breaking news
Anakapalle District Latest News
-
కన్నీటి రోదన.. అంతులేని వేదన
మునగపాక: తుది లేని ఆవేదన.. కొనసాగిన ఆందోళన.. ఇదీ తిమ్మరాజుపేటలోని డావెన్సీ అంతర్జాతీయ పాఠశాల వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం. స్విమ్మింగ్ మీద ఇష్టంతో ట్రెయినింగ్ క్లాసుకు వెళ్లిన చిన్నారి ఈత కొలను వద్ద విగత జీవిగా పడి ఉన్న దారుణ ఘటన గురువారం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. యలమంచిలి ధర్మవరం ప్రాంతానికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు, శ్రీలత దంపతుల రెండో కొడుకై న మోక్షిత్ సందీప్ (8) ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వకపోవడం, బాలుడు ఇంటికి రాలేదని వెతకానికి వెళితే స్విమ్మింగ్ పూల్ వద్ద మృతదేహం లభ్యం కావడంతో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మృతదేహాన్ని కదలనీయకుండా రాత్రంతా నిరసన తెలిపారు. వారి ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. సీసీ ఫుటేజ్ను పరిశీలించేందుకు అవకాశం ఇస్తేనే తన కుమారుని మృతదేహాన్ని పంచనామాకు తీసుకువెళ్లాలని, అంతవరకు తాము సహకరించేది లేదని హెచ్చరించారు. దీంతో పరవాడ, అనకాపల్లి డీఎస్పీలు విష్ణుస్వరూప్, శ్రావణితోపాటు సీఐలు స్వామినాయుడు, ధనుంజయరావు తదితరులు సందీప్ కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించారు. యాజమాన్యాన్ని స్కూల్కు తీసుకువచ్చి సమాధానం చెప్పించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. దీంతో స్కూల్ డైరెక్టర్లు కర్రి సుందరయ్య, జెర్రిపోతుల రమణాజీలను పోలీసు వాహనంలో స్కూల్కు తీసుకువచ్చారు. విద్యార్థి మృతి చెందినా ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని వారిని పలువురు నిలదీశారు. వివాదం ముదిరే పరిస్థితులు కనిపించడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేతలు బొడ్డేడ ప్రసాద్, కరణం ధర్మశ్రీతోపాటు పలువురు పెద్దలు విద్యార్థి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. దీంతో ఎట్టకేలకు సందీప్ మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి పంచనామాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాలుని మృతదేహం పాడయ్యే పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు సహకరించాలని పోలీసులు కోరడంతో వారు సమ్మతించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్కూలు డైరెక్టర్లు సుందరయ్య, రమణాజీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు సందీప్ మృతదేహాన్ని వైఎస్సార్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్తో మాట్లాడుతూ.. విద్యార్థి సందీప్ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినా స్కూల్ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం సరికాదన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని వారు కోరారు.గుండెలు తరుక్కుపోయే విషాదం ఒకవైపు.. అసలేం జరిగిందో సీసీ టీవీ ఫుటేజ్ చూపాలన్న డిమాండ్ మరో వైపు మిన్నంటగా.. డావెన్సీ అంతర్జాతీయ స్కూల్ ప్రాంగణం ఓ విషాద దుర్ఘటనకు వేదికగా మారింది. శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకున్న విద్యార్థి సందీప్ తండ్రి శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమైన దృశ్యం అందరినీ కదిలించింది. స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో నిర్లక్ష్యమే కాక.. బాలుడు మృతి చెందిన విషయాన్ని కనీసం తెలపకపోవడం వెనుక యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని మృతుడి బంధువులు తీవ్రంగా నిలదీశారు. మృతుడి తండ్రి రాకతో మిన్నంటిన రోదనలు ఆర్మీ విధుల్లో చేరేందుకు జమ్ము వెళుతున్న తండ్రి శ్రీనివాసరావు మార్గమధ్యంలో వెనుదిరిగి శుక్రవారం ఉదయం డావెన్సీ స్కూల్కు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న తన కుమారుడు సందీప్ను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరోజు ముందు తనతో ఆడిపాడిన కొడుకు ఇలా స్విమ్మింగ్ పూల్ ఘటనలో మృతి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. కొడుకు సందీప్ మృతదేహాన్ని గుండెలపై హత్తుకొని రోదించిన దృశ్యం అందరినీ కలచివేసింది. డావెన్సీ స్కూల్ వద్ద రెండో రోజూ తగ్గని ఉద్రిక్తత సీసీ ఫుటేజ్ పరిశీలనకు అనుమతివ్వాలని డిమాండ్ తండ్రి రోదనతో కదిలిపోయిన పాఠశాల ప్రాంగణం పోలీసుల అదుపులో స్కూల్ యాజమాన్యం -
కార్తీక దీపోత్సవం
● నేత్రపర్వంగా చోడవరం గౌరీశ్వరాలయం ● 71 వేల దీపాలతో ఆధ్యాత్మిక వికాసం చోడవరం: శివనామస్మరణతో చోడవరం స్వయంభూ శ్రీ గౌరీశ్వరస్వామి ఆలయ ప్రాంగణం హోరెత్తిపోయింది. కార్తీక దీపాలు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా 71 వేల దీపాలు వెలిగించగా శివాలయ ప్రాంగణం భక్తుల శరణుఘోషతో మార్మోగింది. అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన చోడవరం శ్రీ స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి కన్నుల పండువగా దీపోత్సవం జరిగింది. శివ, అయ్యప్పస్వామి మాలధారణ భక్తులతోపాటు సాధారణ భక్తులు ఈ దీపోత్సవ కార్యక్రమంలో వందలాదిగా పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు, వేదపండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య మహాలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దీపోత్సవం ఎంతో ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చింది. లింగాకారం, త్రిశూలం, ఓంకారం, స్వస్తిక్, శ్రీ చక్రం ఆకారాలతో దీపాలను వెలిగించారు. ఎ మ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, ఆలయ కమిటీ చైర్మన్ గూనూరు సురేష్, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.గౌరీశ్వరస్వామి ఆలయం వద్ద దీపోత్సవ కోలాహలంశివలింగ ఆకారంలో దీపాలంకరణ -
అంతా డొల్లే..
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులతో మేనేజ్ప్రభుత్వంతో చర్చలకు 52 మందితో కమిటీ జాబితా అందజేసిన మత్స్యకారులు నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా రెండు నెలలుగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. 52 మందితో కమిటీ ఏర్పాటు చేసి ఈ జాబితాను శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు చేతుల మీదుగా నర్సీపట్నం ఆర్డీవోకు అందజేశారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. చర్చల కోసం వచ్చిన హోం మంత్రిని అడ్డుకోవడం, జాతీయ రహదారి ముట్టడి వంటి ఆందోళనలు చేశారు. వీరితో కలెక్టర్ చర్చలు జరిపారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేయగా.. ఈ వ్యవహారం తన పరిధిలో లేదని కలెక్టర్ చేతులెత్తేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గ్రామస్తులంతా కమిటీగా ఏర్పడి వస్తే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని, మీరే స్వయంగా సీఎంకు డిమాండ్లు చెప్పుకోవచ్చని సూచించారు. రెండు నెలలుగా చేస్తున్న పోరాటం ఒక కొలిక్కి రాకపోవడం, బల్క్ డ్రగ్ పార్క్ రద్దు వ్యవహారం సీఎం స్థాయిలో ఉండటంతో మత్స్యకారులంతా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. 52 మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ జాబితా ఆర్డీవోకు ఇవ్వడంతోపాటు వీరందరినీ సీఎం దగ్గరకు తీసుకెళ్లే బాధ్యత అధికారులే తీసుకోవాలని కోరారు. మత్స్యకారుల ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉంటున్న వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా జాబితా ఆర్డీవోకు అందజేశారు. ఆర్డీవో వి.వి.రమణ మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలకు మత్స్యకారులు అంగీకరించారని, సీఎం వద్దకు వచ్చేవారితో కూడిన జాబితా తమకు అందజేశారన్నారు. ఈ జాబితాను హోం మంత్రి ద్వారా సీఎంకు పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తేదీని మత్స్యకారులకు తెలియజేస్తామన్నారు.ప్లీనరీ సెషన్లలో యూనివర్సిటీల విద్యార్థులుసాక్షి, విశాఖపట్నం: ప్రచారం ప్రపంచాన్ని దాటేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. పారిశ్రామికవేత్తలు ఉండాల్సిన స్థానాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి సెషన్లను ‘మేనేజ్’ చేసేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే సెషన్లలో వక్తలుగా.. టీడీపీ నేతలే ఒప్పందాలు చేసుకున్న డెలిగేట్స్గా వ్యవహరించారు. ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్లుగా పాత ఒప్పందాలనే కొత్తగా చూపిస్తూ.. క్రెడిట్ చోరీలో సాటిలేని చంద్రబాబు సమర్పించిన భాగస్వామ్య సదస్సు సినిమా తొలిరోజు అట్టర్ఫ్లాప్ అయింది. ముఖ్యంగా, ప్రారంభోత్సవ ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కుర్చీలు లేక వీఐపీల అవస్థలు ఉదయం 8.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించినా, 9.30 గంటల వరకు సభా ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద గీతం, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులను ప్లీనరీ హాళ్లకు, ప్రధాన సభా ప్రాంగణానికి తరలించారు. పారిశ్రామికవేత్తల స్థానాల్లో విద్యార్థులే కనిపించడంతో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య అతిథులు సైతం ఆశ్చర్యపోయారు. కేవలం ప్రచార పటాటోపం తప్ప.. భాగస్వామ్య సదస్సు అంతా సినిమా షో అని కీలక వ్యక్తులకూ అర్థమైపోయింది. ఇంతలో సభ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు చేదు అనుభవం ఎదురైంది. వారంతా అక్కడికి చేరుకునే సరికి కుర్చీలు దొరకలేదు. ఎక్కడ కూర్చోవాలో తెలీక కాసేపు నిలబడాల్సి వచ్చింది. ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పిన మాటలకు.. అక్కడ పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. నేటితో ముగియనున్న సదస్సు భాగస్వామ్య సదస్సు శనివారం రాత్రితో ముగియనుంది. రెండో రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు వివిధ ప్లీనరీ హాల్స్లో పలు సెషన్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నంబరు–7లో పరిశ్రమల శాఖ 27, పర్యాటక శాఖ 21, ఐటీ శాఖ 7, చేనేత–జౌళీ శాఖ 2 ఎంవోయూలను కుదుర్చుకోనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకలు ప్రధాన వేదికై న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్–5లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.యల్ల, సీఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు హాజరుకానున్నారు. చంద్రబాబు మాట్లాడే సమయానికి ఖాళీగా దర్శనమిచ్చిన ప్రధాన సభా ప్రాంగణంవేదికని కుదించేశారు చాలా సేపు ఓపికగా కూర్చున్న విద్యార్థులు సైతం సహనం కోల్పోయి, ప్లీనరీ సమయానికి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం మొదలయ్యే సమయానికి ప్రధాన వేదిక ప్రాంగణం దాదాపు ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ పరిణామంతో మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చేసేదేమీ లేక, అధికారులు సభా ప్రాంగణాన్ని కుదించేశారు. అక్కడక్కడా కూర్చున్న వారిని ముందుకు పంపించి, ఖాళీలను కప్పిపుచ్చారు. వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఐటీ, టూరిజం, పరిశ్రమలు, ఆసుపత్రుల రంగాల ఉద్యోగులతో ప్రాంగణాన్ని నింపేందుకు యత్నించారు. అయినా వందల కుర్చీలు ఖాళీగా కనిపించడంతో, చివరికి ప్రధాన ప్రాంగణానికి పార్టిషన్ వేసి వేదికను కుదించేశారు. మంత్రుల అనుచరులే సెషన్ల వక్తలు.! ఇక ప్లీనరీ సెషన్ల విషయంలోనూ ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప, అవి క్షేత్రస్థాయిలో విజయవంతం కాలేదు. వివిధ సెషన్లలో నిపుణులకు బదులుగా, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన పారిశ్రామిక నేపథ్యం ఉన్న అనుచరులే వక్తలుగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ సెషన్లలోనూ ప్రతినిధులెవరూ పాల్గొనకపోవడంతో, ఏయూ విద్యార్థులను హడావిడిగా తీసుకొచ్చి హాళ్లను నింపేశారు. మొత్తంగా తొలి రోజు సదస్సు ప్రచారంలో ఉన్నంత ఏమీ లేదనీ.. అంతా డొల్లేనని తేలిపోయింది. -
గంగమ్మతల్లీ...నీవే దిక్కు...!
బల్క్డ్రగ్ పార్క్ను అడ్డుకోవాలంటూ మత్స్యకారుల మొర నక్కపల్లి: ఏపీఐఐసీ రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్పార్క్ రద్దు చేయాలంటూ మత్స్యకారులు చేస్తున్న నిరాహరదీక్ష 61వ రోజుకు చేరుకుంది. ఓట్లేసి గెలిపించిన మంత్రి అనిత తమ కోరిక మన్నిస్తారని ఎదురు చూశారు. కలెక్టర్పై ఆశలు పెట్టుకున్నారు. నా చేతుల్లో ఏమీ లేదని ఆమె చేతులెత్తేసారు. ఇక మమ్మల్ని ఆదుకునే దిక్కెవరు అంటూ గంగపుత్రులంతా గురువారం తమ ఆరాధ్య దైవం నూకతాత, తాము నమ్ముకున్న గంగమ్మ తల్లికి మొర పెట్టుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా తీరం వద్దకు వెళ్లి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ మెడలు వంచి బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటు కాకుండా అడ్డుకోవాలంటూ నూకతాత ఆలయం వద్ద, తీరంలోను ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
స్నేహం ముసుగులో మోసం
తగరపువలస: స్నేహం పేరుతో మోసగించి, బలవంతంగా కిడ్నీని విక్రయించిన కారణంగా మరణించిన సాడి యమున(29) భౌతిక కాయానికి శుక్రవారం ఆమె స్వగ్రామం వెల్లంకిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలేనికి చెందిన యమునను.. నగరానికి చెందిన సూరిబాబు, పద్మ, సత్య పిక్నిక్ పేరుతో వంచించి, అన్నమయ్య జిల్లా మదనపల్లెకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె కిడ్నీని విక్రయించడంతో తీవ్ర అనారోగ్యం పాలై మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన మూడు రోజుల అనంతరం గురువారం తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు -
టెన్త్ పరీక్ష కేంద్రాల్లో వసతులపై ఆరా
నాతవరం: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎ.శ్రీధర్రెడ్డి తెలిపారు. ఆయన మండల కేంద్రం నాతవరంలోని హైస్కూల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే గదులను గురువారం పరిశీలించారు. గదుల్లో ఫ్యాన్లు, తాగునీరు, డెస్క్లు, తదితర సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో వసతులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా పాఠశాలలను పరిశీలించామని, పలు చోట్ల సదుపాయాల కల్పనపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. నాతవరం మండలంలోని పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ సిహెచ్.సత్యనారాయణ, ఎంఈవోలు ఎస్.బ్రహ్మాజీ, కామిరెడ్డి వరహాలబాబు, నాతవరం హైస్కూల్ హెచ్ఎం కూండ్రపు సత్యనారాయణ పాల్గొన్నారు. -
నేటి నుంచి భాగస్వామ్య సదస్సు
సాక్షి, విశాఖపట్నం : భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 30వ భాగస్వామ్య సదస్సు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో శుక్ర, శనివారాల్లో సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సును శుక్రవారం ఉదయం 8.30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్లను ఏర్పాటు చేశారు. ఆయా హాళ్లలో వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి. తొలిరోజు సదస్సులో గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు కీలకోపాన్యాసం చేయనున్నారు. సదస్సుకు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం 10.30 నుంచి 11.45 వరకు జరిగే ఓపెనింగ్ ప్లీనరీ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రి గోయల్, చంద్రబాబు పాల్గొంటారు. దీంతో పాటు రాత్రి 8 గంటల వరకూ వివిధ కాన్పరెన్స్ హాల్స్లో ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. ఈ సదస్సుకు ఇప్పటికే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన దాదాపు రూ.50 కోట్ల ప్రజాధనంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పేవిధంగా.. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబయి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగులు, డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. నగరమంతా సీఐఐ సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటయ్యాయి. తొలిరోజు ఒప్పందాలు తొలి రోజున వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే గురువారం రాత్రి వరకూ పరిశ్రమల శాఖ 9 ఎంవోయూలు, ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4, ఇంధన శాఖ 6, సీఆర్డీఏ 8 ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు సదస్సులో భాగంగా సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలో ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6, ఇంధన శాఖ 21 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. -
జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత లోపం.!
మిగిలిన గ్రామాల్లో తీసికట్టుగా పనులుతేడా వస్తే బిల్లులు చెల్లించం గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనులు దశలవారీగా చేపట్టాం. ఇప్పటివరకు 50 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. బిల్లులు ఆలస్యం కావడం వల్ల పనులు నెమ్మదించాయి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. తేడాలు వస్తే బిల్లులు చెల్లించబోం. హోంమంత్రి ప్రారంభోత్సవం నిలిపివేసిన ట్యాంకుకు మూడు రోజుల్లో సరి చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. –ఆనంద్, డీఈ, ఆర్డబ్ల్యూఎస్, పాయకరావుపేట కాంట్రాక్టరు నిర్లక్ష్యం జల్ జీవన్ మిషన్లో భాగంగా రెండో విడతగా 2023లో తిమ్మాపురానికి రూ. 88 లక్షలు, గోకులపాడుకు రూ. 68 లక్షలు, కోనవానిపాలెం గ్రామానికి రూ. 28 లక్షలు చొప్పున విడుదలయ్యాయి. ఈ నిధులతో పనులు ప్రారంభించినప్పటి నుంచి కాంట్రాక్టరు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ట్యాంకు నిర్మించిన తర్వాత కనీసం తడపడం లేదు. దీన్ని ప్రారంభించిన వెంటనే లీకులు వచ్చే పరిస్థితి ఉంది. పైపులైనులో సక్రమంగా నీటి సరఫరా అవ్వడంలేదు. అధికారులు పర్యవేక్షించి సరి చేయాలి. –కర్రి సత్యనారాయణ, సర్పంచ్, తిమ్మాపురం ఎస్.రాయవరం: ఇంటింటా కుళాయి ఏర్పాటు చేసి తాగునీరందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడంతోపాటు పాయకరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా జల్జీవన్ మిషన్ పనులపై జవాబుదారీతనం లేకపోవడంతో నాణ్యత డొల్లగా మారింది. తాజాగా పెట్టుగోళ్లపల్లిలో వాటరు ట్యాంకు లీకులను చూసి ప్రారంభించకుండా వెళ్లిపోయిన హోంమంత్రి ఘటనే సాక్షీభూతంగా నిలిచింది. ఈ వ్యవహారంతో కంగుతిన్న అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మిగిలిన ట్యాంకుల పనులను చక్కదిద్దే పనిలో పడ్డారు. జల్ జీవన్ మిషన్ పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా, ఇంతవరకూ నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 60 శాతం గ్రామాల్లో పనులు ప్రారంభించారు. మిగిలిన గ్రామాల్లో కదలిక లేదు. రూ.200 కోట్లతో ప్రారంభమైన పనులు నత్తనడకన నడవడమే కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కాంట్రాక్టరు అందుబాటులో ఉండటం లేదు. సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదు. ఈ పనులపై ప్రశ్నిస్తున్న ఆయా గ్రామాల సర్పంచ్లకు సమాధానం ఉండటం లేదు. లీకులు కారణంగా ప్రారంభానికి నోచుకోనిసర్వసిద్ధి వాటర్ ట్యాంకుపెట్టుగోళ్లపల్లిలో లీకు కారణంగా హోంమంత్రి ప్రారంభోత్సవం నిలిపివేసిన ట్యాంకుతడపకపోవడం వల్ల ట్యాంకులకు ముప్పు వాటర్ ట్యాంకు నిర్మాణంలో దశలవారీగా తడుపుతూ రావాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం నెల రోజుల పాటు తడపాలి. ఎప్పటికప్పుడు తడపకుండా వదిలేస్తే కొన్నాళ్లకే ట్యాంకు బీటలు వారడం, లీకులు ఏర్పడటం, పూర్తిగా పటుత్వం కోల్పోయి కూలిపోతుంది. అయితే గ్రామాల్లో ఇంతవరకు నిర్మించిన ట్యాంకులను పూర్తిస్థాయిలో తడిపిన దాఖలాలు లేవని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. పైపులైన్ల కోసం రోడ్లు తవ్వేసి.. గ్రామ వీధుల్లో సీసీ రోడ్లు పగులగొట్టి వేసిన పైపులైన్లు వేసి అసంపూర్తిగా వదిలేశారు. ఆ రోడ్లను తవ్వేసి మళ్లీ కప్పకపోవడంతో రాకపోకల సమయంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వేసిన పైపులైన్ల నుంచి చుక్క తాగునీరు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో రెండేళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ నిధులతో 60 రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో 26 ట్యాంకులు నిర్మాణం పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అందులో తొలుత పెట్టుగోళ్లపల్లిలో కోటి 9 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన ట్యాంకును హోంమంత్రి అనిత బుధవారం ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. లీకులతో ట్యాంకు నుంచి నీరు కారడంతో ప్రారంభోత్సవం నిలిపివేశారు. పనుల్లో నాణ్యత లేదని చెప్పి ఆమె వెళ్లిపోయారు. అదేక్రమంలో సర్వసిద్ధిలో నిర్మించిన ట్యాంకు లీకులు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేసుకున్నారు. తిమ్మాపురం, కొరుప్రోలు గ్రామాల్లో వాటర్ ట్యాంకుల పనులు చేసి తడపడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన జలజీవన్ మిషన్ పనులు నాసిరకంగా ఉన్నాయని ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పనులు సక్రమంగా చేపట్టాలని కోరుతున్నారు. -
మంచినీటి ట్యాంకు నాణ్యతా లోపంపై విచారణ
ఎస్.రాయవరం: పెట్టుగోళ్లపల్లి గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకం కింద నిర్మించిన వాటర్ ట్యాంకు నాణ్యతా లోపంపై ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ ఇషాన్బాషా సమక్షంలో ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు, క్యాలిటీ కంట్రోల్ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. నాణ్యత లోపంపై గ్రామస్తులు ప్రశ్నించడంతో హోంమంత్రి అనిత బుధవారం ఈ ట్యాంకును ప్రారంభించకుండా వెళ్లిపోయారు. ఈ మేరకు అధికారులు విచారణ కోసం గ్రామానికి వచ్చి ట్యాంకు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ రికార్డులు, ఖర్చు చేసిన నిధులు వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకు లీకులను మూడు రోజుల వ్యవధిలో సరి చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామన్నారు. డీఈ, ఏఈ సస్పెన్షన్! ట్యాంకు నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల లీకులు ఏర్పడటంతో ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఏఈ మనోజ్ కళ్యాణ్లను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత లోపం.! -
కూలిన స్లూయిజ్
నిలిచిన తాండవ సాగునీరు నాతవరం: తాండవ రిజర్వాయరు ఆయకట్టు భూములకు నీరు ప్రవహించేందుకు మండలంలోని గునుపూడి సమీపంలో ఏలేరు కాలువపై నిర్మించిన స్లూయిజ్ కూలిపోయింది. దీంతో శివారు ఆయకట్టుకు నీటి ప్రవాహం ఆగిపోవడంతో ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి విశాఖ స్టీల్ప్లాంటుకు నీరు సరఫరా చేసేందుకు గునుపూడి వద్ద ఏలేరు కాలువ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అడ్డుగా ఉన్న తాండవ కాలువను తొలగించి స్లూయిజ్ నిర్మించారు. అప్పట్నుంచి దిగువ ప్రాంతంలో ఏలేరు కాలువ నీరు, ఎగువ ప్రాంతంలో నిర్మించిన స్లూయిజ్ కాలువలో తాండవ నీరు ప్రవహిస్తోంది. ఇది నిర్మించి 40 ఏళ్లు పైబడటంతో ఏలేరు కాలువపై స్లూయిజ్ రెండు రోజుల క్రితం కూలిపోయింది. పస్తుతం పొట్టదశలో వరి చేను ఉండటం, అటు నీరు ప్రవాహం ఆగిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇక్కడ స్లూయిజ్ కూలిపోయిన విషయాన్ని గునుపూడి తాండవ నీటి సంఘం అధ్యక్షుడు సబ్బవరపు దేముడు తాండవ, ఏలేరు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పని ఏలేరు, విశాఖపట్నం విస్కో అధికారులు సంయుక్తంగా చేయాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన స్లూయిజ్ కాలువ మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై తాండవ ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ను సంప్రదించగా ఏలేరు అధికారులు పరిశీలించారని, త్వరగా బాగు చేసి రైతులకు సాగునీరు ఇస్తామన్నారు. -
పైసలిస్తేనే ఫైలు కదిలేది..!
