Anakapalle District Latest News
-
సబ్బవరంలో భారీగా గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద కారులో పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పిన్నింటి రమణతో కలిసి డీఎస్పీ వళ్లెం విష్ణుస్వరూప్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో ఏజెన్సీ ప్రాంతం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.18.19 లక్షల విలువ చేసే 363.8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ సింహాచలం తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న కారుతో పాటు పైలెట్ వాహనంగా వస్తున్న మరో కారును తనిఖీ చేసి, గంజాయిని పట్టుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారైనట్లు తెలిపారు. వారి నుంచి రూ.50 వేలు నగదు, 5 సెల్ఫోన్లతో కలిపి ఈ కేసులో మొత్తం రూ.57.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏవోబీ బోర్డర్లో కోనుగోలుచేసి చింతపల్లిలో లోడ్చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి తరలింపులో వినియోగించిన వాహనాలు తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయని, వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఏఎస్ఆర్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, ఒడిశాకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఏ1గా సామిరెడ్డి విజయ్(31), ఏ2 వంతల హరీష్బాబు(30), ఏ3 మాడబత్తుల అరుణ్కుమార్(38), ఏ4 సాగర్ శివాజీ గోపనీ(32), ఏ5 కొర్రా మహేష్బాబు(32), ఏ6 ఎన్.రమణ(40), ఏ7గా సరమంద అనిల్కుమార్(25)లపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పిన్నింటి రమణ, ఎస్ఐలు సింహాచలం, టి.దివ్య పాల్గొన్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తుండగా.. రూ.18.19 లక్షల విలువైన 363.8 కిలోల గంజాయి స్వాధీనం 2 కార్లు, ఐదు మొబైళ్లు, రూ.50 వేలు నగదు సీజ్ ఏడుగురి అరెస్ట్, ముగ్గురు పరార్ -
రసాయన పరిశ్రమల్లో రక్షణ వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ
సాక్షి, అనకాపల్లి : పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా కర్మాగారాల లోపల, వెలుపల కూడా రక్షణ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ చైర్మన్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్యాక్టరీలలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థల గూర్చి సమీక్ష చేశారు. ఫ్యాక్టరీ లోపల, వెలుపల కూడా రసాయనాలు లీకేజీలను గుర్తించే సెన్సార్లను అమర్చాలని తెలిపారు. ఫ్యాక్టరీలలో అమర్చిన రక్షణ పరికరాలకు, జాతీయ సేఫ్టీ కౌన్సిల్ ఆమోదం ఉండాలని తెలిపారు. ఫ్యాక్టరీ వెలుపల ప్రమాదాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థల నివేదికలను 20 రోజుల్లో అందజేయాలని తెలిపారు. కంపెనీలలో శిక్షణ పొందిన కార్మికులను నియమించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గల 12 రసాయన కర్మాగారాల్లో మాక్ డ్రిల్ను కూడా నిర్వహించాలని సూచించారు. రసాయనాలను రవాణా చేసే వాహనాలకు కూడా రసాయనాల లీకేజీలను గుర్తించే సెన్సార్లు అమర్చాలని తెలిపారు. సమావేశంలో రెవిన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషా, ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టరు జె. శివశంకర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ జి.వి.ఎస్.ఎస్. నారాయణ, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజారావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ -
ఆటోలో నగల బ్యాగ్ మరిచిపోయిన మహిళ
● నిజాయితీగా తిరిగి అప్పగించిన డ్రైవర్పోలీసుల సమక్షంలో బాధితురాలికి అప్పగిస్తున్న డ్రైవర్ నక్కపల్లి : నక్కపల్లికి చెందిన ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బంగారం బ్యాగ్ను డ్రైవర్ నిజాయితీగా తిరిగి అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. సీఐ కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శిరీష అనే మహిళ తుని వెళ్లేందుకు నక్కపల్లిలో ఆటో ఎక్కింది. తనతో తీసుకెళ్తున్న బ్యాగ్ను ఆటోలో మర్చిపోయింది. ఆందులో సుమారు రూ.7లక్షలు విలువైన ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఉన్నాయి. దీంతో ఆమె నక్కపల్లి పోలీస్స్టేషన్నో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసేలోపు తునికి చెందిన ఆటోడ్రైవర్ గెడ్డమూరి అంజి నిజాయితీగా నక్కపల్లి మహిళ తన ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ ను, అందులో ఉన్న బంగారాన్ని నక్కపల్లి పోలీస్స్టేషన్కు తీసుకు వచ్చాడు. పోలీసుల సమక్షంలో బాధితురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి అతనికి కొంత నగదు ను కానుకగా అందజేశారు. సీఐ కుమార స్వామి ఆటోడ్రైవర్ను ప్రత్యేకంగా అభినందించారు. 28న తపాలా అదాలత్ మహారాణిపేట: విశాఖ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 28న 117వ తపాలా అదాలత్ నిర్వహిస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ అదాలత్ జరుగుతుందని తపాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈనెల 24వ తేదీలోగా పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు. -
విరాళ సొమ్ము దోచుకోవాల్సిన అవసరం లేదు
● వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయ నిర్మాణం ● స్పీకర్ ఆరోపణలను తిప్పికొట్టిన మాజీ ఎమ్మెల్యే గణేష్నర్సీపట్నం : నూకాలమ్మ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన నిధులను దోచుకోవాల్సిన అవసరం తనకు లేదని, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడి సొమ్ము తినాలని ఎవరూ అనుకోరన్న విషయాన్ని స్పీకర్ గ్రహించాలన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో కంట్రిబ్యూషన్ కింద రూ.10 లక్షలు చెల్లించారు. ఎన్నికలు మూడు నెలలు ఉండగా ఆలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అప్పలనాయుడు 2019 డిసెంబరులో నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.40 లక్షల వ్యయంతో నూతన గుడిని నిర్మిస్తే తానే కట్టానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 లక్షలు, కంట్రిబ్యూషన్ రూ.10 లక్షలు మొత్తం రూ.50 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ పనులు అసంపూర్తిగా ఉండడంతో నూకాలమ్మ ఆలయానికి సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణను ఆర్ధిక సాయం కోరడం జరిగిందన్నారు. సీఎంఆర్ అధినేత అమ్మవారి ఆలయానికి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. సీఎంఆర్ సంస్థ వ్యాపారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలకు విరాళాలు ద్వారా తోడ్పాటునందించడంతో పాటు వారి సంస్థలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చిన విరాళం నిధులను దోచుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. సీఎంఆర్ సంస్థ ప్రకటించిన రూ.10 లక్షల విరాళానికి సంబంధించి లావాదేవీలన్ని సీఎంఆర్ సంస్థ మేనేజర్, నూకాలమ్మ టెంపుల్ చైర్మన్ ధనిమిరెడ్డి నాగు మధ్య జరిగాయన్నారు. ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్నది పక్కాగా వివరాలు ఉన్నాయన్నారు. సీఎంఆర్ సంస్థ, చైర్మన్ మధ్య లావాదేవీలు జరిగితే తనపై బురదజల్లడం స్పీకర్కు తగదన్నారు. నూకాలమ్మ ఆలయంలో నూతన విగ్రహం ఏర్పాటుకు ఎంత అవుతుందని శిల్పిని సంప్రదిస్తే రూ.లక్షా 50 వేలు అవుతుందన్నారు. అమ్మవారి విగ్రహం కోసం తాను స్వయంగా రూ.లక్ష విరాళంగా ఇచ్చి విగ్రహం తయారు చేయించానన్నారు. విరాళాలను అకౌంట్కు ఎలా జమ చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పిందే నిజమైతే ఇదే సీఎంఆర్ అధినేత సుమారు రూ.20 లక్షల విరాళంతో నర్సీపట్నం శ్మశాన వాటికను సుందరీకరణ చేశారు. ఆ నిధులను మున్సిపాలిటీ అకౌంట్కు ఎందుకు జమ చేయలేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ పాల్గొన్నారు. -
సీఐపీఈటీ సహకారంతో ఎన్టీపీసీలో ఉపాధికి శిక్షణ
పరవాడ: విజయవాడలోని సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం కల్పిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఈడీ సమీర్శర్మ కోరారు. విజయవాడలోని సీఐపీఈటీని ఈడీ సమీర్శర్మ, సంస్థ అధికారులు మంగళవారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కలిసి, వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీ సమీర్ శర్మ మాట్లాడుతూ సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ శతశాతం ఉద్యోగ నియామక హామీపై మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోల్డింగ్లో ఆరు నెలల శిక్షణ అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్లలో 120 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించామన్నారు. ప్రస్తుతం మరో 60 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. -
మూటలో మహిళ శరీర భాగాలు
ఎవరు అంతమొందించారో..కశింకోట మండలం బయ్యవరంలో సంచలనంకశింకోట: ఆ మహిళకు సుమారు 35 ఏళ్ల వయసు ఉండవచ్చు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఆమె వివాహిత అని చెప్పకనే చెబుతున్నాయి.. కొద్ది గంటల క్రితమే హత్య జరిగి ఉండవచ్చని వైద్యులు ధ్రువీకరించారు.. కశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభిప్రాయం ప్రకారం.. సోమవారం రాత్రి మహిళను హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా కోసి మూటగట్టి సోమవారం రాత్రి తెచ్చి ఇక్కడ పడేసి ఉంటారు. సీఐ అల్లు స్వామినాయుడు తదితర సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని ఆమె సందర్శించారు. మృతురాలి శరీర భాగాలపై వస్త్రాలు గాని, మరే ఆధారాలుగాని లేవు. గాజులు, మట్టెలు మాత్రం దొరికాయి. మిగిలిన మృతదేహ భాగం లభ్యమయితే తప్ప ఎవరో గుర్తించే అవకాశం లేదు. అయితే కాలి భాగంలో ఒక పుట్టు మచ్చ ఉంది. మిగిలిన శరీర భాగాన్ని మరోచోట పడేయడం గాని, పూడ్చి వేయడం గాని చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు జాగిలం యలమంచిలి మార్గం వైపు వెళ్లింది. మృతదేహం శరీర భాగాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు మహిళ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. సీసీ టీవీ పుటేజి, స్థానికుల సమాచారాన్ని విశ్లేషించి నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఏ విధమైన సమాచారంగాని, అద్యశ్యమైన మహిళల వివరాలు గాని తెలిసిన వారు తక్షణమే పోలీసు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. కశింకోట సీఐ అల్లు స్వామినాయుడు సెల్ నెంబర్ 9440796088కు గాని, 100, 112 నెంబర్లకు గాని సమాచారాన్ని తెలియజేయాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు విజయకుమార్, అశోక్కుమార్, కోటేశ్వరరావు, పైడపు నాయుడు, అప్పలరాజు, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. -
రైతన్న గుండె మండింది..
దేవరాపల్లి: విత్తు నాటాడు.. నీరు పోశాడు.. బాగా ఎదగాలని ఎరువులు వేశాడు.. పండిన చెరకు గడలను చూసి మురిసిపోయాడు.. లాభాల తీపి ఊహించుకొని ఆనందపడ్డాడు.. కానీ పెట్టుబడులకు సరిపడా గిట్టుబాటు ధర లేకపోవడం, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో సక్రమంగా క్రషింగ్ జరపకపోవడంతో కలత చెందిన రైతు తన పంటకు తానే నిప్పంటించుకున్నాడు. దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు కన్నీటి కథ ఇది. కె.కోటపాడు మండలం మేడిచెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో వెంకటరావు 80 సెంట్ల విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తున్నాడు. పంట కోత దశకు చేరుకున్న తరుణంలో గిట్టుబాటు ధర లేకపోగా, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో తరచూ క్రషింగ్ నిలిచిపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ పంటను ఫ్యాక్టరీకి తరలించినా సకాలంలో పేమెంట్లు రాక.. కనీసం కోత కూలి, రవాణా చార్జీలు చెల్లించే పరిస్థితి లేదని భావించిన రైతు గత్యంతరం లేక బాధతో పంటకు నిప్పంటించాడు. గతంలో 50 టన్నుల వరకు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసేవాడినని, అప్పట్లో ప్రతి 15 రోజులకోసారి పేమెంట్లు ఇచ్చేవారని వెంకటరావు తెలిపాడు. ప్రస్తుతం చెరకుతో రోజుల తరబడి కాటా, ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీంతో చెరకు ఎండిపోయి బరువు తగ్గి మరింత నష్టం వాటిల్లుతుందని, సాగు చేసిన పంటకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో నిప్పు పెట్టానని చెప్పాడు. ఈ చర్యతోనైనా కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలపై కనువిప్పు కలగాలన్నాడు. కలెక్టర్ ఆదేశాలతో జేసీ విచారణ రైతు స్వయానా చెరకు తోటకు నిప్పు పెట్టిన ఘటనపై కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఆమె ఆదేశాలతో జేసీ జాహ్నవి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఎండీ, రెవెన్యూ అధికార్లతో కలిసి సంఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతు వెంకటరావుతో మాట్లాడారు. చెరకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ఫ్యాక్టరీ సక్రమంగా క్రషింగ్ జరపక పోవడం పట్ల ఆవేదనతో తానే పంటకు నిప్పు పెట్టినట్లు రైతు తెలియజేశారు. వెంటనే రైతుకు జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికార్లను జేసీ ఆదేశించారు. పంటను వెంటనే ఫ్యాక్టరీకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ ఎండీని ఆదేశించారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు మొత్తం తీసుకోవడం జరుగుతుందని, 2600 ఎకరాలలో చెరకు క్రషింగ్ రెండు వారాలలో పూర్తి చేస్తామన్నారు. చెరకు బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. జేసీ వెంట దేవరాపల్లి, కె.కోటపాడు రెవెన్యూ అధికార్లు, స్థానిక ఏవో వై. కాంతమ్మ, కొత్తపెంట సర్పంచ్ రొంగలి వెంకటరావు తదితర్లు ఉన్నారు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే చెరకు రైతుకు ఈ దుస్థితి : సీపీఎం నేత వెంకన్న కొత్తపెంటలో చెరకు రైతు తన పంటకు నిప్పు అంటించుకున్నారని విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత రైతును ఓదార్చారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పిన ఎంపీ సీఎం రమేష్, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు గెలుపొందాక కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. ప్రధాన మోడి వద్ద తనకు పలుకుబడి ఉందని ఊదరగొట్టిన ఎంపీ సీఎం రమేష్ ఫ్యాక్టరీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
సైక్లోథాన్కు ఘనస్వాగతం
యలమంచిలి రూరల్: సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం 2025 సందర్భంగా తీర ప్రాంత ‘సైక్లోథాన్–2025’ మంగళవారం యలమంచిలి చేరుకుంది. తీరప్రాంత భద్రత గురించి అవగాహన పెంపొందించడం, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం పట్టణానికి చేరుకున్న సైక్లోథాన్కు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈనెల 31వ తేదీన కన్యాకుమారి చేరుకోవడంతో సైక్లోథాన్ 2025 ముగుస్తుంది. కార్యక్రమంలో కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్, డిప్యూటీ కమాండెంట్ వికాష్ కుమార్ సాహు, సహాయ కమాండెంట్ అమిత్ కుమార్, ఇన్స్పెక్టర్ కె.కుమార్, మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, తహసీల్దార్ కె.వరహాలు, పట్టణ ప్రణాళికాధికారి వై.శ్రీలక్ష్మి, పట్టణ ఎస్సై కె.సావిత్రి, పీడీ వై.పోలిరెడ్డి, వీరభద్రరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
లైన్ ఇన్స్పెక్టర్కు ఘనసత్కారం
మాణిక్యాలరావు దంపతులను సత్కరిస్తున్న డీఈ, ఇతర సిబ్బంది మాకవరపాలెం : జాతీయ అవార్డు అందుకున్న విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ బొంతు మాణిక్యాలరావును ఘనంగా సత్కరించారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్లో రెండున్నరేళ్లుగా లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మాణిక్యాలరావు జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 4న ఢిల్లీలో కేంద్ర విద్యుత్శాఖ మంత్రి చేతుల మీదుగా మాణిక్యాలరావు అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి డివిజన్ పరిధిలోని విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది సబ్ స్టేషన్ వద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు దంపతులను నర్సీపట్నం డీఈ రామకృష్ణ, ఏడి త్రినాథరావు, స్థానిక ఏఈ బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిద మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్వారీ లారీలు
●పడగ విప్పిన మైనింగ్ మాఫియాకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత క్వారీ లారీలు పెరిగాయి. విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలంటే, ప్రభుత్వ ఆస్తులంటే లెక్కలేని రీతిలో ఏది ఎదురుపడితే దానిని ఢీకొట్టి వెళ్లిపోతున్నాయి. పరిమితికి మించి అధిక లోడ్తో వెళ్లడమే ఇందుకు కారణం. రాంబిల్లి మండలంలో నేవల్ పనుల కోసం ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద పెద్ద బండరాళ్లను, నల్లరాయిని, రోడ్డు మెటల్ను పెద్ద స్థాయిలో రవాణా చేస్తున్నారు. దీని వెనుక ఓ బడా ప్రజాప్రతినిధి ఉండడమే నిర్వాహకులు చెలరేగిపోవడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునగపాక మెయిన్రోడ్డులో మితిమీరిన వేగంతో వచ్చిన క్వారీ లారీ ఢీకొని కొద్ది రోజుల క్రితం మాడా కన్నారావు అనే ఎల్ఐసీ ఏజెంట్ మృతి చెందారు. సోమవారం అనకాపల్లి టౌన్లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి గడ్డర్ను క్వారీ లారీ ఢీకొనడంతో విరిగిపోయింది. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. కాటేస్తున్న ● కూటమి ప్రభుత్వంలో పెరిగిన మైనింగ్ అక్రమ తవ్వకాలు ● ప్రజా ప్రతినిధుల అండతో చెలరేగిపోతున్న క్వారీ యాజమాన్యాలు ● పరిమితి మించి అధిక లోడ్తోనే ప్రమాదాలు ● రోజుకు 300 –350 క్వారీ లారీల రాకపోకలు ● కమిషన్ కోసం అతి వేగంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ● మొన్న మునగపాకలో క్వారీ లారీ ఢీకొని ఎల్ఐసీ ఏజెంట్ మృతి ● నిన్న క్వారీ లారీ ఢీకొనడంతో దెబ్బతిన్న రైల్వే గడ్డర్ సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో మైనింగ్ మాఫియా పెరిగింది. కొండలను పిండి చేసి నల్లరాయిని దర్జాగా అమ్ముకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనూ అనుమతులకు మించి, పరిధి దాటి రాయి తవ్వకాలు చేపట్టడమే కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని తరలిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను, నల్లరాయిని, రోడ్డు మెటల్ను రాంబిల్లి మండలంలో నేవీ ప్రత్యామ్నాయ ఆపరేషన్ బేస్కు రవాణా చేస్తున్నారు. సముద్ర తీరంలో జెట్టీ నిర్మాణానికి, బ్రేక్ వాటర్స్ కోసం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు పెద్ద పరిమాణంలో వుండే బండరాళ్ల అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా మైనింగ్ అధికారుల సహకారంతో అనకాపల్లి, రోలుగుంట, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో రాయి క్వారీల నిర్వాహకులు నేవల్ బేస్ పనులకు బండరాళ్ల సరఫరా కోసం సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. చాలా వరకు అనుమతులు లేకుండానే ఇవి జరిగిపోయాయి. ఆయా మండలాల్లోని క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లలో పెద్ద పెద్ద బండరాళ్లను తరలిస్తున్నారు. అనుమతి లేనివే ఎక్కువ జిల్లాలో గనుల శాఖ అనుమతి వున్న రాయి/కంకర క్వారీలు 60 మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్క అనకాపల్లి డివిజన్లోనే ఎటువంటి అనుమతులు లేకుండా 150కి పైగా క్వారీలు నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, మాకవరం, ఊడేరు, కుంచంగి, కూండ్రం పరిసరాల్లో అనుమతి లేని రాయి క్వారీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం మండలాల్లో కూడా క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు, లారీల్లో బండరాళ్లను తరలిస్తున్నారు. ఒకటి, రెండు ప్రముఖ సంస్థల పేరున ఉన్న లీజు పత్రాల ఆధారంగా నకిలీ వేబిల్లులతో అనధికార క్వారీల నుంచి కంకర, నల్లరాయి రవాణా చేస్తున్నారు. గనులు, రవాణా, పోలీసు శాఖల తనిఖీలు నామమాత్రం కావడం, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా వుండడంతో అక్రమ క్వారీల నిర్వాహకుల వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు లారీల చందంగా సాగిపోతున్నది. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. గనుల శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు అప్పుడప్పుడు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకొని మొక్కుబడిగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారు. అక్రమంగా తరలిపోతున్న దానిలో అధికారులు పట్టుకుంటున్నది పట్టుమని పది శాతం కూడా ఉండడంలేదు. క్వారీ లారీలను అడ్డుకున్న రైతులు, స్థానిక ప్రజలు రోజు రోజుకూ క్వారీ యాజమాన్యాలకు, స్థానిక రైతుల మధ్య వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి. మా మాట వినండి, మాకు నష్టం చేకూర్చే క్యారీలు ఆపండని బాధిత రైతులు కోరుతున్నా.. మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు అండతో క్వారీ యాజమాన్యాలు చెలరేగిపోతున్నారు. దీంతో రెండు రోజుల క్రితమే క్వారీ లారీలను శరభవరం, రాజన్నపేట, గొల్లపేట, వడ్డిపె గ్రామాల్లో రైతులు అడ్డుకున్నారు. ఆందోళనలు కూడా చేశారు. వారం రోజుల క్రితం వరకూ సుమారు 25 రోజుల పాటు నల్లరాయి రవాణా ఆపిన యజమాన్యం మరలా ఈ రవాణా కొనసాగించింది. దీంతో పై గ్రామాలవారు క్వారీ నిర్వహణ ప్రాంతం సమీపంలో రవాణా ఆపాలి, కొండలు పేల్చడం ఆపాలంటూ యాజమాన్యాన్ని కోరారు. వినకపోవడంతో అడ్డుకున్నారు. తమకు కూటమి ప్రభుత్వ నేతలు అండగా ఉన్నారని బహిరంగంగా చెబుతున్నారు. ఈ నేపథ్యలో శరభవరం గ్రామానికి చెందిన జలుమూరి సత్తిబాబు అనే రైతు మానసిక వ్యధతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అదేవిధంగా రోలుగుంట నుంచి మాకవరపాలెంలో ఆన్రాక్ కంపెనీకి వచ్చే లోడ్ లారీలను స్థానికులు అడ్డుకున్నారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి. కూటమి నేతల అక్రమ వసూళ్లు రోజుకు 1000 ట్రిప్లు.. అనకాపల్లి రూరల్ పరిధిలో మార్టూరు, మామిడపాలెం, మావవరం, బౌలువాడ, కుంచంగి, వేట జంగాలపాలెం, వెంకుపాలెం గ్రామాల నుంచి రాంబిల్లి మండలంలో నావెల్ బేస్ ప్రాజెక్టుకు బండరాళ్లు సరఫరా అవుతున్నాయి. అనకాపల్లి రూరల్ ప్రాంతంలో మాకవరం, మామిడిపాలెం, మార్టూరు గ్రామాల్లో, బౌలువాడ, కుంచంగి, వేటజంగాలపాలెం, వెంకుపాలెం గ్రామాల సమీపంలో ఉన్న క్వారీల నుంచి రవాణా చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రావికమతం, కాకినాడ జిల్లాలో రౌతులపూడి, కోటనందూరు మండలాల నుంచి క్వారీ లారీల్లో రవాణా జరుగుతున్నాయి. రోజుకు సుమారుగా 300 నుంచి 350 వరకూ క్వారీ లారీల ద్వారా 1000 ట్రిప్లు వెళుతున్నాయి. రోజుకు సుమారు 12,000 నుంచి 13,000 టన్నుల స్టోన్ రవాణా జరుగుతోంది. మైనింగ్ పేరిట కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు లక్షలు ఆర్జిస్తున్నారు. టన్నుకు రూ.30 చొప్పున నెలకు సగటున రూ.కోటి 8 లక్షల అక్రమ వసూళ్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టు పరంగా చూస్తే ఒక లారీ రోజుకు రెండు నుంచి మూడు ట్రిప్పులు వేస్తుంది. రెండు లోడ్లకు 80 టన్నులు, మూడు లోడ్లు అయితే 120 టన్నులు రవాణా జరుగుతుంది. ఒక టన్నుకు రూ.500 చొప్పున నెలకు రూ.12 లక్షలు వసూలు చేస్తారు. 300 నుంచి 350 లారీలకు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్లు వసూలవువుతాయి. కూటమి ప్రజాప్రతినిధులైన స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఈ దందా నడిపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే అధిక లోడ్తో రవాణా చేసినా .. ప్రమాదాలు జరిగినా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు ఉండడం లేదు. అక్రమ మైనింగ్ దందాలన్నీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జి ప్రమాదానికి ఆయనే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాథం నేతృత్వంలోని బృందం సభ్యులు సోమవారం విమర్శించిన విషయం తెలిసిందే. -
తాండవ కాలువల అభివృద్ధికి భూమిపూజ
నాతవరం: ఖరీఫ్ సీజన్లో తాండవ రిజర్వాయరు నీరు శివారు ఆయకట్టుకు అందించాలంటే కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తేనే సాధ్య పడుతుందని ప్రాజెక్టు డీఈ ఆనురాధ అన్నారు, తాండవ ఆయకట్టు పరిధిలో నాతవరం నర్సీపట్నం మండలాల మధ్య బలిఘట్టం మేజరు కాలువను అభివృద్ధికి రూ.11.70 లక్షలతో మంగళవారం భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ తాండవ ఆయకట్టు పరిధిలో కాలువలు అభివృద్ధి చేసేందుకు 18పనులు రూ.2.10 కోట్లతో టెండర్లు ఖరారు చేశామన్నారు. వాటిలో ప్రస్తుతం కొన్ని పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మిగతా పనులు కూడా త్వరలో ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ జోగుబాబు, తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ జేఈ శ్యామ్కుమార్, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. -
ఇందిరా మార్కెట్లో చోరీ
నర్సీపట్నం : మున్సిపాలిటీ ఇందిరా మార్కెట్లోని శ్రీనివాస్ ట్రేడింగ్ కిరాణా దుకాణంలో ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు పైకప్పు సిమెంట్ రేకును కట్ చేసి లోపలికి ప్రవేశించి కిరాణా సామాన్లతో పాటు కౌంటర్లోని కొంత నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారు. షాపు యజమాని అంజూరి శ్రీనివాసరావు ఉదయం షాపు తెరిచి చూసేసరికి పైకప్పు రంధ్రం చేసి ఉండడంతో షాపులోని ఆయిల్ డబ్బాలు, సబ్బులు, కిరాణా సామాన్లు పట్టుకుపోవడాన్ని గుర్తించి లబోదిబోమన్నాడు. మొత్తం కిరాణా సామాన్లు, నగదు కలిపి రూ.లక్ష వరకు చోరీ జరిగిందని షాపు యజమానికి తెలిపాడు. రెండు నెలల కాలంలో వరుసగా మార్కెట్లో నాలుగు దొంగతనాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చోరీలను ఆరికట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. చోరీపై టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కూటమి కు‘తంత్రం’
● మేయర్ పీఠం కోసం కుయుక్తులు ● రంగంలోకి దిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ● కార్పొరేటర్కు రూ.25 లక్షల చొప్పున బేరం ● ససేమిరా అంటున్న వారికి ఎక్కువ ఆఫర్లు ● లొంగని వారికి బెదిరింపులు డాబాగార్డెన్స్ (విశాఖ): విశాఖలో కూటమి కుట్రలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో తెర వెనుక అప్రజాస్వామిక ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కోట్లాది రూపాయలు సిద్ధం చేశారు. ఒక్కొక్క కార్పొరేటర్కు ఏకంగా రూ.25 లక్షలు వెలకట్టి, వారిని కొనుగోలు చేసేందుకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం. కొందరికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ, మరికొందరి వ్యాపారాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరైనా లొంగకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా అప్రజాస్వామిక విధానాలను అవలంబించి స్థానిక సంస్థలను చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు విశాఖ నగర పీఠాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు పన్నుతోంది. గ్రేటర్లో బలం లేకపోయినా.. గ్రేటర్లో కూటమికి సంఖ్యా బలం లేదు. మహా విశాఖ నగరపాలక సంస్థలోని 98 వార్డులకు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం 19వ వార్డు మినహాయిస్తే 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైఎస్సార్ సీపీ 58, తెలుగుదేశం 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, భాజపాకు ఒక్కొక్కరు, నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు గెలుపొందారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను నయానో భయానో తమకు మద్దతు తెలిపేలా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతున్నారు. ఇందుకోసం అవసరమైతే క్యాంపు రాజకీయాలకు కూడా సిద్ధమవుతున్నారు. కూటమిలో చేరితే రూ.25 లక్షలు ఇస్తామని ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వార్డుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తాం.. వచ్చే ఎన్నికల్లో సీటు మీదే.. ఇలా పలు విధాలుగా లొంగదీసుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. లొంగని కార్పొరేటర్లకు బెదిరింపులు కూటమి నేతల ఆఫర్లకు తలొగ్గని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులు దిగుతున్నారు. మద్దతు తెలపని కార్పొరేటర్లను ‘మీ అంతు చూస్తాం’అంటూ కూటమి నేతలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వార్డుల్లో అభివృద్ధి పనులు జరగనివ్వబోమని, వ్యాపారాలు, ఇతర పనులు సాఫీగా సాగనివ్వమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది. మా నాయకుడు ఇప్పటికే వైఎస్సార్ సీపీకి ఎటువంటి పనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.’ అంటూ కూటమి నేతలు బెది రింపులకు పాల్పడుతున్నారని పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేయలేను ‘నాకు వైఎస్సార్ సీపీ రాజకీయ భిక్ష పెట్టింది. పార్టీకి ద్రోహం చేయలేను. ఇప్పటికే జనసేన, టీడీపీల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. వాళ్లు ఎన్నో ప్రలోభాలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నా వార్డు నుంచి నేనే కార్పొరేటర్గా ఉంటానని హామీ ఇచ్చారు. నా వార్డు అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. వార్డులో జనసేన, టీడీపీ కార్యకర్తలు నా వెంటే ఉంటారని తెలిపారు. అంతేకాదు నాకు మరిన్ని పదవులు ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు. డబ్బు కూడా ఇస్తామన్నారు.’అంటూ ఓ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ ప్రారంభం
ఏయూక్యాంపస్: తీరప్రాంత భద్రత ప్రాధాన్యతను వివరిస్తూ సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ థాన్ను మంగళవారం ఉదయం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం నుంచి సైకిల్థాన్ బృందం సోమవారం విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. తిరిగి విశాఖ నుంచి మంగళవారం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. సైకిల్థాన్కు మద్దతుగా పలువురు చిన్నారులు సైకిళ్లపై వారి వెంట కొంత దూరం ప్రయాణించారు. కార్యక్రమంలో పీపీఏ సెక్రటరీ టి.వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కశింకోటలో సినిమా షూటింగ్ సందడి
కశింకోట: కశింకోటలోని ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ‘అనకాపల్లి’ పేరిట నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నూతన నటీనటులు, దర్శకులతో దీన్ని నిర్మిస్తున్నారు. లగడపాటి విక్రం, సంధ్య హీరో, హీరోయిన్లగా దర్శకుడు కాగేష్ తొలి ప్రయత్నంగా నిర్మాణం చేపట్టారు. సినిమాలో కొంత మేర క్లైమాక్స్ దృశ్యాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆర్ఈసీఎస్ కార్యాలయం వెనుక భాగంలో బెల్లం దిమ్మెల శ్రేణి, చెరకు గడలు, బెల్లం తయారీ పెనం ఏర్పాటు చేయడంతోపాటు పొగాకు తోరణాలతో అలంకరించిన గుడిసెల సెట్ వేశారు. వాటిలో రొమాన్స్కు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. కొంత కాలంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేస్తున్నామని, నెలాఖరుకు పూర్తి కానుందని మేనేజర్ తెలిపారు. -
ముసుగుదొంగలను పట్టుకోవాలి..
