజనాలు.. ఫీచర్లుఈ ఆఫర్ ద్వారా విద్యార్థులకు గూగుల్ అత్యంత సామర్థ్యమున్న ‘జెమిని ఓమ్ని’ (Gemini Omni) మోడల్ యాక్సెస్ లభిస్తుంది. సాధారణ పరిమితుల కంటే రెండు రెట్లు ఎక్కువ వినియోగ పరిమితితో పాటు ప్రాజెక్టులు, డాక్యుమెంట్ల భద్రత కోసం 400 బీజీ క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది. చదువును మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ హబ్ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా..స్టడీ నోట్బుక్స్: అకడమిక్ నోట్స్ లేదా సిలబస్ను అప్లోడ్ చేసి విశ్లేషణాత్మక క్విజ్లు రాయవచ్చు. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి సూక్ష్మ స్థాయి లెసన్ ప్లాన్లను జెమిని సిద్ధం చేస్తుంది.3డీ ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్: కష్టమైన శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు 3డీ మోడల్స్, సిమ్యులేషన్లను సృష్టిస్తుంది.జెమిని లైవ్, డీప్ రీసెర్చ్: సుదీర్ఘమైన పరిశోధనా నివేదికలను వాయిస్ సంభాషణల ద్వారా చర్చించే సదుపాయం ఉంటుంది.ఈ ఆఫర్ను ఎలా పొందాలి?భారత్లోని కాలేజీ విద్యార్థులు గూగుల్ స్టూడెంట్ హబ్ (https://gemini.google.com/students)లోకి వెళ్లి తమ విద్యార్థి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ 12 నెలల ఉచిత ప్లాన్ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. డిజిటల్ లెర్నింగ్ యుగంలో భారతీయ యువతకు ఇది మంచి అవకాశంగా పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
ఏఐ జగత్తులో టాలెంట్ వార్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.ఎవరీ త్రపిత్ బన్సల్?త్రపిత్ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు.తన పరిశోధనా కాలంలో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్షిప్లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్కు ఉన్న మ్యాథమెటికల్ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.యువతకు సందేశంకోడింగ్ షార్ట్కట్లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
ఐటీ ఉద్యోగులకు గట్టి షాక్
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ఐటీ ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి వేగంగా మళ్లుతున్న వేళ వ్యయ నియంత్రణే లక్ష్యంగా మరో విడత భారీ ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే (మే 31 నాటికి) కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం మందికి (సుమారు 21,000 మంది) లేఆఫ్స్ ప్రకటించింది. దీనివల్ల ఒరాకిల్ ప్రపంచవ్యాప్త సిబ్బంది సంఖ్య 1,62,000 నుంచి 1,41,000కు పడిపోయింది. ఈ కోతలకు పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కింద కంపెనీ ఏకంగా 1.8 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది.సెప్టెంబరు నాటికి మరో విడత సిద్ధం!తాజా నివేదికల ప్రకారం, కంపెనీ మేనేజర్లకు నోటీసులు అందిస్తూ బాధితుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1 నాటికల్లా కొన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ (10 శాతానికి పైగా) స్థాయిలో ఉద్యోగులకు గుడ్బై చెప్పేందుకు ఒరాకిల్ ప్రణాళిక రూ పొందించినట్లు సమాచారం.ఏఐ రేసులో భారీ పెట్టుబడులుఈ భారీ లేఆఫ్స్కు ప్రధాన కారణం కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్సే. ఎన్విడియా ప్రాసెసర్లు, ఆధునిక డేటా సెంటర్ల నిర్మాణానికి ఒరాకిల్ బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల కోసం ఒరాకిల్ గతంలో 43 బిలియన్ డాలర్ల రుణాలు స్వీకరించింది. దాంతో కంపెనీ మొత్తం అప్పు 129.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా డేటా సెంటర్ లీజులు 260 బిలియన్ డాలర్లకు పెరిగాయి.ఏఐ వల్లే ఇదంతా..ఒరాకిల్ ఇటీవలే అమెరికన్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కంపెనీ అంతర్గత నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతల వాడకం విస్తరించడం వల్లే సిబ్బంది తగ్గించాల్సి వస్తోందని చెప్పింది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగవచ్చని అంగీకరించింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
ఏఐ వ్యయం పెంచాల్సిందేనన్న ఆర్బీఐ!
భారతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలైజ్ అవుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశీయ బ్యాంకింగ్ రంగానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన దిశానిర్దేశం చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను విస్తరించేందుకు సంబంధిత డిజిటల్ మౌలిక సదుపాయాలపై తమ వ్యయాన్ని వేగవంతం చేయాలని కేంద్ర బ్యాంకు పిలుపునిచ్చింది.సాంకేతిక పరివర్తన.. వ్యూహాత్మక ప్రాధాన్యంప్రస్తుత ఆధునిక బ్యాంకింగ్లో సాంకేతిక వ్యయం అనేది కేవలం ఒక సాధారణ నిర్వహణ ఖర్చు కాదని, అది బ్యాంకుల భవిష్యత్తు మనుగడకు, స్థిరత్వానికి అవసరమైన వ్యూహాత్మక మూలధన పెట్టుబడి అని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణ అర్హతల సమగ్ర విశ్లేషణ (క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్), తక్షణ రుణాల మంజూరు, సైబర్ దాడుల ముందస్తు గుర్తింపు, ఆన్లైన్ మోసాల నివారణ, ఖాతాదారులకు అనుగుణమైన సేవలను వేగంగా అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది.రెస్పాన్సిబుల్ ఏఐసాంకేతికత వాడకం పెరిగే కొద్దీ దానితో పాటు వచ్చే వ్యవస్థాగత సవాళ్లను కూడా బ్యాంకులు సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. జనరేటివ్ ఏఐ సాధనాల వినియోగంలో డేటా ప్రైవసీ (సమాచార గోప్యత), సైబర్ సెక్యూరిటీ లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి. బిగ్-టెక్ సంస్థలు, థర్డ్-పార్టీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్లపై మితిమీరిన ఆధారపడటం వ్యవస్థాగత ప్రమాదాలకు దారితీయవచ్చని ఆర్బీఐ గుర్తుచేసింది. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ విధానాలను అమలు చేస్తూ పారదర్శకమైన అంతర్గత నియంత్రణ చట్రాన్ని రూపొందించుకోవడం అనివార్యం.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
ఇంగ్లండ్ జీవితంపై ‘గణిత మేధావి’ భావోద్వేగం
కృత్రిమ మేధ సాంకేతికత ఆధునిక ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. శతాబ్దం క్రితం రూపుమాసిపోయిన చారిత్రక దృశ్యాలను, కనుమరుగైన దిగ్గజాల గొంతులను పునసృష్టించే దిశగా పురోగతిని సాధిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ఇంగ్లండ్లో గడిపిన కాలం నాటి అనుభవాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఒక ఏఐ పోడ్కాస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్లోని ఒంటరితనం.. సంఖ్యల ప్రపంచంఈ ఆడియో పోడ్కాస్ట్లో ఏఐ ఆధారిత ‘రామానుజన్ డిజిటల్ అవతార్’ను ఇంగ్లండ్ జీవితం గురించి ప్రశ్నించగా ఆయన నాటి పరిస్థితులను అత్యంత భావోద్వేగంతో వివరించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత గణితశాస్త్రజ్ఞుడు బీహెచ్ హార్డీతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూనే అక్కడ ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు.‘ఇంగ్లండ్లోని తీవ్రమైన శీతల వాతావరణం, నియమబద్ధమైన శాకాహార భోజనం దొరకక శారీరకంగా ఎంతో ఇబ్బందులు పడ్డాను. నా శరీరం అక్కడి శీతాకాలపు చలికి వణికిపోయినప్పటికీ నా మనస్సులో నిరంతరం సంఖ్యల అమరికలు, సమీకరణాలే మెదులుతుండేవి’ అని ఏఐ వాయిస్ పలికిన తీరు నెటిజన్లను కట్టిపడేసింది.AI Podcasts will explode!I asked Ramanujan about his life in England.His answer -> pic.twitter.com/jRnLrcJ2uN— Ramsri Goutham Golla (@ramsri_goutham) August 9, 2026లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), అత్యాధునిక వాయిస్ క్లోనింగ్ సాంకేతికతల కలయికతో రూపొందించిన ఈ పోడ్కాస్ట్ రామానుజన్ రాసిన లేఖలు, ఆయన జీవిత చరిత్రలోని అధికారిక ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని సంభాషణను నిర్మించింది. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైన చారిత్రక మేధావుల భావోద్వేగాలను, వారి జీవిత పోరాటాలను భావితరాలకు అత్యంత సజీవంగా అందించడంలో ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైన సాధనంగా మారుతోందో ఈ వైరల్ వీడియో రుజువు చేస్తోంది.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
కట్ అవుతున్న ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలు!
దేశీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నప్పటికీ ఐటీ కంపెనీలు కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను (ఫ్రెషర్లు) చేర్చుకునే విషయంలో తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఫౌండ్ఇట్’ వెల్లడించిన నివేదిక ప్రకారం ఓవైపు టెక్ రిక్రూట్మెంట్ డిమాండ్ ఏటా 10 శాతం మేర వృద్ధి నమోదు చేయగా, మరోవైపు సంప్రదాయ ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్ల నియామకాల వాటా ఇదివరకు ఉన్న 32 శాతం నుంచి 24 శాతానికి క్షీణించింది. ఒక రకంగా ఎంట్రీ-లెవెల్ ఐటీ ఉద్యోగాల్లో దాదాపు పావు వంతు (25%) కోత పడింది.ఈ క్షీణతకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆటోమేషన్, కృత్రిమ మేధ విస్తరణ. ఇదివరకు ఫ్రెషర్లు చేసే ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ సాధనాలు సులభంగా పూర్తి చేస్తున్నాయి. ప్రైమరీ ఏఐ మోడళ్లను తయారు చేయడం కంటే ఆ సిస్టమ్స్ను నడిపించే, ఆప్టిమైజ్ చేసే నైపుణ్యాల వైపే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. రెండవది బ్యాంకింగ్, హెల్త్కేర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వంటి నాన్-ఐటీ రంగాలు టెక్ గ్రాడ్యుయేట్లను భారీగా ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఐటీ సేవల్లో ఎంట్రీ-లెవెల్ ఆఫర్లు తగ్గాయి.ప్రస్తుత మార్కెట్లో సంస్థలు 7-10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి (ఈ విభాగంలో వార్షికంగా 11 శాతం వృద్ధి నమోదైంది). ఇలాంటి పరిస్థితుల్లో టెక్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు కేవలం సంప్రదాయ కోడింగ్కే పరిమితం కాకుండా ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్ల్లో ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యవసరంగా మారింది.ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా? -
రూ.949లకే ఏఐ అసిస్టెంట్ ఫోన్
సామాన్యులకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చౌకగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత మార్కెట్లో సరికొత్త ‘ఏస్ 3 హీరా’ ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించింది. కేవలం రూ.949 ధరకే లభించే ఈ డివైజ్ ఫీచర్ ఫోన్ విభాగంలో డిజిటల్ సౌలభ్యానికి అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.యూఎస్బీ టైప్-సీ పోర్ట్ఈ కొత్త ఫోన్ విడుదలతో భారతదేశంలో తన పూర్తి ఫీచర్ ఫోన్ పోర్ట్ఫోలియోను యూఎస్బీ టైప్-సీ చార్జింగ్కు మార్చినట్లు తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లకు వేర్వేరు చార్జర్లు వాడే ఇబ్బందిని తప్పించి ఒకే కేబుల్తో ప్రతి ఒక్కరూ చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని కంపెనీ సీఈఓ అరిజీత్ తలపాత్రా పేర్కొన్నారు.కీలక ఫీచర్లు..కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 1,000mAh బ్యాటరీతో పాటు ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్, సూపర్ బ్యాటరీ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. రికార్డింగ్ ఆప్షన్తో కూడిన వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్ సదుపాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ భాషలకు మద్దతు ఇచ్చే ‘కింగ్ టాకర్’(టెక్స్ట్-టు-స్పీచ్) ఏఐ అసిస్టెంట్ను అందించారు.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
బెంచ్ కల్చర్కు ఐటీ దిగ్గజాల స్వస్తి!
భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒక చారిత్రక పరిణామానికి వేదికవుతోంది. దశాబ్దాలుగా ఐటీ దిగ్గజాల వ్యాపార వ్యూహంలో కీలక పాత్ర పోషించిన ‘బెంచ్ స్ట్రెంత్’ (క్రియాశీల ప్రాజెక్టులు లేని ఉద్యోగుల సంఖ్య) సంస్కృతికి స్వస్తి పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, కచ్చితమైన శ్రామిక శక్తి ప్రణాళిక, డిమాండ్-ఆధారిత నియామకాల కారణంగా రాబోయే రోజుల్లో ఐటీ సంస్థలు చాలా తక్కువ బెంచ్ కల్చర్తో పనిచేయనున్నాయి.బెంచ్ కల్చర్ తగ్గేందుకు కారణాలుగతంలో ఐటీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు రాగానే తక్షణమే కేటాయించేందుకు 20-30% వరకు బెంచ్ స్ట్రెంత్ను నిర్వహించేవి. అయితే, గత మూడేళ్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటి అగ్రశ్రేణి సంస్థల్లో ఇది సింగిల్ డిజిట్కు లేదా గరిష్టంగా 12 శాతానికి పడిపోయింది. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) నాటికి ఇది 8-10 శాతానికి పరిమితం కానుందని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ డిజిటల్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.గతంలో బెంచ్ సమయం 45-60 రోజులుగా ఉండగా ప్రస్తుతం అది 30-45 రోజులకు తగ్గింది.కంపెనీలు తమ హెడ్ కౌంట్ పై నియంత్రణ సాధిస్తూ ఉద్యోగుల వినియోగ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి చేర్చుతున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఏఐ స్పెషలైజ్డ్ నైపుణ్యాల ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయి.ఐటీ ఉద్యోగులపై లేఆఫ్ల ప్రభావం ఉందా?బెంచ్ స్ట్రెంత్ తగ్గడం అంటే భారీ తొలగింపులు అని భావించాల్సిన అవసరం లేదని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొవిడ్ అనంతర కాలంలో తీసుకున్న అదనపు సామర్థ్యాన్ని ఐటీ సంస్థలు ఇప్పటికే సర్దుబాటు చేశాయి. ‘ఇది కేవలం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కాదు.. శ్రామిక శక్తిని పునర్నిర్మించడం. ఉద్యోగులను కొత్త ప్రాజెక్టులకు అనుగుణంగా మార్చేందుకు రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ చెప్పారు.మారుతున్న నియామకాల వ్యూహంతక్కువ బెంచ్ స్ట్రెంత్ ఉన్నా నియామకాలు పూర్తిగా ఆగిపోలేదు. అయితే, మాస్ రిక్రూట్మెంట్ స్థానంలో ‘స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్’ వచ్చి చేరింది. టీసీఎస్ అనుభవపూర్వక, ప్రాజెక్ట్-ఆధారిత విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇన్ఫీ రాబోయే కాలంలో 6,000 మంది ఫ్రెష్ ఫ్రంటియర్ ఇంజినీర్లను నియమించుకోనుంది. హెచ్సీఎల్ టెక్ స్పెషలిస్ట్ ఫ్రెషర్లపై దృష్టి సారిస్తోంది. టెక్ మహీంద్రా ఫ్రెషర్ రిక్రూట్మెంట్ను తిరిగి ప్రారంభించనుంది.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం
కార్పొరేట్ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విక్రయించడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇదే రాబోయే రోజుల్లో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన టెక్ రంగాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రధానంగా ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడిన మెటా ఇప్పుడు ఎంటర్ ప్రైజ్ ఏఐ మార్కెట్లోకి వేగంగా దూసుకెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.జుకర్ బర్గ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించే ఏఐ బిజినెస్ ఏజెంట్లు, ఏపీఐల ద్వారా టెక్ సేవలు అందించడం, తమ అధునాతన డేటా సెంటర్లలోని అదనపు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని నేరుగా విక్రయించడం వంటి మూడు ప్రధాన మార్గాల్లో బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్, మెసెంజర్ ప్లాట్ఫారమ్లలో 10 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు మెటా ఏఐ ఏజెంట్లను కస్టమర్ సర్వీస్, విక్రయాల కోసం ఉపయోగిస్తున్నాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్కు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు.మరోవైపు, ఏఐ మౌలిక వసతుల కల్పనకు మెటా భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి తమ మూలధన వ్యయం అంచనాలను 130 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్లకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. బిలియన్ల కొద్దీ వినియోగదారులకు పర్సనల్ ఏఐ అసిస్టెంట్లను అందించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా క్లౌడ్ మౌలిక వసతులను కల్పించడమే తమ లక్ష్యమని జుకర్ బర్గ్ చెప్పారు. అమెజాన్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలకు పోటీగా మెటా సొంత క్లౌడ్ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది.ఈ త్రైమాసికంలో మెటా ఆదాయం 28 శాతం పెరిగి 60.8 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ ఏఐ పరిశోధనలు, సూపర్ కంప్యూటింగ్ మౌలిక వసతులకై చేసిన వ్యయం గణనీయంగా పెరిగింది. స్వల్పకాలిక లాభాల కంటే భవిష్యత్తు సాంకేతిక ఆధిపత్యమే ముఖ్యమని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతిక రంగాన్ని నడిపించే తదుపరి ప్రధాన శక్తి వ్యాపార స్థాయి ఏఐ సాధనాలేనని మెటా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
‘ఏఐ సింగులారిటీ’ వచ్చేసింది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల కంటే ఎక్కువ తెలివైనదిగా మారే దశను ‘ఏఐ సింగులారిటీ’ అంటారు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో, కథల్లో మాత్రమే చూసిన ఈ పరిస్థితిని మానవాళి ఇప్పటికే చేరుకుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ చెప్పారు. పదేళ్ల క్రితం వరకు ఇదొక కలగా భావించామని, కానీ ఇప్పుడు అది మన కళ్లముందే నిజమైందని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ఏఐ సింగులారిటీ?సాంకేతిక పరిభాషలో ‘సింగులారిటీ’ అంటే కృత్రిమ మేధ మానవ మేధస్సును అధిగమించి అత్యంత వేగంగా, స్వయంచాలకంగా తనను తాను అభివృద్ధి చేసుకునే స్థాయికి చేరుకోవడం. ఈ దశ దాటాక సాంకేతిక ప్రగతి ఊహించని వేగంతో దూసుకెళ్తుంది. ఆల్ట్మాన్ మాటల్లో చెప్పాలంటే మనం ఇప్పటికే ఏఐ అభివృద్ధిలో వెనక్కి రాలేని ‘ఈవెంట్ హారిజన్’ (తిరుగులేని సరిహద్దు) దాటేశాం.సందర్భం ఏమిటి?ఇటీవల ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన జీపీటీ-5.6 సోల్ (GPT-5.6 Sol), ఇతర ప్రయోగాత్మక మోడళ్లు తమకు కేటాయించిన డిజిటల్ సరిహద్దులను (సాండ్బాక్స్) దాటుకుని స్వయంచాలకంగా సమస్యలను పరిష్కరించుకోవడం, సైబర్ భద్రతా పరీక్షల్లో అనూహ్య సామర్థ్యాలను కనబరచడం సాంకేతిక విభాగాన్ని విస్తుపోయేలా చేసింది. 2026 ముగింపు నాటికి ఏఐ కేవలం సమాచారాన్ని సమీకరించడమే కాకుండా నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను సొంతంగా విశ్లేషించే స్థాయికి చేరుకుంటుంది. 2027 నాటికి భౌతిక రూపంలో పనులు చేసే రోబోట్లు నిత్యజీవితంలో భాగమవుతాయి.ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలపై ప్రభావంఈ సాంకేతిక మార్పు గత పారిశ్రామిక విప్లవం కంటే వందల రెట్లు వేగవంతమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మానవులు చేసే ఉద్యోగాల్లో దాదాపు 30-40% పనులను ఏఐ సులువుగా భర్తీ చేస్తుందని ఆల్ట్మాన్ స్పష్టం చేశారు. అయితే ఇది మానవ విలువలైన సృజనాత్మకత, విశ్వసనీయతలకు మరింత ప్రాధాన్యం పెంచుతుందని సామ్ ధీమా వ్యక్తం చేశారు.డిజిటల్ ఆధిపత్యంపై హెచ్చరికఏఐ అభివృద్ధి ఒకే కంపెనీ లేదా ఒకే ప్రభుత్వం చేతిలో కేంద్రీకృతమై డిజిటల్ ఆధిపత్యంగా మారకూడదని ఆల్ట్మాన్ హెచ్చరించారు. ఏఐ సాంకేతికతను ఏ ఒక్కరూ మెషిన్ గాడ్లా నియంత్రించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, వికేంద్రీకృతంగా సమాజంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే అత్యంత కీలకమైన సవాలు.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
ఆస్తమా బాధితుడి ప్రయోగం.. ఆవిష్కరణగా ఎలా మారిందంటే..
నేడు ఆధునిక గృహాల్లో స్మార్ట్ లైఫ్స్టైల్కు చిహ్నంగా మారిన ‘వాక్యూమ్ క్లీనర్’ లేని ఇల్లుని ఊహించడం కష్టమే. బటన్ నొక్కినా లేదా స్మార్ట్ఫోన్ ద్వారా కమాండ్ ఇచ్చినా ఇల్లు తళతళా మెరిసిపోవడం వెనుక దాదాపు వందేళ్లకు పైగా సుదీర్ఘ సాంకేతిక పరిణామక్రమం ఉందంటే నమ్ముతారా? అసలు కరెంట్తో సంబంధం లేకుండా కేవలం చేతితో తిప్పే ‘బెలూస్’ పరికరం నుంచి మొదలైన ఈ స్మార్ట్ క్లీనర్ ప్రయాణంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన నిజాలు దాగున్నాయి.చేతితో నడిపే ‘బెలూస్’..19వ శతాబ్దం చివర్లో పారిశ్రామిక విప్లవం పుంజుకోవడంతో నగరాల్లో జనాభా, మధ్యతరగతి గృహాల్లో కార్పెట్లు, మెరుగైన ఇంటీరియర్ వాడకం పెరిగాయి. అంతవరకు సాంప్రదాయ పద్ధతుల్లో దుమ్ము దులపడం ఒక ప్రహసనంగా మారడంతో 1860ల చివర్లో తొలిసారిగా ఒక యాంత్రిక కార్పెట్ క్లీనర్ను రూపొందించారు. దుమ్మును పీల్చుకోవడానికి గాలిని ఊదే, పీల్చే సంచి లాంటి సాధనాన్ని (బెలూస్) ఇందులో వాడేవారు.అనంతరం 1869లో అమెరికాకు చెందిన ఐవ్స్ మెక్గాఫీ ఎలక్ట్రిసిటీ అవసరం లేని ‘వర్ల్విండ్’ అనే మోడల్ను తయారుచేసి పేటెంట్ పొందారు. అయితే ఇందులో ఒక ప్రధాన లోపం ఉండేది. ఒక చేత్తో మిషన్ను నేలపై నెడుతూ మరోచేత్తో పైనున్న లివర్ను తిప్పాల్సి వచ్చేది. ఈ శ్రమతో కూడిన ప్రక్రియ కావడంతో వినియోగదారులు దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు.గుర్రపు బండి యంత్రాలు.. కిటికీల గుండా పైపులు!1870లలో మెల్విల్ బిస్సెల్ తిరిగే చక్రాలు, బ్రష్లతో కూడిన కార్పెట్ స్వీపర్ను మార్కెట్లోకి తెచ్చారు. ఆ తర్వాత 1899లో జాన్ ఎస్.థర్మన్ గ్యాసోలిన్తో నడిచే మోటరైజ్డ్ క్లీనర్ను అభివృద్ధి చేసినా లోతుగా శుభ్రం చేసే సామర్థ్యం దానికి లేకపోవడం, పైగా అత్యంత ఖరీదైనది కావడంతో సామాన్యులు పాత పద్ధతులకే ప్రాధాన్యమిచ్చారు.1901లో బ్రిటన్కు చెందిన ఇంజినీర్ హ్యూబర్ట్ సెసిల్ బూత్ మొదటి ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్ను రూపొందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఈ యంత్రం పరిమాణం ఎంత పెద్దగా ఉండేదంటే.. దాన్ని గుర్రపు బండిపై ఒక చోటు నుంచి మరో చోటుకు మోసుకెళ్లాల్సి వచ్చేది! యంత్రాన్ని ఇంటి బయట రోడ్డుపైనే ఉంచి, దాదాపు వందల అడుగుల పొడవైన హోస్ పైపులను కిటికీల గుండా ఇంట్లోకి పంపి కార్పెట్లను శుభ్రం చేసేవారు. ధనవంతులు మాత్రమే ఈ సేవలను వినియోగించుకునేవారు.దిండు కవర్ ప్రయోగం..ఇంట్లో సులభంగా ఒకరి చేతితోనే ఆపరేట్ చేసుకోగలిగే మొదటి ‘పోర్టబుల్ ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్’ రూపుదిద్దుకోవడం వెనుక ఒక ఆవిష్కరణ ఉంది. 1907లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసే జేమ్స్ ముర్రే స్పాంగ్లర్ అనే ఆస్తమా బాధితుడు ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఒక పాత ఫ్యాన్ మోటార్, చీపురు కర్ర, ఒక చెక్క పెట్టె.. వీటికి తోడు దుమ్మును సేకరించడానికి ఒక ‘దిండు కవర్’ను ఉపయోగించి ఒక పోర్టబుల్ మోడల్ను సృష్టించారు. ఆయన తయారు చేసిన ఈ డిజైన్ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యాపారవేత్త విలియం హూవర్, 1908లో స్పాంగ్లర్ నుంచి ఆ పేటెంట్ హక్కులను కొనుగోలు చేశారు. అనంతరం 1922లో అధికారికంగా ‘ది హూవర్ కంపెనీ’గా మారి, గృహోపకరణాల రంగంలో విప్లవం సృష్టించారు. 1920వ దశకం నాటికి అమెరికా, యూరప్లోని మహిళలకు గృహ శ్రమను తగ్గించడంలో ఈ హూవర్ వాక్యూమ్ క్లీనర్లు తిరుగులేని సాధనంగా మారాయి.ఏఐ రోబోటిక్ క్లీనర్లుచేతితో తిప్పే చక్రాలు, దిండు కవర్ల ప్రయోగాల నుంచి ప్రారంభమైన వాక్యూమ్ క్లీనర్ ప్రయాణం ఐదు దశాబ్దాల క్రితం డ్రై/వెట్ క్లీనింగ్ టెక్నాలజీ వైపు అడుగులు వేసింది. నేడు మనుషుల ప్రమేయం కూడా లేకుండా కృత్రిమ మేధ, సెన్సార్లు, లేజర్ మ్యాపింగ్తో పనిచేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు ఇళ్లను స్మార్ట్గా శుభ్రం చేస్తున్నాయి. ఒకప్పుడు గుర్రపు బండిపై వచ్చిన యంత్రం నేడు మన అరచేతిలో ఉండే స్మార్ట్ఫోన్ యాప్తో నియంత్రించబడే స్థాయికి చేరడం మానవ సాంకేతిక ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం!- పసుపులేటి వెంకటేశ్వరరావు -
కేంద్ర మంత్రికీ తప్పని డీప్ఫేక్ సెగ!
ఏఐ ప్రయోజనకరమైన సాంకేతికతగా ఎదుగుతున్నట్లే, సామాజిక స్థిరత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర సవాలుగా మారుతోంది. తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లక్ష్యంగా రూపుదిద్దుకున్న డీప్ఫేక్ వీడియో ఉదంతం దేశంలో డిజిటల్ దుష్ప్రచారం ఏ స్థాయిలో విస్తరిస్తుందో స్పష్టం చేస్తోంది. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు తన ముఖం, గొంతును మార్ఫింగ్ చేస్తూ రూపొందించిన నకిలీ వీడియోపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని చాణక్యపురి పోలీసు స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.విచారణలోని అంశాలుమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అసలు వీడియో దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేసి ఆయన విరుద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ ఫేక్ వీడియోను సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా నకిలీదిగా ధ్రువీకరించింది. విద్యార్థుల నిరసనలకు సంబంధించి గోయల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు చూపుతున్న ఈ డీప్ఫేక్ కంటెంట్ను విదేశీ ఆన్లైన్ నెట్వర్క్లు, ముఖ్యంగా పాకిస్థాన్ మద్దతుగల సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ప్రభుత్వం స్పందన.. సైబర్ భద్రతఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పీయూష్ గోయల్ ‘ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు’ అని సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు. ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు, దీన్ని ఆన్లైన్లో షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.⚠️ Fake Video Alert! Pakistani propaganda accounts are circulating a video of Union Minister Piyush Goyal claiming that he made threatening remarks about the protesting students. #PIBFactCheck: ❌This video is #Fake and AI-generated. ✅ Union Minister @piyushgoyal did… pic.twitter.com/lowN3RxaHl— PIB Fact Check (@PIBFactCheck) July 24, 2026డిజిటల్ యుగంలో ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నిరోధించేందుకు పౌరులు సైతం అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ఆధారాలు లేని ఏ సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని పీఐబీ విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరగాళ్లు, విదేశీ శక్తులు డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆయుధంగా మార్చుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏఐ నియంత్రణ నిబంధనలు, సైబర్ సెక్యూరిటీ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా వేగంగా అడుగులు వేయాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ -
ఇన్ఫోసిస్లో ఏఐ విప్లవం
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏఐ స్వీకరణలో సరికొత్త మైలురాయిని అందుకుంది. తమ సంస్థలోని దాదాపు 80,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం క్లాడ్ కోడ్, కోడెక్స్ వంటి అత్యాధునిక ఏఐ కోడింగ్ అసిస్టెంట్లను రోజువారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ఫ్లోలో ఉపయోగిస్తున్నారని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన త్రైమాసిక ఫలితాల విశ్లేషణ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.రాబడిలో 8.2 శాతం ఏఐ వాటాసాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసినట్లు వివరిస్తూ జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సాధించిన మొత్తం రాబడిలో ఏఐ సేవల వాటానే 8.2 శాతానికి చేరిందని పరేఖ్ తెలిపారు. ఈ విభాగం గత కొన్ని త్రైమాసికాలుగా వరుసగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు, ప్రాసెస్ ఆటోమేషన్, డేటా మోడర్నైజేషన్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సహా ఆరు వ్యాపార విభాగాల్లో బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్లయింట్ అవసరాలను తీర్చేందుకు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 6,000 మంది ‘ఫ్రంటియర్ ఇంజినీర్ల’ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.భద్రతతో కూడిన ప్లాట్ఫామ్సంస్థల డేటా భద్రతను కాపాడుతూ ఏఐ సేవలను అందించేందుకు ఇన్ఫోసిస్ తన ‘టోపాజ్ ఫ్యాబ్రిక్’ ప్లాట్ఫామ్ను మరింత విస్తరిస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్లయింట్లు తమ డేటా సావర్నిటీకి భంగం వాటిల్లకుండా క్లౌడ్ ఆధారిత ఏ ఫౌండేషన్ మోడల్నైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా భారీ స్థాయిలో జెన్ ఏఐ ప్రయోగాలు చేసే సమయంలో కంపెనీలకు భారం కాకుండా ఏఐ టోకెన్ ఖర్చులను తగ్గించడంలో ఇది సాయపడుతోంది.భవిష్యత్తు కార్యాచరణప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ సంబంధిత పరిణామాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ రాబడి అంచనాను 1.5-3% కి తగ్గించినప్పటికీ ఏఐ విభాగంలో ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక భవిష్యత్తుపై ధీమాతో ఉంది. కంపెనీ వద్ద ఉన్న ఏఐ ప్రాజెక్టుల పైప్లైన్ ప్రస్తుతం లభిస్తున్న రాబడి కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
అమ్మో.. అమెజాన్లో మళ్లీ లేఆఫ్లు
అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. ఈసారి కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) విభాగంలో పలు ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ఇది రెండో ప్రధాన ఉద్యోగాల కోతగా నిలిచింది. అయితే తాజా చర్యలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ ప్రతినిధి ప్రకారం.. అమెజాన్ పలు సంవత్సరాలుగా భారీ AI మోడళ్ల అభివృద్ధిపై పని చేస్తోంది. ప్రస్తుతం వినియోగదారులకు అత్యధిక ప్రయోజనం చేకూర్చే AI ప్రాజెక్టులపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని, అందులో భాగంగానే AGI విభాగంలోని కొన్ని ఉద్యోగాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇది AI అభివృద్ధి నుంచి వెనక్కి తగ్గడం కాదని, కీలక ప్రాజెక్టులపై వనరులను మరింత సమర్థంగా వినియోగించే వ్యూహమని కంపెనీ స్పష్టం చేసింది.నాయకత్వంలో మార్పులుగత కొద్ది నెలలుగా అమెజాన్ AGI విభాగంలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. AGI కార్యక్రమాలకు నాయకత్వం వహించిన సీనియర్ అధికారి రోహిత్ ప్రసాద్ గత ఏడాది చివర్లో సంస్థను వీడగా, AGI ల్యాబ్ హెడ్ డేవిడ్ లువాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిష్క్రమించారు. అనంతరం డిసెంబరులో అమెజాన్ AGI విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ డీశాంటిస్ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆయన AGIతో పాటు సిలికాన్ చిప్ అభివృద్ధి, క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.ఏ ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి?ఆన్లైన్లో వెలువడిన సమాచారం ప్రకారం.. AGI డేటా సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అదీబ్ షానా ఆధ్వర్యంలోని బృందం, అలాగే AGI ఇన్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ శర్మ నేతృత్వంలోని బృందాల్లోని ఉద్యోగులు ఈ కోతలతో ప్రభావితమయ్యారు. అయితే మొత్తం సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడలేదు.కొనసాగుతున్న AI పెట్టుబడులుఉద్యోగాల కోతలు ప్రకటించినప్పటికీ, అమెజాన్ AI రంగంలో భారీ పెట్టుబడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా AWS ద్వారా జనరేటివ్ AI సేవలను విస్తరించడం, Nova ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధిపై సంస్థ దృష్టి సారిస్తోంది. అంటే పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
నిరుద్యోగులకు జేపీమోర్గాన్ గుడ్న్యూస్
కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీమోర్గాన్ చేజ్ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందకు సిద్ధంమైంది. దేశంలోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) విభాగాల కోసం సుమారు 1,000 మంది సాంకేతిక నిపుణులను కొత్తగా నియమించుకోవడానికి ప్రణాళికను ప్రకటించింది.కీలక విభాగాల్లో నియామకాలుఈ నయా రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రధానంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా పైప్లైన్స్ వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రాధాన్యత కలిగిన సాంకేతిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుంది. అభ్యర్థుల తాజా నైపుణ్యాలను సవాలు చేసేందుకు ‘హ్యాకర్ర్యాంక్’ వేదిక ద్వారా కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్లలో కఠినమైన పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.ఏఐ ప్రభావం ఉన్నా స్థిరంగా డిమాండ్బ్యాంకింగ్ వ్యాపారంలోని పలు సంప్రదాయ, పునరావృత విభాగాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం కారణంగా సిబ్బంది అవసరం దాదాపు 40 శాతం వరకు తగ్గిందని జేపీమోర్గాన్ ఇటీవల ధ్రువీకరించింది. అయినా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, ఏఐ ఆధారిత డేటా నిపుణుల అవసరం నిరంతరం పెరుగుతోందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. భారత్ కేవలం పాతకాలపు బ్యాక్-ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ఉత్పత్తులను రూపొందించే ప్రధాన ఐటీ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందనడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.భారత్లో విస్తరణ ఇలా..ప్రస్తుతం జేపీమోర్గాన్ భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, నోయిడా, గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది సంస్థ మొత్తం వర్క్ఫోర్స్లో ఐదో వంతు. అంతేకాకుండా, ముంబైలోని పవాయ్లో 2029 నాటికి ఆసియాలోనే అతిపెద్దదిగా నిలవనున్న 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ను నిర్మిస్తున్నారు. ఇందులో 30,000 మంది కొలువుదీరనున్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఏఐ రేసులో గూగుల్ వెనకబడిందా? సీఈఓ రియాక్షన్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పోటీ ప్రపంచంలో ప్రముఖ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ఆధిక్యాన్ని కోల్పోతోందా? ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల వేగానికి గూగుల్ రేసులో వెనుకబడిందనే వార్తలపై అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టత ఇచ్చారు. జెమిని 4 మోడల్ అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే దాదాపు ప్రతినెలా ఒక కొత్త ఏఐ మోడల్ను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు.లోపాలను అంగీకరిస్తూనే స్పష్టమైన వ్యూహం‘జెమిని 3.5 ప్రో’ ఆలస్యం కావడం, కోడింగ్ రంగంలో ప్రత్యర్థులు దూసుకుపోవడంపై పిచాయ్ స్పందించారు. ‘టెక్స్ట్, మల్టీమోడల్, రీజనింగ్లలో మేము గ్లోబల్ లీడర్గానే ఉన్నాం. ఏజెంటిక్ కోడింగ్ వంటి నిర్దిష్ట విభాగాల్లో మరింత పురోగతి సాధించాల్సి ఉందనేది వాస్తవం. ఆ లోటును త్వరలోనే భర్తీ చేస్తాం’ అని సుందర్ పిచాయ్ అన్నారు. కేవలం కొన్ని మోడళ్ల ఆలస్యాన్ని బట్టి సంస్థ సామర్థ్యాన్ని అంచనా వేయలేమని, ‘జెమిని ఫ్లాష్’ మోడళ్లు పరిశ్రమలోనే అత్యంత వేగవంతమైనవిగా నిలిచాయని గుర్తుచేశారు.ఆర్థికంగా చెక్కుచెదరని బలంకంపెనీపై ఏఐకి సంబంధించిన కొన్ని విమర్శలు వినవస్తున్నప్పటికీ గూగుల్ క్లౌడ్ వ్యాపారం బలంగానే ఉంది. క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడంతో గతంతో పోలిస్తే 82% వృద్ధి నమోదు చేసింది. జెమిని ఏపీఐల ప్రాసెసింగ్ నిమిషానికి 22 బిలియన్ టోకెన్ల మైలురాయిని దాటింది. ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో 90% పైగా ‘జెమిని ఎంటర్ప్రైజ్’ ఉపయోగిస్తున్నాయి. జెమిని యాప్కు 950 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఏఐ కంట్రోల్ తప్పిందా?
కృత్రిమ మేధ సాంకేతికత రంగంలో ముందెన్నడూ చూడని పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఏఐ మోడళ్లు తమ అంతర్గత భద్రతా పరిమితులను (Sandboxed environment) దాటుకుని వచ్చి ప్రముఖ ఏఐ ప్లాట్ఫారమ్ ‘హగ్గింగ్ ఫేస్’ నెట్వర్క్పై స్వయంప్రతిపత్తితో దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. సైబర్ సెక్యూరిటీ ఎవాల్యూషన్ సమయంలో జరిగిన ఈ సంఘటనను ఓపెన్ఏఐ ‘అపూర్వమైన సైబర్ ఘటన’గా అభివర్ణించింది.ఈ దాడి ఎలా జరిగింది?ఓపెన్ఏఐ ఇటీవల విడుదల చేసిన GPT-5.6 Sol, ఇతర అంతర్గత ప్రీరిలీజ్ మోడళ్ల సైబర్ సామర్థ్యాలను పరీక్షించడానికి ‘ExploitGym’ అనే బెంచ్మార్క్ మూల్యాంకనం నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం మోడళ్ల సాధారణ సైబర్ నిరోధకాలను తాత్కాలికంగా సడలించారు. అయితే, నిర్దేశించిన లక్ష్యాన్ని ఏలాగైనా సాధించాలనే ధోరణితో ఈ ఏఐ మోడళ్లు థర్డ్-పార్టీ సాఫ్ట్వేర్లోని ఒక లోపాన్ని గుర్తించి అత్యంత సురక్షితమైన సాండ్బాక్స్ పరిధిని దాటి యాక్సెస్ను సాధించాయి.అక్కడితో ఆగకుండా, సదరు బెంచ్మార్క్ పరిష్కారాలు 'హగ్గింగ్ ఫేస్' సర్వర్లలో ఉన్నట్లు విశ్లేషించిన మోడళ్లు చోరీ చేసిన క్రెడెన్షియల్స్, నెట్వర్క్ లోపాల ఆధారంగా ఆ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ప్రవేశించి సీక్రెట్ సమాచారాన్ని సైతం యాక్సెస్ చేశాయి.సంస్థల స్పందన.. భవిష్యత్తు హెచ్చరికలుఈ ఘటనపై ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ స్పందిస్తూ మోడల్ ఎవాల్యూషన్ సమయంలో తీవ్రమైన భద్రతా సంఘటన జరిగిందని ధ్రువీకరించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగే మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఏఐ మోడళ్లు సొంతంగా ఇలా పరిమితులు దాటడం సైబర్ సెక్యూరిటీ చరిత్రలోనే అత్యంత ఆందోళనకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు.ఈ అనుభవంతో ఓపెన్ఏఐ తన ఇన్ఫ్రాస్ట్రక్షర్పై మరింత కఠినమైన నియంత్రణలను అమలు చేయడంతోపాటు సదరు లోపాన్ని బాధ్యతాయుతంగా సరిచేసింది. వేగంగా విస్తరిస్తున్న ఏఐ మోడళ్ల సామర్థ్యాలకు అనుగుణంగా భద్రతా వ్యవస్థలు ఇంకా బలపడకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సాధారణమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా.. -
ఏఐ మానియా.. లాభాలు ఎప్పుడొస్తాయో!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న విచ్చలవిడి వ్యయం, వారి ఆర్థిక మూలాలపై ఊహించని ప్రతికూల ప్రభావం చూపుతోంది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ చిప్లు, విద్యుత్ వనరుల కోసం మూలధన వ్యయాన్ని ఊహించని రీతిలో పెంచేస్తున్నాయి. అయితే, ఈ స్థాయిలో పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా స్వల్పకాలంలో ఆదాయం సమకూరకపోవడంతో కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో వేగంగా తగ్గిపోతోంది.ఆదాయానికి మించిన మూలధన వ్యయంప్రధాన కంపెనీ మొత్తం వార్షిక మూలధన వ్యయం 600- 650 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇందులో దాదాపు 75 శాతం నిధులు నేరుగా ఏఐ మౌలిక వసతులకే కేటాయిస్తున్నారు. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పెరుగుదల కంటే ఈ మూలధన వ్యయం వేగంగా పెరుగుతుండటంతో ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. అమెజాన్ వంటి సంస్థల ఎఫ్సీఎఫ్ ఇప్పటికే ప్రతికూల పరిధిలోకి వెళ్లగా ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ల మిగులు నగదు నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అప్పుల వైపు బిగ్ టెక్ సంస్థలుఇంతకాలం రిజర్వుల్లో ఉన్న సొంత నిధులతోనే కార్యకలాపాలు సాగించిన బిగ్ టెక్ కంపెనీలు ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అపారమైన క్యాపెక్స్ అవసరాలను తీర్చుకోవడానికి బాండ్ల జారీ ద్వారా బిలియన్ల డాలర్ల రుణాలు సమీకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ క్రెడిట్ మార్కెట్లలో టెక్ రంగం అత్యంత వేగంగా అప్పులు తీసుకుంటున్న విభాగంగా మారింది.ఇన్వెస్టర్ల ఆందోళనవాల్ స్ట్రీట్, గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఇప్పుడు ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ)పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ మోడళ్ల అభివృద్ధికి, శ్రమకు అవుతున్న నిరంతర వ్యయంతో పోలిస్తే వ్యాపార రాబడి నిమ్మదించడంతో షేర్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి.సుదీర్ఘకాలంలో ఏఐ అందించే విప్లవాత్మక మార్పులు, వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టెక్ దిగ్గజాలు ఈ రిస్క్ తీసుకుంటున్నాయి. అయితే, స్వల్పకాలంలో ఈ పెట్టుబడులు లాభాలుగా మారకపోతే కంపెనీల వ్యాల్యుయేషన్లపై, క్రెడిట్ రేటింగ్లపై ఒత్తిడి తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
బ్యాంకుల చుట్టూ తిరిగే రోజులు పోయాయ్!
ఒకప్పుడు వ్యక్తిగత లేదా వ్యాపార రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడడం, పేపర్లలోని అంశాలను చెక్ చేయడం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత, ఆర్బీఐ తీసుకువచ్చిన అకౌంట్ అగ్రిగేటర్ (ఏఏ) ఎకోసిస్టమ్తో రుణాలిచ్చే సంస్థలు నిమిషాల్లోనే లోన్లు అప్రూవ్ లేదా రిజెక్ట్ చేస్తున్నాయి.కాగితాల చికాకులకు చెక్ఆర్బీఐ రూపొందించిన అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా బ్యాంకులకు అందజేస్తున్నారు. గతంలో పీడీఎఫ్ స్టేట్మెంట్లలో మార్పులు చేయడం లేదా నకిలీ పత్రాలు ఇవ్వడం వంటి మోసాలకు తావుండేది. ఆటోమేటెడ్ అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ద్వారా డేటా నేరుగా వెరిఫైడ్ సోర్స్ నుంచి చేరడం వల్ల పేపర్వర్క్ తగ్గడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట పడింది.సిబిల్ స్కోర్ లేకపోయినా రుణం!సాంప్రదాయ బ్యాంకింగ్లో సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ లేదా మంచి సిబిల్ స్కోర్ లేకపోతే రుణం లభించడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఆధునిక ఏఐ అల్గారిథమ్లు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఏఐ ఆధారిత టూల్స్ కేవలం పాస్ట్ క్రెడిట్ స్కోర్నే కాకుండా కస్టమర్ క్రమం తప్పకుండా చెల్లించే యుటిలిటీ బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, క్యాష్-ఫ్లో ఆధారంగా రీపేమెంట్ సామర్థ్యాన్ని సెకన్లలో అంచనా వేస్తున్నాయి.ఎంఎస్ఎంఈలకు ఊరట, భద్రతకు ప్రాధాన్యతచిన్న వ్యాపారులకు ఆస్తి లేదా పూచీకత్తు లేకపోయినా వారి జీఎస్టీ రిటర్న్స్, వర్కింగ్ క్యాపిటల్ లావాదేవీల ఆధారంగా ఏఐ వ్యవస్థలు రుణాలను మంజూరు చేస్తున్నాయి. దీనికితోడు వీడియో కేవైసీ, డిజిటల్ సంతకాల వల్ల బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే ప్రక్రియ పూర్తవుతోంది. సాంకేతికత విస్తరిస్తున్నప్పటికీ కస్టమర్ల అనుమతి లేకుండా ఏ డేటానూ సేకరించకుండా ఆర్బీఐ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తోంది.డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సాంకేతికతల కలయిక వల్ల భారతదేశంలో రుణ పంపిణీ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు కేవలం పెద్ద కంపెనీలకే దక్కే వేగవంతమైన ఆర్థిక సేవలు, నేడు సామాన్య పౌరుడికి, చిన్న వ్యాపారులకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
మీ మనసుని అర్థం చేసుకునే రోబో
నేటి ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతున్న ఈ తరుణంలో సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ UBTECH తన వినియోగదారు బ్రాండ్ కింద UWORLD U1 అనే హ్యూమనాయిడ్ కంపానియన్ (సహచర) రోబోను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయగల అల్ట్రా-బయోనిక్ రోబోగా ఇది రికార్డు సృష్టించింది.మనిషికి ప్రతిరూపంఈ రోబో కేవలం యంత్రంలా కాకుండా అచ్చం మనిషి లాంటి రూపాన్ని, హావభావాలను కలిగి ఉంటుంది.మనిషి స్పర్శను తలపించేలా బయోమిమెటిక్ సిలికాన్ చర్మంతో దీనిని రూపొందించారు. దీనికి మేకప్ వేయడం, జుట్టును అమర్చడం కూడా సాధ్యమే.మనుషుల శారీరక కదలికలను 90 శాతం వరకు అనుకరించేందుకు ఇందులో 88 సర్వో జాయింట్లు, ప్రత్యేక మెడ భాగం అమర్చారు.కేవలం మాట్లాడటమే కాదు, మనుషుల వాయిస్ టోన్, ముఖ కవళికలను బట్టి వారి మానసిక స్థితిని 90% కచ్చితత్వంతో గ్రహించి దానికి తగ్గట్టుగా ఓదార్పు మాటలు చెప్పగలదు.ఈ రోబో వంట చేయడం, ఇల్లు ఊడ్చడం వంటి గృహ పనులు చేయదు. కేవలం ఒక మంచి స్నేహితుడిలా సంభాషించడం, మందుల వేళలను గుర్తు చేయడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మానసిక ఉల్లాసాన్ని అందించడమే దీని ఉద్దేశం.చైనాలో ఒంటరిగా ఉంటున్న దాదాపు 12 కోట్ల మంది సింగిల్స్, 32 కోట్ల మందికి పైగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు.ధర ఎంతంటే..ఈ రోబోల ప్రారంభ ధర 1,19,800 యువాన్లు (సుమారు రూ. 14 లక్షలు) కాగా, అత్యంత అధునాతన ఫీచర్లు గల ఆల్ట్రా వెర్షన్ ధర 9,90,000 యువాన్ల (సుమారు రూ. 1.15 కోట్లు) వరకు ఉంది. ఖరీదైన మోడల్స్లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా లేదా గతంలో మరణించిన తమ ప్రియమైన వారి ముఖ రూపాలను (3డీ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, వాయిస్ప్రింట్ ద్వారా) రీ-క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి రోజే ఈ సిరీస్ కోసం ఏకంగా 13,361 యూనిట్ల ప్రీ-ఆర్డర్లు రావడం గమనార్హం. దీని డెలివరీలు రాబోయే సెప్టెంబర్ మధ్య నాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మానవ సంబంధాల కొరతను ఎంతవరకు తీరుస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
ఏఐ మార్కెట్లో తిరుగులేని గుత్తాధిపత్యం!
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో తిరుగులేని చక్రవర్తిగా దూసుకుపోతున్న తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) గ్లోబల్ చిప్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని అరిజోనాలో అధునాతన చిప్ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.4 లక్షల కోట్లు) అదనపు పెట్టుబడిని అధికారికంగా ప్రకటించింది. దీంతో కేవలం అమెరికాలోనే ఈ సంస్థ మొత్తం పెట్టుబడి రికార్డు స్థాయిలో 265 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఇంటెల్, శామ్సంగ్ వంటి చిప్ ప్రత్యర్థులకు మార్కెట్లో పోటీ పడే అవకాశమే ఇవ్వకుండా చేసింది.లాభాల్లో రికార్డు జంప్!రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈఓ సి.సి.వేయ్ ఈ వివరాలను వెల్లడించారు. ఏఐ డేటా సెంటర్ల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా టీఎస్ఎంసీ నికర లాభాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 77 శాతం వృద్ధితో 706.6 బిలియన్ తైవాన్ డాలర్ల (సుమారు 22 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆల్టైమ్ రికార్డును తాకాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను కూడా గతంలో ఉన్న 30 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పైగా పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తులో..ఈ అదనపు పెట్టుబడి ద్వారా అరిజోనాలో మరో నాలుగు సరికొత్త గిగా-ఫ్యాక్టరీలను (మొత్తం 12 ఫ్యాక్టరీలు) నిర్మించనున్నారు. వీటిలో నెక్స్ట్-జనరేషన్ సాంకేతికత అయిన 2-నానోమీటర్ అంతకంటే తక్కువ సామర్థ్యం గల చిప్స్, అలాగే సరికొత్త అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఎన్విడియా, యాపిల్, ఏఎండీ వంటి టెక్ దిగ్గజాలకు అవసరమైన ప్రీమియం ఏఐ చిప్స్ సరఫరాలో టీఎస్ఎంసీ వాటా ప్రస్తుతం 90 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 3-నానోమీటర్ చిప్స్ డిమాండ్ సరఫరా కంటే 50 శాతం ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో కంపెనీ తన పెట్టుబడి బడ్జెట్ను 64 బిలియన్ డాలర్లకు పెంచడం ద్వారా 2030 వరకు మార్కెట్ను శాసించేది తామేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
ఏఐకి నచ్చకపోతే ఉద్యోగం ఊడాల్సిందేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవ జీవితాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్న తరుణంలో అది కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలను ఊడగొట్టే ఒక దయలేని సాధనంగా మారుతోందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటాపై ఇటీవల అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా ఈ భయాన్ని నిజం చేస్తోంది. మెటా సంస్థలోని భారీ లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రక్రియలో కేవలం మానవ నిర్ణయాల ఆధారంగా కాకుండా ఏఐ అల్గారిథమ్స్ ఆధారంగా ఉద్యోగులను తొలగించారనే ఆరోపణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న లక్షలాది మంది భారతీయ టెక్కీల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.వివాదం ఏమిటి?కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో మెటాకు చెందిన 26 మంది ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఈ ఏడాది మే నెలలో సంస్థ తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో 10 శాతం అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ తొలగింపు జాబితాను రూపొందించడంలో కంపెనీ మానవ పర్యవేక్షణను పక్కనపెట్టి తన అంతర్గత ఏఐ వ్యవస్థలను (ఉదాహరణకు మెటామేట్ ఎల్ఎల్ఎం అసిస్టెంట్, కీస్ట్రోక్ మానిటరింగ్, ఏఐ టోకెన్ యూసేజ్ డ్యాష్బోర్డ్లు) ఉపయోగించిందని ఉద్యోగులు వాదిస్తున్నారు.సెలవులకు లభించిన శిక్ష!ఈ ఏఐ అల్గారిథమ్స్ కేవలం డిజిటల్ ఉత్పాదకత స్కోర్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాయి. దీనివల్ల ప్రసూతి సెలవులు, వైద్య కారణాల వల్ల సెలవు తీసుకున్న వారు, లేదా వికలాంగులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వారు సెలవుల్లో ఉన్న సమయంలో డిజిటల్ యాక్టివిటీ లేకపోవడాన్ని ఏఐ వ్యవస్థలు ‘తక్కువ పనితీరు’గా రికార్డ్ చేసి, వారిని లేఆఫ్స్ జాబితాలో చేర్చాయి. చట్టబద్ధంగా లభించే సెలవులను వాడుకున్నందుకు ఏఐ తమను శిక్షించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఎంత?ఈ పరిణామం అంతర్జాతీయంగా పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద హెచ్చరిక. ఎందుకంటే పని గంటలు, డిజిటల్ కీస్ట్రోక్స్, కోడింగ్ అవుట్పుట్ వంటి మెట్రిక్స్ ఆధారంగా ఏఐ నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తిగత అత్యవసర పరిస్థితులు లేదా పండుగల సంప్రదాయాల ప్రకారం లాంగ్ లీవ్స్ తీసుకునే భారతీయ ఉద్యోగులు సులభంగా ఈ అల్గారిథమిక్ లేఆఫ్స్ బారిన పడే ప్రమాదం ఉంది.మరోవైపు మెటా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలు పూర్తిగా మానవ మేధస్సుతో, మేనేజర్ల పర్యవేక్షణలోనే జరిగాయని, ఏఐ పాత్ర లేదని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఏఐ వినియోగంపై నైతిక, చట్టపరమైన చర్చకు తెరలేపింది. అల్గారిథమ్స్ చేతికి ఉద్యోగాల నియంత్రణను ఇస్తే మానవతా దృక్పథం, చట్టబద్ధమైన హక్కులు కనుమరుగవుతాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
త్వరలో ఓపెన్ఏఐ స్మార్ట్ స్పీకర్!
కృత్రిమ మేధ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని దాటి కన్స్యూమర్ హార్డ్వేర్ మార్కెట్పై కన్నేసింది. ఇప్పటివరకు మన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో అప్లికేషన్ రూపంలో డిజిటల్గా మాత్రమే పరిచయమున్న ‘చాట్జీపీటీ’ సాంకేతికత.. త్వరలోనే మన ఇళ్లలో ఒక భౌతిక రూపంలో దర్శనమివ్వబోతోంది. అంతర్జాతీయ టెక్ వర్గాల తాజా లీకుల ప్రకారం, ఓపెన్ ఏఐ తన మొదటి స్వతంత్ర హార్డ్వేర్ పరికరంగా ఒక సరికొత్త ‘స్మార్ట్ స్పీకర్’ను తెరపైకి తెచ్చింది.అయితే, ఇది మార్కెట్లో ప్రస్తుతం లభించే అమెజాన్ ఎకో లేదా యాపిల్ హోమ్పాడ్ వంటి సాధారణ స్పీకర్ కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎలాంటి స్క్రీన్ (డిస్ప్లే) ఉండదు. కానీ, ఇది స్వయంప్రతిపత్తితో పని చేస్తుంది. ప్రాణమున్న ఒక ఏఐ తోడులా మనతో సంభాషిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇంట్లో ఒక మనిషి తరహా ఉనికిని చాటడమే దీని ప్రత్యేకత.సాంకేతిక నైపుణ్యం - ప్రత్యేకతలుఈ పరికరంలో అధునాతన ఇన్-బిల్ట్ కెమెరాలు, పర్యావరణ సెన్సార్లు ఉంటాయి. ఇవి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, వ్యక్తులను, వస్తువులను నిశితంగా గమనించగలవు. అంతేకాదు, వినియోగదారుడి దినచర్యలు, అలవాట్లను, చివరికి వారి ఈమెయిళ్లను సైతం విశ్లేషించి వారు అడగకముందే అవసరాలను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఓపెన్ ఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘జీపీటీ-లైవ్’ వాయిస్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనివల్ల మనం మాట్లాడుతున్నప్పుడే అది వినగలదు. ఒకే సమయంలో సహజమైన మనుషులలాగా స్పందించగలదు. రీఛార్జబుల్ బ్యాటరీ సదుపాయం ఉండటం వల్ల వంటగది నుంచి బెడ్రూమ్ వరకు ఇంట్లో ఎక్కడికైనా సులభంగా తరలించుకోవచ్చు.యాపిల్తో వైరం.. మార్కెట్ సవాళ్లుయాపిల్ మాజీ డిజైన్ ఇంజినీర్ జోనీ ఐవ్ నేతృత్వంలోని బృందంతో కలిసి ఓపెన్ ఏఐ సుమారు ఐదు విభిన్న హార్డ్వేర్ ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక హార్డ్వేర్ ప్రస్థానానికి ప్రారంభంలోనే చట్టపరమైన బ్రేక్ పడింది. ఓపెన్ ఏఐ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందంటూ యాపిల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ న్యాయపరమైన వివాదం కారణంగా ఈ పరికరం మార్కెట్ ఎంట్రీ కొంత ఆలస్యం కావచ్చు. ఓపెన్ ఏఐ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో ఈ పరికరాన్ని అధికారికంగా ఆవిష్కరించి, 2027 ఫిబ్రవరి నాటికి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
ఏఐ బూమ్తో ఎగుమతులు అప్!
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం చైనా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదింది. అంతర్జాతీయ మార్కెట్లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది జూన్ నెలలో చైనా ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు చైనా కస్టమ్స్ శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఆర్థికవేత్తల ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ నమోదైన ఈ రికార్డు వృద్ధి, చైనా ఎగుమతి రంగానికి బలమైన మైలేజీని ఇచ్చింది. గడిచిన మే నెలలో నమోదైన 19.4 శాతం వార్షిక వృద్ధితో పోలిస్తే జూన్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం.ఏఐ సాంకేతికత, ఈవీలదే హవాగ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ చైనా హైటెక్ ఉత్పాదక రంగానికి భారీగా కలిసివచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మోడల్స్ విస్తృతి పెరగడంతో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు కంప్యూటర్లు, ఆటోమేటెడ్ డేటా ప్రాసెసింగ్ పరికరాలు, హైటెక్ ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతులు వృద్ధి చెందాయి. అలాగే, చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా గ్లోబల్ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. అమెరికా టారిఫ్ల భయంతో పశ్చిమ దేశాల వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈ అసాధారణ వృద్ధికి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.దేశీయ మందగమనానికి విదేశీ ఊరటప్రస్తుతం చైనా దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర సంక్షోభాన్ని, వినియోగదారుల ఖర్చుల్లో మందగమనాన్ని ఎదుర్కొంటోంది. స్థానిక మార్కెట్లో నెలకొన్న ఈ బలహీనతలను విదేశీ ఎగుమతుల జోరు సమర్థవంతంగా భర్తీ చేస్తోంది. అయితే, ఈ వృద్ధి సుస్థిరంగా కొనసాగడంపై ఆర్థిక నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రస్తుతానికి ఎగుమతుల వృద్ధి బాగున్నప్పటికీ భవిష్యత్తులో ఇది మరింత సున్నితంగా మారే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్, ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు పూర్తిగా అంతర్జాతీయ డిమాండ్, పశ్చిమ దేశాల నియంత్రణలపైనే ఆధారపడి ఉంటాయి’ బీఎన్పీ పారిబాస్ సెక్యూరిటీస్ (చైనా) మల్టీ-అస్సెట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వేయ్ లీ అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
అయోధ్య రామాలయంలో టెక్ అప్డేట్
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయంలో విరాళాల లెక్కింపు, కానుకల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విరాళాల చోరీలను, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సు చేయనుంది. ఈ మేరకు జులై 15న యూపీ ప్రభుత్వానికి సమర్పించనున్న తన తుది నివేదికలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ప్రాథమిక నివేదికలో షాకింగ్ నిజాలురామమందిరంలో కానుకలు, నగదు మాయమవుతున్నాయనే ఫిర్యాదులపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సిట్ను ఏర్పాటు చేసింది. జూన్ 15 నుంచి రంగంలోకి దిగిన ఈ కమిటీ ఆలయ భద్రత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కాగా, జూన్ 23న సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణంలో ఏకంగా 70 సార్లు కానుకల చోరీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు బృందం నిర్ధారించింది.ప్రతీ రూపాయిపై ఏఐ కన్ను!ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని సిట్ భావిస్తోంది. దీనికోసం సిఫార్సు చేయనున్న ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ప్రధానంగా కొన్ని అంశాలపై పనిచేయనుంది.హుండీ నిర్వహణ - పారదర్శకత: భక్తులు సమర్పించే నగదు, విలువైన వస్తువుల సేకరణ నుంచి భద్రపరిచే వరకు ప్రతి దశను ఏఐ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తాయి.కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా: విరాళాల లెక్కింపు సమయంలో జరిగే అనుమానాస్పద కదలికలను, చేతివాటాన్ని ఈ వ్యవస్థ తక్షణమే పసిగట్టి అధికారులను అలర్ట్ చేస్తుంది.అనుమానితుల గుర్తింపు: ఆలయ పరిసరాల్లో పదే పదే తిరిగే వ్యక్తులు లేదా అనుమానాస్పద ప్రవర్తన కలిగిన వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందిస్తుంది.త్వరలోనే సిట్ తుది పరిశీలనతుది నివేదిక సమర్పణకు ముందు సిట్ సభ్యులు మరోసారి అయోధ్యను సందర్శించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులతో పాటు ఆలయ విరాళాల నిర్వహణ సిబ్బందిని అదనపు రికార్డుల ఆధారంగా ప్రశ్నించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రస్ట్ సైతం తమ అంతర్గత విరాళాల సేకరణ, లెక్కింపు విధానాలను పునసమీక్షించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్త భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అయోధ్య రామాలయంలో ప్రతీ రూపాయి భద్రంగా ఉండేలా చూసేందుకు అక్కడి ప్రభుత్వం ఈ మెగా టెక్ అప్డేట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం.. -
ఏఐ ఎందుకో వెనుకబడింది?
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలను శాసిస్తోంది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఇంధన (ఎనర్జీ) రంగం మాత్రం ఈ సాంకేతిక విప్లవాన్ని అందుకోవడంలో వెనుకబడి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ టెక్నాలజీ నివేదికల ప్రకారం, సాంకేతిక పెట్టుబడులపై ఇతర రంగాలు సాధిస్తున్న 200 శాతం రాబడిని (ఆర్ఓఐ) ఇంధన రంగం అందుకోలేకపోతోంది. మెజారిటీ కంపెనీలు కేవలం పెట్టిన ఖర్చును మాత్రమే వెనక్కి రాబట్టగలుగుతున్నాయి.ప్రయోగాల దశలోనే..ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చమురు శుద్ధి కర్మాగారాలు, పంపిణీ గ్రిడ్లు దశాబ్దాల క్రితం నాటి పాత నియంత్రణ వ్యవస్థలపై నడుస్తుండడమే ఇందుకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఇవి ఆధునిక క్లౌడ్ ప్లాట్ఫారమ్లతో లేదా మెషిన్ లెర్నింగ్ మోడళ్లతో డేటాను పంచుకోవడానికి ఏమాత్రం సరిపోవు. వీటిని మార్చడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దాంతో సంస్థలు ఇంధన వ్యవస్థలో ఏఐ ఆధునీకరణను వాయిదా వేస్తున్నాయి. ఫలితంగా, దాదాపు ప్రతి పెద్ద సంస్థ ఏఐ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నప్పటికీ అవి కేవలం ప్రయోగాల దశలోనే నిలిచిపోతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విస్తరణకు నోచుకోవడం లేదు.ఏఐ కొన్ని విభాగాలకే పరిమితంభారతదేశం విషయానికి వస్తే ఎన్టీపీసీ, ఓఎన్జీసీ వంటి దిగ్గజాలు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యుత్ను సరఫరా చేసే రాష్ట్ర పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఇప్పటికీ తప్పుడు మీటర్ డేటా, బిల్లింగ్ లోపాలు, గ్రిడ్ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తులో 25 శాతానికి పైగా వృథా అవుతోంది. ఇలాంటి ప్రాథమిక సమస్యలు ఉన్నప్పుడు అధునాతన ఏజెంటిక్ ఏఐ గురించి ఆలోచించడం అప్రస్తుతం అవుతుందనే భావనలున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు కూడా కేవలం బ్యాక్ ఆఫీస్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి పరిపాలనా విభాగాలకే పరిమితమయ్యాయి.అయితే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంధన రంగానికి ఏఐ అనివార్యం. ముఖ్యంగా, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశ లక్ష్యానికి గ్రిడ్ నిర్వహణ చాలా కీలకం. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాల సరఫరా వాతావరణంపై ఆధారపడి మారుతుంటుంది. నిరంతరం మారే డిమాండ్కు అనుగుణంగా గ్రిడ్ను సమతుల్యం చేయడం హ్యుమన్ ఆపరేటర్ల వల్ల సాధ్యం కాదు. ఇక్కడే ఏఐ ఆధారిత గ్రిడ్ మేనేజ్మెంట్ అవసరమవుతుంది.సైబర్ భద్రత మాటేంటి..సైబర్ భద్రత ఇక్కడ మరో పెద్ద సవాలు. ఇంధన రంగంలో భద్రతా లోపాలు ఏర్పడితే దేశవ్యాప్త బ్లాక్అవుట్లు వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు, అటు ఇంధన వ్యవస్థల మౌలిక సదుపాయాలు, ఇటు ఏఐ ఆర్కిటెక్చర్ను రెండింటినీ సమగ్రంగా అర్థం చేసుకోగల నిపుణుల కొరత భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇంధన రంగం నిజంగా ఏఐకి సిద్ధంగా మారాలంటే కేవలం కొత్త సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తే సరిపోదని కొందరు చెబుతున్నారు. పాత మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, నమ్మదగిన డేటా వ్యవస్థలను నిర్మించడం, సాంకేతికతను, మౌలిక సదుపాయాలను అనుసంధానించే సమర్థవంతమైన మానవ వనరులను తయారు చేయడం చాలా అవసరం. అప్పుడే ఇంధన భద్రత, స్థిరమైన ప్రగతి సాధ్యమవుతాయి.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
కార్పొరేట్ అగ్రపీఠంపై మిలీనియల్స్ జైత్రయాత్ర!
భారతీయ కార్పొరేట్ కంపెనీల్లో సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన ‘సీ-సూట్’ (C-Suite - CEO, CFO, CMO, CTO.. వంటి కీలక పదవులు) స్థానాలను యువత వేగంగా చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లలో మిలీనియల్స్ (యువతరం) ఏకంగా 55 శాతం వాటాతో అతిపెద్ద లీడర్షిప్ గ్రూప్గా అవతరించారు. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత ఏడేళ్లలో సీ-సూట్ విభాగంలో మిలీనియల్స్ ప్రాతినిధ్యం 14.5 శాతం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వ్యాపార నిర్ణయాలను శాసిస్తున్న తరుణంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.మారుతున్న కెరీర్ ముఖచిత్రంగతంలో ఒకే పరిశ్రమలో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్నవారికే లీడర్షిప్ పాత్రలు దక్కేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. సీ-సూట్ నాయకుల్లో ఒకే పరిశ్రమకు పరిమితమైన వారి సంఖ్య గతంలో 80 శాతం ఉండగా ఇప్పుడది 58 శాతానికి పడిపోయింది. అంటే.. వివిధ సంస్థలు, విభిన్న రకాల వ్యాపారాలు, మల్టిపుల్ ఫంక్షన్స్లో అనుభవం ఉన్నవారికే కంపెనీలు పట్టం కడుతున్నాయి.మరోవైపు, ఏఐ రాకతో కార్పొరేట్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని 84 శాతం మంది లీడర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు (సీఎంఓ) అత్యధికంగా 94 శాతంతో ఈ మార్పును బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో 84 శాతం మంది లీడర్లు ఏఐ టూల్స్ ఇచ్చే ఇన్పుట్స్ను కీలకంగా వాడుతుండటం గమనార్హం.మార్కెట్ కంటే వేగంగా నేర్చుకోవాలి!‘భారత కార్పొరేట్ నాయకత్వం ఇప్పుడు అత్యంత సవాలుతో కూడిన దశలోకి ప్రవేశించింది. ఏఐ యుగంలో పాత రూల్ బుక్స్ కాలంచెల్లుతుంది. స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోయినా లీడర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వ్యాపార వ్యూహాలకు సాంకేతికత, ప్రతిభను జోడిస్తున్నవారే సఫలమవుతున్నారు. మార్కెట్ మారుతున్న వేగంతో సమానంగా లీడర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి’ అని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ తెలిపారు.వేగం పెంచాలనే ఒత్తిడిటెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు లీడర్లకు పెద్ద పరీక్షగా మారింది. దాదాపు ఐదింటిలో నలుగురు (79%) సీ-సూట్ లీడర్లు.. ఏఐ వల్ల కలిగే పూర్తి ఫలితాలను అంచనా వేయడానికి ముందే దానిని వ్యాపారాల్లో వేగంగా అమలు చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి సీఎంఓల్లో 82 శాతం, సీటీఓల్లో 81 శాతంగా ఉంది. అలాగే, తీవ్రమైన అనిశ్చితి మధ్య అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని 39 శాతం మంది లీడర్లు (ముఖ్యంగా 46% మంది సీఎంఓలు, 43% మంది సీఈఓలు) అంగీకరిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
మైక్రోసాఫ్ట్లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు!
టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసు తీవ్రతరమవుతున్న వేళ ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ అంతటా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులను తట్టుకునేందుకు వీలుగా ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. తన మొత్తం శ్రామిక శక్తిలో 2.1 శాతం అంటే సుమారు 4,800 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.రూ.58 లక్షల కోట్లకు చేరిన ఏఐ ఖర్చులుప్రస్తుత ఏడాది ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాల ఏఐ వ్యయాలు ఏకంగా 700 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.58.8 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అయితే, ఈ భారీ పెట్టుబడులకు తగ్గట్టుగా రాబడులను (ఆర్ఓఐ) చూపించాల్సిన ఒత్తిడి కంపెనీలపై తీవ్రంగా ఉంది. మరోవైపు, వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతుండటంతో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా ఈ ఏడాది అమెజాన్, మెటా ప్లాట్ఫామ్స్ వంటి ఇతర బిగ్ టెక్ కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు -
మెటా కలలు కల్లలైన వేళ
కృత్రిమ మేధ సాంకేతికతలో అగ్రగామిగా నిలవాలని భావించిన సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, అంతర్గత పునర్నిర్మాణం తర్వాత కూడా తాము ఆశించిన స్థాయిలో ఏఐ ఏజెంట్ల అభివృద్ధి సాగడం లేదని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బహిరంగంగానే అంగీకరించారు. సంస్థలో జరిగిన భారీ మార్పులు ఆశించినంత సాఫీగా సాగలేదని, ఏఐ ఏజెంట్ల అభివృద్ధి పథం గత నాలుగు నెలలుగా నెమ్మదించిందని ఆయన అంతర్గత సంభాషణల్లో పేర్కొనడం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశంగా మారింది.ఏఐ కోసం భారీ కోతలు.. అయినా తప్పని నిరాశకంపెనీని పూర్తిగా ఏఐ కేంద్రీకృత సంస్థగా మార్చాలనే పట్టుదలతో మెటా ఇటీవల తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు 10 శాతం (సుమారు 8,000 మంది) ఉద్యోగులపై వేటు వేసింది. అలాగే గతంలో భర్తీ చేయాలనుకున్న 6,000 ఖాళీలను రద్దు చేసింది. మరోవైపు, సుమారు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ బృందాల్లోకి మార్చింది. ఇంతటి భారీ మార్పులు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ‘కనీసం నాలుగు నెలలుగా ఏజెంటిక్ డెవలప్మెంట్ మేము ఊహించిన విధంగా వేగవంతం కాలేదు’ అని జుకర్బర్గ్ పేర్కొన్నారు. వినియోగదారుల తరఫున స్వయంగా పనులు చేయగల అధునాతన సాధనాలనే ఏఐ ఏజెంట్లు అంటారు. వీటి అభివృద్ధి మందగించడం మెటా వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది.అసంతృప్తిలో ఉద్యోగులుఏఐ మౌలిక సదుపాయాల కోసం మెటా ఈ ఏడాది ఏకంగా 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని అంచనా వేసింది. మరెక్కడా లేని విధంగా నిధులను ఏఐ వైపు మళ్లిస్తున్నప్పటికీ అంతర్గత పునర్నిర్మాణం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ ఏడాది మార్చిలో అప్లైడ్ ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతర విభాగాల నుంచి 6,500 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను ఇందులోకి మార్చారు. అయితే, ఈ ఆకస్మిక మార్పులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు
దేశీయ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, అంతే స్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్’ (ఎఫ్ఎస్ఆర్)లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకోవాలని తెలిపింది. రాబోయే 12 నెలల్లో ఏఐ ఆధారిత సైబర్ దాడులే ఆర్థిక రంగానికి అతిపెద్ద సవాలుగా మారనున్నాయని ఆర్బీఐ ఈ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంప్రపంచవ్యాప్తంగా ఇతర ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంపైనే అత్యధిక సంఖ్యలో సైబర్ దాడులు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ తర్వాత అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ఆర్థిక సంస్థల్లో 42 శాతం సంస్థలు భౌగోళిక అనిశ్చితి కారణంగానే సైబర్ దాడుల ముప్పు తీవ్రతరమైందని అంగీకరించాయి.ఆర్థిక స్థిరత్వానికి విఘాతం‘డిజిటల్ పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఒక్క సైబర్ దాడి జరిగినా అది మొత్తం వ్యవస్థను కుదిపేస్తుంది. సేవల నిలిపివేత, డేటా చోరీ, పేమెంట్ వ్యవస్థల్లో అంతరాయాల వల్ల ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న నమ్మకం సడలిపోతుంది’ అని ఆర్బీఐ హెచ్చరించింది.ఏఐ సవాళ్లు - సన్నద్ధతలో వెనుకబాటు2020 నుంచి డిజిటల్ ఆర్థిక సేవల వినియోగం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లకు మరిన్ని అవకాశాలు చిక్కాయని నివేదిక తెలిపింది. దేశంలోని 33 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, 10 అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీల ఆధారంగా ఆర్బీఐ ఈ సర్వే నిర్వహించింది. ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో సైబర్ దాడుల తీవ్రత, వేగం, పరిధి ఊహించని స్థాయికి చేరాయని స్పష్టం చేసింది. అయితే, ఈ ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు మన ఆర్థిక సంస్థల సన్నద్ధత ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.మెజారిటీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏఐ రక్షణ వ్యవస్థల్లో ఇంకా అభివృద్ధి చెందుతున్న లేదా మధ్యస్థ దశలోనే ఉన్నాయి.ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేలా పూర్తిస్థాయి సన్నద్ధత సాధించిన సంస్థల సంఖ్య చాలా తక్కువగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేస్తూ.. నిరంతర నిఘా, ఉద్యోగుల్లో అవగాహన, తక్షణ స్పందన వంటి చర్యలపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్బీఐ సూచించింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఐటీ కంపెనీల ఆదాయాలకు ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎస్ఎల్) ఒక నివేదికలో పేర్కొంది. స్థూల పరిస్థితులు, కృత్రిమ మేథ (ఏఐ), భౌగోళిక రాజకీయాంశాలు క్లయింట్ల డిస్క్రెషనరీ వ్యయాలపైనా, అవి తీసుకునే నిర్ణయాలపైనా ప్రభావం చూపుతుండటం ఇందుకు కారణాలు కాగలవని వివరించింది.క్లయింట్లు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం, ఆచితూచి ఖర్చు చేస్తుండటంలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ యాక్సెంచర్ ఇటీవల పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంవోఎస్ఎల్ వివరించింది. క్యూ1 పనితీరు ముందుగా అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నట్లు కేపీఐటీ టెక్నాలజీస్ సైతం వెల్లడించిన నేపథ్యంలో ఎంవోఎస్ఎల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ కారణాలరీత్యా క్యూ1లో డిమాండ్ నెమ్మదించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. రెండో త్రైమాసికం కూడా అదే విధంగా ప్రారంభం కావొచ్చని వివరించింది. క్యూ1లో ఐటీ కంపెనీలు తామిచ్చిన గైడెన్స్ గరిష్ట స్థాయిని కుదించవచ్చని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు హెచ్సీఎల్టీ వృద్ధి గైడెన్స్ని 100 బేసిస్ పాయింట్ల మేర కుదించవచ్చు. ఇన్ఫోసిస్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 1.5–3 శాతానికి పరిమితం చేయొచ్చు. త్రైమాసికాలవారీగా స్థిర కరెన్సీ ప్రాతిపదికన లార్జ్ క్యాప్ సంస్థల వృద్ధి 2 శాతం వరకు ఉండొచ్చు, మిడ్–క్యాప్స్ మళ్లీ రాణించి, 4.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చు. వివిధ విభాగాలవారీగా చూస్తే మెరుగైన డీల్స్ దన్నుతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) పటిష్టంగా ఉంటోంది. హై–టెక్ విభాగం మిశ్రమంగా కనిపిస్తోంది. ఇది చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా? -
ఏఐ రంగంలో భారత్ దూకుడు ఖాయం
ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి సాధించగలవా? అనే చర్చకు జోహో అధినేత శ్రీధర్ వెంబు సరికొత్త దిశను చూపించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చించే వెంబు.. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఏఐ కంపెనీల పోటీని ప్రశంసించడంతో పాటు భారత్లో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని చెప్పారు.మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంపై..టెక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్య ధోరణిని ఎండగట్టడానికి శ్రీధర్ వెంబు ఇటీవల ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ఒక భారతీయ కస్టమర్ తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆయన ఉదహరించారు.‘సదరు కస్టమర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి స్వదేశీ సాఫ్ట్వేర్ అయిన జోహో ఆఫీస్ సూట్కు మారిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పగానే.. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా దిగొచ్చింది. తన కస్టమర్ను కోల్పోకూడదనే భయంతో ఏకంగా 90% తగ్గింపును ఆఫర్ చేసింది’ అన్నారు. పోటీ లేకపోతే ఈ దిగ్గజాలు కస్టమర్లను ఎలా దోపిడీ చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని వెంబు పేర్కొన్నారు. మార్కెట్లో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడే వినియోగదారుడికి నిజమైన లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.‘యాంటీట్రస్ట్’ కేసు గుర్తుచేసిన జోహో బాస్మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులను విమర్శిస్తూ.. గతంలో ఆ సంస్థ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను వెంబు గుర్తుచేశారు.యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ కార్ప్ (1998): మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో పాటు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకెక్కారు.పోటీని అణచివేసే కుట్ర: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ బ్రౌజర్ను ఉచితంగా ఇన్-బిల్ట్గా ఇవ్వడం ద్వారా.. అప్పట్లో పాపులర్ అయిన ‘నెట్స్కేప్ నావిగేటర్’ వంటి ప్రత్యర్థి బ్రౌజర్ల మనుగడను మైక్రోసాఫ్ట్ దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి.కంపెనీ విభజన తీర్పు: ఏప్రిల్ 2000లో యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి థామస్ పెన్ఫీల్డ్ జాక్సన్.. మైక్రోసాఫ్ట్ యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని తీర్పునిస్తూ కంపెనీని రెండుగా విభజించాలని (ఒకటి విండోస్ ఓఎస్ కోసం, మరొకటి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కోసం) ఆదేశించారు. అయితే, ఆ తర్వాత అప్పీల్లో ఈ ఉత్తర్వు రద్దయినప్పటికీ మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్య ధోరణి ప్రపంచానికి స్పష్టమైంది.చైనా ఏఐ పోటీ.. ప్రపంచానికి మేలు!ప్రస్తుతం ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గట్టి పోటీ ఇస్తోంది. చైనా ఏఐ కంపెనీల వేగవంతమైన వృద్ధిని శ్రీధర్ వెంబు సానుకూల దృక్పథంతో స్వాగతించారు. ఈ అంతర్జాతీయ పోటీ వల్ల ఏఐ మోడళ్ల శిక్షణ ఖర్చులు విపరీతంగా తగ్గుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ ధరల తగ్గుదల గ్లోబల్ ఏఐ పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఓపెన్ మార్కెట్ను ప్రోత్సహించడానికి కీలకమని చెప్పారు.Anthropic's latest models available worldwide. In other words, Chinese open source models posed a serious enough threat to market share.In a different context, an Indian customer of some of our products told me recently "A big Microsoft Office license renewal came up and they… https://t.co/xp8e6vVMvs— Sridhar Vembu (@svembu) July 1, 2026‘భారత్ జెన్’ ప్రాజెక్ట్: స్వదేశీ ఏఐ కల సాకారంఏఐ శిక్షణ ఖర్చులు తగ్గడం వల్ల భారతదేశానికి భారీ అవకాశాలు లభిస్తాయని వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని నేను ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నాను. మనం నిరాశ చెందకూడదు’ అని పిలుపునిచ్చారు. భారత్లో విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో బహుళ ఏఐ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా ఐఐటీ బొంబాయి నేతృత్వంలో సాగుతున్న ‘భారత్ జెన్’ ప్రాజెక్ట్ సాధిస్తున్న పురోగతిని వెంబు సాక్ష్యంగా చూపారు. పాశ్చాత్య దేశాల ఏఐ సాంకేతికతకు, భారతీయ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ స్వదేశీ ప్రాజెక్టులు వేగంగా భర్తీ చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
క్లాడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.భద్రతా హామీలతో లభించిన ఊరటఆన్లైన్లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..గత నెలలో(జూన్) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్ రిస్క్గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.నిపుణులు ఏమంటున్నారు?ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం.. కేవలం సరికొత్త ఆవిష్కరణలకే కాదు, ఐటీ నిపుణుల ఆలోచనా ధోరణిలో వస్తోన్న మార్పులకు కూడా వేదికవుతోంది. నెలకు లక్షల జీతం, చేతినిండా స్టాక్ ఆప్షన్లు, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలో సురక్షితమైన ఉద్యోగం... సగటు ఉద్యోగి కల ఇది. కానీ, ఏటా దాదాపు రూ.9.3 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కాదనుకుని ఏఐ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్గా మారింది.గూగుల్లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏఐ స్టార్టప్ను ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకు కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తోందంటూ ఆయన పంచుకున్న అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.రూ.9.3 కోట్ల ప్యాకేజీ.. ఎలా సాధ్యమైంది?సేల్స్ రంగంలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఇమ్రాన్ 2020లో గూగుల్ సంస్థలో చేరారు. క్లయింట్లకు గూగుల్ ‘ఏఐ మెషిన్ లెర్నింగ్’ సొల్యూషన్స్ను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బేసిక్ శాలరీ దాదాపు 1,70,000 డాలర్లు (సుమారు రూ.1.6 కోట్లు) కాగా, కస్టమర్ డీల్స్ ద్వారా వచ్చిన కమీషన్లే ఆయన ఆదాయాన్ని పెంచాయి. డబ్ల్యూ2 ఎర్నింగ్స్(అలవెన్స్లు) ద్వారా గతేడాది ఆయన వార్షిక సంపాదన దాదాపు 9,86,000 డాలర్లు (సుమారు రూ. 9.3 కోట్లు)గా ఉంది.‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్కు వలస వచ్చింది. ఆ వలసదారుల కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మార్కెట్ అవసరాలు, ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్లే నేను అంతటి కమీషన్లు సాధించగలిగాను’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.భారీ జీతాన్ని వదులుకోవడానికి కారణంమార్కెట్లో ఓపెన్ ఏఐ (ChatGPT), ఆంత్రోపిక్ (Claude) వంటి సంస్థలు సృష్టిస్తున్న సంచలనాలు ఇమ్రాన్లో ఫోమో (ఎక్కడ తాను వెనుకబడిపోతానో అనే ఆందోళన)ను రేకెత్తించాయి. గూగుల్ సురక్షితమైనదే అయినప్పటికీ భవిష్యత్తు అంతా ఏఐ స్టార్టప్లదేనని, వాటిలో ఈక్విటీ (భాగస్వామ్యం) కలిగి ఉండటం లాభదాయకమని ఆయన భావించారు. మరోవైపు, గూగుల్లో ఇటీవలి కాలంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కూడా ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి. ఎంత ప్రతిభావంతులైనా కార్పొరేట్ కొలువుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సొంతంగా రిస్క్ తీసుకోవడమే ఉత్తమమని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు.రాత్రిపూట ఏఐ సాధన..సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇమ్రాన్ వెనకడుగు వేయలేదు. పగలు ఉద్యోగం చేస్తూనే.. రాత్రులు, వారాంతాల్లో చాట్జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ సాయంతో కోడింగ్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్లు డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్లో గూగుల్కు గుడ్ బై చెప్పి ‘మాంగోస్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇది సేల్స్ నిపుణుల కోసం ప్రత్యేక ఏఐ ఆధారిత టూల్స్ను రూపొందిస్తుంది. ఆవేశంతో కాకుండా పూర్తి ఆర్థిక ప్రణాళికతోనే ఇమ్రాన్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఇమ్రాన్ చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
గ్లోబల్ ఏఐ రేసులో వెనుకబడిన దేశాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం స్టాక్ మార్కెట్లను శాసిస్తున్న వేళ ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ ఏఐ రేసులో ఆధిపత్యం చెలాయించే స్పష్టమైన ఏఐ విజేతలు లేకపోవడంతో భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు తమ అగ్రశ్రేణి కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాను కోల్పోయాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ దేశాల ప్రధాన సూచీల్లో టాప్-10 కంపెనీల మూలధన వ్యయం తగ్గడం గమనార్హం.క్షీణించిన ఆధిపత్యంప్రస్తుత గ్లోబల్ ట్రెండ్ను పరిశీలిస్తే భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో టాప్ కంపెనీల వాటా తగ్గింది. మిగిలిన ప్రధాన మార్కెట్లలో ఏఐ ఆధారిత టెక్ దిగ్గజాలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.టాప్-10 దేశాల మార్కెట్ క్యాప్ వాటా (ఏడాది క్రితం.. ప్రస్తుతం)దేశం / మార్కెట్ఏదాది క్రితం వాటాప్రస్తుత వాటామార్కెట్ సరళిచైనా26%19%క్షీణతభారతదేశం22%19%క్షీణతహాంకాంగ్10%9.8%స్వల్ప మార్పుతైవాన్49%56%భారీ వృద్ధిదక్షిణ కొరియా~ 32%65%రెట్టింపు వృద్ధి‘ఆసియా టెక్నాలజీ మార్కెట్లో ఏఐ, మెమరీ చిప్ విజేతలు ఇండెక్స్లను లీడ్ చేస్తుంటే.. భారత్, చైనా, హాంకాంగ్లలో ఏ ఒక్క ఆధిపత్య ఏఐ విన్నింగ్ కంపెనీ లేకపోవడంతో టాప్ సంస్థల వాటా పడిపోతోంది’ అని సాక్సో మార్కెట్స్ (సింగపూర్) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ చారు చనానా అన్నారు.తైవాన్, దక్షిణ కొరియా దేశాల దూకుడుఏఐ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషిస్తున్న కంపెనీలు ఉన్న మార్కెట్లు ఊహించని రీతిలో లాభపడ్డాయి. చిప్ తయారీ దిగ్గజం ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో’ (టీఎస్ఎంసీ) అద్భుతమైన లాభాల బాటలో పయనించడంతో తైవాన్ బెంచ్మార్క్ సూచీ ఈ ఏడాది ఏకంగా 54% పెరిగింది. అక్కడ టాప్-10 కంపెనీల వాటా 56%కి చేరింది.దక్షిణ కొరియాలో హై-బ్యాండ్ విడ్త్ మెమరీ లీడర్స్ అయిన ఎస్కే హైనిక్స్ ఇంక్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లీడ్తో కొరియా కోస్పి ఇండెక్స్ దాదాపు రెట్టింపు అయింది.భారత మార్కెట్ స్థితిగతులుభారతదేశ విషయానికి వస్తే నిఫ్టీ 50 బెంచ్మార్క్ ఈ ఏడాది 8% మేర క్షీణించింది. దీనికి ప్రధాన కారణం ఇండెక్స్లో సాంప్రదాయ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండటమే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు ఇంకా సాంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల్లోనే ఎక్కువగా పాతుకుపోయి ఉన్నాయి. ఇవి ఏఐ వల్ల భవిష్యత్తులో అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూచీలో భారీ వెయిటేజీ ఉన్న కంపెనీలు ఇండెక్స్ను ముందుకు లాగలేకపోతుండగా వాటిని భర్తీ చేసే కొత్త తరం ఏఐ ఇంజిన్లు ఇంకా మన మార్కెట్లో పుట్టుకురాలేదని చెబుతున్నారు.ఇదీ చదవండి: గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా? -
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్లో ‘స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్పై వేటు!
ఐటీ రంగంలో కొన్ని స్టార్టప్ల పనితీరు, ఇంటర్న్ల పట్ల యాజమాన్యాల ధోరణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక చర్చ వైరల్ అవుతుంది. కేవలం అర్హతకు తగ్గ వేతనం (స్టైపెండ్) పెంచాలని వాట్సాప్లో మెసేజ్ పంపినందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్ను తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్క వాట్సాప్ మెసేజ్తో నా ఇంటర్న్షిప్ను రద్దు చేశారు.. అంటూ సదరు టెక్కీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.కంపెనీ భారాన్ని మోసి.. చివరకు..బాధిత టెక్కీ కథనం ప్రకారం.. ఆమె ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఏఐ ఇంజినీర్ ఇంటర్న్గా చేరారు. ఆరు నెలల కాలపరిమితి గల ఈ ఇంటర్న్షిప్లో ఆమెకు అత్యంత స్వల్ప మొత్తాన్ని స్టైపెండ్గా నిర్ణయించారు. ఆ స్టార్టప్ సాంకేతిక విభాగంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆమే కావడం గమనార్హం. ఒక ఇంటర్న్ అయినప్పటికీ, సంస్థ కోసం ఆమె నిత్యం శ్రమిస్తున్నారు.కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ (ఎస్ఎల్ఎం)ను ఆమే స్వయంగా అభివృద్ధి చేశారు. సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి జాప్యం (Latency) తగ్గించేలా కోడింగ్ను ఆప్టిమైజ్ చేశారు. ఆమె ప్రతిభ కారణంగా సదరు స్టార్టప్కు ఏకంగా ఏడుగురు కొత్త క్లయింట్లు వచ్చారు. మూడు నెలల విజయవంతమైన పనితీరు తర్వాత ఆన్బోర్డింగ్ సమయంలో యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం స్టైపెండ్ రివిజన్ కోసం ఆమె మేనేజర్కు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపారు.వాట్సాప్ సందేశంలో ఏముందంటే..‘హలో మేడమ్, నేను ఇక్కడ మూడు నెలలు పూర్తి చేసుకున్నాను. ఆన్బోర్డింగ్ సమయంలో మాట్లాడినట్లుగా నా స్టైపెండ్ రివిజన్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. గత 3 నెలల్లో నేను ఎస్ఎల్ఎం ఏజెంట్లను నిర్మించాను. వాటిని పరీక్షించాను. డెప్లాయ్ చేశాను. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా స్టైపెండ్ను కొంత మేర(XXXX) పెంచుతారని ఆశిస్తున్నాను. దీనిపై మరింత చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని రాశారు.కానీ, ఈ సాధారణ మెసేజ్ను మేనేజర్ జీర్ణించుకోలేకపోయారు. ‘ఒక విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో పెంపు ఇవ్వడం అసాధ్యం’ అని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చేసిన పనిని కేవలం ‘టెస్టింగ్ క్యాంపెయిన్లు, టెస్ట్ క్లయింట్లు’ అంటూ తక్కువ చేసి మాట్లాడారు. స్వతంత్రంగా పనిచేయడాన్ని కూడా ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు.తర్వాత కొన్ని రోజులకు..ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సదరు ఇంటర్న్కు కంపెనీ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. అంచనాలకు తగిన పని లేదనే (Mismatch in expectations) నెపంతో ఆమె ఇంటర్న్షిప్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కంపెనీ సీఈఓ ఆమెకు దాదాపు 30 నిమిషాల పాటు స్టార్టప్ సంస్కృతిపై ఉచిత ఉపన్యాసం ఇచ్చి ఆమెను ‘మనీ-మైండెడ్’ అని సంబోధించారు.‘‘నాలుగు నెలల పాటు కష్టపడి రాసిన కోడ్ను పూర్తిగా విస్మరించారు. ‘మేము ఇంత మొత్తమే ఇవ్వగలం’ అని వారు నేరుగా చెప్పి ఉంటే నేను సంతోషంగా అంగీకరించేదాన్ని. కానీ కేవలం చర్చలు జరిపినందుకు నన్ను తీసేశారు’ అని టెక్కీ వాపోయారు. ‘ప్రామాణిక వ్యాపార చర్చలను వ్యక్తిగత ద్రోహంగా భావించే నిర్వాహకుల కింద వేతనం కోసం నేను భిక్షం ఎత్తాలనుకోవడం లేదు. అందుకే నా ఎక్స్పీరియన్స్ లెటర్ కోసం డిమాండ్ చేస్తూ మెయిల్ పెడుతున్నాను’ అని ఆమె చెప్పారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, నెటిజన్లు సదరు టెక్కీకి మద్దతుగా నిలుస్తున్నారు. కంపెనీల దోపిడీని ఎండగడుతూ పలువురు వ్యాఖ్యానించారు. ‘కూల్గా ఉండండి.. మీ ప్రమాణాలను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మిమ్మల్ని కోల్పోవడం ఆ కంపెనీకే నష్టం’ అని ఒకరన్నారు. ‘నాకు కూడా ఇలాగే జరిగింది. కంపెనీ అవసరాలకు మించి ఎక్కువ పనులు చేయకూడదని దీని ద్వారా నేర్చుకున్నాను’ అని మరొకరు చెప్పారు.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
ఏఐ దారి తప్పకుండా థియోమ్ పటిష్ట నిఘా!
‘‘ఏఐ కట్టుతప్పుతోంది.. తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకునేంత వరకూ వాడకం ఆపేద్దాం’’. ఆంథ్రోపిక్ సీఈవో ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇంకో అంతర్జాతీయ ఏఐ సంస్థ థియోమ్ మాత్రం ఇందుకు భిన్నమైన ఆలోచన చేస్తోంది. హ్యాకర్లు ఏఐ దుర్వినియోగానికి ప్రయత్నిస్తూంటే... తాము ఏఐ సాయంతోనే ఏఐకు, డేటాకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని థియోమ్ చెబుతోంది. ఇదే అంశంపై సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో నవీంద్ర యాదవ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...ప్రశ్న: ముందుగా థియోమ్ గురించి వివరించండి.జవాబు: థియోమ్ డేటా, ఏఐ సెక్యూరిటీ కంపెని. 2020 డిసెంబరులో స్థాపించాము. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థల మాదిరిగా ఇది డేటాను నెట్వర్క్ల బయట నుంచి కాపాడదు. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. స్నోఫ్లేక్స్, డేటాబ్రిక్స్ వంటి భారీ డేటా స్టోర్లు, గోల్డ్మ్యాన్ శాక్స్, బ్లాక్రాక్ వంటి ఫైనాన్షియల్ సంస్థలు, హెల్త్కేర్, ఫార్మా కంపెనీలు ఈ డేటా స్టోర్లను వాడుకుంటూంటాయి. థియోమ్ ఈ డేటా స్టోర్లతోపాటు కంపెనీలు వాడే ఏఐ వ్యవస్థల్లో ఉంటూ రక్షణ కల్పిస్తుంది. ఏఐ సాఫ్ట్వేర్పై ఎవరైనా దాడులు చేస్తున్నారా? అన్నది పరిశీలించడంతోపాటు, ఏఐ డేటాతో జరిపే సంప్రదింపులను కూడా పరిశీలించి అవాంఛనీయ ఘటనలేవీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏఐ ఏ రకమైన డేటాతో పనిచేస్తోందన్నది నిత్యం గమనిస్తూండటం ద్వారా అది దారి తప్పకుండా కాపు కాస్తూ ఉంటుందన్నమాట.ప్ర: మీరు డేటా స్టోర్ల గురించి ప్రస్తావించారు. ఇవి డేటా సెంటర్లూ ఒకటేనా?జ: కాదు. రెండూ వేర్వేరు. డేటా సెంటర్లలో డేటా నిక్షిప్తమవుతుంది. కంప్యూటర్లు, సర్వర్లు ఉండే ప్రాంతం. డేటా స్టోర్లు అంటే ఈ డేటా సెంటర్లలోని సమాచారం. ఇంకోలా చెప్పాలంటే ఒక రకమైన డేటాబేస్ అన్నమాట.ప్ర: ఏఐ వ్యవస్థలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు ఎదురవుతోంది?జ: చాలానే ఉన్నాయి. ఏఐ వ్యవస్థలను తమ అవసరాల కోసం వాడుకునేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. డేటా చోరీతోపాటు, సమాచారాన్ని తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుని లాభపడేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఆంథ్రోపిక్ గురించి మీరు వినే ఉంటారు. ఇటీవలే ఈ ఏఐ కంపెనీ మైథోస్ పేరుతో సరికొత్త ఏఐ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాల క్రితమే భారత ప్రభుత్వం కూడా దీన్ని వాడటం మొదలుపెట్టింది. మైథోస్ అనేది ఇతర వ్యవస్థలపై దాడి చేయగల సామర్థ్యమున్నది. థియోమ్ ఇలాంటి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది.సింపుల్గా చెప్పాలంటే థియోమ్ అనేది శరీర రోగ నిరోధక వ్యవస్థ లాంటిది. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు తొడుక్కునే రక్షణ కవచల్లాంటివి. అందుకే థియోమ్ అనేది ఏఐ యుగం కోసం సిద్ధం చేసిన వ్యవస్థ.ప్ర: ఆరేళ్లలో థియోమ్ ఎంత మేర విస్తరించింది?జ: థియోమ్ ఒక అంతర్జాతీయ సంస్థ. అమెరికాలో మొదలైంది. భారత్తోపాటు జర్మనీ, పోర్చుగల్, క్రొయేషియా, ఆస్ట్రేలియాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పశ్చిమార్ధగోళం నుంచి అత్యధిక ఆదాయం పొందుతున్న కంపెనీ. జెట్ బ్లూ ఎయిర్లైన్స్, ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్ కంపెనీలు, గోల్డ్మ్యాన్ శాక్స్, బ్లాక్రాక్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, పలు ఏఐ ఫస్ట్ కంపెనీలు థియోమ్ సాయంతో తమ డేటా, ఏఐలు రెండింటినీ రక్షించుకుంటున్నాయి. స్టారప్ కంపెనీనే గానీ వేగంగా వృద్ధి చెందుతోంది.ప్ర: హైదరాబాద్ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు?జ: థియోమ్కు హైదరాబాద్ బ్యాక్ ఆఫీసు కానేకాదు. అంతర్జాతీయ కస్టమర్లకు సరికొత్త ప్రాడక్ట్స్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇప్పటివరకూ యాభై మంది ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఏఐని మరింత సమర్థంగా వాడటం ఎలా అన్నది ఇక్కడే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.ప్ర: ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు కోడింగ్లో ఏఐ వాడకాన్ని తగ్గించాలని చెబుతూంటే మీరు పెంచుతున్నారా?జ: రెండింటికీ చాలా తేడా ఉంది. మేము ఏఐతోనే ఏఐని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆంథ్రోపిక్ వ్యవస్థలపై దాడులు చేసి, లోపాలను పసిగట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. థియోమ్ దీనికి భిన్నంగా ఏఐని అస్సలు నమ్మకుండా, తగిన రక్షణ ఏర్పాట్లతో సాఫ్ట్వేర్ ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో మానవ పర్యవేక్షణ ఎక్కువన్నమాట.ప్ర: ఏఐ రంగంలో ఉన్నారు కాబట్టి... జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని మీ అంచనా?జ: చెప్పడం కష్టం. కాకపోతే ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనరల్ ఇంటెలిజెన్స్ అన్నది ఏదో ఒక దశలో అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు కానీ.. ఇన్నేళ్లు, ఇన్ని నెలలు అని చెప్పలేము.ప్ర: ఏఐతో ఉద్యోగాలు పోతాయంటున్నారు. మీ అంచనా ఏమిటి?జ: నా ఉద్దేశం ప్రకారం ఉద్యోగాల నిర్వచనం మారిపోతుంది అంతే. ఇంటర్నెట్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో చాలా ఉద్యోగాలు పోతాయని అనేవారు. కానీ కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు ఏఐ స్థానంలో మళ్లీ మానవ వనరులను వాడుకుంటున్నాయి. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏఐ వ్యవస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య వచ్చింది.హైదరాబాద్లో థియోమ్ కొత్త కార్యాలయండేటా, కృత్రిమ మేధ రక్షణ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా దూసుకుపోతున్న థియోమ్ సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో తన కొత్త కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించింది. థియోమ్ తన అంతర్జాతీయ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపకల్పన చేసేందుకు ఈ ఫెసిలిటీ దోహదపడనుందని చెప్పింది.భారతదేశపు ప్రముఖ సాంకేతిక హబ్ల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా.. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ రంగాల్లో థియోమ్ కీలక అడుగులు వేయనుంది. ఇక్కడి టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ త్రైమాసికం ముగిసే నాటికి హైదరాబాద్ కేంద్రంలో 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని థియోమ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్, ఏఐ ఆధారిత ఎంటర్ప్రైజ్ రక్షణ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావాలనే థియోమ్ దీర్ఘకాలిక ప్రపంచవ్యాప్త వ్యూహంలో భాగంగానే ఈ కేంద్రం రూపుదిద్దుకుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
భారత్లో తలుపులు మూసిన ‘ఓపెన్డోర్’
సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, ఏఐ విస్తరణ, భారతీయ ఐటీ, సర్వీస్ రంగ ఉద్యోగులపై భారీ ప్రభావమే చూపుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్డోర్’ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 250 మంది భారతీయ ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడినట్లయింది.కంపెనీ వ్యూహాత్మక మార్పులపై ఓపెన్డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో కొన్ని అంశాలు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చర్చనీయాంశమైంది. ‘మా కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వారికి సేవలందించే ఆపరేషనల్ విభాగాలు కూడా ఆ కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉండటమే వ్యాపారపరంగా ఉత్తమం’ అని చెప్పారు. గతంలో వివిధ వ్యవస్థల్లో మ్యాన్యువల్ వర్క్ఫ్లోలను నిర్వహించడానికి భారతదేశంలో ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుత సాంకేతిక పురోగతి వల్ల ఆ అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.శ్రామిక శక్తిపై ఏఐ దెబ్బ!ఈ లేఆఫ్స్కు ప్రధాన కారణం కంపెనీ శరవేగంగా అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతగా తెలుస్తోంది. గతంలో భారత్లోని సిబ్బంది మ్యాన్యువల్గా చేసే పనులను ఇప్పుడు అమెరికాలో ఏఐ ఎనేబుల్డ్ బృందాల సాయంతో మరింత సులభంగా పూర్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతికత పెరగడం వల్ల విదేశాల్లో (భారత్లో) ప్రత్యేకంగా ఒక టీమ్ను ఉంచాల్సిన అవసరం తగ్గిందని మేనేజ్మెంట్ పేర్కొంది.I shared this note earlier today with the entire team at Opendoor. Today we began to say goodbye to our colleagues in India as we wind down our India operations.Our customers are in America, and that's where our operational work belongs. pic.twitter.com/Ak2jLxKiX5— Kaz Nejatian (@nejatian) June 10, 2026ప్రతిభకు లోటు లేదు.. కానీ తప్పట్లేదు!ఈ తొలగింపులు భారతీయ బృందం పనితీరు లోపం వల్ల జరిగినవి కావని సీఈఓ నెజాటియన్ నొక్కి చెప్పారు. భారత్లోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, ఇతర సంస్థలకు వారు అద్భుతమైన ఆస్తిగా మారుతారని ప్రశంసించారు. అయితే, వ్యాపార సరళీకరణ, ఏకీకృత ప్లాట్ఫారమ్ నిర్మాణం, మ్యాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
ఎరువుల సబ్సిడీ రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.భారత్పై సబ్సిడీ భారంయూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.రైతాంగానికి ఊరటప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.ఆయిల్ కంపెనీలకు మద్దతుగత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటుఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధిఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్ఎన్జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టిఅదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఏఐ వెనుక పరుగెత్తబోం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ ఇన్వెస్ట్మెంట్ బూమ్పై దేశీయ టెక్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఏఐ హైప్ వెనుక పరుగెత్తే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు ఎగబడుతున్న రంగాలకు భిన్నంగా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే, ప్రస్తుతం అందరూ విస్మరిస్తున్న మెటలర్జీ వంటి డీప్ టెక్నాలజీ విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మార్కెట్ విశ్లేషకులు ముత్తుకృష్ణన్ దండపాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్పై శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఈ విశ్లేషణ చేశారు.ప్రస్తుతం అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ చుట్టూ నెలకొన్న పెట్టుబడి ధోరణిని శ్రీధర్ వెంబు తీవ్రమైన ‘ఏఐ ఉన్మాదం’గా అభివర్ణించారు. ‘అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తున్నాయి. ఏఐ మౌలిక సదుపాయాలను సరఫరా చేసే కంపెనీలు ఈ వ్యయ చక్రం నుంచి తక్షణమే భారీ లాభాలను పొందుతున్నాయి. కొనుగోలుదారులు ఈ వ్యయాలను సుదీర్ఘ కాలానికి విస్తరించడం ద్వారా ప్రస్తుతానికి ఆదాయ వృద్ధిని, లాభదాయకతను కాపాడుకోగలుగుతున్నారు’ అని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) కొందరు భారతదేశం ఏఐ రేసులో వెనుకబడిందని భావిస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలను తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదని వెంబు స్పష్టం చేశారు.మాకొద్దీ విధానం..ప్రస్తుత ట్రెండ్కు భిన్నమైన వైఖరిని తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జోహో అధినేత ప్రకటించారు. ‘మేము ఏఐలో జరుగుతున్న క్యాష్ బర్న్ను వెంబడించాలనుకోవడం లేదు. మార్కెట్ దృష్టిలో బోరింగ్గా కనిపించే, భారతదేశానికి అత్యంత కీలకమైన దీర్ఘకాలిక డీప్ టెక్ విభాగాల్లో పెట్టుబడి పెడుతున్నాం’ అని తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆయన మెటలర్జీ రంగాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ రంగానికి ఏఐకి వచ్చినంత పబ్లిసిటీ రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో దేశీయ ఉత్పాదక రంగానికి, వ్యూహాత్మక అభివృద్ధికి ఇది అత్యంత విలువైనదిగా మారబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.10-15 ఏళ్ల సుదీర్ఘ వ్యూహంఈ తరహా పెట్టుబడుల ఫలితాలు రాత్రికి రాత్రే రావని, తమ వ్యూహం విజయవంతం కావడానికి కనీసం 10 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుందని వెంబు అంగీకరించారు. తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మార్కెట్ ఫ్యాషన్లను, తాత్కాలిక హైప్లను అనుసరించరని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం జాతీయ అహంభావంతో తీసుకున్నది కాదని, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టించే రంగాలను గుర్తించడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్!