దేవరాపల్లి: స్థానిక తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు కొందరు ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి పేద ప్రజల నుంచి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫైల్స్ ముందుకు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందేనంటూ బరి తెగిస్తున్నారని పలువురు బాధితులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్ కోసం వచ్చే సామాన్య ప్రజలకు కుంటి సాకులు చూపి నెలల తరబడి తిప్పించుకుంటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తండ్రి పేరిట ఉన్న భూమిని కుమారుడి పేరిట మార్చేందుకు ఎం.అలమండ వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీసీ అధికారులకు దొరికిన వైనం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. గతంలో దేవరాపల్లి మండల సర్వేయర్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయినప్పటికీ ఇక్కడ అవినీతి, అక్రమాలు ‘మామూలే’ అన్నట్టు పరిస్థితి తయారైంది. వారు అడిగినంత ముట్టచెప్పకపోతే ఫైల్స్ను సైతం మాయం చేసి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ రైతులకు నరకం చూపిస్తున్నారు. భూముల ఆన్లైన్, భూమి పట్టాదారు పాసుపుస్తకం, సబ్ డివిజన్, సర్వే తదితర భూ సమస్యలపై రెవెన్యూ అధికారులను ఆశ్రయించాలంటే పేద ప్రజలు భయపడుతున్న దారుణ పరిస్థితి నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు తీసుకువచ్చే ఫైల్స్కు భారీ మొత్తంలో పైసలు దండుకొని యుద్ధప్రాతిపదికన క్లియర్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ జోక్యం.. ప్రైవేటు పెత్తనం టీడీపీ నాయకుల అండతో కొందరు వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాయకుల సేవలో తరిస్తూ ఏకపక్షంగా ఉంటూ సామాన్య ప్రజల సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. సామాన్య ప్రజలు అడిగితే కనీసం సమాధానం ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుల సిఫార్సులతో ఏళ్ల తరబడి కొందరు ఒకే గ్రామంలో, మరికొందరు ఇదే మండలంలో తిష్ట వేసి ప్రజలను పట్టి పీడిస్తున్నారు. పై స్థాయి అధికారులు చోద్యం చూడటంతో మరింత రెచ్చిపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుస్థితి ఉండేది కాదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విషయం తన దృష్టికి రావడంతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు తీవ్ర స్థాయిలో స్పందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ప్రైవేటు వ్యక్తులను బయటకు పంపించి, అధికారులకు సైతం ముత్యాలనాయుడు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు అధికార తెలుగుదేశం నాయకులే అవినీతిని ప్రోత్సహించడంతో పరిస్థితి దిగజారిందని చెబుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం మితిమీరింది. పలువురు వ్యక్తులు దర్జాగా అధికారుల సీట్లలో కూర్చొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొందరు వీఆర్వోలు ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారానే అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంతోపాటు వీఆర్వోల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. -
మురిపించిన బుజ్జాయిలు
భరతమాత వేషధారణలో.. నర్సింహావతావరంలో.. గోవర్ధన గిరిధారి.. నర్సీపట్నం: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఆర్టీయూ నిర్వహించిన బాలల ప్రతిభా పాటవ పోటీలు ఆకట్టుకున్నాయి. గురువారం విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. భరతమాత, గౌతమ బుద్ధుడు, పరమశివుడు, శ్రీకృష్ణుడు, నర్సింహావతారం వంటి వివిధ వేషాల్లో బాలలు అలరించారు. ఈ పోటీల్లో విజేతలకు శుక్రవారం జరిగే బాలల దినోత్సవ కా ర్యక్రమంలో బహుమతులు అందజేస్తామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ తెలిపారు. -
డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు
తుమ్మపాల: ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖాధికారి జి.మనోహర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం చొప్పున మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీపీఆర్ నకలతో పాటు ఇతర అటాచ్మెంట్లను స్థానిక జిల్లా రవాణా శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. నిర్వాహకులు ఎన్జీవో, ట్రస్ట్, కో–ఆపరేటివ్ సొసైటీ, ఫర్మ్ అయి ఉండాలన్నారు. గత మూడు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్స్, టర్నోవర్ సర్టిఫికెట్స్ అందించాలని పేర్కొన్నారు. రెండెకరాల స్థలం, సిమ్యూలేటర్, ట్రైనింగ్ వాహనాలు, వర్క్షాప్, క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్ సదుపాయాలు ఉండాలని ఆయన సూచించారు. -
దేవాలయాలే టార్గెట్
సాక్షి, అనకాపల్లి: గ్రామ శివారు దేవాలయాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లావ్యాప్తంగా 26 ఆలయాల్లో హుండీలను దోచుకొని, బంగారం, వెండి ఆభరణాలను అపహరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వ్యసనాలకు, జల్సాలకు బానిసై డబ్బుల కోసం నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే దేవాలయాలను ఎంచుకొని, అర్ధరాత్రి వేళల్లో హుండీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలకాలంలో చోడవరం, బుచ్చెయ్యపేట, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. వీరు మొత్తం 26 గుడుల్లో దొంగతనాలు చేసి 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, రూ.44,218ల నగదు దోచుకున్నారు. దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒకరు మేజర్ కాగా.. మిగిలిన ముగ్గురూ మైనర్లు. నేరస్థలంలో దొరికిన ఆధారాల సాయంతో ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను పట్టుకున్నామన్నారు. చోరీ చేసిన డబ్బుల్లో కొంత వారి అవసరాలకు ఖర్చు చేసి.. మిగతా డబ్బు, బంగారం, వెండిని విజయరామరాజుపేట ఏరియాలో దాచి ఉంచారు. గురువారం మైనర్ నిందితులు ముగ్గురు వడ్డాది నుంచి చోడవరం వైపు వస్తుండగా చోడవరం పోలీసులు చోడవరం గ్రామ శివారులో గౌరిపట్నం వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. చోడవరం పీఎస్ పరిధిలో 2, బుచ్చెయ్యపేట పీఎస్లో 11, వి.మాడుగుల పీఎస్లో 9, చీడికాడ పీఎస్లో 2, దేవరాపల్లి పీఎస్లో 2 చోట్ల దొంగతనాలు జరిగాయి. ప్రధాన నిందితుడు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన రాసూరి పోతురాజు (20), మిగిలిన ముగ్గురు బాల నేరస్తులు. వీరు కూడా బుచ్చెయ్యపేటకు చెందినవారే. కేసులను ఛేదించిన అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎల్.మోహనరావు, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం సీఐ పి.అప్పలరాజు, పి.అప్పలరాజు, ఎస్సై బి.నాగకార్తీక్, ఎస్సై బి.జోగారావులను ఎస్పీ అభినందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా ఆలయ కమిటీలను కోరారు. అర్ధరాత్రి సమయాల్లో దేవాలయాల్లో ఉన్న హుండీలో డబ్బులు, అమ్మవారి బంగారం, వెండి ఆభరణాలు దొంగతనానికి గురవుతున్నాయని, ఆలయానికి వెలుపుల, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలకు పాల్పడేవారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు, ఎక్కువ రోజులు క్యాంప్లకు వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన డబ్బు, బంగారం ఉంచుకోరాదని, బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా స్థానిక పోలీసులతో కలిసి ఎల్.హెచ్.ఎం.ఎస్ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
మునగపాక: అభం శుభం తెలియని చిన్నారి స్విమ్మింగ్ పూల్లో మృతి చెందడంతో తిమ్మరాజుపేటలోని డావెన్సీ అంతర్జాతీయ స్కూల్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లో ఒకటో తరగతి చదువుకుంటున్న తమ బిడ్డ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పూడిమడక రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. చిన్నారులందరూ బాలల దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. వివరాలు.. యలమంచిలి ధర్మవరం ప్రాంతానికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు జమ్మూలో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాసరావు, శ్రీలత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రశాంత్ మునగపాక మండలం తిమ్మరాజుపేట డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు మోక్షిత్ సందీప్ (8) అదే స్కూల్లో ఒకటో తరగతి చదువుకుంటున్నాడు. ఎప్పటిలాగా వీరిద్దరూ యలమంచిలి ధర్మవరం నుంచి బస్సులో బయలుదేరి స్కూల్కు వచ్చారు. మధ్యాహ్నం సందీప్ స్కూల్లోని స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. తరగతులు అయ్యాక స్కూలు బస్సు ఎక్కిన ప్రశాంత్ కొంత దూరం వెళ్లాక తమ్ముడు సందీప్ రాలేదని గుర్తించాడు. కంగారు పడి వెంటనే ఆ విషయం చెప్పినా బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. ధర్మవరానికి బస్సును తీసుకువచ్చేశాడు. ఇంటికి వెళ్లిన ప్రశాంత్ తన తల్లితో తమ్ముడు సందీప్ బస్సులో రాలేదని చెప్పడంతో కంగారుపడ్డ శ్రీలత స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో తన బంధువులతో కలిసి స్కూల్కు వచ్చి సందీప్ కోసం వెతకడం ప్రారంభించారు. స్కూల్ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. అప్పటికే సందీప్ మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న -
సినీ రంగానికి ఎదిగిన మునగపాక ఖ్యాతి
మునగపాక: మునగపాక పేరు చెప్పగానే గుర్తు వచ్చేది కళారంగం. ఇక్కడ పలువురు కళలపై ఆసక్తి పెంచుకుంటూ అవసరమైన చోట తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. నాటకరంగ అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలు అందిస్తున్న సహకార స్ఫూర్తి ఎంతోమంది కళాకారులకు ఊపిరి పోస్తోంది. ఇప్పుడు ఆ ప్రతిభే సినీ రంగానికి సైతం విస్తరించింది. మునగపాకకు చెందిన వేద పండితులు వెలవలపల్లి కోటేశ్వరశర్మ నిర్మాతగా ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ కోరుకొండ గోపీకృష్ణ దర్శకునిగా తీర్చిదిద్దిన ‘మా ఊరి వెంకన్న’ సినిమా శుక్రవారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. యజ్ఞశ్రీ ప్రొడక్షన్ పేరిట నిర్మించిన ఈ సినిమాలో కొత్త తారాగణం కనిపించనున్నారు. మునగపాకలో నూతనంగా నిర్మిస్తున్న కలియుగ దైవం శ్రీ వెంకన్న ఆలయ పరిస్థితులకు అనుగుణంగా చిత్రాన్ని తయారు చేసినట్లు దర్శకుడు గోపీకృష్ణ తెలిపారు. ఇప్పటికే తాను వాడే–వీడు, కలియుగ భగవాన్ వంటి రెండు చిత్రాలు అందించానని, మూడవ చిత్రంగా ‘మా ఊరి వెంకన్న’ రూపొందించానన్నారు. హాస్యం, భక్తి ప్రధాన అంశాలతో సినిమా తెరకెక్కుతోందని, నిర్మాత కోటేశ్వర శర్మ, పరుచూరి ప్రణవి, మారుతీరాం, పావులూరి శివరామకృష్ణ కీలక ప్రాతలు పోషించారన్నారు. -
ఇక చోడవరంలోనే అమర్నాథ్ మకాం
చోడవరం: వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇకనుంచి చోడవరంలోనే పూర్తిగా మకాం వేయనున్నారు. ఈ మేరకు ఇక్కడ తన సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఆయన సతీసమేతంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. చోడవరం సమన్వయకర్తగా ఇటీవల అమర్నాథ్ను పార్టీ నియమించిన విషయం తెలిసిందే. ఇక తన భవిష్యత్ రాజకీయమంతా చోడవరం నియోజకవర్గంలోనే అని ఇటీవల అమర్నాథ్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు ఇక్కడ సొంత ఇల్లును, పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం చోడవరం పట్టణ ప్రవేశంలోనే ఇటీవల స్థలాన్ని కొనుగోలు చేసి తాజాగా పనులకు శ్రీకారం చుట్టారు. వేగంగా పనులు పూర్తి చేసి రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సొంతిల్లు, పార్టీ కార్యాలయనిర్మాణానికి భూమిపూజ -
జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో జిల్లా విద్యార్థినుల ఘనత
తుమ్మపాల: ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్ధిలో ప్రతిభ ఉంటుందని, ఉపాధ్యాయులు వారి ఆసక్తిని గుర్తించి వినూత్నంగా, ఉన్నతంగా ఆలోచించేలా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో అత్యుత్తమ ప్రదర్శనలతో జిల్లాకు పేరు తీసుకువచ్చిన విద్యార్థినులు కె.లిఖిత, సి.హెచ్. రేణుకాదేవిలను కలెక్టరేట్లో గురువారం ఆమెతో పాటు ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. రాష్ట్రం నుండి ఎంపికై న 52 మంది బృందంలో జిల్లాలో వి.మాడుగుల మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కె.లిఖిత, నక్కపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సిహెచ్.రేణుకాదేవిలు అద్భుత ప్రతిభ సాధించారన్నారు. రష్యన్ స్పేస్ కొలబ్రాషన్పై జాతీయ స్థాయి వక్తృత్వం, వ్యాస రచన పోటీల్లో తృతీయ స్థానం సంపాదించి, జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన లిఖితను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కర్నూలులో జీఎస్టీ–2.2 పై జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నక్కపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని చైత్రని కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ప్రధానోపాధ్యాయులు వి. శ్రీలక్ష్మి, ప్రభాకర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బ్యాక్లాగ్లు
బ్యాక్డోర్లోవిశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. విద్యార్థులకు పురుగుల భోజనాలు, యూనివర్సిటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు, డిస్పెన్సరీలో ఆక్సిజన్ పెట్టే వారు లేక విద్యార్థి మరణం వంటి ఘటనలు శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఏయూ ప్రతిష్టను దిగజార్చాయి. తాజాగా, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాల ఆరోపణలు ఏయూలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా 28 పోస్టులను భర్తీ చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియలో భారీగా సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కూటమి ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖల మేరకే ఏయూ అధికారులు రహస్యంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారని వామపక్ష, విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నలు సంధిస్తున్నాయి. పోస్టుల భర్తీపై వివాదాలు ఏయూలో 33 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 2018లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. 2021లో సెక్యూరిటీ, హాస్టల్ సహాయకులు, మెస్ వర్కర్లు, తోటపని వంటి ఉద్యోగాలకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. కనీస విద్యార్హత ఏడో తరగతి, పదో తరగతిగా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయని ప్రకటించారు. ఆ సమయంలో సుమారు 1000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో డిగ్రీ, పీజీలు చేసిన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ నోటిఫికేషన్ ప్రకారం ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు కావడంతో ఆ ప్రతిపాదికన మెరిట్ జాబితాను సిద్ధం చేసి ఆన్లైన్లో పొందుపర్చారు. అయితే ఎంపికై న అభ్యర్థుల విద్యార్హతలు, మార్కుల జాబితాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఏడో తరగతి చదవినట్లు, ఎక్కువ మార్కులతో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నకిలీ మార్కుల జాబితాలను సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా అప్పటి నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఆన్లైన్లో ఎంపిక జాబితా ఎక్కడ? ఏయూలో 33 బ్యాక్లాగ్ పోస్టులు ఉండగా.. అందులో 28 పోస్టులను ఏయూ అధికారులు రహస్యంగా భర్తీ చేశారు. ఈ నియామక ప్రక్రియ విషయం ఏయూలో చాలా మంది అధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పైగా నోటిఫికేషన్ నుంచి మెరిట్ జాబితా వరకు ఇప్పటివరకు అధికారులు ఆన్లైన్లో పొందుపర్చలేదు. రహస్యంగా పోస్టులను ఎలా భర్తీ చేస్తారని గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏయూ అధికారులను ప్రశ్నించినప్పటికీ.. ఎవరూ సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. చక్రం తిప్పిన కూటమిప్రజాప్రతినిధి? ఏయూలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధి చక్రం తిప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలకు ఏయూ పాలకులు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏయూను పూర్తిగా రాజకీయ కేంద్రంగా మార్చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అధికారులు ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అలాగే అభ్యర్థుల మెరిట్ జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
దేవరాపల్లి: టీడీపీ పాత, వలస నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి బాహాబాహి అంటూ ముష్టి యుద్ధానికి సైతం దిగారు. ఇందుకు దేవరాపల్లిలోని రైవాడ అతిథి గృహం వేదికై ంది. ఈ అతిథి గృహంలో గురువారం జరిగిన టీడీపీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఏసుదాసు సాక్షిగా పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి తలబడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలో అన్యాయానికి గురైన పలువురు సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో వేదిక వద్దకు దూసుకురావడంతో రసాభాసగా మారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పార్టీ పదవుల్లో తమకు జరిగిన అన్యాయంపై సీనియర్ నాయకులు నేరుగా ఎమ్మెల్యే బండారుపై తిరగబడ్డారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని పక్కన పెట్టి, ఇటీవల వలస వచ్చిన నాయకులకు పదవులు ఎలా కట్టబెడతారంటూ మారేపల్లికి చెందిన నాయకుడు కిల్లి గోవింద సహా సుమారు వంద మందికిపైగా నాయకులు, కార్యకర్తలు వేదికపై ఉన్న బండారును నిలదీశారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పరుష పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. తనను ప్రశ్నిస్తే ఏ స్థాయి నాయకుడినైనా సస్పెండ్ చేస్తానంటూ హుంకరించారు. మీరు తమ పార్టీకి చెందిన వారు కాదని, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని రెచ్చకొట్టే ధోరణిలో మాట్లాడడంతో వివాదం మరింత రాజుకుంది. అదే స్థాయిలో అసంతృప్తి వాదులంతా ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే.. పోలీసులను పిలిచి వారిని ఇక్కడి నుంచి బయటకు పంపించేయండి అంటూ అవమానకరంగా వ్యవహరించడంతో అక్కడే ఉన్న పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదని పార్టీ శ్రేణులు బాహటంగా అసంతృప్తిని వెళ్లగెక్కాయి. పార్టీని నమ్మకున్న వారిని నట్టేట ముంచి కొత్తగా చేరిన వలస పక్షులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని చింతలపూడి, తామరబ్బ పంచాయతీలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శించారు. పరస్పర విమర్శలతో అరుపులు, కేకలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పరిస్థితి అదుపు తప్పడంతో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఏసుదాసు జోక్యం చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అసంతృప్తి వాదులు శాంతించలేదు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. -
మనస్తాపంతో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆత్మహత్య
నర్సీపట్నం: సీపీఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు(53) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఆయన స్వస్థలం గొలుగొండ మండలం చోద్యం గ్రామం. ప్రస్తుతం నర్సీపట్నం బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కుమారుడు మూడు నెలల క్రితం మరణించాడు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో బాధపడుతున్న రామునాయుడు బుధవారం గడ్డి మందు తాగారు. గమనించిన కుమార్తె లోచత వెంటనే చుట్టు పక్కల వారి సాయంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. రామునాయుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామునాయుడు సీపీఐ గొలుగొండ మండల సెక్రెటరీగా రెండు పర్యాయాలు, ఉమ్మడి జిల్లా ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం సీపీఐ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. భార్య సత్యవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రామునాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. -
గ్రేటర్పై ‘సమ్మిట్’ పోటు
విశాఖ సిటీ: గ్రేటర్పై సమ్మిట్ పోటు పడింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో జీవీఎంసీపై చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్ల భారం మోపింది. ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నట్లు డప్పులు కొట్టుకుంటున్న సర్కార్.. నిర్వహణకు మాత్రం పైసా కూడా విదల్చకుండా చేతులు దులుపుకుంది. దీంతో అరకొర పనులతోనే హడావుడిగా ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు ఇలా మొత్తంగా 3 వేల మంది హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎప్పటిలాగే గత వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన ఒప్పందాలను కూడా తమ ఖాతాలో వేసుకొని రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఊదరగొడుతోంది. ఈ సదస్సుకు విశాఖను సుందరంగా ముస్తాబు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసేసింది. సదస్సు నిర్వహణకు గాని, విశాఖ సుందరీకరణకు గానీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. జీవీఎంసీపై రూ.42 కోట్ల భారం ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు విశాఖ సుందరీకరణపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీవీఎంసీ ఖజానా నుంచే నిధులు వెచ్చిస్తున్నారు. నగరంలో కొత్త రోడ్లు కాకుండా ముందుగా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫుట్పాత్, డివైడర్లు, రైలింగ్ మరమ్మతులు చేశారు. అలాగే నగరానికి పుసుపు రంగు పులిమేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డివైడర్లు, ఫుట్పాత్లు, రైలింగ్లకు తెలుపు, నలుపు రంగులు వేశారు. ఇప్పుడు తెలుపు రంగు స్థానంలో పసుపు రంగులు వేశారు. నగరాన్ని పసుపుమయంగా మార్చేశారు. ఈ సుందరీకరణ పనులకు సంబంధించి జీవీఎంసీ ఖజానాపై రూ.42 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. కొందరికే ఆహ్వానంపై అనుమానాలు భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని బాకాలు ఊదుతున్న ప్రభుత్వం ఈ సదస్సుకు కొందరినే ఆహ్వానించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ఇదే తరహాలో పెట్టుబడుల సదస్సు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసి ఈవెంట్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా బడా పారిశ్రామికవేత్తలుగా చూపించారు. ఎవరూ కనిపెట్టలేరన్న భ్రమలో వారికి సూటు, బూటు వేసి స్టేజ్ ఎక్కించారు. ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఫొటోలకు పోజులిచ్చారు. వెంటనే ఆ ఒప్పందాలు చేసుకున్న నకిలీ పారిశ్రామికవేత్తల అసలు బండారం సోషల్ మీడియా ద్వారా బయటపడింది. దీంతో ఈసారి గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు మినహా.. మిగిలిన ఒప్పందాలపై గోప్యత పాటించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఊరు, పేరు లేని ఉర్సా కంపెనీకి భూములు అప్పనంగా కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ పెట్టుబడుల సదస్సులో ఒప్పందాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులకు కారుచౌకగా భూముల పందారం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు విమర్శలు సంధిస్తున్నారు. దీని కారణంగానే ఈ సదస్సుకు కేవలం టీడీపీ శ్రేణులు, వారి అనుచరులను మాత్రమే ఆహ్వానిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. బీచ్ రోడ్డులో చేసిన ప్యాచ్ వర్క్లుతుది దశకు ఏర్పాట్లు ఈ నెల 14, 15 తేదీలలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్కు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం జర్మన్ హ్యాంగర్లతో 8 హాళ్లు నిర్మించారు. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సుమారు 3 వేల మంది హాజరవుతున్నట్లు భావిస్తున్నారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా 14వ తేదీన సదస్సును ప్రారంభించనున్నారు. అలాగే దీనికి రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఇందులో 30కి పైగా అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రులు చెబుతున్నారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, ఐదు కంట్రీ సెషన్లు జరగనున్నాయి. ఈ సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఏయూ పరిసర ప్రాంతాలను నో డ్రోన్ జోన్గా ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్తో పాటు వీఐపీలు పర్యటించే, బస చేసే హోటళ్ల వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. -
పెద్దేరులో యువకుడు గల్లంతు
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది పెద్దేరు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వడ్డాది మేదర వీధికి చెందిన మొగ్గ నాగ అప్పారావు గ్రామంలో ఉన్న పెద్దేరు నదిలో చేపలు పట్టడానికి మంగళవారం వెళ్లాడు. చేపల కోసం వెళ్లిన నాగ అప్పారావు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం బుచ్చెయ్యపేట పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు గజ ఈతగాళ్లు, తమ సిబ్బందితో పెద్దేరు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు నాగ అప్పారావు కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
తాండవలో చేప పిల్లల విడుదల
నాతవరం: మత్స్యకారులను ఆదుకునేందుకు తాండవ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసినట్టు స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. తాండవ రిజర్వాయర్లో బుధవారం 10 లక్షల చేప పిల్లలను కలెక్టరు విజయకృష్ణన్తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా తాండవ ప్రాజెక్టు నుంచి జాలరిపేటకు వెళ్లే మట్టిరోడ్డును అభివృద్ధి చేయాలని మత్స్యకారులు, తాండవ ప్రాజెక్టు పరిధిలో ఏలేరు, తాండవ కాలువలు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ కోరారు. స్పీకరు అయ్యన్న మాట్లాడుతూ నాతవరం నుంచి తాండవ ప్రాజెక్టు మధ్య రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ 6.36 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు, ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు. సీఎస్ఆర్ నిధులతో రోడ్డు అభివృద్ధికి కలెక్టర్ కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఎం.బి. పట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం వద్ద ఏలేరు కాలువ నీటిని పైపులైను ద్వారా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు తరలించేందుకు కావలసిన భూమిని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు రాజాన సూర్య చంద్ర, మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు, డీడీ పి.విజయ, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తాండవ ప్రాజెక్టు అధికారులు కె.సత్యనారాయణ, అనురాధ, తహసీల్దార్ ఎ.మహేష్ ఎంపీడీవో శ్రీనివాస్, తాండవ మత్స్యశాఖ అధికారి నాగమణి పాల్గొన్నారు. -
ఈగల్ క్లబ్లతో విద్యార్థుల్లో అవగాహన
తుమ్మపాల: గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆమెతో పాటు ఎస్పీ తుహిన్ సిన్హా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ గంజాయి రవాణా నివారణకు ప్రత్యేక నెల రోజుల ప్రణాళిక రూపొందించామన్నారు. మొదటి వారంలో ప్రజల నుంచి సమాచారం సేకరణ, రెండో వారంలో సమాచారం వర్గీకరణ, మూడో వారంలో గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక ఆపరేషన్ల నిర్వహణ, నాలుగో వారంలో కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా తాటిపర్తి, కోనాం, డౌనూరు, భీమవరం, శ్రీరాంపురం ప్రాంతాల్లో శాశ్వత చెక్పోస్టులతో పాటు 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో 15 పడకలతో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 116 కేసులు నమోదు చేసి, 382 మందిని అరెస్ట్ చేశామన్నారు. 8,504 కేజీల గంజాయి, 109 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే కుష్టు నిర్మూలన కుష్టు వ్యాధి రహిత జిల్లా కోసం ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కుష్టు వ్యాధి కేసులను గుర్తించేందుకు ప్రభుత్వం తలపెట్టిన లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్సీడీసీ)–2025 ప్రొగ్రాం పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో ఆమెతో పాటు ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఎంహెచ్వో ఎం.హైమావతి, డీఎల్ఏటీవో కె.స్వప్న, డీఐవో ఐ.చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు
చిత్తూరు, పాడేరు ఐటీడీఏల సత్తా కొమ్మాది(విశాఖ): జన జాతీయ గౌరవ దివస్–2025లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్(టీసీఆర్టీఎం) ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల ముగింపు కార్యక్రమంలో టీసీఆర్టీఎం ఈడీ డా.రాణి మందా పాల్గొని, విజేతలకు ట్రోఫీ లను అందజేశారు. కబడ్డీ(బాలురు, బాలికలు) పోటీల్లో చిత్తూరు ఐటీడీఏ, వాలీబాల్ (బాలురు) పార్వతీపురం ఐటీడీఏ, వాలీబాల్ (బాలికలు) సీతంపేట ఐటీడీఏ, జావెలిన్ త్రో (బాలురు, బాలికలు) పాడేరు ఐటీడీఏ, ఆర్చరీ (బాలురు)పాడేరు ఐటీడీఏ, ఆర్చరీ (బాలికలు) పోటీల్లో సీతంపేట ఐటీడీఏ విజేతలుగా నిలిచాయి. అలాగే సాంస్కృతిక పోటీల్లోనూ గిరిజన విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో సీతంపేట ఐటీడీఏ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. గిరిజన చిత్రలేఖనం పోటీల్లో కేఆర్పురం ఐటీడీఏ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఈడీ డా. రాణి మందా మాట్లాడుతూ గిరిజన యువత క్రీడలు, విద్యతో పాటు సాంస్కృతిక అంశాలలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. జన జాతీయ గౌరవ దివస్ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు
నర్సీపట్నం: ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నెల 11న నిర్వహించిన ఇంటర్ కాలేజీ బాక్సింగ్ సెలక్షన్స్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన ఇద్దరు ఉమెన్ బాక్సర్లు బంగారు పతకాలు సాధించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న బొంతు మౌనిక 75 కేజీల విభాగం, ఎబీఎం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఏడిద లక్ష్మీ తేజస్విని 81 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారని కోచ్ అబ్బు తెలిపారు. వచ్చే నెల పంజాబ్లో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్కు సెలెక్ట్ అయ్యారని ఆయన చెప్పారు. వీరిని ఏపీ బాక్సింగ్ ప్రెసిడెంట్ ఐ.వెంకటేశ్వరరావు, నింజాస్ అకాడమీ డైరెక్టర్ సుతాపల్లి శ్రీకాంత్ అభినందించారు. -
గంటల తరబడి ట్రాఫిక్ జామ్
రోడ్డు మధ్యలో ట్రాలర్ బోల్తా గాజువాక: షీలానగర్ జంక్షన్ జాతీయ రహదారి మధ్యలో ట్రాలర్ బోల్తా పడింది. దీంతో ఆ ట్రాలర్పై గల కంటైనర్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయి జనం అవస్థలు పడ్డారు. అచ్యుతాపురం నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్లను తీసుకెళ్తున్న ఒక ట్రాలర్ షీలానగర్ నుంచి పోర్టు రోడ్లోకి మలుపు తిరుగుతుండగా బోల్తా పడిపోయింది. దీంతో దానిపైగల కంటైనర్లు కిందపడిపోయి ట్రాఫిక్కు ఆటంకంగా మారాయి. బుధవారం తెల్లవారుజాము 5.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హైవేపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఉదయం 7 గంటల సమయంలో హైవేపై ఒక్కసారిగా వాహనాలు పెరిగాయి. అదే సమయంలో ట్రాలర్ను తొలగించడానికి సంబంధిత కంపెనీ ప్రతినిధులను నాలుగు క్రేన్లను అక్కడికి తీసుకురావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అటువైపు షీలానగర్ నుంచి ఎయిర్ పోర్టువరకు, ఇటువైపు గాజువాక ఆటోనగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై వెళ్లాలనుకొనేవారు గంటల తరబడి అవస్థలను ఎదుర్కొన్నారు. చివరకు కంటైనర్లను తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
పీఎం ఆవాస్ యోజన మంజూరు పత్రాల పంపిణీ
అనకాపల్లి టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొని, సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిదారులకు బుధవారం పత్రాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఒక లబ్ధిదారుడు కట్టిన ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద, మళ్ల సురేంద్ర, ఆర్డీవో షేక్ ఆయిషా, జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఏఈలు పింకీ, మురళి తదితరులు పాల్గొన్నారు. -
జీవీఎంసీ టెండర్ల విచిత్రం
సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ చేపట్టిన పనులకు సంబంధించి టెండర్లలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు ముందుగానే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ అధికారులు విచిత్రంగా కొన్ని పనులకు సంబంధించి బుధవారం షార్ట్ టెండర్లను ఆహ్వానించడం విశేషం. ఏయూలో పార్కింగ్ కోసం భాస్కర్, న్యూటన్, సమతా హాస్టల్స్ వద్ద మైదానాలను లెవెలింగ్కు, మద్దిపాలెంలో ఏయూ ఎంట్రన్స్ ఆర్చ్ వద్ద ఫుట్పాత్ టైల్స్, కెర్బ్వాల్ మరమ్మతులు, ట్రాఫిక్ ఐల్యాండ్ మ్యూరల్ ఆర్ట్స్ పెయింటింగ్... ఇలా పనులకు షార్ట్ టెండర్లు పిలిచారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. 15 తేదీ సాయంత్రానికి సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ముగుస్తుంది. అప్పుడు టెండర్లు ఖరారు చేసి సదస్సుకు సుందరీకరణ పనులు చేపడ్డమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. -
ఉగ్రవాద దాడులు ఎదురైతే.?
సింహాచలం: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఉగ్రవాద దాడులు ఎదురైతే వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆక్టోపస్ సిబ్బంది కళ్లకు కట్టినట్టు చూపించారు. స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ మెగా మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఉగ్రవాదులు ఆలయంలోకి చొరబడినట్టు సమాచారం అందగానే.. ఆక్టోపస్ అధికారులు వారిని మట్టుపెట్టేందుకు తుపాకీలు పట్టుకుని అనుసరించిన విధానాలు అబ్బురపరిచాయి. ఉగ్రవాదుల రూపంలో ఉన్న కొందరు ఆలయ పరిసరాల్లో మాటు వేయడం, వారిని మట్టుపెట్టేందుకు ఆక్టోపస్ సిబ్బంది గాలించిన వైనం ఆకట్టుకుంది. దేవస్థానం భద్రతా సిబ్బందితో పాటు గోపాలపట్నం పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఆక్టోపస్ డీఎస్పీ ఐ.తిరుపతయ్య, ఇన్స్పెక్టర్ శివాజీ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతయ్య మాట్లాడుతూ.. ఆలయాల్లో అత్యవసర పరిస్థితులు లేదా ఉగ్రవాద దాడులు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పరచడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.అప్పన్న ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ -
వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సుమారు 20 మందితో పాటు పలు పశువులు, నాటుకోళ్లపై దాడి చేసి గాయపరిచింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వడ్డాదిలో పలు వీధుల్లో తిరుగుతూ ఎదురుపడిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. పి.వెంకటరత్నం, డి.అచ్చియమ్మ, టి.ధనశ్రీ, కండెల్లి నూకరత్నం, పి.వెంకటరమణ, ఎ.సత్యవతి, జి.రామకృష్ణ, టి.అప్పారావు, సాకేత్ కుమార్, శ్రీను తదితరులు 20 మందికి పైగా కుక్క దాడిలో గాయపడ్డారు. వడ్డాది ప్రభుత్వ ఆస్పత్రిలో 15 మందికి వైద్యాధికారి దుర్గ రమ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేసి, రేబిస్ వ్యాక్సిన్ వేశారు. వీరిలో తీవ్రంగా గాయపడిన పలువురిని రెండు 108 వాహనాల్లో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి జనరల్ చెకప్కు, చిన్న పిల్లల వైద్యుల వద్దకు తరలించారు. గాయపడిన పశువులు, మేకలను బాధిత రైతులు వడ్డాది పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. వీధి కుక్కలతో రాత్రిపూట వీధుల్లో తిరగాలంటేనే భయపడుతున్నామని, నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుక్క దాడిలో గాయపడ్డ బాలిక ధనశ్రీ, వృద్ధురాలు -
ప్రజాగ్రహం
ప్రైవేటీకరణపైకదం తొక్కిన జిల్లా ప్రజలు, విద్యార్థులు, వైఎస్సార్సీపీ శ్రేణులు చోడవరంలో నిర్వహించిన భారీ ర్యాలీ, (ఇన్సెట్) వైఎస్సార్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలుఅనకాపల్లిలో పాదయాత్రగా వెళుతున్న సమన్వయకర్త మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీ సత్యవతి, దంతులూరి దిలీప్కుమార్ పోలీసుల అడ్డంకులను అధిగమించి నిరసనలు నర్సీపట్నంలో బారికేడ్లతో మోహరించిన పోలీసులు అయినా ఎక్కడా తగ్గకుండా పాదయాత్రగా ర్యాలీ సాక్షి, అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ పేరుతో ప్రై‘వేటు’ వేసే జీవోను రద్దు చేయాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహోద్యమం చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రజా ఉద్యమం’ పేరిట పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పేద ప్రజలకు చంద్రబాబు హయాంలో అన్ని విధాలుగా అన్యాయమే జరిగిందని.. మెడి‘కిల్’ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు. నర్సీపట్నంలో ర్యాలీకి అనుమతి లేదని పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్కు ముందురోజు నోటీసు జారీ చేసిన పోలీసులు బుధవారం ఉదయం నుంచే పట్టణంలో భారీగా మోహరించారు. అయినప్పటికీ ప్రజలు నిరసన ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇదే స్పందన కనిపించింది. చోడవరంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. చోడవరం కాలేజి జంక్షన్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు కిలోమీటరన్నర మేర పాదయాత్రగా ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థులు పాల్గొని మద్దతు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏరువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, జెడ్పీటీసీలు మారిశెట్టి విజయ శ్రీకాంత్, పోతల లక్ష్మీ శ్రీనివాస్, ఎంపీపీలు గాడి కాసు అప్పారావు, పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దేవి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. తహసీల్దార్ రమాదేవికి వినతిపత్రం సమర్పించారు. పార్టీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఎంపీపీలు తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, కురచా జయమ్మ, చింతల బుల్లిలక్ష్మి, రెడ్డి జగన్మోహన్, చోడవరం సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ స్టేడియం వద్ద మహాత్మగాంధీ విగ్రహం నుంచి అబిద్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల ఎర్రాపాత్రుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షరాలు లోచల సుజాత, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, గజ్జలపు మణికుమారి, సర్వేశ్వరరావు పాల్గొన్నారు. అనకాపల్లిలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన సాగింది. రింగ్రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఏవో లీలావతికి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎంపీ, సీఈసీ సభ్యురాలు డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు జ్ఞాన్దీప్ పాల్గొన్నారు. యలమంచిలిలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఏవీఎన్ కాలేజీ డౌన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, సీఈసీ సభ్యుడు బోదెపు గోవింద్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు, ఎంపీపీలు గొట్టిముక్కల శిరీష, కిషోర్రాజు, కోన సంధ్య, జెడ్పీటీసీలు సేనాపతి సంధ్యారాణి, ధూళి నాగరాజు, సోము సత్యానారాయణ,, మున్సిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు సత్య గుప్తా పాల్గొన్నారు. పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రాష్ట్ర కార్యదర్శులు పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
భర్త వేధింపులకు బలైన ఆర్కిటెక్ట్ డిజైనర్
గోపాలపట్నం: వివాహమై ఏడాది కాకముందే దేశంశెట్టి విజయ శ్యామల (25) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లో చోటు చేసుకుంది. భర్త పెట్టిన మానసిక వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన విజయ శ్యామలకు 2024 డిసెంబర్ 6న చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన దేవాడ దిలీప్ శివకుమార్తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల కట్నం, ఎకరా భూమి, రూ. 1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, 8 తులాల బంగారం, ఆడపడుచు కట్నం రూ.లక్ష, సారె ఇచ్చామని శ్యామల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్ఎస్టీఎల్లో ఆర్కిటెక్చర్ డిజైనర్గా పనిచేస్తున్న శ్యామల ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్త దిలీప్ శివకుమార్ తరచుగా ఆమెకు దూరంగా ఉంటూ, ఇతరులతో పోల్చుతూ ద్వేషిస్తూ మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఆమె ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన దిలీప్ శివకుమార్ తలుపు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి వెళ్లి చూడగా, శ్యామల ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకి దించి, తన అన్నావదినలకు సమాచారం అందించాడు. వారు వచ్చిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన జరిగిన విధానంపై ఆరా తీశారు. సోమవారం ఉదయం ఏసీపీ పృధ్వీతేజ ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలను బట్టి, భర్త తనను పూర్తిగా దూరం పెట్టడం, అర్ధరాత్రి ఇంటికి రావడం, శారీరకంగా, మానసికంగా దూరం పెడుతున్న కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అల్లుడే చంపేశాడు మృతురాలి తల్లిదండ్రులు దేశంశెట్టి రోజారమణి మాట్లాడుతూ తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని ఆరోపించారు. తమ కూతురు చనిపోయిన తర్వాత తమకు సమాచారం ఇవ్వకుండా, అన్నావదినలకు సమాచారమందించడం, వారు వచ్చిన తరువాత పోలీసులకు చెప్పడం ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఎకరా భూమి గురించి పలుమార్లు అల్లుడు ఫోన్ చేసి అడిగేవాడని తల్లి రోజారమణి ఆరోపించారు. తమ కూతురిని వారే పొట్టన పెట్టుకున్నారని, వారికి తగిన శిక్ష వేయాలని రోదించారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ, ఎస్ఐ అప్పలనాయుడు ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. తల్లి రోజారమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీలపై క్షేత్ర స్థాయి పర్యటన తప్పనిసరి
● అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం ● పీజీఆర్ఎస్కు 239 అర్జీలుఅర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరిస్తున్న జేసీ జాహ్నవి, జిల్లా అధికారులుతుమ్మపాల: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని జేసీ ఎం.జాహ్నవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు పీజీఆర్ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలు వివరంగా తెలియజేసి, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. అర్జీల సమాచారం కోసం దరఖాస్తుదారులు 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 239 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, జిల్లా సర్వే, భూ రికార్డుల భద్రత సహాయ సంచాలకుడు గోపాల రాజా, తదితరులు పాల్గొన్నారు. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేసి ప్రజల జీవితాలను కాపాడాలని కోరుతూ నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. మత్స్యకారులకు జీవనాధారంగా ఉన్న మత్స్య సంపద పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి–16 ఆనుకుని యలమంచిలి పరిసరాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యలమంచిలి మండలం కొత్తపాలెంకు చెందిన ఆడారి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. మండలంలో మర్రిబంద, రేగుపాలెం, పులపర్తి, పురుషోత్తపురం, తదితర ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులు నెలవారీ మామ్ముళ్ల మత్తులో నిద్రిస్తున్నారని, ప్రత్యేక పోలీస్ బృందంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆటో సేవా పథకం కింద అందాల్సిన నగదు నేటికి తనకు జమ కాలేదని చీడికాడ మండలం ిసిరిజాం గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఆవాల వెంకటరమణ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. పదేళ్లుగా ఆటో డ్రైవర్గా ఉన్నానని, ఆటో విక్రయించి ట్యాక్సీ క్యాబ్ నిర్వహిస్తున్నానని, సచివాలయంలో అన్ని పత్రాలు సమర్పించినా నగదు జమ కాలేదని వాపోయారు. తక్షణం పథకం డబ్బులు మంజూరు చేయాలని కోరారు. భూసమస్యపై అర్జీ అందజేసి ఏడాది పూర్తవుతున్నా అధికారులు కనీసం స్పందించలేదని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు భీశెట్టి అప్పారావు పీజీఆర్ఎస్లో మరోసారి ఫిర్యాదు చేశారు. కోడూరు సర్వే నెం.324/2, 329/1,2లో మొత్తం 2.20 ఎకరాల భూమి తన భార్య జానకికి వారసత్వంగా వచ్చిందని, రెవెన్యూ అధికారులు పట్టణానికి చెందిన బొడాల సత్యనారాయణ, బొడాల శ్రీనుబాబు, రమణబాబుల పేరున తప్పుగా ఆన్లైన్ చేశారని, వాటిని తొలగించి తమ పేరున ఆన్లైన్ చేయాలని కోరారు. ఎస్పీ కార్యాలయానికి 50 అర్జీలు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 50 అర్జీలు అందాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలను ఎస్పీ తుహిన్సిన్హాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూ తగాదాలు – 19, కుటుంబ కలహాలు – 2, మోసానికి సంబంధించిన – 2, ఇతర విభాగాలకు చెందినవి – 27 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ మద్యం విక్రేత అరెస్టు
మద్యం సీసాలతో పట్టుబడిన నిందితుడురావికమతం: మండలంలోని గొంపలో కొప్పాక నాగేశ్వరరావు(40) అనే వ్యక్తి పాన్షాప్లో అనధికార మద్యం విక్రయాలు జరుపుతున్నట్టు స్పెషల్ బ్రాంచి పోలీసులకు సమాచారం అందింది. అనకాపల్లి స్పెషల్ బ్రాంచి సీఐ బాల సూర్యరావు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి పోలీసులు మద్యం విక్రయిస్తున్న నాగేశ్వరరావుపై ఆకస్మిక దాడి జరిపి 149 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మద్యాన్ని రావికమతం పోలీసుస్టేషన్కు అప్పగించి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు అప్పగింత
నక్కపల్లి: మండలంలో బల్క్డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు కోల్పోయిన వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించి అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం ఆమె పెదబొదిగల్లం వద్ద నిర్వాసితుల కోసం 160 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్లాట్లు పొందిన కొంతమంది నిర్మించుకునే ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ భూమిని కొనుగోలు చేసి 734 మంది నిర్వాసితులకు ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.8.98 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్యాకేజీ, ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు కొంతమంది ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆరుమాసాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నివాసప్రాంతాలు కోల్పోయిన వారు పలు సమస్యలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. చాలా మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాలేదని తెలిపారు. మేజర్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, కట్టడాలకు నష్టపరిహారం కోసం ఎస్టిమేషన్లు వేయాల్సి ఉందని, వివాహాలైన ఆడపిల్లలను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితాలో చేర్చాలని, వారికి కూడా ఇంటి స్థలం, ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైతే న్యాయం చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, డీటీ నారాయణరావు, ఏపీఐఐసీ అధికారులు, స్దానిక నాయకులు గోవిందు, లక్ష్మణరావు పాల్గొన్నారు.ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన కలెక్టర్ -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో గురుకుల విద్యార్థులకు పతకాలు
మెడల్స్ సాధించిన విద్యార్ధులతో ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ నర్సీపట్నం: ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పెదబొడ్డేపల్లి గురుకుల విద్యార్థులు మెడల్స్ సాధించారు. అండర్ 17 కేటగిరి 71 కేజీల విభాగంలో షేక్ అబ్దుల్ సిల్వర్ మెడల్, సీహెచ్.కిరణ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి గురుకుల విద్యాలయానికి పేరు తీసుకువచ్చిన విద్యార్ధులు, పీఈటీని ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ అభినందించారు. -
వచ్చే నెల 21న క్షత్రియ కార్తీక వన సమారాధన
అనకాపల్లి: క్షత్రియ సేవ సమితి జిల్లా కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు దంతులూరి దిలీప్కుమార్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి విజయ రెసిడెన్సీ హాల్లో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో క్షత్రియ సేవా సమితి స్థలంలో పక్కా భవనం నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. క్షత్రియులందరినీ ఒక తాటి మీదకు తీసుకువచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ సహాయంతో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా కార్యదర్శి పిన్నమరాజు కిషోర్రాజు, కోశాధికారి మంతెన నీలావతి, సభ్యులు దంతులూరి రాజబాబు, పెనుమత్స కృష్ణంరాజు, పిన్నమరాజు శ్రీనివాసరాజు, భూపతిరాజు వర్మ, చేకూరి శ్రీనివాసరాజు, పిన్నమరాజు వాసు, పాకలపాటి రాజా, ఉప్పలపాటి నరసింహరాజు, అచ్యుతరామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
హైరానా..
