
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులు భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ చెల్లింపులదే ఆధిపత్యం. ముఖ్యంగా టీనేజర్లు, కుర్రకారు ఎక్కువగా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దాదాపు అందరికీ యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసు. కానీ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. ఆన్లైన్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకునే మోసాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ప్రకారం, 15-29 సంవత్సరాల వయసువారిలో దాదాపు 99.5 శాతం మందికి యూపీఐ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఇది డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించడాన్ని హైలైట్ చేస్తున్నప్పటికీ, స్కామర్లు సైతం తమ వ్యూహాలను అమాయక యూజర్లను మోసం చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
యూపీఐ లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
మోసాన్ని నివారించడానికి వినియోగదారులు ఈ భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలని అధికారులు, ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.యూపీఐ పిన్ షేర్ చేయకండి: సైబర్ నేరగాళ్లు తరచూ బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ వినియోగదారులను మోసం చేస్తుంటారు.
లావాదేవీ లింక్లను సరిచూసుకోండి: స్కామర్లు చట్టబద్ధమైన ప్లాట్ ఫారమ్ లను అనుకరించే నకిలీ యూపీఐ చెల్లింపు లింక్ లను పంపవచ్చు. లావాదేవీలను ఆమోదించడానికి ముందు ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేయండి.
పేమెంట్ రిక్వెస్ట్ల పట్ల జాగ్రత్త: తెలియని వ్యక్తుల నుంచి పేమెంట్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు వాటికి స్పందించే ముందు సోర్స్ను చెక్ చేసుకోండి.
- అధికారిక యాప్లు, ప్లాట్ ఫామ్ ఉపయోగించొద్దు: భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి ధ్రువీకరించిన బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరిగేలా చూసుకోండి.
- అకౌంట్లో ఏం జరుగుతోందో చూసుకోండి: యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయడం అనధికార చెల్లింపులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.