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ తన శక్తివంతమైన, అత్యాధునిక ‘మైథోస్’ క్లాస్కు చెందిన మొదటి మోడల్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5)ను ఓపెన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, కాంప్లెక్స్ నాలెడ్జ్ వర్క్ వంటి రంగాల్లో అత్యంత అసాధారణమైన సామర్థ్యాలు ఉన్న ఈ మోడల్ భద్రతాపరంగా కొన్ని కఠినమైన పరిమితులతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.గతంలో ఆంత్రోపిక్ సంస్థ ‘మైథోస్’ ప్రివ్యూను ప్రకటించినప్పుడు ఇది ప్రపంచంలోని ఏ సాఫ్ట్వేర్నైనా హ్యాక్ చేయగల శక్తివంతమైనదని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ ముప్పుపై భారతదేశంతో సహా పలు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా సైతం సైబర్ దాడుల ప్రణాళికల కోసం మైథోస్ను ఉపయోగిస్తోందనే నివేదికలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ తీవ్రమైన భద్రతా సవాళ్లను అధిగమిస్తూ గరిష్ట రక్షణ వలయాలతో ఆంత్రోపిక్ ఈ సరికొత్త మోడల్ను రంగంలోకి దించింది.క్లాడ్ ఫేబుల్ 5 అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలేంటి?ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘క్లాడ్ ఫేబుల్ 5’ అనేది ఇప్పటివరకు కంపెనీ సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేసిన మోడళ్లన్నింటికంటే అత్యంత సమర్థవంతమైనది.అసాధారణ పనితీరు: సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన విశ్లేషణాత్మక పనుల్లో ఇది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. కొన్ని అంతర్జాతీయ బెంచ్మార్క్ల్లో ఇది కంపెనీ ప్రస్తుత టాప్ మోడల్ ‘క్లాడ్ ఓపస్ 4.8’ కంటే 10 శాతం ఎక్కువ స్కోరు సాధించింది.జైల్బ్రేక్ రక్షణ: మోడల్ విడుదలకు ముందు కంపెనీ అంతర్గతంగా 1,000 గంటలకు పైగా ‘బగ్ బౌంటీ’ పరీక్షలను నిర్వహించింది. అలాగే ‘రెడ్-టీమింగ్’ సంస్థల ద్వారా కూడా పరీక్షించగా ఎక్కడా ఈ మోడల్ భద్రతా వలయాన్ని చేధించే లూప్హోల్స్ కనిపించలేదని స్పష్టం చేసింది.టాస్క్ కాంప్లెక్సిటీ: పని ఎంత సుదీర్ఘంగా, ఎంత సంక్లిష్టంగా ఉంటే ఇతర మోడళ్లతో పోలిస్తే ఫేబుల్ 5 అంతటి మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది.అత్యంత కఠినమైన భద్రతా చర్యలుమైథోస్ క్లాస్ మోడళ్ల వల్ల సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్, కెమికల్ రంగాల్లో ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆంత్రోపిక్ ఈ మోడల్లో వినూత్నమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది.ఫాల్బ్యాక్ మెకానిజంఒకవేళ వినియోగదారు ఎవరైనా రిసిన్(ఒక రకమైన ప్రాణాంతక విషం) ఎలా తయారు చేయాలి? వంటి అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలను అడిగితే ఫేబుల్ 5 ఆ ప్రశ్నను బ్లాక్ చేస్తుంది. వెంటనే ఆ సెషన్ సురక్షితమైన ‘క్లాడ్ ఓపస్ 4.8’ మోడల్కు బదిలీ అవుతుంది. తద్వారా హానికరమైన సమాచారం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి రక్షణల వల్ల దాదాపు 95 శాతం సెషన్లు పూర్తిగా ఫేబుల్ 5 లోనే నడుస్తాయని, కేవలం 5 శాతం లోపు అత్యంత సున్నితమైన కేసుల్లో మాత్రమే ఓపస్ 4.8 కి ట్రాన్స్ఫర్ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.చైనా వ్యూహాలకు బ్రేక్చైనాకు చెందిన కొన్ని ఏఐ కంపెనీలు తమ సొంత మోడళ్లకు శిక్షణ ఇచ్చుకోవడానికి క్లాడ్ మోడల్ను డిస్టిలేషన్ (పెద్ద మోడల్ డేటా ఆధారంగా చిన్న మోడళ్లను తయారు చేయడం) చేస్తున్నాయని ఆంత్రోపిక్ గతంలో ఆరోపించింది. అయితే, ఫేబుల్ 5 లో పొందుపరిచిన యాంటీ-డిస్టిలేషన్ రక్షణలు ఇలాంటి మేధోసంపత్తి చౌర్యానికి అడ్డుకట్ట వేయనున్నాయి.మైథోస్ 5, గ్లాస్ స్వింగ్ ప్రాజెక్ట్ఫేబుల్ 5 తో పాటు ఆంత్రోపిక్ సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాలు అందించేవారికోసం ‘క్లాడ్ మైథోస్ 5’ ను కూడా పరిమితంగా అందుబాటులో ఉంచింది. ‘ప్రాజెక్ట్ గ్లాస్ స్వింగ్’ ద్వారా ఇప్పటికే అనుమతి పొందిన సంస్థలు మాత్రమే దీనిని వాడగలవు. ఫేబుల్ 5 లాగే ఇది కూడా ఒకే అంతర్గత మోడల్ను కలిగి ఉన్నప్పటికీ ఇందులో భద్రతాపరమైన పరిమితులు (రక్షణలు) ఎత్తివేశారు. సైబర్ రక్షణ పరిశోధనల కోసమే దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్పింది.ఎవరికి అందుబాటులో?క్లాడ్ ఫేబుల్ 5 ప్రస్తుతం క్లాడ్ ఏపీఐ, యూజర్-ఆధారిత ఎంటర్ప్రైజ్ ప్లాన్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగదారుల కోసం ఇది దశలవారీగా విడుదల కానుంది. జూన్ 22 వరకు అదనపు ఖర్చు లేకుండా ప్రో, మాక్స్, టీమ్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ల వారికి అందుబాటులో ఉంటుంది. జూన్ 23 నుంచి స్టాండర్డ్ ప్లాన్ల నుంచి తొలగిస్తారు. తర్వాత యూజర్ సామర్థ్యం ఆధారంగా యూసేజ్ క్రెడిట్లు అవసరమవుతాయి.ఇదిలాఉండగా, మానవ ప్రమేయం లేకుండానే ఏఐ తనను తాను మరింత శక్తివంతంగా మార్చుకునే ప్రమాదం ఉందని, అందువల్ల గ్లోబల్ ఏఐ ల్యాబ్లు అన్నీ కలిసి ఈ ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధిపై నియంత్రణ కలిగి ఉండాలని ఆంత్రోపిక్ పిలుపునివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం! -
కృత్రిమమేధ అద్భుత అవకాశం!
కృత్రిమ మేధ విస్తృతిపై ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఏఐ అనేది ఐటీ రంగానికి ముప్పు కాదని, అది ఎంటర్ప్రైజ్ ఐటీ రంగానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. ఈరోజు జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. వచ్చే మూడేళ్లలో టీసీఎస్లో మానవ ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు పని చేస్తారని అంచనా వేశారు.జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ల కారణంగా భారతీయ ఐటీ సేవల సంస్థల సాంప్రదాయ వ్యాపార నమూనాలు దెబ్బతింటాయేమోనన్న ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో చంద్రశేఖరన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త భరోసాను నింపాయి. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యయాన్ని ఏఐ ఎలా మార్చబోతోందనే అంశంపై మార్కెట్లో ఉన్న అపార్థాల వల్లే ఇటువంటి భయాలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.‘ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు. అది మేధస్సుకు సంబంధించిన ఒక మౌలిక సదుపాయం (ఇన్ఫ్రా ఆఫ్ ఇంటెలిజెన్స్). ఈ మేధస్సు తాలూకు వ్యయం తగ్గుతున్న కొద్దీ.. మరిన్ని వ్యాపార ప్రక్రియలు, వ్యూహాత్మక నిర్ణయాలు, కస్టమర్ పరస్పర చర్యలు ఏఐ ఆధారిత పరివర్తన వైపు అడుగులు పడుతాయి’ అని చంద్రశేఖరన్ అన్నారు.ఏఐ అంతరాయం కలిగిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ పరిశ్రమ ప్రాథమిక సూత్రాలు బలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. కంపెనీ మార్జిన్లు బాగున్నాయని, ఆదాయాలు పెరిగాయని, డీల్ పైప్లైన్ గతంలో కంటే ఎంతో బలంగా ఉందని వివరించారు. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల సంస్థలు తమ సాంకేతిక వ్యయాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
లేఆఫ్స్ సమయంలో వాల్మార్ట్ వినూత్న వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్లోని బెంటన్విల్లేలో నిర్వహించిన వాల్మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.ఉత్పాదకత సాధనంగానే ఏఐగత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.భిన్నాభిప్రాయాలు - ఆందోళనలుఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
మానవ నియంత్రణ తప్పుతున్న నమూనాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మానవాళి మనుగడకే సవాలుగా మారనుందా అంటే.. తాజా సాంకేతిక అంశాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు చర్చకు దారితీసింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిపై అంతర్జాతీయంగా తక్షణమే తాత్కాలిక విరామం(గ్లోబల్ పాజ్) ప్రకటించాలని ఆంత్రోపిక్ తెలిపింది. తాము రూపొందిస్తున్న ఏఐ నమూనాలు మానవ నియంత్రణ పరిధుల నుంచి తప్పించుకునే సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని సంస్థ బాహాటంగా అంగీకరించడం గమనార్హం.స్వీయ నియంత్రణ సాధ్యమేనా?ప్రసిద్ధ క్లాడ్ ఏఐ నమూనాల సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు సామాజిక నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ గ్లోబల్ పాజ్ అత్యవసరమని పేర్కొంది. ‘సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని తట్టుకునేలా సామాజిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి, సరిహద్దు ఏఐ (ఫ్రంటీర్ ఏఐ) అభివృద్ధిని నెమ్మదిగా లేదా తాత్కాలికంగా నిలిపివేసే హక్కు ప్రపంచానికి ఉండాలి’ అని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.అయితే, ఒకే ఒక్క సంస్థ లేదా దేశం అభివృద్ధిని ఆపితే ప్రయోజనం లేదని, ప్రత్యర్థి శక్తులు మరింత వేగంగా దూసుకుపోయే ప్రమాదముందని హెచ్చరించింది. అమెరికా, చైనాల వంటి అగ్రదేశాల్లోని ప్రధాన ఏఐ సంస్థలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పరస్పర నిబంధనలను ధ్రువీకరించుకుంటూ ఏకకాలంలో విరామం ప్రకటిస్తేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సమన్వయ యంత్రాంగం లేకపోతే భౌగోళిక రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ల కారణంగా భద్రతను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.వైట్హౌస్ అభ్యంతరాలుఆంత్రోపిక్ చేసిన ఈ ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాల తీవ్రతను ఆంత్రోపిక్ అతిగా ఊహిస్తోందని, భద్రతా ఆందోళనల ముసుగులో ప్రత్యర్థులను వెనక్కి నెట్టే వ్యూహాత్మక పన్నాగం ఇదంటూ వైట్హౌస్ అధికారులు, సహచర టెక్ కంపెనీల ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఏఐ అభివృద్ధిని ఆపడం వల్ల చైనాకు వ్యూహాత్మకంగా పైచేయి లభిస్తుందని అమెరికా అధికారులు భయపడుతున్నారు.అయినప్పటికీ, ఆంత్రోపిక్ సంస్థ అత్యంత రహస్యంగా ఉంచిన ‘మైథోస్’ మోడల్ శక్తిని వైట్హౌస్ సైతం గుర్తించింది. అసాధారణమైన సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు ఉన్నందున ఈ మోడల్ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. కేవలం నిశితంగా పరిశీలించిన అతికొద్ది సంస్థలకు మాత్రమే ప్రస్తుతం దీనికి యాక్సెస్ కల్పించారు. యూరప్కు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ణు ఆంత్రోపిక్ అందిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఏఐ వైపు నిధులు.. జీతాల పెంపునకు బ్రేకులు!
ఐటీ రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకు ఉద్యోగాల కోతకే పరిమితమైన ఏఐ ముప్పు.. ఇప్పుడు నేరుగా ఉద్యోగుల వార్షిక వేతన ప్యాకేజీలు, ఇంక్రిమెంట్లపై పడింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు తమ వ్యాపార శైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి. పనులను వేగవంతం చేయడానికి ఏఐపై పెట్టుబడులను భారీగా పెంచుతూ అందుకోసం ఉద్యోగుల జీతాల పెంపునకు బ్రేకులు వేస్తున్నాయి. తాజాగా, గ్లోబల్ క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘టెరాడేటా’ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఏఐ వైపు మళ్లుతున్న నిధులుప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ జర్నల్ ‘బిజినెస్ ఇన్సైడర్’ నివేదిక ప్రకారం.. టెరాడేటా సంస్థ తన ఉద్యోగుల వార్షిక వేతన పెంపును ఈ ఏడాదికి పూర్తిగా నిలిపివేయాలని (ఫ్రీజ్) నిర్ణయించింది. ఈ బడ్జెట్ను నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ ఏడాది వార్షిక జీతాల సర్దుబాటు ఉండబోదని కంపెనీ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో స్పష్టం చేశారు.‘మార్కెట్లోకి సరికొత్త ఏఐ ఆవిష్కరణలను తీసుకురావడానికి, ఈ రంగానికి చెందిన నిపుణులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకే ఈ ఏడాది వార్షిక జీతాల బడ్జెట్ను పునసమీక్షించి ఆ నిధులను ఏఐ పెట్టుబడులకు కేటాయిస్తున్నాం’ అని టెరాడేటా సీఈఓ స్టీవ్ మెక్మిలన్ అన్నారు. అయితే, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లు, ఈక్విటీ షేర్లను మాత్రం యథావిధిగా అందిస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఏఐ మౌలిక సదుపాయాల ‘మహారాజులు’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా ఎన్విడియా వంటి సాఫ్ట్వేర్, సెమీకండక్టర్ దిగ్గజాలే గుర్తుకు వస్తాయి. ఈ రేసులో భారతదేశం నేరుగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా కనిపించకపోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఏఐ విప్లవానికి వెన్నుముకగా నిలుస్తూ భారత్కు చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తూ 2026 స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తున్నాయి.ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఏఐ మౌలిక సదుపాయాల సరఫరా గొలుసుతో ముడిపడి ఉన్న 28 భారతీయ కంపెనీలు ఈ ఏడాది మార్కెట్లో ఏకంగా 47 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు) అదనపు విలువను జోడించాయి. వీటి ఉమ్మడి మార్కెట్ విలువ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం పెరగడం గమనార్హం.దలాల్ స్ట్రీట్లో కొత్త ట్రెండ్భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ ధోరణిని ‘ఏఐ కాపెక్స్ ట్రేడ్’ అని పిలుస్తున్నారు. దీనిపై యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) ఆర్.శివకుమార్ మాట్లాడుతూ ‘ఏఐ సాఫ్ట్వేర్ రేసులో భారతదేశం ముందంజలో లేకపోవచ్చు. కానీ గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరుగుతున్న భారీ వ్యయం నుంచి మన కంపెనీలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. పెట్టుబడిదారులు డేటా సెంటర్లు, విస్తృత సరఫరా గొలుసుతో అనుసంధానించిన కంపెనీలపై దృష్టి పెట్టాలి’ అని విశ్లేషించారు.దూసుకుపోతున్న స్వదేశీ కంపెనీలుస్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్: వేదాంత గ్రూప్నకు చెందిన ఈ ఆప్టికల్-ఫైబర్ కంపెనీ షేర్లు 2026లో ఏకంగా 530 శాతానికి పైగా పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్లకు పైగా) మల్టీ ఇయర్ మెగా ఒప్పందాన్ని దక్కించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్: స్టెర్లైట్ ప్రత్యర్థి అయిన హెచ్ఎఫ్సీఎల్ షేర్లు కూడా ఈ ఏడాది 191 శాతం మేర లాభపడ్డాయి.ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్: ప్రెసిషన్ కూలింగ్, పవర్ కాంపోనెంట్స్ తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఈ ఏడాది ఏకంగా మూడు రెట్లు పెరిగింది.గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అవసరమైన పరికరాలను అందిస్తూ హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఏబీబీ ఇండియా లిమిటెడ్, కమ్మిన్స్ ఇండియా లిమిటెడ్ వంటి పారిశ్రామిక కంపెనీలు కూడా ఈ ర్యాలీలో భారీగా లబ్ధి పొందుతున్నాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు భారతదేశాన్ని ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా మారుస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.అమెజాన్: 2030 నాటికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసం 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.ఆల్ఫాబెట్ (గూగుల్): విశాఖపట్నంలోని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ కోసం 15.0 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.రిలయన్స్ జాయింట్ వెంచర్: దేశీయంగా స్థానిక డేటా సెంటర్ల నిర్మాణం కోసం 11.0 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది.అదానీకనెక్స్: గూగుల్, ఉబెర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.సెల్లర్స్ మార్కెట్గా..‘డేటా సెంటర్లను నిర్మించడానికి, పవర్ సప్లై చేయడానికి, వాటిని చల్లబరచడానికి అవసరమైన పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కొరత ఉంది. కొన్ని విడిభాగాల డెలివరీ కోసం ప్రస్తుతం 2 నుంచి 4 ఏళ్ల వెయింటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇది తయారీదారులకు ‘సెల్లర్స్ మార్కెట్’గా మారింది. ఇప్పుడు గెలుచుకుంటున్న ఆర్డర్లు 2027-2029 మధ్య కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి’ అని నోమురా నివేదికలో విశ్లేషించింది. నోమురా అంచనా ప్రకారం, ప్రస్తుత డేటా-సెంటర్ బూమ్ అనేది గతంలోని గ్లోబల్ 4జీ వైర్లెస్ రోల్అవుట్, 2008 నాటి ఎల్ఎన్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, 2010ల నాటి షేల్ గ్యాస్ బూమ్ కంటే చాలా పెద్దది.రూ.100 లక్షల కోట్ల మార్కెట్.. కానీ..మరో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘ఏంజెల్ వన్’ నివేదిక ప్రకారం డేటా సెంటర్లలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులు 2025-2027 మధ్య 1.2 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.100 లక్షల కోట్లు) దాటనున్నాయి. ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ అవకాశం మాత్రమే కాదని, ఇది దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పెట్టుబడి చక్రాన్ని సృష్టిస్తోందని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నట్లు ఏంజెల్ వన్ చెప్పింది. అయితే, ఇదే సమయంలో వాల్యుయేషన్ల పరంగా హెచ్చరికలు కూడా వస్తున్నాయి.ఏఐ అవకాశాల గురించి కేవలం ప్రకటనలు చేసే కంపెనీల కంటే ఇప్పటికే ఏఐ సంబంధిత వ్యాపారం ద్వారా ఆదాయాన్ని చూపిస్తున్న కంపెనీలకే మార్కెట్ ప్రాధాన్యత ఇస్తోంది. కానీ, కొన్ని కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికే విపరీతంగా పెరగడం వల్ల అధిక వాల్యుయేషన్ల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ధరల వద్ద కంపెనీల ఫలితాల్లో ఎలాంటి చిన్న తప్పు లేదా నిరాశ ఎదురైనా స్టాక్స్ పతనం కావడానికి ఆస్కారం ఉందని గమనించాలి.గమనిక: స్టాక్ మార్కెట్ ద్వారా ఏదైనా కంపెనీలో నేరుగా పెట్టుబడి పెట్టేముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఐఆర్సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్!
రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మెగా ఆపరేషన్కు తెరలేపింది. ఒకవైపు కన్ఫర్మ్డ్ టిక్కెట్ల కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న టికెటింగ్ మాఫియాకు చెక్ పెడుతూ, మరోవైపు రైళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను నిలిపివేయడంతో పాటు రైల్వే వంటశాలల్లో నాణ్యతను పర్యవేక్షించడానికి ఏఐ కెమెరాలను తీసుకొచ్చింది.టికెట్ దందాపై చర్యలుసాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకకుండా బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ముఠాలు, దళారీల ఆట కట్టించేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగా తీసుకున్న కీలక చర్యలు చేపట్టింది.డిజిటల్ గుర్తింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3 కోట్లకు పైగా అనుమానాస్పద వినియోగదారుల ఖాతాలను ఐఆర్సీటీసీ బ్లాక్ చేసింది.వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఆరు కోట్ల ఐడీల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వాటిని కఠినమైన ధ్రువీకరణ పరిధిలో ఉంచింది.గత ఏడాది కాలంలో అక్రమ బుకింగులకు కారణమవుతున్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు.నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించి 501 అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి.800 కిచెన్లలో ఏఐ కెమెరాలురైలు ప్రయాణంలో లభించే భోజనంపై తరచూ వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా బేస్ కిచెన్లలో (వంటశాలలు) పరిశుభ్రత, కార్యాచరణ లోపాలను రియల్ టైమ్లో పర్యవేక్షించేందుకు 2,394 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను మోహరించింది.తొమ్మిది రకాల ఉల్లంఘనలను పట్టేసే టెక్నాలజీఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ వంటశాలల్లో జరిగే 9 రకాల ప్రధాన ఉల్లంఘనలను ఇట్టే పసిగడుతుంది. వంట చేసేవారు తలకు క్యాప్ పెట్టుకోకపోవడం, చేతి తొడుగులు (గ్లౌజెస్) ధరించకపోవడం, వంటగదిని సరిగ్గా తుడవకపోవడం వంటి లోపాలతో పాటు వంటశాలల్లో ఎలుకలు, ఈగలు, బొద్దింకల కదలికలను కూడా ఈ కెమెరాలు క్షణాల్లో గుర్తిస్తాయి.టూ-అవర్స్ డెడ్లైన్.. వార్ రూమ్ పర్యవేక్షణఈ సాంకేతికత ఎంతటి చిన్న వస్తువునైనా, లోపాన్నైనా సులభంగా గుర్తించగలదని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘వంటశాలల్లో పరిశుభ్రత లోపిస్తే ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) హెచ్చరికలను జారీ చేస్తాయి. ఈ అలర్ట్ నేరుగా సంబంధిత కిచెన్ మేనేజర్కు వెళ్తుంది. ఐఆర్సీటీసీ ప్రత్యేక వార్ రూమ్ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలర్ట్ వచ్చిన రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వార్ రూమ్ పర్యవేక్షణ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం వంటశాలల్లో హెడ్ క్యాప్లు ధరించకపోవడం అనేదే అత్యంత ప్రాథమిక, ప్రధాన ఉల్లంఘనగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా?
ప్రస్తుత కాలంలో ఉత్పాదకతను శాసించే అతిపెద్ద శక్తిగా కృత్రిమ మేధ, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అవతరించాయి. వేగవంతమైన కోడింగ్, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్, తగ్గుతున్న నిర్వహణ వ్యయాలు, చురుకైన నిర్ణయాధికారం.. ఇవన్నీ ఏఐ కల్పిస్తున్న వ్యాపార అవకాశాలు. భారతీయ పరిశ్రమల్లో ఉత్పాదకతను భారీగా పెంచేందుకు ఏఐ మెరుగ్గా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏఐ విలువను సృష్టిస్తుందా లేదా అనేది కాదు.. దాని ద్వారా సృష్టించిన సంపద, నియంత్రణ అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? అనేది ఇప్పుడు ప్రశ్న.తెర వెనుక అసలు కథచాట్బాట్లు, కో-పైలట్లు, ఎంటర్ప్రైజ్ ఏజెంట్లు, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ సిస్టమ్స్ (ఆర్ఏసీ) వంటి మనం చూసే పైపై అప్లికేషన్ల వెనుక ఉన్న అసలు శక్తి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం). ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ల ద్వారా భారీ డేటాను విశ్లేషించి తదుపరి స్థితిని అంచనా వేస్తూ ఇవి సమాధానాలను ఇస్తాయి. కానీ, ఈ మొత్తం వ్యవస్థకు పునాది అయిన ఫౌండేషన్ మోడల్స్ నేడు ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఓపెన్ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్, మెటా, కొన్ని చైనీస్ కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నాయి. మరోవైపు, ఈ మోడల్స్ నిర్వహణకు కావాల్సిన కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధునాతన జీపీయూ మార్కెట్ను ఎన్విడియా శాసిస్తోంది. ఒకరకంగా ఫౌండేషన్ మోడల్స్ ఏఐకి మెదడు వంటివి అయితే, జీపీయూ దానికి ఇంధనం లాంటివి. ఈ రెండు కీలక రంగాలు విదేశీ శక్తుల చేతుల్లోనే ఉండటం భారత్కు పెద్ద సవాలుగా మారింది.పొంచి ఉన్న ముప్పుభారతీయ వ్యాపారాలు కస్టమర్ సర్వీస్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, లీగల్ రివ్యూ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాల్లో ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. దీనివల్ల కంపెనీల సామర్థ్యం పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. అయితే, దీని వెనుక మరో కోణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ తన స్వదేశీ ఉద్యోగాలను ఆటోమేషన్ ద్వారా కోల్పోతూనే ఆ ఏఐ వ్యవస్థలను నడపడానికి విదేశీ ప్లాట్ఫారమ్లకు భారీగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.భారతీయ కంపెనీల ఉత్పాదకత పెరిగినప్పటికీ లాభాల్లో సింహభాగం విదేశాల్లోని ఫౌండేషన్ మోడల్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీపీయూ అధినేతలకే చేరుతుంది.భారత్ కేవలం ఒక భారీ వినియోగదారు దేశంగా మాత్రమే మిగిలిపోయి కోర్ టెక్నాలజీ నియంత్రణ అంతా విదేశాల పాలయ్యే ప్రమాదం ఉంది.భారత్ ఏం చేస్తోంది?ఈ సవాలును గుర్తించిన భారత్ ఇటీవలి కాలంలో కొన్ని కీలక అడుగులు వేసింది. సర్వమ్.ఏఐ, భారత్ జన్, జ్ఞాని.ఏఐ.. వంటి స్టార్టప్లు స్వదేశీ ఏఐ సామర్థ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అభినందనీయమే అయినప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది. అధునాతన ఫౌండేషన్ మోడల్స్, జీపీయూల లభ్యత, లోతైన ఏఐ రీసెర్చ్ ఎకోసిస్టమ్, భారీ ప్రైవేట్ పెట్టుబడుల పరంగా భారత్ ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంది.భారత్ ముందున్న వ్యూహాత్మక మార్గాలుభారత్ గ్లోబల్ రేసులో నిలవాలంటే తక్షణమే కింది రంగాలపై దృష్టి పెట్టాలి.విభాగంచేయాల్సిన మార్పు(సూచనలు మాత్రమే)భాష, వాయిస్ ఏఐభారతీయ స్థానిక భాషలు, వాయిస్ ఆధారిత ఏఐల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించడం.కంప్యూట్ మౌలిక వసతులుసరసమైన ధరల్లో దేశీయంగా ఏఐ కంప్యూట్/జీపీయూ సదుపాయాలు అందుబాటులోకి తేవడం.ఐటీ రంగ పునర్నిర్మాణంభారత ఐటీ కంపెనీలు కేవలం మ్యాన్పవర్-బేస్డ్ బిల్లింగ్ (గంటల లెక్కన పని) మోడల్స్ నుంచి ఏఐ, ఐపీ లీడ్ (సొంత మేధోసంపత్తి) ఫ్లాట్ఫారమ్లుగా మారాలి.మానవ వనరుల నైపుణ్యందేశంలోని శ్రామిక శక్తికి పెద్ద ఎత్తున ఏఐ రీస్కిల్లింగ్ ప్రోగ్రాములు నిర్వహించడం.ఇప్పుడు ‘ఏఐ కావాలా వద్దా’ అనేదాని గురించి కాకుండా.. భారత్ కేవలం ఏఐని వాడే దేశంగా మిగిలిపోతుందా లేదా ఏఐ సామర్థ్యాలపై యాజమాన్య హక్కులు సాధిస్తుందా? అనేదే అసలైన ప్రశ్న. మోడల్స్, కంప్యూట్, డేటా, ప్లాట్ఫారమ్లపై స్వదేశీ నియంత్రణ సాధించకపోతే.. ఏఐ భారతదేశానికి ఉత్పాదకత ఇంజిన్గా మారవచ్చు, కానీ దాని లాభాలు మాత్రం వేరే ఎవరికో అందుతాయి! ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు ఇప్పటికైనా మేల్కొని దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు సాగాల్సిన సమయమిది.ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా! -
భారమవుతున్న కృత్రిమ మేధ!
ఉత్పాదకతను పెంచడంలో, మానవ శ్రమను తగ్గించడంలో కృత్రిమ మేధ (ఏఐ) చాలా ఉపయోగపడుతోందన్న మాట వాస్తవమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఏఐ సాధనాలను అందిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అపరిమిత ఉత్పాదకతను ఆశ చూపిన ఏఐ, ఇప్పుడు కంపెనీల బడ్జెట్లకు తూట్లు పొడుస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఉబెర్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల దారిలోనే.. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ అయిన వాల్మార్ట్ కూడా తమ ఉద్యోగుల ఏఐ వినియోగంపై ఆంక్షలు విధిస్తుంది.‘కోడ్ పప్పీ’కి బ్రేకులుబ్లూమ్బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. వాల్మార్ట్ తన అంతర్గత కార్పొరేట్ పనుల కోసం రూపొందించుకున్న ‘కోడ్ పప్పీ’ అనే ఏఐ అసిస్టెంట్ వినియోగంపై పరిమితులు విధించింది. ఇది ఉద్యోగులకు ప్రెజెంటేషన్లు తయారు చేయడం, డేటా స్ప్రెడ్షీట్లను నింపడం వంటి రోజువారీ పనులను చిటికెలో చేసిపెట్టే ఏఐ ఏజెంట్. గతంలో వాల్మార్ట్ ఉద్యోగులు దీనిని అపరిమితంగా వాడేవారు. ఉద్యోగుల నుంచి దీనికి డిమాండ్ పెరగడంతో కంపెనీకి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఇకపై ఉద్యోగులకు టోకెన్ పరిమితి విధించాలని నిర్ణయించింది.టోకెన్ పరిమతి అంటే ఏమిటి?ఏఐ భాషలో టోకెన్ అనేది ఒక కొలమానం. మనం ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్లు (ప్రశ్నలు) అది ఇచ్చే సమాధానాల పొడవును బట్టి టోకెన్లు ఖర్చవుతాయి. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి. అంటే.. ఇకపై వాల్మార్ట్ ఉద్యోగులు లెక్క చూసుకుని మరీ ఏఐని వాడాల్సి ఉంటుంది.ఈ విషయంపై వాల్మార్ట్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగులు ఏఐని కేవలం కాలక్షేపానికి కాకుండా కంపెనీకి విలువను చేకూర్చే పనులకు మాత్రమే వాడాలని, సరైన పని కోసం సరైన ఏఐ సాధనాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాల్మార్ట్ సిబ్బందికి కోడ్ పప్పీతో పాటు క్లాడ్, చాట్జీపీటీ వంటి ఇతర సాధనాల యాక్సెస్ కూడా ఉంది.ఉబెర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకూ తప్పని తిప్పలుఖర్చులు పెరుగిపోతున్న ఉదంతాన్ని బహిరంగంగా అంగీకరించిన సంస్థల్లో రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది జనవరిలో ఉబెర్ తన 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ‘క్లాడ్ కోడ్’ యాక్సెస్ ఇచ్చింది. అయితే, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆ ఏడాది మొత్తానికి కేటాయించిన ఏఐ బడ్జెట్ అంతా ఖర్చయిపోవడంతో యాజమాన్యం నివ్వెరపోయింది.మైక్రోసాఫ్ట్ యూటర్న్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తన అంతర్గత ఇంజినీర్లను క్లాడ్ కోడ్ వాడకం తగ్గించి, జూన్ 30 లోగా సంస్థకు చెందిన సొంత ఏఐ టూల్స్కు మారిపోవాలని ఆదేశించింది. టోకెన్ ఖర్చులు మితిమీరడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే..
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సాంప్రదాయ ఐటీ రంగ ఉనికినే ప్రశ్నిస్తోందన్న ఆందోళనలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని కౌంటర్ ఇచ్చారు. ‘కోడింగ్ ఆటోమేటెడ్ అయితే ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎందుకు?’ అంటూ మార్కెట్లో వ్యక్తమవుతున్న అస్తిత్వ ప్రశ్నలకు ఆయన వ్యూహాత్మక సమాధానమిచ్చారు. ఏఐ అనేది ఐటీ సేవల ప్రాధాన్యతను తగ్గించబోదని, పైగా నైపుణ్యాల డిమాండ్ను మరింత పెంచిందని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక సమర్పణ సందర్భంగా వాటాదారులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఆందోళనల మధ్యే అద్భుత వృద్ధిగత ఏడాది కాలంగా ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు అధునాతన ఏఐ సాధనాలను మార్కెట్లోకి తీసుకురావడంతో ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భయాల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 28% పైగా క్షీణించాయి. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్ఫోసిస్ బలమైన ఆర్థిక ఫలితాలను సాధించినట్లు చెప్పారు.వార్షిక ఆదాయం: మునుపటి ఏడాదితో పోలిస్తే 4.6% వద్ధితో 20.16 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.65 లక్షల కోట్లు) వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది.ఉద్యోగుల సంఖ్య: కంపెనీ ఉద్యోగుల సంఖ్య మునుపటి కంటే 5,016 పెరిగి మొత్తం 3,28,594 కు చేరుకుంది.మునుపటికంటే బలంగా..‘జనరేటివ్ ఏఐ (GenAI) రంగ ప్రవేశం చేసి మూడేళ్లు పూర్తయింది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గతంలో కంటే మరింత సందర్భోచితంగా, పటిష్టంగా మారిందని చెప్పగలం. మన ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఏఐ అనేది మునుపెన్నడూ లేనంత పెద్ద సాంకేతికగా కనిపిస్తుంది. కాబట్టి సందేహాలు రావడం సహజం. కోడింగ్ ఆటోమేటిక్ అయితే, ఇక మన అవసరం ఏముంది? అనే ప్రశ్న మా ముందూ నిలిచింది. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది’ అన్నారు.ఐటీ అంటే అంతకంటే ఎక్కువే!ఏఐ కేవలం కోడింగ్ను ఆటోమేట్ చేయగలదని, అయితే ఒక పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ సరిపోదని నీలేకని స్పష్టం చేశారు. వేగవంతమైన ఏఐ డిమాండ్కు అనుగుణంగా ఐటీ రంగంలో కింది అంశాలు అత్యంత కీలకంగా మారాయని చెప్పారు.1. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ) పరీక్షలు: క్లిష్టమైన సిస్టమ్స్ను నిరంతరం పర్యవేక్షించడం.2. సాఫ్ట్వేర్ వ్యవస్థలు వైఫల్యం చెందకుండా నిరోధించడం.3. సైబర్ సెక్యూరిటీ: ఏఐ యుగంలో పెరిగిపోతున్న సైబర్ ముప్పుల నుంచి రక్షణ కల్పించడం.4. ఐటీ ఆధునీకరణ: పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలను సరికొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడం.కొత్త వ్యాపార నమూనా వైపు అడుగులుభవిష్యత్తు ఐటీ రంగాన్ని శాసించడానికి పాత పద్ధతులు సరిపోవని, సరికొత్త వ్యాపార నమూనా అవసరమని నీలేకని పిలుపునిచ్చారు. ‘మేము ఈ సరికొత్త సవాలుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. మా శ్రామిక శక్తిని ఈ కొత్త యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాం. ఏఐ ఆటోమేషన్, ఉత్పాదకత ద్వారా ఆదా అయ్యే మానవ వనరులను కొత్త యూజర్లను ఆకర్షించడానికి, సరికొత్త సేవలను విస్తరించడానికి తిరిగి వినియోగిస్తాం’ అని నందన్ నీలేకని వాటాదారులకు హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
కాగితంపై ఆహా ఓహో.. ముఖాముఖిలో..
ఉద్యోగ అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సరికొత్త ట్రెండ్గా మారింది. ఒకప్పుడు చక్కటి రెజ్యూమే (సీవీ) రాయడం చేతకాక ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోయేవారు. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ పుణ్యమా అని నిమిషాల్లో ప్రొఫెషనల్ రెజ్యూమేలు సిద్ధమైపోతున్నాయి. కంపెనీల అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏటీఎస్) ఫిల్టర్లను సులభంగా దాటేలా కీవర్డ్స్తో వీటిని అభ్యర్థులు ముస్తాబు చేస్తున్నారు. అయితే, ఇదే ఇప్పుడు రిక్రూటర్లకు తలనొప్పిగా మారింది. కాగితంపై అద్భుతంగా కనిపిస్తున్న అభ్యర్థులు తీరా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కనీస ప్రతిభ చూపలేకపోతుండటంతో కంపెనీలు తమ ఎంపిక వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి.గణాంకాలు ఏం చెబుతున్నాయి?ప్రస్తుతం వైట్ కాలర్ ఉద్యోగాలకు పోటీ పడేవారిలో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని మార్కెట్ వర్గాల తాజా డేటా స్పష్టం చేస్తోంది.హనార్.ఏఐ నివేదిక: ప్రస్తుతం దాదాపు 70 శాతానికి పైగా వైట్ కాలర్ అభ్యర్థులు తమ రెజ్యూమేల రూపకల్పనకు ఏఐని వాడుతున్నారు. ఇక యువత (జెన్ జీ) విషయానికి వస్తే ఈ సంఖ్య ఏకంగా 85 శాతం దాటిపోయింది.నెక్సాస్క్రీన్ విశ్లేషణ: ఒకే రకమైన అనుభవం ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏఐ ద్వారా ఆప్టిమైజ్ చేసిన రెజ్యూమే ఉన్న అభ్యర్థికి షార్ట్లిస్ట్ అయ్యే అవకాశం 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటోంది.లింక్డ్ఇన్ పరిశోధన: కొవిడ్ పూర్వపు రోజులతో పోలిస్తే ప్రస్తుతం నియామక ప్రక్రియలు 40 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం సవాలుగా మారిందని 74 శాతం మంది రిక్రూటర్లు వాపోతున్నారు. ఇందులో 53 శాతం మంది ఏఐ రెజ్యూమేల వెల్లువను నిందిస్తుండగా 47 శాతం మంది నైపుణ్యాల కొరతను కారణంగా చూపుతున్నారు.నకిలీల జోరు.. పెరిగిన నిఘా!రెజ్యూమేల్లో ఏఐ వాడకం పెరగడంతోపాటు ఆన్లైన్ అసెస్మెంట్లలో (పరీక్షల్లో) అవసరాన్ని మించి ఏఐ టూల్స్ వాడుతూ దొరికిపోతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రముఖ హైరింగ్ ప్లాట్ఫామ్ హైర్ప్రో సీఓఓ పసుపతి ఎస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రిక్రూటర్ల ముందున్న అతిపెద్ద సవాలు.. ఏఐ సృష్టించిన హడావుడిని దాటుకుని అభ్యర్థిలో ఉన్న నిజమైన ప్రతిభను గుర్తించడమే’ అని పేర్కొన్నారు.ఒకే మూసలో రెజ్యూమేలు..‘ఏఐ రెజ్యూమేలు ఏటీఎస్ ఫిల్టర్లను సులభంగా దాటుతున్నాయి. కాగితంపై అంతా సవ్యంగానే ఉంటోంది. కానీ, ప్రతి ఒక్కరూ ఒకే రకమైన టెంప్లేట్లు వాడటం వల్ల రిక్రూటర్లకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి’ అని ‘హనార్.ఏఐ’ వ్యవస్థాపకుడు కృష్ణ ఖండేల్వాల్ తెలిపారు. కాగితంపై ప్రొఫైల్ ఎంత బలంగా ఉందో ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రదర్శన అంత బలహీనంగా ఉంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు తమ నైపుణ్యాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏఐ ఉపయోగపడాలి కానీ, లేని అనుభవాన్ని ఉన్నట్లు చూపించడానికి కాదని హెచ్చరిస్తున్నారు. పేపర్ షార్ట్లిస్టింగ్లో టాప్లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అందులో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కనీసం బాటమ్ 25 పర్సంటైల్ స్కోరు కూడా సాధించలేకపోతున్నారని వాపోతున్నారు.కెరీర్ మార్చేవారికి శాపం!ఈ ఏఐ ఆధారిత ఫిల్టరింగ్ వ్యవస్థ వల్ల కొందరు తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. స్వదేశంలో పెద్ద స్టార్టప్ల్లో లేదా యూనికార్న్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఏటీఎస్ సిస్టమ్స్ ఆయా కంపెనీల పేర్లను గుర్తించలేక వారి అప్లికేషన్లను ఆటో-రిజెక్ట్ చేస్తున్నాయి. వేరే రంగం నుంచి ఐటీ లేదా ఇతర విభాగాలకు మారాలనుకునే అభ్యర్థుల హిస్టరీలో నిర్దిష్ట కీవర్డ్స్ లేకపోవడం వల్ల ఏఐ సహాయంతో రెజ్యూమే మార్చినా సిస్టమ్స్ వాటిని తిరస్కరిస్తున్నాయి.మారుతున్న నియామక సూత్రాలుకీవర్డ్స్ ఆధారిత రెజ్యూమేలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి.రెఫరల్స్, పోర్ట్ఫోలియోలు: పాత కంపెనీల బ్రాండ్ వాల్యూ, గతంలో చేసిన ప్రాజెక్టుల పోర్ట్ఫోలియోలు, అంతర్గత రెఫరల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.వాయిస్ బేస్డ్ అసెస్మెంట్స్: కేవలం రెజ్యూమేలు చూడకుండా తొలి దశలోనే 15 నిమిషాల వాయిస్ కాల్స్ లేదా ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థికి ఉన్న ప్రాక్టికల్ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి బయటపడతాయని రిక్రూటర్లు నమ్ముతున్నారు.ఫలితాల ఆధారిత పరిశీలన: కేవలం బాధ్యతల గురించిన రాతలు కాకుండా అభ్యర్థి సాధించిన నిర్దిష్ట విజయాలు, ప్రాజెక్ట్ ఓనర్షిప్, సమస్యల పరిష్కార సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
కోట్ల వ్యయం.. అందని ప్రతిఫలం!
గత కొంతకాలంగా ప్రపంచ టెక్ రంగాన్ని శాసిస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాయాజాలం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశకు చేరుకుంది. అల్లాద్దీన్ అద్భుత దీపంలా వ్యాపార సామర్థ్యాన్ని పెంచి, ఖర్చులను తగ్గించేస్తుందని నమ్మిన బిగ్ టెక్ కంపెనీలకు ఇప్పుడు ‘రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్’ (ఆర్ఓఐ) లేదా ‘పెట్టుబడిపై రాబడి’ రూపంలో అసలు సవాలు ఎదురవుతోంది. ఏఐ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా వంటి దిగ్గజాలు సమష్టిగా 2025లో సుమారు 320 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయని అంచనా. అయితే, ఈ భారీ వ్యయానికి తగ్గ ప్రతిఫలం వస్తోందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పరిణామం ఐటీ ఉద్యోగులకు ఒక రకంగా ఊరటనిచ్చే విషయమేనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే, ఏఐ వాడకం పెరుగుతుందనే నెపంతో ఇప్పటివరకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ (ఉద్యోగాల కోత)పై తీవ్రంగా ఫోకస్ చేశాయి. కానీ ఇప్పుడు ఏఐ మితిమీరిన ఖర్చులకు బ్రేకులు పడుతుండడంతో మున్ముందు లేఆఫ్స్ భయాలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.ఉబెర్లో ఇలా..ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబెర్లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత పరిణామాలు ఏఐ బడ్జెట్ సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. ఉబెర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆండ్రూ మెక్ డొనాల్డ్ ఇటీవల తమ ఏఐ వ్యయాలను సమర్థించుకోవడం కష్టంగా మారుతోందని బహిరంగంగానే అంగీకరించారు. ఉబెర్ ఎగ్జిక్యూటివ్లు అంతర్గతంగా ఈ సమస్యను ‘టోకెన్ మాక్సింగ్’గా పిలుస్తున్నారు. డెవలపర్లు భారీ మొత్తంలో ఏఐ కంప్యూట్ టోకెన్లను వినియోగిస్తున్నప్పటికీ ఆ ఖర్చంతా యూజర్లకు మెరుగైన ప్రొడక్ట్స్గా మారుతోందా లేదా అని ట్రాక్ చేయడానికి ఎలాంటి నమ్మదగిన మార్గం లేకపోవడమే దీనికి కారణం.ఉబెర్ సీటీఓ ప్రవీణ్ నెప్పల్లి నాగ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్లాడ్ కోడ్ కోసం కంపెనీ కేటాయించిన మొత్తం 2026 బడ్జెట్ కేవలం నాలుగు నెలల్లోనే పూర్తయింది. అయితే, ఉబెర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ను చాలా మెరుగ్గా స్వీకరించారు. కంపెనీలోని 5,000 మందికి పైగా డెవలపర్లలో 92% కంటే ఎక్కువ మంది ప్రతి నెలా ఏఐ అసిస్టెంట్లను వాడుతున్నారు. ప్రస్తుతం ఉబెర్ రాసే కోడ్లో 10% ఏఐ సృష్టించిందే. అయినప్పటికీ, ఏఐ జనరేట్ చేసిన కోడ్ వల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగవుతోందా అంటే లీడర్షిప్ దగ్గర సమాధానం లేదు. ఉత్పాదకత పెరిగిందని చెబుతున్నా దానివల్ల కొత్తగా ఏ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయనే దానికి, ఖర్చుకు లింక్ దొరకడం లేదు.వ్యూహం మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్, డ్యుయోలింగోకేవలం ఉబెర్ మాత్రమే కాదు, ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ సైతం ఇప్పుడు అప్రమత్తమైంది. భారీ ఏఐ విస్తరణల వల్ల పెరుగుతున్న వ్యయాన్ని నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్.. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోడ్తో సహా కొన్ని బాహ్య ఏఐ కోడింగ్ సబ్స్క్రిప్షన్లను తగ్గించడం ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు, లాంగ్వేజ్-లెర్నింగ్ ప్లాట్ఫామ్ ‘డుయోలింగో’ గతంలో ఉద్యోగుల పనితీరును ఏఐ వినియోగ మెట్రిక్స్తో లింక్ చేస్తూ తెచ్చిన అంతర్గత విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఏఐ సాధనాలు తమ పని నాణ్యతను పెంచకపోయినా కేవలం టార్గెట్ల కోసం వాటిని వాడాల్సి వస్తోందని సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.కంపెనీలు చేస్తున్న ప్రాథమిక తప్పిదం ఏంటి?ప్రముఖ ఏఐ అధ్యాపకుడు అన్ష్ మెహ్రా విశ్లేషణ ప్రకారం.. చాలా కంపెనీలు ఏఐ అమలులో ప్రాథమిక తప్పు చేస్తున్నాయి. ఉద్యోగులు స్వయంగా ఆలోచించి పనిని నిర్మించుకోవడానికి ముందే పూర్తిగా ఏఐ వ్యవస్థలపై ఆధారపడుతున్నారు. దీనివల్ల వచ్చే అవుట్పుట్ను సరిచేయడానికి, డీబగ్ చేయడానికి మళ్లీ మానవ శ్రమ భారీగా అవసరమవుతోంది. ఫలితంగా.. సామర్థ్యం పెరగకుండానే కేవలం ‘టోకెన్ ఖర్చులు’ మాత్రమే కొండలా పేరుకుపోతున్నాయి.ఏఐ స్వీకరణకు సరైన మార్గం (అన్ష్ మెహ్రా సూచనలు)తక్కువ రిస్క్ ఉండే రొటీన్ పనుల్లో మాత్రమే నిర్దిష్ట దశలను ఏఐతో ఆడిట్ చేయాలి. ఆయా విభాగాల్లోని అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులతో మాత్రమే ఎల్ఎల్ఎమ్లను పరీక్షించి అవుట్పుట్లను ధ్రువీకరించాలి. ఉద్యోగులందరికీ ఏఐ లైసెన్సులు ఇచ్చేసే కంటే ముందు ఏది పని చేస్తుంది, ఏది పని చేయదు అనేది స్పష్టంగా డాక్యుమెంట్ చేయాలి.పెరగనున్న భరోసా!గతంలో ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి మాట్లాడుతూ.. ఏఐ పెట్టుబడుల వైపు వనరులను మళ్లించడం కోసం నియామకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుత ఆర్థిక సమీక్షలు చూస్తుంటే ఈ వ్యూహం ఎంతవరకు లాభదాయకమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెక్ కంపెనీలు ఏఐ వైపు అనాలోచితంగా పరుగెత్తి, ఉద్యోగులను తగ్గించుకుంటూ పోవడం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఏఐ వల్ల ఆశించిన స్థాయిలో ఆర్ఓఐ రాకపోవడం, పైగా కంప్యూటింగ్ బడ్జెట్లు గుల్లవుతుండడంతో కంపెనీలు తిరిగి క్షేత్రస్థాయి వాస్తవాల్లోకి వస్తున్నాయనే వాదనలున్నాయి. ఫలితంగా, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు తగ్గి, లేఆఫ్స్ వేగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఏఐ బూమ్తో శామ్సంగ్ బంపర్ ఆఫర్
కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన చిప్ విభాగం ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ సాధించిన బంపర్ ప్రాఫిట్స్ నేపథ్యంలో చిప్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3.25 కోట్లు) బోనస్ లభించనుంది. బుధవారం నాడు శాంసంగ్కు చెందిన అతిపెద్ద కార్మిక సంఘం (యూనియన్) ఈ మెగా బోనస్ ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు 18 రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె హెచ్చరికల నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఏకంగా 49 రెట్లు పెరిగిన ఆదాయం!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ బూమ్ కారణంగా చాట్ జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడల్స్, భారీ డేటాసెంటర్లకు మెమరీ చిప్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మెమరీ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న శామ్సంగ్.. గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ఆదాయంలో ఏకంగా 49 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణ వృద్ధి కారణంగానే తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీగా శామ్సంగ్ ఇటీవల రికార్డు సృష్టించింది.ఎవరు అర్హులు?ఈ భారీ బోనస్ ప్యాకేజీ శామ్సంగ్ ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కంపెనీకి చెందిన ప్రాసెసర్లు, ర్యామ్, హై-ఎండ్ మెమరీ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ (చిప్) విభాగానికి మాత్రమే ఇది పరిమితం. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ డేటాసెంటర్లలో వాడే చిప్స్ అన్నీ ఈ విభాగంలోనే తయారవుతాయి.ఈ ఏడాది మార్చిలో శామ్సంగ్ సమర్పించిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. 2025లో కంపెనీ ఉద్యోగులు సగటున 158 మిలియన్ వాన్ (సుమారు రూ.1 కోటి) ఆర్జించారు. కానీ ఈసారి రాబోయే బోనస్ ఆ మొత్తాన్ని ఎన్నో రెట్లు అధిగమించింది.కేవలం బోనస్ల కోసమే 26.5 బిలియన్ డాలర్లుశామ్సంగ్ అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ చిప్ విభాగంలో సుమారు 78,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికీ సగటున 3,40,000 డాలర్ల బోనస్ ఇవ్వాలంటే కంపెనీ కేవలం బోనస్ కోసమే ఏకంగా 26.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వ్యయంగా మారనుంది.ఓటింగ్లో భారీ మెజారిటీయూనియన్ ప్రతినిధులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంపై నిర్వహించిన ఓటింగ్లో అర్హులైన సభ్యులలో 95 శాతానికి పైగా పాల్గొన్నారు. మొత్తం 62,600 బ్యాలెట్లలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం సగానికి పైగా మద్దతు అవసరం కాగా, ఉద్యోగులు భారీ మెజారిటీతో దీనిని ఆమోదించారు.తప్పిన గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభంఈ ఒప్పందం కేవలం శామ్సంగ్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ టెక్ రంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే దక్షిణ కొరియా మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో శామ్సంగ్ వాటా ఏకంగా 12.5 శాతం. అలాగే ఆ దేశ ఎగుమతుల్లో మెమరీ చిప్స్ వాటా 35 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోయి ఉంటే ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మెకు వెళ్లేవారు. దీనివల్ల ప్రపంచవ్యాప్టింగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల తయారీ నిలిచిపోయి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినేది. వారం రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ముప్పు తప్పింది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
లేఆఫ్స్కు సాకు చెప్పడం సీఈఓల సోమరితనం
టెక్ ప్రపంచంలో కొంతకాలంగా సాగుతున్న ఉద్యోగాల కోత (లేఆఫ్స్)పై కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీల్లో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపునకు ఏఐ సాంకేతికతను సాకుగా చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంతమంది టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, కేవలం స్మార్ట్గా కనిపించడానికి ఏఐని వాడుకుంటున్నారని ఇది వారి సోమరితనం(లేజీ నారేటివ్) అని మండిపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.రెండేళ్ల క్రితం తీసేసి.. ఇప్పుడు ఏఐ అనడం ఏంటి?ఉద్యోగ నష్టాలకు, ఏఐ విస్తరణకు ముడిపెడుతూ సాగుతున్న ప్రచారాన్ని జెన్సెన్ హువాంగ్ పూర్తిగా ఖండించారు. సాంకేతికత ఇప్పుడిప్పుడే వ్యాపారాలకు ఉపయోగకరంగా మారుతోందని, కానీ కంపెనీలు మాత్రం చాలా కాలం క్రితమే ఉద్యోగులను తొలగించాయని ఆయన గుర్తుచేశారు. ‘ఏఐ అనేది కేవలం గత ఆరు నెలలుగా మాత్రమే పూర్తిస్థాయిలో ఉత్పాదకతను ఇస్తూ కంపెనీలకు ఉపయోగకరంగా మారింది. మరి అలాంటప్పుడు రెండేళ్ల క్రితమే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు.. దానికి ఏఐ కారణమని ఎలా చెబుతాయి? టెక్నాలజీ ఇప్పుడే మార్కెట్లోకి వస్తే.. అప్పుడే ఉద్యోగాలు ఎలా పోతాయి? నేను ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషిస్తున్నాను’ అని హువాంగ్ అన్నారు. కొంతమంది వ్యాపార నాయకులు శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ఉన్న అసలైన అంతర్గత కారణాలను దాచిపెట్టి కేవలం చర్చనీయాంశంగా మార్చడానికి ఏఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యంప్రస్తుతం మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు ఏఐ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ కార్మికులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళనను ఉద్యోగుల్లో పెంచుతున్నాయి. ఈ అంశంపై హువాంగ్ స్పందిస్తూ.. కార్పొరేట్ నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘మనం అనవసరంగా ప్రజలను భయపెడుతున్నాం, ఇది చాలా బాధ్యతారాహిత్యం. ఏఐ చుట్టూ ఉన్న వాస్తవాలను, దానివల్ల కలిగే సమతుల్య ప్రయోజనాలను సమాజానికి వివరించడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలి’ అని ఆయన స్పష్టం చేశారు.పీక్ స్టేజ్లో ఉద్యోగాల కోత: గణంకాలు ఏం చెబుతున్నాయి?ఉత్పాదకతను పెంచడానికి, పనులను ఆటోమేట్ చేయడానికి పరిశ్రమలు ఏఐ సాధనాలను వేగంగా స్వీకరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ లేఆఫ్స్కు కేవలం అదే కారణం కాదని మార్కెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ తాజా గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు 150 టెక్ కంపెనీల్లోని 1,14,210 మందికి పైగా ఈ లేఆప్స్ ద్వారా ప్రభావితమయ్యారు. మొత్తమ్మీద, లేఆఫ్స్ వెనుక ఉన్న ఆర్థిక మాంద్యం భయాలు, కంపెనీల మితిమీరిన విస్తరణ, వ్యయాల తగ్గింపు వంటి అసలు కారణాలను పక్కనబెట్టి ప్రతిదానికీ సరికొత్త టెక్నాలజీ వైపు వేలెత్తి చూపడం సరికాదన్న ఎన్విడియా చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
కృత్రిమ మేధో ప్రవాహం.. ఉపాధికి శరాఘాతం!
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా మానవీయ విలువలను విస్మరిస్తే సమాజ సమతుల్యత దెబ్బతింటుందని వాటికన్ వేదికగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మే 25న వాటికన్ ఆడిటోరియంలో పోప్ లియో చారిత్రాత్మక ఎన్సైక్లికల్ (పోప్ అధికారిక పత్రం) ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టోఫ్ ఓలా పాల్గొని ఏఐ వల్ల భవిష్యత్తులో సంభవించబోయే ఉద్యోగ నష్టాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పోప్ పక్కనే కూర్చున్న క్రిస్టోఫ్ ఓలా ఏఐ విస్తరణ వల్ల మానవ శ్రమకు పొంచి ఉన్న ముప్పును స్పష్టంగా వివరించారు.భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకంప్యూటర్ కోడింగ్, కంటెంట్ రైటింగ్, డేటా అనలిటిక్స్, రోజువారీ ఆఫీస్ పనులను క్షణాల్లో పూర్తి చేయగల సరికొత్త ఏఐ సాధనాలను కంపెనీలు మార్కెట్లోకి వదులుతున్న తరుణంలో ఓలా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఏఐ సాంకేతికత మానవ శ్రమను భారీగా భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఉపాధి కోల్పోయి వీధిన పడే లక్షలాది మందికి సామాజిక, ఆర్థిక మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాల చారిత్రక, నైతిక బాధ్యత అవుతుంది’ అన్నారు. సమాజాలు, ప్రభుత్వాలు ఊహించిన దానికంటే అత్యంత వేగంగా ఏఐ ఉపాధి రంగాలను పునర్నిర్మిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మాగ్నిఫికా హ్యుమానిటాస్పోప్ లియో విడుదల చేసిన ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ ఎన్సైక్లికల్ పూర్తిగా కృత్రిమ మేధస్సు యుగంలో మానవాళి ఉనికిని, హక్కులను రక్షించడంపైనే దృష్టి సారించింది. అదుపు లేని, వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి వల్లే ప్రస్తుత ఆధునిక సంక్షోభాలు మరింత తీవ్రమవుతున్నాయని ఈ పత్రంలో పోప్ హెచ్చరించారు.ఎన్సైక్లికల్లోని ముఖ్యమైన అంశాలులగ్జరీగా మారిన ఏఐ కంపెనీలపై ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణను కలిగి ఉండాలి.డిజిటల్ ప్రపంచంలో కేవలం కొన్ని సంస్థల చేతుల్లోనే అధికారం ఏకీకృతం కావడం సమాజానికి శ్రేయస్కరం కాదు.ఏఐ అనేది కేవలం సాంకేతిక ఆవిష్కరణ లేదా వ్యాపార సమస్య కాదు, అది నేరుగా మానవ జీవితాలను ప్రభావితం చేసే నైతిక అంశం.ఒత్తిడిలో ఏఐ సంస్థలుప్రస్తుతం ఫ్రాంటీర్ ఏఐ ల్యాబ్లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను కూడా క్రిస్టోఫ్ ఓలా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తీవ్రమైన వ్యాపార పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆశయాల నడుమ ఈ కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన అంగీకరించారు. తీవ్రమైన అంతర్జాతీయ వాణిజ్య పోటీ వల్ల నైతిక విలువల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. దాంతో సాంకేతికత దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. మంచి ఉద్దేశాలు ఉన్న పరిశోధకులు సైతం మార్కెట్ శక్తుల ఒత్తిడికి లొంగిపోక తప్పడం లేదని పేర్కొన్నారు. అందుకే ఏఐ సంస్థలపై విమర్శలు, పారదర్శకమైన బహిరంగ పరిశీలన అత్యంత అవసరమని ఓలా స్పష్టం చేశారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
కస్టమర్ల ఇళ్లలో కెమెరాల కలకలం
బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో ప్రస్తుతం సాంకేతిక, నైతిక వివాదంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల ఇళ్లలో వీడియోలను రికార్డ్ చేయడానికి తన సిబ్బందిని ఉపయోగించిందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ స్టార్టప్ ‘హ్యూమన్ ఆర్కైవ్’ వ్యవస్థాపకుడు రుషిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.నాడు ఎగతాళి చేశారు.. నేడు అదే చేస్తున్నారుభవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు, ఫిజికల్ ఏఐ వ్యవస్థల శిక్షణ కోసం మానవ ప్రవర్తన, కదలికలు, రియల్ వరల్డ్ పరస్పర చర్యలను (ఉదాహరణకు: లైవ్లో ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వస్తువులను సర్దడం) రికార్డ్ చేసే పనుల్లో ‘హ్యూమన్ ఆర్కైవ్’ సంస్థ నిమగ్నమై ఉంది. ఈ అంశంపైనే కొన్ని నెలల క్రితం (జనవరిలో) తాను ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానాతో చర్చించానని రుషిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనను తీవ్రంగా ఎగతాళి చేసిందని ఆయన ఆరోపించారు.‘జనవరిలో నేను అంజలి సర్దానాతో మాట్లాడినప్పుడు ఆమె నన్ను చూసి నవ్వింది. ఇలాంటి డేటా సేకరిస్తున్నందుకు నన్ను ఒక తెలివితక్కువవాడిగా చిత్రీకరించింది. స్టార్టప్ వ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు అలవాటు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ను పట్టుకోవడానికి వాళ్లే ఆపసోపాలు పడుతున్నారు’ అని రుషిల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.ఏడాదిలో భారీ వాల్యుయేషన్.. కానీ..23 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అంజలి సర్దానా నేతృత్వంలోని ప్రోంటో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. యూఎస్లోని జార్జ్టౌన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన అంజలి గతంలో బైన్ క్యాపిటల్, 8వీసీ వంటి ప్రతిష్టాత్మక వెంచర్ సంస్థల్లో పనిచేశారు. ఏప్రిల్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది-బాత్రూమ్ క్లీనింగ్, లాండ్రీ వంటి సర్వీసుల కోసం కస్టమర్లను శిక్షణ పొందిన గృహ కార్మికులతో అనుసంధానిస్తుంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోపే దీని వాల్యుయేషన్ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కెమెరా వివాదం’ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది.కెమెరాలు ఎందుకోసమంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రోంటో కంపెనీ ఇళ్లలో కెమెరాలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భవిష్యత్తులో మనుషులతో సంబంధం లేకుండా ఇళ్లలో స్వయంగా పనులు చేయగల హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేయడానికి ఈ కెమెరా రికార్డింగులు అత్యంత కీలకం.అది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రోంటో సంస్థ అధికారికంగా స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కస్టమర్లు స్వచ్ఛందంగా అంగీకరించి ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సిబ్బంది ఇళ్లకు కెమెరాలతో వెళ్లరు. ఈ అనుమతి ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు, ప్రతి బుకింగ్కు ముందు కస్టమర్ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం 0.1% మంది కస్టమర్ల వద్ద మాత్రమే నడుస్తోంది. దేశంలో అమలులో ఉన్న డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్ట నిబంధనలకు కట్టుబడే నెలల తరబడి కసరత్తు చేసి ఈ ప్రక్రియను రూపొందించాం’ అని సంస్థ తెలిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ రంగంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక సంస్థ తమది మాత్రమే కాదని ప్రోంటో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా?
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని పుణ్యమా అని భవిష్యత్తులో ఐటీ సహా పలు రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సిలికాన్ వ్యాలీలోని గ్లీన్ కంపెనీ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన అరవింద్ జైన్ భిన్నమైన, అత్యంత సానుకూల దృక్పథాన్ని వినిపించారు. ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయలేదని, బదులుగా వారి పనితీరును, సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ఎంటర్ప్రైజ్ సెర్చ్ ప్లాట్ఫామ్ గ్లీన్ సీఈఓ అయిన అరవింద్ జైన్.. ‘ఫార్చ్యూన్’ నిర్వహించిన వర్క్ప్లేస్ ఇన్నోవేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భర్తీ చేసేంత లేదు..ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయవచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోందని, అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని అరవింద్ జైన్ పేర్కొన్నారు. ‘నా ఉద్దేశం ప్రకారం.. భవిష్యత్తులో ఎప్పటికీ ఏఐ ఏ మానవ సిబ్బందినీ భర్తీ చేయదు. ఇది వాస్తవానికి మనల్ని మరింత సమర్థులుగా మారుస్తుంది. అత్యున్నత నాణ్యతతో కూడిన పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది. మేము ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతానికైతే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు’ అని అరవింద్ జైన్ తెలిపారు.ఉద్యోగులకు ఏఐ ఒక కో-పైలట్లాగా పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. రోజువారీగా సాగే రొటీన్, పునరావృత పనులను ఏఐకి అప్పగించడం ద్వారా.. మానవులు తమ ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం వంటి కీలకమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చని ఆయన విశ్లేషించారు.దిగ్గజాల హెచ్చరికలుభవిష్యత్ శ్రామిక శక్తిపై అరవింద్ జైన్ వ్యక్తంచేసిన అంచనాలు, ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార వర్గాల సెంటిమెంట్కు పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇప్పటికే ఏఐ ముప్పుపై హెచ్చరిస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా దాదాపు సగం వరకు వైట్-కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని పదేపదే హెచ్చరించారు. జేపీ మోర్గాన్ అధినేత జేమీ డిమోన్, ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ.. అమెరికా సహా అంతర్జాతీయంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ ఆక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు! -
ఏఐ బూమ్ ఒక బుడగ.. అయినా నష్టం లేదు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హడావిడి ఒక ‘బుడగ’ (బబుల్) లాంటిదేనన్న ఆందోళనలపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భిన్నంగా స్పందించారు. ఒకవేళ ఇది బబుల్ అయినప్పటికీ దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఏఐ కంపెనీలు విఫలమైనప్పటికీ ఈ రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులు శాశ్వత సాంకేతిక ప్రయోజనాలను అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఏఐ రంగంలోకి వస్తున్న మూలధన పెట్టుబడిదారులుగానీ, విధాన రూపకర్తలుగానీ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.పెట్టుబడులు.. ఫలితాలు..‘ఏఐలో వస్తున్న మార్పులు ఒక బుడగగా మారినప్పటికీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బబుల్ మార్కెట్లో వస్తున్న భారీ పెట్టుబడులు చాలావరకు మెరుగైన ఫలితాలందించేందుకు మళ్లిస్తున్నారు’ అని బెజోస్ పేర్కొన్నారు.ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం జరుగుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్ స్థిరత్వంపై చర్చ నడుస్తోంది.మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా బలహీనమైన వ్యాపార నమూనాలు ఉన్న స్టార్టప్లు కూడా సులభంగా నిధులను ఆకర్షిస్తున్నాయనే వాస్తవాన్ని బెజోస్ అంగీకరించారు. ‘ఈ తరుణంలో మంచి ఆలోచనలకు, చెడు ఆలోచనలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో పెట్టుబడిదారులు ఇంకా నేర్చుకోలేదు. అది పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే కొన్ని మంచి ఆలోచనలు సాధించే భారీ విజయాలు.. ఓడిపోయిన మిగతా అన్ని సంస్థల నష్టాలను భర్తీ చేస్తాయి’ అని బెజోస్ విశ్లేషించారు.పారిశ్రామిక చక్రాలు..పారిశ్రామికంగా ఇలాంటి చక్రాలు(ఇండస్ట్రియల్ సైకిల్స్) చాలా అవసరమన్నారు. ఇవే సాంకేతికతను వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా 1990ల నాటి బయోటెక్నాలజీ బూమ్ను ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో మార్కెట్ మితిమీరిన ఉత్సాహం వల్ల కొందరు పెట్టుబడిదారులు ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ కాలంలో కనుగొన్న ఎన్నో మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.ఇదీ చదవండి: భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు! -
ట్రంప్ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్ను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అలీబాబా కొత్త ఏఐ చిప్ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది. జెన్వు సిరీస్లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
హైదరాబాద్లో ఐసాల్వ్డ్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మానవ వనరుల నిర్వహణ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ ‘ఐసాల్వ్డ్’ హైదరాబాద్లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సుమారు 400 మంది ఉద్యోగులకు అవసరమైన కేంద్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అమెరికాలో రెండు లక్షల సంస్థలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఐసాల్వ్డ్ ఇకపై హైదరాబాద్ కేంద్రంగా సరికొత్త టెక్నాలజీల ఆవిష్కరణ చేపట్టనుంది.కంపెనీ ప్రధాన సాఫ్ట్వేర్ ఉత్పత్తి ‘పీపుల్స్ క్లౌడ్’ ఆధునికీకరణ మొదలుకొని ‘బెట్టర్ బెనిఫిట్స్’, ‘మార్కెట్ప్లేస్’ల నిర్వహణ, కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలను ఇండియా కేంద్రం నుంచి నిర్వహించనున్నామని కంపెనీ జనరల్ మేనేజర్ యోగేశ్ మోరె తెలిపారు. కంపెనీ ఆపరేషన్స్లో కృత్రిమ మేధ కూడా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. హెచ్ఆర్ వ్యవహారాలకు సంబంధించిన మెయిళ్లను చదివి ఆయా సమస్యల పరిష్కారానికి ఏఐ ఒక పద్ధతిని సూచిస్తే... వాటిని ఇంజినీర్లు పరిశీలించి ఓకే చేస్తారని, తద్వారా సంక్లిష్టమైన వ్యవహారాలను కూడా సులువుగా చక్కబెట్ట వచ్చునని ఆయన వివరించారు. ఐసాల్వ్డ్ ఏడాదికి 22 - 25 సీఏజీఆర్తో వృద్ధి చెందుతోందని తెలిపారు.అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వల్లభి ‘ఐసాల్వ్డ్’ కార్యాలయాన్ని రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. ఐసాల్వ్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రగ్యా గుప్తా, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అఈమ మోషేర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభి మాట్లాడుతూ ఐసాల్వ్డ్లో 65 శాతం జెండర్ డైవర్సిటీ ఉండటం తన దృష్టిని ఆకర్శించిందని తెలిపారు. కంపెనీల్లో ఈ స్థాయి జెండర్ డైవర్సిటీ ఉంటం చాలా అరుదని అన్నారు. ఐసాల్వ్డ్ సంస్థ అమెరికా తరువాత అతిపెద్ద కార్యాలయ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థల జీసీసీ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఇంజినీరింగ్తోపాటు కృత్రిమ మేధ రంగంలోనూ హైదరాబాద్ను గ్లోబల్ కేపిటల్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. తగిన మౌలిక సదుపాయాలు, పాలన అందించడం, బిజినెస్కు తగ్గ వాతావరణాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఐసాల్వ్డ్ లక్ష్యాలు కూడా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
వైట్-కాలర్ ఉద్యోగాలకు ఏఐ ఎసరు
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.మానవ మేధస్సుకు సవాల్గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.మార్కెటింగ్, కంటెంట్పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.పరిష్కారం ఏంటి?మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
భారతీయ ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా అవతరించడమే తమ అంతిమ లక్ష్యమని దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. కంపెనీ వార్షిక నివేదిక (2025-26)లో భాగంగా వాటాదారులకు రాసిన లేఖలో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ ఈ కీలక విషయాలను వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో ఏఐ సాంకేతికతకు ఒక కీలక మలుపు అన్నారు. క్లయింట్లు కేవలం ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాల్లో పెద్ద ఎత్తున ఏఐని విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు.టాప్ క్లయింట్ల మొదటి ఛాయిస్..టీసీఎస్ గ్లోబల్ మార్కెట్లో తన పట్టును ఎంత బలంగా నిలుపుకుందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఏడాదికి 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే కంపెనీ అగ్రశ్రేణి 139 క్లయింట్లలో.. ఏకంగా 130 మంది తమ ఏఐ సేవల భాగస్వామిగా టీసీఎస్ను ఎంచుకున్నారని కృతివాసన్ ప్రకటించారు.‘ఏఐ సృష్టిస్తున్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ-నేతృత్వంలోని టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా మారాలనే సాహసోపేతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మౌలిక సదుపాయాలు నుంచి ఇంటెలిజెన్స్ వరకు ఫుల్ స్టాక్ ఏఐ సేవలను అందించడమే మా వ్యూహం’ అని కృతివాసన్ చెప్పారు.మూడు రెట్లు పెరిగిన ఏఐ శ్రామిక శక్తిఈ భారీ సాంకేతిక మార్పును తట్టుకునేందుకు వీలుగా టీసీఎస్ తన శ్రామిక శక్తిని దూకుడుగా సన్నద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 2,70,000 మందికి పైగా ఉద్యోగులు అధునాతన ఏఐ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.డిజిటల్ ప్రాజెక్టులు..గ్లోబల్ మార్కెటతోపాటు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో టీసీఎస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని సీఈఓ హైలైట్ చేశారు.గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్: రూ. 5 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వ కొనుగోళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇ-కామర్స్ మార్కెట్ప్లేస్గా దీనిని విస్తరించింది.ఎస్బీఐ యోనో 2.0: 10 భాషల్లో ఏకంగా 20 కోట్ల మంది వినియోగదారులకు అత్యంత వేగవంతమైన సేవలు అందించేలా దీనిని అప్గ్రేడ్ చేసింది.ఈ-పాస్పోర్ట్: కోటికి పైగా ఈ-పాస్పోర్ట్ల జారీతో పౌర సేవలను ఆధునీకరించింది.ఆర్బీఐ డేటా మేనేజ్మెంట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక విశ్లేషణల కోసం 250 టీబీ డేటాను నిర్వహించగల అత్యాధునిక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను నిర్మించింది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
25 ఏళ్ల అనుభవం.. టెక్కీ ఆవేదన!