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025యూరియా కోసంరైతులు పంటల సాగుకు అవసరమయ్యే యూరియా కోసం నానా హైరానా పడుతున్నారు. ఖరీప్లో రైతులకు అవసరమయ్యే యూరియాను సకాలంలో తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీజన్కు తగ్గ యూరియాను అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారులు కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎప్పుడు యూరియా దొరుకుతుందా అని రైతులు వేయి కళ్లతో ఎదురు చూడాల్సిన పరిస్థితులు జిల్లాలో దాపురించాయి. తెలుగుభాష అభివృద్ధికి బ్రౌన్ కృషి మరువలేనిది సీపీ బ్రౌన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు తుమ్మపాల: తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి సీపీ బ్రౌన్ చేసిన కృషి మరపురానిదని జాయింట్ కలెక్టర్ ఎం.జిహ్నవి అన్నారు. కలెక్టరేట్లో ఆయన జయంతి వేడుకలను సోమవారం నిర్వహించి చిత్రపటానికి జేసీ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు నిఘంటువు రూపకల్పనలో ఆయన చేసిన సేవలు భాషా సంరక్షణకు పునాది వేశాయన్నారు. యువత తెలుగు భాషా వారసత్వాన్ని గౌరవించి, సంరక్షించే దిశగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, ఇతర అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.మునగపాక: మునగపాక సచివాలయ ప్రాంగణంలో సోమవారం యూరియా పంపిణీ చేస్తామంటూ అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఉదయం 8 గంటల నుంచే సచివాలయానికి చేరుకుని బారులు తీరారు. మునగపాక సచివాలయానికి 12 టన్నుల మేర యూరియా రావడంతో రైతులు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి గంటల కొలదీ నిరీక్షించారు. వ్యవసాయాధికారులు సచివాలయానికి చేరుకొని క్యూలో నిలబడిన రైతులకు టోకెన్లు అందజేయడంతో ఈ టోకెన్ల కోసం రైతులు ఎగబడాల్సి వచ్చింది. అరకొర యూరియా రావడంతో కనీసం బస్తా అయినా దొరుకుతుందో లేదా? అని ఆవేదన చెందుతూ కష్టతరమైనప్పటికీ క్యూలో నిలబడ్డారు. టోకెన్లు తీసుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో అతి కష్టం మీద కొంతమంది రైతులు యూరియాను తీసుకోగలిగారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా టోకెన్లు తీసుకున్న రైతులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఖాతా నెంబర్తో పాటు ఆధార్ నంబరును సరిచూసుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద మూడు, నాలుగు గంటల పాటు రైతులు యూరియా బస్తా కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురవ్వడం పట్ల రైతులు మళ్ల సంజీవరావు,ఆడారి లక్ష్మణరావు,బొడ్డేడ రాజు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యూరియా విషయంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కష్టాలు తప్పడం లేదుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి జ్యోత్న్సకుమారి వద్ద ప్రస్తావించగా లక్ష్యం మేర యూరియా తీసుకువచ్చామని కొంతమంది రైతులు అవసరం లేకున్నా యూరియా పట్టుకుపోవడంతో సమస్య తలెత్తుతుందన్నారు. దీనికి తోడు పంటలకు కాకుండా గడ్డి పెంపకానికి యూరియా తీసుకుపోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికై నానా యూరియా వినియోగించాలంటూ రైతులకు పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.భాగస్వామ్య సదస్సుకు పక్కా ఏర్పాట్లు -
ఆర్టీవో సహకారంతో ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్ శిక్షణ
అనకాపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్కు శిక్షణ ఇచ్చి, ఆర్టీవో వారి సహకారంలో డ్రైవింగ్ లైసెన్స్ను అందజేయడం జరుగుతుందని జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి వి.ప్రవీణ అన్నారు. స్థానిక డిపో ఆవరణలో 11వ బ్యాచ్ శిక్షణ పూర్తి అయిన 20 మంది డ్రైవర్లకు సోమవారం ఆమె సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ పొందిన డ్రైవర్లను ఆర్టీసీలో డ్రైవర్లు అవసరం ఉన్న సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో విధులకు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కావలసిన వ్యక్తులు దగ్గరలో ఆర్టీసీ సిబ్బందిని కలవాలన్నారు. ట్రాఫిక్ మేనేజర్ గౌరి, డ్రైవింగ్ శిక్షకుడు ఎ.వి.రమణ, డ్రైవింగ్ స్కూల్ డీఈవో బాపునాయుడు పాల్గొన్నారు. -
ఇరిగేషన్లో ఇంజినీర్ల కొరత
సాక్షి, అనకాపల్లి: ఇరిగేషన్ ప్రొజెక్టులపై చంద్రబాబు సర్కార్ అడుగు అడుగునా నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమించలేదు. సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు ఎస్ఈ పోస్టులకు మూడు ఎస్ఈ, ఒక సీఈల్లోనూ ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. తుఫాన్ సమయంలో రిజర్వాయర్లలో నీరు చేరి గేట్లు ఎత్తివేయడంలో అనుమతులు రాకపోవడంతో జేఈలు, డీఈలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. రిజర్వాయర్ నీటిమట్టం, నదుల ద్వారా ప్రవహించే నీరు, గట్లు పరిస్థితులపై ఇన్చార్జి అధికారులకు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, నిర్ణయాధికారం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగినా... జిల్లాల పునఃవిభజన జరిగినా ఇరిగేషన్ విభాగంలో ఉమ్మడి విశాఖ జిల్లాలకు ఒక్కరే ఎస్ఈ ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే మూడు జిల్లాలకు ఈఈలను ఆయా జిల్లాల ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి, అల్లూరి జిల్లాలో ఇరిగేషన్ విభాగం అత్యంత ప్రాధానమైంది. అలాంటి జిల్లాల్లో కూడా అరకొరగానే ఇంజినీర్లు ఉన్నారు. విశాఖ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈగా ఈఈ పి.అప్పలనాయుడు కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లా ఇన్చార్జిగా ఈఈ త్రీనాథ్(డబ్లూఎస్ఎం) కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇరిగేషన్ ప్రధాన విభాగాన్ని నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న డీఈ బాలసూర్యమే అక్కడ ఈఈ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇద్దరు ఈఈలు ఉన్నారు. విశాఖకు ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. సీఈగా కూడా ఇన్చార్జినే.. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో కీలకమైన నార్త్ కోస్టు సీఈ పోస్టు కూడా ఇన్చార్జిలతో నడుస్తోంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదు ఎస్ఈ పోస్టుల్లో ఒక వంశధార ప్రాజెక్టు ఎస్ఈ ఒక్కరే రెగ్యులర్గా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లాలో ఇరిగేషన్ శాఖలో, ఇక ఉమ్మడి విశాఖలో జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కరువయ్యారు. నాలుగు డివిజన్లకు ఒకే ఒక్క ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉన్నారు. దాదాపు అన్ని ఎస్ఈ, ఈఈ పోస్టులు ఇన్చార్జిలతో నడుస్తున్నాయి. మిగిలిన డివిజన్ల్లో, సబ్ డివిజన్లలో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లేక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్(డీఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్లు(ఏఈ)లతో జలవనరుల శాఖ నడుస్తోంది. ఇక అసిస్టెంటు ఇంజినీరు(ఏఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ) పోస్టుల కొరత కూడా విపరీతంగా ఉంది. ప్రస్తుతం డీఈఈలు, ఏఈలు అనేక పోస్టుల్లో ఇన్చార్జిలుగా పనిచేస్తున్నారు.పదోన్నతులు, పోస్టింగుల్లో తీవ్ర అన్యాయం జలవనరుల శాఖలో ఇటీవల ఇచ్చిన పదోన్నతులు, పోస్టింగుల్లో కూడా ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. జలవనరుల శాఖలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో అన్ని ఎస్ఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ) పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీ ఉంటున్నాయి. విశాఖ జిల్లా ఎస్ఈ పోస్టులో ధవళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ఈని ఇక్కడ ఇన్చార్జీగా కొంత కాలం నియమించారు. ప్రస్తుతం ఈఈనే ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎంతో మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నారు. కానీ ఏదో చిన్న సాకుతో పదోన్నతులు ఇవ్వడం లేదు. అలాగే అందువల్ల ఇక్కడ పనిచేస్తున్న వారికి ఇటీవల ఇచ్చిన పోస్టింగుల్లో కూడా ప్రాధాన్యం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ఇక్కడ నియమించి వారికి పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు కూడ ఉన్నాయి. అంతేకాకుండా ప్రాజెక్టు నిర్వహణకు నిధులు జిల్లాలో కీలకమైన రిజర్వాయర్లు అన్నీ ఎస్ఈ పరిధిలో ఉంటాయి. అనకాపల్లి జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు, కళ్యాణపులోవ మేజర్, మైనర్ సాగునీటి ప్రాజెక్టులుగా ఉన్నాయి. వాటి పర్యవేక్షణ అంతా ఎస్ఈలే నిర్ణయాధికారంగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో 3 ఎస్ఈ, ఒక సీఈ పోస్టుల్లో ఇన్చార్జిలే ఉమ్మడి విశాఖకూ ఇన్చార్జి ఎస్ఈ ఈఈలు, డీఈఈలు కూడా సర్దుబాట్లే నీటి పారుదల శాఖ పట్ల చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం కళ తప్పిన సూపరింటెండెంట్ కార్యాలయ ప్రాంగణాలు -
ఫీజుల విడుదలకు ఐక్య పోరాటం
యలమంచిలి రూరల్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై దశలవారీగా పోరాటం చేయనున్నట్టు రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు జె.రమణాజీ తెలిపారు. సోమవారం రాత్రి యలమంచిలి కేబీఆర్ డిగ్రీ కళాశాలలో జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం ద్వారా ఒత్తిడి తెస్తామన్నారు. త్వరలోనే విజయవాడలో అన్ని కళాశాలల యాజమాన్యాల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాలల యాజమాన్యాలు అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు సొంత ఆస్తులు, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి ఉందన్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. తొలిసారిగా ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై న జెర్రిపోతుల రమణాజీని పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ పరిధి ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, కార్యదర్శి రామారావు, జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల అధ్యక్షుడు గోవిందరావు, సంఘం పాలకవర్గ సభ్యుడు నాగేశ్వర్రావు, పలు డిగ్రీ కళాశాలల యజమానులు పాల్గొన్నారు. -
రూ.15 వేలు పింఛన్ ఇచ్చి ఆదుకోండి
మంచానికి పరిమితమైన తన కూతురు సాయి భవానికి రూ.15 వేలు పింఛన్ అందించి ఆదుకోవాలని కోరుతూ జీవీఎంసీ విలీన గ్రామం కొండకొప్పాకకు చెందిన డి.రాము కలెక్టరేట్కు వచ్చి అర్జీ అందజేశారు. 90 శాతం అంగ వైకల్యం ఉన్న బిడ్డ సాయి భవానికి నెలకు రూ.6వేలు పింఛన్ మాత్రమే అందుతుందని, పూర్తిగా మంచాన ఉండే బిడ్డ వద్ద మరో మనిషి పూర్తిగా ఉండిపోవాల్సి వస్తుందని, నిరుపేదలమైన తాము కూలిపనులకు కూడా వెళ్లలేని స్థితి ఉందని, నెలకు రూ.15 వేలు పింఛన్ అందించి ఆదుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమామణిని వేడుకున్నారు. – సాయిభవానితో తండ్రి రాము -
యువతకు ఆదర్శనీయం స్వామీ వివేకానంద సందేశం
అనకపల్లి టౌన్/తుమ్మపాల: నేటి యువత స్వామీ వివేకానంద సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. స్ధానిక ఏఎంఏఎల్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ(సెట్విజ్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామీ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెకర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ యోగా, ధ్యానం వంటివి వారి దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జానపద నృత్యం, గీతాలు, కధ రచన, పెయింటింగ్, కవిత్వం, ఆవిష్కరణ తదితర పోటీల్లో విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రశంసా పత్రాలు ఆమె అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహక అధికారి కె.కవిత, జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావు నాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వినోద్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయబాబు, కరస్పాండెంట్ వెంకట రామారావు పాల్గొన్నారు. -
దీక్షా శిబిరం వద్దే వంటావార్పు
శిబిరం వద్ద భోజనాలు చేస్తున్న మత్స్యకారులు నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహారదీక్షలు 58వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం దీక్షా శిబిరం వద్ద వంటలు చేసుకుని భోజనాలు చేశారు. తమకు ప్రాణభిక్ష పెట్టాలని, గంగమ్మతల్లిని మా నుంచి దూరం చేయొద్దంటూ గంగపుత్రులు వేడుకుంటున్నారు. బల్క్డ్రగ్ పార్క్ పేరుతో రాజయ్య పేట పరిసరాల్లో వందలాది రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర పనులు పూర్తి చేశారన్నారు. దాదాపు రెండు నెలల నుంచి మత్స్యకారులంతా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ పనులు కొనసాగిస్తోందన్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ కంపెనీల ఏర్పాటును మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు. కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచి వేయాలని చూస్తే భయపడే ప్రసక్తి లేదంటున్నారు. ఈ ఆందోళనలో కాసులమ్మ, పైడితల్లి, సోమేష్, మహేష్, స్వామి, సూరిబాబు, అప్పలరాజు పాల్గొన్నారు. -
స్కూల్ గేమ్స్లో అన్యాయం
ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ గేమ్స్లో తనకు అన్యాయం జరిగిందంటూ మునగపాక మండలం మడకపాలెంకు చెందిన క్రీడాకారిణి బి.ఇందు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ఎంజే పురం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న తాను హరిపాలెంలో జరిగిన పోటీల్లో మొదటి స్థానం, అనకాపల్లి, ఎంజేపురం హైస్కూళ్లలో వేర్వేరుగా జరిగిన పోటీల్లో విన్నర్గా నిలిచానని చెప్పారు. దీంతో కొవ్వూరులో జరిగే పోటీలకు ఎంపికై నట్లు చెప్పి చివరి నిమిషంలో తన పేరును జాబితా నుంచి తొలగించి మరొకరిని పంపించారని ఆమె వాపోయింది. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. – క్రీడాకారిణి ఇందు -
యువకుడి మృతి కేసులో నలుగురు అరెస్ట్
యలమంచిలి రూరల్: స్వల్ప వివాదం కాస్త ముదిరి కొట్లాటకు దారితీసిన ఈ ఘటనలో ఒకరి ప్రాణాలు బలిగొనగా, నలుగురు యువకులు జైలుపాలయ్యారు. పట్టణంలోని గత నెల 25వ తేదీ రాత్రి నాగుల చవితి జాతరలో ఆటో డ్రైవర్పై దాడికి పాల్పడి అతని మృతికి కారణమైన నలుగురు నిందితులను పట్టణ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. గత నెల 26న తొలుత కొట్లాట కేసుగా నమోదు చేసిన పోలీసులు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ నెట్టి శివ(35) ఆదివారం మృతి చెందడంతో సెక్షన్లు మార్పు చేశారు. ఈ కేసుకు సంబంధించి యలమంచిలి సీఐ ధనుంజయరావు సోమవారం రాత్రి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక టిడ్కో కాలనీకి చెందిన శివ ఇద్దరు స్నేహితులతో కలిసి యలమంచిలి పట్టణంలోని నాగుల చవితి జాతర చూడ్డానికి వెళ్లాడు. సీతా తులసీ సినిమాహాళ్ల వద్దకు చేరుకున్న సమయంలో నెట్టి శివ భుజం ఎదురుగా వస్తున్న పట్టణానికి చెందిన ఓ యువకుడికి తగిలింది. దీంతో శివకు పట్టణంలో ధర్మవరంకు చెందిన వెదుళ్ల మోహన్, కశింకోట గువ్వాలు, కొఠారు రవితేజ(రవి), గొన్నాబత్తుల విఘ్నేష్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెరుగుతున్న సమయంలో శివ నలుగురు యువకులకు సారీ సైతం చెప్పాడు. అయినప్పటికీ శాంతించని యువకులు శివపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడున్న సిమెంట్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం శివ ముఖంపై పిడి గుద్దులు గుద్దిన నలుగురు యువకులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తల, ఇతర శరీర భాగాలకు గాయాలైన శివను అతని స్నేహితులు టిడ్కో గృహ సముదాయంలో ఇంటికి తీసుకెళ్లారు. శివ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. శివను పరీక్షించిన అక్కడి వైద్యులు మరింత మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. 15 రోజులుగా చికిత్స పొందిన శివ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఽఘటనపై శివ కుటుంబసభ్యులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఆదివారం మరో ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు మొదట బీఎన్ఎస్ 117(2),115(2) రెడ్ విత్3(5) కింద నమోదైన కేసు సెక్షన్లను బీఎన్ఎస్ 105 రెడ్ విత్ 3(5) గా మార్పు చేశారు. నలుగురు నిందితులకు సోమవారం రాత్రి యలమంచిలి సీహెచ్సీలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.నాగుల చవితి జాతరలో దాడి చేసిన నిందితులు -
పెట్రో వర్సిటీలో నూతన భవనాలకు ప్రారంభోత్సవాలు
సబ్బవరం: మండలంలోని వంగలి గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ అఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ)లో సోమవారం పలు భవనాలను ప్రారంభించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై వీటి గృహప్రవేశం, ప్రారంభోత్సవాలను చేపట్టారు. వర్సిటీలోని బాయ్స్ హాస్టల్స్–1, 2, గర్ల్స్ హాస్టల్, టైఫ్–8 క్వార్టర్స్, ఈ అండ్ ఎం వర్క్ షాప్, క్యాంటీన్లను ప్రారంభించారు. అనంతరం వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ శాలివాహన, రిజిస్ట్రార్ రాంపాల్ ద్వివేది, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కె.పునీత్కుమార్, జీఎం జె.రంగారావు, తహసీల్దార్ బి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులుగా రమణకుమారి, ధనలక్ష్మీ, ఎ.కమల అనకాపల్లి: ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) 5వ రాష్ట్ర మహాసభలు ముగింపు కార్యక్రమం స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్ ఎదురుగా కర్రి రమేష్ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.రమణకుమారి(నంద్యాల), ప్రధాన కార్యదర్శిగా కె.ధనలక్ష్మి, కోశాధికారిగా ఎ.కమల(విజయనగరం జిల్లా) ఎన్నికయ్యారు. వీరితో పాటు 23 మంది ఆఫీస్ బేరర్స్, 30 మంది యూనియన్ సభ్యులుగా ఎంపికయ్యారు. -
వింత షరతులు
వైజాగ్ మాల్యా.. మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశాడు. అలాంటి మాల్యానే.. మన వైజాగ్లోనూ ఉన్నాడు. ఈ మాల్యా మాత్రం పారిపోలేదు. అపరిచితుడిలా భిన్న పార్శ్వాలు ప్రదర్శిస్తున్నాడు. కానీ..మన వైజాగ్ మాల్యాలో మాత్రం రెండు కోణాలున్నాయి... ఎన్నికల ముందు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు. ఇప్పుడు.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అప్పులిచ్చిన బ్యాంకుల్నే బెదిరిస్తున్న కై ంకర్యుడు. సాక్షి, విశాఖపట్నం : ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. వారు చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ.. నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది ఓ కూటమి ఎమ్మెల్యేకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్ కంపెనీల దగ్గర సదరు ఎమ్మెల్యే.. ఓ డిఫాల్టర్ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ డిఫాల్టర్ అనే ముద్ర వేసుకుంటూ.. ఈవీఎంల గాలిలో గెలిచిన మాల్యా.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలకు ఆద్యుడిగా మారుతున్నారు. ఆది నుంచీ అవే మోసాలు..! ఏ బ్యాంకు కనిపించినా.. ఏ ఫైనాన్స్ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తిరగడమే సదరు ఎమ్మెల్యే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. చిట్ఫండ్ కంపెనీల్లో డబ్బులు పాడుకొని వాటిని ఎగ్గొట్టేందుకు యత్నించగా కోర్టు మొట్టికాయలు వెయ్యడంతో వాటిని చెల్లించారు. చిట్ఫండ్ సంస్థలకు ఎగనామం పెట్టిన వైజాగ్ మాల్యా... 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ప్రతి ఫైనాన్స్ సంస్థ దగ్గర కోట్ల రూపాయల రుణాలు తీసుకొని వాటికి శఠగోపం పెట్టేశారు. చివరికి కోర్టులని ఆశ్రయించిన కొన్ని సంస్థలు.. ఈయన దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో.. ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి. వైజాగ్ పోర్టులో కింగ్ అవుతా..! షిప్పింగ్ కంపెనీని నడుపుతున్న వంశీ.. దాన్ని కొనసాగించేందుకే పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని అటు బ్యాంకుల్ని.. ఇటు పోర్టుని శాసించాలని యత్నిస్తున్నారు. వైజాగ్ పోర్టులో షిప్పింగ్ కాంట్రాక్టులు పొందేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. షిప్పింగ్ కాంట్రాక్టులు తన సంస్థకే ఇవ్వాలనీ.. లేదంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పి.. బదిలీ చేస్తానంటూ కొందరు పోర్టు అధికారులతో వాగ్వాదం పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోర్టులో తానే కింగ్ అవుతానంటూ విర్రవీగుతున్నారని సమాచారం. బ్యాంకులపైనా బెదిరింపుల అస్త్రాలు..! బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలే కాదు... కొంత మంది వ్యక్తుల దగ్గరా చేబదులుగా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 సార్లకు పైగా డిఫాల్టర్గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్ మాల్యా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫైనాన్స్ సంస్థల్ని బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇటీవల డిఫాల్టర్గా మారారంటూ.. జప్తుకు ముందు ఇచ్చే నోటీసులు సదరు ఎమ్మెల్యే మాల్యాకు కొన్ని బ్యాంకులు ఇచ్చాయి. వెంటనే బ్యాంకు ప్రతినిధుల్ని తన కార్యాలయానికి రప్పించుకొని.. వారిపైనా బెదిరింపుల అస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురిస్తే.. తన ఇమేజీ డ్యామేజీ అవుతుందని, చిన్న చిన్న పత్రికల్లో నోటీసులిచ్చి వదిలెయ్యాలని చెప్పినట్లుగా బ్యాంకింగ్ వర్గాలు వాపోతున్నాయి. నోటీసులు ప్రచురించమని, డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరుతున్న బ్యాంకులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో బ్యాంకు స్థానిక అధికారులు.. సదరు వైజాగ్ మాల్యా ఎమ్మెల్యే పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ నోటీసుల వ్యవహారం తమకు సంబంధం లేదని, రీజినల్ కార్యాలయం నుంచే పరిష్కరించుకోవాలంటూ కొన్ని బ్యాంకుల అధికారులు హెడ్ ఆఫీస్కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రుణాలు ఎగ్గొట్టడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సదరు ఎమ్మెల్యే తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ రుణాలిచ్చిన సంస్థలకే కన్నం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైజాగ్ అంతా కోడై కూస్తోంది. అప్పులిచ్చిన బ్యాంకుల్ని బెదిరిస్తున్న కూటమి ఎమ్మెల్యే పోర్టులో కాంట్రాక్టుల కోసం బ్యాంకుల్లో రుణాలు నిర్ణీత సమయాల్లో చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ఎమ్మెల్యే బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురించొద్దంటూ ఆదేశాలు రుణం చెల్లించే సమయం చెప్పకుండా బ్యాంకులపై పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే మాల్యా -
చిన్నారికి టీకా.. నూరేళ్ల జీవితానికి భరోసా
మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు. అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్తో ముందుకెళ్తున్నారు. ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్ పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్ బి.లూసీ సూచించారు. ఏ టీకా.. ఎప్పుడు వేయాలి? ప్రసవం నుంచి 24 గంటలు: టీబీ నుంచి రక్షణకు బీసీజీ, పోలియో నివారణకు ఓపీవీ జిరో డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్–బి ● 45 రోజులకు: పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ ● 75 రోజులకు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యూమోనియా నివారణకు పెంటావాలెంట్–1, 2, 3 ● 105 రోజులకు: తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి సమస్యల నివారణకు ఆర్వీవీ–1, 2, 3 ● 9–12 నెలలకు: తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్–1, అంధత్వ నివారణకు విటమిన్–ఎ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫ్ఐవీవీ–3, పీసీవీ–బీ ● 16–24 నెలలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీడీ–1 బూస్టర్, పోలియో నివారణకు ఓపీవీ బూస్టర్, తట్టు రుబెల్లా నివారణకు ఎంఆర్–2, మెదడువాపు వ్యాధికి జేఈ–2, అంధత్వ నివారణకు విటమిన్–ఎ2 ● 5–6 సంవత్సరాలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 ● 10 సంవత్సరాలు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–1 బూస్టర్ ● 16 ఏళ్ల వయసు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–2 బూస్టర్ జిల్లాలో అందుబాటులో ఉన్న టీకాలు ప్రస్తుతం జిల్లాలో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ బి.లూసీ తెలిపారు. డీపీటీ, ఎఫ్ఐపీవీ, ఓపీవీ, హెపటైటిస్ బి, ఎంఆర్, బీసీజీ, పీసీవీ, టీడీ, రోటవైరస్ వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూనివర్సిల్ ఇమ్యూనైజేషన్ ప్రొగ్రామ్లో భాగంగా వీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఎస్.రాయవరం: మండలంలో గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన ఊడి రంజిత్ (28)తలుపులమ్మ లోవ నుంచి స్వగ్రామం వస్తుండగా కారుని ఓవర్టేక్ చేసే క్రమంలో బైకుతో రోడ్డుపై పడిపోయాడు. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని ఎస్ఐ విభీషణరావు తెలిపారు. బైకుపై ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడినట్టు చెప్పారు. వివరాలు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
జాతరలో యువకుల దాష్టీకం
● నాగులచవితి రోజు యువకుడిపై విచక్షణారహితంగా దాడి ● 15 రోజులుగా చికిత్స పొందుతూ మృతి ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన యలమంచిలి రూరల్ : సరదాగా స్నేహితులతో కలిసి జాతర చూసేందుకు వెళ్లిన యువకుడిపై నలుగురు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. గత నెల 25వ తేదీ రాత్రి పంచరాత్రి ఉత్సవాల ముగింపు రోజైన నాగులచవితినాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టిడ్కో కాలనీలో నివాసముంటున్న యువకుడు నెట్టి శివ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. గత నెల 25వ తేదీన యలమంచిలి పట్టణంలో నాగులచవితి సందర్భంగా జరిగిన జాతరకు స్నేహితులు దాసరి మధు, మడగల శివలతో కలిసి నెట్టి శివ జాతర చూసేందుకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి సుమారు 10.15 గంటలకు ప్రధాన రహదారికి పక్కనున్న సీతాతులసీ సినిమా హాళ్లకు వెళ్లే దారిలో వెళ్తుండగా శుభయోగ ట్రేడర్స్ పెయింట్ షాపు వద్దకు వచ్చేసరికి రాత్రి 10.30 గంటలకు ఎదురుగా వస్తున్న కశింకోట గువ్వాలు, గొన్నాబత్తుల విఘ్నేషు, వెదుళ్ల మోహన్, కొఠారు రవిల్లో ఒకరికి నెట్టి శివ భుజం తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన నలుగురు యువకులు నెట్టి శివపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శివ రోడ్డుపై పడిపోయినా వదలకుండా ముఖంపై మరోసారి దాడికి పాల్పడ్డారు. దీంతో అపస్మారకస్థితికి చేరుకున్న నెట్టిశివను స్నేహితులు ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. అపస్మారకస్థితికి చేరుకున్న శివను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా వైద్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పంపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం శివను అక్కడ్నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. నెట్టి శివ మెదడులో రక్తస్రావమైనందున గత నెల 26వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స చేశారు.అప్పట్నుంచి కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన సోదరుడిపై దాడి చేసిన నలుగుర్ని ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్టు, ఈ మేరకు జరిగిన ఘటనపై మృతుడు నెట్టి శివ సోదరి సంతోషరాణి ఆదివారం యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు పోలీసులు నమోదు చేసినట్టు తెలిసింది. -
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్యాయత్నం
గాజువాక : ప్రేమించిన వ్యక్తితో పోలీసులు పెళ్లి చేయలేదనే బాధతో ఓ యువతి గాజువాక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలమంచిలి ప్రాంతానికి చెందిన సీహెచ్ దుర్గాభవాని అనకాపల్లి ప్రాంతానికి చెందిన వీరయ్యస్వామి అచ్యుతాపురం ప్రాంతంలోని ఒక సంస్థలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత దుర్గాభవాని అచ్యుతాపురంలో పని మానేసి గాజువాకలోని ఒక షాపింగ్ మాల్లో పని చేస్తూ శ్రీనగర్లోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని వీరయ్యస్వామిపై ఒత్తిడి తెచ్చింది. ఏడేళ్లపాటు కలిసి తిరిగిన తరువాత అతడు వివాహానికి నిరాకరించడంతో పాటు మొహం చాటేశాడు. దీంతో దుర్గాభవాని పది రోజుల క్రితం గాజువాక పోలీసులను ఆశ్రయించి తన ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. అయితే పోలీసులు పెళ్లి చేయడంలేదని బాధతో తనతోపాటు తెచ్చుకున్న నెయిల్పాలిష్ను తాగింది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాజువాక సీఐ పార్థసారధి ఆస్పత్రికి వెళ్లి దుర్గాభవానిని విచారించారు. ప్రియుడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామిన పోలీసులు తెలపగా...ఫిర్యాదు చేయడానికి ఆమె ఇష్టపడలేదు. ప్రియుడితో వివాహం మాత్రమే జరిపించాలని కోరింది. ఈ విషయంపై ప్రియుడు వీరయ్యస్వామితో పోలీసులు మాట్లాడుతున్నారు. -
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలి
మహారాణిపేట (విశాఖ): ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్తో కలిసి ఆదివారం ఈ పనులను పరిశీలించిన ఆయన, వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున, అధికారులు సమన్వయం వహించుకుని, నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రధాన వేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్ వసతి వంటి అంశాలపై ఆయన సూక్ష్మ స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చేయాల్సిన పనులపై ఆయన అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడా గ్యాప్ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే జీవీఎంసీ సీఈకి పలు అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై, మార్పులు చేర్పులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీసీపీ మణికంఠ చందోలు, జీవీఎంసీ సీఈ సత్యనారాయణరాజు, సీఎంవో డాక్టర్ నరేష్ కుమార్, సీఐఐ ప్రతినిధి మౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘ఆశ’లు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
● ముగిసిన ఆశ వర్కర్ల రాష్ట్ర మహాసభలు ● ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు కోసం భవిష్యత్తు పోరాటాలకు పిలుపుఅనకాపల్లి: ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో ఆశ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి అన్నారు. స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్నహైస్కూల్ ఎదురుగా కర్రి రమేష్ కల్యాణ మండపంలో యూనియర్ రాష్ట్ర 5వ మహాసభ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ల పై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఈ మహాసభల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశా వర్కర్లుగా గుర్తించాలని, ఆశ వర్కర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలపై జీవోలు విడుదల చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో మహిళలు పనిచేసే విధంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయ వేధింపులు, తొలగింపులు అనేక జిల్లాల్లో జరుగుతున్నాయని వీటిపై కూడా ఉద్యమించాల్సి వస్తుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్న ఉద్యోగులు, కార్మికులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి పెట్టుబడిదారుల సేవలో మునిగి తేలుతున్నాయని అన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తూ అనకాపల్లి జిల్లాలో మరో ప్రైవేటు స్టీల్ ప్లాంట్ను తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు. కార్మికులను ఎనిమిది గంటల పనిని 13 గంటలకు పెంచి శ్రమదోపిడీకి దారులు వేస్తున్నారని, చికాగో పోరాట స్ఫూర్తిని అపహాస్యం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావు , ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఐదో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.మాణిక్యం, డీడీ వరలక్ష్మి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె.పోచమ్మ, పి ధనశ్రీ, వి.సత్యవతి, డి.సుధారాణి, పి.మణి, డి.జ్యోతి, కమల, అమర, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్ పాల్గొన్నారు. -
177కే ఆంధ్ర ఆలౌట్
107 పరుగుల ఆధిక్యంలో తమిళనాడు విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్–ఏ గ్రూప్ మ్యాచ్లో తమిళనాడు జట్టు ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్పై పట్టు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 182 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆదివారం ఓవర్ నైట్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 20 పరుగులతో ఆటను ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తమిళనాడు బౌలర్ల ధాటికి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బ్యాటర్లు భరత్ (12), విజయ్ (3), కెప్టెన్ రికీ భుయ్ (4), కరణ్ షిండే (9), అశ్విన్ హెబ్బర్ (13), రాజు (1) పెవిలియన్కు క్యూ కట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రషీద్ (87 నాటౌట్) ఒక్కడే అద్భుత పోరాటం కనబరిచాడు. సౌరభ్ (30) తో కలిసి కాసేపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డా, మిగిలిన బ్యాటర్లు పృథ్వీ (డకౌట్), సాయితేజ (2) సహకారం అందించకపోవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమిళనాడు జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 5 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆల్రౌండర్ సందీప్ 4 వికెట్లు, త్రిలోక్, సోను, సాయి కిశోర్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ (డకౌట్) నిరాశపరిచినా, మరో ఓపెనర్ విమల్ (20) కొంత సేపు ఆడాడు. బాలసుబ్రమణ్యం (51) అర్ధ సెంచరీతో రాణించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రదోష్ (26), కెప్టెన్ సాయికిశోర్(0 ) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీ, రాజు చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉంది. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలక్ట్రీషియన్ మృతి
తగరపువలస: ఆనందపురం మండలం వేములవలస ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ ఉప్పాడ అప్పలరాము(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై, చికిత్స పొందుతూ కేజీహెచ్లో చనిపోయారు. మృతుడి కుమార్తె భార్గవి ఈ మేరకు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అప్పలరాము వేములవలస కాలనీ నుంచి జాతీయ రహదారిపైకి నడుచుకుంటూ వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొని, మోకాలి పైనుంచి దూసుకుపోయింది. తీవ్రమైన గాయాలతో కిందపడి ఉన్న అతన్ని స్థానికులు గుర్తించి 108 వాహనం సాయంతో కేజీహెచ్కు తరలించారు. అయితే గాయాలకు తాళలేక అప్పలరాము చికిత్స పొందుతూ మరణించారు. ఎస్ఐ శివ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసిసంహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. విశేషంగా నిత్యకల్యాణం : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
సొంత పొలంలో మట్టి తీసుకెళ్తే పన్ను వసూలా?