ముషిడిపల్లి నుంచి జంక్షన్కు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి దాడులు చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేసి బంగారు నగలు, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించారు. పట్ట పగలే ఇలా దాడులు చేయడంతో జంక్షన్కు వెళ్లాలంటే మహిళలంతా భయాందోళనలు చెందుతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. పోలీస్లు స్పందించి అటువంటి వ్యక్తులపై నిఘా ఉంచి అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలి. –పిల్లి పద్మ, మహిళ, ముషిడిపల్లి. ఒంటరిగా వెళ్లొద్దని చెప్పాను... ముషిడిపల్లి జంక్షన్కు వెళ్లే మార్గంలో చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తునట్లు మా దృష్టికి వచ్చింది. ఈ దాడుల విషయమై ఐదుగురు తనకు సమాచారం అందించారు. ముషిడిపల్లి మీదుగా ప్రయాణించే ఎ.కొత్తపల్లి వాసులను కూడా అడ్డగించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని దేవరాపల్లి ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లాను. కానిస్టేబుల్స్ను పంపించారు. ఒంటరిగా వెళ్లోద్దని గ్రామస్తులకు తెలియజేశాను. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలకు కూడా తెలియజేశాను. –లావణ్య, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి, ముషిడిపల్లి. దొంగల పనిపడతాం ముషిడిపల్లిలో రాకపోకలు సాగించే వారిని అడ్డగించి దోపిడికి యత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. స్థానిక గ్రామ సచివాలయ సంరక్షణ కార్యదర్శి కూడా మా దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక నిఘా పెట్టి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆచూకీ లభించడం లేదు. మరింత నిఘా పెట్టి అటువంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తాం. –టి.మల్లేశ్వరరావు, ఎస్ఐ, దేవరాపల్లి -
ముషిడిపల్లిలో ఆక్రమణలు తొలగించాలని రైతుల బైఠాయింపు
దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి రెవెన్యూ పరిధిలోని దుబిరెడ్డి బందతో పాటు చెరువు వాగులో అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సదరు ఆక్రమణ స్థలంలో నిర్మించిన వైన్ షాపు తదితర నిర్మాణాల ఎదుట వి.సంతపాలెం, గుడిపాల, నీలకంఠరాజుపురం, జమ్మాదేవిపేట, ఆనందపురం, పోతనవలస, ఉగ్గినవలస, కృష్ణారాయుడుపేట తదితర గ్రామాల రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి తప్పుడు రికార్డులను సృష్టించారని వేచలపూడి అగ్రహానికి చెందిన వేపాడ మాజీ ఎంపీపీ వేచలపు చినరామునాయుడు ఆరోపించారు. రాజుగారి చెరువు నుంచి దుబిరెడ్డి బందకు ఇరువైపులా నీరు వెళ్లేందుకు గతంలో నిర్మించిన మదుములను కబ్జా చేశారన్నారు. చెరువు పక్కన ఉన్న గోర్జు అన్యాక్రాంతం చేశారన్నారు. రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులతో కుమ్మక్కవ్వడంతో పలు గ్రామాలకు చెందిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.ఆందోళనలో వి.ఎస్.నాయుడు, బోజంకి అచ్యుతరామయ్య, సూర్యనారాయణ, చిరికి వెంకటరమణ, సింహాద్రప్పడు పాల్గొన్నారు. ‘ఆరోపణలు నిరాధారం’ ముషిడిపల్లికి చెందిన సర్వసిద్ది నాగేశ్వరరావు నుంచి 2013లో శ్రీకాకుళానికి చెందిన మహిళ జహర్న్ఖాన్ సర్వే నెంబర్ 580–2లో గల 30 సెంట్ల భూమిని కొనుగోలు చేయగా ఆమె నుంచి తాము 2022లో కొనుగోలు చేసినట్టు సోమిరెడ్డి గోవింద, గండి దేవి వివరణ ఇచ్చారు. దీనిపై రైతులు ఆర్డీవో కోర్టులో అప్పీలుకెళ్లగా విచారణ అనంతరం తిరస్కరించారన్నారు. ఆ తర్వాత 8 మంది రైతుల మీద తాము చోడవరం కోర్టుకి వెళ్లగా ఆ భూమిపై తాము తప్ప ఇతరులెవరూ వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం తాము భూమిని కొనుగోలు చేసుకుంటే, కొందరు రైతులను రెచ్చకొట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
విద్యుత్ స్తంభం మార్పుపై ఇరువర్గాల వివాదం
నాతవరం: ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు మార్పు చేయడంపై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. జిల్లేడుపూడి గ్రామంలో లాలం నూకరాజు కొత్తగా నిర్మించిన ఇంటి గేటు ముందు విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. ఈ స్తంభం మార్పు చేయడం కోసం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం గత నెల 25వ తేదీన లాలం నూకరాజు విద్యుత్శాఖకు రూ.69,500 ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈనెల 16వ తేదీన విద్యుత్ స్తంభం మార్పు చేసేందుకు జిల్లేడుపూడిలో నూకరాజు ఇంటి వద్ద సిబ్బంది పనులు ప్రారంభించారు. కొత్తగా స్తంభం ఏర్పాటుకు పాత స్తంభం తొలగించేందుకు గొయ్యి తీశారు. అయితే ఆ సమయంలో సర్పంచ్ లాలం రమణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ద్వారా పనులు నిలుపుదల చేయించారు. కొత్తగా విద్యుత్ స్తంభం వేసే ప్రదేశంలో పంచాయతీ డ్రైనేజీ నిర్మిస్తామంటూ పనులను అడ్డుకున్నారు. పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు విద్యుత్ స్తంభం మార్చుకుంటే ఎలా ఊరుకుంటామని సర్పంచ్ రమణ భీిష్మించారు. విద్యుత్ స్తంభం మార్పు కోసం ఆదివారం వైర్లు తొలగించడంతో గ్రామంలో సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నర్సీపట్నం విద్యుత్ శాఖ ఏడీ సునీల్కుమార్, నాతవరం జేఈ చంద్రమౌళి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఎదుట ఇరుపార్టీల నాయకులు వివాదానికి దిగారు. విద్యుత్ స్తంభం వేయరాదని సర్పంచ్ రమణ, నిబంధనల మేరకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాం కాబట్టి గొయ్యి తీసిన స్థలంలో స్తంభం వేయాలని మాజీ సర్పంచ్ లోవ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరం లేక అధికారులు విద్యుత్ స్తంభం మార్పును వారం రోజుల పాటు వాయిదా వేసి విద్యుత్ పునరుద్ధరించి వెళ్లిపోయారు. ఈ విషయమై ఏడీ సునీల్కుమార్ మాట్లాడుతూ స్తంభం మార్పుకు వినియోగదారుడు డబ్బులు కట్టారని, ఈనెల 25వ తేదీ వరకు స్తంభం మార్పుకు సమయం ఉందన్నారు. రాజకీయ నాయకులు సమస్య సృష్టిస్తే పని చేయడం కష్టమన్నారు. -
23న ఫ్లాంట్ పరీక్ష నిర్వహణ
తుమ్మపాల : ఈ నెల 23న జరిగే ఫ్లాంట్ (ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ – ఎసెస్మెంట్ టెస్ట్) పరీక్షను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఫ్లాంట్ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్లో ఆమెతో పాటు జేసీ ఎం.జాహ్నవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంలో భాగంగా, జిల్లాలో మహిళా స్వయంశక్తి సంఘాల్లో గల నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులను చేయడానికి మొదటి దశలో 11,900 మంది అభ్యాసకులను నమోదు చేసి, 1,190 మంది అక్షరాస్యులతో అక్షరాస్యతా కేంద్రాలను ఏర్పాటు చేసి వాలంటరీ టీచర్ల ద్వారా చదువు నేర్పడం జరిగిందన్నారు. ఆయా అభ్యాసకులకు ఈ నెల 23న అంగన్వాడీ కేంద్రాలలో పాఠశాలో ఫ్లాంట్ పరీక్ష నిర్వహించాలన్నారు. అంగన్వాడీ టీచర్, సెకండరీ గ్రేడు టీచర్ పరీక్ష నిర్వాహకులుగా వ్యవహరించాలన్నారు. వయోజన విద్యాశాఖ నుంచి పరీక్ష పేపర్లు, సంబంధిత సామగ్రి అందజేయనున్నట్టు తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో సంబంధిత శాఖలు సమన్వయంతోని ఫ్లాంటు పరీక్షను నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, వయోజన విద్య ఉప సంచాలకుడు ఎస్.ఎస్.వర్మ, నోడల్ అధికారి డి.చిన్నికృష్ణ, డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.అనంతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
పట్టపగలే దోపిడీ యత్నం
నెల రోజుల క్రితం ముషిడిపల్లి నుండి ఆనందపురంలోని బట్టల షాపునకు వెళ్లేందుకు జంక్షన్ వరకు కాలినడకన బయలుదేరాను. ఉదయం 10 గంటల ప్రాంతంలో నాగారాయుడు చెరువు మలుపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి బైక్పై ఇద్దరు వ్యక్తులు ముఖానికి గుడ్డలు కట్టుకొని జంక్షన్ వరకు తమ బండి ఎక్కాలని కోరగా తిరస్కరించాను. దీంతో బైక్పై ముందున్న వ్యక్తి నా మెడలోని అర తులం బంగారు మంగళ సూత్రాలను లాగి తెంచేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకొని మంగళసూత్రాలను గట్టిగా పట్టుకున్నాను. బైక్ ఉన్న మరో వ్యక్తి తన చెవులకు ఉన్న బంగారు రింగ్లను లాగేందుకు ప్రయత్నించగా గట్టిగా చేతి గోర్లతో రక్కేయడంతో విడిచి పెట్టాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించి గట్టిగా హారన్ కొట్టుకుంటూ వేగంగా రావడంతో ఇద్దరు దుండగులు బైక్పై పరారయ్యారు. నాకు మెడపైన, బుగ్గపై చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడతానని ఆనుకోలేదు. –బత్తిన మంగ, బాధిత మహిళ, ముషిడిపల్లి. -
బావిలో దూకి యువకుడి ఆత్మహత్య
మాకవరపాలెం: వ్యవసాయ బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి. మండలంలోని చామంతిపురం గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్ (17) గ్రామంలో వైరింగ్ పనులు చేస్తుంటాడు. అయితే బుచ్చియ్యపేట మండలం పంగిడి గ్రామానికి చెందిన వివాహితతో దుర్గాప్రసాద్కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం వివాహిత భర్తకు తెలియడంతో దుర్గాప్రసాద్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోన్ చేసి రమ్మనడంతో భయపడిన దుర్గాప్రసాద్ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై మృతుడు తల్లి రాజేశ్వరి ఇచ్చిని ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఈవీఎం గోడౌన్ తనిఖీ
తుమ్మపాల: ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా గోదాములో భద్రపరచిన ఈవీఎం మెషీన్లను, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, ఎలక్షన్ సెక్టన్ సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయపార్టీల ప్రతినిధులు టి.షణ్ముఖ్, బి.శ్రీనివాసరావు, కె.హరినాథబాబు, మీసాల సుబ్బన్న, జి.శ్రీరామ్, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభం మార్పుపై ఇరువర్గాల వివాదం
నాతవరం: ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు మార్పు చేయడంపై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. జిల్లేడుపూడి గ్రామంలో లాలం నూకరాజు కొత్తగా నిర్మించిన ఇంటి గేటు ముందు విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. ఈ స్తంభం మార్పు చేయడం కోసం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం గత నెల 25వ తేదీన లాలం నూకరాజు విద్యుత్శాఖకు రూ.69,500 ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈనెల 16వ తేదీన విద్యుత్ స్తంభం మార్పు చేసేందుకు జిల్లేడుపూడిలో నూకరాజు ఇంటి వద్ద సిబ్బంది పనులు ప్రారంభించారు. కొత్తగా స్తంభం ఏర్పాటుకు పాత స్తంభం తొలగించేందుకు గొయ్యి తీశారు. అయితే ఆ సమయంలో సర్పంచ్ లాలం రమణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ద్వారా పనులు నిలుపుదల చేయించారు. కొత్తగా విద్యుత్ స్తంభం వేసే ప్రదేశంలో పంచాయతీ డ్రైనేజీ నిర్మిస్తామంటూ పనులను అడ్డుకున్నారు. పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు విద్యుత్ స్తంభం మార్చుకుంటే ఎలా ఊరుకుంటామని సర్పంచ్ రమణ భీిష్మించారు. విద్యుత్ స్తంభం మార్పు కోసం ఆదివారం వైర్లు తొలగించడంతో గ్రామంలో సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నర్సీపట్నం విద్యుత్ శాఖ ఏడీ సునీల్కుమార్, నాతవరం జేఈ చంద్రమౌళి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఎదుట ఇరుపార్టీల నాయకులు వివాదానికి దిగారు. విద్యుత్ స్తంభం వేయరాదని సర్పంచ్ రమణ, నిబంధనల మేరకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాం కాబట్టి గొయ్యి తీసిన స్థలంలో స్తంభం వేయాలని మాజీ సర్పంచ్ లోవ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరం లేక అధికారులు విద్యుత్ స్తంభం మార్పును వారం రోజుల పాటు వాయిదా వేసి విద్యుత్ పునరుద్ధరించి వెళ్లిపోయారు. ఈ విషయమై ఏడీ సునీల్కుమార్ మాట్లాడుతూ స్తంభం మార్పుకు వినియోగదారుడు డబ్బులు కట్టారని, ఈనెల 25వ తేదీ వరకు స్తంభం మార్పుకు సమయం ఉందన్నారు. రాజకీయ నాయకులు సమస్య సృష్టిస్తే పని చేయడం కష్టమన్నారు. -
వడ్డాది వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
వడ్దాది వేంకటేశ్వరస్వామి ఆలయంలో కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది బుచ్చెయ్యపేట : వడ్దాది వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 152 కల్యాణోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాలు సందర్బంగా ఈ నెల 10 వ తేది నుంచి 15 వరకు భక్తులు సమర్పించిన హుండీ లెక్కింపులు సోమవారం నిర్వహించారు. ఆలయ ఈవో శర్మ వారి సిబ్బందితో కలిసి లెక్కించిన హూండీ ఆదాయంలో గత ఏడాది కంటే స్వామి వారికి రూ 2,67,640 ఆదాయం అధికంగా వచ్చింది. హుండీల్లో రూ.7,86,406 నగదు వచ్చింది. టిక్కెట్ల ద్వారా రూ 4,08,665, తలనీలాల ద్వారా రూ.25వేలు, కొబ్బరి చిప్పలు వేలం ద్వారా రూ 38వేలు, ఆశీలు ద్వారా రూ 9,160, విరాళాలు ద్వారా రూ. 8435, మెత్తం రూ.12,75,666 ఆదాయం వచ్చిందని ఈవో శర్మ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర ధర్మకర్త దొండా కన్నబాబు, ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు స్థానిక పెద్దలు దొండా సన్యాసిరావు, దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు. -
బుచ్చింపేటలో పశువుల పాక దగ్ధం
కాలిపోయిన పశువుల పాకను ఆర్పుతున్న రైతులు రోలుగుంట : మండలంలోని బుచ్చింపేట గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాటూరి శ్రీరాముకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. వివరాలివి. పశువుల పాక యజమాని సోమవారం మధ్యాహ్నం పొలం పాకల వద్ద పనులు ముగించుకొని భోజనానికి ఇంటికి వచ్చేశాడు. గంట తరువాత ఇతని పొలం పాకల నుంచి మంటలు వ్యాపించడంతో కుటుంబీకులతో కలసి పాక వద్దకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు, అయితే ఈ పాక సమీపంలో గల మేకల దొడ్డు కూడా కాలిపోయింది. సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పించాలని బాధితుడు కోరారు. -
● జంక్షన్కు వెళ్లే దారిలో పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు ● ఒంటరి మహిళలే టార్గెట్ ● ముఖాలకు ముసుగు వేసుకొని దాడులు ● ఇప్పటి వరకూ ఆరు ఘటనలు ● బెంబేలెత్తుతున్న జనం
దేవరాపల్లి : ముషిడిపల్లి గ్రామం నుంచి జమ్మాదేవిపేట జంక్షన్ వైపు వెళ్లే రహదారిలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలతో పాటు పురుషులను సైతం టార్గెట్గా చేసుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామం నుంచి ఈ జంక్షన్ సుమారు రెండు కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో పాటు జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటుగా వచ్చేవారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. నాగారాయుడు చెరువు సమీపంలోని మలుపుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగు వేసుకొని అటుగా వచ్చే వారిని అడ్డగించి బ్యాగుల్లో నగదుతో పాటు ఒంటిపై గల ఆభరణాలను దోచుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రతిఘటించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి ఈ తరహా సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురిపై ఈ తరహా దాడులు జరిగినట్టు సమాచారం. తాజాగా ఈనెల 11న రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై వస్తున్న యువకుడిని అడ్డుకొని దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ముషిడిపల్లి నుంచి జమ్మాదేవిపేట జంక్షన్ వైపు వెళ్లేందుకు మహిళలతో పాటు గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. ముషిడిపల్లితో పాటు కె.ఎం.పాలెం, ఎ.కొత్తపల్లి గ్రామాల ప్రజలు ఈ రహదారి మీదుగానే ఇటు దేవరాపల్లి, అటు ఆనందపురం, అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లేందుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇపుడు ఈ రహదారిలో దారిదోపిడీ ఘటనలతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. కాగా ఆయా ఘటనల నుంచి తప్పించుకున్న ముషిడిపల్లి గ్రామానికి చెందిన బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ముషిడిపల్లిలో దారి దోపిడీల కలకలం -
ఉపాధి కూలీలపై రాజకీయ కక్ష, వివక్ష
నీలిగుంటలో ఉపాధి పని కల్పించలేదని ఆరోపిస్తున్న కూలీలు కోటవురట్ల: కూటమి ప్రభుత్వంలో ఉపాధి కూలీలపై రాజకీయ కక్ష, వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. లింగాపురంలో పలువురు కూటమి కార్యకర్తలకు పనికి రాకుండానే మస్తర్లు పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నీలిగుంటలో టీడీపీ కార్యకర్తలు ఉన్న గ్రూపులకు మాత్రమే పని కల్పించారంటూ కూలీలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలిగుంట, శివారు గ్రామం సన్యాసిరాజుపాలెంలో మొత్తం 18 గ్రూపులు ఉండగా అందులో ఏరికోరి టీడీపీ కార్యకర్తలున్న 4 గ్రూపులకు మాత్రమే పని కల్పించారని కూలీలు ఆరోపించారు. తమకు పని ఎందుకు కల్పించరంటూ ఉపాధి సిబ్బందిని ప్రశ్నించారు. సర్పంచ్ వరహాలబాబు మాట్లాడుతూ కూలీలపై రాజకీయం రుద్ది, పనుల కల్పనలో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా మండల సర్వ సభ్య సమావేశంలో ఇదే అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఉపాధి సిబ్బంది పనితీరు మారలేదని ఆరోపించారు. వెంటనే అన్ని గ్రూపులకు పని కల్పించకపోతే కూలీలతో మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?
● పూడిమడక రోడ్డులో భారీ వాహనాలను కట్టడి చేయాలి ● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన మునగపాక : తరచూ పూడిమడక రోడ్డులో భారీ వాహానాల (క్వారీ లారీల) రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఽఈ మార్గంలో అధికలోడులతో వాహనాలు ప్రయాణిస్తున్నాయన్నారు. అధికారుల ఉదాసీనత తగదంటూ మండిపడ్డారు. సోమవారం మునగపాక రెవెన్యూ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. రాంబిల్లిలోని నేవల్బేస్ నిర్మాణంలో భాగంగా పరిమితికి మించి భారీ బండరాళ్లతో లారీలు తిరగడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పగలు,రాత్రి తేడా లేకుండా వాహనాలు విచ్చల విడిగా తిరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఇటీవల కాలంలో పూడిమడక రోడ్డులో భారీ వాహనాల కారణంగా కొంతమంది మృత్యువాతకు గురికావడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. వాహన డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఈ విషయమై అచ్యుతాపురం, మునగపాక మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి గత ఏడాది నవంబర్ 4వతేదీన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు వినతి అందజేసినా ఫలితం కనిపించలేదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని లేకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.ఆదిమహేశ్వరరావుకు వినతి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ నేతలు మారిశెట్టి సూర్యనారాయణ, మలసాల కిషోర్,దాసరి అప్పారావు, మళ్ల సంజీవరావు, నరాలశెట్టి సూర్యనారాయణ, ఆడారి కాశీబాబు, దిమ్మల అప్పారావు, కోనపల్లి రామ్మోహనరావు, కాండ్రేగుల జగన్, ఈత బాబూరావు, నాగేశ్వరరావు, పెదబ్బాయి, బొడ్డేడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బైక్ను అడ్డగించారు..
ఈ నెల 11న రాత్రి 10 గంటల సమయంలో ఆనందపురం నుంచి ముషిడిపల్లికి బైక్పై ఒంటరిగా వస్తుండగా నాగారాయుడు చెరువు సమీపంలోని మలుపు వద్ద అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు బైక్కు అడ్డంగా వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. బైక్ను మరింత వేగంగా నడిపి తృటిలో వారు నుండి తప్పించుకున్నాను. వెంటనే గ్రామంలోకి ఫోన్ చేయగా మూడు బైక్లపై యువకులు వచ్చారు. ఇలా రావడాన్ని గుర్తించిన దుండగులు స్కూటీపై పరారయ్యారు. చాలా దూరం వరకు వెంబడించిన వారి ఆచూకి లభించలేదు. వెంటనే దేవరాపల్లి ఎస్ఐకు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించాను. –రెడ్డి మహేష్, బాధితుడు, ముషిడిపల్లి. ● -
మైనింగ్ మాఫియా వికృత రూపం
అనకాపల్లి టౌన్: కూటమి పాలనలో మైనింగ్ అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోందని, దీనిపై తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం చర్య లు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జిని క్వారీ లారీ ఢీకొట్టిన ప్రదేశాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడు తూ పగలు, రాత్రి తేడా లేకుండా మండలం నుంచి నిత్యం అధిక లోడ్తో క్వారీ లారీలు వెళుతున్నాయన్నారు. నెలకు 15 లక్షల టన్నుల రాయి రాంబిల్లికి రవాణా అవుతోందన్నారు. కూటమి పెద్దలు నిర్వహిస్తున్న మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తెల్లవారుజామున పెద్దగా జనసంచారం లేని సమయంలో గూడ్స్ ట్రైన్ వెళ్లబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని, అదే ఏదైనా ఎక్స్ప్రెస్ వెళితే భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చేదన్నారు. మైనింగ్ దందాపై స్వయంగా స్థానిక అధికార పార్టీ శాసన సభ్యులు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోలేదంటే.. ఈ వ్యాపారంలో పెద్దలు ఉన్నారనేది స్పష్టమవుతోందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ , పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు–2 వేగి త్రినాథ్, పార్టీ సీనియర్ నేత మలసాల కుమార్ రాజా పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా నడిపితే కఠిన చర్యలు తుమ్మపాల: అధిక లోడుతో ప్రయాణించే క్వారీ లారీల యజమానులు, నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. పట్టణంలో పోలీస్ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన లారీ యాజమానుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో తెల్లవారుజామున రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదం క్వారీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదా లు జరగకుండా లారీ యజమానులు డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గంటకు పైగా నిలిచిన ఎక్స్ప్రెస్ రైలు యలమంచిలి రూరల్: క్వారీ లారీ బీభత్సంతో అనకాపల్లిలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో యలమంచిలి రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు గంటకు పైగా ఇక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి తీవ్ర హైరానా పాడాల్సి వచ్చింది. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదానికి ఇదే సంకేతం తక్షణమే అధికారులు చర్య తీసుకోవాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ డిమాండ్ -
డ్రైవర్కు నిద్ర కరువై..
● బోల్తా పడ్డ ప్రైవేటు కంపెనీ బస్సు ● 22మందికి గాయాలు ఎస్.రాయవరం: కేవలం మూడు గంటల విశ్రాంతి అనంతరం అదే డ్రైవర్ బస్సు నడపాల్సి రావడంతో నిద్ర సరిపోక ప్రమాదానికి దారి తీసింది. 32 మంది కార్మికులతో వస్తున్న సీసీఎల్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్.రాయవరం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటవురట్ల మండలం లింగాపురం గ్రామం నుంచి వేకువజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ బస్సు బయలుదేరింది. ఊరూరా కార్మికులను ఎక్కించుకొని వస్తున్న ఈ బస్సు అడ్డురోడ్డు–నర్సీపట్నం ఆర్అండ్బీ రోడ్డుపై పెదగుమ్ములూరు సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22మంది గాయపడగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ప్రయాణికులందరినీ నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన 9మందికి నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్స అందించారు. స్వల్పగాయాలతో బయటపడిన 10మందికి చికిత్స అందించి ఇళ్లకు పంపారు. క్షతగాత్రులు వీరే.. కోటవురట్ల మండలం పందూరు గ్రామానికి చెందిన మానేపల్లి సత్యవతి, గొన్నాబత్తుల స్వాతి, చింతల సాయిలక్ష్మి, యర్రంశెట్టి మంగ, మారిశెట్టి భారతి, చీకట్ల నూకరాజు, సమర్శి మహాలక్ష్మి, సరపాక సంతోషి, మారిశెట్టి హేమలత, సరమశెట్టి వరలక్ష్మి, ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామానికి చెందిన కోసూరి తులసి, హనుమంతు లక్ష్మి, వీరితోపాటు డ్రైవర్ షేక్ సత్తార్ తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కాండ్రకోట నాగమ్మ దేవి, కంటే పార్వతి, చుక్క చిట్టమ్మ, బోదెపు సంధ్య, రాజపతి హిమబిందు, ఆకేటి కుమారి, షేక్ హుస్సేన్, మోటూరి నారాయణమ్మ, మానేపల్లి సత్యవతి చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎస్.రాయవరం తహసీల్దార్ జె.రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. నక్కపల్లి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ అనకాపల్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు డ్రైవర్ బి షిఫ్ట్ కార్మికులను గడిచిన రాత్రి 11–12 గంటల సమయంలో ఇళ్ల వద్ద దించి, మళ్లీ తెల్లవారుజామున ఏ షిఫ్ట్ కార్మికులను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం మూడు గంటలు మాత్రమే వ్యవధి ఉండడంతో డ్రైవర్కు నిద్ర సరిపోక ప్రమాదానికి దారి తీసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం
నా కుమారుడు ఇంటి రాకేష్ డిగ్రీ పూర్తిచేశాడు. గాజువాకలో పెదగంట్యాడ బీసీ కాలనీకి చెందిన దుంగి దౌపది ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని రూ.8 లక్షలు కాజేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె వారిని మ్యానేజ్ చేస్తోంది. గతంలో రెండుసార్లు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశాం. అప్పుడు రావికమతం ఎస్ఐ పిలిపించి మాట్లాడారు. తరువాత దాని గురించి పట్టించుకోలేదు. కూలీ నాలీ చేసుకుని సంపాదించిన డబ్బులవి. నా కుమారుడికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఆ డబ్బంతా ఇచ్చేశాను. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. న్యాయం చేస్తామన్నారు. – ఇంటి భాగ్యవతి, మత్సపురం గ్రామం, రావికమతం మండలం పాసు పుస్తకం కోసం డబ్బులు అడిగారు.. మాకు గునిపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నెం.44–5లో 0.45 సెంట్ల భూమి ఉంది. నా భర్త ఏడాది 3 నెలల క్రితం చనిపోయాడు. ఆ భూమిని నా పేరు మీదకు మార్చుకునేందుకు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. నా పేరు మీదకు మార్చుకోవడానికి మ్యుటేషన్ పెడితే.. అది చెల్లదని వీఆర్వో చెప్పారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందంటున్నారు. పేదరాలిని.. ఇచ్చుకోలేనని చెబితే ఇప్పటికీ పని చేయడం లేదు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను. – వానపల్లి సత్యవతి, గునిపూడి గ్రామం, నక్కపల్లి మండలం ఆక్రమణదారుడికి రెవెన్యూ అధికారుల వత్తాసు చేతమెట్ట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.292లో 4.10 ఎకరాల అసైన్డ్ భూమిని 1975లో నా భర్త కట్టా కొండయ్యకు ప్రభుత్వం డి–ఫారం పట్టా మంజూరు చేసింది. ఆయన మరణాంతరం నాకు, నా కుమారుడికి స్వాధీన అనుభవ హక్కు ఉంది. అయితే లాలంకోడూరుకు చెందిన మోతుబరి రైతు లాలం గణేష్ ఆర్థిక, రాజకీయ బలంతో రాంబిల్లి రెవెన్యూ అధికారులతో కుమ్ముకై ్క 1 బీ అడంగల్లో ఆ భూమిని తన తండ్రి పేరున నమోదు చేసుకుని ఆక్రమిస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. వీఆర్వో రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుని మోసం చేశాడు. ఆర్టీఐ యాక్టు ప్రకారం విచారించి వీఆర్వోపైన, అతనికి సహకరించిన రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. –కట్టా ఆదమ్మ, ఆమె కుమారుడు, లాలం కోడూరు, రాంబిల్లి మండలం -
విశాఖకు ఆగ్నేయ దేశాల బౌద్ధ పర్యాటకులు
విశాఖలో బౌద్ధ క్షేత్రంలో విదేశీ బౌద్ధ పర్యాటకులు విశాఖ సిటీ: ఆగ్నేయ దేశాల నుంచి బౌద్ధ పర్యాటకుల తొలి బ్యాచ్ విశాఖకు చేరుకుంది. సోమవారం వీరిని కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్లు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అధ్యక్షుడు విజయ్మోహన్ ఆధ్వర్యంలో ఈ పర్యాటక బృందం బావికొండ, తొట్లకొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండలను సందర్శించింది. ఇక్కడి నుంచి థాయ్లాండ్, మలేషియా, సింగపూర్లకు విమాన సర్వీసులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్నేయ దేశాల పర్యాటకులే లక్ష్యంగా ఇన్బౌండ్ టూరిజంకు శ్రీకారం చుట్టింది. -
కాళ్లరిగేలా తిరిగినా..
నా వయసు 76 సంవత్సరాలు. మా భూమిని ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న నా భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోమని రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాను. కలెక్టరమ్మ ఆదేశించినా మండలంలోని అధికారులు నాకు న్యాయం చేయలేదు. అందుకే మళ్లీ ఫిర్యాదు చేయడానికి వచ్చాను. – చెన్నా సత్యవతి, చిన్నగుమ్మలూరు, ఎస్.రాయవరం మండలం పాసు పుస్తకం ఆన్లైన్ చేయాలి పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆన్లైన్ చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతి అందించాను. నిరుపేద దళితులమైన మాకు 1998లో తుమ్మపాల సర్వే నెం.708–1లో ఒక ఎకరం భూమి డీపట్టా మంజూరు చేశారు. జీడీ మామిడి తోటలు సాగుచేసుకుని జీవిస్తున్నాం. నా పేరున పట్టాదారు పాసుపుస్తకం కూడా మంజూరు చేశారు. దీని ఆధారంగా ఆన్లైన్ చేసి డిజిటల్ పుస్తకం మంజూరు చేయాలని కోరాను. –వెలుసూరి ప్రకాశరావు, తుమ్మపాల, అనకాపల్లి మండలం పింఛన్ తొలగించారు.. నా కుమారుడు ఆదాయ పన్ను కడుతున్నాడని నాకు పింఛన్ తొలగించారు. అతనికి వివాహమై ఇప్పుడు వేరుగా జీవిస్తున్నాడు. ఇప్పుడు నా కుమారుడు కూడా ఆదాయ పన్ను పరిధిలో లేడు. పైగా వేరుగా జీవిస్తున్నాడు. అందువల్ల దివ్యాంగుడనైన నా మొర ఆలకించి, పింఛన్ పునరుద్ధరించవలసిందిగా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించాను. –జెట్టి సత్యారావు, పరశురాంపేట, అనకాపల్లి -
లెక్కలు సరే.. తిప్పల మాటేమిటి?