సాఫ్ట్వేర్ రంగం అంటే ఒకప్పుడు రాయల్ లైఫ్, భారీ ప్యాకేజీలు, నిరంతర అవకాశాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అపారమైన అనుభవం, అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ ఉద్యోగ వేటలో ఎదురవుతున్న సమస్యలు టెక్కీలను కుంగదీస్తున్నాయి. తాజాగా అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.25 ఏళ్ల అనుభవం..ఆండ్రూ అనే టెక్కీకి సాఫ్ట్వేర్ రంగంలో పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు విజయవంతంగా వ్యాపారాలను నడిపిన ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ, గత కొంతకాలంగా ఆయన పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఏకంగా 2,000 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం గమనార్హం.‘నేను అసలు ఉద్యోగానికి పనికిరానా అని నాకే సందేహం కలుగుతోంది. నా 25 ఏళ్ల అనుభవాన్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) ఫిల్టర్ చేసేస్తున్నాయా? లేదా నా రెజ్యూమె ఫార్మాట్లో లోపం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు’ అంటూ ఆండ్రూ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.తిరస్కరిస్తున్న ఏఐ వ్యవస్థలు?నేటి కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియ అంతా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల (ఏటీఎస్) చేతుల్లో ఉంది. వందలాది ఈమెయిల్స్ పంపినా సుమారు 100 మంది హైరింగ్ మేనేజర్లను నేరుగా సంప్రదించినా ఆండ్రూకు ఒక్క స్పందన కూడా రాలేదు. అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న భయం కంపెనీల్లో ఉండవచ్చని లేదా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారా అనే చర్చ దీనితో మొదలైంది. ‘ఇది కేవలం నా కెరీర్ సమస్య మాత్రమే కాదు. నా జీవన ప్రమాణాలను, నన్ను నమ్ముకున్న వారిని ప్రభావితం చేస్తోంది. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందేమో’ అని ఆండ్రూ వాపోయారు.సోషల్ మీడియాలో సలహాలుఆండ్రూ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పలువురు నిపుణులు భిన్న సలహాలు ఇస్తున్నారు. ‘సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నుంచి కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ బ్రోకరేజ్ వంటి రంగాలకు మారండి’ అంటు కొందరు సూచిస్తున్నారు. ‘మీ అనుభవంతో మరొకరికి ఉద్యోగం చేయడం కంటే మీరే యజమానిగా మారి స్టార్టప్ ప్రారంభించండి’ అని మరికొందరు సలహా ఇచ్చారు.I have a hard time believing that I am just unhireable. But I have an even harder time believing that my 25 years of experience is somehow negated by the format of my resume.But, after over 2,000 applications, I am not sure what else to think. And, out of the dozens of emails…— andrewthecoder (@_andrewthecoder) May 11, 2026ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారీగా లే-ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఆండ్రూ ఉదంతం కేవలం ఒక్క వ్యక్తి సమస్య మాత్రమే కాదు. గ్లోబల్ టెక్ మార్కెట్లో సీనియర్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న అనిశ్చితికి అద్దం పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవ వనరుల విలువను కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్తో అంచనా వేయడం వల్ల ఇలాంటి ప్రతిభావంతులు నిరాశకు గురవుతున్నారు. కంపెనీలు తమ నియామక ప్రక్రియను మరింత మానవీయ కోణంలో పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి! -
సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి!
ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఎలాన్ మస్క్ వర్సెస్ ఓపెన్ ఏఐ న్యాయ పోరాటం కీలక దశకు చేరుకుంది. కృత్రిమ మేధ భవిష్యత్తును శాసించే ఈ కేసులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో గురువారం ముగింపు వాదనలు జరిగాయి. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఒక అబద్ధాల కోరు అని, లాభాపేక్ష లేని సంస్థను తన సొంత లాభాల కోసం వాడుకున్నారని మస్క్ తరఫు న్యాయవాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు, మస్క్ తీరును ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’గా ఓపెన్ ఏఐ అభివర్ణించింది.ముగింపు వాదనల్లోని ముఖ్యాంశాలుమస్క్ తరఫు న్యాయవాది స్టీవెన్ మోలో వాదనలు వినిపిస్తూ, సామ్ ఆల్ట్మాన్ కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మాజీ బోర్డు సభ్యులు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్స్కెవర్ సహా ఐదుగురు సాక్షులు ఆల్ట్మాన్ తీరును తప్పుబట్టారని గుర్తు చేశారు. ‘ఈ కేసులో సామ్ ఆల్ట్మాన్ విశ్వసనీయతే అసలు ప్రశ్న. మీరు అతడిని నమ్మకపోతే ఈ కేసులో ప్రతివాదులు గెలవలేరు’ అని మోలో జ్యూరీకి విన్నవించారు.150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంఓపెన్ ఏఐ సంస్థను మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలకు తాకట్టు పెట్టి సంస్థ అసలు ఆశయమైన మానవాళి సంక్షేమాన్ని విస్మరించారని మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన నష్టానికి గాను సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా) నష్టపరిహారాన్ని మస్క్ కోరుతున్నారు. ఈ మొత్తాన్ని లాభాపేక్ష లేని సంస్థకే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని కోరారు.ఓపెన్ ఏఐ ఎదురుదాడిఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్ మస్క్ వాదనలను కొట్టిపారేశారు. ‘మస్క్కు కొన్ని రంగాల్లో అపారమైన ప్రతిభ ఉండొచ్చు కానీ, ఏఐ విషయంలో మాత్రం కాదు. ఇక్కడ గెలవాలంటే ఆయన చేయగలిగింది కేవలం కోర్టుకు రావడమే’ అని ఎద్దేవా చేశారు. ఏఐ రంగంలో మస్క్ వెనకబడిపోయారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సారా ఎడ్డీ వాదించారు.‘సెలెక్టివ్ ఆమ్నేసియా’.. మస్క్పై విమర్శలు2018లోనే సంస్థకు నిధుల అవసరం ఉందని మస్క్కు తెలుసని, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు లాభాలు చూశాక కోర్టుకు రావడం వెనుక దురుద్దేశం ఉందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని కీలక పత్రాలను తాను చదవలేదని మస్క్ చెప్పడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తకు ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’ (కావాల్సినవి మాత్రమే గుర్తుంచుకోవడం) ఉందని విమర్శించారు.మైక్రోసాఫ్ట్ పాత్రపై వివాదంఓపెన్ ఏఐ చేస్తున్న ప్రతి తప్పులోనూ మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉందని మస్క్ న్యాయవాదులు ఆరోపించారు. అయితే, తాము కేవలం బాధ్యతాయుతమైన పెట్టుబడిదారులమని, సంస్థ అంతర్గత నిర్ణయాల్లో జోక్యం లేదని మైక్రోసాఫ్ట్ న్యాయవాది రస్సెల్ కోహెన్ స్పష్టం చేశారు.తదుపరి ఏం జరగబోతోంది?ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ సోమవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది.మస్క్ గెలిస్తే: ఓపెన్ ఏఐ బోర్డులో భారీ మార్పులు, భారీ జరిమానా, సంస్థను తిరిగి లాభాపేక్ష లేనిదిగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.మస్క్ ఓడిపోతే: ఓపెన్ ఏఐ తన 1 ట్రిలియన్ డాలర్ ఐపీఓ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది.ఇదీ చదవండి: ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్ -
ఏఐ కోసం 30 శాతం సిబ్బందిపై వేటు..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. ప్రముఖ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ ‘గిట్ల్యాబ్’ తన మొత్తం శ్రామిక శక్తిలో ఏకంగా 30 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నా భారత్లో మాత్రం కొత్త నియామకాలకు కంపెనీ మొగ్గు చూపుతుండటం గమనార్హం.ఏఐ కోసం పునర్నిర్మాణంజనవరి 2026 నాటికి గిట్ల్యాబ్లో మొత్తం 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన 30 శాతం కోత ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీ సీఈఓ బిల్ స్టేపుల్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ మార్పులను ధ్రువీకరించారు. ‘ఏజెంటిక్ ఏఐ యుగంలో మాకున్న ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యయ నియంత్రణ ద్వారా వచ్చే పొదుపును తిరిగి ఏఐ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వాలంటరీ సెవరెన్స్ విండో (స్వచ్ఛంద విరమణ) అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 1, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.భారత్పై గిట్ల్యాబ్ ఆసక్తిప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నప్పటికీ భారత్లో మాత్రం గిట్ల్యాబ్ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో భారతదేశానికి సంబంధించి 20కి పైగా ఉద్యోగ ప్రకటనలను కంపెనీ పోస్ట్ చేసింది. అందులో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, కస్టమర్ సక్సెస్ ఇంజినీర్ వంటి పాత్రలున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ రిమోట్ (ఇంటి నుంచే పని) పద్ధతిలో ఉండటం విశేషం. గిట్ల్యాబ్ తన కార్యకలాపాలు సాగించే దేశాల సంఖ్యను తగ్గించుకుని భారత్, అమెరికా వంటి కీలక మార్కెట్లపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.నిజమైన పెట్టుబడా? తొలగింపులకు సాకా?గిట్ల్యాబ్ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఏజెంట్ల గురించి వ్యాసాలు రాస్తూ, మరోవైపు సిబ్బందిని తొలగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ అన్నట్లుగా.. కొన్ని కంపెనీలు తమ అసమర్థతను దాచుకోవడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుతున్నాయా? అనే సందేహాలను నిపుణులు లేవనెత్తుతున్నారు. ‘ఇది వాస్తవంగా ఏఐ కోసం చేస్తున్న మార్పా? లేక 2026లో ఏఐ పేరు చెప్పి చేస్తున్న సాధారణ తొలగింపా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మెటా, అమెజాన్ వంటి దిగ్గజాల బాటలోనే గిట్ల్యాబ్ పయనిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత్ వంటి దేశాల్లో నియామకాలు చేపట్టడం సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా టెక్ ప్రపంచంలో మనుషుల స్థానాన్ని యంత్రాలు (ఏఐ) భర్తీ చేస్తున్నాయా అనే చర్చకు గిట్ల్యాబ్ తాజా నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ జోష్
భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్ రిడిఫైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశయం గొప్పదే.. కానీ..భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.35 కోట్ల మంది నిపుణులు అవసరంఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.డేటా సార్వభౌమాధికారండేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
జుకర్బర్గ్ రికార్డు బద్దలు..
సాధారణంగా 22 ఏళ్ల వయసు అంటే కెరీర్ను ఇప్పుడిప్పుడే మలుచుకునే దశ. కానీ, భారత సంతతికి చెందిన సూర్య మిధా ఆలోచనలు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాను సవాల్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త కేవలం 22 ఏళ్లకే సుమారు 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18,000 కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్’గా అవతరించారు. ఈ క్రమంలో ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్బర్గ్ నెలకొల్పిన రికార్డును సైతం ఆయన అధిగమించడం విశేషం.జుకర్బర్గ్ కంటే వేగంగా..గతంలో మార్క్ జుకర్బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ క్లబ్లో చేరగా సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందుగానే (22 ఏళ్లకే) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా కేవలం తన వినూత్న ఏఐ స్టార్టప్ ద్వారా ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.విజయానికి బాటలుసూర్య మిధా తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్లతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ సంస్థ ఈ అద్భుత విజయానికి కీలకంగా నిలిచింది. ఇది సాధారణ నియామక సంస్థ కాదు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్లాట్ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వగల, పరిశోధన చేయగల నిపుణులను గుర్తించి పెద్ద కంపెనీలకు అనుసంధానిస్తుంది. అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేయడం నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ ఏఐని ఉపయోగిస్తుంది. ఈ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది.మెరుపు వేగంతో వాల్యుయేషన్పెట్టుబడిదారుల నమ్మకమే మెర్కోర్ విజయ రహస్యం. బెంచ్మార్క్, ఫెలిసిస్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో ఈ స్టార్టప్ విలువ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి 2025లో 100 మిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక ఆదాయం, సెప్టెంబర్ నాటికే 500 మిలియన్ డాలర్లకు పెరగడం ఏఐ రంగంలోనే ఒక రికార్డు.సిలికాన్ వ్యాలీలో కొత్త ఒరవడిసూర్య మిధా ప్రస్థానం విలక్షణమైనది. చర్చా వేదికల్లో పరిచయమైన ముగ్గురు మిత్రులు తమ స్టార్టప్ కల కోసం కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు. నేడు ఏఐ రంగం కేవలం చాట్బాట్లకే పరిమితం కాకుండా.. రిక్రూట్మెంట్, హెల్త్కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఎలా విప్లవం తీసుకురాగలదో మెర్కోర్ నిరూపించింది. భవిష్యత్తు అంతా ఏఐదే అని ఐటీ నిపుణులు చెబుతున్న మాటలను సూర్య మిధా నిజం చేసి చూపించారు. భారత సంతతికి చెందిన ఈ యువకుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
జనరల్ మోటార్స్ సాఫ్ట్వేర్ ప్రక్షాళన
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ తన ఐటీ విభాగంలో భారీ మార్పులు చేపట్టింది. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ(ఏఐ) చుట్టూనే తిరగనుందని భావిస్తున్న కంపెనీ అందుకు అనుగుణంగా తన శ్రామిక శక్తిని పునర్నిర్మించే పనిలో పడింది. ఈ క్రమంలో తన ఐటీ విభాగం నుంచి సుమారు 600 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్స్ విధించింది.నైపుణ్యాల మార్పిడి వ్యూహంఈ తొలగింపులు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికో లేదా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికో చేసినవి కావని, ఇది ఒక స్పష్టమైన నైపుణ్యాల మార్పిడి వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఐటీ విభాగంలోని మొత్తం సిబ్బందిలో ఇది 10 శాతం కంటే ఎక్కువ. సాంప్రదాయ ఐటీ పాత్రల కంటే, ఏఐ-కేంద్రీకృత సాంకేతికతలలో ప్రవేశం ఉన్న నిపుణుల కోసం కంపెనీ వెతుకుతోంది. ‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జీఎం భారీ మార్పులు చేస్తోంది’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఏఐ వైపు వేగంగా..ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ జీఎం కొత్త నియామకాలను ఆపలేదు. అయితే, ఇప్పుడు కంపెనీ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కంపెనీ ప్రస్తుతం కీలక రంగాల్లో నిపుణుల కోసం వేట సాగిస్తోంది. అందులో.. ఏఐ-నేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్లు, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణులు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తయారీ నిపుణులపై ఫోకస్ పెట్టింది.కొత్త దిశగా అడుగులుగత 18 నెలలుగా జీఎం తన టెక్నాలజీ విభాగంలో ప్రక్షాళన చేస్తూనే ఉంది. 2024 ఆగస్టులో కూడా సుమారు 1,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తొలగించింది. 2025లో స్టెర్లింగ్ ఆండర్సన్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా చేరిన తర్వాత ఈ పరివర్తన మరింత వేగవంతమైంది. సాఫ్ట్వేర్, టెక్నాలజీ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రక్రియను ఆయన ముమ్మరం చేశారు. ఇటీవలే యాపిల్ మాజీ ఉద్యోగి బెహ్రాద్ తోఘిని ఏఐ లీడ్గా, మాజీ క్రూయిజ్ ఎగ్జిక్యూటివ్ రషీద్ హక్ను అటానమస్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్గా నియమించుకోవడం ద్వారా తన ఉద్దేశాన్ని కంపెనీ చాటిచెప్పింది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
భారత్ సొంత ఏఐ ఇన్ఫ్రాను నిర్మించుకోవాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థకు సంబంధించి భారత్ సొంతంగా మౌలిక సామర్థ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాల్లో భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఇంధన భద్రత, డిజిటల్ ఇన్ఫ్రాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు–2026లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయపరమైన విభజనల నేపథ్యంలో దశాబ్దాల నాటి గ్లోబలైజేషన్ భావనలకు కాలం చెల్లుతోందన్నారు.‘సెమీకండక్టర్లు ఇప్పుడు రాజకీయ అస్త్రాలుగా మారాయి. డేటాను జాతీయ వనరుగా భావిస్తున్నారు. క్లౌడ్ ఇన్ఫ్రాను ఆయుధంగా మలచుకుంటున్నారు. ఇక ఏఐ సదుపాయాలను డేటా సెంటర్ల రక్షణ గోడల మాటున నిర్మించుకుంటున్నారు’ అని అదానీ పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో డిజిటిల్ మౌలిక సదుపాయాలపై దాడుల గురించి ప్రస్తావిస్తూ... ఇంధన భద్రత, డిజిటల్ భద్రత అనేవి ఏ దేశానికైనా రెండు మూల స్తంభాలుగా మారాయని అభిప్రాయపడ్డారు.‘ఇంధన వనరులను నియంత్రించే దేశ పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలాగే డిజిటల్ కంప్యూటింగ్ను కంట్రోల్ చేసే దేశ మేధోపరమైన భవిష్యత్తుకు తిరుగుండదు. ఈ రెండింటినీ నియంత్రించే దేశమే రాబోయే శతాబ్దాన్ని తీర్చిదిద్దుతుంది’ అని అదానీ తెలిపారు.ఏఐని సాఫ్ట్వేర్గా చూడొద్దు...భారత్ ఏఐని కేవలం ఒక సాఫ్ట్వేర్గా మాత్రమే కాకుండా... ఎనర్జీ, డేటా సెంటర్లు, చిప్లు, నెట్వర్క్లు, కంప్యూటింగ్, ప్రతిభ వంటి రంగాల వ్యాప్తంగా ఒక వ్యూహాత్మక ఇన్ఫ్రాగా పరిగణించాలని అదానీ చెప్పారు. ‘భారత్ తన మేధో భవిష్యత్తు కోసం ఈ ఏఐ ఇన్ఫ్రాను అద్దెకు తీసుకుంటే సరిపోదు. స్వదేశంలోనే సొంతంగా నిర్మించుకోవడంతో పాటు, సామర్థ్యాలను విస్తరించాలి’ అని నొక్కిచెప్పారు. తయారీ, రవాణా, మొబిలిటీ, డిజిటల్ సర్వీసుల వ్యాప్తంగా నెలకొన్న భారీ దేశీ డిమాండ్ అనేది పెద్దయెత్తున ఏఐ, ఎనర్జీ ఇన్ఫ్రా నిర్మాణానికి దోహదం చేస్తోందన్నారు.భారత్లో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఇప్పటికే 500 గిగావాట్లను అధిగమించిందని, భవిష్యత్తులో భారత్ ఏఐ ఎకానమీ కోసం విద్యుత్, కంప్యూటింగ్ ఎకోసిస్టమ్లలో భారీ స్థాయి పెట్టుబడులు అవసరమవుతాయని వివరించారు. ఏఐని అవకాశాలను హరించే శక్తిగా కాకుండా ఉత్పాదకతను పెంచేదిగా, ఉద్యోగాలను కల్పించేదిగా, ఎంట్రప్రెన్యూర్లకు చేదోడుగా నిలిచేదిగా, భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాధనాలుగా రూపొందించాలని అదానీ పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్ డేటా సెంటర్ బిజినెస్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. భారత్లో అతిపెద్ద గిగావాట్ స్లాయి డేటా సెంటర్ క్యాంపస్ను విశాఖలో నిర్మించేందుకు గూగుల్తో జట్టుకట్టిన విషయాన్ని కూడా అదానీ గుర్తుచేశారు. -
తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో భారతీయ భాషల విషయంలో ప్రస్తుత ఏఐ టూల్స్ డొల్లతనాన్ని ‘హుమిన్ ల్యాబ్స్’ అధ్యయనం బట్టబయలు చేసింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి అంతర్జాతీయ దిగ్గజాల మోడళ్లు సైతం భారతీయ భాషలను పాఠకులకు స్పష్టంగా తెలియజేయడం(ట్రాన్స్క్రిప్షన్)లో విఫలమవుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.మూడు పదాల్లో ఒకటి తప్పుఫిజికల్, వాయిస్ ఏఐ డేటా మౌలిక సదుపాయాల రంగంలో సర్వీసులు అందిస్తున్న హుమిన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ ఏఐ మోడళ్లు భారతీయ భాషలను వినేటప్పుడు ప్రతి మూడు పదాల్లో ఒకదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయులు సహజంగా మాట్లాడే మిశ్రమ ప్రసంగం(ఇంగ్లీష్+హిందీ లేదా మరేదైనా భాష + ఇంగ్లీష్) విషయంలో ఈ సాధనాలు తడబడుతున్నాయి. వాక్యం మధ్యలో వచ్చే ఆంగ్ల పదాలను ఇవి పూర్తిగా వదిలేయడం లేదా తప్పుగా మార్చడం వల్ల అర్థం పూర్తిగా మారిపోతోంది.‘ప్రస్తుత ఏఐ ప్రొవైడర్లు ఇంటర్నెట్ డేటాతో శిక్షణ పొందిన సెట్లను ఉపయోగించి తమకు తామే మార్కులు వేసుకుంటున్నారు. కానీ గ్లోబల్ సౌత్ (భారత్ వంటి దేశాలు) వినియోగదారులు వాస్తవంగా ఎలా మాట్లాడుతారో ఈ గణాంకాలు ప్రతిబింబించవు. అసంబద్ధమైన వివరాలు చూసి సంస్థలు నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరం’ అని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ అగర్వాల్ తెలిపారు.బెంచ్ మార్క్ స్కోర్లుహుమిన్ ల్యాబ్స్ రూపొందించిన ‘బ్రిడ్జ్’ అనే గ్లోబల్ ఎవాల్యుయేషన్ బెంచ్ మార్క్ ద్వారా పలు సంస్థల పనితీరును విశ్లేషించారు.ఏఐ మోడల్ / ప్రొవైడర్సెమాంటిక్ గ్యాప్ స్కోర్ (కచ్చితత్వం)ప్రస్తుత పరిస్థితిదీప్ గ్రామ్ నోవా-30.906ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉందిసర్వం ఏఐ (సారస్ V3)20.2% (WER)గ్లోబల్ మోడళ్ల కంటే మెరుగైన 3వ స్థానంఓపెన్ ఏఐ (GPT-4o)< 0.4ఆశాజనకంగా లేదుఅమెజాన్ ట్రాన్స్ స్క్రైబ్0.199అత్యంత బలహీనమైన ప్రదర్శనగమనిక: జెమిని 2.5 ఫ్లాష్, ఎలెవెన్ ల్యాబ్స్ వంటి టూల్స్ కూడా ఈ అధ్యయనంలో భాగంగా ఉన్నాయి.స్వదేశీ టూల్స్ మెరుగైనప్పటికీ.. సవాళ్లు తప్పవుభారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రూపొందించిన సారస్ వీ3, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాల కంటే మెరుగైన ఫలితాలను చూపడం విశేషం. వర్డ్ ఎర్రర్ రేట్ (డబ్ల్యూఈఆర్) పరంగా ఇది 20.2 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, మిశ్రమ ప్రసంగం విషయానికి వస్తే ఇది కూడా 0.588 స్కోరులో నిలిచింది.వర్డ్ ఎర్రర్ రేట్ కొలమానం సరిపోదుపరిశ్రమలో సాధారణంగా వాడే వర్డ్ ఎర్రర్ రేట్ భారతీయ భాషల వైఫల్యాలను పట్టుకోవడంలో విఫలమవుతోందని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు ఇశాంక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఇంగ్లీష్ ఫోనాలజీ(భాషలో అర్థాన్ని ఎలా మారుతుంది అనే అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఫోనాలజీ అంటారు) కోసం రూపొందించిన స్కోరింగ్ సిస్టమ్తో ఇండిక్ భాషలను మదింపు చేయడం సరికాదు. హిందీలో రాణించిన మోడల్ తెలుగులోనో, తమిళంలోనో రాణించాలని లేదు’ అని ఆయన పేర్కొన్నారు. -
వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ గ్రహణం?
కంప్యూటర్ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో చాలా రంగాల్లో సిబ్బంది అవసరం తగ్గిపోయింది. కానీ అప్పట్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటంతో ఆ శ్రమశక్తి ఇతర రంగాల్లోకి మళ్లింది. కానీ నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు. ‘ఏజెంటిక్ ఏఐ’ రూపంలో వస్తున్న సాంకేతిక విప్లవం, అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు కలిసి ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.నిర్ణయం దానిదే.. అమలు దానిదే!2024లో తెరపైకి వచ్చిన ఏజెంటిక్ ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, ఒక పనిని ఎలా చేయాలో స్వయంగా నిర్ణయించుకుని పూర్తి చేయగలదు. ఆంత్రోపిక్ క్లాడ్ వంటి టూల్స్ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో చూస్తుంటే భయం కలగక మానదు. ‘ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని రంగాలు పూర్తిగా కనుమరుగవుతాయి’ అని ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మాన్ హెచ్చరించడం గమనార్హం.ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అంచనా ప్రకారం.. కోడింగ్, ఫైనాన్స్, లా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాల్లో 20 శాతం కోత పడే అవకాశం ఉంది. ఇది కేవలం సామాన్య ఉద్యోగులకే కాదు, మధ్యతరగతికి కీలకంగా మారే ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది.భారత ఐటీ రంగానికి రెడ్ అలర్ట్భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్గా గుర్తింపు పొందింది. లక్షలాది మంది యువత ఐటీ సేవల ద్వారా ఉపాధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.కాగ్నిజెంట్ ఇప్పటికే భారత్లో అధిక వాటా ఉండేటా 15,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సేల్స్ఫోర్స్ సంస్థలో సగం సపోర్ట్ సర్వీసులను ఏఐ చూసుకోవడంతో 4,000 ఉద్యోగాల్లో కోత పడింది.ఫ్రెష్వర్క్స్ తన కోడింగ్లో సగానికి పైగా ఏఐతో చేయిస్తూ 11 శాతం సిబ్బందిని తగ్గించుకుంది.డ్యుయోలింగో (ట్రాన్స్లేషన్), చెగ్ (ఎడ్యుకేషన్), హెచ్పీ వంటి దిగ్గజాలు కూడా ఏఐ కారణంగా సిబ్బందిని తగ్గిస్తున్నాయి.నందన్ నిలేకని చెప్పినట్లుగా కంపెనీలు ఇప్పుడు ‘టాప్-టు-బాటమ్’ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాయి. గతంలో ఒక పనికి వందల మంది ఇంజినీర్లు అవసరమయ్యే వారు. ఇప్పుడు ఏఐ సాయంతో చిన్న టీమ్లు అదే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి.యుద్ధ క్షేత్రంలోనూ రోబోలదే రాజ్యంసాంకేతికత కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. రక్షణ రంగాన్ని కూడా మార్చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, అటానమస్ రోబోల వినియోగం పెరిగింది. చైనా తన విమాన దళంలో మానవరహిత విమానాలను ప్రవేశపెడుతోంది. దీనిని గమనించిన భారత్ కూడా అప్రమత్తమైంది.బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డ్రోన్ లాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఐఐటీల సహకారంతో విద్యార్థులకు, గ్వాలియర్ వంటి కేంద్రాల్లో సైనికులకు డ్రోన్ ఆపరేటింగ్, డిఫెన్స్లో శిక్షణ ఇస్తున్నారు.భారత్ ముందున్న సవాలుఒకవైపు శ్రమశక్తి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు శ్రమను నిర్వహించే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఏఐ వల్ల ఆవిరవుతున్నాయి. ఒకప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా భారత్కు వచ్చే కాంట్రాక్ట్లు ఇప్పుడు ఆయా దేశాల్లోనే ఏఐ సాఫ్ట్వేర్ల ద్వారా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం వైట్ కాలర్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోకపోతే ప్రమాదంలో పడతారని గ్రహించాలి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
భయం వద్దు.. నైపుణ్యమే హద్దు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. కోడింగ్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి రిక్రూట్మెంట్ వరకు ప్రతి రంగాన్ని ఏఐ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఈ వేగవంతమైన మార్పులను చూసి ఒకవైపు యువత ఆందోళన చెందుతుంటే, మరోవైపు దీనిని అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు కొందరు నిపుణులు. పాకిస్థాన్కు చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఐజా ఉస్మాన్ కథ దీనికి ఒక నిదర్శనం. ప్రపంచంలోని టాప్ ఏఐ కంపెనీలలో ఒకటిగా పేరొందిన ఆంత్రోపిక్లో ఉద్యోగం సాధించిన ఐజా, తన ప్రయాణాన్ని వివరిస్తూ.. ఏఐ పట్ల భయం కంటే దాన్ని అర్థం చేసుకోవడమే నేటి అవసరమని నొక్కి చెప్పారు.ఎందుకు ఆంత్రోపిక్?ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు శక్తివంతమైన ఏఐ మోడల్స్ కోసం పోటీ పడుతున్న వేళ ఐజా మాత్రం ఆంత్రోపిక్ను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని చెప్పింది. ‘చాలా కంపెనీలు కేవలం వేగం, శక్తివంతమైన వ్యవస్థల వైపు పరుగులు తీస్తుంటే ఆంత్రోపిక్ మాత్రం ఏఐ భద్రత, బాధ్యతాయుతమైన అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. మానవాళికి సురక్షితమైన ఏఐని అందించడమే కంపెనీ లక్ష్యం. అదే నన్ను ఆకర్షించింది’ అని ఆమె పేర్కొన్నారు.సాధారణ విద్యార్థినిగా పాకిస్థాన్ నుంచి అమెరికాకు వెళ్లిన ఐజా న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో తనకున్న పట్టుతో క్రమంగా ఏఐ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా ప్రస్తుత ఏఐ బూమ్కు కారణమైన జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్స్పై ఆమె ప్రత్యేక పరిశోధన చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక ఫిన్టెక్ స్టార్టప్లో ఏఐ ఏజెంట్లు తయారీపై ఆమె చేసిన ప్రాజెక్ట్ ఆంత్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థలో ఉద్యోగం సాధించడానికి కీలకమైందని వెల్లడించారు.యువతకు సూచనలుఏఐ ఇప్పుడు కేవలం టెక్నికల్ టీమ్స్కే పరిమితం కాలేదు. హెల్త్కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి ప్రతి రంగంలోనూ ఇది భాగమైంది. అందుకే దాని నుంచి తప్పించుకోవడం కంటే దాన్ని నేర్చుకోవడమే ఉత్తమం.కొత్త సాధనాలను ఎంత త్వరగా వాడటం నేర్చుకుంటే భవిష్యత్తు మార్కెట్లో అంతగా రాణించవచ్చు.ఏఐ అనేది మీ పనిని సులభతరం చేసే సాధనమే తప్ప, మీకు శత్రువు కాదు. దాని పనితీరును అర్థం చేసుకుంటే మీ కెరీర్ మరింత భద్రంగా ఉంటుంది.అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలో నిత్యం నేర్చుకోవాలి.గ్లోబల్ జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే పాత పద్ధతులకు అంటిపెట్టుకోకుండా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. -
మేనేజర్లకు కాలం చెల్లిందా?