● మైనింగ్ చెక్ పోస్టులో అక్రమ సీనరేజ్ వసూలుపై ఆగ్రహం ● నిలదీసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు రోలుగుంట: సొంత పొలంలో మట్టిని తవ్వి తీసుకెళ్తే పన్ను వసూలు చేయడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు నిండుగొండ జంక్షన్లో మైనింగ్ చెక్పోస్టులో సీనరీజ్ వసూళ్లపై సంబంధిత సిబ్బందిని ఆయన ఆదివారం సాయంత్రం నిలదీశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మైనింగ్ మాఫియా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపించారు. గ్రామాల్లో తమ సొంత పొలంలో మట్టిని తీసుకెళ్లినా సరే రూ.300 నుంచి రూ.500 వరకు మైనింగ్ చెక్ పోస్టుల్లో సీనరీజ్ వసూలు చేస్తుండడం దారుణమన్నారు. క్వారీల వద్ద వే బిల్లు ఉన్నా.. లేకపోయినా సరే నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ చెల్లింపు బిల్లు ఇవ్వాలన్న నిబంధనలు పాటించకుండా నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. మాఫియాను అరికట్టకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ సీనరీజ్కు సంబంధించిన ఫారంను ఈ సందర్భంగా ఆయన విలేకర్లకు చూపించారు. -
● ఆనందసాగరం..
నాతవరం: తాండవ రిజర్వాయరు సరుగుడు జలపాతం వద్ద సందర్శకులు కార్తీక మాసం ఆదివారం కావడంతోసందర్శకులు సరదగా గడిపారు. తాండవ ప్రాజెక్టు దిగువనున్న నల్లగొండమ్మ తల్లిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అక్కడి పార్క్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. సరుగుడు జలపాతం వద్ద కూడా సందర్శఽకుల తాకిడి కన్పించింది. ఎత్తయిన కొండల నడుమ ప్రవహించే జలపాతంలో పెద్దా చిన్న అనే తేడా లేకుండా జలకాలాడుతూ సందడి చేశారు. మధ్యాహ్నం తాండవ సరుగుడు ప్రాంతాల్లో పలువురు సందర్శకులు సహపంక్తి భోజనాలు చేసి తాండవ ప్రాజెక్ట్లో నీటి అందాలు తిలకించారు. ఎస్.రాయవరం: రేవు పోలవరం తీరంలో పిక్నిక్ పర్యాటకులతో పోటెత్తింది. పరసర ప్రాంతాల వారు ఆదివారం పెద్ద ఎత్తున తీరానికి చేరుకుని సందడి చేశారు. మధ్యాహ్నం వరకు తీరాన్ని ఆనుకుని ఉన్న తోటల్లో సందడి చేసి , సాయంత్రం అయ్యే సరికి తీరం ఇసుక తిన్నెల్లో క్రీడలతో కేరింతలు కొట్టారు,మరికొందరు కెరటాల్లో జలకాలు ఆడి సేద తీరారు.పర్యాటకులకు అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ విభీషణరావు సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. -
వైఎస్సార్సీపీ నేత తాతీలుకు బెయిల్ మంజూరు
● తుపాను సహాయక కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన తాతీలు ● దీంతో అక్రమ కేసు బనాయింపు నక్కపల్లి: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఉద్యమ నేత, వైఎస్సార్సీపీకి చెందిన రాజయ్యపేట మాజీ ఎంపీటీసీ పిక్కితాతీలకు యలమంచిలి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు అరెస్టు చేసి 24 గంటలు గడవక ముందే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం రాత్రి ఆయన విడుదలయ్యారు. మోంథా తుపాను సమయంలో గ్రామస్తులందరికీ భోజన సదుపాయం కల్పించకపోవడంపై పంచాయతీ కార్యదర్శిని పిక్కితాతీలు నిలదీశారు. దీంతో పిక్కితాతీలు,12 మంది తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిక్కితాతీలు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచిన వెంటనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా, బల్క్గ్రడ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న నేతలపై అక్రమ కేసులు బనాయించి ఆందోళనను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మత్స్యకారులపై అక్రమ కేసులు బనాయిస్తోందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. పిక్కితాతీలు తదితరులను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ పరామర్శించారు.పిక్కితాతీలుతో మాట్లాడుతున్న వీసం రామకృష్ణ -
చట్టాలపై అవగాహనతో నేరాల నియంత్రణ
బీసీ మహిళల వసతి గృహంలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జిల్లా పదో అదనపు న్యాయమూర్తి నరేష్ అనకాపల్లి: విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉన్నట్టయితే నేరాలను నియంత్రించవచ్చని జిల్లా పదో అదనపు న్యాయమూర్తి, ఎంఎల్ఎస్సీ జిల్లా చైర్మన్ వి.నరేష్ అన్నారు. మండలంలో గుండాల జంక్షన్ బీసీ మహిళల విద్యార్థినుల వసతిగృహంలో ఆదివారం మండల న్యాయసేవాధికార సంఘం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.ధర్మారావు, వసతి గృహం అధికారి సబిత పాల్గొన్నారు. -
భగవద్గీతతో జీవిత సమస్యలకు పరిష్కారం
మురళీనగర్ (విశాఖ): ప్రతి రోజూ భగవద్గీత పఠనం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఎన్జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చిన్న పిల్లలు భగవద్గీత చదివితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. జ్యోతిష్యం, ఆగమ శాస్త్రాలను తప్పక గౌరవించాలని సూచించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వల్ల పుణ్యం కలుగుతుందని పిలుపునిచ్చారు. మనసును నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేయాలని తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు, ఈవో బి.ప్రసాద్ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ వైభవుడిని దర్శించుకుని పూజలు చేసి, అంతరాలయంలో కాసేపు ధ్యానం చేశారు. బీజేపీ నేత శ్యామలాదీపిక, అర్చకులు శేషాచార్యులు, వాసుదేవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యంపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్: పట్టణంలోని తులసీ సినిమాహాలు ప్రాంతానికి చెందిన చెక్కా సన్యాసిరాజు(శివ), కుమార్తె చెక్కా గౌరీ పార్వతి (22) అదృశ్యమైనట్టు పట్టణ ఠాణాలో ఆదివారం కేసు నమోదైంది. పట్టణంలోని రంగావారి వీధిలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతి ఈ నెల 8వ తేదీ శనివారం రాత్రి 7.40 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి తాను పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నట్టు చెప్పింది. ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద కుటుంబ సభ్యులు వెతికారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనపుడు నీలం రంగు టాప్ ధరించి ఉన్నట్టు, ఆమె తెలుపురంగులో ఉండి 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్నట్టు ఫిర్యాదులో తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కో..అంటే కాసులే..!
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో కోడి పందేలు, జూద క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. గ్రామ జాతరలు, తీర్థాలు పేరిట అధికారం అండతో కూటమి నేతలు జూదాలు, కోడి పందాలు, పొట్టేలు పందాలు, గుండాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. జిల్లాలో యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నర్సీపట్నం, కోటవురట్ల గొలుగొండ, నాతవరం, రోలుగుంట, బుచ్చెయ్యపేట, మాడుగల, దేవరపల్లి మండలాల్లో గ్రామ జాతరలు, తీర్థాల పేరిట కోడి పందాలు, లాటరీ, జూదం,పేకాట, గుండాటతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వాటిని నిలువరించాల్సిన పోలీసులే వారితో కుమ్మక్కై వెనకుండి నడిపిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కోడి పందాలు, పేకాట, గుండాట, లాటరీ గేమ్లకు ఒక్క రోజుకు గానూ రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకూ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం రాంబిల్లి మండలంలో వాడనర్సాపురంలో అభయాంజనేయ స్వామి తీర్థంలో అనధికారికంగా జూద క్రీడలు నిర్వహించారు. వీటి నిర్వహణ కోసం పోలీసులకు భారీగానే మామూళ్లు ముట్టచెప్పినట్టు సమాచారం. స్థానిక కూటమి నేతలే కోడి పందాలు, ఇతర జూద క్రీడలను నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేందుకు సుమారు రూ. లక్ష వరకు మామూళ్లు ఇచ్చినట్టు భోగట్టా. జాతరల్లో విస్తృతంగా కోడి పందాలు.. ఈ నెల 09వ తేదీన ఆదివారం రాంబిల్లి మండలంలో వాడ నర్సాపురం, యలమంచిలి నియోజకవర్గంలో ఏటికొప్పాక గ్రామ జాతరలో విచ్చలవిడిగా కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించారు. అచ్యుతాపురం మండలంలో ఎదురవాడ, నునపర్తి, జగన్నాథపురం, యర్రవరం గ్రామంలో, మడుతూరు గ్రామాల్లో, యలమంచిలి మండలంలో యర్రవరం గ్రామంలో, రాంబిల్లి మండలంలో మామిడాడ కొత్తూరు గ్రామంలో, మునగపాక గ్రామంలో నిర్వహించిన గ్రామ జాతరల్లో కూడా కోడి పందాలు, లాటరీ, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించారు. అదేవిధంగా దసరాకు అచ్యుతాపురం మండలంలో హరిపాలం గ్రామంలో, మాఘపౌర్ణమి నాడు పూడిమడక గ్రామంలో పొట్టేలు పందేలు, కోడి పందాలు, జూద క్రీడలు జరిగాయి. యలమంచిలి మండలంలో జంపపాలెం, సోమలింగపాలెం గ్రామంలో నిత్యం పేకాట, గుళ్లాట తరుచూ జరుగుతూనే ఉండడం గమనార్హం. కూటమి నేతల జూద క్రీడలు.. పలు గ్రామాల్లో అనధికారంగా కోడి పందాలు వాడనర్సాపురం తీర్థం, ఏటికొప్పాక గ్రామ జాతరలో భారీగా పందేలు రూ.లక్షల్లో చేతులు మారినట్టు సమాచారం అంతా.. పోలీసుల కనుసన్నల్లోనే అని ఆరోపణలు -
నూకాంబిక సన్నిధిలో రైల్వే జీఎం దంపతులు
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ ఠాగూర్ దంపతులు, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ అంకుష్ గుప్తా దంపతులుఅనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ ఠాగూర్ దంపతులు , ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ అంకుష్ గుప్తా దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని మొదటిసారిగా కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ల్లో అమ్మవారి చిత్రపటాన్ని రైల్వేశాఖ ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలు మేరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం దేవదాయశాఖ సహాయ కమిషనర్ కెఎల్.సుధారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు) అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాన్ని అందజేశారు. -
సెయింట్ కనకదాస జయంతి
సెయింట్ కనకదాస చిత్రపటం వద్ద నివాళులర్పించిన డీఆర్వో సత్యనారాయణరావుతుమ్మపాల: ప్రముఖ భక్తకవి, తత్వవేత్త సెయింట్ కనకదాస సమాజంలో సమానత్వం, సేవా భావం, భక్తి మార్గాన్ని ప్రజలకు చూపిన మహానుభావుడని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. ఆయన జయంతి వేడుకలను శనివారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కనకదాసు గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ఆలోచనలు ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన తన రచనల ద్వారా కుల వ్యవస్థ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, ప్రజలలో సమానత్వం కోసం కృషి చేశారన్నారు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, యోధుడు, సంగీతకారుడు తత్వవేత్త అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీదేవి, బీసీ సంఘ నాయకులు, హాస్టల్ సంక్షేమాధికారులు పాల్గొన్నారు. -
అక్రమంగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు
● ఎన్ఆర్ఐ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ● పొక్లెయిన్, ట్రాక్టర్ స్వాధీనం, కేసు నమోదునాతవరం: నిబంధనలు ఉల్లఘించి ఎలాంటి అనుమతులు లేకుండా ఏలేరు కాలువ గట్టుపై ప్రభుత్వ భూమిలో ఆక్రమ తవ్వకాలు చేస్తుండడంపై చెర్లోపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ లెక్కల వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలో చెర్లోపాలెం పంచాయతీని ఇదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ లెక్కల వెంకటేశ్వరరావు దత్తత తీసుకుని గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పంచాయతీలో ఉన్న ఏలేరు కాలువ గట్టుపై ప్రభుత్వ భూమిలో గ్రావెల్ ఇసుక మట్టి కొందరు ప్రోత్సాహంతో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. పొక్లెయియిన్తో రాత్రి పగలు అనే తేడా లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరుంచి తవ్వకాలు చేసి వ్యాపారం చేస్తున్నారు. ట్రిప్పర్లు, ట్రాక్టర్లతో రవాణా చేయడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ విషయంపై గ్రామంలో పలువురు లెక్కల వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్వయంగా పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ,పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయా శాఖలు అధికారులు సంయుక్తంగా దాడులు చేయగా పొక్లెయిన్, ట్రాక్టరు పట్టుబడడంతో పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ విషయంపై నాతవరం ఎస్.ఐ వై.తారకేశ్వరరావును వివరణ కోరగా వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై పొక్లెయిన్, ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని తవ్వకందారులపై కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు.ఏలేరు కాలువ గట్టుపై తవ్వకాలు జరిపిన ప్రదేశం ప్రభుత్వ భూమిలో ఇసుక తవ్విన ప్రాంతం -
కొబ్బరి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
బుచ్చెయ్యపేట: మండలంలో గల పొట్టిదొరపాలెం గ్రామంలో కొబ్బరి చెట్టుపై నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలివి. వడ్డాది గ్రామానికి చెందిన ముత్యాల శ్రీను(43) కొబ్బరి కాయలు కొని వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శనివారం పొట్టిదొరపాలెం గ్రామంలో రైతు దగ్గర కొనుగోలు చేయడానికి వెళ్లి కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి కింద పడిపోయాడు. సంఘటన స్థలంలోనే అతను మృతి చెందాడు. ఇతనికి భార్య అమ్మాజీ, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. ఘటనపై బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
10 కిలోల గంజాయితో ఒకరి అరెస్టు
పట్టుకున్న గంజాయితో పోలీసులుగొలుగొండ: కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం మార్గంలో అక్రమంగా బైక్పై గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి హోండా షైన్ నెంబర్ లేని బైక్పై మహారాష్ట్రకు చెందిన ఆకాష్ బైరావ్(26) అనే వ్యక్తి గంజాయి తరలిస్తున్న సమయంలో చిన్నయ్యపాలెం వద్ద పట్టుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడన్నారు. అతని వద్ద నుంచి బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. -
నీటి ప్రవాహంలో ప్రాణాలు అరచేతిలో...
వర్షం వస్తే గిరిజన శివారు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గొర్రిగెడ్డ ప్రవహిస్తే 7 గ్రామాల ప్రజలకు సంబంధాలు తెగిపోతున్నాయి. అధికారులు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత వస్తున్నారు. అయితే నీటి ప్రవాహం వల్ల గ్రామాల్లో గల పాఠశాలలకు ఉపాధ్యాయులు కూడా రాలేదు. ఏటి అవతలి గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యాలి. – దారపర్తి బాలరాజు, మామిడిపాలెం గ్రామం, శంకరం పంచాయతీ, మాడుగుల మండలం పాలకులు పట్టించుకోలేదు.. మా గ్రామం నుంచి రాకపోకలు సాగించడానికి తుఫాన్ వర్షాలు తగ్గిన తర్వాత కూడా మేం ఇబ్బందులు పడుతున్నాం. గత ఏడాది కొత్తవలస గెడ్డ దాటలేక అనారోగ్యంతో యువకుడు మృతి చెందగా, తాడివలస గెడ్డ దాటుతూ గర్భిణి ప్రసవించింది. వర్షాల సమయంలో 108, 104 సర్వీసులు రావడానికి కూడా ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గిరిజన గ్రామాలు సందర్శించలేదు. – జన్ని కన్నయ్య, గ్రామస్తులు తాడి వలస గ్రామం, మాడుగుల మండలం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీలు నెరవేర్చాలి... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హమీని నెరవేర్చాలి. గత ఎన్నికల ముందు ఎక్కడ పది ఇళ్లు వుంటే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలి. గ్రామాలకు రహదారులు, గెడ్డల మీద వంతెనలు నిర్మించాలి – ఉండూరు ఈశ్వరరావు, గ్రామస్తులు, కొత్తవలస, మాడుగుల మండలం -
ఆచరణతో పిల్లల్లో విలువలు ఏర్పాలి
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న రిమ్ జిమ్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి అతిథిగా ది హిందూ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ ఆర్నాల హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలతో విలువల గురించి మాట్లాడడం కాదని, వాటిని ఆచరించడం నేర్పించాలని శ్రీధర్ ఆర్నాల అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల తుని, పాయకరావుపేట, అన్నవరం విద్యార్థులు సుమారు 5500 మందికి సాహిత్యం, సంగీతం, ఆటలు, క్రీడలు, లలిత కళలు, థియేటర్ ఆర్ట్స్, సైన్స్ వంటి అనేక అంశాల మీద 31 రకాల పోటీలు నిర్వహించి శ్రీధర్ ఆర్నాల, జేఎన్టీయు వైస్ ప్రిన్సిపాల్ డా జి.వి.ఎస్.ఆర్ దీక్షితులు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చావేదికలో కృత్రిమ మేధస్సు – తెలివైన సాధనమా లేక ప్రమాదకరమైన ధోరణా? అనే అంశంపై బాల అతిథులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. డా. దీక్షితులు మాట్లాడుతూ వేగవంతమైన సాంకేతిక పురోగతి కారణంగా ప్రపంచ పోకడలు మారుతున్నాయని, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్కరూ మెరుగుపరచుకోవాలని తెలిపారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల నుంచి పొందే ప్రేరణ వెల కట్టలేనిదని అన్నారు. విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధిలోనూ దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఉన్నత స్ధానానికి తీసుకువెళ్లాడానికి ఇటువంటి పోటీల్లో వచ్చిన విజయాలు ప్రేరణ ఇస్తాయని తెలిపారు. అనంతరం అతిథులకు జ్ఙాపికలు బహుకరించారు. విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, రిమ్ జిమ్ కన్వీనర్ నీలాదేవి పాల్గొన్నారు. శ్రీ ప్రకాష్లో ముగిసిన రిమ్ జిమ్ వేడుకలు -
నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఐసీకి భూమి అప్పగింత!
నాతవరం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ జరపకుండా, రైతుల అంగీకారం లేకుండా రెవెన్యూ అధికారులు వాటర్ ప్లాంటు నిర్మాణం కోసం భూమిని ఏపీఐఐసీ అధికారులకు అప్పగించడం భావ్యం కాదని రైతులు శనివారం అవేదన వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న పలు పరిశ్రమలకు నాతవరం మండలం మీదుగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువ నీటిని పైపులైను ద్వారా తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు తరలించేందుకు రూ.340 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో వాటర్ ప్లాంటు నిర్మించేందుకు ఎం.బి.పట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం గ్రామం వద్ద ఏలేరు కాలువను అనుకొని రెండెకరాలు భూమి అవసరమైంది. భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కొందరు రైతుల నుంచి భూమి అంగీకారం తీసుకున్నారు. మరికొందరు రైతులు అక్కడున్న మార్కెట్ రేటు కంటే తక్కువగా ఇవ్వలేమని భీష్మించారు. ఇటీవల కాలంలో ఈ భూమిని అనుకుని క్రయ విక్రయాలు జరిగాయని, ఆ విధంగా రేటు ఇస్తే భూమి ఇస్తామన్నారు. తమకు ఈ భూమి తప్ప మరెక్కడా భూములు లేవని రైతులు ప్రసాద్, పైల సత్యం, ఉమామహేశ్వరరావు తదితరులు అధికారుల వద్డ గోడు వినిపించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రైతులను భయపెట్టి భూములు బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతులు పైల సత్యం, కర్రి ప్రసాద్, కర్రి ఉమా మహేశ్వరరావు, పెదిరెడ్ల రమణమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శనివారం తహసీల్దార్ ఎ.వేణుగోపాల్, సర్వేయరు విజయకుమార్, వీఆర్వో సత్తిబాబు స్వయంగా దగ్గరుండి భూమిని ఏపీఐఐసీ వారికి అప్పగించారు. రెవెన్యూ అధికారులు అప్పగించిన సరిహద్దు ప్రకారం ఆ భూమి చుట్టూ ఏపీఐఐసీ అధికారులు జెండాలు వేసి వాటర్ ప్లాంటు నిర్మించేందుకు మార్కింగ్ పనులకు సిద్ధపడ్డారు. 2018 భూసేకరణ ప్రకారం రేటు ఇస్తే కుదరదని, 2025 సంవత్సరం భూసేకరణ ప్రకారం భూమికి రేటు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మా భూమిలో బలవంతంగా అధికారులు జెండాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ కలెక్టరు ఆదేశాల ప్రకారమే తాము రైతులకు న్యాయం చేస్తామన్నారు. కొందరు రైతులు స్వంతంగా భూమి ఇచ్చారని, కొందరు మాత్రం రేటు అధికంగా కావాలంటున్నారని, అది తమ పరిధిలో లేదన్నారు. రైతులు స్వయంగా ఇచ్చిన భూమిలో ఒక జెండా, భూమి ఇవ్వని రైతుల భూమిలో రెండో రకం జెండా వేశామన్నారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పనులు చేస్తున్నామన్నారు. ఎ.శరభవరం వద్ద వాటర్ప్లాంట్ నిర్మాణానికి భూసేకరణ మార్కెట్ ధర ఇస్తేనే భూములిస్తామంటున్న రైతులు హైకోర్టులో కేసు ఉండగా అధికారులు ఆ భూముల్లో జెండాలు పాతడంపై ఆవేదన -
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
మాకవరపాలెం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. మాకవరపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు అర్హత సాధించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో సాఫ్ట్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న 10 మంది మాకవరపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం నారాయణరావు శనివారం తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు డి.రవి, చంద్రదేవి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. ఎస్.రాయవరం: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మండలం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ధర్మవరం అగ్రహారం ఉన్నత పాఠశాల నుంచి హాకీ పోటీలకు బి.జయశ్రీ, కె.తోనేశ్వరి ఎంపికై నట్టు హెచ్ఎం ఎంఎన్ఎస్ ప్రశాంతి తెలిపారు. కొరుప్రోలు ఉన్నత పాఠశాల నుంచి అండర్–14 విభాగంలో పి.వైష్ణవి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు, 48 కేజీల తైక్వాండో పోటీలకు వై.ఆకాష్ ఎంపికై నట్టు హెచ్ఎం కప్పల ప్రసాద్ తెలిపారు. విజేతలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు. చీడికాడ: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మండలలోని దిబ్బపాలెం ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మోసూరి లీలావతి ఎంపికై నట్టు ఎంఈవోలు బొంజుబాబు, రమణ తెలిపారు. శుక్రవారం విశాఖలో జిల్లా స్థాయి అండర్–14 క్రీడల్లో పాల్గొన్న లీలావతి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ందన్నారు. బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి హైస్కూల్కు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎస్.యమున, ఎస్.లత, జి.లక్ష్మణరావు అండర్–17 విభాగంలో అర్హత సాధించారు. అండర్–14 వాలీబాల్ పోటీలో జి.చంద్రిక సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని హెచ్ఎం, పీఈటీలు తెలిపారు. -
పోర్టుకు వాస్తు పోటు?