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య.. భూ వివాదం, ఇంటి సమస్య, దారి సమస్య, భూ సర్వే, అందని పింఛన్, ఉద్యోగాల పేరిట మోసం, పాసు పుస్తకం కోసం మామూళ్లు వసూలు.. ఇలా వందలు, వేల ఫిర్యాదులతో బాధితులు కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నారు. అధికారుల లెక్కలు చూస్తే సమస్యలు ఇట్టే పరిష్కారమైనట్టు కనిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలు బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. ‘సాక్షి’ బృందం సోమవారం పలువురు అర్జీదారులను పలకరించింది. ప్రజా సమస్యల అపరిష్కృత వేదికగా పీజీఆర్ఎస్తమ పరిధిలో లేదని చెప్పినా.. పరిష్కరించినట్లే.!క్షేత్రస్థాయిలో మాత్రం పరిష్కారం శూన్యమే..రెవెన్యూ పరిధిలోనే అత్యధిక ఫిర్యాదులు అర్జీదారుల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి సాక్షి, అనకాపల్లి: ఉన్నతాధికారులకు తమ గోడు చెప్పుకుంటే బాధ తీరుతుందని సామాన్య ప్రజలు ఆశిస్తారు. సోమవారం కలెక్టర్ సహా జిల్లా అధికారులు స్వయంగా తమ అర్జీలు స్వీకరిస్తారు కాబట్టి ఇక తమ కష్టం తీరినట్టేనని భావిస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) పనితీరుపై నిరంతరం సమీక్షలు జరుగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో బాధితులకు పరిష్కారం లభించడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్ నుంచి ఇప్పటి వరకు 45,346 ఫిర్యాదులు రాగా వీటిలో 42 వేల అర్జీలను క్లోజ్ చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ‘క్లోజ్’ చేయడమంటే పరిష్కరించినట్టేనా?.. ఈ ప్రశ్నకు అధికారులే బదులివ్వాలి. ‘ఈ సమస్య మా పరిధిలో లేదు’ అని కొన్ని అర్జీలకు సమాధానం ఇస్తారు. వాటిని కూడా పరిష్కరించినట్టే భావిస్తే.. ఇక సామాన్యుల సమస్యలు తీర్చేదెవరు? కలెక్టర్, ఆర్డీవోల ఆదేశాలు బేఖాతర్ ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలుమార్లు తిరగాల్సి వస్తోంది. ఒకే సమస్యపై నెలల తరబడి పీజీఆర్ఎస్లో పదే పదే ఫిర్యాదులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన బాధితులను ఎవరిని కదిలించినా.. తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు ఆన్లైన్లో చూపిస్తున్నారని, సగానికి పైగా అర్జీలను ఆన్లైన్లో అసలు నమోదే చేయడం లేదని మరికొంతమంది వాపోతున్నారు. కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాలను క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వెల్లువగా వినతులు.. అరకొర పరిష్కారం.. జిల్లాలో జూన్ నెల నుంచి నేటి వరకూ 45,346 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 42,237 ఫిర్యాదులను క్లోజ్ చేసినట్లు, 3,109 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ఫిర్యాదు చేసిన బాధితులు మాత్రం తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని, తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఆయా సంబంధిత అధికారి ఫోన్ చేసి మీ సమస్య పరిష్కార యోగ్యమైనది కాదు..అని ఏదో ఒక కారణం చెప్పి వివరణ మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి కేసులను కూడా క్లోజ్ చేసినట్లు చూపుతున్నారని, వచ్చిన ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి సగం కూడా లేవని బాధితులు వాపోతున్నారు. సోమవారం 340 వినతులు సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, కేఆర్సీపీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 340 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 209 ఉండగా, పోలీసు శాఖ 23, పంచాయతీరాజ్ శాఖ 27, సర్వే సెటిల్ మెంట్ 11, హౌసింగ్ 10, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం 8, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, కార్పొరేషన్ 5, రూరల్ డెవలప్మెంట్కు సంబంధించినవి 10 ఫిర్యాదులున్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 33 వినతులు వచ్చాయి. -
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
● డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు ● పరీక్షల నిర్వహణ అధికారులు, స్క్వాడ్ బృందాలతో సమావేశం అనకాపల్లి టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు నిర్వహణలో నిబంధనలన్నీ పక్కాగా పాటించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు పేర్కొన్నారు. స్ధానిక బీఆర్ అంబేడ్కర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి పరీక్షల నిర్వహణ అధికారులు, స్క్వాడ్ బృందాల సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏ రూపంలో ఎవరు భాగస్వాములైనా కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఉద్యోగాలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారన్నారు. పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, కేంద్రాల పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాచ్లు తదితర పరికరాలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ హాల్ టికెట్లు ముందుగా తనిఖీ చేసి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. పదో తరగతి బోర్డు, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉప విధ్యాశాఖాధికారి పి.అప్పారావు, పరీక్షల విభాగం సహాయ సంచాలకులు ఎ.శ్రీధర్రెడ్డి, విద్యాశాఖ, రెవిన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
గోవాడ సుగర్స్లో మళ్లీ నిలిచిన క్రషింగ్
చోడవరం: గోవాడ సుగర్స్ క్రషింగ్కు మళ్లీ అంతరాయం కలిగింది. బాయిలర్ హౌస్లో సమస్య తలెత్తడంతో ఆదివారం క్రషింగ్ నిలిచిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, కార్మికుల సమ్మెలతో ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించడమే ఆలస్యంగా జరిగింది. ఇప్పటికే అనేక సార్లు బెగాస్ కొరత, బాయిలర్ హౌస్లో సమస్యలతో క్రషింగ్కు అంతరాయం కలుగగా మరలా బాయిలర్ ఈటీపీ ప్లాంట్లో సమస్య తలెత్తడంతో మరోసారి క్రషింగ్ నిలిచిపోయింది. రాత్రి అయినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుండగా క్రషింగ్ నిలిచిపోవడంతో మరలా యథావిధిగా ఫ్యాక్టరీ యార్డుల వద్ద చెరకు కాటాల వద్ద పెద్ద సంఖ్యలో చెరకు లోడుతో వాహనాలు నిలిచిపోయాయి. తరుచూ ఉత్పన్నమౌతున్న అంతరాయం సమస్యతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు లేక క్రషింగ్ ఆశించిన మేర జరగదని ముందు భావించినప్పటికీ చెరకు పుష్కలంగా సరఫరా అవుతుండడంతో ఇప్పటికే 80వేల టన్నులు దాటి క్రషింగ్ కూడా జోరుగానే సాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో తరుచూ మరమ్మతుల సమస్యలు తలెత్తుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
రసవత్తరంగా రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి చెస్ పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా చెస్ అసోసియేషన్, ప్రగతి చెస్ అకాడమీ సంయుక్తంగా తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాలకు చెందిన 180 మంది హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెస్ పోటీలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి. ఈ పోటీల్లో విశాఖ జిల్లాకు చెందిన అఖిలప్రసాద్ ప్రథమ, ప్రకాశం జిల్లాకు చెందిన జె.కె.రాజు ద్వితీయ, అనకాపల్లి జిల్లాకు చెందిన బి.సాకేత్ తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. వీరికి ప్రథమ బహుమతిగా రూ.5,100, ద్వితీయ రూ.4000, తృతీయ రూ.3000 నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అవంతి కళాశాల మెకానికల్ విభాగం హెడ్ హరికిరణ్, ప్రగతి చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు సుదీర్, ఏిపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, గౌతమి లలిత కళా కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, శేషగిరిరావు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
తుమ్మపాల: ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు ఏప్రిల్ 1 వరకు రాత పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 107 పరీక్ష కేంద్రాల్లో 22,042 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సరిగ్గా 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. సున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని, అలాగే క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జెరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసివేయాలని ఆదేశించామని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడడం నిషేధమని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. -
ఈ ప్లేట్లు...
క్లీన్ అండ్ గ్రీన్ వంద గ్రాములుగడ్డితో 3 ప్లేట్లు ఎండు గడ్డిని నీటితో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి. వీటిలో 1 కేజీ గడ్డి ముక్కలు తీసుకుని వాటిని బాగా ఎండబెట్టాలి. సగటున 100 గ్రాముల వరి గడ్డిలో 7 లీటర్ వాటర్ వేసి మరిగించాలి.15 నిమిషాల పాటు బాగా ఉడికించిన తరువాత అందులో సోడియం హైడ్రాక్స్డ్ క్రిష్టల్ను వేసి గంటన్నర పాటు ఉడికించాలి. ఆ తరువాత జల్లెడలో వేసి వరిగడ్డి నుంచి నీరును సెపరేట్ చేయాలి. మిగిలిన వరి గడ్డిని మిక్సీలో వేసి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను ప్లేట్ సైజ్ కన్నా పెద్దగా స్కీన్ లేదా గాజు గ్లాస్పై వేసి 24 గంటల పాటు ఎండబెట్టాలి. ఎండిన తరువాత షీట్గా ఏర్పడుతుంది. దీనిని హైడ్రాలిక్ ప్రెస్ యంత్రంలో పెట్టి ప్రెస్ చేస్తే ప్లేట్ ఏర్పడుతుంది. ఈ ప్లేట్కు పైన విస్తరాకు గానీ లేదా నేలలో కలిసిపోయేలా బయోగ్రెడిబుల్ ఫిల్మ్గాని వేస్తారు. దీంతో డిస్పోజల్ ప్లేట్ తయారు అవుతుంది. సగటున 100 గ్రాముల వరి గడ్డికి 3 నుంచి 4 ప్లేట్లు తయారవుతాయి. సాక్షి, అనకాపల్లి: అధిక పెట్టుబడులతో ఆశించిన దిగుబడి లేక రైతు నష్టాల బాట పడుతున్నాడు. వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితుల కారణంగా పంట నష్టపోయి లాభాలార్జించలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. దేశంలోనే వరి పంట పండిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ టెన్లో ఉంది. రైతు మీదే యావత్ దేశం ఆధారపడుతుంది. అందుకే రైతుకు మేలు చేకూరేలా..అదే విధంగా పర్యావరణాన్ని పరిరక్షించేలా.. అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఎండు గడ్డి, అరటి కాండంతో డిస్పోజల్ ప్లేట్ల తయారు చేశారు. రైతుకు అదనపు ఆదాయం సంపాదించుకునేలా సరికొత్తగా ప్రాజెక్టు చేసి చూపించారు. ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు, డాక్టర్ ఎ.కేశవకుమార్, ఈవీఎస్ కుమారి పర్యవేక్షణలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్ విద్యార్థులు రక్షిత, ఎం.కీర్తి స్వరూప, పి.గురుసాయి, ఆర్.ఉదయ్కుమార్ ఈ ప్రయోగం ద్వారా డిస్పోజల్ ప్లేట్లు తయారు చేయవచ్చని చేసి చూపించారు. వరి పంట వేసే రైతు నూర్పు తరువాత ఎండు గడ్డిని కొంతమేర పశువులకు మేతగా ఉపయోగిస్తాడు..పశువులు తినగా మిగిలిన మరికొంత గడ్డి పశువుల పాకలుగా వాడుతుంటారు. తరువాత కూడా మిగిలి వృధాగా పడి ఉన్న ఎండు గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇలా వృధా చేసేకంటే ఆ గడ్డితో డిస్పోజల్ ప్లేట్లు తయారీ చేసుకుని అదనపు ఆదాయం ఆర్జించవచ్చని ఆర్ఏఆర్ఏస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని చోట్ల మిగిలిపోయిన ఎండు గడ్డి కాల్చడం ద్వారా కార్బన్ డైఆకై ్సడ్ విడుదలై పర్యవరణం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పొగ ద్వారా ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇలా వృథాగా పడి ఉన్న వరిగడ్డిని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అగ్రికల్చర్ విద్యార్థులు డిస్పోజబుల్ ప్లేట్లుగా తయారు చేశారు. సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఎండు గడ్డి, అరటి బెరడుతో డిస్పోజబుల్ ప్లేట్ల తయారీ పర్యావరణ హితం, ఆరోగ్య దాయకం రైతుకు అదనపు ఆదాయం ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ అరటిడొప్పతో... అరటి మొక్క నుంచి గెల కాసిన తరువాత దాన్ని నరికేస్తారు. అలా నరికేసిన అరటి కాండం నుంచి చెట్టు డొప్పల నుంచి ఫైబర్ను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టాలి. ఇందులో సోడియం హైడ్రాకై ్సడ్ క్రిస్టల్ను వేసి ఒక గంట పాటు బాయిల్ చేస్తారు. ఆ పేస్ట్ను జల్లెడలో వేసి వాటర్ తీసేస్తారు. షీట్ను ప్లేట్ మౌల్డింగ్ మిషన్ దగ్గరకు తీసుకెళతాం. 100 గ్రాములు కాండం నుంచి 5 నుంచి 6 ప్లేట్లు తయారు చేయవచ్చు. రైతుకు ఎంతో మేలు.. నేను అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో గల అనకాపల్లి పాలిటెక్నిక్ ఇంజినీరింగ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మూడు నెలల పాటు నేను చేసిన ప్రాజెక్ట్లో భాగంగా పర్యావరణాన్ని కాపాడుతూ..రైతుకు మేలు చేకూర్చేలా ఈ ప్రయోగ విధానం చేశాం. రైతుకు పంట దిగుబడి అనంతరం వృధాగా పడేసే గడ్డితో డిస్పోజబుల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు.సోడియం హైడ్రాక్స్డ్ క్రిష్టల్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్లేట్ మౌల్డింగ్ మిషన్ ఒక్కటే కొనుగోలు చేసుకుంటే వారంతట వారే డిస్పోజబుల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త జగన్నాధరావు సహకారంతో డిస్పోజబుల్ ప్లేట్లు ప్రాజెక్టు చేశాం. –కీర్తి స్వరూప, థర్డ్ ఇయర్ విద్యార్థిని, పాలిటెక్నికల్ ఇంజినీరింగ్.ప్లాస్టిక్కుప్రత్యామ్నాయంగా... ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పర్యావరణం దెబ్బతింటుంది. ఎక్కువగా వినియోగించే డిస్పోజబుల్ ప్లేట్లతో మరింతగా పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాకుండా రైతులు పండించే వరిలో వృధాగా పడేసే ఎండుగడ్డి వంటివి కాల్చడం ద్వారా కార్బన్డైఆకై ్సడ్ విడుదల అవుతుంది. అందుకే మా విద్యార్థులతో కలిసి ఎకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ ప్లేట్లు ప్రయోగాత్మకంగా తయారీ చేశాం.పర్యావరణాన్ని కాపాడడంతో పాటు రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా ఉపయోగపడేలా రూపొందించాం. –డాక్టర్ ఎ. కేశవ్కుమార్, టీచింగ్ అసోసియేట్, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్. అనకాపల్లి -
విజయోస్తు..
రెగ్యులర్తుమ్మపాల: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని, పదో తరగతి పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు పి. శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పట్టణంలో పలు పరీక్ష కేంద్రాలను ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావునాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనుకూలంగా బెంచీలు ఉండాలని, ఫ్యాన్లు తిరిగేలా చూడాలని, సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకుముందు ఆయన పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ, స్క్వాడ్ బృందాల అధికారులతో మాట్లాడుతూ ఎక్కడ ఏ లోపాలున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 107 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో ఏడు సెంటర్లలో ఎస్ఎస్సీ బోర్డు విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తారన్నారు. 22 వేల 42 మంది రెగ్యులర్, 1258 ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. అలాగే 667 మంది ఓపెన్ స్కూల్ అభ్యర్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీక్షల కోసం ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, అవసరం మేరకు ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఏడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించమన్నారు. జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారని వివరించారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, సర్వీసులు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సహకారంతో ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విద్యార్థులంతా ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్వో వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు కృష్ణంరాజు, జనార్ధన్ పాల్గొన్నారు. హాజరుకానున్న విద్యార్థులుపరీక్షలు ఎప్పటివరకంటే : సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలు ఏడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు ఏర్పాట్లు పరిశీలించిన విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు శ్రీనివాసరావు -
తాటిపూడి వద్ద ‘భూమాత’ సరికొత్త వెంచర్
కొమ్మాది: భూమాత గ్రూప్, ఎస్విఎన్ గ్రూప్ సంయుక్తంగా తాటిపూడి వద్ద 200 ఎకరాల్లో భూమాతాస్ ఎస్వీఎన్ స్వప్నలోక్ పేరుతో వెంచర్ వేస్తున్నట్లు భూమాత గ్రూప్ ఎండీ తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. బీచ్రోడ్డులోని ఓ రిసార్ట్లో ఆదివారం సాయంత్రం దీనికి సంబంధించిన బ్రోచర్ను ఎస్విఎన్ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఎకరాల్లో 5 ఫేజ్ల్లో.. 1650 ఫ్లాట్లు వీఎంఆర్డీఏ అనుమతులతో అందరికి అందుబాటు ధరల్లో నిర్మించినట్లు తెలిపారు. ఈ వెంచర్లో ఇంతవరకు రియల్ఎస్టేట్ చరిత్రలో ఎవరు ఇవ్వని సౌకర్యాలు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్టుగా కస్టమర్లకు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఆంధ్రలో ఇదే మొదటిదని తెలిపారు. ఈ వెంచర్కు సమీపంలోని తాటిపూడి రిజర్వాయర్ను ప్రభుత్వం టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తుండడంతోపాటు 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ టూరిస్ట్ స్పాట్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్లూరి శివాజి, కిరణ్ శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పెదపూడిలో మూడు పాకలు దగ్ధం
● 10 మేకలు సజీవ దహనం ● రూ.4 లక్షల ఆస్తి నష్టం బుచ్చెయ్యపేట: పెదపూడి శివారు రాజుపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పాకలు దగ్ధమవగా 10 మేకలు సజీవ దహనమయ్యాయి. గ్రామానికి చెందిన తండ్రికొడుకులు నమ్మి పైడయ్య, చిలుకులు మేకలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి దూరంగా మూడు పాకలు వేసుకుని మేకలపై ఆధారపడి జీవిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పాల్చిపారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరగ్గా మూడు పాకలతో పాటు పాకల్లో ఈనిన మేకలు, పిల్లలు పది సజీవ దహనమయ్యాయి. సాయంత్రం పాకకు వచ్చిన పైడయ్య, చిలుకులు కాలిపోయిన పాకలు, మేకలను చూసి భోరున విలపించారు. సుమారు రూ.4 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
నేడు విశాఖకు ‘ఢిల్లీ క్యాపిటల్స్’
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్ తన జట్టుతో కలిసి సోమవారం విశాఖపట్నం చేరుకోనున్నారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియాన్ని తమ రెండో హోం గ్రౌండ్గా ఎంచుకున్న డీసీ ఈ సీజన్ను ఇక్కడే ప్రారంభించనుంది. చాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ జట్టులోని డీసీ సభ్యులంతా వారి ఇంటి నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారు. మంగళవారం నుంచి వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటారు. గతంలో పంజాబ్ తరఫున ఆడిన అక్షర్ 2016లో హాట్రిక్ సాధించాడు. 2020లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖలో జరిగే తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)తో తలపడనుంది. హెడ్ కోచ్ హేమంగ్ బదాని, సహాయ కోచ్ మాథ్యూ, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ పర్యవేక్షణలో అక్షర్ పటేల్, ఇతర ఆటగాళ్లు మంగళవారం నుంచి నెట్స్లో సాధన చేస్తారు. జట్టులో స్టార్క్, చమీరా వంటి విదేశీ బౌలర్లు, డ్యూ, బ్రూక్ వంటి బ్యాటర్లు, కేఎల్ రాహుల్, ఫెరీరా వంటి వికెట్ కీపర్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్లో సెంచరీలతో చెలరేగిపోయిన కరుణ్ నాయర్తో పాటు పోరెల్, స్టబ్స్, అశుతోష్, కుల్దీప్ కూడా ప్రాక్టీస్లో పాల్గొంటారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన జట్టుతో ఈ నెల 22న విశాఖ చేరుకోనున్నారు. గత సీజన్లో రిషబ్ డీసీకి కెప్టెన్గా ఉన్నారు. ఎల్ఎస్జీ 23న నెట్స్లో ప్రాక్టీస్ చేయనుంది. డీసీ, ఎల్ఎస్జీ మధ్య తొలి మ్యాచ్ ఈ నెల 24న విశాఖలో జరగనుంది. రేపటి నుంచి ప్రాక్టీస్ -
ఆరు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు దగ్ధం
రోలుగుంట: కూసుర్లపూడి గ్రామానికి చెందిన రైతుల జీడితోటల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో జీడి, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల భవన్నారాయణకు చెందిన ఎకరా యాకలిప్టస్, మటం బెన్నయ్య, కూండ్రపు శ్రీను, గున్నంపల్లి కొండ, సియాద్రి అప్పారావుకి చెందిన జీడి, మామిడి తోటలు అయిదెకరాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై బాధితులు తమకు ఎవరిపైనా అనుమానం లేదని తెలిపారు. ప్రమాదంలో వాటిల్లిన నష్టాన్ని సంబంధిత అధికారలు అంచనా వేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. -
నేత్రపర్వంగా పవళింపు సేవ
నక్కపల్లి: జో అచ్చుతానంద, జోజో ముకుందా అంటూ ఉపమాకలో స్వామివారి పవళింపు సేవలు (పుష్పయాగోత్సవాలు) ఘనంగా జరుగుతున్నాయి. కల్యాణోత్సవాల అనంతరం స్వామివారికి మూడు రోజుల పాటు పవళింపు సేవలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్కు, ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామికి నిత్యపూజలు, ఆరాధనలు నిర్వహించారు. రాత్రి నిత్య సేవాకాలం, విశేష ప్రసాద నివేదనలు తీర్థగోష్టి , భక్తులందరికీ ప్రసాద వినియోగం నిర్వహించారు. తదుపరి స్వామివారి పుష్పయాగోత్సవం రెండోరోజు కార్యక్రమంలో భాగంగా అద్దాల మండపం వద్దకు తీసుకెళ్లి ఉత్సవమూర్తులను ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు, షోడోపచార పూజలు నిర్వహించారు. పండ్లు, పాలు నివేదన చేసి భక్తుల సమక్షంలో నీరాజనాలు సమర్పించారు. శ్రీవైష్ణవ దంపతులకు తాంబూలాలు అందజేసి నీరాట్టం సేవాకాలంతో స్వామివారికి పుష్పయాగోత్సవం పవళింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. పుష్పయాగోత్సవాల్లో ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రాజగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి స్వామివారిని దర్సించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సుగంధ ద్రవ్యాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. -
పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
ఆరిలోవ(విశాఖ): ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి చిరస్మరణీయుడిగా నిలిచారని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా విశాలాక్షినగర్లోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలీస్ అధికారులతో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాషా ప్రయుక్త్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఎనలేని కృషి చేశారన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించారని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, హరిజోద్ధరణ కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన క్వారీ లారీ
● డ్రైవర్ నిర్లక్ష్యంతో మునగపాకకు చెందిన ఎల్ఐసీ ఏజెంటు మృతి ● బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన మునగపాక: క్వారీ లారీ వ్యక్తిని బలి తీసుకుంది. పూడిమడక రోడ్డులో భారీ వాహనాలు రాకపోకలకు అనుమతులు లేకున్నా ఇవేమీ పట్టనట్టు వాహన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పూడిమడక రోడ్డులో భారీ వాహనాలను అనుమతించవద్దంటూ పలు మార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం కనిపించడం లేదు. దీనికి తోడు లారీ డ్రైవర్లు కూడా ట్రిప్పులకు కక్కుర్తి పడి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. కొంతకాలంగా రాంబిల్లి మండలంలోని నేవల్ బేస్కు బండరాళ్లను లారీలపై తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్లు రహదారిపై పడిపోతున్నాయి. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేవారు నిత్యం భయాందోళనకు గురవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆదివారం మునగపాకకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ మాడా కన్నారావు(53) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మునగపాక గ్రామానికి చెందిన మాడా కన్నారావు ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం కన్నారావు తన బైక్పై గుడికి వెళ్లేందుకు అవసరమయ్యే సామగ్రి కొనుగోలు కోసం వెళుతుండగా ఇదే సమయంలో రాంబిల్లి మండలం నేవల్ బేస్కు రాయి తరలించి తిరిగి అనకాపల్లి వైపు వస్తున్న భారీ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో కన్నారావు బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో భోరున విలపించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన కన్నారావు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పూడిమడక రోడ్డులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమస్య జటిలం కావడంతో కశింకోట సీఐ స్వామినాయుడు, మునగపాక పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులతో చర్చించారు. పూడిమడక రోడ్డులో పగటిపూట భారీ వాహనాలు రాకుండా చూడాలని , అలాగే ప్రమాదాలకు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కన్నారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కు తరలించగా సంబంధిత డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చింతపండుకు భలే డిమాండ్
● దేవరాపల్లి వారపు సంతలో హాట్కేకుల్లా విక్రయాలు ● మణుగు రూ.550 నుంచి రూ.650 వరకు పలికిన ధరలు ● ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో ధరలకు రెక్కలు దేవరాపల్లి: ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉండడంతో చింత పండుకు డిమాండ్ ఏర్పడింది. ధర పెరిగినా దేవరాపల్లిలో ఆదివారం జరిగిన వారపు సంతలో హాట్కేకుల్లా విక్రయాలు జరిగాయి. దేవరాపల్లిలో నాణ్యమైన చింతపండుతో పాటు అందుబాటు ధరలో లభిస్తుందని నమ్మకంతో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి ఇక్కడి సంతకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంతకు చింతపండు అరకొరగా వచ్చింది. సమీప గిరిజన ప్రాంత నుంచి కూడా తక్కువ మొత్తంలోనే చింతపండు వచ్చింది. కొనుగోలుదారులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికి అందుకు తగ్గట్టుగా చింతపండు లేక పోవడంతో డిమాండ్ ఏర్పడింది. కొనుగోలుదారులు పోటీ పడడంతో గంటల వ్యవధిలోనే హాట్కేకుల్లా అమ్ముడుపోయింది. మణుగు(10 కేజీలు) చింతపండు నాణ్యత ఆధారంగా రూ. 550 నుంచి రూ.650 వరకు ధర పలికింది. సాధారణంగా చింతపండు ధరలు రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. అయితే దిగుబడి తగ్గిపోవడంతోనే అమాంతం ధరలు పెరిగాయని పలువురు అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరిగే సంతకు చింతపండు మరింత తక్కువగా రానుండడంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పలువురు కొనుగోలుదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో చింతపండు కొనుగోలుదారులతో కిక్కిరిసిన వారపు సంత దేవరాపల్లిలో చింతపండు కనుగోలుదారులతో కిక్కిరిసిన వారపు సంత -
ఆంధ్ర రాష్ట్రం.. పొట్టి శ్రీరాముల త్యాగఫలం
తుమ్మపాల : అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామమని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు గాంధేయ మార్గంలో నిరాహారదీక్ష చేసి ఆశయసాధన కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలి అమరజీవిగా నిలిచారని తెలిపారు. ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అలరిస్తున్న విభిన్న వాతావరణం
ఖైదీకి ఫోన్ ఇచ్చిన భార్యాభర్తల అరెస్టు ఆరిలోవ : విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫోన్ ఇచ్చిన భార్యాభర్తలను ఆదివారం అరెస్టు చేశారు. ఇటీవల జైలులో ఖైదీల వద్ద ఫోన్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ కమిటీ వేయగా జైలులో ఫార్మసిస్ట్గా పనిచేసిన కడియం శ్రీనివాసరావు, అతని భార్య పుష్పలతలు నాగమల్లేశ్వరరావు అనే ముద్దాయికి ఫోన్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో విచారణ అధికారి, ఎస్ఐ కృష్ణ వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గతంలో శ్రీనివాసరావు ఖైదీలకు గంజాయి సరఫరా చేయడంతో విధుల నుంచి తొలగించారు. ఖైదీలకు ఫోన్ అందించే ఘటనలో కూడా శ్రీనివాసరావు నిందితుడిగా నిర్ధారణ కావడం చర్చనీయాంశమైంది. అనకాపల్లి టౌన్: అనకాపల్లి ప్రజలు అధిక మంచు, ఎండ తీవ్రత రెండింటిని చవి చూస్తున్నారు. పట్టణం, మండలంలో అధిక మంచు కురుస్తోంది. ఆదివారం ఉదయం ఏడు గంటలైనా మంచుతెరలు వీడలేదు. కనీసం వంద మీటర్ల దూరంలోని రోడ్డు కూడా సరిగ్గా కనిపించలేదు. దీంతో ప్రకృతి ప్రేమికులు మంచును ఆస్వాదిస్తూ దైనందిన కార్యక్రమాల్లో లీనమవుతున్నారు. కాస్త సమయం గడిచి తొమ్మిది గంటలయ్యేసరికి ఎండ ప్రతాపం చూపించింది. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సెలవు దినం కావడంతో ఎక్కువ శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పనిసరి పనులపై వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాలతో ఉపశమనం పొందారు. ఇంటర్ మూల్యాంకనం వేళల మార్పు విశాఖ విద్య: ఇంటర్మీడియెట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం వేళలు మార్పు చేసినట్లు ఆర్ఐవో మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రమైన ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఈనెల 17, 18 తేదీల్లో ఉదయం ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు ఉన్నందున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎడ్ల పోటీల్లో పాము హల్చల్
కశింకోట: కశింకోటలోని కస్పావీఽధిలో జరిగిన పడమటమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎడ్లబళ్ల పోటీలో ఓ పాము హల్చల్ చేయడం కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి భయం లేకుండా జెర్రిగొడ్డుగా పిలిచే సుమారు 5 అడుగుల పొడవు ఉన్న పెద్ద పామును తోక పట్టుకుని తెచ్చి చూపుతూ, కొంతసేపు నేలపై విడిచి పెట్టి దాన్ని పరుగులు పెట్టిస్తూ కలియదిరిగాడు. దీంతో పోటీలు చూడడానికి వచ్చిన వారు పరుగులు తీసి వెళ్లి పామును ఆసక్తిగా వీక్షించారు.అయితే ఇది విష పూరితమైనది కాదని, దూరంగా పొలాల వైపు తీసుకెళ్లి ఆ వ్యక్తి విడిచిపెట్టారు. -
ఐదు ఎకరాల్లో యూకలిప్టస్ తోటలు దగ్ధం
దేవరాపల్లి: కొత్తూరు ముత్యాలమ్మపాలెంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ఎకరాల మేర యూకలిఫ్టస్ తోటలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన సిరసపల్లి రాము, సిరసపల్లి దేముడమ్మ, సిరసపల్లి రాములమ్మ, చౌడువాడ లక్ష్మీ, చౌడువాడ అప్పలనర్స, చౌడువాడ అప్పలనాయుడు, బోను సింహాచలంనాయుడు, లక్కరాజు భూషణంకు చెందిన తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో కోళ్ల ఫారంకు ఎదురుగా ఉన్న యూకలిప్టస్ తోటల నుంచి మంటలు కనిపించడంతో స్థానికులు అక్కడుకు చేరుకున్నారు. అగ్ని కీలలు ఎగిసి పడడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. వెంటనే చోడవరం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి రప్పించామని, అప్పటికే తోటంతా కాలిపోయిందని స్థానిక సర్పంచ్ గంధం రామకృష్ణ తెలిపారు. మిగతా తోటలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారన్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే తోటలు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. దిబ్బిడిలో ఆరు ఎకరాల్లో సరుగుడు తోట దగ్ధం బుచ్చెయ్యపేట : దిబ్బిడి గ్రామంలో విద్యుత్ సార్ట్ సర్క్యూట్ కారణంగా ఆరు ఎకరాల్లో సరుగుడు తోటలు కాలిపోగా సుమారు రూ.నాలుగు లక్షలు ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలో గల జర్తా వారి పొలాల్లో శనివారం విద్యుత్ వైర్లు కలిసిపోయి అగ్గినిప్పులు పడగా గాలికి రాజుకుని మంటలు వ్యాపించినట్టు బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముమ్మిన నాగరాజు, పాతాళ శ్రీనివాసరావు, కందికొండ శ్రీను, సేనాపతి సూరిబాబు, దేవుడమ్మ,బోధ అమ్మాజీ, ముమ్మిన నూకరాజులకు చెందిన సరుగుడు తోటలు కాలిపోయాయి. స్ధానికుల సమాచారం మేరకు చోడవరం అగ్పిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మూడేళ్ల సరుగుడు తోటలు కాలిపోవడంతో రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. -
నేల నుంచి నీటిలోకి..
సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు కొమ్మాది: బుల్లి ఆలివ్ రిడ్లే తాబేళ్లు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తమ సహజ ఆవాసమైన సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ మనోహరమైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయపాలెం ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లను అటవీ శాఖ అధికారులు సేకరించి సాగర్నగర్లోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షించారు. వీటి నుంచి వచ్చిన పిల్లలను డీఎఫ్వో శ్రీవాణి శనివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోడుగుళ్లపాలెం నుంచి పెదనాగమయపాలెం వరకు మొత్తం 57,372 గుడ్లను సేకరించి సంరక్షించినట్లు తెలిపారు. తొలి దశలో శనివారం ఉదయం 237 తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ విడతల వారీగా మరిన్ని తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నూకాంబిక హుండీ ఆదాయం రూ.44.66 లక్షలు
హుండీ లెక్కిస్తున్న సిబ్బంది, శ్రీవారి సేవా సభ్యులు అనకాపల్లి టౌన్: నూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు దేవస్థానం ఉత్సవ మండపం ఆవరణలో శనివారం జరిగింది. గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ నుంచి శనివారం వరకు 138 రోజులలో భక్తులు సమర్పించిన ముడుపులు, మొక్కుబడులను లెక్కించారు. రూ.44,65,787 నగదు, 20.500 మిల్లీగ్రాముల బంగారం, కేజీ 925 గ్రాముల వెండి హుండీల ద్వారా వచ్చినట్లు ఎండోమెంట్ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీ సుధారాణి, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్, శ్రీవారి సేవ సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పోడు భూములకు పట్టాలివ్వండి
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు వెంకన్న, నరసింహమూర్తితో ఆదివాసీ గిరి రైతులు మాడుగుల : మైదాన ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములుకు పట్టాలివ్వాలని, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న అన్నారు. శనివారం శంకరం పంచాయితీలో కృష్ణంపాలెం, బొడ్డరేవు, మామిడిపాలెం, తాడివలస, గొప్పూరు, వెలగలపాడు గిరిజన గ్రామాల్లో సీపీఎం పాదయాత్ర నిర్వహించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొంత మంది గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా సరే వాటిలో పేర్లు తప్పుగా నమోదు జరిగిందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి గిరిజనుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి, సీపీఎం సభ్యురా లు, కార్లి భవానీ, రైతులు పాల్గొన్నారు. -
ఆర్మీలో అగ్నివీర్ అవుతారా?
● అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు ● 13 భాషల్లో ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ● ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ● విశాఖలో మరోసారి ర్యాలీ ● ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17.5 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది కీలక మార్పులు ఈ సారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ తెలిపింది. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం www. joinindianarmy.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని 0891–2756959, 0891–2754680 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
జో అచ్యుతానంద.. జోజో ముకుందా..
