టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు | Tata Motors to Hike Commercial Vehicle Prices from April 1 | Sakshi
Sakshi News home page

టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు

Mar 19 2026 3:29 PM | Updated on Mar 19 2026 4:48 PM

Tata Motors to Hike Commercial Vehicle Prices from April 1

న్యూడిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని కమర్షియల్‌ వాహనాలపై 1.50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు పరిధి మారుతుందని పేర్కొంది. 

ముడి సరుకుల ధరలు, ఇతర ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు చేపడుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 180 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్, దేశంలో యుటిలిటీ వాహనాలు, పిక్‌అప్‌ వాహనాలు, ట్రక్కులు, బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement