రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక
కశింకోట : రాష్ట్ర స్థాయి సైక్లింగ్ రేస్ పోటీలకు స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి పీతల కిషోర్ ఎంపికయ్యాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైక్లింగ్ రేస్ పోటీలు మంగళవారం అనకాపల్లిలో నిర్వహించారు. ఈ పోటీలో కిషోర్ రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికై నట్టు హెచ్ఎం ఎన్.జె.వి ప్రసాద్ తెలిపారు. ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు చెప్పారు. కిషోర్ ఎంపిక పట్ల ఆయనతోపాటు పీడీలు వి.ప్రభాకరరావు, పి. కమల, విద్యా కమిటీ ప్రతినిధుల నక్కా నాగమణి, దుర్గ అప్పారావు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.