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల అనంతరం మూడు రోజుల పాటు జరిగే పుష్పయాగోత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉత్సవ మూర్తులను ముందుగానే అలంకరించిన అద్దాల మండపంలో గల ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండ్లు, పాలు నివేదనలు చేసి భక్తుల సమక్షంలో విశేష నీరాజనాలు సమర్పించారు. శ్రీవైష్ణవ స్వాములకు తాంబూలాలు అందజేసి నీరాట్టం సేవాకాలంలో స్వామివారికి పుష్పయాగోత్సవం (పవళింపు సేవ) మొదటిరోజు కార్యక్రమం పూర్తి చేశారు. అర్చకస్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా డోలోత్సవం శుక్రవారం రాత్రి స్వామివారి డోలోత్సవం (అద్దపు సేవ) కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం స్వామివారికి రాజయ్యపేట సముద్రతీరంలో అవబృందం కార్యక్రమం నిర్వహించారు. సముద్ర జలాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి రాత్రి రథోత్సవం జరిపారు. తదుపరి ఆలయానికి తీసుకువచ్చి అద్దపుసేవ నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారు కొత్త కళతో వెలిగిపోతూ ఉంటారు. నేరుగా చూస్తే భక్తులకు దృష్టి దోషం కలుగుతుందనే ఉద్దేశంతో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని ఊయలలో ఉంచి అద్దంలో చూపిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని అద్దంలో చూసి పరవశులయ్యారు. అనంతరం మాడవీధుల్లో తిరువీధి సేవ (దొంగల దోపు ఉత్సవం) నిర్వహించారు. తదుపరి ఆస్థాన మండపంలో లక్ష్మీ సంవాద కార్యక్రమం జరిగింది. దీంతో స్వామివారికి ఐదు రోజులపాటు నిర్వహించిన కల్యాణోత్సవాలు పరిసమాప్తమయ్యాయని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. వడ్డాది వెంకన్నకు పుష్పాంజలి సేవ బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. కల్యాణ వేడుకల్లో ఆఖరి రోజు వేంకటేశ్వరస్వామికి ఇష్టమైన శనివారం రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి ఆలయ మండపంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఊయలలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి జోలపాటలతో పుష్పాంజలి (పవళింపు) సేవ చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని బుగ్గన పెళ్లి చుక్కతో శ్రీదేవి, భూదేవి నడుమ ఇమిడిపోయిన వేంకటేశ్వరస్వామి అందాన్ని చూసి పరవశించిపోయారు. ఛలోక్తులతో కూడిన జోల పాటలు, భక్తి గీతాలు పాడుతూ ఉత్సాహంగా ఊయల సేవ చేశారు. పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు స్వామికి జోల పాడేందుకు పోటీ పడ్డారు. రాత్రికి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. వెంకన్న పవళింపు సేవలో పాల్గొని తరించిన భక్తజనం ఉపమాకలో పుష్పయాగోత్సవాలు ప్రారంభం -
కొత్త పింఛన్లు ఎప్పుడు?
● ఆత్రుతగా ఎదురుచూస్తున్న అర్హులు ● కూటమి ప్రభుత్వం 9 నెలల్లో ఒక్కరికై నా కొత్తగా పెన్షన్ ఇచ్చిందా? ● నిలదీసిన జెడ్పీటీసీ సభ్యులు ● మన్యంలో చిన్నారుల మృత్యు ఘోషపై వాడీవేడి చర్చ ● గరంగరంగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలుమహారాణిపేట (విశాఖ): కూటమి ప్రభుత్వంలో కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు మాట్లాడుతూ పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన కుటుంబ సభ్యులకు పింఛన్లు ఇస్తామని ప్రకటించారని, కానీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అలాగే అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా ఎక్కడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఇది అన్యాయమన్నారు. ఏజెన్సీలో పిల్లల మృతిపై ఆందోళన ఏజెన్సీలో వైద్య సదుపాయాలపై, పిల్లల మరణాలపై చర్చ జరిగింది. తొలుత అరకు జెడ్పీటీసీ చెట్టి రోష్ని మాట్లాడుతూ అరకు మండలం బస్కి గ్రామంలో పిల్లలు ఆకస్మికంగా మృతి చెందారని, ఈ విషయం గురించి మాట్లాడడానికి తాను హెల్త్ సబ్ సెంటర్కు కాల్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తడం లేదన్నారు. గిన్నెల, మాడగూడ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు వరుసగా చనిపోయారని, కారణం తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని చైర్పర్సన్ జె.సుభద్ర కోరారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా రాలేదని, జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు రాని అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆమె సీఈవోను కోరారు. జెడ్పీటీసీలను పట్టించుకోని హౌసింగ్ అధికారులు హౌసింగ్ అధికారులు జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదని పలువురు చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. తమ మండలాల్లో గృహ నిర్మాణ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో, కొత్త పేర్ల నమోదు చేసేటప్పుడు తమను సంప్రదించడం లేదని, దీనివల్ల స్థానికంగా తాము ఇబ్బంది పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తామని అధికారులు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల డ్రాపవుట్స్ పెరుగుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా స్థాయీ సంఘం చైర్పర్సన్ ఈర్లె అనురాధ కోరారు. పాయరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందువల్ల అనకాపల్లిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ కోరారు. అనకాపల్లి నుంచి మామిడిపాలెం వెళ్లే రహదారిలో నాణ్యత లోపించిందని జెడ్పీ కోఆప్షెన్ సభ్యుడు పెతకంశెట్టి శివ సత్యనారాయణ ఆరోపించారు. ఈ పనులకు రూ.30 లక్షల మేరకు నిధులు ఖర్చయినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని, గుంతల్లో డస్ట్తో పూడ్చడం వలన నాణ్యత లోపించిందని అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు కనిపించలేదా..! కోటవురట్ల మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జెడ్పీటీసీ సభ్యురాలు సిద్ధాబత్తుల ఉమాదేవి ధ్వజమెత్తారు. వరాహనదిలో పైలట్ ప్రాజెక్టు సమీపంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటితే నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు సంబంధించి 36 గ్రామాలకు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తితోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణానికి ప్లాస్టిక్ పెద్ద సవాలు
● దుకాణదారులు పాలిథిన్ కవర్లు విక్రయించరాదు ● వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ ఆదేశంనర్సీపట్నం: ప్లాస్టిక్ వినియోగాన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. నర్సీపట్నంలో ఉన్న దుకాణదారులకు ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ సురేంద్రను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాలన్నారు. ఇటీవల కాలంలో నర్సీపట్నంలో నాటు వైద్యులు పెరిగారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కొంతమంది డాక్టర్లు మత్తు ఇంజక్షన్లు కూడా ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో రూ.14.11 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులు అందజేస్తామన్నారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రామారావు, కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, రాజేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అచ్యుతాపురం రూరల్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం కాపాడుకోగలమని కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెలుపాక జగన్నాథపురంలో పర్యటించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్తో కలిసి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం’ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. జేసీ జాహ్నవి, ఆర్డీవో, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
● విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు ● పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు ● రేపటి నుంచి 31 వరకు నిర్వహణసాక్షి, అనకాపల్లి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయి. 31వ తేదీ రంజాన్ సెలవు ప్రకటిస్తే.. ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష సమయం. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయం ముగిసేవరకు విద్యార్థులు బయటకు రాకూడదు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గానీ, సెల్ఫోన్లు గానీ, స్మార్ట్ వాచీలు గానీ అనుమతించరు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. టెన్త్ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యార్థి హాల్టికెట్ చూపిస్తే చాలు.. టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్లు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి.. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి సౌకర్యం, పరీక్ష గదిలో ఫ్యాన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టేబుళ్లు, మరుగుదొడ్లు తదితర వసతులు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలనే ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తిచేశాం. విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. వారికి అందుబాటులో ఉండేలా స్టాప్లు ఏర్పాటు చేయాలని ప్రజారవాణా శాఖ వారిని కోరాం. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సదుపాయం కల్పించి, పరీక్ష గదుల్లో ఫ్యాన్లు పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెలుతురు బాగా ఉన్న గదులను ఎంపిక చేశాం. – అప్పారావునాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి ● -
ల్యాబ్ టెక్నీషియన్లకు పదోన్నతులు కల్పించాలి
తుమ్మపాల: గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్గా ప్రభుత్వ సర్వీస్లో చేరిన ఉద్యోగి ఎటువంటి పదోన్నతి లేకుండానే రిటైర్ అవుతున్నాడని, ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్లు కల్పించాలని మెడికల్ లేబొరేటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గీతారాణి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎంహెచ్వో రవికుమార్, డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు, సీఎస్ ఆర్ఎంవో గౌతమ్, అల్లూరి జిల్లా డీసీహెచ్ఎస్ కృష్ణారావు విచ్చేసి ల్యాబ్ టెక్నిషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గీతారాణి మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలపై అధికారులకు వివరించారు. వారికి పని భారం తగ్గించే విధంగా ప్రతి పీహెచ్సీలో అదనంగా మరో పోస్టు భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసాగా క్రమబద్ధీకరణ కొనసాగించాలన్నారు. అన్ని విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ శంకరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈతో మెండుగా ఉపాధి అవకాశాలు
తుమ్మపాల: సాంకేతిక విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని, తద్వారా విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అచ్యుతాపురంలో గల ఎంఎస్ఎంఈ విద్యా సంస్థ అధ్యాపకులు డాక్టర్ కె.వెంకట అప్పారావు అన్నారు. పట్టణంలో గల మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అచ్యుతాపురంలో ఉన్న పారిశ్రామిక వాడలో అన్ని సౌకర్యాలతో ఎంఎస్ఎంఈ విద్యా సంస్థ ఏర్పాటు చేశారన్నారు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ డిప్లమో కోర్సులో ప్రవేశ పొందడం ద్వారా ప్రఖ్యాత పరిశ్రమల్లో ఉపాధి పొందవచ్చని తెలిపారు. అదే విధంగా బీటెక్లో కూడా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ కూడా విద్యార్థుల పొందవచ్చన్నారు. ప్రవేశ పరీక్షకు ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందని, ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంట్రన్స్ పరీక్ష మే 4న ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్ దేవరశెట్టి వెంకటేశ్వర్లు, హిందీ అధ్యాపకులు మహేంద్రనాథ్ పట్నాయక్, ఆంగ్ల అధ్యాపకురాలు సుహాసిని, పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ కర్రి గంగాధర్, 10వ తరగతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అందరి చుట్టం.. వినియోగదారుల చట్టం
సాక్షి, అనకాపల్లి: కొనుగోలు చేసే ప్రజలందరికీ వినియోగదారుల రక్షణ చట్టం చుట్టంలా అండగా నిలుస్తుందని కన్జూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టం (సీపీఏ) కారణంగా లక్షలాది మంది వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్లో మార్పు, ఈ కామర్స్ అభివృద్ధి, టెలీ మార్కెటింగ్, డైరెక్ట్ సేల్స్, ఆన్లైన్ ట్రేడింగ్, తప్పుదారి పట్టించే ప్రకటనలు, కల్తీ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలు పెరిగిన నేపథ్యంలో 107 సెక్షన్లతో కొత్త వినియోగదారుల రక్షణ చట్టం–2020లో అమల్లోకి వచ్చిందన్నారు. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకుంటేనే కేసు గెలిచేందుకు వీలుగా ఉంటుందని, అలాగే గ్యారంటీ లేదా వారంటీ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. చట్టపరిధిలోకి వచ్చేవి ఇవే.. బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు, విత్తనాల కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు, పురుగుల మందుల కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు, ఎయిర్లైన్స్, క్లినికల్ లేబొరేటరీలు, ట్రాన్స్పోర్టు కొరియర్ సర్వీసు, జీవిత బీమా, రైల్వే, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, లే–అవుట్లు, గ్యాస్, లాయర్లు, అపార్ట్మెంట్లు, టూరిస్టు సర్వీసు, ఈ–కామర్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ, హౌసింగ్ బోర్డు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ఇంటర్మీడియట్ బోర్డు వినియోగదారుని చట్టపరిధిలోకి వస్తాయి. -
మాయాబజార్
కళ్ల ముందే కనికట్టు.. తూకంలో తేడాలున్నా కనిపెట్టకుండా హస్తలాఘవం.. కూరగాయలు, కిరాణా, బెల్లం, చేపలు, మాంసం, పండ్లు.. ఇలా ఏది కొన్నా అనకాపల్లిలో ఎంతో కొంత నష్టపోవలసిందే. తూనికలు కొలతల శాఖ అధికారులు ఉండే జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా మాయ చేస్తున్నారంటే జిల్లావ్యాప్తంగా వినియోగదారులు ఎంత నష్టపోతున్నారో అర్థమవుతోంది. కళ్ల ముందే తూకంలో మోసం జరిగినా వినియోగదారులు గుర్తించలేని విధంగా వ్యాపారులు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను తూకంలో తేడాలు మరింత కలవరపెడుతున్నాయి. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్టే కచ్చితమైన తూకంతో అమ్మేవారూ ఉన్నారు. కానీ ఏది రైటో ఏది తప్పో తెలుసుకోలేని అయోమయ స్థితి నెలకొంటోంది. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ●తూకంలో తేడాలు.. జనం జేబుకు చిల్లులు ●కిలోకు 100 గ్రాముల వరకు తగ్గుదల ●డిజిటల్ వేయింగ్ మెషీన్లోనూ మోసాలు ●తూతూమంత్రంగా లీగల్ మెట్రాలజీ దాడులు ●మార్కెట్లో 30 శాతానికి పైగా మోసపూరిత వ్యాపారులే.. ●వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి డిజిటల్ వేయింగ్ మెషీన్లలోనూ మోసం డిజిటల్ వేయింగ్ మెషీన్లోనూ మోసం చేసే ఆస్కారముంది. మెషీన్ క్యాలిబ్రేషన్ సెట్ చేయడం ద్వారా 1000 గ్రాములకు వారు అనుకున్నంత 900, 800 గ్రాముల వరకు సెట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి సెట్ చేస్తే అలానే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ యంత్రాన్ని లీటర్ మోడ్లో పెట్టి తూకం చేస్తున్నారు. అందులో వెయ్యి గ్రాములు కాకుండా వెయ్యి అని మాత్రమే చూపిస్తోంది. తక్కెడలు, తూకపు రాళ్ల లెక్కలు లేవు.. జిల్లా కేంద్రంలో తూనికలు, కొలతల శాఖ కార్యాలయం ఉంది. ఒక అసిస్టెంట్ కంట్రోలర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. నెలలో ఒక్కసారైనా దుకాణాల్లో తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వ్యాపారులకు ఇష్టారాజ్యంగా మారింది. తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం ముందుగా తెలిసి వ్యాపారులు పాత రాళ్లను దాచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది చిరు, బడా వ్యాపారుల వద్ద ముద్రలు వేసిన ఎలక్ట్రానిక్ కాటాలు, ఇనుప తక్కెడలు, తూకాలు చేసే రాళ్లు ఉన్నాయనే లెక్కలు అధికారుల వద్ద లేకపోవడం కొసమెరుపు. స్టాంపులు వేసిన రాళ్లు అంతంతమాత్రం చాలా దుకాణాల్లో ముఖ్యంగా కూరగాయల మార్కెట్ విక్రయదారుల్లో ఎక్కువ మంది వద్ద స్టాంపులు వేసిన తూకం రాళ్లు కనిపించవు. ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అనేక మంది వ్యాపారులు ఇంకా పాతతరపు త్రాసులనే వాడుతున్నారు. తూకం రాళ్లలో ఏ1 రకం (సరైన రాళ్లు), ఏ2 రకం (నాశిరకం రాళ్లు) ఉంటున్నాయి. వ్యాపారులు తూకం వేసేటపుడు ప్రశ్నించేవారు ఉన్నపుడు ఏ1–రకం రాళ్లు, మిగిలిన సమయాల్లో ఏ2–రకం రాళ్లు వినియోగిస్తున్నారు. ● అనకాపల్లి మార్కెట్వీధిలో ఒక కిలో కూరగాయలు కొని తూకం వేస్తే 150 గ్రాములు తేడా వచ్చింది. ఎందువల్ల తేడా వచ్చిందని అడిగితే.. కాటాను సరిచేశారు. ఇప్పుడు సరిగ్గా వచ్చింది. ● మెయిన్రోడ్డులో పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఒక కేజీ సపోట పండ్లు తీసుకుని తూకం వేస్తే 70 గ్రాములు తక్కువ చూపిస్తోంది. తక్కువగా వచ్చిందేమని అడిగితే మరో సపోటా వేశారు. ఇప్పుడు సరిపోయింది. ● నెహ్రూచౌక్, అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద గల విజయరామరాజు పేటలో ఓ మాంసం దుకాణానికి వెళ్లి కిలో చికెన్ తీసుకొని తూస్తే 100 గ్రాములు తక్కువ వచ్చింది. దీంతో దుకాణదారును ‘సాక్షి’ నిలదీయగా అప్పుడప్పుడు పొరపాటున చిన్న తేడా వస్తుందని చెప్పాడు. ● గవరపాలెంలో గల గాంధీమార్కెట్లో రోడ్డు కూడలి వద్ద ఉన్న ఒక కూరగాయల దుకాణం నుంచి కేజీ బెండకాయలు తూకం తూస్తే 50 గ్రాములు తక్కువగా చూపించింది. ● పలు దుకాణాల్లో బియ్యం బస్తా 26 కిలోలకు ధర చెల్లిస్తుండగా.. తూకం వేస్తే 25.5 కిలోలు మాత్రమే ఉంటోంది. దీనిపై బియ్యం వ్యాపారులను నిలదీస్తే బుకాయిస్తున్నారు. ● మెయిన్రోడ్డును అనుకుని ఉన్న బియ్యం షాపుల్లో బస్తాకు 25 కేజీల చొప్పున ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఇందులో 200 నుంచి 300 గ్రాములు తక్కువగా ఉంది. వ్యాపారులను అడిగితే తమకు మిల్లర్లు, హోల్సేల్ షాపుల నుంచి వస్తాయని చెబుతున్నారు. ఈ ప్యాకింగ్లు తామేమీ చేయమని, హోల్సేల్ షాపుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. సాక్షి, అనకాపల్లి/సాక్షి నెట్వర్క్: శుక్రవారం ఉదయం 10 గంటలు.. సాక్షి విలేకరుల బృందం అనకాపల్లి మార్కెట్లో ఫీల్డ్ విజిట్ ప్రారంభించింది. వివిధ రకాలైన 95 దుకాణాలకు వెళ్లింది. ఇందులో 15 షాపుల వారు తూకం పరిశీలించేందుకు సహకరించలేదు. మిగతా 80 దుకాణాల్లో తూకం ఎలా ఉందో పరిశీలించగా 50 చోట్ల బాగానే ఉంది. 30 షాపుల్లో తేడాలు కనిపించాయి. 10 చోట్ల 30 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తూకం తేడా ఉంది. 20 దుకాణాల్లో ఏకంగా 100 నుంచి 150 గ్రాముల వరకు వినియోగదారులు నష్టపోయేలా కాటాలు ఉన్నాయి. మార్కెట్లోని పెద్ద వ్యాపారస్తులు మాత్రమే ఎలక్ట్రానిక్ కాటాలను వాడుతున్నారు. సాధారణంగా ఇవి కచ్చితంగా ఉంటాయని అందరి నమ్మకం. కానీ ఆధునిక సాంకేతికతతో ఈ వేయింగ్ మిషన్లతోనూ మాయ చేయవచ్చని సాక్షి పరిశీలనలో తేలింది. తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి సరిపెడుతున్నట్టు శుక్రవారం నాటి విజిట్లో అర్థమైంది. -
చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక శివారు కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు జగన్ (20) సముద్రంలో వేటకు వెళ్లి వల వేస్తుండగా జారి సముద్రంలో పడిపోవడంతో గల్లంతై మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. శుక్రవారం ఉదయం సుమారు 9.30 గంటలకు వెళ్లిన మత్స్యకారులు రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం, సీతపాలెం పొరుగు ప్రాంతాల్లో వల వేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో జారి పడిపోయిట్లు మత్స్యకారులు తెలిపారు. జగన్ మృతితో పూడిమడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గల్లంతవడంతో మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వైభవంగా గౌర పూర్ణిమ ఉత్సవాలు
కొమ్మాది : బీచ్రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో శుక్రవారం గౌర పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గౌర పూర్ణిమ శ్రీ కృష్ణభగవానుని భక్త అవతారమైన శ్రీ చైతన్య మహా ప్రభు ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించే సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ కృష్ణుని భజన సంకీర్తనలు, పుష్పాభిషేకం నిర్వహించారు. గౌర పూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా చైతన్య లీలల్లో ఒకటైన చాంద్కాజీ ఉద్ధరణ నాటకం అద్భుతంగా ప్రదర్శిచారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీకృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో పరిష్కారం
● చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్ ● ఈ–జాగృతితో మరింత వెసులుబాటు ● జిల్లా వినియోగదారుల ఫోరం–1 ప్రెసిడెంట్ తనూజరెడ్డి సాక్షి, విశాఖపట్నం: చట్టాలపై ప్రజలు అవగాహన పొందడం ద్వారా మోసపోకుండా ఉండవచ్చని జిల్లా వినియోగదారుల ఫోరం–1 ప్రెసిడెంట్ జి.తనూజరెడ్డి అన్నారు. వస్తు సేవలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణాలు, ఇలా ఎందులో మోసం జరిగిందని భావించినా.. నిరభ్యంతరంగా జిల్లా వినియోగదారుల మండలిని ఆశ్రయించవచ్చని సూచించారు. ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే సాంకేతికత ఈ–జాగృతి పేరుతో అందుబాటులోకి వస్తోందని వెల్లడించారు. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలను ఆమె వివరించారు. ఫిర్యాదు చేయడం ఎలా అంటే? వినియోగదారుల మండలికి ఫిర్యాదు చేసి విధానం చాలా సులువు. తెల్ల కాగితం ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశాం. మీరెలా మోసపోయారో చెబితే అంతా వారే సహకారం అందిస్తారు. అన్ని రకాల వస్తువులపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది. లోపాలు, ఇబ్బందులు తలెత్తితే వస్తువు కొన్న రెండేళ్లలోపు ఫిర్యాదు చేయాలి. ఆలస్యమైతే పూర్తి ఆధారాలతో డిలే పిటిషన్ వేచవచ్చు. ప్రతివాది సంస్థ నోటీసులు అందిన 45 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయకపోతే.. తదుపరి ప్రొసీడింగ్స్ లేకుండానే కేసు పరిష్కృతమయ్యే అవకాశం ఉంది. బిల్లు తప్పకుండా తీసుకోవాలి వినియోగదారుడు ఏదైనా వస్తువును కొన్న తర్వాత బిల్లు తప్పకుండా తీసుకోవాలి. ఇదే ప్రాథమిక ఆధారం. అప్పుడే కేసు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందవచ్చు. రూ.5లక్షల లోపు వస్తువు ధర ఉంటే ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరం(కోర్టు)లో కేసులు వేయవచ్చు. రూ.5 లక్షలపైబడి ఉంటే.. రూ.400 నుంచి రూ.2 వేల వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులు ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులొస్తుంటాయి. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, పెట్రోల్ దుకాణాలు, ధరల వ్యత్యాసం, బీమా, వైద్యం వంటి ఎక్కువగా ఉంటాయి. వచ్చిన ఫిర్యాదుల్లో బీమా కంపెనీల మోసాలపై 50 శాతం వరకు ఉండగా.. మోటర్ వాహనాలపై 30 శాతం ఉంటున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో న్యాయవాది సాయంతో వస్తున్న ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. 90 రోజుల్లో పరిష్కారం పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. 90 రోజుల్లో పరిష్కృతమై వినియోగదారుడికి పరిహారం అందించగలుగుతున్నాం. కొన్ని కేసులు మాత్రం ఎక్కువ సమయం పడుతున్నాయి. ప్రతి నెలా 30 కిపైగా కేసులు పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకూ 190 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. పరిధి లేదు.. ఫిర్యాదు చేయవచ్చు ఒకప్పుడు ఎక్కడ వస్తువు కొనుగోలు చేస్తే ఆ పరిధిలోనే ఫిర్యాదు చేసేవారు. చట్టంలో వచ్చిన మార్పులు వినియోగదారుడికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఎవరు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ–జాగృతి అమల్లోకి రానుంది. అంటే పేపర్లెస్ విధానం. ప్రొసీడింగ్స్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటాయి. భయపడకుండా రావాలి అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. జిల్లా వినియోగదారుల ఫోరం ద్వారా నష్ట పరిహారం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు, రాష్ట్ర కమిషన్ ద్వారా రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు పొందవచ్చు. రూ.10 కోట్లు దాటితే జాతీయ వినయోగదారుల కమిషన్లో కేసులు వేసుకునే అవకాశం ఉంటుంది. మోసం జరిగిందని గుర్తిస్తే ప్రతి ఒక్కరూ భయపడకుండా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం. -
అట్టహాసంగా జాతీయ నాటకోత్సవాలు ప్రారంభం
మురళీనగర్: కేవీ మెమోరియల్ ఆర్ట్స్, విశాఖ పోర్ట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మురళీనగర్ వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో మురళీనగర్లోని వేములపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయస్థాయి ఆహ్వాన నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రదర్శించిన నాటికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు పొందిన రంగస్థల నటులు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముందుగా గుంటూరు అభినయ ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంద్రప్రస్థం’యువతను ఆలోచింపజేసింది. నేటి యువత జీవితంలో స్థిరత్వం లేకుండా ప్రేమ, పెళ్లి మోజులో పడటం, అనంతరం జీవితంలో వారికి ఎదురయ్యే పరిణామాలు, వారి కష్టాలను కళ్లకు కట్టినట్లు నటీనటులు ప్రదర్శించారు. ‘వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి అందరూ డబ్బు మోజులో సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాల్లోకి వెళ్లిపోతే రానున్న కాలంలో రైతులనేవారు కనిపించరు. దీని వల్ల తిండి కొరత ఏర్పడితే మానవ మనుగడ పరిస్థితి ఏమిటి?’అనే సందేశాత్మక అంశంతో చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ నటులు‘మా ఇంట్లో మహా భారతం’నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ భోగీల్లో ఉన్న ప్రయాణికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఒక రైలు ప్రమాదం సమయంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న తన కొడుకు ఆచూకీ తెలియక ఒక తల్లి అనుభవించే ఆవేదనను తెలిపే ‘జనరల్ బోగీలు’నాటికను కొలకలూరు సాయి ఆర్ట్స్ బృందం ప్రదర్శించింది. పార్కు అధ్యక్ష, కార్యదర్శులు సనపల వరప్రసాద్, పి.వెంకట సూర్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాకర్స్ డిస్ట్రిక్ట్–101 ఆర్సీ–5 యు.శుభ, వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు పల్లా చంద్రమౌళి సహకరించారు. శనివారం సాయంత్రం 6.15కు ఒంగోలు పండు క్రియేషన్స్ వారిచే ‘పక్కింటి మొగుడు’, రాత్రి 8.15 గంటలకు విశాఖ జాస్మిన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ మహిళలచే ‘సంకల్పం’నాటికల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
సొంత గనుల కోసం కార్మికుల పోరాటం
సీతమ్మధార: స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మహా ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, గాజువాకలో తలపెట్టిన ధర్నాకు పోలీసులు అడ్డుపడి నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలగించిన సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. స్టీల్ప్లాంట్లోని ఆఫీసర్లు, శాశ్వత ఉద్యోగులకు మూడు నెలల బకాయి జీతాలు విడుదల చేయాలని, స్టీల్ప్లాంట్ క్వార్టర్లలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఉద్యమాలు నిర్వహిస్తున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ నాయకుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు వై.రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, పి.మణి, కె.ఎం.కుమార మంగళం, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు ఎస్.కె.రెహమాన్, జె.డి.నాయుడు పాల్గొన్నారు. -
కచ్చితంగా తూకం వేస్తున్న దుకాణాలూ ఉన్నాయి..