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీని వాస్తు దోషం పట్టిపీడిస్తోందంట! ఇటీవల పోర్టులో నెలకొన్న పరిస్థితులతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. పోర్టు మెయిన్ ఎంట్రన్స్ను మార్చడం వల్లే ఈ దోషం చుట్టుకుందని, దీనికి శాంతి పూజలు చేయాలేమోనని మదనపడిపోతున్నారు. ఇటీవల వరుసగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సెక్రటరీ బదిలీ కావడం ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. మరోసారి వాస్తు పోటు తగిలిందనే చర్చ ఇప్పుడు పోర్టు వర్గాల్లో జోరుగా సాగుతోంది. గేటు మార్పు.. వరుస బదిలీలు విశాఖపట్నం పోర్టు అడ్మిన్ బిల్డింగ్కు తూర్పు వైపు, ఈశాన్యంలో ఇన్ అండ్ అవుట్ గేట్లు పక్కపక్కనే ఉండేవి. అయితే చైర్మన్గా డా.అంగముత్తు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆధునికీకరణలో భాగంగా గతంలో మూసేసిన ఆగ్నేయం గేటును అభివృద్ధి చేసి, నెల కిందట ఇన్గేట్గా ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు ఇకపై ఇటునుంచే లోపలికి రావాలని ఆదేశించారు. ఈ గేటు ప్రారంభించిన నెల రోజుల్లోనే చైర్మన్ డా.అంగముత్తు బదిలీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది సర్వసాధారణ బదిలీయే కదా అని కొట్టిపారేయలేమని, దీనికి వాస్తు దోషమే కారణమని పోర్టు ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు వారు మూడు ప్రధాన కారణాలను ఉదహరిస్తున్నారు. పోర్టు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణంగా కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. డా.అంగముత్తు బాధ్యతలు చేపట్టి రెండేళ్లే అయ్యింది. మొదట్లో ఆయన ముంబయి పోర్టుకు బదిలీ కోరినా.. కేంద్రం తిరస్కరించింది. దీంతో ఆయన ఇక బదిలీ కాదని ఫిక్స్ అయ్యారు. అలాంటిది.. ఈ కొత్త గేటు తెరిచిన కొద్ది రోజులకే ఆయనకు ముంబయి బదిలీ కావడం ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తోంది. డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే పదవీకాలం మరో రెండు నెలలు మాత్రమే ఉంది. ఆయన పదవీ పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కానీ, హఠాత్తుగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం, కొత్త డిప్యూటీ చైర్మన్ను నియమించడం చకచకా జరిగిపోయాయి. ఇది కూడా వాస్తు దోషం ప్రభావమేనని ఉద్యోగులు అంటున్నారు. ముచ్చటగా మూడోది.. సెక్రటరీ వేణుగోపాల్ కూడా బదిలీ అయ్యారు. తొలుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ అయినా, వైజాగ్ పోర్టులోనే డిప్యూటీ చైర్మన్గా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కానీ పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ అయ్యారు. ఇలా ముగ్గురు ప్రధాన అధికారులు ఒకే సమయంలో బదిలీ కావడం వెనుక వాస్తు దోషమే ఉందని పోర్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆగ్నేయం వైపు గేటు మార్చినప్పుడు పోర్టులో తీవ్ర ఒడిదొడుకులు ఏర్పడ్డాయని గుర్తుచేస్తున్నారు. గతంలో ఇన్గేట్ను ఆగ్నేయానికి మార్చారు. అప్పుడు ఇన్చార్జ్ చైర్మన్గా ఉన్న సింగ్పై సీబీఐ దాడులు జరిగాయి. ఇది గేటు మార్పు వల్లే జరిగిందని అప్పట్లో ఉద్యోగులు భావించారు. ఆ తర్వాత చైర్మన్గా వచ్చిన అజయ్ కల్లాం ఉద్యోగుల విన్నపం మేరకు ఆ గేటును మూసివేయించారు. అయితే, ఆ తర్వాతి చైర్మన్ కృష్ణబాబు మళ్లీ దక్షిణం వైపు ఉన్న మరో ద్వారం తెరిచారు. అలా తెరిచిన రెండు నెలలకే ఆయన బదిలీ కావడం, ఆ స్థానంలో వచ్చిన ఇన్చార్జి చైర్మన్ రింకేష్ రాయ్పై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనకు కూడా బదిలీ కావడం వంటివి చకచకా జరిగిపోయాయి. అనంతరం వచ్చిన రామ్మోహన్రావు ఈశాన్యం గేటునే యథాతథంగా కొనసాగించగా, అప్పటి నుంచి పోర్టులో ఎలాంటి ఇబ్బందులు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఆగ్నేయం గేటు తెరవడం వల్లే ఉన్నతాధికారులంతా ఒకేసారి బదిలీ అయ్యారని ఉద్యోగులు అంటున్నారు. మరోసారి వాస్తు దోషం చుట్టుకుందని, వెంటనే ఆ గేటును మూసివేసి శాంతి పూజలు చేస్తే తప్ప ఈ దోషం పోదనే వార్తలు పోర్టు వర్గాల్లో చక్కర్లు కొడుతుండటం కొసమెరుపు. 123 బదిలీలంటున్న ఉద్యోగులు -
సమాజానికి సందేశాన్నిచ్చే సినిమాలు రావాలి
● వైఎస్సార్సీపీ నాయకుడు బొడ్డేడ ప్రసాద్ ● మునగపాకలో ఘనంగా ‘మాఊరి వెంకన్న’ప్రీరిలీజ్ ఫంక్షన్ ● ఈ నెల 14న విడుదల కానున్న చిత్రంమునగపాక: సమాజానికి మంచి సందేశాన్నిచ్చే సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మునగపాకకు చెందిన పురోహితుడు వెలవలపల్లి కోటేశ్వరశర్మ నిర్మాతగా రూపొందించిన మాఊరి వెంకన్న చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్లో భాగంగా శనివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గవర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మళ్ల సురేంద్రతో కలిసి ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుడూ శ్రీయజ్ఞ ప్రొడక్షన్పై స్థానిక కళాకారుడైన కోటేశ్వరశర్మ నిర్మాతగా చిత్రీకరించిన మాఊరి వెంకన్న చిత్రం విజయవంతం కావాలని ఆకాక్షించారు. మంచి సినిమాలు తీయాలన్న తపన కోటేశ్వరశర్మతో పాటు చిత్ర దర్శకుడు కోరుకొండ గోపీకృష్ణలో ఉందన్నారు. చిత్ర దర్శకుడు గోపీకృష్ణ మాట్లాడుతూ మునగపాక గ్రామం కళారంగానికి ముద్దుబిడ్డగా చెబుతుంటారన్నారు. అటువంటి గడ్డపై కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పేరిట మాఊరి వెంకన్న సినిమా తీయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు మునగపాకలో నిర్మిస్తున్న వెంకన్న ఆలయమే స్ఫూర్తిగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో మాఊరి వెంకన్న చిత్రం విడుదలవుతుందన్నారు. మునగపాక ఎంపీటీసీ సూరిశెట్టి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ దిమ్మల అప్పారావు, జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, శ్రీధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయి కృష్ణ, డాన్ జిమ్ అధినేత పెంటకోట విజయ్, పెద్దలు దాడి ముసిలినాయుడు, డాక్టర్ బద్దెం సూర్యనారాయణ, కాండ్రేగుల జగ్గారావు, ఎంపీటీసీ–3 బోడకుర్తి గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులపై కేసులు పెట్టడం సరికాదు
పాయకరావుపేట: నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం మత్స్యకారుల పై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం సక్రమమైన పని కాదని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణానికి నిరసనగా కార్యక్రమాలు చేస్తున్న మత్స్యకారుల పై కేసులు పెట్టి భ్రయబ్రాంతుల్ని చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి మత్స్యకారుల్ని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను మత్స్యకారులు ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కె.కోటపాడు : ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 3న విశాఖ కై లాసగిరిలోని పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన అండర్–17 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో కె.ప్రమోదిని, 1500 మీటర్లు, 3000 మీటర్లు పరుగు పందెంలో టి.మాధురి, 1500 మీటర్ల పరుగు పందెంలో ఎల్.ఉమ సత్తా చాటారు. ఈ నెల 6న ఆనందపురం హైస్కూల్లో జరిగిన అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.జాన్ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే జట్టులో సభ్యునిగా ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 22, 23 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గోనున్నట్లు పీఈటీలు కె.చిట్టి ప్రసాద్, తమ్మునాయుడు తెలిపారు. సత్తా చాటిన విద్యార్థులను పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్, ఉపాధ్యాయులు బి.శివప్రసాద్, సూర్రెడ్డి బాబూరావు, పీఎంసీ కమిటీ చైర్మన్ కిల్లి సింహాచలంనాయుడు, సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, ఎంపీటీసీ లెక్కల గౌతమి అభినందించారు. దొండపూడి స్కూల్ విద్యార్థి ప్రతిభ రావికమతం: మాకవరిపాలెం మండలంలో శుక్రవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీల్లో దొండపూడి హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొంకిపూడి కీర్తన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. కీర్తన అండర్ –14 విభాగంలో సాఫ్ట్ బాల్ విభాగంలో సత్తా చాటింది. ఈ మేరకు ఆమెను వ్యాయామ ఉపాధ్యాయుడు సిహెచ్.ఆనంద్, పాఠశాల హెచ్ఎం బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్
కూర్మన్నపాలెం: అగనంపూడి ముఖ్య కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. గాజువాక పైడిమాంబకాలనీకి చెందిన వల్లూరి శ్రీనివాసరావు భార్య రమణమ్మ(48) అగనంపూడిలో పాలబూత్ నిర్వహిస్తోంది. అందువల్ల అగనంపూడిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ కూడా నివాసం ఉంటున్నారు. రమణమ్మ తన వ్యక్తిగత పని నిమిత్తం శుక్రవారం సాయంత్రం కూర్మన్నపాలెం వెళ్లి తిరిగి వస్తున్నారు. సాయంత్రం వేళ అగనంపూడి జంక్షన్లో ఆటో దిగి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచుకొండకు చెందిన సారిక నాగరాజు(48) తన కుమారుడు జవహర్తో కలిసి బైక్పై గాజువాక వైపు వస్తున్నారు. ఈ క్రమంలో జంక్షన్ వద్ద ఆమెను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రమణమ్మ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. బైక్పై నుంచి కిందపడిన తండ్రీకొడుకులు నాగరాజు, జవహర్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జవహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవహర్ వికలాంగుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూచుకొండలో విషాదం మునగపాక: అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చూచుకొండకు చెందిన వడ్డీ వ్యాపారి సారిక నాగరాజు (51) మృత్యువాతకు గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగరాజు విశాఖలో వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం తన బైక్పై కుమారుడు జవహర్తో కలిసి విశాఖ వెళ్లి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకుని తిరుగు ప్రయాణంలో అగనంపూడి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బాటసారిని తప్పించే క్రమంలో నాగరాజు కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న కుమారుడు జవహర్కు గాయాలయ్యాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నాగరాజు మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు -
కూటమి నేతల కబ్జా పర్వం
సందరయ్యపేట పంచాయతీలో జేసీబీతో చదును చేస్తున్న కొండ అనకాపల్లి టౌన్: కూటమి ప్రభుత్వంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, కొండలను ఇష్టానుసారంగా కబ్జా చేస్తున్నారు. మండలంలోని సుందరయ్య పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ పక్కన ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొండను అక్రమార్కులు శుక్రవారం పట్టపగలే జేసీబీలతో తొలిచేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమ భూములుగా భావిస్తూ ఇష్టానుసారంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. -
మా పొలం నష్టం నమోదు నిలిపేశారు..
తుమ్మపాల, శంకరం గ్రామాల పొలాలు కలిసే ఉంటాయి. శంకరం గ్రామంలో ఉన్న మా పొలంతో పాటు సమీపంలో ఉన్న తుమ్మపాలకు చెందిన 1.5 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న వరి పంట తుపానులో పూర్తిగా మునిగిపోయింది. పక్కనే ఉన్న శంకరం పొలానికి నష్టం నా పేరుతో నమోదు చేశారు. కానీ తుమ్మపాల పొలంలో జరిగిన నష్టాన్ని మాత్రం నమోదు చేయకుండా మూడు రోజులు తిప్పించుకున్నారు. చివరకు పొలాలకు నష్టం లేదంటూ నమోదు నిలిపేశారు. – గుమ్మాల సత్తిబాబు, రైతు, శంకరం గ్రామం -
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..!
● కేజిహెచ్లో జనరేటర్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ ధ్వజం దేవరాపల్లి : పేద ప్రజల ప్రాణాల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విశాఖ కేజిహెచ్లో విద్యుత్ సమస్యతో రోగులు పడ్డ ఇబ్బందుల పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ అన్నారు. దేవరాపల్లి మండలం తారువలో శుక్రవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కేజిహెచ్లో అత్యవసర వైద్య సేవలందించే రాజేంద్ర ప్రసాద్, భవన్నగర్, చిన్న పిల్లల వార్డు, గైనిక్ వార్డులలో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, ఇతర రోగులు నరకయాతన అనుభవించారన్నారు. ఈ సమస్యపై కూటమి ప్రజాప్రతినిధులు సహా కూత వేటు దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం కేజిహెచ్ను సందర్శించి సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమన్నారు. వేలా ది మందికి వైద్య సేవలందించే ఆసుపత్రిలో కనీసం జనరేటర్లు ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కేజిహెచ్లో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణ ఘటన జరగలేదని, ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమేనని అన్నారు. పవర్కట్తో ఆక్సిజన్ అందక మహిళ ప్రాణాలు కోల్పోయారని, దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడ ప్రమాదాలు జరిగినా కూటమి ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించి ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని, ఇలాంటివి మానుకోవాలని అనురాధ హితవు పలికారు. -
తక్షణమే ఇళ్లు ఖాళీ చేయలేం..
నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు కోల్పోయిన వారికి పునరావాస కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు సిమెంట్, ఐరన్, వంటి మెటీరియల్ ఉచితంగా గానీ తక్కువ ధరకు గాని ఇప్పించాలని, అలాగే ఇళ్లు ఖాళీ చేసేందుకు ఏడాది సమయం కావాలని పలువురు నిర్వాసితులు కలెక్టర్ను కోరారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చందనాడ, అమలాపురం, బుచ్చిరాజుపేట, డీఎల్ఫురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ పూర్తయి నష్ట పరిహారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించిన గ్రామాల్లో 734 మంది నిర్వాసితులను గుర్తించి వారికి పెదబోదిగల్లం వద్ద కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసిత కాలనీలో ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. వీరందరికీ ఇళ్ల నిర్మాణం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, రూ.8.90 లక్షల నగదు సాయం అందించామన్నారు. బల్క్డ్రగ్ పార్క్ పనులు, స్టీల్ప్లాంట్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాసితులంతా తమ తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన కాలనీలో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. నవంబరు 14 నాటికి ఎంతమంది తమ ప్రాంతాలను ఖాళీ చేసి కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటారో చెప్పాలని ఆయా గ్రామాల ప్రతినిధులకు సూచించారు. దీనిపై నిర్వాసితుల తరపున తళ్ల భార్గవ్, గంటా తిరుపతిరావు, సూరాకాసుల గోవిందు, గబ్బర్సింగ్, లక్ష్మణరావు, కె.శ్రీను తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాసకాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదన్నారు. సిమెంట్, ఐరన్ ఉచితంగా అందజేయాలని కోరారు. ఇంటి నిర్మాణానికి అయ్యే మెటీరియల్ ఖర్చులో 60 శాతం ప్రభుత్వం భరించాలని అన్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలంటే వీలుపడదని అన్నారు. కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మాత్రమే జరిగిందని, లబ్ధిదారులకు ఇప్పటివరకు వాటిని అప్పగించలేదన్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వాడుకనీరు సదుపాయం కల్పించాలన్నారు. ఇవన్నీ పూర్తిచేసిన తర్వాత ఏడాది సమయం ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామన్నారు. నెలా, రెండునెలల్లో ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేయడం కష్టమని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి ఆరుమాసాల సమయం పడుతుందన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో వివాహాలైన ఆడపిల్లలకు ఇప్పటివరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదని తెలిపారు. చాలా మంది ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించలేదని, అలాగే నిర్వాసితుల సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇవేవీ పరిష్కరించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని కోరడం సమంజసం కాదని విన్నవించారు. కలెక్టర్ విజయ్కృష్ణన్ మాట్లాడుతూ సిమెంట్, ఐరన్ హోల్సేల్ ధరలకు ఇప్పిస్తామని, అలాగే ట్రాన్స్పోర్టు ఖర్చుల నుంచి వెసులు బాటు కల్పిస్తామన్నారు. ఉచితంగా ఇప్పించడం సాధ్యం కాదన్నారు. ఇళ్లు ఖాళీ చేసే లబ్ధిదారులు వేరొక చోట అద్దెకు ఉంటే అద్దె మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. నిర్వాసితులు మాత్రం వీలైనంత తొందరగా ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లి నిర్వాసితులతో మాట్లాడి తెలియజేస్తామని ప్రతినిధులు కలెక్టర్కు హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పాల్గొన్నారు. ఏడాది సమయం కావాలి సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇప్పించాలి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ను కోరిన నిర్వాసితులు -
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
పంట నష్ట పరిహారంలో కూటమి ప్రభుత్వం కోత పెడుతోంది. పంట నష్ట పరిహారం కోసం చేసే ఎన్యూమరేషన్ ప్రక్రియ సందర్భంగా క్షేత్ర స్థాయిలో అధికారులపై నష్టం లెక్క తగ్గించాలంటూ ఒత్తిడి తెస్తోంది. జిల్లా తుఫాన్ ప్రభావంతో 15,180 ఎకరాల్లో పంటనష్టం జరిగితే దానిలో భారీగా కోత విధించి 3,452 ఎకరాల్లో పంట నష్టం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ జీవోలో ఇచ్చిన విధంగా 33 శాతం పంట నష్టం తీవ్రతను పరిగణించాలని ప్రకటించినా..క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్ను తగ్గిస్తున్నారు. 50 శాతం పంట నష్టం ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
స్కూల్ బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండాలి
అనకాపల్లి: జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల నిర్వాహకులు రవాణాశాఖ నిబంధనలను పాటించాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్లో నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే స్కూల్బస్ డ్రైవర్లుగా నియమించాలని జిల్లా ఇన్ఛార్జి ఆర్టీవో ఎ.వి.రమణ అన్నారు. జీవీఎంసీ విలీనగ్రామమైన కె.ఎన్.ఆర్.పేట ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యాజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ బస్లు ఫిట్నెస్ను ఎప్పటికపుడు పరిశీలించాలన్నారు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, బస్సులను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా నడపాలని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన పరికరాలను బస్సుల్లో భద్రపరచాలని సూచించారు. బస్ల్లో హ్యాండ్ బ్రేక్, మెయిన్ బ్రేక్, వాహనంపై నాలుగు మూలలు అంబర్ లైట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలో 50 ప్రైవేట్ స్కూల్స్కు చెందిన ప్రతినిధులు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసులో 100 గ్రాముల సొత్తు స్వాధీనం
తాటిచెట్లపాలెం: ద్వారకా క్రైం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని గతంలోనే అరెస్టు చేయగా, అతను తాకట్టు పెట్టిన చోరీ సొత్తును తాజాగా హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ద్వారకా పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ క్రైం ఇన్చార్జి అన్నెపు నరసింహమూర్తి తెలిపారు. సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న గుంటూరు విక్రమాదిత్య వర్మ తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం జూలై 17తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని కొనితివాడకు వెళ్లారు. జూలై 20న తిరిగి వచ్చేసరికి వారి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం గమనించారు. బెడ్రూంలో ఉన్న బీరువాలో ఉంచిన సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు గుర్తించి వెంటనే ద్వారకా క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారకా క్రైం పోలీస్స్టేషన్ సీఐ వి. చక్రధరరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఎస్.రాజు, సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు, మాజీ జవాన్ బసవ కిరణ్కుమార్ దొంగతనం చేసినట్టు గుర్తించి, ఆగస్టు 5న మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకానగర్ ఎస్వీటీ జంక్షన్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. అతనిది శ్రీకాకుళం జిల్లా కాగా.. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత చోరీ సొత్తు గురించి పోలీసులు విచారించినా.. ఫలితం లేకపోయింది. నిరంతర విచారణ ఫలితంగా సుమారు మూడు నెలల తర్వాత నిందితుడు చోరీ సొత్తును హైదరాబాద్లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి, 100 గ్రాముల బంగారు ఆభరణాలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేసిన ద్వారకా సబ్ డివిజన్ సిబ్బందిని సీపీ, డీసీపీ క్రైమ్ అభినందించారు. -
నేటి నుంచి రంజీ సమరం
విశాఖ స్పోర్ట్స్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–ఏ లో భాగంగా ఆంధ్ర జట్టు సొంత గడ్డపై తమిళనాడుతో తలపడనుంది. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ఈ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆట ప్రారంభమై, రెండు సెషన్ల అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎలైట్ గ్రూప్–ఏలో 8 జట్లు పోటీ పడుతుండగా, ఇప్పటికే అన్ని జట్లు మూడేసి మ్యాచ్లు ఆడాయి. ఆంధ్ర జట్టు 9 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్లో ఒడిశాపై ఇన్నింగ్స్ విజయంతో ఆంధ్ర ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా, తమిళనాడు జట్టు 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లతో జార్ఖండ్ అగ్రస్థానంలో ఉండగా, 13 పాయింట్లతో విదర్భ రెండో స్థానంలో ఉంది. ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. రాబోయే మ్యాచ్ల్లో ఆంధ్ర.. తమ కంటే పైన ఉన్న జార్ఖండ్, విదర్భ జట్లతోనే ఆడాల్సి ఉండటం గమనార్హం. రాణిస్తున్న భరత్ : ప్రస్తుత సీజన్లో ఆంధ్ర జట్టుకు విశాఖకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖకు చెందిన రికీ బుయ్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఆశిష్ స్టాండ్–బైగా ఉన్నాడు. కె.ఎస్.భరత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. యూపీతో జరిగిన మ్యాచ్లో 142 పరుగులు, ఒడిశాపై 93 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్లోనూ రాణిస్తూ ఒడిశాతో మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టాడు. అయితే రికీ బుయ్ బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. ఒడిశాపై డకౌట్ కాగా, బరోడాపై 7, యూపీపై 2 పరుగులే చేశాడు. యూపీపై మాత్రం రెండు వికెట్లు తీశాడు. శశికాంత్ ఒడిశాపై 46 పరుగులతో పాటు ఒక వికెట్ తీశాడు. బరోడా, యూపీలపై కూడా తలో వికెట్ సాధించాడు. షేక్ రషీద్ టాపార్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒడిశాపై 140 సాధించి అజేయంగా నిలిచాడు. యూపీపై 136 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ మూడు ఇన్నింగ్స్లలో 127 పరుగులు చేశాడు. త్రిపురాన విజయ్ రెండు మ్యాచ్ల్లో 9 వికెట్లు, సాయితేజ 8 వికెట్లు పడగొట్టారు. ఈ రంజీ మ్యాచ్ను వీక్షించే అభిమానుల కోసం ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. గేట్ నంబర్ 15 నుంచి ప్రవేశించి, ఎం స్టాండ్లో కూర్చుని మ్యాచ్ను వీక్షించవచ్చు. కోచ్ స్టీవ్తో రికీబుయ్, తమిళనాడు కెప్టెన్ జగదీషన్తో ఆంధ్ర క్రికెటర్ -
గురుకులాల్లో పార్ట్ టైం లెక్చరర్స్ తొలగింపు అన్యాయం
స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ చిట్టియ్య నర్సీపట్నం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్టైం ఉపాధ్యాయులను ప్రభుత్వం అకారణంగా తొలగించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ ఎం.చిట్టియ్య పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరలోచన చేయాలని డిమాండ్ చేశారు. పేద వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఈ గురుకులాల్లో కనీస బోధన సదుపాయాలు కల్పించడానికి పార్ట్టైం పేరిట చాలీచాలని జీతాలు చెల్లిస్తూ ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగించడం గురుకుల ఉన్నతాధికారులకు తగదన్నారు. ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీతో పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతుంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల సొసైటీలో కనీసం తొలగిస్తున్నామన్న విషయాన్ని తెలపకుండా ఉపాధ్యాయులను రోడ్డున పడేయడం మంచిపద్ధతి కాదన్నారు. గురుకుల అధికారులు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేని 72 కాలేజీలలో సీనియారిటీ కలిగిన లెక్చరర్స్ని ఇన్చార్జిలుగా నియమించి వారి స్థానంలో ఆయా సబ్జెక్టులు బోధించేందుకు పార్ట్ టైం లెక్చరర్స్ని నియమించారన్నారు. కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న వీరందరినీ తొలగించారన్నారు. వీరికి రావాల్సిన మూడు నెలల జీతాలను సైతం ఇవ్వకుండా కళాశాల నుండి గెంటేసారన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా తక్కువ జీతాలతో పని చేసిన పార్ట్ టైం ఉపాధ్యాయులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకోవాలన్నారు. -
ఉద్యమకారులపై కేసులు తగవు
నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మత్య్సకార నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుపాను సాయం కోసం పంచాయతీ కార్యదర్శిపై దౌర్జన్యం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గ్రామానికి చెందిన పిక్కి తాతీలు, పిక్కి కోటి, రామచరణ్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. బల్క్డ్రగ్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేసేందుకే అట్రాసిటీ కేసుల పేరుతో అరెస్టులు చేస్తున్నారన్నారు.పారా లీగల్ వలంటీర్లకు ఇంటర్వ్యూలు నర్సీపట్నం: మండల్ లీగల్ సర్వీస్ కమిటీ పారా లీగల్ వలంటీర్ల నియామకానికి శుక్రవారం కోర్టు సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి పి.షీయాజ్ ఖాన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరందరినీ ఎంపిక చేసినట్టు జడ్జి ప్రకటించారు. ఈ ఇంటర్వ్యూలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టా ప్రభాకర్రావు ఉన్నారు.అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం అనకాపల్లి టౌన్ : మండలంలోని జాతీయ రహరారి కోడూరు జంక్షన్ వద్ద అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. యలమంచిలి జయబాబు పలు గ్రామాలలో సేకరించిన 12 బస్తాల్లోని 600 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఆ 12 గంటలు ఏం చేశారు.?