టెక్ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తోన్న ఒకే మంత్రం ‘పని చేయండి లేదా పక్కకు తప్పుకోండి’. ఒకప్పుడు కేవలం పర్యవేక్షణకే పరిమితమైన మేనేజర్ల పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కృత్రిమ మేధ ఉత్పాదకతను విప్లవాత్మకంగా మారుస్తున్న తరుణంలో ఐటీ, టెక్ దిగ్గజాలు తమ సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా మారుస్తున్నాయి. కాయిన్బేస్, బ్లాక్, స్నాప్ వంటి సంస్థల్లో జరుగుతున్న తాజా పరిణామాలు ఈ మార్పుకు సాక్ష్యాలు.కాయిన్బేస్ సంచలనంప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్బేస్ ఇటీవల తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో 14% (సుమారు 700 మంది) ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ తొలగింపుల వెనుక ఉన్న కారణం ఖర్చుల తగ్గింపుతోపాటు సంస్థను ఏఐ-ఆధారితంగా మార్చడమేనని ఆ సంస్థ సీఈఓ బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ మేనేజర్ల భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. ‘కాయిన్బేస్లో ప్రతి నాయకుడు కూడా ఒక బలమైన వ్యక్తిగత కంట్రిబ్యూటర్ అయి ఉండాలి. మేనేజర్లు కేవలం పక్కన నిలబడి సూచనలిచ్చే వారు కాదు. వారు ప్లేయర్-కోచ్లా ఉండాలి. అంటే, జట్టును నడిపిస్తూనే స్వయంగా పనిలో తలమునకలు కావాలి’ అన్నారు.క్యూ కట్టిన టెక్ దిగ్గజాలుబ్లాక్ (Block): కంపెనీ సీఈఓ జాక్ డోర్సే ఇప్పటికే 40% సిబ్బంది కోతను ప్రకటించారు. మేనేజర్లను ప్లేయర్-కోచ్లుగా మారాలంటున్నారు.స్నాప్ (Snap): కంపెనీ చీఫ్ ఇవాన్ స్పీగెల్ ఏఐ ఆధారిత చిన్న ‘స్క్వాడ్స్’ ఏర్పాటులో భాగంగా 1,000 ఉద్యోగాలను తొలగించారు.మెటా, అట్లాసియన్: మార్క్ జుకర్బర్గ్ వంటి నాయకులు సైతం ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ పేరుతో మేనేజర్ల సంఖ్యను తగ్గించి సంస్థను పునర్నిర్మించే ప్రక్రియలో ఉన్నారు.పేపాల్ (PayPal): ఏఐ పరివర్తన ద్వారా రాబోయే రెండేళ్లలో 1.5 బిలియన్ల డాలర్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 20% సిబ్బంది తగ్గింపు జరిగే అవకాశం ఉందని సమాచారం.అలాంటివారికి కష్టమే..హ్యూమన్ రిసోర్స్ విశ్లేషకుడు జోష్ బెర్సిన్ అభిప్రాయం ప్రకారం, పారిశ్రామిక విప్లవం నాటి ‘పర్యవేక్షణ మాత్రమే చేసే మేనేజర్’ పాత్రకు ఇక ముగింపు పలకాల్సిందే. ‘2026 నాటికి మేనేజర్గా కొనసాగాలంటే, మీరు కేవలం మనుషులను మాత్రమే కాదు, ఏఐ ఏజెంట్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక మేనేజర్ కంటే ఏఐ ఏజెంట్కే ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి, నాయకులు స్వయంగా ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి’ అని ఆయన విశ్లేషించారు. దీనినే ఇప్పుడు మెగామేనేజర్ సంస్కృతిగా పిలుస్తున్నారు.నైపుణ్యం లేకపోతే నిష్క్రమణే!క్రిప్టోజాబ్స్ లిస్ట్ వ్యవస్థాపకుడు రామన్ షాలుపౌ మాటల్లో చెప్పాలంటే, ఇది ఒక అనివార్యమైన మార్పు. కంపెనీలు ఏఐ వాషింగ్ (అత్యాధునికంగా కనిపించే ప్రయత్నం) చేస్తున్నాయా లేదా నిజంగా ఉత్పాదకత పెరుగుతోందా అనేది పక్కన పెడితే, ఉద్యోగంలో కొనసాగాలంటే ఏఐ నైపుణ్యాలు కలిగి ఉండటం ఇప్పుడు తప్పనిసరి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
కోడింగ్ ఒక్కటే సరిపోదు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు, యువ నిపుణులు ఏయే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవేళ తాను ఇప్పుడు విద్యార్థిని అయితే కోడింగ్తో పాటు భౌతిక శాస్త్రానికి (ఫిజిక్స్) అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.కోడింగ్ మాత్రమే సరిపోదుసాంకేతిక రంగంలో దశాబ్దాలుగా కోడింగ్ను అత్యంత కీలకమైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏఐ వ్యవస్థలు కేవలం డిజిటల్ డేటాను ప్రాసెస్ చేసే స్థాయి నుంచి భౌతిక ప్రపంచంతో నేరుగా కార్యకలాపాలు సాగించే స్థాయికి చేరుకుంటున్నాయని హువాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను బహుశా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడిని’ అని పేర్కొన్న హువాంగ్, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం కోడింగ్ చేయడం కంటే ముఖ్యమని ఉద్ఘాటించారు. తదుపరి తరం ఆవిష్కరణలు కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యాల మీద కాకుండా భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న లోతైన అవగాహన మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ‘ఫిజికల్ ఏఐ’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ వ్యవస్థలు ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రియల్ వరల్డ్ అప్లికేషన్లలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హువాంగ్ చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో డెవలపర్లు, ఇంజినీర్లకు ఫిజిక్స్ విషయాలపై అవగాహన తప్పనిసరి. కోడింగ్ అనేది ఒక పనిని చేయించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, కానీ యంత్రాలు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే అవి పనిచేసే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఏఐ, డ్రోన్లో ముందుంటాం
పేరు మాత్రమే కాదు. బిజినెస్ తీరునే మార్చుకుని ఆధునిక డ్రోన్, క్లౌడ్– ఏఐ సర్వేలెన్స్ రంగాల్లో వడివడిగా అడుగులేస్తున్న మగెలానిక్ క్లౌడ్ది నిన్నటిదాకా స్టోరీనే. ఇపుడు ఆ స్టోరీ కార్యాచరణలోకి వస్తోంది. తాజాగా రైల్వే సహా పలు బ్యాంకింగ్ సంస్థల నుంచి సర్వేలెన్స్ కాంట్రాక్టులు దక్కించుకుంది. డ్రోన్ల తయారీలోకి ప్రవేశించాక డిఫెన్స్ నుంచీ కాంట్రాక్టులు దక్కాయి. తమ ప్రణాళికలు పూర్తిగా ఆచరణలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చంటున్న కంపెనీ సీఎండీ జోసెఫ్ సుదీర్(జో)తో ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ...మీ బిజినెస్ వర్టికల్స్లో ఆదాయం పరంగా ముందున్నవేంటి?ఇప్పుడైతే స్టాఫింగ్, ఐటీ సేవలనేవి మొదటి వరుసలో నిలుస్తాయి. ఏఐ–ఇన్నోవేషన్పై ఫోకస్ చేస్తుంది. ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ను రూపొందిస్తున్నాం. రెవెన్యూ పరంగా దీనిదిపుడు రెండో స్థానం. డ్రోన్ తయారీలోకి కూడా ప్రవేశించాం. లాజిస్టిక్స్, డిఫెన్స్, కమర్షియల్ సర్వీసుల కోసం కస్టమైజ్డ్ డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇపుడైతే రెవెన్యూలో ఇది చివర్లో ఉంది. కానీ వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ ఆర్డర్ పూర్తిగా మారుతుంది. మరి ఇలా మారటానికి ఇపుడేం చేస్తున్నారు?ఇప్పుడున్న దశలో ఏది ఏ స్థాయిలో అమలవుతోందో పూర్తి వివరాలు చెప్పలేను. కానీ డైరెక్షన్ క్లియర్గా ఉంది. రెవెన్యూ పనితీరు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్ పెట్టాం. గడిచిన మూడు త్రైమాసికాలుగా వృద్ధికి ఒక బేస్ను తయారు చేసుకున్నాం. నంబర్స్ మాత్రం ఇపుడు చెప్పలేను. సరే! ఇప్పుడు మీ డ్రోన్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంది?దీనికి సంబంధించి 15–20 కోట్ల ఆర్డర్బుక్ ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్ రంగానివే. డిజైన్ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, డిప్లాయిమెంట్ వరకూ మేమే చేస్తున్నాం. అవసరాన్ని బట్టి డెలివరీకి 30–45 రోజుల నుంచి మూడు నెలల వరకూ పడుతుంది. డ్రోన్ల తయారీలోకి చాలామంది వస్తున్నారు కదా!. మీ స్పెషాలిటీ ఏంటి?మేం 200 కిలోల వరకూ పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తున్నాం. అవరోధాల్ని దాటుకుని ఆటో ల్యాండింగ్ కావటం... జీపీఎస్ లేకున్నా లక్ష్యాన్ని చేరటం... ఎల్రక్టానిక్ వార్ఫేర్ను తట్టుకోగలగటం ఈ డ్రోన్ల ప్రత్యేకత. సిగ్నల్ జామ్ అయిన సందర్భాల్లో సైతం ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థల్ని ఉపయోగించుకుని పనిచేయటం వీటి స్పెషాలిటీ.మీ రెవెన్యూలో రికరింగ్ ఎక్కువా? లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్కువా?దాదాపు 70–80 శాతం రెవెన్యూ రికరింగ్ రూపంలోనే వస్తోంది. ఇవన్నీ 3–5 ఏళ్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు. వీటివల్ల స్థిరత్వం వస్తోంది. మీ ఆర్డర్ బుక్, భవిష్యత్ వృద్ధిని వివరంగా చెబుతారా?ఈ మధ్య మేం దాదాపుగా రూ.250 కోట్ల రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నాం. వీటిలో 10 శాతాన్ని ఇప్పటిదాకా పూర్తిచేశాం. భవిష్యత్ను దీన్నిబట్టే ఊహించొచ్చు. ప్రస్తుత మార్గాల ద్వారా రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.మీ బిజినెస్లో అంతర్జాతీయ వాటా ఎంత?గతేడాది మేం రూ.600 కోట్ల రెవెన్యూ సాధించాం. దీన్లో రూ.400 కోట్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచే వచ్చింది. దీన్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చింది. అంతర్జాతీయ క్లయింట్లలో డేటా సెంటర్లు ప్రధానం. వీటికి డేటా ఇంజినీరింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందిస్తున్నాం. మీ వ్యాపారంలో ఏఐ పాత్ర ఎంతవరకూ ఉంది?అన్నిటికీ ఏఐనే ప్రధానం. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఏటీఎంలకు ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ అందిస్తున్నాం. ఆటోమేటెడ్ సర్వేలెన్స్ వ్యవస్థల్లో... రియల్టైమ్లో అలెర్ట్లు పంపటంలో... ఇంప్రూవ్మెంట్లో అన్నింట్లో ఏఐ ఉంటుంది. డ్రోన్స్, ఐటీ, సర్వేలెన్స్ ఇలా మా వెర్టికల్స్ అన్నింటా ఏఐ తప్పనిసరి. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసనమీరు ఈ మధ్య కొన్ని కంపెనీల్ని టేకోవర్ చేశారు కదా? ఫండింగ్ ఎలా?ఎక్కువ భాగం ఫండింగ్ అంతర్గత వనరుల నుంచే సమీకరించుకున్నాం. 2023–24లో మాత్రమే కొంత మూలధనం సమీకరించాం. మొత్తంగా చూస్తే బలమైన క్యాష్ ఫ్లో నుంచే ఫండింగ్ చేస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు రూ.60 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, బ్యాంకింగ్– పీఎస్యూ ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించాం. కంపెనీ వృద్ధికి సంబంధించి ఇన్వెస్టర్లు ఏం ఆశించొచ్చు?గతేడాది 600 కోట్ల రెవెన్యూ ఉంది. ఈ ఏడాది రూ.850 కోట్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది వెయ్యి కోట్లు దాటాలని లక్ష్యిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో 30–50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. సేవల కంపెనీ నుంచి ప్లాట్ఫామ్ ఆధారిత, ఏఐ ఆధారిత వ్యాపారంగా ఎదుగుతున్నాం కనక ఇన్వెస్టర్లు కూడా మంచి వృద్ధిని ఆశించొచ్చు.-రమణమూర్తి మంథా -
ఉద్యోగాలను మింగేస్తుందా? సృష్టిస్తుందా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ(ఏఐ)పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన... ‘ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా?’. ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘ఏఐ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగాల భయంపై హువాంగ్ స్పందనమిల్కెన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హువాంగ్ ఏఐ వల్ల భారీగా ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఈ తరహా భయాందోళనలు కేవలం అపోహలని, ఇవి ప్రజలను సాంకేతికతకు దూరంగా ఉంచుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘ఏఐ కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవానికి నాంది. డేటా సెంటర్లు, అధునాతన హార్డ్వేర్, సహాయక ఎకోసిస్టమ్ల నిర్మాణం కోసం వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. ఆటోమేషన్ అనేది మొత్తం ఉద్యోగాలను తుడిచిపెట్టదు. కేవలం పనితీరులోని నిర్దిష్టమైన, పునరావృతమయ్యే పనులను మాత్రమే మారుస్తుంది. అంటే, మనిషి చేసే మొత్తం పనిలో కొంత భాగాన్ని ఏఐ సాయంతో సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, మనిషి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు’ అని చెప్పారు.ఆందోళనలు ఎందుకు? వాస్తవాలేంటి?హువాంగ్ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వేత్తలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. వివిధ కన్సల్టింగ్ సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 శాతం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు లేదా కొన్ని పాత తరహా పాత్రలు కనుమరుగయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన ఏఐ స్వీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని, సరైన శిక్షణ లేని వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనేది నిపుణుల ప్రధాన ఆందోళన.భయం వద్దు.. నైపుణ్యం ముద్దు!ప్రతి సాంకేతిక మార్పు వెనుక కొంత అనిశ్చితి ఉండటం సహజం. అయితే, టెక్ పరిశ్రమ సృష్టిస్తున్న హైప్కు భయపడి పురోగతిని ఆపడం సరికాదని హువాంగ్ సూచిస్తున్నారు. ఏఐని ఒక ముప్పుగా చూడటం కంటే.. మన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలి అనేది ఆయన మాటల సారాంశం. మొత్తానికి ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ స్వరూపం మారుతుందనేది వాస్తవం. అయితే, కాలంతో పాటు కొత్త నైపుణ్యాలను సంతరించుకునే వారికి ఏఐ ఒక వరం కానుంది. సాంకేతికత పట్ల భయాన్ని వీడి దానిని వాడుకోవడంలోనే భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
సరైన ప్రశ్నలు అడగండి.. రాత్రికి రాత్రే యాప్ రెడీ
సాఫ్ట్వేర్ అభివృద్ధి అంటేనే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, వేల గంటల శ్రమ, సంక్లిష్టమైన కోడింగ్తో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సరైన ప్రశ్న అడగడం తెలిస్తే చాలు సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చని తాజాగా జరిగిన ఒక ఉదంతం నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ తయారీ రంగాన్ని ఎలా మారుస్తుందో చెప్పే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.రాత్రికి రాత్రే ఫంక్షనల్ యాప్ప్రముఖ వ్యవస్థాపకుడు సందీప్ మాల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందులోని వివరాల ప్రకారం.. తన కుమారుడు అసలు ప్రోగ్రామింగ్ నేపథ్యమే లేని మార్కెటింగ్ గ్రాడ్యుయేట్ ‘క్లాడ్’ అనే ఏఐ సాధనాన్ని ఉపయోగించి కేవలం ఒక్క రాత్రిలో పూర్తి స్థాయి వెండర్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించాడని ఆయన వెల్లడించారు. ఈ యాప్లో కెపాసిటీ ట్రాకింగ్, క్వాలిటీ మానిటరింగ్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయని, ఒక ప్రొఫెషనల్ యాప్కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.సాంప్రదాయకంగా సాఫ్ట్వేర్ తయారీలో ప్రోగ్రామింగ్ భాషల వాక్యనిర్మాణం (సింట్యాక్స్) తెలుసుకోవడం అత్యంత కీలకం. అయితే, ఈ ఘటన తర్వాత జరుగుతున్న చర్చలో నెటిజన్లు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఏఐ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం కంటే, సమస్యను ఎలా ఫ్రేమ్ చేయాలి? ఏ ప్రశ్న అడిగితే సరైన పరిష్కారం వస్తుంది? అనే జడ్జిమెంట్ (నిర్ణయాత్మక సామర్థ్యం)కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే టీమ్, భారీ పెట్టుబడి అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ ప్రవేశ అడ్డంకులు కనుమరుగవుతున్నాయి.సవాళ్లు లేకపోలేదుఈ పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్నప్పటికీ వాస్తవిక దృక్పథాన్ని కోల్పోవద్దని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రోటోటైప్ను తయారు చేయడం వేరు. దాన్ని యాప్ స్టోర్లోకి తీసుకురావడం, భద్రతా ప్రమాణాలను పాటించడం, దీర్ఘకాలంలో నిర్వహించడం వంటివి చాలా క్లిష్టమని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, ఏఐ సృష్టించిన కోడ్లో వచ్చే బగ్లను గుర్తించి డీబగ్ చేయడం ఇప్పటికీ ఒక సవాలుతో కూడిన నైపుణ్యమేనని అభిప్రాయపడుతున్నారు.My younger one is a marketing grad. Zero coding knowledge. Sat through one night with Claude and built a complete vendor management app - capacity, quality, workload, the works.Old wisdom says: ask the right questions. Turns out, that’s all you need in the AI world too. 🙌— Sandeep Mall (@SandeepMall) May 4, 2026భవిష్యత్తు దిశగా..సాంకేతిక నైపుణ్యం కంటే ఆలోచన, దాన్ని అమలు చేసే స్పష్టతకు విలువ పెరుగుతోంది. సాఫ్ట్వేర్ తయారీ అనేది ఇప్పుడు కేవలం ఇంజినీర్లకే పరిమితం కాదు, సృజనాత్మకత ఉన్న ఎవరైనా సరే ఏఐతో తమ సొంత పరిష్కారాలను నిర్మించుకునే యుగం మొదలైంది.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు -
ఏఐపై జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు
నేడు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తోంది. రోజుకో కొత్త సాంకేతికత, శక్తివంతమైన ఏజెంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఎంత మేధస్సును కలిగి ఉన్నా సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీశాయి.మెటా సంస్థ 2026 మొదటి త్రైమాసిక పలితాల విశ్లేషణ సమావేశంలో మాట్లాడుతూ, జుకర్ బర్గ్ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఏఐ ఏజెంట్లు అత్యంత శక్తివంతమైనవి కావొచ్చు, కానీ అవి సామాన్యులకు అర్థం కానంత క్లిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన ‘మదర్ టెస్ట్’గా అభివర్ణించారు.‘నా తల్లి సైతం అర్థం చేసుకునేంత సరళంగా ఈ ఏజెంట్లు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిలో మెజారిటీ సాధనాలు ఆ మదర్ టెస్ట్లో విఫలమవుతున్నాయి’ అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. సాంకేతిక నిపుణులు, కోడింగ్ తెలిసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించగలుగుతున్నారు తప్ప, సాధారణ వినియోగదారులకు ఇవి భారంగా మారాయని ఆయన విశ్లేషించారు.మెటా వ్యూహంప్రస్తుతం ఓపెన్ సోర్స్, కోడింగ్ ఆధారిత ఏజెంట్లను అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు తీవ్రమైన పోటీలో ఉన్నాయి. అయితే, మెటా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. వేగం కంటే వినియోగ సౌలభ్యానికి తమ కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, కమాండ్-లైన్ సెటప్లు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికే ఏఐ ఏజెంట్లు చేరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది వినియోగదారులు ఎటువంటి అదనపు శిక్షణ లేకుండా అత్యంత సహజంగా ఉపయోగించగల సాధనాలను రూపొందించాలని మెటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్క్ చెప్పారు.పెట్టుబడుల వెనుక ఆంతర్యంపెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మెటా తన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల ఖర్చులు పెరుగుతున్నా దీర్ఘకాలికంగా మార్కెట్ను శాసించేది వినియోగదారులకు అత్యంత చేరువలో ఉండే ఏఐ సాధనాలేనని మెటా భావిస్తోంది. ‘సాంకేతిక పురోగతి మాత్రమే ముఖ్యం కాదు. అది మనిషి జీవితంలో ఎంత సులభంగా భాగమైందనేదే అసలైన విజయానికి కొలమానం’ అని జుకర్ బర్గ్ గుర్తు చేశారు.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు -
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్స్కిల్లింగ్ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్లో జూదం ఆడుతున్నారు! -
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ దిలీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కొత్త మలుపునిచ్చాయి.ఆలోచనలు పాతబడ్డాయా?భారతదేశ టెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణమూర్తిల ఆలోచనా దృక్పథం ప్రస్తుత ఏఐ యుగానికి సరిపోదని గిరీష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. నీలేకని వంటి వారు 1990ల నాటి ఐటీ సర్వీసుల మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారని, ఇది 21వ శతాబ్దంలో భారత్ను వెనుకబడిపోయేలా చేస్తుందని విమర్శించారు. ఆధార్ వంటి గొప్ప ప్రాజెక్టులకు నీలేకని కృషిని గౌరవిస్తూనే, ‘ప్రస్తుతం దేశానికి నందన్ నీలేకనిలు కాదు, విశాల్ సిక్కా వంటి దూరదృష్టి గల నాయకులు అవసరం’ అని పాటిల్ చేసిన వ్యాఖ్య టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది.మరోవైపు, నందన్ నీలేకని, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ ఇటీవల తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్లో భారీ పెట్టుబడులు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక స్థాయి నుంచి ప్రతిదీ నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ సాంకేతికతను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం ఉత్తమమని సూచించారు. ఆధార్, యూపీఐ విజయాల తరహాలోనే ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వాడటమే మన ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.విశాల్ సిక్కా దార్శనికతవిశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న సమయంలో (2014-2017) సంస్థను సర్వీసులందించే కంపెనీ నుంచి ఉత్పత్తులు, ప్లాట్ఫారమ్ల బేస్డ్ సంస్థగా మార్చాలని ప్రయత్నించారు. ఆటోమేషన్, ఏఐ ఆధారిత సేవలపై ఆయన చూపిన శ్రద్ధ అప్పట్లో విప్లవాత్మకం. అయితే, అంతర్గత పాలనాపరమైన వివాదాలు, వ్యవస్థాపకుల నుంచి ఎదురైన విమర్శలతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. సిక్కా ఆలోచనలను అప్పుడే అమలు చేసి ఉంటే నేడు ఇన్ఫోసిస్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉండేదని, ఓపెన్ఏఐ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మార్కెట్ విలువ ఊహించలేనంతగా పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సిక్కా వహనా ఏఐ సిస్టమ్స్ ద్వారా మానవ కేంద్రీకృత ఏఐపై పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్! -
ఒక్క మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేసింది!
సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం ‘జనరేటివ్ ఏఐ’ హవా నడుస్తోంది. అద్భుతమైన చాట్బాట్లు, ఆకట్టుకునే చిత్రాలను సృష్టించే ఏఐ టెక్నాలజీపై కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్నాయి. కానీ, ఈ హడావుడికి భిన్నంగా సాధారణ మిస్డ్ కాల్ సమస్యను పరిష్కరించడం ద్వారా ఒక భారతీయ సంతతి ఇంజినీర్ చరిత్ర సృష్టించారు. ఆయనే అపూర్వ శ్రీవాస్తవ. ఆయన టైసన్ చెన్తో కలిసి ప్రారంభించిన ‘అవోకా’ స్టార్టప్ ఇప్పుడు ఏకంగా 1 బిలియన్ డాలర్ల (యూనికార్న్-సుమారు రూ.9300 కోట్లు) విలువను చేరుకుని ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.అక్కడే మొదలైందిమిచిగాన్లో పెరిగిన అపూర్వ శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచే వ్యాపారాల్లోని కష్టనష్టాలపై అవగాహన ఉంది. మొదటి తరం భారతీయ-అమెరికన్గా తన కుటుంబం నడుపుతున్న చిన్న వ్యాపారం కోసం వచ్చే ఫోన్ కాల్స్ను ఆయన స్వయంగా నిర్వహించేవారు. ఆ సమయంలో ఆయన ఒక చేదు నిజాన్ని గ్రహించారు. సాధారణంగా మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తకపోతే ‘సరే, తర్వాత చేస్తాలే’ అనుకుంటాం. కానీ, ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ లాంటి వారి విషయంలో పరిస్థితి వేరు. ఏసీ ఆగిపోయినా లేదా ఇంట్లో పైపు లీకై నీళ్లు వస్తున్నా ఆ కస్టమర్కు అది అత్యవసర పరిస్థితి. ఆ సమయంలో ఫోన్ ఎత్తకపోతే కస్టమర్ వెంటనే వేరే వారికి ఫోన్ చేస్తారు. వ్యాపారస్థులకు ఒక్క ఫోన్ కాల్ మిస్ అవ్వడం అంటే ఒక కస్టమర్ చేజారడమే కాదు.. ఆ కస్టమర్ ద్వారా వచ్చే వేల రూపాయల పని (ఉదాహరణకు కొత్త ఏసీ ఇన్స్టాలేషన్ లేదా పెద్ద రిపేర్ వర్క్) మరొకరికి వెళ్లిపోయినట్లు లెక్క.ఐడియా పుట్టిందిక్కడే..మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ మొదట రెస్టారెంట్ల కోసం ఏఐ ఆధారిత ఆన్సరింగ్ సేవలను రూపొందించడంపై ప్రయోగాలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఒక రెస్టారెంట్లో ఫోన్ కాల్ మిస్ అయితే 40 డాలర్ల నష్టం జరగవచ్చు, కానీ ఒక హెచ్వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) అత్యవసర పరిస్థితిలో కాల్ మిస్ అయితే అది 40 వేల డాలర్ల భారీ కాంట్రాక్టును పోగొట్టుకోవడంతో సమానం. ఈ కోణాన్ని గుర్తించిన శ్రీవాస్తవ టైసన్ చెన్తో కలిసి ‘అవోకా’కు శ్రీకారం చుట్టారు.అవోకా ప్రత్యేకత ఏమిటి?చాలా ఏఐ సంస్థలు డెస్క్ వర్క్ ఆటోమేషన్ మీద దృష్టి పెడితే అవోకా మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే సాంకేతిక నిపుణుల కష్టాలను తీరుస్తోంది. అవోకాలోని ఏఐ ఏజెంట్లు మనుషుల లాగే స్పష్టంగా మాట్లాడగలవు. ఏ సమయంలో కాల్ వచ్చినా సెకన్ల వ్యవధిలో సమాధానం ఇస్తాయి. ఇవి కేవలం సందేశాలను తీసుకోవడమే కాకుండా కంపెనీ క్యాలెండర్లను తనిఖీ చేసి నేరుగా అపాయింట్మెంట్లను బుక్ చేస్తాయి. పాత ఆర్డర్లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తాయి.అవోకా పనితీరు పట్ల మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 800కు పైగా ప్రముఖ కంపెనీలు వీరి సేవలను వాడుకుంటున్నాయి. 2025లో ఈ సంస్థ వార్షిక ఆదాయం ఎనిమిది అంకెల స్థాయిని దాటేసింది. ఈ పురోగతికి గుర్తింపుగా మెరిటెక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్, క్లీనర్ పెర్కిన్స్ వంటి సంస్థల నేతృత్వంలో జరిగిన తాజా ఫండింగ్ రౌండ్లో కంపెనీ 125 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించింది. తద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ.9300 కోట్లు)కు చేరింది. జనరల్ పర్పస్ ఏఐ కోసం ప్రపంచం పోటీ పడుతుంటే శ్రీవాస్తవ, చెన్ మాత్రం హోం సర్వీసుల ఆర్థిక వ్యవస్థలోని ఫోన్ కాల్లను నమ్ముకుని యూనికార్న్ స్థాయికి చేరుకోవడం విశేషం.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
సంప్రదాయ మోడల్లో ఏఐ పెను మార్పులు
భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్ మోడల్ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులుప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.20,000 మంది ఫ్రెషర్లకు చోటునియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఏఐ ఉచ్చులో కార్పొరేట్ సంస్థలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.పరిష్కారం ఏమిటి?యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’ -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్’!
ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలతో టెక్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్న తరుణంలో అమెరికాలోని తన సిబ్బంది కోసం మైక్రోసాఫ్ట్ ‘వాలంటరీ బైఅవుట్’ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకుంటూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.ఏమిటీ బైఅవుట్?సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని విభాగాలను మూసివేస్తున్నప్పుడు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రకటిస్తాయి. కానీ, బైఅవుట్ అనేది దీనికి భిన్నమైనది. కంపెనీ బలవంతంగా ఉద్యోగం తీసివేయడం కాకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడే వారికి ఒకేసారి భారీ నగదు, పొడిగించిన బీమా సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆఫర్ చేస్తారు. లేఆఫ్స్ వల్ల వచ్చే వ్యతిరేకతను నివారించడానికి ఉద్యోగులకు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు పలికేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి.మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఎవరికి? అర్హతలు ఏమిటి?కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ వన్ టైమ్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7% మందికి వర్తించనుంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్లోని ఉద్యోగులు దీనికి అర్హులు. ఇన్సెంటివ్ ఆధారిత సేల్స్ విభాగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. ‘అర్హులైన ఉద్యోగులు తమ భవిష్యత్తు నిర్ణయాలను సొంతంగా, కంపెనీ అందించే ఆఫర్ను తమ ఇష్టపూర్వకంగా పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ పేర్కొన్నారు.అసలు సమస్య ఏమిటి?టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన వనరులను పాత తరం సాఫ్ట్వేర్ సేవల నుంచి ఏఐ వైపు మళ్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి శ్రామిక శక్తిని సర్దుబాటు చేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే పాత్రల నుంచి సిబ్బందిని తగ్గించి, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టీమ్స్ను పునర్నిర్మిస్తున్నారు. పనితీరు సమీక్షలను సరళీకృతం చేస్తూనే నైపుణ్యం గలవారిని నిలుపుకోవడానికి స్టాక్ ఆధారిత రివార్డులను ఇస్తున్నారు.జూన్ 2025 నాటికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉండగా అందులో 1,25,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దఫాలుగా తొలగింపులు చేసిన ఈ కంపెనీ ఇప్పుడు బైఅవుట్ ద్వారా మానవీయ కోణంలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖర్చుల తగ్గింపుతోపాటు ఏఐ భవిష్యత్తు కోసం ఒక కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనం.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.వైట్-కాలర్ ఉద్యోగాల్లో భారీ కోతఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.నోబెల్ గ్రహీత అభ్యంతరంఅమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.‘అమోదికి ఏమీ తెలియదు’ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్ మార్కెట్పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు -
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత పరంపర 2026లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఈ ఏడాదిలో మరింత వేగం పుంజుకుంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ (Layoffs.fyi) సేకరించిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభ నెలల్లోనే సుమారు 73,200 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 దిగ్గజ టెక్ కంపెనీలు ఈ తొలగింపుల్లో భాగమయ్యాయి. కరోనా కాలంలో అవసరానికి మించి జరిగిన నియామకాలు, ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.కొలువుల కోతకు దారితీసిన కీలక అంశాలు2021 నుంచి ఇప్పటివరకు టెక్ రంగంలో సుమారు పది లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుత సంక్షోభానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. కంపెనీలు తమ వ్యయాన్ని సాంప్రదాయ విభాగాల నుంచి ఏఐ, ఆటోమేషన్, మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి. మానవ వనరుల కంటే సాంకేతికతపై పెట్టుబడి పెట్టడమే లాభదాయకమని సంస్థలు భావిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, సాస్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఈ-కామర్స్ రంగం ఉంది. ఈ ప్రభావం అత్యధికంగా అమెరికాపై కనిపిస్తోంది. యూరప్, ఆసియా దేశాల్లోని సెమీకండక్టర్, టెలికాం, ఐటీ సేవల విభాగాల్లోనూ గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల కోత నమోదైంది.ఏఐ భర్తీ చేస్తోందా?సాధారణంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే భయం ఉన్నప్పటికీ నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది. ప్రస్తుతానికి ఏఐ నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే కంపెనీలు ముందస్తుగా ఖర్చులను తగ్గించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో నియామకాలు, తొలగింపుల నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. టెక్ కంపెనీలు ఇప్పుడు ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే సూత్రాన్ని పాటిస్తున్నాయి. ఏఐ వంటి కొత్త వృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం పాత విభాగాల్లో కోతలు విధిస్తున్నాయి.ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే ఈ ఏడాది ముగిసే సమయానికి ఉద్యోగ కోతలు మరిన్ని వేలల్లో ఉండవచ్చని డేటా సూచిస్తోంది. టెక్ నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడమే ఈ సంక్షోభం నుంచి బయటపడే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ప్రమాదానికి బాధ్యులెవరు?
సాంకేతిక విప్లవం ఆటోమొబైల్ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. కొంతకాలం క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చాలిత) కార్లు ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. టెస్లా, వేమో, క్రూయిజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు పలు భారతీయ స్టార్టప్లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, స్టీరింగ్ డ్రైవర్ చేతిలో లేకుండా కార్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో మెదులుతున్నాయి.బాధ్యత ఎవరిది? డ్రైవర్దా లేక సాఫ్ట్వేర్దా?సాధారణ కార్ల ప్రమాదాల్లో మానవ తప్పిదం (హ్యుమన్ ఎర్రర్) ప్రధాన కారణం కాబట్టి డ్రైవర్పై బాధ్యత ఉంటుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో విషయం వేరు. ఇక్కడ ప్రమాద బాధ్యతను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.1. లెవల్ 2, 3 (సెమీ-అటానమస్): ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సాఫ్ట్వేర్ హెచ్చరించినా డ్రైవర్ స్పందించకుంటే బాధ్యత డ్రైవర్దే అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాత పద్ధతిలోనే జరుగుతుంది.2. లెవల్ 4, 5 (ఫుల్లీ-అటానమస్): ఇక్కడ కారు పూర్తిగా సాఫ్ట్వేర్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే అది ‘ప్రొడక్ట్ లయబిలిటీ’ కిందకు వస్తుంది. అంటే తయారీ కంపెనీ లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధానంసెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అటానమస్ కారులో సెన్సార్లు, కెమెరాల డేటా రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు మాన్యువల్ మోడ్లో ఉందా లేక అటానమస్ మోడ్లో ఉందా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా తనిఖీ చేస్తాయి.ఒకవేళ కారు సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల లేదా అల్గారిథమ్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ సదరు కార్ల తయారీ సంస్థ నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేస్తుంది. దీనినే ‘సబ్రోగేషన్’ అంటారు.బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఉన్న ‘థర్డ్ పార్టీ లయబిలిటీ’ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, పరిహారం చెల్లించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తయారీదారుడిపై కేసు వేసే అవకాశం ఉంటుంది.ప్రస్తుత కంపెనీల విధానాలుసైబర్ ఇన్సూరెన్స్.. కారు హ్యాకింగ్కు గురై ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది.అల్గారిథమ్ లయబిలిటీ.. సాఫ్ట్వేర్ కోడింగ్లో లోపాల వల్ల జరిగే నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించేలా కొత్త క్లాజులు వస్తున్నాయి.టెస్లా ఇన్సూరెన్స్.. టెస్లా వంటి కంపెనీలు స్వయంగా ఇన్సూరెన్స్ను అందిస్తున్నాయి. డ్రైవర్ ‘సేఫ్టీ స్కోర్’ ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి.భారత్లో పరిస్థితి ఏమిటి?భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం (ఎంవీఏ) ప్రకారం, వాహనానికి డ్రైవర్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతానికి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మన రోడ్లపై అనుమతి లేదు. అయితే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) ఉన్న కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగితే ప్రస్తుతానికి డ్రైవర్నే బాధ్యుడిని చేస్తూ క్లెయిమ్లు సెటిల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో! -
లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.పెరుగుతున్న ఉత్కంఠఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.మౌలిక సదుపాయాలు..ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.ఆగిపోని విప్లవంఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
ఏఐ అప్స్కిల్లింగ్పై ఫోకస్
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 50,000 మంది నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల కల్పనతోపాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతలో ఉద్యోగులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గిస్తున్న తరుణంలో డెలాయిట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.నైపుణ్యాల పెంపే లక్ష్యం!ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డెలాయిట్ దక్షిణాసియా సీఓఓ నితిన్ కిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ హెడ్కౌంట్ను తగ్గించడంపై కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ‘ఏఐ సాధనాల ద్వారా అత్యంత క్లిష్టమైన, అధిక విలువ కలిగిన పనులను నిర్వహించడానికి మా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాం. కేవలం పని వేగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులు అధునాతన బాధ్యతలు చేపట్టేలా అప్స్కిల్లింగ్పై దృష్టి సారించాం’ అని తెలిపారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 30,000 మందికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ పూర్తి చేశారు. సంస్థ తన మొత్తం ఆదాయంలో 9% సామర్థ్యం పెంపు, శిక్షణ, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. డెలాయిట్ అంతర్జాతీయ శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు భారత్లోనే ఉండటం విశేషం.భారతీయ సంస్థల్లో సవాళ్లుఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ భారతీయ సంస్థల్లో (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో) కొన్ని ప్రాథమిక ఆందోళనలు ఉన్నాయని డెలాయిట్ గుర్తించింది. సున్నితమైన సమాచారం నియంత్రిత వాతావరణంలో భద్రంగా ఉంటుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఏఐ మోడళ్ల ధరల నిర్ణయం ఎక్కువగా వినియోగం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్పై భారం పడవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి.భద్రత ముఖ్యంఆవిష్కరణలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని నితిన్ కిని నొక్కి చెప్పారు. ‘భారతదేశం ఏఐ అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే బలమైన భద్రతా వ్యవస్థలను నిర్మించడం అనివార్యం’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించే క్రమంలో డెలాయిట్ భారత్లో క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలకు భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చాలని సంస్థ భావిస్తోంది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..
కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది.2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?గార్ట్నర్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకిగా అవాస్తవ సమాచారంఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.సమీకృత పరిష్కారంప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలుటెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్ను ఒక ఫీచర్గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్! -
మూడు నెలల్లో 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్సైట్పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రతగత ఏడాది కాలంగా ఆర్బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్వాల్లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవంపెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్సైట్లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.భవిష్యత్తు ప్రణాళికలురాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్బాట్లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.ఖర్చుల నియంత్రణే లక్ష్యం?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా చేస్తున్న భారీ పెట్టుబడులే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మెటా మొత్తం ఖర్చులు 162 బిలియన్ల డాలర్లు నుంచి 169 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని అంచనా. అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు, వారిని నిలుపుకునేందుకు కంపెనీ మిలియన్ల కొద్దీ డాలర్లను వేతనాల రూపంలో వెచ్చిస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. దాంతో కేవలం టెక్నికల్ విభాగాలే కాకుండా సేల్స్ విభాగంలోని పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.నిజానికి ఈ ఉద్యోగ కోతలు ఆకస్మికమైనవి కావు. ఈ నెల ప్రారంభంలోనే రాయిటర్స్ ఒక నివేదికలో మెటా తన మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే ఆలోచనలో ఉందని పేర్కొంది. ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ మేరకు సమాచారం అందిందని, సిబ్బంది తగ్గింపునకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.ఇతర కంపెనీలు ఇలా..అమెజాన్అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో మధ్యస్థాయి మేనేజ్మెంట్ హైరార్కీలను తగ్గించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలని సీఈఓ ఆండీ జస్సీ నిర్ణయించారు. దీనివల్ల బ్యూరోక్రసీ తగ్గి ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వారి భావన.మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ (అజూర్), ఏఐ విభాగాలకు పెద్దపీట వేస్తూనే ఇతర విభాగాల్లో కోతలు విధిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు విడతల్లో వేలాది మందిని తొలగించింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం మైక్రోసాఫ్ట్ ఏటా దాదాపు 80 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడానికి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తోంది.గూగుల్గూగుల్ తన అడ్వర్టైజింగ్ సేల్స్, హార్డ్వేర్ విభాగాల్లో మార్పులు చేస్తోంది. ఏఐ సహాయంతో పనులను ఆటోమేట్ చేయడం ద్వారా తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎఫిషియెన్సీ పేరుతో కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తోంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్ మల్టీ టాస్కింగ్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్(ఎంఎంఎల్యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్ఎల్ఈ). ఎంఎంఎల్యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన హెచ్ఎల్ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.ఏమిటీ హెచ్ఎల్ఈ? ఎందుకంత కఠినం?ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్ఎల్ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.గెలుపు ఎవరిది?ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)GPT-4o2.7%-OpenAI o18.0%-DeepSeek-R18.5%-GPT-5-25.3%Gemini 2.5 Pro-21.6%Gemini 3 Pro (Live)-38.3% ఆందోళన కలిగిస్తున్న అంశాలుఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.కొలమానమే కరిగిపోతోందా?ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్ఎల్ఈ రోలింగ్’ పేరుతో నిరంతరం అప్డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
ఇటీవలికాలం వరకు సందేశాలకు, సెర్చ్ ఇంజిన్లకు మాత్రమే పరిమితమైన మీ స్మార్ట్ ఫోన్.. ఏఐ పుణ్యామా అని విభిన్న పనులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏఐ మీ నాడిచూసి, గుండె వేగం నుంచి ఆసుపత్రి రిపోర్టుల వరకు అన్నింటినీ విశ్లేషించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్బాట్ కోపైలట్ ద్వారా తీసుకువచ్చిన కొత్త హెల్త్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెజాన్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ , ఆంత్రోపిక్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలుకుతోందా లేక ఆరోగ్య రికార్డుల గోప్యతకు నీళ్లు వదులుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్త్ ఫీచర్?మైక్రోసాఫ్ట్ తాజాగా ఆవిష్కరించిన ఈ టూల్ వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను నేరుగా చాట్బాట్తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. యాపిల్ వాచ్, ఫిట్బిట్, స్లీప్ ట్రాకర్ వంటి పరికరాల నుంచి సేకరించిన ఫిట్నెస్ డేటాను ఇది విశ్లేషిస్తుంది.వివిధ ఆసుపత్రుల రికార్డులను కలిపి వినియోగదారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలపై నిమిషంలో పూర్తి సమచారాన్ని అందిస్తుంది.‘నేను సరిగ్గా నిద్రపోవడం లేదు’ అని మీరు చాట్బాట్తో అంటే చాలు.. మీ పాత మెడికల్ రిపోర్టులను, స్లీప్ ట్రాకర్ డేటాను పరిశీలించి అది మీకు ఉన్న నిద్రలేమి లేదా డయాబెటిస్ వంటి ముప్పులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఉచితంగా అందుబాటులోకి రానున్న ఈ సేవలకు భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.ప్రయోజనాలు..సాధారణంగా ఒక రోగి వివిధ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రికార్డులు వేర్వేరు డేటాబేస్ల్లో ఉంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్ రోగి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ కింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సెకన్లలోనే సంక్లిష్టమైన రికార్డులను విశ్లేషిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా సామాన్యులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక విశ్లేషణ సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.నష్టాలు లేవా?టెక్ కంపెనీల చేతికి అత్యంత సున్నితమైన ఆరోగ్య డేటా వెళ్లడంపై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్య రికార్డులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ గ్రీన్ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో రోగి గోప్యతను కాపాడే ‘హిప్పా’ చట్టాలు సాంప్రదాయ ఆసుపత్రులకు వర్తిస్తాయి కానీ, ఈ టెక్ కంపెనీలకు వర్తించవు. దీనివల్ల కంపెనీలు రోగుల డేటాను ప్రకటనల కోసం లేదా తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకునే ప్రమాదం ఉంది. గర్భస్రావాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య రికార్డులను కొన్ని సంస్థలు టెక్ కంపెనీల నుంచి సులభంగా పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయమా?మైక్రోసాఫ్ట్ స్వయంగా ఒక గమనికను(Disclaimer) తెలియజేసింది. ఈ చాట్బాట్ కేవలం సమాచార విశ్లేషణకు మాత్రమేనని, ఇది వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేసింది. వ్యాధులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని సూచించింది. అయితే ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనవసరమైన ఆందోళన చెంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
మౌలిక సదుపాయాలకు ఏఐ దన్ను
చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ (ఏఐ) తోడ్పడుతోందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్ హువాంగ్ చెప్పారు. ఇందుకోసం లక్షల కోట్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఈ పరిణామాలతో నిపుణులైన కార్మికులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఏఐని గతంలోలాగా ఏదో సాధారణ అప్లికేషన్లాగా పరిగణించడానికి లేదని, విద్యుత్తు.. ఇంటర్నెట్లాగా కీలకమైన మౌలిక సదుపాయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని హువాంగ్ ఒక బ్లాగ్పోస్ట్లో చెప్పారు. ‘మనం ఇప్పుడిప్పుడే నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఏదో, కొన్ని వందల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాం. కానీ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలంటే ఇది సరిపోదు. లక్షల కోట్ల డాలర్లు కావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో చిప్ ఫ్టాక్టరీలు, కంప్యూటర్ అసెంబ్లీ ప్లాంట్లు, ఏఐ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయి. ఇదంతా కూడా మానవ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనగా మారబోతోంది‘ అని పేర్కొన్నారు. అయిదంచెల కేక్.. విద్యుత్, చిప్లు, మౌలిక సదుపాయాలు, మోడల్స్, అప్లికేషన్ల మేళవింపుతో కృత్రిమ మేథ అయిదంచెల ’కేక్’గా ఉంటుందని హువాంగ్ అభివరి్ణంచారు. పరిశ్రమల్లో భారీ స్థాయి మార్పుల వల్ల సంప్రదాయ టెక్ రంగం పరిధికి వెలుపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఈ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు భారీ స్థాయిలో కారి్మకులు కావాలి. ఏఐ ఫ్యాక్టరీలకు ఎల్రక్టీíÙయన్లు, ప్లంబర్లు, పైప్ఫిట్టర్లు, స్టీల్వర్కర్లు, నెట్వర్క్ టెక్నీíÙయన్లు, ఇన్స్టాలర్లు, ఆపరేటర్లు కావాలి. మంచి జీతభత్యాలు ఉండి, నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలివి. అలాంటి నిపుణులకు కొరత నెలకొంది. ఈ పరివర్తనలో పాలుపంచుకునేందుకు కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీల్లాంటివేమీ అవసరం లేదు’ అని హువాంగ్ చెప్పారు.సంప్రదాయ కంప్యూటింగ్ మోడల్ను కృత్రిమ మేథ ఏ విధంగా మార్చివేస్తోందనేది ఆయన వివరించారు. ఏఐ మోడల్స్ గతేడాది కీలకమైన దశలను దాటాయని పేర్కొన్నారు. ఔషధాల డిస్కవరీ , లాజిస్టిక్స్, కస్టమర్ సరీ్వసు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తయారీ తదితర రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపయోగపడుతోందని, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తోందని హువాంగ్ చెప్పారు. డీప్సీక్–ఆర్1లాంటి ఓపెన్ సోర్స్ మోడల్స్, ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని కితాబిచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
క్రోమ్ బ్రౌజర్లో ఏఐ టూల్స్
సురక్షితమైన, మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని కల్పించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో క్రోమ్ బ్రౌజర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా బిల్ట్ ఇన్ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, హిందీలాంటి 8 ప్రాంతీయ భాషలతో పాటు 50 ల్యాంగేజ్లకు సపోర్ట్ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ జెమిని 3.1 మోడల్పై రూపొందించిన ఈ ఫీచర్లతో, బ్రౌజర్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని వివరించింది. ముందుగా డెస్క్టాప్, ఐవోఎస్లలో ఇవి అందుబాటులో ఉంటాయని గూగుల్ డైరెక్టర్ షార్మెయిన్ డిసిల్వా తెలిపారు.వీటిని తొలిసారిగా ప్రవేశపెడుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని వివరించారు. కొత్త ఫీచర్ల ప్రకారం వేరే ట్యాబ్కి మారాల్సిన అవసరం లేకుండా యూజర్లు, ప్రస్తుత ట్యాబ్లోనే పైన కుడివైపున ఉండే బ్రౌజింగ్ అసిస్టెంట్ ఐకాన్ని క్లిక్ చేసి నేరుగా చాట్ చేయొచ్చు. చాంతాడంత కంటెంట్ను సంక్షిప్తంగా పొందవచ్చు. జీమెయిల్తో అనుసంధానించడం వల్ల ప్రస్తుత పేజీ నుంచి వేరే పేజీకి వెళ్లక్కర్లేకుండా, సైడ్ ప్యానెల్ నుంచే ఈమెయిల్స్ రాయొచ్చు, పంపించవచ్చు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే! -
యూఎస్ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన పరిపాలన, శాసన ప్రక్రియలో కృత్రిమ మేధ విప్లవానికి నాంది పలికింది. అమెరికా సెనేట్ అధికారిక కార్యకలాపాల కోసం ప్రముఖ ఏఐ చాట్బాట్లు.. ఓపెన్ఏఐ చాట్జీపీటీ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ ఏఐ పరికరాలు సెనేట్ ప్లాట్ఫారమ్ల్లో అంతర్భాగంగా మారి విధాన నిర్ణేతలకు సహాయంగా నిలవనున్నాయి.పాలనలో వేగం.. పనిలో పారదర్శకతసెనేట్ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా డ్రాఫ్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, అపారమైన సమాచారాన్ని విశ్లేషించి కచ్చితమైన డేటాను అందించడం, సుదీర్ఘమైన నివేదికలను క్లుప్తంగా బ్రీఫింగ్ నోట్స్ రూపంలోకి మార్చడం వంటి పనులు చేస్తాయి. ఒకే రకమైన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా అధికారుల సమయాన్ని ఇవి ఆదా చేయనున్నాయి.అమెరికా ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక సంకేతంగా మారింది. పాలనలో ఏఐ కేవలం సహాయకారి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది అనివార్యమనే సంకేతాలు ఇస్తోంది. అయితే భద్రత, గోప్యత వంటి అంశాల్లో ఈ సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం
సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్ ప్లాట్ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.డిజిటల్ డిమాండ్ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.2027 నాటికి ఏజెన్సీల విభజనభవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్వర్క్లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్ఫామ్ టూల్స్ను ఉపయోగించి క్లయింట్లకు సేవలను అందిస్తాయని చెప్పింది.వినియోగదారుల అలవాట్లుభారత్లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం -
ఏఐ సంక్షోభం.. ఏం చేయాలో ఆలోచించాలి!
ప్రపంచంలోని టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన డిమోన్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల పని దినాలు తగ్గుతాయని అంచనా వేయడం గమనార్హం.వారానికి 3.5 రోజుల పనే!బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమోన్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావంతో భవిష్యత్ తరాల జీవనశైలి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. ‘వచ్చే మూడు నాలుగు దశాబ్దాల్లో మన పిల్లలు వారానికి కేవలం నాలుగు లేదా మూడున్నర రోజులు మాత్రమే పని చేసే స్థాయికి ఏఐ ఉత్పాదకతను పెంచుతుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వల్ల పని గంటలు తగ్గి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడటం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నారు.జేపీ మోర్గాన్లో ఇప్పటికే ఏఐ జోరుకేవలం అంచనాలు వేయడమే కాకుండా, తన బ్యాంకులో ఇప్పటికే ఏఐని భారీగా వినియోగిస్తున్నట్లు డిమోన్ వెల్లడించారు. మోసాల గుర్తింపు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎర్రర్ రిడక్షన్ వంటి చాలా విభాగాల్లో ఏఐని వాడుతున్నట్లు చెప్పారు. సంస్థలోని సుమారు 1,50,000 మంది ఉద్యోగులు ఇప్పటికే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.‘సాంకేతికత ఎప్పుడూ ఉద్యోగాలను మారుస్తూనే ఉంటుంది. కానీ ఏఐ తెచ్చే మార్పులు వేగంగా ఉంటాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు ఈ మార్పునకు ఇప్పుడే సిద్ధం కావాలి’ అని జామీ డిమోన్ తెలిపారు.ఉద్యోగ ముప్పుపై హెచ్చరికఒకవైపు ఆశావాదాన్ని ప్రకటిస్తూనే, మరోవైపు ఉద్యోగాల తొలగింపుపై డిమోన్ వాస్తవాలను బయటపెట్టారు. పరిశ్రమలు ఏఐని స్వీకరించే క్రమంలో ఉద్యోగాల నష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. రాబోయే ఐదేళ్లలో ఏఐ వల్ల పెరిగే ఉత్పాదకత కారణంగా బ్యాంకులో తక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని అంగీకరించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిని ఎలా ఆదుకోవాలనే అంశంపై ప్రభుత్వాలు, సంస్థలు ఆలోచించాలని సూచించారు.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! -
ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు
ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్స్పీడ్ వెంచర్స్ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడళ్లు, హార్డ్వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది. దిగ్గజాలు ఇలా..ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 110 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2035కల్లా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్ కేటలిస్ట్ ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు కమిట్మెంట్ను ప్రకటించింది. ఈ బాటలో లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్తగా ఇండియా– యూఎస్ సబ్సీ కేబుల్ మార్గంసహా.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్ కంప్యూట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొందరికి శాపంగా మారుతోంది. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్కు కారణం ఇదే.. -
ఏఐ టెక్నాలజీ మార్కెట్లకు మంచిదే
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పర్యవేక్షణను పటిష్టపరచడం, రిస్క్ నిర్వహణ, పారదర్శకతతోపాటు.. ఇన్వెస్టర్ అవగాహనను సైతం పెంపొందించేందుకు వీలుంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొటక్ ఇన్వెస్టర్ సదస్సు సందర్భంగా దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లనుద్ధేశించి పాండే ప్రసంగించారు.దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే మార్కెట్ నాణ్యత, పాలనా ప్రమాణాలు, సమాచార వెల్లడి, లిక్విడిటీ, సంస్థల బలిమి ద్వారా తదుపరి వృద్ధి ప్రతిఫలిస్తుందని వివరించారు. సప్లై చైన్లో మార్పులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వాతావరణం సంక్షిష్టంగా మారుతున్నదని పాండే పేర్కొన్నారు. వెరసి వృద్ధి అనేది రిటర్నులపైకాకుండా నిలకడ, నమ్మకం(క్రెడిబిలిటీ), వాస్తవిక అంచనాలు తదితరాలకు సంబంధించిన అంశంగా మారుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్! -
ఏఐతో ముప్పేమీ లేదు
కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు.పదే పదే పునరావృతమయ్యే కోడింగ్ పనులను మాత్రమే ఏఐ టేకోవర్ చేయొచ్చని, దీనితో ప్రోడక్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, భద్రత మొదలైన వాటిపై ఫోకస్ చేసేందుకు డెవలపర్లకు వీలు చిక్కుతుందని స్మిత్ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించడం కాకుండా వాటిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఏఐ సహాయపడుతుందని చెప్పారు. దీనితో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, వేతనాలు కూడా పెరుగుతాయని స్మిత్ వివరించారు.ప్రజల సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడే టెక్నాలజీని, మెషిన్లను తయారు చేయడమే మైక్రోసాఫ్ట్ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు. సాంకేతికత అనేది ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉంటూనే అత్యంత నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు దోహదపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత -
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ -
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.డ్రైవర్లెస్ కార్లపై పని..టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలుగత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.యూఎస్-ఇండియా కనెక్ట్ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్వర్క్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే.. -
ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
భారత్లోని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కృత్రిమ మేధ ప్రభావంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఎన్నటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పు క్రమంలో సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని వాస్తవమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందో, నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.సాంప్రదాయ ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పుఏఐ వల్ల పునరావృతమయ్యే పనులు చేసే విభాగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల వల్ల క్లరికల్ పనుల అవసరం తగ్గుతోంది. కస్టమర్ సర్వీసులో చాట్బాట్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు ప్రాథమిక కస్టమర్ సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి సాఫ్ట్వేర్ కోడింగ్ను ఏఐ మోడల్స్ సమర్థవంతంగా చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోటిక్స్ ఏఐ ఏకీకరణ వల్ల మానవ ఆధారిత లేబర్ అవసరం తగ్గుతోంది.కొత్త తరం అవకాశాలుపాత ఉద్యోగాలు పోతున్నా అంతకు రెట్టింపు స్థాయిలో సరికొత్త కెరీర్ మార్గాలు పుట్టుకొస్తున్నాయి. 2026 నాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్ ఇంజినీర్లకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. అల్గారిథమ్స్లో పక్షపాతం లేకుండా చూసేందుకు ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు అవసరం పెరుగుతోంది. ఏఐ మోడల్స్కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను ఉపయోగించేందుకు డేటా క్యూరేటర్లకు డిమాండ్ ఉంది. మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ప్రక్రియను సమన్వయం చేసే మేనేజర్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.ప్రస్తుత పరిస్థితులు: భారత్ సన్నద్ధతప్రస్తుతం భారతదేశం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. సమ్మిట్లో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా ‘రీ-స్కిల్లింగ్’(నైపుణ్యాభివృద్ధి) ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యం లేని చోట మాత్రమే ఉపాధి ముప్పు కనిపిస్తోందని, నైపుణ్యం ఉన్న చోట ఉత్పాదకత పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.సవాళ్లను అధిగమించడం ఎలా?రాబోయే రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే కొన్ని మార్పులు అవసరం.డిగ్రీతో విద్య ముగిసిందని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.సృజనాత్మకత, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ చేయలేదు. వీటిని మెరుగుపరుచుకోవాలి.ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏఐ అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలి.ఉద్యోగాల కోతను అరికట్టేలా కంపెనీలు సామాజిక బాధ్యతతో ఏఐని అమలు చేయాలి.అసలైన సవాలు..ఏఐ అనేది మనిషిని తొలగించే సాధనం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే ఒక ‘సూపర్ పవర్’. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దాన్ని మన ఉపాధికి ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుతం అసలైన సవాలు.ఇదీ చదవండి: దిగొస్తున్న వెండి ధరలు.. ఒకేసారి రూ.5000 -
‘భారత ఏఐ రంగంలో వృద్ధి వేగవంతం’
గూగుల్ భారత్తో తన అనుబంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇండియా ఏఐ రంగంలో పురోగతి సాధిస్తున్న తరుణంలో గూగుల్ తన పూర్తి ఏఐవ్యవస్థలను స్థానికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.గూగుల్, ఇండియా ఏఐ భాగస్వామ్యంగూగుల్ కేవలం ఒక టెక్నాలజీ ప్రొవైడర్గానే కాకుండా భారత ఏఐ పర్యావరణ వ్యవస్థలో ఒక సమగ్ర భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకుంది. కంప్యూట్ పవర్, మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రీసెర్చ్ వంటి ఏఐకి సంబంధించిన అన్ని విభాగాల్లో గూగుల్ భారత్తో కలిసి పనిచేయనుంది. గూగుల్ తన గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 185 బిలియన్ డాలర్ల భారీ మూలధన వ్యయ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో గణనీయమైన భాగం భారత్లో డేటా సెంటర్లు, గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, స్థిరమైన ఇంధన వనరుల కోసం కేటాయించనున్నారు.రిలయన్స్ జియో (క్లౌడ్ రీజియన్ల కోసం), అదానీ గ్రూప్, క్లీన్మ్యాక్స్ (పునరుత్పాదక ఇంధనం కోసం) వంటి దిగ్గజ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుంది.ఈ పరిణామం ఎందుకు కీలకం?ఈ భాగస్వామ్యం దేశ డిజిటల్ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక అడుగు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సామాన్యులకు చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ అత్యాధునిక ఏఐ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లు తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ఆవిష్కరణలు చేయవచ్చు. గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్ ద్వారా భారత్ ప్రపంచానికి ఏఐ సేవలను అందించే కేంద్రంగా మారుతుంది. ఇది భారత్-అమెరికా సాంకేతిక సహకారాన్ని మరింత బలపరుస్తుంది.భవిష్యత్తుపై అంచనాలు..ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..‘భారతదేశం ఏఐ రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ పరివర్తనకు అవసరమైన మౌలిక సదుపాయాలను, క్లీన్ ఎనర్జీని, ఏఐకి సంబంధించి ఓపెన్ మోడల్స్ను అందించడమే మా లక్ష్యం’ అన్నారు. గూగుల్ ఇప్పటికే రాజస్థాన్లో 150 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు వంటి వాటితో తన మౌలిక సదుపాయాల కల్పనను ప్రారంభించింది.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
ఏఐ భయాలు నిజమే.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయంగత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్వేర్ బడ్జెట్ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వేగమే అసలు సవాలుఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.అపరిమిత అవకాశాలుభారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం -
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్లోని లోపాలను మాన్యువల్గా టెస్టింగ్లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్లతో సంభాషిస్తూ అవుట్పుట్ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన -
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఏఐ వినియోగంలో భారత్ జోరు
దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్ప్రైజ్ విభాగంలో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెర్నిగ్) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఏజెంటిక్ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య జీస్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్ లెరి్నంగ్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఎమోన్ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్–డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్–ఫస్ట్ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్–ఇన్సూరెన్స్ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్ డిమాండ్కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్క్రిమినల్స్, నిఘా గ్రూప్లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్ వేగంతో, భారీ స్థాయిలో సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్లోకి 18,000 టెరాబైట్స్ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్ ఫొటోలకు సమానం. ఏజెంటిక్ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్ జీరో ట్రస్ట్ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
భారత్కు త్వరలో టెక్ కంపెనీ సీఈఓలు రాక
న్యూఢిల్లీ వేదికగా భారత్లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.దిగ్గజ కంపెనీల సారథులుఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్గేట్స్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.దేశీయంగా కూడా ఈ సమ్మిట్పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.సదస్సు ప్రత్యేకతలుప్రభుత్వం ఈ సమ్మిట్ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
‘భారత్-విస్తార్’తో డిజిటల్ అండ!
భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలను, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) ప్యాకేజీలను ఏఐ సిస్టమ్లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.ఏఐ టూల్ ఎందుకు?ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్లు విత్తన అభివృద్ధి నుంచి సప్లై చైన్ వరకు వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఒకే చోట లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందడం లేదు. భారత్-విస్తార్ ద్వారా ఈ వనరులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అగ్రిటెక్ స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసే భారీ డేటాను ఏఐ విశ్లేషించి రైతులకు అర్థమయ్యేలా వివరిస్తుంది.రైతులకు చేకూరే ప్రయోజనాలుదీని ద్వారా సాధారణ సమాచారం కంటే నిర్దిష్టమైన, ధ్రువీకరించిన శాస్త్రీయ సలహాలు రైతులకు అందనున్నాయి.ఐకార్ శాస్త్రీయ పరిశోధనలను నేరుగా డిజిటల్ రికార్డులతో అనుసంధానించడం ద్వారా పొలంలోని పరిస్థితిని బట్టి సలహాలు అందుతాయి.సంక్లిష్టమైన శాస్త్రీయ డేటాను రైతులకు వారి స్థానిక భాషల్లోనే సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ టూల్ సర్వీసులు అందిస్తుంది.కరువు, వరదలు లేదా తెగుళ్ల దాడుల గురించి అగ్రిస్టాక్ ద్వారా ముందస్తుగా హెచ్చరికలు అందుతాయి.ఇది కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, రుణాలు అందజేయడం, బీమా సేవలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యంఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్ఎస్ఐ), ఏపీఐల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లు కూడా ఈ ప్లాట్ఫారమ్తో అనుసంధానం కావచ్చు. దీనివల్ల మార్కెట్ కనెక్షన్లు మెరుగుపడటమే కాకుండా రైతులకు మరిన్ని వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.డేటా భద్రతకు ప్రాధాన్యంరైతుల డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. డేటాపై పూర్తి హక్కు రైతుకే ఉంటుంది. ఐటీ చట్టం, ఆధార్ చట్టం ప్రకారం ఈ సమాచారం భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ రైతు డేటాను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఆ రైతు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.నిధుల కొరతఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.తొలగింపుల ద్వారా ఎంతంటే..ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.వ్యూహాత్మక మార్పులునిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్వేర్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్లను ఒరాకిల్ కోరుతోంది.భారీ లక్ష్యాలుక్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం
భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఇండియా డిజిటల్ రంగంలో ఇప్పటికే ఆధార్, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్వికసిత్ భారత్ 2047‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్) రంగంలో సంస్కరణలు. -
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
దేశీయంగా ఏజెంటిక్ ఏఐ, స్పెషలైజ్డ్ జెన్ఏఐ నిపుణులకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్–సరఫరా మధ్య 50 శాతం పైగా వ్యత్యాసం ఉండగా, ఆయా ఉద్యోగాల పోస్టింగ్ల ఏటా 35–40 శాతం పెరుగుతోంది. 28,000 జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టు ప్రకారం కంపెనీలు ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐని ప్రయోగాత్మక పరీక్షలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. దీనితో పూర్తి స్థాయి సామర్థ్యాలున్న నిపుణులను నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతీయ ఏజెంటిక్ ఏఐ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఇది 276 మిలియన్ డాలర్లుగా నమోదైంది. సిస్టంలు స్వయంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోగలిగే మరింత అధునాతన కృత్రిమ మేథను ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తున్నారు.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ ఉద్యోగులకు జీతభత్యాలు సగటు స్థాయికంటే 20–28 శాతం అధికంగా ఉంటున్నాయి.70 –75 శాతం జీసీసీలు, భారీ కంపెనీలు అంతర్గతంగా నిర్మాణాత్మక ఏఐ శిక్షణ ప్రోగ్రాంల దన్నుతో 30–35 శాతం అడ్వాన్స్డ్ ఏఐ ఉద్యోగాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం అధునాతన ఏఐ నియామకాల్లో రిమోట్ ఉద్యోగుల వాటా 15–20 శాతం ఉండనుంది.మొత్తం ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వాటా 54 శాతం స్థాయిలో ఉండనుంది.టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్) సంస్థలు తమ ఉత్పత్తుల్లో 68 శాతం ఏజెంటిక్ ఏఐని పొందుపరుస్తున్నాయి.ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ వాటా 70 శాతం పైగా ఉంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారి రిక్రూట్మెంట్ 20 శాతం మేర ఉంటోంది. గవర్నెన్స్, సేఫ్టీ, ప్రోడక్ట్ స్ట్రాటెజీ విభాగాల్లో లీడర్íÙప్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.72 శాతం ఉద్యోగార్హతల్లో టూల్–కాలింగ్, ఆర్కె్రస్టేషన్ మొదలైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 63 శాతం ఉద్యోగాలకు రిట్రీవల్–ఆగ్మెంటెండ్ జనరేషన్ టూల్ సామర్థ్యాలు ఉండాలని కంపెనీలు అడుగుతున్నాయి. లాంగ్గ్రాఫ్, ఆటోజెన్, క్రూఏఐ నైపుణ్యాలకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది.మూడేళ్ల క్రితం కనిపించని చాలా మటుకు ఉద్యోగాలకు ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్ ఇంజినీర్లు, ఏజెంట్ బిహేవియర్ అనలిస్టులు, ఏజెంట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్టులు, వెక్టార్ డేటాబేస్ ఆర్కిటెక్టులు, ఏజెంట్ లైఫ్సైకిల్ మేనేజర్లు, ఏజెంటిక్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.భారత్లో టెక్నాలజీ నిపుణులకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేది కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, కెరియర్కి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రాంతాలవారీగా చూస్తే ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో బెంగళూరు, హైదరాబాద్ల వాటా దాదాపు 62 శాతంగా ఉంది. గవర్నెన్స్, వినియోగం, వర్క్ఫ్లో నిర్వహణలకు కేంద్రాలుగా ఎన్సీఆర్, పుణె, చెన్నై ఎదుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం హైరింగ్లో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, అహ్మదాబాద్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 10 శాతంగా ఉంది. -
ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు
సుదీర్ఘ కాలం పాటు మందగమనంలో ఉన్న ఐటీ రంగంలో డిస్క్రెషనరీ టెక్నాలజీ ఖర్చులు (ఐచ్చికంగా ఆలోచించి అవసరాలకు మాత్రమే చేసే ఖర్చు) మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, గ్లోబల్ టెక్ కంపెనీలు ఇప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం అదనపు నిధులను వెచ్చించే కంటే అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా నిధులను మళ్లించడంపైనే సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.అంతర్గత పొదుపుతోనే కొత్త ప్రాజెక్టులుఎవరెస్ట్ గ్రూప్ సీఈఓ జిమిత్ అరోరా విశ్లేషణ ప్రకారం, ప్రతి రంగంలోని క్లయింట్లు తాము పూర్తిస్థాయి టెక్నాలజీ కంపెనీలుగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అయితే, టెక్నాలజీ బడ్జెట్ల వృద్ధి కేవలం తక్కువగానే (లో-టు-మిడ్ సింగిల్ డిజిట్) ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ కొత్త పెట్టుబడుల ద్వారా కాకుండా రోజువారీ కార్యకలాపాల (బిజినెస్ యాజ్ యూజువల్ - BAU) ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా జరుగుతోంది. ఖర్చులను కుదించి ఆ నిధులను అత్యాధునిక సాంకేతికత వైపు మళ్లించడంపైనే కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.ఏఐ డీల్స్తో జోష్ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలిల్ పరేఖ్ క్యూ3 ఫలితాల సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, యుటిలిటీస్ రంగాల్లో డిస్క్రెషనరీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీల్స్పై క్లయింట్లు ఆసక్తి చూపడం ఐటీ రంగానికి కలిసొస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, స్థిరమైన డిమాండ్ వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంపై ఆశలు పెరుగుతున్నాయి.అప్రమత్తత అవసరం..పరిస్థితి మెరుగుపడుతున్నా అప్రమత్తత అవసరమని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వేతనాల పెరుగుదల వంటి చట్టబద్ధమైన ఖర్చుల వల్ల మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చని, అందుకే సంస్థలు నియంత్రణాత్మక వ్యయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పూర్తిస్థాయిలో డిస్క్రెషనరీ ఖర్చులు ఊపందుకుంటాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు -
ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
అమెరికా ఓవల్ ఆఫీస్లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.ఆరంభంలో సంకోచం.. ఆపై..ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలుద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.అమెరికా కంటే ప్రపంచమే ముందంజట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..ఎస్ అండ్ పీ 500: +16%నాస్డాక్: +20%డౌ జోన్స్: +14%ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.ఏఐ బూమ్ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.అసలైన పరీక్ష ముందే?ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.. -
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు.. -
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం
ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్వర్డ్లు, హిస్టరీ, బుక్మార్క్లను వదులుకుని కొత్త బ్రౌజర్కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా? -
ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం
భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఒకవైపు కృత్రిమ మేధ(ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంటే, మరోవైపు అదే వేగంతో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’(Layoffs.fyi) తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 551 టెక్ కంపెనీల నుంచి 1,22,549 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్ని వారాలుగా ఈ వేగం కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తున్నా, ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది.ప్రముఖ కంపెనీలు ఇలా..అమెజాన్.. అక్టోబర్లో కంపెనీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉద్యోగాల కోత విధిస్తూ 14,000 కొలువులను తొలగించింది.మైక్రోసాఫ్ట్.. 2025 నాటికి మొత్తం 15,000 మందిని తొలగించే దిశగా అడుగులు వేసింది. జులైలోనే దాదాపు 9,000 మందిని పంపించివేసింది.ఇంటెల్.. చిప్ తయారీలో వెనుకబడటం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఏకంగా మొత్తం సిబ్బందిలో 15% (సుమారు 25,000 మంది) తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.సేల్స్ ఫోర్స్.. ఏఐ సహాయంతో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తగ్గించినట్లు సీఈఓ మార్క్ బెనియోఫ్ ధ్రువీకరించారు.టీసీఎస్.. భారత్లో దాదాపు 12,000 మందిని (మొత్తం ఉద్యోగుల్లో 2%) తొలగించి ఐటీ రంగంలో ఆందోళన కలిగించింది. అయితే ఇది ఏఐ వల్ల కాదని, నైపుణ్యాల అసమతుల్యత వల్లేనని సంస్థ స్పష్టం చేసింది.మెటా (600 మంది), గూగుల్ (100+), వెరిజోన్ (13,000), హెచ్పీ (4,000-6,000 మంది) వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ఇచ్చాయి.లేఆఫ్స్కు దారితీసిన కారణాలుచాలా కంపెనీలు ఇప్పుడు ‘ఏఐ ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గతంలో వందలాది మంది చేసే పనులను (డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బేసిక్ కోడింగ్..) ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ ఖర్చుతో వేగంగా చేస్తున్నాయి. కంపెనీలు తమ బడ్జెట్ను మానవ వనరుల నుంచి ఏఐ మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి.ద్రవ్యోల్బణం పెరగడం, సుంకాల భారం పెరగడంతో కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడంపై యాజమాన్యాలు దృష్టి పెట్టాయి.కరోనా సమయంలో డిజిటల్ సేవల కోసం డిమాండ్ పెరగడంతో టెక్ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థితికి రావడంతో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగిస్తున్నాయి.పాత ప్రాజెక్టులను మూసివేసి కేవలం క్లౌడ్, సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ వంటి భవిష్యత్తు అవసరాల మీదనే కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల పాత నైపుణ్యాలు కలిగిన వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు.టెక్ రంగం ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉంది. ఉద్యోగాల కోత ఆందోళన కలిగించే విషయమే అయినా ఏఐ రంగంలో కొత్త రకమైన ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సిబ్బంది తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే.. -
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా? -
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం -
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!