●అనకాపల్లి రామచంద్ర థియేటర్ జంక్షన్లో ఏర్పాటు చేసిన శివరామకృష్ణ స్వీట్స్ షాపులో ‘సాక్షి’ ఒక కేజీ మిక్సర్, ఒక కేజీ స్వీట్ తీసుకొని తూకం వేయగా.. ఒక్క గ్రాము కూడా తేడా లేకుండా సరిసమానంగా వచ్చింది. దుకాణ యాజమాని పతివాడ రామకృష్ణ మాట్లాడుతూ.. మోసం లేకుండా అమ్మితే వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతుందని, దీర్ఘకాలంలో వ్యాపారాభివృద్ధికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ●గాంధీ మార్కెట్లో సురేష్ కిరాణా హోల్సేల్ షాపునకు వెళ్లి ఒక కేజీ కందిపప్పు తూకం వేయగా సరిగా ఉంది. ●అనకాపల్లిలో సిద్ధి లింగేశ్వరరావుస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీజయలక్ష్మీ ఎంపోరియం టీ పొడి షాపులో ఒక కేజీ టీ పొడి తూకం తూయగా సమానంగానే వచ్చింది. ●గాంధీ మార్కెట్లో బెల్లం షాపులో 9.5 కేజీ బెల్లం దిమ్మ తూకం వేయగా సరిగానే ఉంది ●గాంధీ మార్కెట్లో కూరగాయలు అమ్మే మహిళా వ్యాపారి దగ్గర ఒక కేజీ బెండకాయలు తూకం వేయగా.. 20 గ్రాములు తక్కువగా వచ్చింది. మరో రెండు బెండకాయలు వేయగా తూకం సరిపోయింది. -
అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దేవస్థానం ఈవోగా వెంపలి
మహారాణిపేట: అనకాపల్లి లోని శ్రీ నూకాంబికా అమ్మ వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సింహాచలం దేవ స్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేస్తున్న వెంపలి రాంబాబు నియమితులయ్యారు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాంబాబును ఇటీవల సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి (ఏఈవో)గా బదిలీ చేశారు. ఆయనకు సహాయ కమిషనర్గా పదోన్న తి లభించడంతో అనకాపల్లి దేవస్థానానికి సహా య కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నియమించారు. ప్రస్తుతం నూకాలమ్మ అమ్మవా రి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుజాత పని చేస్తున్నారు. శనివారం వెంపలి రాంబాబు ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఉక్కు ఎస్ఎంఎస్లో ప్రమాదం ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్)–2 విభాగంలో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగికి గాయాలయ్యాయి. కార్మిక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఎంఎస్–2 విభాగం కన్వర్టర్స్లోని హాట్మెటల్ చెక్ చేసే సమయంలో ఒక్కసారిగా స్లాగ్ బయటకు తుల్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి బలిరెడ్డి పెంటయ్యపై స్లాగ్ పడటంతో గాయపడ్డాడు. బాధితుడిని ఉక్కు జనరల్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు
సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వివాహం కోసం శుక్రవారం సింహగిరి నుంచి కొండ దిగువకు దిగి వచ్చి స్వామి.. పిల్లనివ్వమని తన సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని కోరారు. ఏం చూసి నీకు పిల్లనివ్వాలని తొలుత నిరాకరించిన అమ్మవారు.. ఆ తర్వాత స్వామి వైభవాన్ని, ఆయనకున్న అసంఖ్యాకమైన భక్తజనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. చివరకు అమ్మవారు పిల్లనివ్వడానికి అంగీకరించింది. దీంతో ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఉత్సవం, వచ్చే నెల 8వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. దీంతో సింహగిరిపై పెళ్లి సందడి నెలకొంది. ఘనంగా డోలోత్సవం ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం ఘనంగా జరిగింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామికి జరిగే వార్షిక కల్యాణోత్సవానికి ముందు వచ్చే ఫాల్గుణ పౌర్ణమి రోజు అడవివరంలో స్వామికి డోలోత్సవం విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. తనకు పిల్లనివ్వాలంటూ తన సోదరి అయిన పైడితల్లి అమ్మవారిని స్వామి అర్ధించే విధానాన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమి ఉత్సవం(డోలోత్సవం)గా అభివర్ణిస్తారు. కాగా.. కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపంలో ఈ ఉత్సవాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహగిరిపై నుంచి పల్లకీలో మెట్లమార్గం ద్వారా తొలిపావంచా వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామికి దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, అధికారులు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని ఊరేగింపుగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ స్వామికి గ్రామస్తులు విశేషంగా హారతులుపట్టారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి ఉద్యానవన మండపంలో ఏర్పాటు చేసిన డోలీపై అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. చూర్ణోత్సవం, వసంతోత్సం నిర్వహించారు. పూజలు చేసిన వసంతాలను స్వామికి సమర్పించారు. అనంతరం నాళాయిర దివ్య ప్రబంధాన్ని ఆలపిస్తూ డోలోత్సవం నిర్వహించారు. తదుపరి స్వామికి సమర్పించిన వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. స్వామి కి పెళ్లికుదిరిన ఆనందంలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు ఒకరిపై ఒకరు వసంతాలను జల్లుకుని ఆనంద డోలికల్లో మునిగితేలారు. అనంతరం భక్తులకు పానకాన్ని ప్రసాదంగా అందజేశారు. తర్వాత అడవివరంలో తిరువీధి నిర్వహించారు. పెళ్లి కొడుకు అలంకరణలో తమ ఇంటిముందుకు వచ్చిన స్వామికి గ్రామస్తులు మంగళ హారతులిచ్చా రు. తదుపరి స్వామిని మరల పైడితల్లి ఆలయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి సింహగిరికి చేర్చారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, డిప్యూటీ ఈవో రాధ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఏప్రిల్ 8న వార్షిక కల్యాణోత్సవం ఉద్యానవన మండపంలోఘనంగా డోలోత్సవం శాస్త్రోక్తంగా వసంతాల సమర్పణ -
క్వారీ లారీలు ఆపాలని రైతుల ఆందోళన
రోలుగుంట: రోజురోజుకు క్వారీ యాజమాన్యానికి, స్థానిక రైతుల మధ్య వివాదం తీవ్రతరం అవుతున్నా అధికారులు, స్థానిక నాయకులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టం చేకూర్చే క్వారీలు ఆపండని బాధిత రైతులు కోరుతున్నా నాయకులు పట్టించుకోవడంలేదు. తమకు ప్రభుత్వ అనుమతి ఉందని, స్థానిక నాయకులతో సత్సంబంధాలున్నాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ క్వారీ యాజమాన్యం చెప్పడంతో శరభవరం, రాజన్నపేట, గొల్లపేట, వడ్డిప గ్రామాల రైతులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకూ సుమారు 25 రోజుల పాటు నల్లరాయి రవాణా ఆపిన యజమాన్యం తిరిగి దానిని కొనసాగించింది. దీంతో పలువురు రవాణా ఆపాలి, కొండలు పేల్చడం మానేయాలంటూ యాజమాన్యాన్ని కోరారు. అయితే వారు దీన్ని పట్టించుకోలేదు. లారీల్లో డ్రైవర్లుగా సమీప గ్రామస్తులకు అవకాశం కల్పించి ఉపాధికి తోడ్పాటునందిస్తున్నాం అంటూ చెబుతున్నారు. దీంతో యాజమాన్యానికి, సమీప గ్రామాల రైతులకు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శరభవరం గ్రామానికి చెందిన జలుమూరి సత్తిబాబు అనే రైతు మానసిక వ్యధతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యం అందించడంతో కోలుకోగా గురువారం రాత్రి సత్తిబాబుని పంపించేశారు. దీంతో బాధిత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాల మద్దతు తీసుకుని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ కల్తీ
● మరమ్మతులకు గురవుతున్న వాహనాలు ● కొలతల్లో రీడింగ్ మోసాలు ● పట్టించుకోని తనిఖీ అధికారులు ● వినియోగదారుల ఆగ్రహంచోడవరం: అసలే ఆకాశాన్నంటిన ధర.. ఆపై ఆయిల్ కల్తీ. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పెట్రోల్ బంకుల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. వినియోగదారుల క్షేమాన్ని వదిలేసి, కేవలం దోపిడీ భావంతోనే పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఆయిల్ కల్తీ చేస్తున్నారు. దీంతో రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలు మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో వాహనాలపై తిరగడమే అందరికీ భారంగా మారింది. దీనికి ఆయిల్ కల్తీ కూడా తోడవడంతో మరమ్మతులకు గురైన వాహనాలకు పెట్టుబడులు పెట్టలేక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 100కి పైగా పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. పెట్రోల్, డీజిల్లో ఇథనాయిల్, ఇతర క్రూడాయిల్ కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్ కల్తీతో పాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్ ఆయిల్ ట్యాంకర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు పెట్రోల్, డీజిల్ ట్యాంకుల్లో చేరి ఆయిల్లో కలిసిపోతుండగా ఆ కల్తీ ఆయిల్నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల పెట్రోల్ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, తాళ్లపాలెం, నర్సీపట్నం, పెందుర్తి ప్రాంతాల్లోని బంకుల్లో ఆయిల్ కల్తీ మరీ ఘోరంగా జరుగుతోంది. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, రెవెన్యూ, తూనికలు–కొలతలు, పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ తనిఖీలు మొక్కుబడిగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్ బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్ కల్తీకి, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారని వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆయిల్తో మరమ్మతులకు గురైన వాహనాలు మార్గ మధ్యలోనే నిలిచిపోవడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే వారు, అత్యవసర పనులపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఆయిల్ పంపింగ్ చేసే మిషన్ల వద్ద పాయింట్ల రీడింగ్లో ఎడ్జిస్టింగ్ చేస్తున్నారు. అసలే లీటర్ పెట్రోల్ ధర రూ. 108.41 ఉండగా డీజిల్ ధర రూ. 98 ఉంది. ఇంత ఎక్కువగా ధరలు పెరిగిపోయి ఆయిల్ వేయించుకోవడమే భారంగా మారిన పరిస్థితుల్లో రీడింగ్లో మోసాలు, ఆయిల్లో కల్తీతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణం పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.● -
నేత్రపర్వం.. వెంకన్న చక్రతీర్థం
నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఉపమాక వెంకన్న చక్రవారి స్నానం శుక్రవారం ఘనంగా జరిగింది. పౌర్ణమినాడు వేంకటేశ్వరస్వామి అత్తవారింటికి (సముద్రుడి) వెళ్లే సన్నివేశాన్ని చక్రవారి స్నానంగా పిలుస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని రాజాధిరాజవాహనంపై ఉంచి రాజయ్యపేట సముద్రతీరానికి తీసుకెళ్లారు. ప్రతేకంగా ఏర్పాటు చేసిన పందిట్లో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి, చక్రపెరుమాళ్లను సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సముద్ర జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకించారు. సాగర జలాలతో అభిషేకం అనంతరం సాయంకాల తిరువారాధన, స్వప్న తిరుమంజనం అనంతరం నాలాయిర సేవాకాలంలో ఆరాధన, ప్రసాద నివేదన కార్యక్రమాలు జరిగాయి. స్వామివారి చక్రవారి స్నానం సందర్భంగా పలువురు భక్తులు సముద్రంలో స్నానం చేసేందుకు పోటీ పడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పలువురు తోడపెద్దులు, అమ్మవారి ఘటాలను తీసుకువచ్చి సముద్ర స్నానమాచరింపచేశారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకు వచ్చి ఆలయంలో అద్దాల మండపంలో స్వామివారికి డోలోత్సవం (అద్దపు సేవ) నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. నాగవల్లి వసంతోత్సవానికి పోటెత్తిన భక్తులు బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి నాగవల్లి వసంతోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు శుక్రవారం జరిగిన ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. రాష్టం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను కొండ దిగువకు దించి గజ గరుడ వాహనాలపై ఉంచి వడ్డాది పుర వీధుల్లో తిరువీధి వసంతోత్సవం నిర్వహించారు. సన్నాయి, మేళతాళాలతో డప్పులు, వాయిద్యాల నడుమ వేలాది మంది భక్తులు రంగులు పులుముకుంటూ స్వామివారిపై రంగులు జల్లి ఆనందంతో పులకించారు. అనంతరం వసంతాన్ని తమపై జల్లుకుని భక్తిభావంలో స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులు స్వామి రథం వెంట పురవీధుల్లో తిరుగుతూ భక్తి పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ఉత్సాహంగా డాన్స్లు చేస్తూ స్వామిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసరావులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వడ్డాది శారదా నదిలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు శాస్రోక్తంగా వేదపండితుల సమక్షంలో ఈవో శర్మ, ఆలయ సిబ్బంది చక్రస్నానం చేయించారు. స్వామివారితో పాటు పలువురు భక్తులు శారదా నదిలో స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను గిరిజాంబ కొండపైకి చేర్చారు. రాత్రికి ఆలయం వద్ద భారీ మందుగుండు సామగ్రి కాల్చివేత భక్తులకు కనువిందు చేసింది. వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
చోడవరం దగ్గర బంకులో పెట్రోల్ కొట్టించాను. కొంచెం దూరం వెళ్లి ఇంజిన్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ షెడ్కు తెచ్చాను. ఆయిల్ కల్తీ వల్లే ఇంజిన్ పట్టేసిందని మెకానిక్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కల్తీని నివారించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మా వాహనాలు పాడవుతున్నాయి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. – అప్పలనాయుడు, వాహదారుడు, చోడవరం ఆయిల్ కల్తీని అరికట్టాలి.. నేను కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం బయలుదేరాను. వెంకన్నపాలెం సమీపంలోని ఒక బంకులో నా బైక్లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించాను. ఇక్కడ ఆయిల్ వేయించిన తర్వాత సైలెన్సర్ నుంచి పొగ ఎక్కువగా వచ్చింది. మెకానిక్ షెడ్కు తీసుకెళ్తే కల్తీ ఆయిలే కారణమని అన్నారు. రీడింగ్లో కూడా మోసం జరుగుతోంది. లీటర్ ఆయిల్ పూర్తిగా రావడం లేదు. బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలను అరికట్టాలి. – సీహెచ్ శ్రీనివాసరావు, వాహనదారుడు, చోడవరం -
బడిలో బలవంతపు తీర్మానాలు
విశాఖ విద్య : ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా మోడల్ స్కూళ్లను తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి, చుట్టు పక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఇందులో విలీనం చేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దూరంగా వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ప్రాథమిక విద్యకు విఘాతం కలిగేలా కూటమి ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరిట స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది పారదర్శకంగా జరగడం లేదు. పాఠశాలల పునర్నిర్మాణంపై వ్యతిరేకత లేకుండా చూడాలనే కూటమి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో దీనిపై నేరుగా జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగారు. దీంతో బడిలో బలవంతపు తీర్మానాలు జరిగిపోతున్నాయి. పాఠశాలల పునర్నిర్మాణం ఇలా.. పాఠశాలల పునర్నిర్మాణంలో భాగంగా ఇక నుంచి శాటిలైట్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, అలాగే 1, 2 తరగతులు), మోడల్ ప్రైమరీ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు), హైస్కూళ్లు (6 నుంచి 10 వరకు) ఉండేలా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను దానిలోకి తరలిస్తారు. 60 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే దాన్ని యథావిధిగా కొనసాగిస్తారు. మిగతా స్కూళ్లలో కేవలం 1, 2 తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు పూర్తిగా కనుమరుగైపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో విలీనానికి సై అంటున్నారా..? కూటమి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఇంకా తగ్గిపోతాయని ఉపాధ్యాయులు బాహాటంగానే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలతో చాలా స్కూళ్లలో 1, 2 తరగతుల నిర్వహణకు విద్యార్థులు లేక, స్కూళ్లకు తాళాలు వేయాల్సిందే. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు మూతపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానాలు వస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్లో తమ బడి మూతపడుతుందనే విషయం వారికి తెలిసే, ఇదంతా జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగులు ఉపాధ్యాయుల దారెటో.. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటి వరకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు (ఎస్జీటీ) పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో 783 మంది, అనకాపల్లిలో 2,114 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,566 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. 3, 4, 5 తరగతులను మోడల్ స్కూళ్లకు తరలించినట్లయితే, ఆయా పాఠశాలల్లో ఇక ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడు జిల్లాల్లో కలిపి ఆరు వందలకు పైగానే ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉంటారు. రేషనలైజేషన్ పేరుతో వీరిలో ఎక్కువ మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి పంపించాల్సి ఉంటుంది. 117 జీవో అమల్లో భాగంగా జరిగిన రేషనలైజేషన్తో ఏజెన్సీకి వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పట్లో వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా చేపడుతున్న చర్యలతో మిగులు ఉపాధ్యాయులు దారెటనేది ప్రశ్నార్థకమే. తుదిదశకు స్కూళ్ల పునర్నిర్మాణం ప్రక్రియ ప్రభుత్వ నిర్ణయానికి విశాఖలో 40.45 శాతం వ్యతిరేకత అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 85 శాతం ఓకేనట మూతపడనున్న ప్రాథమిక పాఠశాలలు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆందోళన స్కూళ్ల పునర్నిర్మాణంపై అభిప్రాయ సేకరణ ఇలా.. జిల్లా మండలాలు పంచాయతీలు ప్రభుత్వ అభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణలో స్కూళ్లు పూర్తయిన స్కూళ్లు ఆమోదం శాతం విశాఖపట్నం 11 161 560 440 81.63 అనకాపల్లి 24 667 1,408 1,159 84.85 అల్లూరి 22 421 1,673 1,587 98.02 మోడల్ స్కూళ్లుపై అభిప్రాయ సేకరణ ఇలా.. జిల్లా ప్రతిపాదిత మోడల్ స్కూళ్లు ఎస్ఎంసీల నుంచి వచ్చిన వ్యతిరేకత శాతం విశాఖపట్నం 178 40.45 అనకాపల్లి 180 15.53 అల్లూరి 252 15.88 -
టీడీపీ, జనసేన డిష్యుం డిష్యుం
తుమ్మపాల : మండలంలో కొండుపాలెం పంచాయతీ చేనుల అగ్రహారం గ్రామంలో ఈ నెల 9న జరిగిన గ్రామ దేవత శ్రీ సత్తెమ్మ తల్లి జాతరలో మొదలైన ఫ్లెక్సీల వివాదం తీవ్రతరమై టీడీపీ వర్సస్ జనసేనగా మారింది. ఆ రోజు ఉదయం ఫ్లెక్సీల చించివేతతో మొదలైన ఘర్షణ సాయంత్రానికి ఒకరిపై మరొకరు కాపుకాచి దాడులు చేసుకునేంతగా ముదిరిపోయింది. టీడీపీ ఎంపీటీసీ భర్త మధుపాడ నరసింగరావు, జనసేన పార్టీ నేత, మాజీ సర్పంచ్ మధుపాడ శ్రీనివాసరావు, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా కొట్టుకున్నారు. గాయాలపాలైన ఇరు వర్గాలు స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మధుపాడ నరసింగరావును మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఇదిలా ఉండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఇరువురికీ న్యాయం చేయలేక జనసేనకు చెందిన శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నేతగా తప్పుడు ప్రకటన చేయడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా ఇరువర్గాలను పోలీసులు విచారించారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చేనుల అగ్రహారంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు తీవ్ర గాయాలపాలైన ఎంపీటీసీ భర్త నరసింగరావు -
అన్నం ఇలాగేనా వండేది...
యలమంచిలి రూరల్ : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు జి.దేవి గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి విద్యార్థులకు, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆయా పాఠశాలల పరిసరాలు, వండిన ఆహార పదార్థాల నాణ్యత, నిర్దేశిత కొలతల్లో ఆహార పదార్థాలు వండి పెడుతున్నారో లేదో పరిశీలించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు పాఠశాలలో వండిన అన్నం ముద్దగా ఉండడం, కొంతమంది విద్యార్థులకు అన్నం చాలకపోవడంతో ఆమె వంట ఏజెన్సీ నిర్వాహకులు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం ఎందుకు ముద్ద అయిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏజెన్సీ నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఇలా అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార నాణ్యత ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో అరుణ్ కుమార్, రెవెన్యూ,విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ రోడ్డు జెడ్పీ పాఠశాలలో ఆహార కమిషన్ సభ్యురాలి తనిఖీలు నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక -
సారా రహిత రాష్ట్రం కోసమే నవోదయం 2.0
అచ్యుతాపురం రూరల్ : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గురువారం పూడిమడకలో సారాకు వ్యతిరేకంగా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డి.శ్రీరామ చంద్రమూర్తి, అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ ఎౖక్సైజ్ అధికారి వి.సుధీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా ఏపీ ప్రొహిబిషన్ చట్టం 1995 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సారా సంబంధిత ఫిర్యాదుల కోసం 14405 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలని సూచించారు. సారా రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ప్రారంభించిన నవోద యం 2.0 కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. యలమంచిలి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ పి.తేజో వెంకట కుమార్, ఎస్ఐ సుధాకర్, ఎస్ఐ వెంకటరావు, మహిళా పోలీసులు రేవతి, రత్నకుమారి, వీఆర్వో కిరణ్ పాల్గొన్నారు. -
‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’లో ప్రతి ఉద్యోగి పాల్గొనాలి
తుమ్మపాల: జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాల యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఈ నెల 15న మూడో శనివారం నిర్వహించే శుభ్రత కార్యక్రమాలపై గురువారం కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభు త్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు వంటి ప్రదేశాలలో పరిసరాల పరిశుభ్రత చేపట్టాలన్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది బహిరంగ ప్రదేశా ల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని, అందులో ప్రజలను, విద్యార్థులను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, మూడో శనివారం ప్రభుత్వం నిర్దేశించిన థీంతో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడం జరిగిందని, దాని అమ్మకాలు, కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వినియోగదారులు రీయూజ్ కవర్లు, సంచులు వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మొక్కలు నాటాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు ఏర్పాటు చేయాలని, పరిసరాలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సుందరీకరణలో భాగంగా వంతెనలు, భవనాలపై సృజనాత్మక పెయింటిగులు వేయించాలని తెలిపారు. స్వచ్ఛ అవార్డులు... మంచి పనితీరు కనబరిచిన స్వచ్ఛ వార్డు, స్వచ్ఛపాఠశాల, స్వచ్ఛ అపార్ట్మెంట్, స్వచ్ఛ కళాశాల, స్వచ్ఛ బస్టాండ్, రైల్వే స్టేషన్లను గుర్తించి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యకమానికి సంబంధించి ప్రతి జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా గణాంకాధికారి జి.రామారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె. శచీదేవి, జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఇ.నాగలక్ష్మి, జిల్లా ప్రజా రవాణా అధికారి కె.పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి, డ్వామా పీడీ బి.పూర్ణమాదేవి పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం కలెక్టర్ విజయ కృష్ణన్ -
పసుపు సాగుకు సిరుల ఛాయ
● మాడుగుల పసుపునకు భలే గిరాకీ ● రంగు, నాణ్యతలో టాప్ ● ఏజెన్సీలో విరివిగా పసుపు సాగు ● మాడుగుల, ఎస్.కోట, నర్సీపట్నం కేంద్రాలకు లక్షలాది టన్నుల సరఫరా ● ఏటా 1100 కుటుంబాలకు జీవనోపాధి ● రూ.96 కోట్ల టర్నోవర్ మాడుగుల : ఉమ్మడి విశాఖ జిల్లాలో మన్యం ముఖద్వారమైన మాడుగుల పసుపు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఏజెన్సీలో 11 మండలాల్లో పండించిన పసుపు మాడుగుల పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలకు సరఫరా అవుతుంది. గతంలో 3 వేల ఎకరాలకు పరిమితమైన పసుపు సాగు నేడు 6 వేల ఎకరాలకు పైగా పెరిగింది. ఏజెన్సీ 11 మండలాల నుంచి 80 కిలోలున్న బస్తా లు 80 వేల బస్తాలు వచ్చేవి. ఈ ఏడాది సుమారు లక్షా 70 వేల బస్తాలు సరఫరా అవుతాయని రైతు లు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పసుపు ప్రాసెసింగ్ ఇలా... విశాఖ ఏజెన్సీలో పండించిన పసుపు దుంపలు మాడుగుల చేరాక, అక్కడ డ్రమ్ముల్లో వేసి ఉడక బెట్టి ప్రాసెసింగ్ చేస్తారు. అనేకమైన ప్రాసెసింగ్ తరువాత ఆరెంజ్ ఎల్లో రంగుకు మారిన తరువాత ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి ఎగుమతులు చేస్తారు. పంట పండించే దగ్గర నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పసుపు వ్యాపారంపై సుమారు 1100 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నర్సీపట్నం, పాలకొండ, రాజమండ్రి, వరంగల్, నిజామాబాద్, దుగ్గిరాల, తమిళనాడు, కేరళ, ఒడిశా, కురుపాం, ఈరోడ్డు, బరంపురంలో పసుపు పరిశ్రమలున్నాయి. ఉత్తరాంధ్రాలో మాడుగుల, ఎస్.కోట, తుని, నర్సీపట్నం, సాలూరుల్లో పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలున్నాయి. కానీ మాడుగుల పసుపునకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. విశాఖ మన్యంలో పండించే పసుపులో అధిక కుర్కుమిన్తో పాటు, చర్య సౌందర్యానికి ఉపయోగపడే, ఓలంటయిల్ ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మిగతా ప్రాంతాల పసుపులో 2 శాతం కుర్కుమిన్ ఉంటే మాడుగుల పసుపులో మాత్రం 5 శాతం కుర్కుమిన్ ఉండడంతో పాటు రంగు ఆరంజ్ ఎల్లో కావడంతో మంచి క్రేజ్ ఉంది. నాణ్యమైన పసుపు కావడంతో సౌందర్యానికి, వివిధ రకాల వంటకాల్లోనూ ఈ పసుపు విరివిగా వినియోగించడం వల్ల డిమాండ్ బాగుంటుంది. పసుపు ఎగుమతులు ఇలా అధిక కుర్కుమిన్తో గిరాకీ కుర్కుమిన్ అధికంగా ఉండే పసుపు ఎక్కువగా తమిళనాడు లో ఉపయోగిస్తున్నారు. ఔషధ తయారీలో కూడా ఉపయోగించడంతో మాడుగుల పసుపునకు మంచి గిరాకీ ఉంది. గతంలో కిలో పసుపు ధర రూ.70 నుంచి రూ.90 వరకు పలికేది. రెండేళ్లుగా రూ. 120 నుంచి రూ.140 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ ఏడాది సీజన్ తొలినాళ్లలోనే రూ.125 పలకడం విశేషం. దీంతో అటు రైతులకు, ఇటు వ్యాపారులకు లాభాలు వస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి అరికట్టడంతో ఏజెన్సీలో అందుకు ప్రత్యామ్నాయంగా పసుపు సాగు పెరిగింది. – నూతిగట్టు నాగశంకర్, పసుపు వ్యాపారి, మాడుగుల ఈ ప్రాంతంలో పండించే దుంప పసుపు సుమారు 300 ఏళ్ల నుంచి వ్యాపారుల ద్వారా మాడుగుల చేరుకుంటుంది. మాడుగులలో సుమారు 10 పసుపు ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా ఛాయ పసుపు తయారు చేస్తున్నారు. ఏటా సుమారుగా 800 లారీల పసుపు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాడుగుల ప్రాసెసింగ్ కేంద్రాలకు చేరుకుంటుంది. ఇక్కడ అనేక రకాలుగా ప్రాసెసింగ్ చేసిన తరువాత గ్రేడింగ్ చేసి మేలిమి పసుపు, నార పసుపు విడివిడిగా ప్యాకింగ్ చేసి ఎగుమతులు చేస్తారు. సుమారు 500 లారీల వరకు చైన్నెకి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మరో 200 లారీల వరకు కొచ్చిన్కు ఎగుమతులు చేస్తారు. 100 లారీల వరకు స్థానికంగా శుభకార్యాలతో పాటు వంటకాల కోసం వ్యాపారులకు విక్రయాలు జరుగుతాయి. బస్తా 80 కిలోల చొప్పున ఒక్కో లారీకి 125 బస్తాలు ఎగుమతులు చేస్తారు. ఈ లెక్కన 800 లారీలకు కిలో పసుపు రూ.125 చొప్పున ప్రతి ఏటా సుమారుగా రూ.96 కోట్ల టర్నోవర్ ఉంటుంది. -
సన్యాసిరాజుపాలెంలో చోరీ
కోటవురట్ల: ఆ దొంగ మంచి దొంగ.. ఎందుకంటే బీరువాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నప్పటికీ తనకు కావలసిన కొంత నగదు, బంగారాన్ని మాత్రమే కాజేసి జాలి చూపించాడు. పోలీసులు సైతం విస్తుపోయిన ఈ ఘటన రామచంద్రపాలెం శివారు సన్యాసిరాజుపాలెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. సన్యాసిరాజుపాలేనికి చెందిన శింగంపల్లి వరలక్ష్మి, కొండబాబు దంపతులు ఊరి చివర ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్నారు. కొడుకు లంకెలపాలెంలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. వరలక్ష్మి, కొండబాబు దంపతులు ఊళ్లో పని చేసుకుంటూ ఉంటారు. గత నెల 26వ తేదీన ఊళ్లో కొందరితో కలిసి ఉపాధి నిమిత్తం పడమటకు పని కోసం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని గురువారం ఉదయం ఇంటికి తిరిగొచ్చారు. ఇంటి తలుపుకు వేసిన తాళం కప్ప ఉన్నదున్నట్టుగా ఉండగానే గెడ మాత్రం తప్పించి ఉండడాన్ని గమనించి ఆందోళనగా ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో బీరువా కూడా గెడ తప్పించి ఉండడం గుర్తించి వెంటనే నగదు, బంగారం కోసం వెతికారు. ఇంటి స్థలం కొనుగోలు కోసం దాచి ఉంచిన రూ.5 లక్షల్లో రూ.2.50 లక్షలు, 18 గ్రాముల బంగారు ఆభరణాలకు గాను 6 గ్రాముల చెవిదిద్దులు కనిపించలేదు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం చేరుకుని ఆధారాల కోసం ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై జరిగిన దొంగతనంపై ఆశ్చర్యపోయారు. ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉంటా రని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
గుర్తింపు కార్డులివ్వాలంటూ డప్పు కళాకారుల ర్యాలీ
రోలుగుంట: తమకు గుర్తింపుకార్డులు ఇవ్వాలంటూ రోలుగుంటలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కులవ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి పలు సమస్యలపై మాట్లాడారు. నిరుపేదలైన డప్పు కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. అలాగే చర్మకారులకు రూ. 6000 పింఛన్ ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. డప్పు కళాకారులకు గజ్జెల డ్రెస్ ఇవ్వడమే కాకుండా కుట్టు కూలి కూడా ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల డప్పు కళాకారులు పాల్గొన్నారు. -
కల్తీ మద్యాన్ని అరికట్టరేం?