గత ప్రభుత్వ హయాంలో ప్రగతి పథంలో కేజీహెచ్ సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ అమరావతిలో ఉన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. సీఎస్ ఆర్ఎంవో, ఆర్ఎంవోలు.. ఎవరి పని వారిదే అన్నట్లుగా వదిలేశారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడ్డారు. అప్పుడే పుట్టిన శిశువులు అవస్థలు ఎదుర్కొన్నారు. బాలింతలు బాధలనుభవించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతున్న రోగులు నరకం చూశారు. ఆక్సిజన్ అందక శ్వాస కోసం ఆపసోపాలు పడ్డారు. దాదాపు 12 గంటల పాటు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని చీకట్లో మగ్గింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు..? దీన్నిబట్టి చూస్తే పేదల వైద్యం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో అవగతమవుతుంది. జనరేటర్లు ఏమయ్యాయి.? ప్రస్తుతం కేజీహెచ్లో 5 జనరేటర్లు ఉన్నాయి. వాటిని అత్యవసర వైద్య విభాగాలకు మాత్రమే అన్నట్లుగా వినియోగిస్తుంటారు. భూగర్భ కేబుల్ విద్యుత్ కనెక్షన్ కట్ అవ్వడంతో అనేక వార్డులు అంధకారంలో ఉన్నాయి. భావనగర్ వార్డు, మార్చురీ, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లలవార్డు, గైనిక్ వార్డు.. ఇలా అనేక వార్డుల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 5 జనరేటర్లు ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఈ వార్డుల్లో ముఖ్యమైన వాటికి వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ కేజీహెచ్ అధికారులు అలా చేయలేదు. ఈ ఐదింటిలో రెండు జనరేటర్లు సరిగా పనిచేయడం లేదని మోంథా తుపాన్ సమయంలో గుర్తించారు. వాటిని కూడా సరిచేయలేదని తెలుస్తోంది. జనరేటర్లు అద్దెకు తీసుకోలేదెందుకు..? ఆస్పత్రిలో ఏదైనా అత్యవసరం అయినప్పుడు సొంత నిధులు ఖర్చు చేసి.. జనరేటర్లు తీసుకువచ్చేందుకు వెసులుబాటు ఉంది. కానీ కేజీహెచ్ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోలేదు. సూపరింటెండెంట్ డా.వాణి కోర్టు పనిమీద అమరావతి వెళ్లిపోయారు. తర్వాత స్థానంలో ఉన్న అధికారులు చొరవ తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు కూడా సాయంత్రం వరకు సమాచారం ఇవ్వలేదు. జనరేటర్లు అద్దెకు తీసుకోవడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ అనుమతి ఉంటే సరిపోతుంది. కానీ దానికి కూడా ప్రయత్నించకుండా రోగుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. అద్దెకు జనరేటర్లు ఎందుకు తీసుకోలేదంటే తమ పరిధిలో లేదంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అధికారుల మధ్య పొరపొచ్చాలే కారణమా..? కేజీహెచ్లో ఉన్నతాధికారులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి గ్రూపు రాజకీయాలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే జనరేటర్లను అద్దెకు తీసుకురాలేదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా 12 గంటల పాటు కేజీహెచ్లో చీకట్లు కమ్ముకున్నాయి. ముఖ్యంగా పిల్లల వార్డులో చిన్నారులు, ఇంక్యుబేటర్స్లో చికిత్స పొందుతున్న నవజాతశిశువులు నరకయాతన అనుభవించారు. బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ అందక భావనగర్, రాజేంద్రనగర్ వార్డులో వెంటిలేటర్లు, ఆక్సిజన్పై చికిత్స పొందుతున్న వారంతా అవస్థలు పడ్డారు. కేజీహెచ్పై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం..! కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వ వైద్యంపై శీతకన్ను వేసింది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో వైద్య సిబ్బంది నియామకాన్ని గాలికొదిలేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కేజీహెచ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఓపీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. మందులు కూడా సరిపడా సరఫరా చేయకపోవడంతో పేదలంతా బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఓవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్రపన్నుతూ.. మరోవైపు కేజీహెచ్ వంటి వైద్య శాలలపైనా నిర్లక్ష్యం వహిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగితే.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గుండె ఆపరేషన్లు ఆగిపోయాయంటే.. పేదోడి వైద్యంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై వైఎస్సార్సీపీ విమర్శల దాడి చేస్తే మళ్లీ ఇటీవలే ఆపరేషన్లు మొదలు పెట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు విద్యుత్ పునరుద్ధరణ కేజీహెచ్లో మంచినీటి పైపులైన్ నిర్వహణలో భాగంగా ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ బ్లాక్ సమీపంలో పనులు చేస్తున్న సమయంలో యూజీ కేబుల్ కట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న తర్వాత కేబుల్ పోయిన ప్రాంతాన్ని గుర్తించి కేబుల్ను జాయింట్ కిట్ ద్వారా మరమ్మతులు చేపట్టామని ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యామ్బాబు తెలిపారు. పాడైపోయిన కేబుల్ను సరిచేసి రాత్రి 11.45 గంటలకు పనులు పూర్తి చేశామనీ.. 12 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని విభాగాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఎస్ఈ వెల్లడించారు. సెల్ఫోన్ వెలుగులో రోగులకు వైద్యంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రగతి పథంలో పరుగులు తీసింది. ఎన్నో కార్యక్రమాల ద్వారా పేదలకు అత్తుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేసింది. గత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించగా ప్రభుత్వం మారే సమయానికి రూ.60 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. సీఎస్ఆర్ బ్లాక్ పూర్తిచేసి 200 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రిటికల్ కేర్ యూనిట్తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునికీకరణ చేపట్టింది. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటిల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్స్, అందుబాటులోకి కేన్సర్ కేర్ యూనిట్, అందులో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసింది. ఒక్క కేజీహెచ్కే కొత్తగా 8 అంబులెన్స్లు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునికీకరణ, కనీసం 200 మంది ఉండేలా వెయిటింగ్ హాల్స్ను తీర్చిదిద్దింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో అదనంగా మరో క్యాజువాలిటీని రూ.30 లక్షలతో నిర్మించింది. లేబొరేటరీ, మొబైల్ ఎక్స్రే యూనిట్, ఆల్ట్రా స్కానింగ్ సిద్ధం చేసింది. కీలకమైన కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షలతో ఆధునికీకరించింది. ఐసీసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, 120 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే కేజీహెచ్ చరిత్రలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. గుండె జబ్బుల నియంత్రణ కోసం స్టెమీ ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన ద్వారాన్ని రూ.30 లక్షలతో గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అయితే ఎన్నికల తర్వాత ఈ పనులు పూర్తయ్యాయి. కేజీహెచ్లో అంధకారంపై సర్వత్రా విమర్శలు విద్యుత్ సరఫరా లేనప్పుడు జనరేటర్లు ఎందుకు తీసుకురాలేదు.? ఉన్న జనరేటర్లు పనిచేయట్లేదని తెలిసినా చర్యలు శూన్యం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేజీహెచ్ అధికారుల వైఫల్యం గత వైఎస్సార్ సీపీ హయాంలో కేజీహెచ్కు కొత్త రూపు కూటమి వచ్చిన తర్వాత పేదల వైద్యంపై నిర్లక్ష్యపు పడగ -
పాఠశాలల్లో సదుపాయాల పరిశీలన
కశింకోట: టెన్త్ పరీక్షలు నిర్వహించే డీపీఎన్ జెడ్పీ హైస్కూలు, బాలికల హైస్కూళ్లను శుక్రవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎ. శ్రీధర్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో డెస్కులు, బెంచులు, విద్యుత్, తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. చేశారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ప్రసాద్, ఎంఎస్ స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏయూలో తత్కాల్ విధానం రద్దు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 28 బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. కారుణ్య నియామకాల కింద 40 మంది విశ్వవిద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. ఏయూ సెనేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. విద్యార్థుల సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, ఇకపై సాధారణ రుసుముతోనే వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. పాత స్పెషల్ ఎగ్జామినేషన్ స్థానంలో రెండు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఒకే సబ్జెక్ట్లో తప్పిన విద్యార్థుల కోసం ఇనిస్టెంట్ పరీక్ష, దశాబ్ద కాలంగా పరీక్షలు రాయడానికి వేచి చూస్తున్న అభ్యర్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా కెరీర్ ప్లానింగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వీసీ వెల్లడించారు.మౌలిక వసతుల కల్పనలో భాగంగా 350 కంప్యూటర్లను త్వరలో కొనుగోలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. సీ4ఐ4 ల్యాబ్, ఎలిమెంట్ భవనంలో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. పూర్వోదయ పథకంలో హాస్టల్ భవనాల నిర్మాణం కోసం రూ.170 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఏయూ వైద్యశాలలో నూతనంగా వైద్యులు, కన్సల్టెంట్ వైద్యులు, ఫార్మసిస్ట్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని, అదనపు పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అలాగే బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నివారించేందుకు క్యాంపస్లో సెక్యూరిటీని మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సౌత్ క్యాంపస్లో కొన్ని ద్వారాలను మూసివేస్తామన్నారు. పూర్వ విద్యార్థుల అనుసంధానం(ఆలుమ్ని ఎంగేజ్మెంట్) కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ నెల 11న పాడేరులో ‘ఏయూ గ్రామీణ అనుసంధానం’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో 1,500 క్యాడెట్లతో ఈ నెల 23న బీచ్రోడ్డు కన్వెన్షన్ సెంటర్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
బల్క్డ్రగ్ పార్క్ రద్దు చేయాలి
నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్ను వెంటనే రద్దుచేయాలని ఏపీ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో నిరాహారదీక్ష చేస్తున్న మత్స్యకారులకు గురువారం రైతుకూలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతుకూలీ సంఘం జిల్లాకార్యదర్శి కోన మోహన్రావు, నవయువ సమాఖ్య జిల్లాకన్వీనర్ ఎన్.భాస్కరరావు మాట్లాడుతూ 1,276 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 53 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ ఆందోళనలో స్థానిక మత్స్యకారులు సోమేష్, స్వామి, మహేష్, బాబ్జి, అప్పలరాజు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న స్పీకర్
మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధ్వజం అనకాపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అక్రమ కేసులు పెట్టిస్తూ శునకాందనం పొందుతున్నారని ఆ పార్టీ నర్సీపట్నం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధ్వజమెత్తారు. గురువారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో మాకవరపాలెం, నర్సీపట్నం టౌన్ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాకవరపాలెం మండలం బయ్యవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుకల శ్రీనివాసరావు ఆ గ్రామ వీఆర్వో దగ్గరకు వెళ్లి వైఎస్సార్సీపీ ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే ...టీడీపీ నాయకుడు లాలం సీతారామతేజ దాడి చేశాడని చెప్పారు. వీఆర్వోపై స్పీకర్ ఒత్తిడి తెచ్చి మా నాయకుడు పై అక్రమ కేసు కూడా పెట్టించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. మాకవరపాలెం ఎస్ఐ మా పార్టీ నాయకుడును ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సంఘటన నవంబర్ ఒకటో తేదీన జరిగితే...2వ తేదీ రాత్రి 8 గంటలకు అంటే 33 గంటల తర్వాత కేసు పెట్టారన్నారు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన రోజు నుంచి 5 వ తేదీ వరకూ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మాకవరపాలెం పోలీసు స్టేషన్లో శ్రీనివాసరావును ఉంచి, వేధించారని తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీనివాసరావును మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని, అయితే అదే రోజు పీవీఆర్ థియేటర్ ముందు వీఆర్వో, టీడీపీ నేతలపై శ్రీనివాసరావు దౌర్జన్యం చేసినట్లు మరో కేసు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారని చెప్పారు. స్టేషన్లో ఉన్న వ్యక్తి ఇంకో దగ్గరకు వెళ్లి దౌర్జ న్యం చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. పోలీసులు రోజూ స్టేషన్కు వచ్చి డ్యూటీ చేయడం లేదని, మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుని అయ్యన్నపాత్రుడు ఎవరిపై కేసు పెట్టమని చెబితే వారిపై కేసులు నమోదు చేసి వేధించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. మాకవరపాలెం, నర్సీపట్నం టౌన్ పో లీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. రానున్నది మా ప్రభుత్వం...ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధి స్తున్న అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
సభ్యుల సొమ్ము ‘గోవిందా’!
సాక్షి, విశాఖపట్నం: వచ్చిన జీతంలో కొంత మొత్తం దాచుకుంటే భవిష్యత్లో ఉపయోగపడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ, తాము దాచుకున్న సొమ్ములు సొసైటీ డైరెక్టర్లకు ఉపయోగపడుతున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీలో కొందరు డైరెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకుని, తమ జేబులు నింపేసుకున్నారు. సభ్యులకు తెలీకుండా ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల వరకు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ సర్కిల్ పరిధి సొసైటీలోని మాజీ డైరెక్టరే ఈ స్వాహా పర్వానికి మూలకారకుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడిట్కు ఫిర్యాదు చేసినా.. మేనేజ్ చేసుకుంటూ దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈపీడీసీఎల్లో ఉద్యోగులంతా కలిసి ఓ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మూడు విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్లు ఉన్నాయి. అవి విశాఖపట్నం సర్కిల్, గాజువాక, గోపాలపట్నం. ఒక్కో బ్రాంచ్ సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ బ్రాంచ్లలో గాజువాక శాఖ అతి పెద్దది. ఇందులో ఈపీడీసీఎల్తో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే, గత నాలుగేళ్లుగా విశాఖపట్నం ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఉన్న సొసైటీ బ్రాంచ్ ఆఫీస్ నుంచి సభ్యుల సొమ్ములు స్వాహా అవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్రాంచ్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఉద్యోగుల సొమ్ముని గుట్టుగా స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో సభ్యుడి పేరుతో రూ.15 లక్షలకు పైగానే.! ఈపీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్ హోదాలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి గతంలో సొసైటీలో ఒక డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సమయంలోనే సభ్యుల పేరుతో సొమ్ములు గోవిందా.. గోవిందా అంటూ ఆరగించేసినట్లు తెలుస్తోంది. సొసైటీలో ఉన్న ఒక్కో సభ్యుడి పేరుతో సదరు డైరెక్టర్ రూ.15 లక్షలకు పైగా రుణాలు తీసుకొని, సొంతంగా వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా సభ్యులు ఈ డైరెక్టర్ బాధితులుగా మారినట్లు సమాచారం. రుణాలు తీసుకొని ఎంచక్కా.. డైరెక్టర్ పోస్టు నుంచి తప్పుకుని ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవల కొంత మంది సభ్యులు తమ డివిడెంట్లు, షేర్ క్యాపిటల్ ఫండ్స్, ఇతరత్రా ఆదా చేసిన డబ్బులు గురించి ఆరా తీస్తున్న సమయంలో అప్పటి డైరెక్టర్ బండారం ఒక్కొక్కటిగా బయటపడినట్లు సమాచారం. ఈ విషయంపై సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు కొందరు బాధిత సభ్యులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఆర్థిక మోసం బయటకు రాకుండా గోప్యంగా ఉంచాలనీ, ఎలాగైనా కొల్లగొట్టిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తామంటూ వారు హామీ ఇచ్చారు. సభ్యులు మాత్రం.. తమకు నమ్మకం లేదనీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో ఉద్యోగాల పేరుతో మోసం సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని సొంత ఖాతాకు మళ్లించుకున్న సదరు మాజీ డైరెక్టర్పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశారు. దాదాపు రూ.5 కోట్ల వరకు వసూళ్లు చేసిన డైరెక్టర్పై అప్పట్లో కేసులు నమోదవ్వడంతో.. విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. అయినా తన వక్రబుద్ధిని వదులుకోలేకపోతున్న ఆయన.. సొంత డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సొమ్మునూ వదల్లేదు. ఇలాంటి వ్యక్తికి అప్పట్లో డైరెక్టర్ పదవిని ఎందుకు కట్టబెట్టామా అంటూ సొసైటీ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. సొసైటీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
వసతి గృహంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
కె.కోటపాడు: జీనబాడు జీటీడబ్ల్యూఏ బాలికల వసతిగృహం పరిసరాల్లో పరిశుభ్రత పాటించేలా వసతిగృహ సిబ్బందికి సూచనలు చేయాలని పినకోట పీహెచ్సీ వైద్య సిబ్బందికి అల్లూరి జిల్లా మలేరియా అధికారి తులసి సూచించారు. జీనబాడు వసతిగృహనికి చెందిన ముగ్గురు విద్యార్థినులు కృష్ణవేణి, ప్రమీల, శ్రీవేణి దేవి జ్వరాలతో బుధవారం రాత్రి దేవరాపల్లి పీహెచ్సీ వైద్యం కోరకు వచ్చారు. వీరికి ప్రథమ చికిత్సను అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. ఆసుపత్రిలో గురువారం ముగ్గురు విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించగా సాధారణ జ్వరాలు నివేదిక వచ్చినట్లు మలేరియా అధికారి తులసికి మలేరియా సబ్ యూనిట్ అధికారి బాబూరావు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థినులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఎన్వీబీడీసీపీ జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాస్, ఏఎంవో ఎ.జె.సత్యనారాయణ, వైద్యాధికారి వెంకటేష్ పాల్గొన్నారు. -
చిత్ర దర్శకుడు అనిల్
గ్రామీణ నేపథ్యంలో ‘రోలుగుంట సూరి’ సబ్బవరం: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రోలుగుంట సూరి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చిత్ర దర్శకుడు అనిల్ పళ్ల తెలిపారు. సబ్బవరంలోని సీతారామ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న 100 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతందని, ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో హీరోగా నాగార్జున పళ్ల, హీరోయిన్లుగా ఆద్యారెడ్డి, భావన నటించినట్లు తెలిపారు. విలన్ పాత్రలో బ్రహ్మానంద రెడ్డి చక్కని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తాను హీరోగా పరిచయమవుతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్ర దర్శకుడిది సబ్బవరం మండలం చినగొల్లలపాలెం. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన పళ్ల తాతారావు, మల్లునాయుడులేనికి చెందిన ఆరిపాక ప్రసాద్, కె.సంతోష్ కుమార్, పళ్ల సత్యనారాయణ, రోమాల చంద్రశేఖర్ తదితరులకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. -
బస్సు వెనుక భాగంలో పొగలు
ఆందోళనకు గురైన ప్రయాణికులు మునగపాక: మండల కేంద్రం మునగపాకలో ఓ ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనకాపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గురువారం ఉదయం అనకాపల్లి నుంచి రాంబిల్లి మండలం కొత్తపట్నం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ప్రయాణికులతో అనకాపల్లి వస్తుండగా మునగపాక జంక్షన్ పీఏసీఎస్ ఎదురుగా వద్ద బస్సు వెనుక భాగాన టైరుకు సమీపంలో యాక్సిల్ బాగా వేడెక్కడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులను కిందకు దించేశారు. యాక్సిల్ వేడి టైరు తగలడంతో పొగలు రావడంతో పాటు వాసన వచ్చింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
చీకట్లు
కేజీహెచ్లోఅధికారుల నిర్లక్ష్యం.. రోగులకు శాపంమహారాణిపేట : ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య సంజీవని కేజీహెచ్లో గురువారం రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. ఎటుచూసినా అంధకారం అలముకుంది. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఈ దుస్థితి దాపురించింది. యూజీ కేబుల్ కట్ అయ్యి.. సరఫరా నిలిచిపోయినా కేజీహెచ్ అధికారులు రాత్రి వరకు గంటల వరకూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకుండా వదిలేశారు. ఏమైందంటే? గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మార్చురీ సమీపంలో ఓ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ భూగర్భ కేబుల్ ఉందనే హెచ్చరికలు ఉన్నా.. కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. నిర్మాణ పనులు చేస్తున్న వారినీ హెచ్చరించలేదు. ఫలితంగా యూజీ కేబుల్ విద్యుత్ వైర్లు కట్ అయ్యాయి. ఈ కేబుల్ తెగిపోవడంతో సబ్ స్టేషన్కు వెళ్లే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి వరకు స్పందన లేదు ! మధ్యాహ్నం సరఫరా నిలిచిపోయినా అధికారులు సత్వరమే స్పందించకపోవడంతో అర్ధరాత్రి వరకూ అవస్థలు పడాల్సి వచ్చింది. సాయంత్రం సమయంలో ఈపీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పునరుద్ధరణ పనులు చేపట్టడం ప్రారంభించారు. సాధారణంగా యూజీ కేబుల్ వెళ్లిన మార్గంలో ఏవైనా తవ్వకాలతో కూడిన పనులు జరిగినప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. కానీ కేజీహెచ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా రోగుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశారు. జనరేటర్లు పనిచేయడం లేదు? కేజీహెచ్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యుత్ సరఫరా కోసం భారీ సామర్థ్యం ఉన్న జనరేటర్లున్నాయి. కానీ గత కొద్ది నెలలుగా ఈ జనరేటర్లు పనిచేయడం లేదు. ఇటీవల మోంథా తుఫాన్ సందర్భంగా ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన సమయంలో జనరేటర్లను త్వరితగతిన సరిచేయాలని ఆదేశించారు. అయినా సదరు జనరేటర్ కాంట్రాక్టర్పై కనీస చర్యలు తీసుకోలేదు సరికదా.. వాటిని బాగుచేయమని కూడా కేజీహెచ్ అధికారులు ఆదేశించకపోవడం గమనార్హం. ఆ రోజే ప్రభుత్వం మేల్కొని జనరేటర్లను బాగుచేసి ఉంటే.. ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. జనరేటర్ల పనితీరుపై ఆరోపణలు వస్తున్నా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కారణంగానే యూజీ కేబుల్ కట్ అయి.. సరఫరా నిలిచిపోయినా ప్రత్యామ్నాయం చూడలేకపోయారు. కనీసం అద్దైకె నా జనరేటర్ తెచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచన రాకపోవడం విడ్డూరం. అర్ధరాత్రి వరకూ కేజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర నాయుడు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యామ్ బాబు పర్యవేక్షణలో మరమ్మతులు చేపట్టారు. -
48 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: అచ్చర్ల జంక్షన్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అల్లు స్వామి నాయుడు తెలిపారు. దీనిని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం దుచ్చిర్తి గ్రామానికి చెందిన అక్కపల్లి సుధాకర్ (36)ను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రవాణాకు వినియోగించిన కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తమ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిని అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
లారీ ఢీకొని రైతు దుర్మరణం
యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణానికి సమీపంలో కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద గురువారం రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో రైతు మృతి చెందాడు.ఎస్ రాయవరం మండలం సర్వసిద్దికి చెందిన అడబాల సాయిరాం(59), అతని అల్లుడు దాసరి గోవింద్తో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై యలమంచిలి మీదుగా అనకాపల్లి వెళ్తున్నారు. కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డు నుంచి 16వ నంబరు జాతీయ రహదారికి వీరు ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు దాటుతున్న సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపునకు వెళ్తున్న ఏపీ27వి 7265 రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన లారీ, ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ బోల్తా పడి వెనుక కూర్చున్న అడబాల సాయిరాం రోడ్డుపై పడ్డాడు. అతని శరీరంపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర రక్తగాయాలైన సాయిరాం ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న మృతుడి అల్లుడు దాసరి గణేష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. దాసరి గణేష్ ఈ ప్రాంతంలో ఆర్ఎంపీగా సేవలందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. డ్రైవర్ అధిక వేగంతో నిర్లక్ష్యంగా లారీని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సాయిరాం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. కాగా కొక్కిరాపల్లి హైవే కూడలి ప్రాంతంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వాహనచోదకుల్లో నెలకొంది. -
సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు
మురళీనగర్(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వార్షిక పరీక్షలు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫ్యాషన్ డిజైన్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి కోర్సులో శిక్షణ తీసుకున్న 2024–25 బ్యాచ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్, స్టూడెంట్స్ అఫైర్స్ కోఆర్డినేటర్ ఎస్.వి.రమణ గురువారం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. -
ఆరు లేన్లుగా జాతీయ రహదారి