● కొత్త మద్యం పాలసీ వచ్చాక విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు ● కల్తీ మద్యంతోనే అనారోగ్యం పాలు ● నవోదయం 2.0 సదస్సులోఎకై ్సజ్ అధికారులను నిలదీసిన మత్స్యకారులు ఎస్.రాయవరం: మండలంలో మత్స్యకార గ్రామా ల్లో కల్తీ మద్యం ఏరులై పారుతోందని గ్రామస్తులు ఎకై జ్ పోలీసులకు ముక్తకఠంతో తెలిపారు. పాయకరావుపేట ఎకై ్సజ్ పోలీసులు రేవుపోలవరం, బంగారమ్మపాలెం గ్రామాల్లో గురువారం నవోదయం–2.0 అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సారా తయారీ, గంజాయి రవాణా, అమ్మకాలు చట్టరీత్యా నేరం అని చెప్పారు. సారా, గంజాయి సేవించడం వల్ల గుండె జబ్బులు, నోరు, లివర్, ప్రేగు క్యాన్సర్ కడుపులో మంట వంటి జబ్బులు వస్తాయని తెలిపారు. ఇది విన్న గ్రామస్తులు ఎకై ్సజ్ పోలీసులను ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయిదు వేల నుంచి 10 వేల జనాభా ఉండే మా గ్రామాల్లో కల్తీమద్యం పెద్ద ఎత్తున విక్రయిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఎవరైనా తెగించి ఫిర్యాదు చేస్తే వారిళ్లపైకి అక్రమ మద్యం అమ్మేవారు దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనే నయం.. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఉండేదని, దానిద్వారా నాణ్యమైన మద్యం సరఫరా అయ్యేదని, ఇప్పుడు దుకాణం తొలగించి గుడివాడకు మార్చి బెల్టు దుకాణాలకు తెర తీశారన్నారు. గ్రామంలో సుమారు 100కు పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయని ఎకై ్సజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా లైసెన్స్ దుకాణాల సిబ్బంది ప్రతి రోజూ ఇంటింటికీ పంచినట్టు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం సరఫరా చేసి వెళ్తున్నారని చెప్పారు. అలా పంపిణీ చేసి విక్రయిస్తున్న మద్యం పూర్తి కల్తీగా ఉంటుందని, అది తాగి పలువురు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ అనుమతితో కూడిన మద్యం దుకాణం మాత్రమే ఏర్పాటు చేయాలని, అక్రమ మద్యాన్ని అరికట్టాలని అన్నారు. ఇదే పరిస్థితి బంగారమ్మపాలెంలోనూ ఉందని, ఎకై ్సజ్ పోలీసులు, సివిల్ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో గ్రామస్తుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఎకై ్సజ్ పోలీసులు వారికి తెలిపారు. సమావేశంలో సర్పంచ్ మల్లే లోవరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, గ్రామస్తులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
పూడిమడక వైన్ షాప్లో చోరీ
అచ్యుతాపురం రూరల్ : మత్స్యకార గ్రామమైన పూడిమడక గంటాలమ్మ వైన్ షాపులో బుధవారం అర్థరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో రూ.2 లక్షల 70 వేలు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాపులో ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలిసిన వ్యక్తే దీనికి పాల్పడి ఉంటాడని అంచనా వేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయో గమనించి మొదట వాటిపై దృష్టి సారించి, ఆపై దర్జాగా దొంగతనం చేశాడు. పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా అన్వేషించినప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకపోయిందన్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి చేతికి గ్లౌజ్లు, ముఖానికి మంకీ క్యాప్, కాలికి షూస్ వేసుకుని ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త వహించాడు. క్యాష్ కౌంటర్కు తాళాలు, భద్రత లేకుండా అంత మొత్తం ఉంచడంపై పోలీసులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో వైన్ షాపులు సిండికేట్లుగా ఏర్పడి వ్యాపారాలు చేసినప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగాయని ప్రజలు గుర్తు చేసుకున్నారు. స్థానిక సీఐ నమ్మి గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
కండక్టర్, డ్రైవర్లపైసస్పెన్షన్ ఎత్తివేయాలి
అనకాపల్లి టౌన్ : స్థానిక ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేయాలని ఎన్ఎంయూఏ జోనల్ జాయింట్ సెక్రటరీ జి. శంకరావు డిమాండ్ చేశారు. 13వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా గురువారం భోజన విరామ సమయంలో కార్మికు లు, ఆర్టీసీ డిపో ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎంయూఏ జోనల్ అధ్యక్షుడు ఏఎన్ రావు, కార్యదర్శి కె.ఎన్ .వి.రమేష్, రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్, కె.సునీత, ఎన్.లక్ష్మి, పీఆర్ లక్ష్మి, సంతోషి పాల్గొన్నారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్న ఆటో
ఆటో డ్రైవర్ మృతి చోడవరం : వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో జరిగి న ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి చెందాడు. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్ డి.నర్సింగరావు (54) అక్కడికక్కడే మృతిచెందాడు. సబ్బవరం మండలం ఆరిపాక గ్రామానికి చెందిన నర్సింగరావు తన ఆటోతో బుధవారం రాత్రి వెంకన్నపాలెం వైపు వస్తుండగా చోడవరం మండలం అడ్డూరు గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతదేహానికి గురువారం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
మొల్లమాంబ స్ఫూర్తిగా ప్రతి మహిళ చదువుకోవాలి
తుమ్మపాల : కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళ చదువుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొల్లమాంబ జయంతి వేడుకల్లో మొల్లమాంబ చిత్రపటానికి ఆమె పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మహిళలను విద్యకు దూరం చేశారనే భావనను చెరిపేస్తూ 14వ శతాబ్దంలోనే కవయిత్రి మొల్ల సంస్కృతం అభ్యసించారన్నారు. మహిళా దినోత్సవం జరుపుకొన్న కొద్దిరోజులలోనే మహనీయురాలు మొల్లమాంబ జయంతి జరుపుకోవడం, ఆమెను గురించి తెలుసుకోవడం అదృష్ట్టమన్నారు. సంస్కృతంలో గల రామాయణాన్ని తెలుగువారి కోరిక మేరకు తెలుగులోనికి అనువదించడంతో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కవయిత్రి మొల్లమాంబ చదువుకుని తను కోరిన విధంగా జీవించారని, ప్రతి మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకోవాలని, కోరుకున్న ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. కుటుంబంలో ఆడపిల్లలకు వారి కలలు తీర్చుకునే అవకాశం, నచ్చిన రంగాన్ని ఎన్నుకుని రాణించే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం.సురేంద్ర మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కుమ్మరి కులంలో పుట్టి సంస్కృతం చదువుకుని రామాయణాన్ని తెలుగులో రచించి కుమ్మరి కులానికే గౌరవం తీసుకువచ్చారన్నారు. అటువంటి మహనీయురాలి చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, కుమ్మరి, శాలివాహన సంఘ సభ్యులు అప్పలకొండ, సత్యనారాయణ మొల్లమాంబ జీవిత చరిత్ర గురించి తెలియజేశారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె.రాజేశ్వరి, బీసీ సంక్షేమశాఖ వసతిగృహ అధికారులు, సంఘ సభ్యులు కె.గుండప్ప, సిహెచ్. దుర్గాప్రసాద్, ఎస్.అప్పారావు, కె.శేషగిరిరావు, డి.అప్పలరాజు, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. వెంకన్న తోట ఉత్సవం
నక్కపల్లి : వార్షిక కల్యాణం అనంతరం ఉభయ నాంచారులతో కూడిన వైకుంఠనాథుని వన విహార యాత్ర (తోట ఉత్సవం) గురువారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని భక్తులు స్వామివారి హనీమూన్గా చెప్పుకుంటుంటారు. ప్రతి ఏటా వార్షిక కల్యాణం అనంతరం స్వామివారి తోట ఉత్సవం నిర్వహిస్తారు. ఉపమాక శివారు సారిపల్లిపాలెం సమీపంలో గల తోటలో ఉన్న మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు జి.వరప్రసాద్ ఘనంగా నిర్వహించారు. రాజాధిరాజ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వర స్వామిని కొలువుదీర్చి మండపం వద్దకు తీసుకొచ్చారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మండపశుద్ధి, ప్రసాద నివేదన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాల ఆరాధనలో భాగంగా ఆలయంలో విశేష హోమాలు జరిగాయి. వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణం అనంతరం నాలుగవ రోజున ఈ వన విహార యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రాత్రి స్వామివారి తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి వనవిహార యాత్ర (తోట ఉత్సవాన్ని) తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు తరలివచ్చారు. ఉత్సవానికి వెళ్తున్న స్వామి వెంట వందలాది మంది భక్తులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, ఆలయ అర్చకులు సంకర్షణపల్లి కష్ణమాచార్యులు, శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, గోపాలాచార్యులు, నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఘనంగా సదస్యం.. కల్యాణోత్సవాల్లో బాగంగా సదస్యం (పండిత సభ) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ వేదిక వద్ద స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గాయత్రీదేవి స్వామివారి కల్యాణం నిర్వహించడం ద్వారా లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు. పండితులంతా పురాణాలను ఔపోసన పట్టి స్వామివారికి నిర్వహించే కార్యక్రమాలను, కై ంకర్యాలను సేవల గురించి మనకు తెలియజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవాల్లో స్వామివారి సేవల్లో తరించిన పలువురు పండితులను సత్కరించారు. అనంతరం పుణ్యకోటి వాహనంపై ఉభయ నాంచారులతో కూడిన స్వామి వారిని కొలువుదీర్చి తిరువీధి సేవ నిర్వహించారు. అలరిస్తున్న కోలాటాలు.. వెంకన్న కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలు కోలాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గురువారం తుని పట్టణానికి చెందిన కోలాట బృందం చేసిన కార్యక్రమం భక్తులను అలరించింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చిన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీటీడీ వారి ఆధ్వర్యంలో కూడా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉభయనాంచారులతో కోనేటి రాయుడి విహారం వందలాదిగా తరలి వచ్చిన భక్తులు -
మైదానంలోనూ తప్పని డోలిమోత
గొలుగొండ : మైదాన ప్రాంతంలో కూడా గిరిజనులకు డోలిమోత తప్పడం లేదు. కొత్త ఎల్లవరం గ్రామ పంచాయతీ శివారు డొంకాడ గిరిజన గ్రామంలో మువ్వల మేరీని ప్రసవం సమయంలో కుటుంబ సభ్యులు గ్రామం నుంచి ఆరిల్లోవ ప్రధాన రోడ్డుకు నాలుగు కిలోమీటర్ల దూరం డోలిమోతతో తీసుకు రావాల్సి వచ్చింది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేరీని ప్రధానరోడ్డుకు తీసుకువచ్చి గొలుగొండ ిపీహెచ్సీలో చేర్చగా, అక్కడ మగబిడ్డకు జన్మనివ్వడం జరిగిందని ఆ గ్రామస్తులు తెలిపారు. రోడ్డు లేకపోవడం వల్ల నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు వచ్చి రోడ్డు వేస్తామని చెప్పి నేటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారం రోజుల క్రితం రోడ్డు వేయాలని గ్రామం నుంచి ఆరిల్లోవ అటవీరోడ్డు వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, పండిన పంటను రోడ్డులేక బయటకు తీసుకువచ్చే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రోడ్డు వేయాలని కోరుతున్నారు. -
పేదల ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం
తుమ్మపాల: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకుని ఇంటి నిర్మాణాలను సత్వరం పూర్తి చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎస్సీ, బీసీ, ఎస్టీ, పీవీటీజీ లబ్ధిదారులకు గృహాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న గృహాలకు అదనపు ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ఆమె వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా 2029 నాటికి ’అందరికీ ఇళ్లు’ నిర్మించాలనే లక్ష్యంతో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.1 లక్ష చొప్పున అదనపు మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 17,749 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 13,548 మంది లబ్ధిదారులకు రూ. 70.04 కోట్లు అదనపు ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. మే నెలాఖరు నాటికి 13,687 గృహాలు పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్థిక లబ్ధి సదవకాశాన్ని వినియోగించుకుని సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఆమె కోరారు. -
పేద విద్యార్థులకు ‘చంద్ర’ గ్రహణం : ముత్యాలనాయుడు
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు‘ కార్యక్రమం అత్యంత విజయవంతం అయ్యిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలల పాలనలో యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచిందని అన్నారు. ప్రతి పల్లెలో మద్యం ఏరులై పారుతుందని, మద్యం మీద చూపిస్తున్న శ్రద్ధ విద్యపై కూటమి ప్రభుత్వం చూపించడం లేదంటూ మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ప్రతి నిరుద్యోగికీ రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తాశారని మండిపడ్డారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7,200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కానీ గత బడ్జెట్లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఈ ఏడాది కూడా ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే..ఇందులో 5 కళాశాలల్లో తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన వాటిలో తరగతులు ప్రారంభించాల్సి ఉందని, కానీ వాటిని ప్రైవేటీకరించడానికి కూటమి సర్కార్ కుయుక్తులు పన్నుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందరికీ ఉచిత విద్య అందించాలనే ముందుచూపుతో అమ్మ ఒడి అందించిన ఏకైక సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
బోయిలకింతాడ చెరకు కాటా వద్ద ఘర్షణ
దేవరాపల్లి: మండలంలోని బోయిలకింతాడ కాటా వద్ద చెరకు తరలింపు విషయంలో నెలకొన్న వివాదం రైతుల మధ్య తోపులాటకు దారి తీసింది. సీరియల్ను తప్పించి కాటా సిబ్బంది చెరకును తరలించడమే ఈ వివాదానికి కారణమైంది. చెరకు తరలింపులో గత రెండు రోజులుగా నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలతో కాటా వ్యవసాయ అధికారి కృష్ణమూర్తి బుధవారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, రైతులకు చెందిన చెరకు బళ్లను సీరియల్ను తప్పించి ఉద్దేశ పూర్వకంగా తరచూ పంపిస్తున్నారని కాటా సిబ్బందిని బుధవారం రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. ఇలా అడ్డదారుల్లో పంపిస్తే రోజుల తరబడి కాటా వద్ద నిరీక్షిస్తున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీరియల్ నంబర్లు పొందిన కొందరు రైతులు లేకపోవడంతో సీరియల్ నమోదు కాని రైతులకు చెందిన చెరకు తరలించామని టీడీపీ నాయకులు, సిబ్బంది సమాధానం చెప్పారు. ఇలా సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానంపై వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీరియల్ పొందిన రైతులు లేకపోతే ఆ తర్వాత సీరియల్ నెంబర్లు కల్గిన రైతులను పిలవాలి తప్పా, సీరియల్ నమోదు కాని రైతుల చెరకును ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన నాయకులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు అరుపు, కేకలతో తోపులాటకు దిగారు. అక్కడున్న మిగిలిన రైతులు సముదాయించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇకపై ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకుంటామని కాటా ఏవో కృష్ణమూర్తి ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో శాంతించారు. -
కిరండూల్ రైళ్లు గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: కిరండూల్–బచేలి స్టేషన్ యార్డ్ సంబంధిత భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్– విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్ ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్– విశాఖపట్నం(58502) పాసింజర్ ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది. -
క్లస్టర్ శిక్షణతో నాణ్యమైన విద్య
● డీఈవో గిడ్డి అప్పారావునాయుడు మాడుగుల: రానున్న విద్యా సంవత్సరంలో నాణ్యమైన విద్యను అందించడానికి క్లస్టర్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధాయులకు ఏటా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు డీఈవో గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. బుధవారం మాడుగుల క్లస్టర్ కాంప్లెక్స్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలతో పాటు విద్యార్థులకు అర్థమయ్యేలా తరగతులు నిర్వహించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మండలంలో మాడుగుల, కేజేపురం, కింతలి క్లస్టర్ కాంప్లెక్స్లో 281 మందికి గాను 265 మంది ఉపాధ్యాయలు శిక్షణకు హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బి.దేముడమ్మ, డీఈవో అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కింతలి క్లస్టర్ అబ్జర్వరు రాధాకృష్ణమూర్తి, సీఆర్పీలు వొమ్మలి అచ్చుతరావు, బొబ్బిలి హరికృష్ణ, శారద, సురేష్, నిద్దాన సంధ్య, క్లస్టర్ హెచ్ఎంలు, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
16న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు
వాల్పోస్టర్ను ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్, నిర్వాహకులు మాకవరపాలెం : ఈ నెల 16 న జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీల గోడపత్రికలను అవంతి కళాశాల ప్రిన్సిపాల్ మోహన్రావు ఆవిష్కరించారు. జిల్లా చెస్ అసోసియేషన్, ప్రగతి చెస్ అకాడమీ సంయుక్తంగా తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పోటీల గోడపత్రికను ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకుడు సుధీర్ మాట్లాడుతూ ఈ పోటీలలో అన్ని వయసులవారు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిఉన్న వారు ఈ నెల 15లోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9676514520 నంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో డానియల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రైతు బాంధవుడు ‘నాగులాపల్లి’ ఇక లేరు
● రాజాం మాజీ సర్పంచ్ మృతికి సంతాపం ● అశ్రునయనాల మధ్య అంత్యక్రియలుబుచ్చెయ్యపేట : మండలంలోని రాజాం గ్రామ మాజీ సర్పంచ్ నాగులాపల్లి సత్యనారాయణ(67) అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. విప్లకారుడిగా, రైతు కూలీ సంఘం నాయకుడిగా పలు ఉద్యమాలు చేసిన ఆయన ప్రజల మనిషిగా పేరొందారు. ఆయన మృతికి పలు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలుపుతూ సత్యనారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సత్యనారాయణ తండ్రి నారాయణ రాజమండ్రి పేపరు మిల్లులో పని చేస్తూ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేసేవారు. అక్కడ నుంచి చోడవరం అంకుపాలెం వచ్చి తరువాత బుచ్చెయ్యపేట మండలం రాజాం వచ్చి స్థిరపడ్డారు. తల్లిదండ్రులు నారాయణ, వెంకయమ్మ ఇద్దరూ ఉద్యమాల్లో పాల్గొనడంతో సత్యనారాయణ కూడా ఆ బాట పట్టారు. 40 ఏళ్ల పాటు ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ ఓ దళానికి కమాండర్గా కూడా వ్యవహరించారు. ఉద్యమకారిణి మేధాపాట్కర్తో కలిసి పలు ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఐదేళ్ల పాటు విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు. తరువాత ప్రభుత్వం వద్ద లొంగిపోవడంతో ఆయనకు అనకాపల్లి జిల్లా కూండ్రం వద్ద ఐదెకరాలు ప్రభుత్వ భూమిని ఉచితంగా అందించారు. 1997లో మార్చిలో వడ్డాదిలో వ్యవసాయ కూలీ సంఘాన్ని స్ధాపించి జిల్లాలో వేలాది ఎకరాల సీలింగ్, బంజరు, పోరంబోకు భూములను పేద ప్రజలకు పంచేలా చేశారు. 2014లో సర్పంచ్గా ఎన్నికై రాజాం గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. రాజాంలో ఆయన మృతదేహానికి అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, సీఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు కనకరావు, రాష్ట్ర రైతు కూలీ సంఘం క్యాదర్శి దంతులూరి వర్మ, జిల్లా కార్యదర్శి కోన మోహనరావు, కార్మిక సంఘ నాయకుడు ఐయితరెడ్డి అప్పలనాయుడు, తదితరులు ఈ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మా గ్రామాలకు రోడ్లేయండి మహాప్రభో!
మాడుగుల రూరల్ : మండలంలో గిరిజన గ్రామాలకు పోవు రహదారులు నిర్మించి, గొర్రిగెడ్డ మీద వంతెనలు నిర్మించాలని కోరుతూ ఏడు గ్రామాలకు చెందిన గిరిజనులు బుధవారం మోకాళ్ల మీద నిల్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. శంకరం గ్రామ పంచాయతీ శివారు గిరిజన గ్రామాలు అయిన తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, కొత్తవలస, మరియు తాడివలస వద్ద ఉరకగెడ్డల మీద వంతెనలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు, మోకాళ్ల మీద నిలబడి చంద్రబాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, పవన్కల్యాణ్బాబు మా గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి ఇ.నర్సింహమూర్తి, కె. భవానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రూ 9 కోట్ల 30 లక్షల వ్యయంతో రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తామని నమ్మబలికి ఎన్నికలై 9 మాసాలు పూర్తి అవుతున్నా సరే కనీసం పట్టించుకోలేదన్నారు. గొటివాడ నుంచి కొత్తవలస, వెలగలపాడు, గొప్పూరు తాడివలస మీదుగా రాయిపాలెం, రాజంపేట మీదుగా కృష్ణంపాలెం తారురోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే వందలాది మంది గిరిజనులకు రవాణా సౌకర్యం కల్పించవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్థానికుడు కాకపోవడం వల్ల ఇక్కడ గిరిజన ప్రజల సమస్యలు ఆయనకు తెలియవన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కూడా స్థానికుడు కాదని ఆయనకు కూడా స్థానిక సమస్యలు తెలియవని అన్నారు. వెంటనే గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సోమల నరసింహరావు, జన్ని చిన్నారావు, సోలం సన్యాసమ్మ, సోలం మంగ, గురువుల కృష్టమూర్తి, ఈశ్వరరావు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. ● మోకాళ్ల పై నిల్చుని గిరిజనుల వినూత్న నిరసన -
మడ అడవుల సంరక్షణతో తీర ప్రాంతాలకు రక్షణ
రాంబిల్లి (అచ్యుతాపురం): తీర ప్రాంత రక్షణకు దోహదం చేసే మడ అడవుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ పిలుపునిచ్చారు. రాంబిల్లి మండలం లాలం కోడూరు శివారు సీతపా లెం బీచ్లో బుధవారం ఆమె మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకం, వాస్కా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మడ అడవుల అభివృద్ధి పథకంలో భాగంగా కలెక్టర్ విజయ్కృష్ణన్ మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కాపాడటంలోనూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ మడ అడవులు నష్ట నివారణకు ఉపయోగపడతాయని తెలిపారు. నేల కోతను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కార్బన్ డయాకై ్సడ్ను గ్రహించి ఆక్సిజన్ శాతం పెంచేందుకు మడ అడవులు దోహదపడతాయన్నారు. లక్షా డభ్బై ఐదు వేల నిధులతో ఎన్ఆర్జీఎస్ ద్వారా మొక్కల్ని నాటుతున్నామని తెలిపారు. మడ అడవుల పెంపకానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెన్నయ్కి చెందిన ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ సమకూరుస్తుందని తెలిపారు. అడిషనల్ కమిషనర్ ఎం.శివప్రసాద్ మాట్లాడుతూ వాస్కా ప్రాజెక్టుతో పాటు, ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా లాలం కోడూరు పరిధిలో 24 ఎకరాలను ఎంపిక చేశామని తెలిపారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి,ఎం.ఎస్. స్వామినాథన్ శాస్త్రవేత్త నాగరాజన్, వాస్కా ప్రాజెక్టు స్టేట్ కో ఆర్డినేటర్ వనపర్ల సంతోష్ కుమార్, ఎంపీడీవో విజయ మాధురి, సర్పంచ్ గుణ, ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్, వాస్కా సిబ్బంది దండే ప్రసాద్ పాల్గొన్నారు. -
సారా తయారు చేస్తే కఠిన చర్యలు
కశింకోట: నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా ప్రోహిబిషన్ చట్టం–1995 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జోన్ ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీరామచంద్రమూర్తి హెచ్చరించారు. మండలంలోని ఉగ్గినపాలెంలో నవోదయం–2.0 కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామసభ నిర్వహించి కళా జాతర ద్వారా నాటు సారాకు వ్యతిరేకంగా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీని నాటు సారా రహితంగా తయారు చేసేందుకు ప్రారంభించిన నవోదయం–2.0 కార్యక్రమం విజయవంతం కావడానికి అంతా సహకరించాలన్నారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదులను 14405 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి. సుధీర్, సీఐ వై.లక్ష్మన్నాయుడు, కశింకోట ఎస్ఐ మనోజ్కుమార్, ఎకై ్సజ్ ఎస్ఐ గణేష్, సర్పంచ్ కలగా గున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ నాయకుడు దాడి.. వృద్ధుడి మృతి
చోడవరం: సీపీఐ నాయకుడు దాడి చేయడంతో గాయపడిన వృద్ధుడు బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చోడవరం పట్టణం బాలాజీ నగర్ వద్ద ఇందల సన్యాసిరావు అనే వృద్ధుడికి సీపీఐ నాయకుడు నేమాల హరికి మధ్య ఈ నెల 3వ తేదీ రాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సన్యాసిరావు బుధవారం మృతిచెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరి భార్య చోడవరం పంచాయతీలో వార్డు మెంబరుగా ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చోడవరం సీఐ అప్పలరాజు తెలిపారు. -
వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభం
తుమ్మపాల: జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తొలిసారిగా వజ్రాభరణాలు ఎగ్జిబిషన్ నిర్వహించడం శుభపరిణామమని మాజీ ఎంపీ బీవీ సత్యవతి అన్నారు. వసుందర జ్యూయలరీ ఆధ్వర్యంలో వజ్రాభరణాల అమ్మకాల ఎగ్జిబిషన్ను బుధవారం స్థానిక విజయా రెసిడెన్సీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమెతో పాటు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ హారికా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటివరకు స్వర్ణాభరణాలు మాత్రమే చూశామని, వజ్రాభరణాలు ఎగ్జిబిషన్ కూడా నిర్వహించి మహిళలకు అందుబాటులోకి తీసుకురావడంపై వసుందర జ్యుయలరీ ప్రతినిధులను అభినందించారు. వసుందర జ్యూయలరీ వైస్ ప్రెసిడెంట్ టి.శ్రీదేవి మాట్లాడుతూ రెండు లక్షలకు పైగా విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా డైమండ్ రింగ్ బహుమతిగా అందజేస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ను ఈ ప్రాంత ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
లిక్విడ్ గంజాయితో యువకుడి అరెస్ట్
కె.కోటపాడు : యాసస్ ఆయిల్(గంజాయి లిక్విడ్)ను తరలిస్తున్న యువకుడిని మంగళవారం ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మినారాయణ పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆనందపురం కూడలి వద్ద సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ జాకీర్ అనే వ్యక్తి బ్యాగ్ను తనిఖీ చేయగా 900 గ్రాముల యాసస్ ఆయిల్(గంజాయి లిక్విడ్)ను గుర్తించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ గంజాయి లిక్విడ్ను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకువస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడన్నారు. ఆనందపురం మీదుగా అనకాపల్లికి వెళ్లే ప్రయత్నంలో అతను పట్టుబడినట్టు తెలిపారు. పట్టుబడ్డ యాసస్ ఆయిల్ విలువ రూ.20వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపర్చగా రిమాండ్కు విధించినట్టు వివరించారు. -
రెండు గ్రామాల్లో గంగాదేవి గావు పండగ
కె.కోటపాడు : గుల్లేపల్లి, జోగన్నపాలెం గ్రామాల్లో గంగాదేవి(గావు ) పండగ పర్వదినాన్ని మంగళవారం ఆయా గ్రామస్ధులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒక మారు రెండు గ్రామాల ప్రజలు ఆమ్మవారి పండగను నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పందిరికి భక్తుల మొక్కులలో భాగంగా కొబ్బరి, అరటి, ద్రాక్ష పండ్లతో పాటు, నగదు, చీరలను వేలాడదీశారు. ఆయా వస్తువులను భక్తులు పొందేందుకు సాయంత్రం దోపిడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు లభించే వస్తువులను అమ్మవారి ప్రసాదంగా భావిస్తారు. రెండు గ్రామాల్లో మధ్యాహ్నం అన్న సమారాధన జరిపారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ప్రత్యేక పూజలు గుల్లేపల్లి గ్రామంలో గంగాదేవి గావు పండగ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అలాగే ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, సర్పంచ్ బండారు దేముళ్లు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ● పందిరికి అరటి, కొబ్బరి, నగదు తదితర వస్తువులను వేలాడదీసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు -
పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
కె.కోటపాడు : పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలను పాటించడం వల్ల పెయ్యిల్లో ఎదుగుదల, ఆరోగ్యంగా ఉంటాయని అనకాపల్లి జిల్లా పశుసంవర్ధకశాఖ పశువైద్యాధికారి పి.రామ్మోహన్రావు, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలో చిరికివానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ది సంస్ధల ఆధ్వర్యంలో మంగళవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. చిరికివానిపాలెంలో 43, చౌడువాడలో 35 పెయ్యిలను ఈ ప్రదర్శనకు రైతులు తీసుకువచ్చారు. మొదటి మూడు స్ధానాలలో ఆరోగ్యకరమైన పెయ్యిలుగా ఎంపికై న వాటి యజమానులకు బహుమతులతో పాటు పోటీలకు పెయ్యిలను తీసుకువచ్చిన రైతులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాదికారి రామ్మోహన్రావు, డిప్యూటీ డైరక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పెయ్యిలకు పుట్టిన 10 రోజులకు ఒకసారి నట్టల నివారణ మందును వేయడంతో పాటు ప్రతి నెలకు ఒకసారి 6 నెలల పాటు నట్టల నివారణ మందును వేయాలని తెలిపారు. ఆవు, గేదెలు ఈనిన 60 రోజుల నుంచి 90 రోజులలోపు చూడికట్టే ఇంజక్షన్ను చేయించడం వల్ల చూడికట్టే శాతం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు లవణ మిశ్రమం ప్యాకెట్లను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరక్టర్ దినేష్కుమార్, సౌజన్య, కొరువాడ, చౌడువాడ పశువైద్యాధికారులు సిహెచ్.వై.నాయుడు, సింహాచలంనాయుడు, పశువైద్య సహాయకులు పాల్గొన్నారు. చిరికివానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో లేగ దూడల ప్రదర్శన ఆరోగ్యకరమైన పెయ్యిలకు బహుమతులు -
దైన్యం.. జూలో మూగ జీవాల వైద్యం
● ఇటీవల పుట్టిన రెండు సింహం పిల్లలు మృతి ● వారాల తరబడి పోటీ పడి మరీ సెలవుల్లో వైద్యులు ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాలకు వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. వైద్యులు వారాల తరబడి పోటాపోటీగా సెలవులు పెట్టడం, విధులకు హాజరైన రోజుల్లో కూడా సరిగా వైద్య సేవలు అందించకపోవడంతో మూగ జీవాల ఆరోగ్యం అగమ్యగోచరంలో పడింది. ఇటీవల ఇక్కడ శివంగి(ఆడ సింహం)కి పుట్టిన రెండు పిల్లలు మృత్యువాత పడ్డాయి. జూ పార్కుల్లో సింహాలకు పిల్లలు పుట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన జూ వైద్యులు నిర్లక్ష్యం కారణంగా.. పుట్టిన రెండు సింహం పిల్లల్లో ఒకటి రెండు రోజుల వయసులో, మరొకటి 12 రోజుల వయసులో ప్రాణాలు కోల్పోయాయి. ఏడాదిన్నర క్రితం ఇక్కడ జిరాఫీ పిల్ల తల్లి కడుపులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన పలు అరుదైన వన్యప్రాణులు సైతం సరైన వైద్యం అందకపోవంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాంగ్ లీవ్లో డాక్టర్ శ్రీనివాస్ జూ పార్కు ఏర్పాటైనప్పటి నుంచి పశు సంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రెండేళ్ల క్రితం లాంగ్(ఐదేళ్ల) లీవ్ పెట్టారు. అప్పటి నుంచి పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులున్నారు. వారిలో నెల క్రితం నియమించిన పశు సంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ వైద్యుడున్నారు. మిగిలిన ఇద్దరు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో ఒక యువ వైద్యుడు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో సొంతంగా వెటర్నరీ మందుల సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే గతంలో అవసరానికి మించి మందులు కొనుగోలు చేయించేవారని సమాచారం. సదరు వైద్యుడు నెలలో సగం రోజులు సిక్ లీవ్ల పేరిట జూ డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు. మరో మహిళా వైద్యురాలు నాలుగు నెలల క్రితం జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేరారు. ఆమె గతంలో కొన్నాళ్లు ఇక్కడ వైద్యురాలిగా పనిచేశారు. ఇక్కడ మానేసిన తర్వాత జీవీఎంసీ మొబైల్ వెటర్నరీ క్లినిక్లో చేరారు. ప్రస్తుతం ఆమె రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు జూ సిబ్బంది చెప్తున్నారు. అక్కడో వారం.. ఇక్కడో వారం అన్నట్లుగా ఆమె సేవలందిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు డ్యూటీకి వెళ్లిన రోజుల్లో కూడా వన్యప్రాణులను సరిగా పరిశీలించట్లేదని యానిమల్ కీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే గర్భం దాల్చిన సింహానికి సరైన వైద్యం, అవసరమైన మందులు అందక నీరసించిన పిల్లలు పుట్టాయన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరు ఇటీవల నియమించిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడికి కూడా సహకరించకుండా సెలవుల్లో గడుపుతున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా అటవీశాఖ సీఎఫ్, జూ ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
సింహాద్రి ఎన్టీపీసీలో కలెక్టర్
ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్లో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరవాడ: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం సింహాద్రి ఎన్టీపీసీని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కంట్రోల్ రూమ్లోని మహిళా ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ప్లాంట్లోని మోడల్ రూం పనితీరును తెలుసుకున్నారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను సందర్శించారు. సందర్శనలో భాగంగా పవర్ ప్లాంటు కార్యకలాపాలు, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు రవాణా సేకరణ లింకేజీలు, షెడ్యూల్ ప్రక్రియపై చర్చలు జరిపారు. సమర్థవంతమైన ఇంధన ఉత్పత్తికి ఎన్టీపీసీ సింహాద్రి చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్శర్మ, ప్లాంట్ హెచ్ఆర్ బి.బి.పాత్ర, సీనియర్ అధికారులు ఉన్నారు. -
పనులు జరుగుతున్న రోడ్డుకు మళ్లీ శంకుస్థాపన!
దేవరాపల్లి : ఇప్పటికే పనులు జరుగుతున్నా రహదారిపై మరలా టీడీపీ నాయకులు శంకుస్థాపన చేయడం పలు విమర్శలకు దారి తీసింది. చింతలపూడి పంచాయితీ శివారు బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు వెళ్లే రహదారిలో బీటీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు మంగళవారం శంకుస్థాపన చేయడం వివాదాస్పదమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ లేకుండానే ఏ హోదాలో అతను రోడ్డుకు శంకుస్థాపన చేశారంటూ పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు లేకుండా శంకుస్థాపన చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్థానిక సర్పంచ్, ఎంపీటీసలకు సైతం సమాచారం ఇవ్వకుండా చేయడంపై దుమారం రేగింది. దీనిపై అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు బూడి చొరవతో రూ.2 కోట్లతో మట్టిరోడ్డు నిర్మాణం చింతలపూడి పంచాయతీ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బోడిగరువు, నేరెళ్లపూడి గిరిజన గ్రామాలకు కనీసం కాలినడకన వెళ్లేందుకు కాలి బాట సైతం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. సుమారు 4కి.మీ మేర దూరంలో ఉన్న సమ్మెదకు చేరుకోవాలంటే కొండలు, గుట్టలు, గెడ్డలు, వాగులు దాటి ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తూ నరకయాతన అనుభవించేవారు. 2023లో డిప్యూటీ సీఎం హోదాలో బూడి ముత్యాలనాయుడు 5 కి.మీ మేర కొండలు, గెడ్డలు, వాగులు దాటుకుంటూ ఆ రెండు గ్రామాలకు కాలినడకన చేరుకొని వారి కష్టాలను స్వయంగా చూశారు. సమ్మెద బ్రిడ్జి నుంచి బోడిగురువు మీదుగా నేరెళ్లపూడి వరకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయించి, నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఆత ర్వాత బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సైతం సంకల్పించారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు కొనసాగించాల్సి ఉండగా మరలా శంకుస్థాపనల పేరిట ఇలా హడావుడి చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. బోడిగరువు, నేరెళ్లపూడి రోడ్డుకు ఎమ్మెల్యే తనయుడు శంకుస్థాపన ఎమ్మెల్యే కుమారుడు అప్పలనాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండా ఏ హోదాలో చేశారని విస్మయం -
బైకులు, బంగారం దొంగ అరెస్టు
అనకాపల్లి : రామాపురం కాలనీ ఏలేరు కాలువ వద్ద సోమవారం పట్టణ ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా రావికమతం మండలం, కొత్తకోట గ్రామం, శివాలయం వీధికి చెందిన మొగలుతుర్తి మణికంఠ అలియాస్ రంగ పోలీసులను చూసి పారిపోబోయాడు. అనుమానంతో అతన్ని పట్టుకుని విచారించగా అతని వద్ద నుంచి చోరీ సొత్తు రెండు బైకులు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎం.శ్రావణి చెప్పారు. పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో మంగళవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 15న అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ శివారు సుబ్బారావు దాబా దగ్గర హైవే పక్కన పార్క్ చేసి ఉన్న కారుల్లో అద్దాలను పగులకొట్టి అందులో రెండు హ్యాండ్ బాగుల్లో ఉన్న రూ.40వేలు నగదు, ఒక జత బంగారు చెంప స్వరాలు, ఒక జత బంగారు చెవి దిద్దులు, ఒక బంగారు మండ గొలుసు, ఒక బంగారు చైన్, ఒక యాపిల్ ఐఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు అందింది. పై వస్తువులను మొగలుతుర్తి మణికంఠ చోరీ చేసినట్టు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. ఆ వ్యక్తి నుంచి రెండు బైక్లు, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, కానిస్టేబుల్స్ పి.కిషోర్కుమార్, టి.సంతోష్కుమార్, శివాజీ పాల్గొన్నారు. -
సరికొత్త హంగులతో వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ ప్రస్తుత సీజన్కు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమవుతోంది. మరో సారి ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోం గ్రౌండ్గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకోవడమే కాకుండా తొలి మ్యాచ్ను ఇక్కడే ఆడి సీజన్కు శ్రీకారం చుట్టనుంది. 27,251 మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉన్న వైఎస్సార్ స్టేడియంలో డీసీ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్తో 24వ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు ఆడనుంది. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నరకే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ల నిర్వహణకు వీలుగా స్టేడియంలో ఆధునిక హంగులు సమకూరుస్తున్నారు. ఆటగాళ్ల గ్రీన్రూమ్స్తో సహా డగౌట్స్ను ఆధునికీకరించారు. మ్యాచ్ల్లో డ్రెస్సింగ్ రూమ్కి చాలా ప్రాధాన్యం ఉన్నా.. టీ–20లో ఆటగాళ్లు కూర్చునేందుకు మైదానానికి ఇరువైపులా ఉండే డగౌట్స్ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. డీసీ మేనేజ్మెంట్ సూచనల మేరకు ఏసీఏ ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ ప్రేక్షకులతో పాటు కార్పొరేట్కు పెద్దపీట వేసింది. అందుకు అనువుగా 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్లతో పాటు రెండు టీమ్ బాక్స్లను ఆధునికీకరించింది. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్తో సహా నాలుగు లిఫ్ట్ల్లో ఒకేసారి 64 మంది వెళ్లే విధంగా తీర్చిదిద్దింది. దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించి స్టేడియంలో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లతో పాటు అభిమానులకు బాత్రూమ్లను సైతం మూడింతలు పెంచి సౌకర్యాలు కల్పించింది. స్టేడియంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి 14 ఏళ్లు దాటిపోవడంతో.. వాటి స్థానంలో రూ.9.5 కోట్లు వెచ్చించి ఆధునిక టెక్నాలజీతో పూర్తి నైట్ మ్యాచ్కు అనువుగా ఆధునికీకరించింది. పెవిలియన్ ఎండ్ సౌత్ బ్లాక్లో ఆటగాళ్ల రూమ్, డగౌట్కు పైన 1,640 మంది కూర్చునే కార్పొరేట్ బాక్స్లు అన్ని హంగులతో సిద్ధమయ్యాయి. ఆటగాళ్లకు దగ్గరగా ఉండే అప్పర్ వెస్ట్, జి, ఐ స్టాండ్స్లోనూ సిట్టింగ్ ఏర్పాట్లను మెరుగుపరిచారు. స్టేడియంలో మొత్తంగా కార్పొరేట్ బాక్స్లతో సహా 22 స్టాండ్స్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్లకు టికెట్లను త్వరలోనే ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
దివ్యాంగ బాలలకు ఎన్టీపీసీ వితరణ
పరవాడ: స్థానిక దివ్యాంగ బాలల శ్రేయస్సుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందించారు. దివ్యాంగ బాలల ఉపకరణాల వితరణకు ఎన్టీపీసీ రూ.12.99 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా దీపాంజిలినగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. దివ్యాంగ బాలల విద్యాభివృద్ధి, అవసరమైన ఉపకరణాల పంపిణీకి ఎన్టీపీసీ సమకూర్చిన నిధులను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. సమగ్ర శిక్ష పథక సంచాలకులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 43 భవిత కేంద్రాలకు గతంలో ఎన్టీపీసీ యాజమాన్యం రూ.12 లక్షలతో ఉపకరణాలు అందజేశారని, తాజాగా అనకాపల్లి జిల్లాలోని 24 భవిత కేంద్రాలు, ఆరు సహిత విద్యా రిసోర్స్ రూములు, ఉపకరణాలకు రూ.12.99 లక్షలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్శర్మ మాట్లాడుతూ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, బాలికా సాధికారిత, ఉపకార వేతనాలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీపీసీ సమకూర్చిన ఉపకరణాలను మండలాల వారీగా ఆయా భవిత కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ అందించారు. దివ్యాంగ బాలలు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయ అధికారి బి.శకుంతల, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
అంధకారం
యువత భవితప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలకొల్పిన పరిశ్రమలు 35 భారీ.. 300 చిన్న, మధ్యతరహా కంపెనీలు పరిశ్రమల్లో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు 14,114 రీయింబర్స్మెంట్ అందుకున్న విద్యార్థులు 39 వేలు అందుకున్న ఫీజుల మొత్తం రూ.26.12 కోట్లు జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య2.30 లక్షలు కొత్తగా వచ్చిన పరిశ్రమలుసున్నా రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 39 వేలు గతం -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
కె.కోటపాడు : పిండ్రంగి గ్రామానికి చెందిన బి.స్వామినాయుడు(38) విద్యుత్ షాక్కు గురై మంగళవారం సాయింత్రం మృతిచెందాడు. తన ఇంటి నిర్మాణ పనులకు మేస్త్రి వద్ద స్వామినాయుడు సహాయంగా ఉన్నాడు. ఇంటికి సమీపం గుండా ఉన్న హెడ్డీ విద్యుత్ లైన్ వైరు ప్రమాదవశాత్తూ స్వామినాయుడు ఎడమ చేతికి తగులడంతో షాక్కు గురయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆటోలో కె.కోటపాడు సీహెచ్సీకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే స్వామినాయుడు మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసే భర్త మరణించడంతో తను, పిల్లలు అనాథలుగా మారామని భార్య లక్ష్మి రోధించడం చూపరులను కలచివేసింది. ఘటనపై లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు. మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తామన్నారు. మృతిచెందిన స్వామినాయుడు -
కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యంలేదు
● ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు ● భూములిచ్చిన రైతులను మోసం చేసిన ప్రభుత్వం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ● నిర్వాసిత గ్రామాల్లో పర్యటన నక్కపల్లి: కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆయన మండలంలోని ఇండస్ట్రియల్ కారిడార్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చిన నిర్వాసితులు, రైతులతో రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, అమలాపురం, డీఎల్ పురం తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. డీఫారం భూముల్లో మామిడి, జీడి, కొబ్బరి తోటలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పరిహారం చెల్లింపుల్లో కూడా పక్షపాతం చూపిస్తున్నారన్నారు. జిరాయితీ రైతులతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కోరితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరితే ఇచ్చినంత తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండని హోం మంత్రి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. రైతుల నుంచి రెండు పంటలు పండే భూములను కారు చౌకగా తీసుకుని కార్పొరేట్ శక్తులకు అధిక ధరలకు అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్క్ను తీరప్రాంతాల్లో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, జిల్లా కార్యవర్గసభ్యులు అప్పలరాజు, మండల కన్వీనర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడైనా కళ్లు తెరవాలి
ఎన్నికల ముందు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏటా విద్యార్థులకు వసతి దీవెన, విద్యాదీవెన తదితర పథకాలు పక్కాగా అమలు జరిగేవి. దీంతో పిల్లలను చదివించడం సులువయ్యేది. ఇప్పుడు అప్పులు చేయాల్సివస్తోంది. యువత పోరు కార్యక్రమం ద్వారా అయినా విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. –కాండ్రేగుల జగన్, విద్యార్థిని తండ్రి, తిమ్మరాజుపేట, మునగపాక మండలం -
తాండవ గేట్ల మరమ్మతులు ప్రారంభం
తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతు పనులు ప్రారంభిస్తున్న ప్రాజెక్టు డీఈ అనురాధ, చైర్మన్ సత్యనారాయణ నాతవరం : తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతులతోపాటు కాలువల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ప్రాజెక్టు డీఈ ఆనురాధ చెప్పారు. ఆమె మంగళవారం తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల లీకేజీలకు మరమ్మతు పనులను ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. తాండవ ప్రాజెక్టు అభివృద్ధికి రూ.2 కోట్ల 10 లక్షలతో 18 పనులు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాండవ కాలువలకు సంబంధించి మూడు పనులు జరుగుతున్నాయని, మిగతా పనులు త్వరలో చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జేఈలు శ్యామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి తిని బతకాలా..!
● ఉపాధి కూలీల వినూత్న నిరసన గడ్డి చేత పట్టుకొని నిరసనకు దిగిన ఉపాధి కూలీలు దేవరాపల్లి: ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు వినూత్న నిరసన చేపట్టారు. గడ్డి చేత పట్టి, నోట్లో పెట్టుకొని తమ ఆవేదన వెలిబుచ్చారు. గర్సింగ్, డొర్రి చెరువు, మారేపల్లి గ్రామాలలో చేసిన కూలి పనుల బిల్లులు చెల్లించకపోతే గడ్డి తిని బతకాలా అని ప్రశ్నించారు. ఎండు గడ్డి చేత పట్టుకొని మంగళవారం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు ఉపాధి కూలీల సొమ్ము చెల్లించక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర మద్దతు పలికారు. -
యువత కోసం పోరు బాట
● నేడు విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కలెక్టర్కు వినతిపత్రం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడుఅనకాపల్లి: ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలు నిలువునా ముంచేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి ఇవ్వక యువత పడరాని పాట్లు పడుతున్నారని, వారి పక్షాన వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని.. అనంతరం ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు అనకాపల్లి రింగ్రోడ్డు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులతో వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రజలను నిలువునా ముంచేశారని, సూపర్ సిక్స్ పథకాలని ఆశ కల్పించి అధికారం చేజిక్కించుకున్నాక నరకం చూపిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు పల్లెల వెంకట సీతమ్మదొర, 80వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం.నాయుడు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు. -
తప్పుల తడకగా సీనియారిటీ జాబితా
● అప్పీళ్లకు ముగిసిన గడువు ● సవరణల కోసం 250 మంది దరఖాస్తులు విశాఖ విద్య: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా లు ప్రకటించేందుకు విద్యాశాఖాధికారులు ఆపసోపాలు పడుతున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో సమగ్ర వివరాలు నమోదు సమ యంలో ఉపాధ్యాయుల అలసత్వం, డీడీవోల నిర్లక్ష్యంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. వీటి ఆధారంగానే త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. దీంతో సీనియారిటీ జాబితా లో లోపాలను సవరించి, తమకు న్యాయం చేయా లని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు సర్వీసు విషయాల్లో నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా డీఈవోకు తమ మొర విన్నవించుకునేందుకు ఉపాధ్యాయులు క్యూ కట్టారు. అప్పీళ్లకు సోమ వారం చివరి రోజు కావటంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 250 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పీళ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీ వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే నిమి త్తం 12 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఎంఈవోలతో జిల్లా స్థాయిలో కమిటీ ఏ ర్పాటు చేశారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును వారు పరిశీలించిన తరువాతనే టీఐఎస్ లాగిన్లో వాటిని సరిచేశారు. ఇలా 210 దరఖాస్తులను సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఉపాధ్యాయులు లే వనెత్తిన అంశాలను సరిచేశారు. మరో 40 వరకు దరఖాస్తులు అభ్యంతరాలతో కూడినవి కావటంతో.. మరోసారి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతనే వాటిని సీనియారిటీ జాబితాలో చోటు కల్పించేలా చర్యలు చేపట్టారు. జాబితాలపై ఉన్నత స్థాయి సమీక్ష ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు, సవరణల కోరుతూ వచ్చిన అప్పీళ్ల విషయమై సోమవారం విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి డీఈవో ప్రేమ్కుమార్, సర్వీసు వ్యవహరాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ జ్యోతి, సంబంధిత సెక్షన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని, వివరాలను తెలియజేశారు. ఆందోళన వద్దు సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్ల వారీగా పూర్తి స్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన తరువాతనే తుది జాబితాలను వెల్లడిస్తాం. జాబితాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఉపాధ్యాయులు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. – ఎన్.ప్రేమ్కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా -
ఉచితం పేరుతో అనుచితం
తుమ్మపాల: విద్య హక్కు చట్టం ద్వారా చదువుతున్న పేద విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్ విజయ్ కృష్ణన్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.రమణ మాట్లాడుతూ విద్యార్థులను ఫీజుల ఒత్తిడికి గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని, గతంలో రెండుసార్లు కలెక్టర్కు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు లేవన్నారు. పట్టణంలో గుడ్షెపర్ఢ్, విద్యాధరి, శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లకు కూడా ఫీజులు చెల్లించాలని వత్తిడి చేయడం తీవ్ర అన్యాయమన్నారు. అధికారులు స్పందించి ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఉచిత విద్య పథకంలో చదువుతున్న విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి వెనక్కు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన -
యువత పోరు హోరెత్తాలి
చోడవరం: ఈనెల 12వ తేదీన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన యువత పోరు ఆందోళనను అంతా విజయవంతం చేయాల ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ కోరారు. చోడవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రచార వాల్పోస్టర్లను సోమవారం వారు ఆవిష్కరించారు. యువత, విద్యార్థుల పక్షాల వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ ఉద్యమంలో వారంతా పాల్గొనాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం అనకాపల్లి: చంద్రబాబు పాలనలో దగాపడ్డ విద్యార్థులు, నిరుద్యోగుల తరపున యువత పోరు కార్యక్రమాన్ని ఈనెల 12న నిర్వహిస్తున్నామని వైఎస్సా ర్సీపీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ చెప్పారు. స్థానిక రింగ్రోడ్డులోని పార్టీ సమస్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో సోమవారం యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ రూ.4,600 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలండర్ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబునాయుడు మరో సారి నిరుద్యోగులను మోసగించారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతున్నప్పటికీ ఒక్కరికీ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లా ఐటీ వింగ్ విభాగం అధ్యక్షుడు పల్లెల వెంకట సీతమ్మదొర మాట్లాడుతూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నేటికీ అమలు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి.హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థి విభాగం యలమంచిలి అధ్యక్షుడు చదరం అప్పలనాయుడు, వైద్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహరావు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు. -
● ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు సిద్ధం ● గోవాడ చెరకు రైతులకు బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ ● వారి కష్టాలు తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ● సమస్యలను శాననమండలిలో ప్రస్తావిస్తామని హామీ
చోడవరం: గోవాడ చెరకు రైతులకు వైఎస్సార్సీపీ బాసటగా నిలిచింది. సుగర్ ఫ్యాక్టరీలో తరుచూ క్రషింగ్కు అంతరాయం కలగడంతో చెరకు రైతులు కొద్ది రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా నిలిచి, వారి సమస్యలను ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటేందుకు మేమున్నామంటూ వైఎస్సార్సీపీ ముందుకు వచ్చింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, జెడ్పీ చైర్పర్సన్ సుభద్రతో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం సోమవారం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని సందర్శించింది. ఇక్కడి యార్డులో నిలిచిపోయిన చెరకు బళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు, ప్రస్తుత ఫ్యాక్టరీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమకు గతేడాది చెరకు బకాయిలు ఇంకా ఇవ్వలేదని, ఈ ఏడాది 40 రోజులు ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించారని, ఫ్యాక్టరీ మిషనరీలో మరమ్మతుల వల్ల ఈ సీజన్లో అనేక సార్లు క్రషింగ్ ఆగిపోయిందని, ఈ ఏడాది సరఫరా చేసిన చెరకుకు ఇంకా పేమెంట్స్ ఇవ్వలేదని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీని బాగుచేస్తామని, రైతులకు రూ.4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు, బండారు ఇప్పుడు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నా ఇటువైపు కన్నెత్తి చూడలేదని మరికొంతమంది రైతులు ఆగ్రహంతో చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పడు పలుసార్లు ఫ్యాక్టరీకి సాయం చేశారని, ఆ డబ్బులతో ఎప్పటికప్పుడు చెరకు బకాయిలు చెల్లించడంతోపాటు ఫ్యాక్టరీ ఓవరాయిలింగ్ పనులు కూడా పూర్తిగా చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవడంతో రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించలేదని, ఫ్యాక్టరీని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా పట్టించుకోలేదని రైతులంతా ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉండేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లండంటూ రైతులు సమస్యలు విన్నవించారు. -
మహిళల రక్షణ కోసం శక్తి టీమ్
● అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ● హోం మంత్రి అనితనక్కపల్లి: మహిళల రక్షణ కోసం శక్తి టీమ్లను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక యాప్ను రూపొందించామని రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సోమవారం నక్కపల్లిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ పాఠశాల విద్యార్థులు, మహిళా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నక్కపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శక్తి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతి మహిళ ఈ యాప్ను తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం శక్తి టీమ్లను రంగంలోకి దించుతున్నామన్నారు. 112 నంబరుకు ఫోన్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల్లో శక్తి టీం వస్తుందన్నారు. ఎన్టీపీసీ సాయంతో మాదక ద్రవ్యాలు, మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వాహనాలను మంత్రి ప్రారంభించారు. శక్తి టీమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా సమకూర్చిన 39 వాహనాలు, 11 డ్రోన్స్ను మంత్రి ప్రారంభించి పోలీస్ శాఖకు అందజేశారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ గడచిన ఆరు నెలల కాలంలో గంజాయి కేసుల్లో 500 మందిని అరెస్టు చేశామని, 47 కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. 11 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంటను 90 ఎకరాలకు పరిమితం చేశామన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం 39 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన 13 మంది పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ అప్పారావు, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, ట్రెయినీ డీఎస్పీ కృష్ణచైతన్య, సీఐలు కుమారస్వామి, రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల నిర్బంధంపై నిరసన హోరు
ఇఫ్తార్ సహర్ మంగళ బుధ అనకాపల్లి 6.10 4.53 నర్సీపట్నం 6.12 4.51నర్సీపట్నం: ఇచ్చిన హామీల సాధనకు శాంతియుత నిరసన తలపెట్టిన అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిటు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ధర్నాను ఉద్దేశించి రాజు మాట్లాడుతూ.. గత సమ్మె కాలంలో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ విజయవాడ వెళ్తున్న కార్యకర్తలను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వేతన సమస్యను పరిష్కరించకుండా, వయసు రెండేళ్లు పెంచి గతంలో అంగీకరించని, సరైన విధానం లేని గ్రాట్యుటీని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అంగన్వాడీలను మోసగించడమేనన్నారు. గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని, వారి కుటుంబాల్లోని వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డులు తొలగించడంతో అంగన్వాడీలు ఆరోగ్యశ్రీకి నోచుకోలేదన్నారు. నర్సీపట్నం, గొలుగొండ ప్రాజెక్టుల నాయకులు వి.సామరాజ్యం, పి.వరలక్ష్మి, ఆర్.కృష్ణవేణి, రమణమ్మ, హైమా, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా వెంకన్న కల్యాణోత్సవాలు
ఉభయ దేవేరులతో కల్యాణ కాంతులీనుతున్న ఉపమాక వెంకన్నకనుల పండువగా ఎదురు సన్నాహ మహోత్సవంభక్తులే పెళ్లి పెద్దలయ్యారు. శ్రీవారికి, దేవేరులకు నేత్రపర్వంగా కల్యాణోత్సవాలు జరిపిస్తున్నారు. అర్చక స్వాముల ఇంట స్వామివారిని, ఉభయనాంచారులను ఎదురెదురుగా ఉంచి భక్తులు జరిపిన పెళ్లిమాటలు, కట్నకానుకల కార్యక్రమం (కన్యావరుణ సంవాదం) ఆద్యంతం ముగ్ధులను చేసింది. నక్కపల్లి: ఉపమాక క్షేత్రంలో కలియుగ వైకుంఠనాథుని తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో వెలసిన మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం, తొలిపూజ నిర్వహించారు. స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని పెద్దపల్లకిలో వేంచేయింపజేసి ఉపమాక మాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ధ్వజపటాన్ని ఎగురవేస్తూ అష్టదిక్పాలకులు, దేవతలను స్వామివారి కల్యాణానికి ఆ హ్వానించడం జరిగిందని, ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని అర్చక స్వాములు తెలిపారు. విశాఖ నుంచి తెచ్చి న ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న అద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలనుంచి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోవడంతో కిలోమీటరు దూరం క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నేత్రపర్వంగా ఎదురు సన్నాహమహోత్సవం కల్యాణ తంతులో భాగంగా సోమవారం రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవం జరిగింది. దీనినే కన్యావాద సంవాదం (పెళ్లిమాటల తంతు) అంటారు. వేంకటేశ్వరస్వామిని ఇత్తడి గరుడ వాహనంపైన, ఉభయదేవేరులను ఇత్తడి సప్పరం వాహనంపై ఉంచి చిన్నవీధి, పెద్ద వీధులలో ఊరేగించారు. ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద పెళ్లిమాటల తంతు నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండిట్ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తిప్రతిష్టలను వివరించిన సన్నివేశం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిరిని రథంపై ఉంచి తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా స్వామిని దర్శించుకున్నారు. వడ్డాదిలో పోటెత్తిన భక్తులు బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల కల్యాణ వేడుకల్లో భాగంగా ఏకదశి తొలిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయం ముందు భక్తులు బారులు తీరారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారి ప్రసాదాలు అందించారు. భక్తుల గోవింద నామస్మరణతో గిరిజాంబ కొండ మార్మోగింది. కోటాటాలు, చిడతల భజనల మధ్య సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామి పల్లకిని మోయడానికి పలువురు భక్తులు పోటీపడ్డారు. రాత్రికి గిరిజాంబ కొండపైన ఆలయ కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణాన్ని వేలాదిమంది భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించారు. దేవస్ధానం ఈవో శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించి ప్రసాదాలు అందించారు. రాత్రికి ఆలయం వద్ద వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. -
పి–4 సర్వే వేగవంతం చేయాలి
పి–4 సర్వేపై వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్ తుమ్మపాల : పేదరికం నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వ, ప్రవేటు, ప్రజల భాగస్వామ్యంతో (పి4) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పి –4 సర్వే, పంచాయతీరాజ్, జిఎస్డబ్ల్యూఎస్, డ్వామా, జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా బీటీ, సీసీ రోడ్లను మార్చి చివరినాటికి పూర్తి చేయాలన్నారు. ఈ వారం స్వర్ణంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి, తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని సూచించారు. పాఠశాలల ప్రహరీ పనులు, గోకులం షెడ్ల నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి వాటర్ ట్యాంక్లను శుభ్రపరిచి, మరమ్మతులు, క్లోరినేషన్ చేపట్టాలన్నారు. ఉపాధి పనులను, కేటాయించిన పనిదినాల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ వీరునాయుడు, డ్వామా పీడీ పూర్ణిమ దేవి, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామి పాల్గొన్నారు. -
ఉద్యమం
చెరకు రైతుల పక్షాన త్వరలో రాజకీయాలు చేయడానికి రాలేదు రైతుల ఆవేదన విన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించకపోతే చెరకు రైతుల తరపున త్వరలో ఉద్యమానికి దిగుతామని చెప్పారు. రాజకీయాలు చేయడానికి తాము ఇక్కడికి రాలేదని, చెరకు రైతుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలవాలనే వచ్చామని బొత్స చెప్పారు. చెరకు రైతులు రాష్ట్ర ప్రజలు కారా...వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. చెరకు రైతుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీకి తక్షణ సాయంగా రూ.35 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని త్వరలో జరగనున్న శానసమండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళుతుందని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ.89 కోట్లు సాయంగా ఇచ్చి ఫ్యాక్టరీని అప్పుల ఊబిలోంచి బయటకు తెచ్చిందని, రైతుల పక్షపాతిగా జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా సాయం అందించారన్నారు. ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వం పూర్తిగా చెరకు రైతులను, ఫ్యాక్టరీని విస్మరించిందని ధ్వజమెత్తారు. ఎంపీ ఎక్కడి నుంచో వచ్చారని, ఆయన ఈ ప్రాంతం వారు కాకపోవడంతో ఇక్కడ రైతులు, ఫ్యాక్టరీ సమస్యలు ఆయనకు పట్టవన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడి వారే కాబట్టి వారైనా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయకపోవడం విచారకరమన్నారు. రైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ చూస్తూ ఉండదని, వారికి అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు
అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 31 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఎస్పీ అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ డి.వెంకన్న పాల్గొన్నారు. -
కూటమి పాలనలో సహకార రంగం నిర్వీర్యం
సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు అనకాపల్లి టౌన్: సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడమే రాష్ట్ర ప్రభుత్యం ధ్యేయంగా కనిపిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. మూడు నెలలుగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిలు సుమారు రూ.35 కోట్లు ఉందన్నారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్ సభ్యుడు సి.ఎం రమేష్ రూ.100 కోట్లు నిధులను తీసుకొచ్చి జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో 14 సహకార చక్కెర కర్మాగారాలు ఉండేవని, వాటిలో చాలా వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు అమ్మేసారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ బడ్జెట్లో సహకార రంగానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో చెరకు విస్తీర్ణత శాతం తగ్గిపోయిందని, దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మెగ్గు చూపుతున్నారన్నారు. ముందుగా సామాజిక విప్లవ నాయకురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి వివాళులు అర్పించారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరావు, మండల కార్యదర్శి గంటా శ్రీరామ్లు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాల్లో దాహం దాహం
మాడుగుల: మండలంలో శంకరం పంచాయతీ గొప్పూరు, తాడివలస గిరిజన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం నాన్షెడ్యూల్ ఏరియా, ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో తమ దాహం తీర్చాలంటూ సోమవారం మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాన్షెడ్యూల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి మాట్లాడుతూ.. ఇది వరకు ఈ గ్రామాలకు పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీరు అందించారన్నారు. అయితే ప్రస్తుతం సక్రమంగా కొళాయిలు నుంచి తాగునీరు అందకపోవడంతో గిరి మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు వచ్చి మరమ్మతులు చేపడుతున్నా సరే రెండు రోజులు నీరు వచ్చి మళ్లీ పాడవుతున్నాయని వాపోయారు. మళ్లీ షరా మామూలే అయిపోతుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రెండు గ్రామాలకు తాగునీటి సమస్యలు పరిష్కరించాలని గిరిజన మహిళల తరుపున ఆదివాసీ గిరిజన సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మహిళా కార్యకర్తలు గిన్నెపల్లి సన్యాసమ్మ, సోలం మంగ, సోలం వరలక్ష్మి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో మోకాళ్లపై నిరసన -
రోడ్డున పడిన 400 మంది కార్మికులు
● వేతనాలు వేస్తామని నమ్మబలికి అందుబాటులో లేని లలిత ఫెర్రో యాజమాన్యం ● ఆందోళన చేపట్టిన కార్మికులుఅచ్యుతాపురం రూరల్ : వేతనాలు అకౌంట్లలో వేస్తామని కార్మికులను నమ్మబలికి వారిని రోడ్డున పడేసిన రాజ్ రాజేశ్వరి లలిత త్రిపుర సుందరి ఫెర్రో పరిశ్రమ యాజమాన్యంపై కార్మికులు మండిపడుతున్నారు. సోమవారం నాటికి తమ అకౌంట్లలో వేతనాలు వేస్తామని చెప్పి తరువాత ఫోన్లు ఎత్తకుండా మోసం చేయడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. వారికి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము అండగా నిలిచారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పరిశ్రమ లాక్ అవుట్ చేసి కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. ఉపాధి పేరున వేల కోట్ల రాయితీలు పొందుతూ రూ. కోట్ల విలువైన భూములను తీసుకుని పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పి నిర్వాసితులకు మోసగించారన్నారు. కార్మికులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకుండా దొంగచాటున పరిశ్రమలో ఉన్న ఉత్పత్తి మెటీరియల్ని తరలించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదివరకు కార్మికులకు హామీ ఇచ్చిన పరిశ్రమల ప్రతినిధులను సైతం యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. సుమారు 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. క్యాంటీన్లో పనిచేస్తున్న ఆరుగురు కార్మికుకులు ఆరు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి వేతనాలతో పాటు గ్రాట్యూటీ ఇచ్చి ఆదుకోవాలన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలగించిన పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
నీ వెంటే.. నేనూ !
● భర్తకు పెద్దకర్మ చేస్తూ భార్య మృతి ● రామానాయుడుపాలెంలో విషాదంయలమంచిలి రూరల్: నీలో నేను సగమంటూ భార్యాభర్తలు భావిస్తుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత ఎక్కువైనప్పుడు, ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా, మిగిలిన వారు తీవ్ర వేదనకు గురవుతారు. నీవులేని బతుకు నాకెందుకంటూ కుమిలిపోతుంటారు. చనిపోయిన భర్తకు పెద్దకర్మ నిర్వహిస్తుండగానే, అతని భార్య నీ వెంటే నేనంటూ తుది శ్వాస విడిచింది. మున్సిపాలిటీ పరిధి రామానాయుడుపాలెంలో తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన వివరాలు.. ఈ నెల 1న రామానాయుడుపాలెం గ్రామానికి చెందిన రావి తాతారావునాయుడు (60) అనారోగ్యంతో చనిపోయారు. సోమవారం కుటుంబసభ్యులు, బంధువులు పెద్దకర్మ నిర్వహిస్తుండగా ఊహించని షాక్ తగిలింది. తాతారావునాయుడు చిత్రపటానికి భార్య నాగమణి (50) పుష్పాలు వేసి పూజ చేసి నివాళులర్పిస్తూ, అందరూ చూస్తుండగానే గుండెపోటుతో కుర్చీలో కూలబడిపోయింది. బంధువులు, కుటుంబ సభ్యులు కంగారుగా వెళ్లి చూసేసరికి నాగమణి ప్రాణాలు విడిచింది. వివాహమైనప్పటి నుంచి ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండేవారని బంధువులు స్థానికులు చెప్పారు. సోమవారం సాయంత్రమే ఆమెకు పెద్ద కుమార్తె లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
మాడుగుల రూరల్ : తాటిపర్తి శివారు గరికబంద గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్(47) మృతి చెందారు. ఎస్ఐ జి. నారాయణరావు సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివి. పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్ తన ద్విచక్రవాహనంపై మాడుగుల నుంచి పాడేరు వెవెళ్తుండగా, తాటిపర్తి శివారు గరికబంద సమీపంలో పాడేరు నుంచి మాడుగుల వైపు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ తలకు బలమైన గాయాలు తగిలాయి. వెంటనే రమేష్ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పుత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రమేష్ చనిపోయాడు. ఘటనపై రమేష్ సోదరుడు వేమగిరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్
తుమ్మపాల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కలెక్టరేట్లో నెల రోజుల పాటు నిలిపివేసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ పరిసరాలు నిండిపోయాయి. అర్జీల వివరాలు ఆన్లైన్ చేసేందుకు పది శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్ వద్ద సచివాలయ ఉద్యోగులు నిరక్ష్యరాసులు, వృద్ధులు, వికలాంగుల సమస్యలు తెలుసుకుని అర్జీలు తయారు చేశారు. సమస్యల ఆధారంగా అర్జీలపై నమోదు చేసిన రిఫరెన్స్తో ఆన్లైన్ చేసి మొదటి అంతస్తు పీజీఆర్ఎస్ వేదికపైకి పంపించడంతో కలెక్టర్, డీఆర్వో, ఇతర జిల్లా అధికారులు అర్జీదారుల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్ అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీలకు పరిష్కారం చూపడమే కాకుండా, పరిష్కారం కాని దరఖాస్తులకు వివరంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. సోమవారం మొత్తం 440 అర్జీలు నమోదవ్వగా అందులో అత్యధికం భూ సమస్యలపైనే కావడం గమనార్హం. దివ్యాంగులు, వృద్ధులు ఆరు బయటే... భౌతికంగా తమను చూసి జాలితోనైనా సమస్య పరిష్కారానికి కలెక్టర్ కృషి చేస్తారనే గంపెడు ఆశతో జిల్లా సరిహద్దుల నుంచి సైతం వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్కు చేరుకుంటే వారిని సిబ్బంది ఆరుబయటే నిలిపివేశారు. దీంతో నేరుగా కలెక్టర్ను కలిసి తమ గోడు చెప్పుకునే అవకాశం లేక వెనుతిరుగుతున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీల్ చైర్లు, లిఫ్ట్ ద్వారా తామే స్వయంగా కలెక్టర్ను కలవగలమని, కానీ అందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందారు. భూ సమస్యపై పాయకరావుపేట మండల నుంచి కుటుంబసభ్యుల సహాయంతో వచ్చిన 95 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్ను కలిసే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె అర్జీని ఇతరులతో పీజీఆర్ఎస్లో నమోదు చేయించి జిల్లా అఽధికారులకు పంపించారు. వివాదంలో ఉన్న భూమి ఆన్లైన్పై ఫిర్యాదు కోర్టు వివాదంలో ఉన్న భూమిని ఆన్లైన్న్ చేసి, భూ ఆక్రమణకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాయకరావుపేట మండలం పడాలవాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పదిలం సీతయ్యమ్మ (95 ఏళ్ల వృద్ధురాలు)తో ఆమె కుటుంబ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నెం.155, 158, 153, 164, 162లో పలు సబ్ డివిజన్లలో తన భర్త వాటాకు గల వ్యవసాయ భూములు తన పేరున పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో ప్రసుత్తం సదరు అంశం కోర్టు పరిధిలో ఉంది. భూమిని ఇరువురికి కూడా ఆన్లైన్ చేయవద్దంటూ డిస్ప్యూట్ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరిగిందని, కానీ రీ సర్వేలో వీఆర్వోతో పాటు సర్వేయర్, రెవెన్యూ అధికారులు సదరు భూములను తన కుటుంబ సభ్యుల పేరి ఆన్లైన్ చేయడంతో వారు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని వృద్ధురాలు తెలిపారు. కలెక్టర్, జిల్లా అధికారులు తక్షణమే విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే కలెక్టర్ను స్వయంగా కలిసి తన బాధ చెప్పుకునే అవకాశం లేకపోవడంపై ఆమె నిరాశ వ్యక్తం చేసింది. ఇంటి పట్టా కోసం మూడేళ్లుగా ఎదురు చూపులు ప్రభుత్వ భూమిలో ఉన్న ఇంటికి క్రమబద్దీకరణ పత్రం అందిస్తామని చెప్పి జీవో నెం.225 ద్వారా రూ.2.17 లక్షలు కట్టించుకుని నేటికీ పట్టా ఇవ్వడం లేదని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోరుకొండ పెదసాధు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పైకప్పు రేకులుగా ఉన్న ఇంటికి శాశ్వత హక్కు పత్రం వస్తుందనే ఆశతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కూలి పనులు చేసుకునరి దాచుకున్న సొమ్మంతా సచివాలయంలో కడితే బిల్లు ఇచ్చి సరిపెట్టేసారని, కలెక్టరమ్మ చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరారు. బ్యాటరీ ట్రైసైకిల్ మంజూరు చేయరూ... వికలాంగుడినైన తన జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని చీడికాడ మండలం తిరువోలు గ్రామానికి చెందిన కంచి రాము అర్జీ చేసుకున్నాడు. నిరుపేద అయిన తాను 40 ఏళ్ల నుంచి గ్రామంలో చిన్న కిల్లీబడ్డి పెట్టుకుని జీవిస్తున్నానని, ఈ నెల 9న విద్యుత్ షార్ట్ సర్క్యుట్తో కిల్లీబడ్డితో పాటు తన బండి కూడా కాలిపోయిందని, సరుకులు తెచ్చుకుని అమ్ముకుని జీవనోపాధి పొందెందుకు బ్యాటరీ బండి మంజూరు చేయాలని కోరారు. పూర్వ తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు యలమంచిలి రూరల్ : యలమంచిలి పూర్వ తహసీల్దార్ ఎస్.రాణి అమ్మాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేగుపాలెం మాజీ సర్పంచ్ కొల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి ఆర్డీవో ఆయీషాలకు సోమవారం ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ పరిధి సర్వే నంబర్లు 167/1,167/3లో 2.91 ఎకరాల ప్రభుత్వ భూమిని యలమంచిలి పూర్వపు తహసీల్దార్ రాణి అమ్మాజీ ఉద్దేశపూర్వకంగా ఒక రియల్టర్ పేర జిరాయితీగా రికార్డులను మార్పు చేసి ఆ భూమి అమ్మకం జరిగేలా చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఆ భూమిని కొనుగోలు చేసిన ఒక సిమెంటు పరిశ్రమ యాజమాన్యం పక్కనే ఉన్న ఎర్రచెరువుతో పాటు పక్కనే ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని కూడా ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా భారీ ప్రహరీ గోడ నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. తప్పు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా ఈ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థంకావడం లేదని మాజీ సర్పంచ్ సందేహం వ్యక్తపరిచారు. దీనికి సంబంధించి ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను కూడా ఫిర్యాదుదారు తన ఫిర్యాదుతో జతపరిచారు. నెల తరువాత మొదలైన పీజీఆర్ఎస్ అర్జీలు భూ సమస్యలపైనే అధికం ఆరు బయటే దివ్యాంగులు, వృద్ధులు -
ఘనంగా బౌద్ధ సమ్మేళనం
● బొజ్జన్నకొండ వద్ద శాంతి ర్యాలీ ● బుద్ధ భూమి మాసపత్రిక ఆవిష్కరణ అనకాపల్లి టౌన్: ప్రపంచానికి మొట్ట మొదటిసారిగా శాంతి, ధర్మం, అహింసా మార్గాలను బోధించిన మహానుభావుడు బుద్ధుడని రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మండలంలోని శంకరం ప్రముఖ బౌద్ద పర్యాటక క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ సమ్మేళనం ఘనంగా ఆదివారం జరిగింది. జిల్లా బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పల్లా బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా కొండ మెట్ల మార్గం గుండా బుద్ధుని విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రతినిధులు, బౌద్ద ఉపాసకులు, బౌద్ద అభిమానులు, విదేశీ బౌద్ధ భిక్షువులు వెనరబుల్ పూజ్య బ్రరామో బాంతేజీ (కంబోడియా), రాజాభాంతేజీ(బర్మా)లు పాల్గొని ప్రార్థనలు నిర్వహించి ప్రపంచ శాంతి స్థాపనకు అందరూ దోహద పడాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బుద్ధభూమి మాస పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర బుద్దిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వై హరిబాబు, విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య గౌరవఅధ్యక్షుడు డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బౌద్ధ సంఘాల ప్రతినిధులు బొడ్డు కల్యాణరావు, పి.రాంబాబు, ఎన్.గంగాధర్, వి.వి.దుర్గారావు, బోర వేణు గోపాల్, బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రచార కమిటీ సభ్యుడు బల్లా నాగభూషణం పాల్గొన్నారు. -
నేడే ఉపమాక వెంకన్న కల్యాణం
● ఘనంగా అంకురార్పణ ● మాడవీధుల్లో పెళ్లి కావిడి ఊరేగింపు ● స్వర్ణాభరణాలతో దర్శనమిస్తున్న స్వామివారు ● విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఆలయం నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక గరుడాద్రి పర్వతంపై వెంకన్న వార్షిక తిరుకల్యాణోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పరిషత్, కంకణ ధారణ అంతరాలయ దేవతాపూజ, మత్స్యంగ్రహణ నిర్వహించారు. నిత్య సేవాకాలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ గోష్టి ప్రసాద వినియోగం జరిపారు. అంకురార్పణ పూజా కార్యక్రమాల్లో భాగంగా హంసవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో ఉభయదేవేరులను ఉంచి సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. దీన్నే అంకురార్పణ అంటారు. అనంతరం వాస్తు మండప పూజ, యోగీశ్వరపూజ, అగ్నిప్రతిష్టాపన, జయాది హోమాలు జరిగాయి. గరుడ ప్రాణప్రతిష్ట విశేషహోమాలు, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమం నిర్వహించి గరుడప్పాలు నివేదన చేశారు. అష్టదిక్పాలకులకు ఆవాహన కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారి పెళ్లికావిడిని ఉపమాక మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరిబొండాలు కానుకలుగా సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాలతో స్వామివారి కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యా యని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. పెళ్లికావిడి ఊరేగింపులో అర్చకులు కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. నేడే స్వామివారి కల్యాణం స్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం కన్యావాద సంవాదం (ఉపమాక సింహద్రాచార్యులు ఇంటి వద్ద స్వామివారి అమ్మవార్ల పెండ్లిమాటలు, గుణగణాలను వివరించే తంతును నిర్వహిస్తారు) తరిగొండ వేంగమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపకురాలు, వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ పండిత సభ, 13వ తేదీన స్వామివారికి గజవాహనంపై తిరువీధి సేవ,14న పౌర్ణమినాడు రాజయ్యపేట సముద్రతీరంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి డోలోత్సవం, అద్దపు సేవ జరుగుతుంది. 15 నుంచి 17 వరకు స్వామి వారి పుష్పయాగోత్సవాలు జరుగుతాయి. కల్యాణ తంతును నిర్వహించేందుకు తిరుచానూరు పద్మా వతి ఆలయానికి చెందిన ప్రముఖ వేదపండితులు, ఆగమశాస్త్రసలహాదారులను రప్పిస్తున్నారు. విస్తృత ఏర్పాట్లు కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంతోపాటు, గోపురాలు, బేడామండపం, ఆస్థాన మండపం, కల్యాణమండపాలకు రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. టీటీడీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సుమారు 300 మంది విధుల్లో పాల్గొంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాభరణాలతో దర్శనమివ్వనున్న స్వామివారు వజ్ర వైఢూర్యాలు, కెంపులు, పచ్చల హారం, కాసులపేర్లు, మరకత మాణిక్యాలు, బంగారంతో తయారు చేసిన శంఖు, చక్రం, హస్తాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, చంద్రహారాలు, స్వర్ణ వజ్రకవచం ఇలా స్వామివారికి వెలకట్టలేనన్ని ఆభరణాలున్నాయి. వీటిని స్వామివారికి అలంకరించి ఐదురోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. -
దినదిన గండం ‘గోవాడ’ భవితవ్యం
● ఆర్థిక ఇబ్బందులతో సుగర్ ఫ్యాక్టరీ సతమతం ● నిధులు తెస్తామని కనిపించకుండా పోయిన ఎంపీ, ఎమ్మెల్యే ● ఫ్యాక్టరీ మనుగడపై ఆందోళన చెందుతున్న చెరకు రైతులు, కార్మికులు ● నేడు వైఎస్సార్సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో ఆందోళన ● నేడు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గోవాడ రాకనేడు చెరకు రైతులతో ఆందోళన ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఈనెల 10వ తేదీన చెరకు రైతులతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాయి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఉదయం 10గంటలకు సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు వస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3గంటలకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చెరకు రైతులతో ఆందోళన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ నుంచి శానసమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. ఆయనతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, స్థానిక సమన్వయకర్త గుడివాడ అమర్నాఽథ్, మాజీ ప్రభుత్వ విప్, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు కరణం ధర్మశ్రీ పాల్గొని రైతుల తరపున మద్దతుగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. చోడవరం: రైతులకు చెరకు పేమెంట్స్ ఇవ్వలేక, కార్మికులకు జీతభత్యాలు చెల్లించలేక, పాత బకాయిలు చెల్లించలేక, క్రషింగ్కు కావలసిన సామగ్రికి అవసరమైన ఆర్థిక స్థోమత లేక గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చాలా దయనీయ స్థితిలో ఉంది. 23,450 మంది సభ్య రైతులు ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడో రేపో మూసివేసే దుస్థితికి రావడం రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. 2019 సంవత్సరానికి ముందు గత టీడీపీ ప్రభుత్వం హాయాంలో ఫ్యాక్టరీ పాలకమండలిలో ఉన్న టీడీపీ పాలకవర్గం సుమారు రూ. 150 కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టింది. అప్పట్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి ఆర్థికసాయం అందించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫ్యాక్టరీని ఆధుకుంది. ప్రభుత్వ విప్ హోదాలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉప ముఖ్యమంత్రిగా బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖామంత్రిగా గుడివాడ అమర్నాఽథ్ ఈ ఫ్యాక్టరీని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఐదేళ్లలో రూ.89 కోట్లు ఆర్థిక సాయం అందించారు. దీంతో ఫ్యాక్టరీ నెమ్మదిగా అప్పుల ఊబిలోంచి కొంతమేర బయటపడింది. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం గడిచిన పది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయం ఇవ్వలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఉప ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పి ఫ్యాక్టరీని పూర్తిగా అభివృద్ధి చేసి చెరకు టన్నుకి రూ. 4వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని కూటమి నేతలు ఎంపీ రమేష్, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమైపోయాయి. ఎప్పుడో 1962లో 1000 టన్నుల కెపాసిటీతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ దశలవారీగా కెపాసిటీ స్థాయి పెంచుకుంటూ ప్రస్తుతం 5.2 లక్షల టన్నుల క్రషింగ్ కెపాసిటీకి వచ్చింది. కానీ మిషనరీ అంతా 30, 40 యేళ్ల నాటిదే కావడంతో పాత మిషనరీతో తరుచూ క్రషింగ్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసరంలో రూ. 9 కోట్లు ప్రభుత్వం సాయంగా అందిస్తే తప్పా తాత్కాలికంగా ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర సహకార రంగంలో 11 ఫ్యాక్టరీల్లో అన్నీ ఇప్పటికే మూతబడి పోగా ఒక్క గోవాడ ఫ్యాక్టరీలో నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో 4 ఫ్యాక్టరీలకు సుమారు రూ. 200 కోట్లు వరకూ ఆర్థికసాయం అందించి, కార్మికులు, రైతుల పాతబకాయిలన్నీ చెల్లించారు. కూటమి ప్రభుత్వం ఈ ఒక్క ఫ్యాక్టరీని ఆదుకోవడానికి ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన మాటలు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీగోవాడ సుగర్ ఫ్యాక్టరీ మనుగడ దినదినగండంలా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ఫ్యాక్టరీకి ఈ ఏడాది క్రషింగ్ సీజన్లో ఎదురవుతున్న సమస్యలు మరింతగా కుంగదీస్తున్నాయి. మరో పక్క ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, నాయకులు చేతులెత్తేయడంతో ఇప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం
● రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్, వైద్య బీమా సర్వీసుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ● జాతీయ భద్రతా వారోత్సవాల ప్రారంభం అనకాపల్లి: జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని కార్మికులతో పాటు సామాన్య ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్, వైద్య బీమా సర్వీసుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో కలెక్టర్ విజయకృష్ణన్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్లతో కలసి ఆయన ఆదివారం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుందన్నారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వమే కాకుండా యాజమాన్యం కూడా బాధ్యత వహించి వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. జిల్లాలో 884 పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో 205 ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయని, ఈ పరిశ్రమలన్నింటిలో సుమారుగా లక్షా 28వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మికులతో పాటు విద్యార్థులందరికీ భద్రత పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ కృషియల్ ఫర్ వికసిత్ భారత్–2047 అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి సలహాలు ఇవ్వడానికి వసుధ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎస్పీ తుహిన్సిన్హా మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాలపై కార్మికులకు మాక్ డ్రిల్ నిర్వహించి భద్రతపై శిక్షణ ఇవ్వాలన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ యాజమాన్యం, కార్మికుల సంయుక్త కృషితో జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రతి కార్మికునికి బీమా సహాయం అందాలంటే ఆయా పథకాలలో నమోదు కావాలని ఆయన కోరారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్మూర్తి, కర్మాగార సంయుక్త ముఖ్య తనిఖీ అధికారి జె.శివశంకర్రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం నాగరాజారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఫైర్ సర్వీసస్, హెచ్పీసీఎల్, ఎన్టీపీసీ, హెటిరో ఫార్మా కంపెనీ యాజమాన్యం, పట్టణ సీఐ టి.వి.విజయ్కుమార్, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ పాల్గొన్నారు. -
వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామకొండలరావు
మాడుగుల రూరల్: విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, మాడుగుల ప్రఖండ్ బాధ్యులు రాపేట రామకొండలరావు మాస్టరును నియమించారు. ఈ నెల 8,9, తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో గల వీరంపాలెం గ్రామంలో గల బాల త్రిపుర సుందరీ సహిత, పరమేశ్వర ఆలయంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో 19 జిల్లాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ బాధ్యులు హాజరయ్యారు. దీనికి కేంద్ర కమిటీ బాధ్యులు కోటేశ్వరశర్మ, ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షుడు వెంకటేశ్వరావు, ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో జిల్లా వీహెచ్పీ ఉపాధ్యక్షుడిగా రామకొండలరావును నియమించారు. రామకొండలరావు గతంలో మాడుగుల మండల వీహెచ్పీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో అయోధ్య నుంచి తీసుకొచ్చిన శ్రీరాముని అక్షింతలను ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, సమరతాసేవా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో గ్రామాల్లో పంపిణీ చేశారు. మండలంలో 56 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. -
పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు
చెరకు రైతులకు అండగా వైఎస్సార్సీపీ దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఆదివారం తారువలో ఆయన మాట్లాడుతూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో చెరకు రైతులతో సోమవారం నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరై చెరకు రైతులు, కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటారన్నారు. వీటిపై శాసన మండలిలో ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ముఖాముఖి కార్యక్రమానికి ఫ్యాక్టరీ చెరకు రైతులు, పార్టీ నాయకులు తరలిరావాలని కోరారు. -
ఆయిల్ తాగేశారు!
అధికారులేనెలకు అదనంగా రూ.30 లక్షల ఆయిల్ వినియోగం అధికారులకు అధికారులే మామూళ్ల ఆఫర్ ● ఫాగింగ్ యంత్రాల ఆయిల్ బిల్లు రూ.68 లక్షలకు పెంచేశారు.. ● ప్రతి నెలా పబ్లిక్ హెల్త్, మెకానికల్ అధికారులకు లంచాలు ● డిప్యూటేషన్పై వచ్చిన ఓ అధికారికి పంపకాల బాధ్యత ● గత కమిషనర్ హయాంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ● నెలకు అదనంగా రూ.30 లక్షలు కొట్టేస్తున్నారని స్పష్టం ● ఇప్పటికీ చర్యలు తీసుకోని వైనం తనిఖీలో తేలిందిలా.. ఫాగింగ్ యంత్రాలకు ప్రతి నెలా సుమారు రూ.30 లక్షల మేర అదనపు ఆయిల్ వినియోగం జరుగుతుండటంతో, మెకానికల్ విభాగానికి కొత్తగా వచ్చిన అధికారికి అనుమానం కలిగింది. దీంతో ఆయన ఈ విషయాన్ని గత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకు ఫాగింగ్ యంత్రాలకు గంటకు ఎంత ఆయిల్ అవసరమవుతుందో ముగ్గురు అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఈ ఫాగింగ్ యంత్రాలకు గంటకు 40 నుంచి 45 లీటర్ల ఆయిల్ సరిపోతుందని విచారణలో తేలింది. అయితే గతంలో పనిచేసిన అధికారి మాత్రం ఏకంగా 120 లీటర్ల చొప్పున ఆయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఫాగింగ్ పనులను పర్యవేక్షించే డిప్యూటేషన్ అధికారి, ప్రజారోగ్య విభాగంలోని ముఖ్య అధికారులు అడిగిన దాని ప్రకారమే గత అధికారి మంజూరు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఫాగింగ్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఆ డిప్యూటేషన్ అధికారి మామూళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆ అధికారి ప్రతి నెలా మెకానికల్, ప్రజారోగ్య శాఖ అధికారులకు క్రమం తప్పకుండా మామూళ్లు అందజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కమిషనర్ ఫాగింగ్ వ్యవహారాల పర్యవేక్షణాధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఆయన బదిలీ, ఎన్నికల నియామవళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇన్చార్జి కమిషనర్గా ఉన్న కలెక్టరు దృష్టికి ఈ విషయం వెళ్లకుండా కొందరు జాగ్రత్తగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాధారణంగా ఏదైనా పనిచేసే కాంట్రాక్టర్.. అధికారులకు లంచాలు ఇవ్వడం పరిపాటి. అయితే ఘనత వహించిన జీవీఎంసీలో మాత్రం అధికారులే అధికారులకు లంచాలు ఇస్తున్నారు. తమకు ఇంత మొత్తం బిల్లు ఆయిల్ కోసం ఇస్తే.. మీకు ఇంత మొత్తం ప్రతి నెలా లంచం ముట్టచెబుతామంటూ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. మెకానికల్ విభాగం, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారుల మధ్య జరిగిన ఈ డీల్తో జీవీఎంసీకి భారీ నష్టం జరిగింది. గతంలో మెకానికల్ విభాగంలో పనిచేసిన ఓ అధికారితో పాటు జీవీఎంసీకి డిప్యూటేషన్పై వచ్చిన ఇద్దరు అధికారుల మధ్య లాలూచీతో వ్యవహారం సాఫీగా సాగింది. వాస్తవానికి ఫాగింగ్ యంత్రాల కోసం గతంలో రూ.38 లక్షల మేర నెలవారీగా బిల్లు ఉండగా.. దానిని ఏకంగా రూ.68 లక్షలకు పెంచేశారు. దీనిపై గత నెలలో అప్పటి కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ చేయగా.. రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లు సరిపోతుందని తేలింది. తద్వారా నెలకు రూ.30 లక్షల మేర అధికంగా ఆయిల్ పేరుతో లాగేసినట్టు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో సదరు మెకానికల్ అధికారిపై ఈ వ్యవహారంతో పాటు ఇతర ఫిర్యాదులు రాగా బదిలీ వేటు పడింది. అయితే డిప్యూటేషన్పై ఉన్న మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈలోగా కమిషనర్ బదిలీతో ఈ వ్యవహారం మూలకు చేరింది. ఈ వ్యవహారంలో అడిగినంత మేర ఆయిల్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇద్దరు అధికారులకు మరో అధికారి ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున మామూళ్లు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇన్చార్జి కమిషనర్గా ఉన్న కలెక్టర్ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అడ్డగోలుగా ఆయిల్ సరఫరా జీవీఎంసీలో ఫాగింగ్ మిషన్లు పెద్దవి 8, మీడియం సైజువి 80 ఉండగా, స్ప్రింక్లర్లు 25 ఉన్నాయి. వీటికి ప్రతి నెలా గతంలో రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లు చెల్లించేవారు. అయితే డిప్యూటేషన్పై వచ్చిన ఇద్దరు అధికారులు, మెకానికల్ విభాగంతో కుదుర్చుకున్న మామూళ్ల ఒప్పందంలో భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ.68 లక్షలకు పెంచేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ ఇద్దరు అధికారులకు ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మలేరియా విభాగం వారు అడిగిన మేరకే తాము ఆయిల్ కార్డులను ఇచ్చామని మెకానికల్ విభాగంలో పనిచేసిన అధికారి చెబుతున్నట్టు సమాచారం. గతానికి భిన్నంగా ఒకేసారి రెట్టింపు స్థాయిలో ఆయిల్ వినియోగం పెరిగితే కనీసం విచారణ చేయాల్సిన మెకానికల్ విభాగం అధికారి, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఆయిల్ను తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సదరు అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి మద్దతు కూడా ఉండటంతో ఎవరూ తమను ఏమీ చేయలేరనే ధీమాతో అడ్డగోలుగా ఆయిల్ పంపిణీకి తెరలేపారు. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లకు కూడా నెలవారీగా మామూళ్లు అందినట్టు తెలుస్తోంది. రాబోయే కాలానికి కాబోయే మేయర్నని చెప్పుకుంటున్న నేత వద్ద ఉండే ఇద్దరు కార్పొరేటర్లకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
గురుకులం పిలుస్తోంది..
● ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 13 వరకు గడువు యలమంచిలి రూరల్: పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు, కళాశాలల్లో 2025–26 సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 గురుకులాల్లో రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో ఐదో తరగతి,ఇంటర్ మొదటి సంవత్సరాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.5 బాలికలు,2 బాలురు పాఠశాలలు, కళాశాలల్లో ఐదో తరగతిలో 560, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 560 సీట్లు భర్తీ చేయనున్నారు.జిల్లాలో నక్కపల్లి, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం,నర్సీపట్నం, కోనాంలలో బాలుకలు,దేవరాపల్లి మండలం తెనుగుపూడి, గొలుగొండల్లో బాలురకు గురుకులాలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను గడువులోగా ఆన్లైన్లో పంపించాలి. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. పరీక్ష ఇలా.. ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు,ఇంటర్లో చేరే వారికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఐచ్ఛిక విధానంలో ప్రవేశ పరీక్ష ఉటుంది.ప్రతి తప్పు జవాబునకు 1/4 మార్కు (నెగెటివ్) మార్కు తీసివేస్తారు.ఐదో తరగతికి సంబంధించి నాలుగో తరగతిలో తెలుగు 10,ఆంగ్లం 10,గణితం 15,సైన్స్ 15 కలిపి మొత్తం 50 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి. ఇంటర్కు సంబంధించిన ప్రవేశ పరీక్షలో పదో తరగతిలో గణితం 15, భౌతికశాస్త్రం 15,సామాన్యశాస్త్రం(బయాలజీ) 15,ఆంగ్లం 15,సామాజిక అధ్యయనాలు 10,లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 30 కలిపి మొత్తం 100 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఒత్తిడి లేని నాణ్యమైన విద్యా బోధన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉంటుంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం గురుకులాల్లో ప్రతి ఏటా ఐదు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తోంది. ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించి అర్హత కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠాలు బోధిస్తారు. నిర్ణీత సమయంలోగా ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో గురుకులంలో మొత్తం 80 సీట్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీకి 60, బీసీ–సీ కి 10, ఎస్టీకి 05, బీసీ 04, ఓసీ 01 చొప్పున కేటాయిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి. –మళ్ల మాణిక్యం, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు), కొక్కిరాపల్లి అర్హతలు ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 2012 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య,ఓసీ,బీసీ,ఎస్సీ కన్వెర్టెడ్ క్రిస్టియన్లు 2014 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్ల వయసు మించకూడదు.ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న వారు మాత్రమే అర్హులు.అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకూడదు.అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో htt pr://apbragcet.apcfss.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తులు చేసేటపుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు, ఇంతకు ముందు తరగతికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.మొబైల్ నెంబరు తప్పులేకుండా నమోదయ్యేలా చూసుకోవాలి. ప్రతిభ పరీక్షలో మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశం కేటాయిస్తారు. వసతులు: ఉచిత వసతి, భోజన సౌకర్యంతో గురుకుల విధానంలో చదువుకునే అవకాశం ఉంది. పౌష్టికాహారం, మూడు జతల ఏకరూప దుస్తులు, దుప్పటి లేక జంకాన, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, రాత, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. కాస్మోటిక్ ఛార్జీలు, రోజూ వేరుశనగ చిక్కీ, వారానికి ఆరు రోజులు గుడ్లు,రెండు రోజులు చికెన్తో భోజనం ఉంటుంది. -
కూటమి పాలనలో 43 మంది కార్మికుల మృతి
అనకాపల్లి: జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది మాసాల్లోనే 43 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎస్సెన్షియా కంపెనీలో జరిగిన సంఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారని, సీఎం చంద్రబాబునాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వసుధ మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తీసుకుంటామన్నారు. జిల్లాలో కెమికల్ కర్మాగారాలు ఉన్నాయని, ఇక్కడ త్వరలో బర్న్ వార్డులతోపాటు రెండు బర్న్ అంబులె న్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, పరి శ్రమల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. నూకాంబిక సేవలో మంత్రి... ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్.సుజాత అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ -
ఇంకా చి‘క్కె’న్!
అనకాపల్లిటౌన్: బర్ట్ప్లూ సోకి కోళ్లు చనిపోతున్నాయని అపోహతో ఇంకా కొంత మంది చికెన్ తినడానికి జంకుతున్నారు. చికెన్ 80 డిగ్రీలు వేడి తో వండుకొని తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు భయపడుతున్నారు. మటన్, చేపలు ధరలు అధికంగా ఉన్నా వాటి వైపే అధిక శాతం ప్రజలు మెగ్గుచూపుతున్నారు. చికెన్ ధరలు వాస్తవంగా శనివారం కంటే ఆదివారం ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా భారీగా ధర తగ్గినా చికెన్ విక్రయాలు అంతతమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో శనివారం కేజి విత్ స్కిన్ 180 ఉండగా ఆదివారం 160, స్కిన్ లెస్ 190 నుంచి 170 రూపాయలకు తగ్గింది. మార్కెట్లో సేల్స్ పెంచుకోవడానికి కొందరు ఇంకో పదిరూపాయిలు తగ్గించి 160 రూపాయలకు అమ్మకాలు చేపట్టారు. అయినా అమ్మకాలు అంతంతమాత్రంగానే జరిగాయి. అవగాహన సదస్సులు, చికెన్ మేళాలు నిర్వహిస్తున్నా చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తుండడం గమనార్హం. -
స్టీల్ప్లాంట్ డైరెక్టర్గా సలీం బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా డాక్టర్ జి.సలీం పురుషోత్తమన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఎ.కె.సక్సేనా మొయిల్కు ఎండీగా వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. మెకానికల్ ఇంజనీర్ అయిన సలీం 1988లో బొకారోలో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్ను ప్రారంభించారు. 1996లో విశాఖ స్టీల్ప్లాంట్లో చేరారు. సర్టిఫైడ్ ఎనర్జీ మేనేజర్గా స్టీల్ప్లాంట్ ఐఎస్ఓ 50001 సర్టిఫికేషన్ పొందడంలో ఆయన గణనీయంగా దోహదపడ్డారు. 2018లో ఆయన బ్రైత్ వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్లో డైరెక్టర్ (ప్రొడక్షన్)గా చేరారు. అక్కడ ఒక ఏడాది పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వహించారు. మూడు నెలల పాటు అక్కడ సీఎండీగా వ్యవహరించారు. 2024లో మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పొందారు. -
ప్లాట్ఫాంపైకి రావడం అంత వీజీ కాదు
● రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కొత్త వ్యూహాలు ● కన్ఫర్మ్ టికెట్స్ ఉంటేనే ప్లాట్ఫాంపైకి అనుమతి ● వెయిటింగ్ లిస్ట్ ఉంటే స్టేషన్ బయట ఉన్న హాల్లోనే.. ● త్వరలో విశాఖ రైల్వే స్టేషన్లో అమలుకు సన్నాహాలు సాక్షి, విశాఖపట్నం: నేను టికెట్ తీసుకున్నాను. వెయిటింగ్లో ఉంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాగైనా కన్ఫర్మ్ చేయించుకుని బెర్త్లో హాయిగా పడుకుంటానని అనుకుంటే.. ఇకపై ఆ పప్పులింక ఉడకవ్. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయితేనే ప్లాట్ఫాంపైకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. లేదంటే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్లు వెళ్లిన తర్వాత.. మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే ట్రైన్ ఎక్కగలరు. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఒక అత్యున్నత సమావేశం జరిగింది. ప్లాట్ఫాంలపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు నిపుణులు సూచనలు చేశారు. అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్లాట్ఫాంలపైకి ఒకేసారి ప్రయాణికులు గుంపులుగా రాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలను దేశవ్యాప్తంగా 60 ప్రధాన స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రైలు వచ్చిన తర్వాత, ప్రయాణికులను ఒకరి తర్వాత ఒకరిగా, వివిధ మార్గాల ద్వారా రైలు దగ్గరకు అనుమతిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా ఈ తరహా నిబంధనలు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏం చేస్తారంటే.? ● ప్లాట్ఫాంపై రద్దీని నియంత్రించేందుకు ఇకపై వెయిటింగ్ ప్రాంతాలను స్టేషన్ బయట ఏర్పాటు చేస్తారు. టికెట్ లేని ప్రయాణికులు కూడా స్టేషన్ వెలుపలే వేచి ఉండాలి. వెయిటింగ్ లిస్ట్లోని ప్రయాణికులను పంపిన తర్వాత, వారికి రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. ● ముందుగా కన్ఫార్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్ఫాంపైకి అనుమతిస్తారు. ● మరోవైపు స్టేషన్లలో మరింత వెడల్పుగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను(వంతెనలు) నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహాకుంభమేళా సమయంలో ఇలాంటి వెడల్పాటి వంతెనలు సమర్థవంతంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్టేషన్లలో 6 మీటర్లు, 12 మీటర్ల వెడల్పు కలిగిన ఎఫ్వోబీలు రాబోతున్నాయి. ● రైల్వేస్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీ టీవీ నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా ఏర్పాటు చేస్తారు. ● సమన్వయాన్ని మెరుగుపరచడానికి సిబ్బందికి వాకీ టాకీలు, అత్యాధునిక అనౌన్స్మెంట్ సిస్టమ్, కాలింగ్ సిస్టమ్లతో సహా ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తారు. ● సంక్రాంతి, దసరా వంటి పండుగలు, సెలవుల సమయాల్లో రైల్వే స్టేషన్లలో వార్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి అమలు చేస్తారు. ● ప్రధాన స్టేషన్లలో ఆర్థికపరమైన విషయాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన స్టేషన్ డైరెక్టర్ను నియమించనున్నారు. ఈ అధికారి స్టేషన్ సామర్థ్యం, రైలు లభ్యతను బట్టి టికెట్లను ఎంత వరకు విక్రయించాలనే విషయాలను నిర్ణయిస్తారు. ● ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వేస్టేషన్ ప్రవేశంపై రైల్వే శాఖ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. స్టేషన్కు చేరుకోవడానికి ఉన్న అన్ని అనధికారిక ప్రవేశ మార్గాలను మూసివేస్తారు. ● విశాఖపట్నం ఇటీవలే ‘ఏ’గ్రేడ్ స్టేషన్గా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ తరహా నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. స్టేషన్కు అధికారికంగా, అనధికారికంగా ఎన్ని ప్రవేశ ద్వారాలు ఉన్నాయి? నిష్క్రమణ మార్గాలు ఎన్ని ఉన్నాయి? రోజువారీ రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ప్లాట్ఫాంలు 8 స్టేషన్లో మొత్తం ట్రాక్లు 10 రైల్వే స్టేషన్ విస్తీర్ణం 1,110,600 చ.అడుగులు ఏటా ప్రయాణికుల రాకపోకల ద్వారా ఆదాయం సుమారు రూ.560 కోట్లు ఏటా రాకపోకలు సాగించే ప్రయాణికులు సుమారు 2 కోట్లు విశాఖ రైల్వేస్టేషన్ సమాచారం స్టేషన్ కేటగిరీ నాన్ సబర్బన్ గ్రూప్ (ఎన్ఎస్జీ)1 -
వడ్డాది వెంకన్న క్షేత్రానికి కల్యాణ శోభ
● నేటి నుంచి 15 వరకు కల్యాణోత్సవాలు ● ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు ● లక్షలాది మంది భక్తుల రాకతో భారీ బందోబస్తు ● అంకురార్పణ దొంగపెండ్లితో ప్రారంభమైన వేడుకలు ● నేడు ఏకాదశి ప్రత్యేక పూజలు, రాత్రికి శ్రీనివాస కల్యాణం బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి క్షేత్రం కల్యాణ శోభతో కాంతులీనుతోంది. సోమవారం ఉదయం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 152వ కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం అర్ధరాత్రి అంకురార్పణ చేసి స్వామివారి దొంగపెండ్లితో కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సోమవారం ఏకాదశి వేంకటేశ్వరస్వామి కల్యాణం జరగ్గా, ఆఖరి రోజు శనివారం రాత్రి స్వామివారి పవళింపు సేవతో వేడుకలు ముగుస్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా వడ్డాది వెంకన్నగా పేరొందడంతో ఏటా స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వీరి సౌకర్యార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వంద మందితో ఎస్ఐ శ్రీనివాసరావు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య సేవలు అందేలా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, గ్రామ పెద్దలు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలకు, మెట్లు మార్గం, కల్యాణ వేదిక, కళావేదికలకు రంగులు వేసి, విద్యుద్దీపాలంకరణతో ముస్తాబు చేశారు. టికెట్ల కౌంటర్, ధ్వజ స్తంభం వద్ద, ఆలయంలోను, ఉత్సవ విగ్రహాలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వామివారు కొలువైన గిరిజాంబ కొండ నుంచి వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్ వరకు కిలోమీటర్ల పొడవున మిరుమిట్లు గొలిపే విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కొండ కింద మెట్ల వద్ద భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ చరిత్ర.. 150 ఏళ్ల క్రితం వడ్డాది గ్రామానికి నారాయణభజీ అనే సాధువు భిక్షాటనకు వచ్చాడు. ఇక్కడ ప్రదేశాల్ని చూసి త్వరలోనే వడ్డాది పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన చెప్పి వెళ్లిన కొన్ని రోజులకే వడ్డాది పక్క గ్రామమైన విజయరామరాజుపేట కాళ్లవారి పాకల వద్ద రైతులు మంచినీరు కోసం నేలబావి తవ్వుతుండగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయట పడ్డాయి. అప్పటి గ్రామ పెద్ద దొండా భగవంతులయ్య గ్రామ పెద్దలతో కలిసి వడ్డాదికి తూర్పు దిక్కున ఉన్న ఎత్తయిన గిరిజాంబ కొండపై వీటిని ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. దేవుడికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం 58 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. అప్పటి నుంచి భగవంతులయ్య కుటుంబ సభ్యులు ఆలయ వంశపారంపర్య ధర్తకర్తలుగా కొనసాగుతున్నారు. ఐదు రోజులపాటు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ వేడుకల్లో భాగంగా ఈ నెల 10న వివిధ పూజలు, హామాలు, గజ, గరుడ వాహనాలపై తిరువీధి ఉత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 14న నాగవల్లి వసంతోత్సవం, చక్రస్నానం, 15న పుష్పాంజలి సేవ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డాది కొండ దిగువున, నాల్గు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో రోజూ రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు తిలకించేలా ఏర్పాటు చేశారు. ఆలయానికి ఇలా చేరుకోవాలి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతి అరగంటకు నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ల నుంచి బస్సు సదుపాయం కలదు. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు నుంచి వడ్డాదికి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. -
చెరువులో పడి యువకుడి మృతి?
పరవాడ: మండలంలోని భర్నికం గ్రామానికి చెందిన బలిరెడ్డి సూర్య లక్ష్మీనారాయణ(32) చెరువులో చేపల వేటకు దిగి నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో స్నేహితులతో కలిసి లక్ష్మీనారాయణ ఆదివారం మధ్యాహ్నం చేపల పట్టడానికి చెరువులో దిగాడు. చేపల వేట సాగిస్తూ నీటిలో మునిగిపోయి ఎంతకి రాకపోవడంతో తోటి స్నేహితులు పరవాడ పోలీసులకు, బంధువులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టినా రాత్రి వరకు మృతదేహం లభ్యం కాలేదు. సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీఐ మల్లికార్జునరావు చెప్పారు. గాలింపు చర్యల్లో పరవాడ ఎస్ఐ మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.