నక్కపల్లి: ప్రస్తుతం నాలుగు లేన్లగా ఉన్న 16 వ నంబరు జాతీయరహదారిని ఆరులేన్లగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఈ రహదారి విస్తరణకు నేషనల్ హైవేఆథారిటీ ఆఫ్ ఇండియా రూ.3,800 కోట్లతో రూపొందించిన డీపీఆర్కు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ కూడా ఈ జాతీయరహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఎప్పుడో బ్రిటీష్ వారి హయాంలో కోల్కతా, చైన్నె మధ్య సింగిల్ రోడ్డుగా ఏర్పాటు చేసిన ఈ రహదారిని 30 ఏళ్ల కిందట నాలుగు లేన్లుగా విస్తరించారు. దీంతో కోల్కతా, చైన్నె మధ్య, ఆంధ్రా సరిహద్దు అయిన ఇచ్ఛాపురం నుంచి అటు తమిళనాడు సరిహద్దులో ఉన్న తడ వరకు రాకపోకలకు కొంత సులభతరమైంది. ప్రయాణ సమయం కూడా తగ్గింది. అయితే రవాణా సమయాన్ని మరింత తగ్గించడంతోపాటు, ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం నాలుగు లేన్ల రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు చేపట్టింది. ఇప్పటికే రాజమండ్రినుంచి విజయవాడ వరకు ఆరులేన్ల విస్తరణ పనులు పూర్తయ్యాయి. అనకాపల్లి నుంచి ఇచ్ఛాపురం వరకు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ఆరులేన్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అనకాపల్లినుంచి రాజమండ్రి మధ్య మిగిలిన పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఈ విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లినుంచి తుని వరకు 68.645 కిలోమీటర్లు, కాకినాడ జిల్లాలో తుని నుంచి రాజమండ్రి సమీపంలో ఉన్న దివాన్ చెరువు వరకు (పత్తిపాడు, జగ్గంపేట,రాజానగరం మండలాలను కవర్చేస్తూ) 81 కిలోమీటర్లు, దివాన్ చెరువు నుంచి రాజమండ్రి పట్టణాన్ని కవర్చేస్తూ మరో 11 కిలోటర్ల వరకు ఆరులేన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి విస్తరణ కోసం రూ.3,800 కోట్లలో డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతో ఆమోదం లభించినట్లు తెలిసింది. అనకాపల్లి, తుని సెక్షన్లో(67), అలాగే తుని రాజమండ్రి సెక్షన్ల మధ్య(103)పైప్ కల్వర్టులు, బాక్స్కల్వర్టులు, మేజర్ బ్రిడ్జిలు, మైనర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఈ రెండు సెక్షన్ల మధ్య ఉన్న పాతబ్రిడ్జిలకు మైనర్, మేజర్ మరమ్మతులు కూడా చేపట్టనున్నట్లు డీపీఆర్లో పేర్కొన్నారు. అవసరమైన చోట్లకొత్త వంతెను, అప్రోచ్రోడ్లను నిర్మించనున్నట్లు తెలిసింది. వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయించాలి జాతీయరహదారి పై రాకపోకలు బాగా పెరిగాయి. నాలుగులేన్లుగా ఉన్న ప్రస్తుత రోడ్డుపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రోచ్రోడ్లు, బెర్మ్లు కూడా సరిగా లేవు. ఈ రోడ్డును ఆరులైన్లుగా విస్తరిస్తే ప్రయాణ సమయం ఆదాకావడంతోపాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వాహనదార్లకు నిర్వహణ ఖర్చుకూడా తగ్గుతుంది.రోడ్డువిస్తరణ సందర్భంగా వాహనాల పార్కింగ్కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి డ్రైవర్లకు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. –పోతంశెట్టిబాబ్జి, నక్కపల్లి వ్యాపారులకు నష్టం లేకుండా చూడాలి వ్యాపారులకు నష్టం లేకుండా మండల కేంద్రం నక్కపల్లిలో ఆరులేన్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి. మండల కేంద్రాన్ని నమ్ముకుని చాలా మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు.నక్కపల్లిలో బైపాస్ నిర్మిస్తే వీరంతా ఉపాధి కోల్పొయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేపట్టాలి. –ఎల్లేటిసత్తిబాబు, నక్కపల్లి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ఖర్చు వేంపాడు టోల్ప్లాజా లెక్కల ప్రకారం అనకాపల్లి నుంచి రాజమండ్రి మధ్యలో ప్రతిరోజు అన్నిరకాల వాహనాలు కలిపి 15వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయరహదారి ఆరులేన్లుగా విస్తరణపూర్తయితే, శ్రీకాకుళం నుంచి విజయవాడ, అక్కడనుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ప్రయాణ సమయం మరింత తగ్గడంతోపాటు, రోడ్డుప్రమాదాలు తగ్గేఅవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, రాజమండ్రి మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. దీంతో వాహనాలు వినియోగించే పెట్రోలు, డీజిల్, వాహనాల నిర్వహణ ఖర్చు ఆదా అవుతాయి. వాహనాల యజమానులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుంది. అయితే విస్తరణలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉంది. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రం నక్కపల్లి పట్టణంలో ఆరులేన్ల విస్తరణకు భూసేకరణ జరపాల్సి ఉంటుంది. బైపాస్రోడ్డు నిర్మిస్తారా, లేక ఫైఓవర్ నిర్మిస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. పట్టణంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను, నివాస ప్రాంతాలను సేకరించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. దీంతో నక్కపల్లిలో బైపాస్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వెదుళ్లపాలెం నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు గురుకుల పాఠశాల వెనుక భూసేకరణ జరిపి ఆరులైన్లు రోడ్డు నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే కశింకోట, నర్సింగపల్లి ప్రాంతాల్లో కూడా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లను, వాణిజ్య సముదాయాలను ఖాళీచేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో నాలుగు భారీ వంతెనలు అనకాపల్లి, రాజమండ్రి మధ్య విస్తరించే ఈ ఆరులేన్ల రహదారి మధ్యలో అనకాపల్లి జిల్లాలో నాలుగు మేజర్ వంతెనలు, మూడు ఫ్లైఓవర్స్, మూడు రైలు కం రోడ్డు వంతెనలు నిర్మించనున్నారని ఎన్హెచ్ఏఐ వర్గాలు ద్వారా తెలిసింది. ఈ విస్తరణ పనులు మరో మూడు నెలల్లో ప్రారంభించి, రెండేళ్లలో పూర్తిచేయనున్నట్టు సమాచారం. -
దివ్యాంగులను వేధించడం తగదు
మహారాణిపేట(విశాఖ): దివ్యాంగుల పింఛన్ల కోసం తరచూ విచారణలు నిర్వహించి, ఆస్పత్రుల చుట్టూ తిప్పడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. దీనిలో భాగంగా అనంతగిరి జెడ్పీటీసీ గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు మాట్లాడుతూ దివ్యాంగులను విచారణపేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చైర్పర్సన్ జె.సుభద్ర జోక్యం చేసుకుంటూ.. దివ్యాంగులను వేధించడం సరికాదన్నారు. కొత్తగా ఎన్ని పింఛన్లు ఇచ్చారని, వితంతు పింఛన్ల మంజూరులో జాప్యం ఎందుకవుతోందని అధికారులను ప్రశ్నించారు. గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావడం లేదు గ్యాస్ సిలిండర్ రాయితీ నగదు రెండు నెలలు దాటినా ఇంకా ఖాతాల్లో జమ కాలేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాకపోవడం కారణమని ఏఎస్వో కల్యాణి వివరణ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ‘తల్లికి వందనం’పథకంలో నగదు అందరికీ వేయడం లేదని, వేసిన మొత్తంలో కోత విధిస్తున్నారని ఈర్లె అనురాధ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి మొత్తం ఇచ్చారని, ఇప్పుడు సగం ఇవ్వడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, అత్యవసర మందులు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అనురాధ తెలిపారు. గుంతలు పూడ్చండి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, వర్షాల వల్ల గుంతలు పెరిగి ప్రయాణం కష్టంగా మారిందని గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాడేరు, అరకు ప్రాంతాల్లోని ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారని, పరిశుభ్రమైన నీరు ఇవ్వడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకుని, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులు ఎప్పుడు? గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆనందపురం జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు అన్నారు. వేములవలసలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని ఆయన ప్రస్తావించారు. అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు సైతం గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపుపై ప్రశ్నించారు. ఇళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తల పోస్టులను రద్దు చేయండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ కార్యకర్తల పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు పోస్టులు ఇచ్చారని అరకు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు రోషిణి, గంగరాజు ఆరోపించారు. ఈ పోస్టులను తక్షణం రద్దు చేసి, మళ్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో పాత్రపై విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రల్లో అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఈర్లె అనురాధ తెలిపారు. అరకు, పాడేరుపై వివక్ష అరకు, పాడేరు నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇక్కడ మండల లెవిల్ స్టాక్ పాయింట్లను జీసీసీ నుంచి రెవెన్యూకు అప్పగించడం వంటి అదనపు పద్ధతులు పెట్టారని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉండడం వల్లే ఈ వివక్ష చూపుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర విమర్శించారు. -
రోగుల హాహాకారాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు వార్డుల్లో రోగులు హాహాకారాలు పెట్టారు. గైనిక్ వార్డులో బాలింతలు, డెలివరీ కోసం లేబర్ రూమ్లో ఉన్న గర్భిణులు, పిల్లల వార్డులో బరువు, నెలతక్కువతో పుట్టిన పిల్లలు, వివిధ సమస్యలతో ఉన్న చిన్నారులు, వెంటిలేటర్ మీద ఉన్న రోగులు, ఎమర్జన్సీ వార్డుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పిల్లల పరిస్థితి చూసిన తల్లులు.. రోగుల పరిస్థితి చూసిన వారి బంధువులు అల్లాడిపోయారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డుల్లో గాయపడిన రోగులు, ఆక్సిజన్ పెట్టుకున్న రోగులు విద్యుత్ లేకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు. పిల్లలు, గైనిక్, భావనగర్, రాజేంద్రప్రసాద్ తదితర వార్డుల్లో ఫ్యాన్లు నిలిచిపోవడంతో రోగుల బంధువులు విసనకర్రలను ఆశ్రయించారు. నర్సులు రోగులకు కొవ్వొత్తుల వెలుగులోనే వైద్య సేవలు అందించారు. -
ఇంటింటి కుళాయిల పనులు త్వరలో పూర్తి
జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి చోడవరం: అసంపూర్తిగా ఉన్న ఇంటింటి కుళా యి పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి చెప్పారు. గోవాడ, అంబేరుపురం గ్రామా ల్లో సీఈవో నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఆర్డబ్ల్యూఎస్ డీఆర్ఈవో జె.అనిల్ కుమార్, డిప్యూటీ ఈఈ ఎ.సూర్యనారాయణ, ఏఈ సీహెచ్ నర్సింహరావుతో కూడిన అధికారుల బృందం గురువారం పర్యటించి, అసంపూర్తిగా ఉన్న జల్జీవన్ మిషన్ పథకం పనులను పరిశీలించింది. ఈసందర్భంగా గోవా డ సర్పంచ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని ఇళ్లకుకుళాయిలు వేయకపోవడంతో గ్రామ స్తులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కుళాయిలు వేయాలని కోరారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించింది. గోవాడలో 10శాతం మేర ఇళ్లకి కుళాయిలు వేయలేదని, వాటికి త్వరలోనే వేయిస్తామని సీఈవో చెప్పారు. అంబేరుపురంలో మంచినీటి సమస్యను సర్పంచ్ కార్లె ఈశ్వరమ్మ అధికారులకు వివరించారు. రాయపురాజుపేటలో గల పంప్హౌస్ను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఈవో తెలిపారు. -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రాంబిల్లి(అచ్యుతాపురం): అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్లో పరిశ్రమల స్థాపన కోసం భూములిచ్చిన నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంద ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, యలమంచిలి నియోజక వర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి రాంబిల్లి మండలం కృష్ణపాలెంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తామంతా కృష్ణంపాలెంలో పర్యటించినట్టు తెలిపారు. భూనిర్వాసితులకు గతంలో కేటాయించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను మార్చకూడదని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను తరచూ మార్చడం సమంజసం కాదన్నారు. కృష్ణంపాలెం భూనిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ఇక్కడి నుంచి తరలించాలన్నారు. స్థానికులందరికీ ఇక్కడ ఏర్పాటుచేస్తున్న పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరిగినా వైఎస్సార్ సీపీ పోరాడతుందని స్పష్టం చేశారు. అనంతరం పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అసెంబ్లీ నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ కృష్ణపాలెం భూ నిర్వాసితుల కోసం పోరాడతామని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు కిశోర్, ఎంపీపీ శిరీ షా శ్రీనుబాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, యువజ న నాయకుడు ధూళి వెంకీ, అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాంబాబు, అచ్యుతాపురానికి చెందిన కోన బుజ్జి, నెట్టెం సత్యనారాయణ, నీరుకొండ వెంకట సూర్యనారాయణ, బద్ది హరిబాబు పాల్గొన్నారు. -
8 మంది పేకాటరాయుళ్లపై కేసు
యలమంచిలి రూరల్: మండలంలో పులపర్తి శివార్లులో పంటపొలాల్లో పేకాడుతున్న 8 మందిని బుధవారం యలమంచిలి రూరల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ పేకాడుతున్న సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు వెళ్లగా 8 మంది డబ్బు ఫణంగా పెట్టి పేకాడుతున్నట్టు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.5380 స్వాధీనపర్చుకున్నారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. -
ఆలయం గేటుకు తాళం వేసిన అయ్యప్ప భక్తులు
ఎస్.రాయవరం: సకాలంలో ఆలయం తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలోని సర్వసిద్ధి గ్రామంలో శివాలయం గేటుకు అయ్యప్ప మాలధారణ భక్తులు తాళం వేసి, అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయం గేటుకు తాళం వేయడంతో భక్తులు కాసేపు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు,దేవదాయ శాఖ ఈవో సాంబశివరావు ఆలయానికి చేరుకుని గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని, గుడి తలుపులకు తాళాలు వేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. అనంతరం ఆలయం తెరచి భక్తులకు దర్శనం కల్పించారు. అర్చకుడు పండుకి ఆలయ ఈవో మెమో ఇచ్చారు. -
ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు
నాతవరం: దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యంలోరోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రాజాన వీర సూర్య చంద్ర సహకరించారు. చెర్లోపాలెం పంచాయతీ శివారు పార్వతీపురం గ్రామానికి కొంతమంది బుధవారం కాకినాడ జిల్లా సత్యనారాయణస్వామి అన్నవరం దేవస్థానంలో జరిగే గిరి ప్రదక్షిణకు ఆటోపై బయలు దేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడడంతో ఐదుగురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వస్తున్న బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సంఘటన స్ధలంలో కారు అపి గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరిటెండెంట్తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. బాధితులంతా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. -
17 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధిని గుర్తించే కార్యక్రమం(ఎల్సీడీసీ) పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కుష్టు వ్యాధి సర్వేకు సంబంధించి కలెక్టర్ చాంబర్లో బుధవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ కార్యకర్తలు, పురుష వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. ఎవరికై నా తమ శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు, నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు
తుమ్మపాల: చనిపోయిన వ్యక్తి పేరున గల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు అమ్మివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని కుమారుడు మళ్ల సాగర్ బుధవారం జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావుకు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో రాజుపాలెం సర్వే నెం. 93/25, 94లో గల లే–అవుట్లో ప్లాట్ నెం.15, 16, 17 మొత్తం 956 గజాల స్థలాన్ని 1985 ఏడాదిలో మళ్ల శివ వెంకటకృష్ణ కోనుగోలు చేశారని, 2008లో ఆయన మరణించినప్పటికి 2010 ఫిబ్రవరి 1న లంకెలపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో క్రయ దస్తావేజు నెం.298/2010తో మూడు ప్లాట్లను తన తండ్రి విక్రయించినట్టు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోయిన తమకు న్యాయం చేసి మోసానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, దొంగ దస్తావేజులు రద్దు చేయాలని కోరారు. -
రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థినికి ఘన సత్కారం
నాతవరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటల పోటీల్లో హైస్కూల్ చెందిన విద్యార్థిని ఎ.స్నేహ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయుడు కాశపు శివరాంప్రసాద్ అన్నారు. చమ్మచింత హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎ.స్నేహ గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీలలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపింది.ఈ విద్యార్థినిని హైస్కూల్లో బుధవారం విద్యా కమిటీ చైర్మన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాజ్యాంగ దినోత్సవవం సందర్భంగా ఈనెల 26వ తేదీన అమరావతి అసెంబ్లీలో స్నేహ ప్రసంగిస్తుందని తెలిపారు. -
● పుష్కరిణీ నమోస్తుతే..
సింహాచలం: కార్తీక పౌర్ణమి సాయంసంధ్య.. పవిత్ర వరాహ పుష్కరిణి.. వేలాది దీపాల కాంతులతో, భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుభ ఘడియలలో.. పవిత్ర జలరాశికి పుణ్యనదీ హారతి(గంగా హారతి) సమర్పించే అపురూప ఘట్టానికి బుధవారం సింహగిరి క్షేత్రం సాక్ష్యంగా నిలిచింది. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండదిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధం చేసిన దివ్య వేదికపై స్వామి కొలువుదీరగా, ఆ ప్రాంతం భక్తుల నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి ద్వయ, నక్షత్ర, కుంభ హారతులను సమర్పించగా, ఆ కర్పూర కాంతుల్లో స్వామి దివ్య రూపం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం.. పుష్కరిణి గట్టుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి పుష్కరిణీ నమోస్తుతే.. అంటూ వరాహ పుష్కరిణికి దివ్య నీరాజనం సమర్పించారు. ఆ హారతి వెలుగులు పవిత్ర జలంలో ప్రతిబింబిస్తుండగా, ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. అదే సమయంలో.. పుష్కరిణి గట్టున వందలాది మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిఫెన్స్ మద్యంతో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం: డిఫెన్స్ మద్యం బాటిళ్లు తరలిస్తున్న మాకవరపాలెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన జాజుల సత్తిబాబు(32)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎకై ్సజ్ సీఐ కె.సునీల్కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమయ్యపాలెం నుండి వజ్రగాడ వెళ్లే దారిలో తమ సిబ్బంది సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతని వద్ద ఉన్న బ్యాగ్లో 100 పైపర్, వ్యాట్ 69 విస్కీ, బ్లెండర్ప్రైడ్ బ్రాండ్స్ కలిగిన 3 డిఫెన్స్ మద్యం సీసాలు, 10 బడ్వైజర్ టిన్ బీర్లు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం డిఫెన్స్ క్యాంటీన్లో కొనుగోలు చేసి నర్సీపట్నం తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు తమ విచారణ రుజువైందని సీఐ తెలిపారు. -
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
ఆర్చిడ్ స్పా సెంటర్పై పోలీసుల దాడి బీచ్రోడ్డు: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నాయనే పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాల(వ్యభిచారం)ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళకు గాయాలు
యలమంచిలి రూరల్: యలమంచిలి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళ్లే అనకాపల్లి డిపోకు చెందిన ఏపీ 31టీసీ1314 పల్లెవెలుగు ఆర్డినరీ బస్సు నుంచి జారిపడి మహిళ తీవ్రంగా గాయపడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే మహిళ బస్సు నుంచి జారిపడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివరాలివి..రాంబిల్లి మండలం సంతపాలెం గ్రామానికి చెందిన జోరీగల అచ్చియ్యమ్మ(58) యలమంచిలి నుంచి సొంతగ్రామానికి వెళ్లేందుకు యలమంచిలి ఆర్టీసీ బస్టాండులో బస్సెక్కడానికి వచ్చింది. చదువు రాకపోవడంతో పొరపాటున పాయకరావుపేట వెళ్లే బస్సు ఎక్కింది. కాంప్లెక్సు నుంచి బస్సు బయలుదేరిన వెంటనే అచ్చియ్యమ్మ తాను ఎక్కాల్సిన బస్సు కాదని తెలుసుకుంది. ఈ క్రమంలో ఆమెను బస్సు దిగాలని కండక్టరు, డ్రైవరు చెప్పగా ఆమె దిగేందుకు ప్రయత్నించింది. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా నడపడంతో ఆమె జారిపడింది. ఆమె తల వెనుక భాగానికి రక్తగాయమైంది. బస్సు నుంచి జారిపడిన అచ్చియ్యమ్మను పట్టించుకోకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వగా అక్కడున్న ఓ విలేకరి ఫోటోలు తీయడంతో ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి గాయపడిన అచ్చియ్యమ్మను ఆటోలో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. గాయపడిన మహిళకు యలమంచిలి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై అనకాపల్లి డిపో మేనేజర్, డీపీటీవోలు బస్సు డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాకపోకలు సాగించే పలు బస్సులకు ఉంచుతున్న గమ్యస్థానల పేర్లతో ఉన్న బోర్డులు తికమకగా ఉంటున్నాయని, దీనివల్ల ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని పలువురు మండిపడుతున్నారు. బస్కాంప్లెక్స్లో చదువురాని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించడానికి నియమించిన గైడ్ సేవలు సక్రమంగా అందేలా చూడాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ ఎంపిక
ఆరిలోవ: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 15 ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు బృందాలుగా ఏర్పడి, నాటికలను ప్రదర్శించారు. డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో స్మార్ట్ అగ్రికల్చర్ అనే అంశంపై ప్రదర్శించిన పెందుర్తి మండలం, శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం విజేతగా నిలిచింది. ఈ నెల 7న గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటికను ఎంపిక చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. రైతులు ఆధునికీకరణ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగిందన్నారు. ఈ బృందానికి మరింతగా శిక్షణ ఇచ్చి, రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచేలా కృషి చేయాలని గైడ్ టీచర్ సీతాలక్ష్మికి సూచించారు. ఈ పోటీల్లో ఉమెన్ ఇన్ సైన్స్, డిజిటల్ ఇండియా–ఎంపవరింగ్ లైవ్స్, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి రాజారావు, జ్యూరీ సభ్యులు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు బి.నాగేశ్వరరావు, నవరస ఆర్ట్స్ ఫౌండర్ పి.వి.రమణమూర్తి, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు -
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కె.కోటపాడు మండలంలో పాతవలసలో అండర్–14 విభాగంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి జి.జశ్వంత్, 9వ తరగతి విద్యార్థి సీహెచ్. అశోక్ విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను కై వసం చేసుకుని, రాష్ట్ర వాలీబాల్ జట్టులో స్థానం సంపాదించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 27న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ఇద్దరూ పాల్గొంటారని స్థానిక గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్పాల్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులతో పాటు వీరికి తర్ఫీదు ఇచ్చిన పీఈటీ తరుణ్, పీడీ ఉమామహేష్లను ప్రిన్సిపాల్ విక్టర్పాల్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇరటా నర్సింహమూర్తి, ఉమ్మడి విశాఖ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారి (డీసీవో) గ్రేస్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక పాయకరావుపేట: మండలంలోని గుంటపల్లి పాఠశాల విద్యార్థిని ద్రాక్షవరపు రాణి రాష్ట్ర స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ రవికుమార్ తెలిపారు. 4వ తేదీన ఎస్జీఎఫ్ అండర్ 14 వాలీబాల్ స్కూల్ గేమ్స్ కె.కోటపాడు మండలం పాతవలస పాఠశాల్లో జరిగిన ఎంపిక పోటీల్లో 8 వ తరగతి చదువుతున్న రాణి ఎంపికై నట్టు చెప్పారు. రాణిని హెచ్ఎం జి.రామారావు అభినందించారు. -
సీఎస్సార్ నిధులతో కొత్త డయాలసిస్ యూనిట్లు
కేజీహెచ్లో ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి మహారాణిపేట: ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే వైద్య సేవలను డిజిటల్ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎస్సార్ కింద ఎన్టీపీసీ సమకూర్చిన రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ను బుధవారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో కుప్పంలో సంజీవని పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 13 సబ్ యూనిట్లతో సేవలు అందుతున్నాయని, అదనంగా ఎన్టీపీసీ సాయంతో మరో 10 కొత్త డయాలసిస్ సబ్ యూనిట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ డాక్టర్ రవిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, నెఫ్రాలజీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ డాక్టర్ రత్నప్రభ, కార్పొరేటర్ కొడూరు అప్పలరత్నం, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల మరమ్మతుల కోసం ఆమ్ఆద్మీ దీక్ష
చోడవరం: దెబ్బతిన్న రోడ్లన్నీ మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లుగా మార్చుతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ హామీని తుంగలోకి తొక్కి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆమ్ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనకాపల్లి –చోడవరం, వడ్డాది, కొత్తకోట, నర్సీపట్నం రోడ్డు, చోడవరం–మాడుగుల మెయిన్రోడ్డు పెద్దపెద్ద గోతులు పడి అత్యంత ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఈ రోడ్డును బాగుచేయాలని, రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమ్ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష బుధవారం నాటికి 9వరోజుకి చేరుకుంది. శిబిరంలో ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్కుమార్, జిల్లా కన్వీనర్ కొణతాల హరనాథబాబు, జిల్లా కార్యదర్శి బలివాడ రామసంతోష్, చోడవరం నియోజవకర్గం ఇన్ఛార్జి వేగి మహాలక్ష్మినాయుడు మహిళా అధ్యక్షురాలు శీతల్మదాన్, సోషల్ మీడియా ఇన్చార్జి పవన్కుమార్ కూర్చున్నారు. సుమారు 50 కిలోమీటర్ల మేర మెయిన్రోడ్డు అంతా పెద్దపెద్ద గోతులతో చాలా ప్రమాదకరంగా ఉందని, వర్షాలకు ఆ గోతుల్లో అనేక వాహనాలు పడి ప్రమాదాలు జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు చేపట్టే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. -
సత్యదేవునికి భక్త నీరాజనం
డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ(బాబాజీకొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేశారు. వేకువ జామున 2 గంటలకు ధ్వజస్తంభ పూజ నిర్వహించారు. వేకువజాము 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్వామి దర్శనం కల్పించారు. రూ.1,116 చెల్లించిన భక్తులతో అనివెట్టి మండపంలో ఉదయం 7 గంటలకు, 10.30 గంటలకు ప్రత్యేక వ్రతాలు చేయించారు. ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు సామూహిక వ్రతాలు జరిగాయి. భక్తుల తాకిడి దృష్ట్యా ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు అవకాశం కల్పించలేదని ఈవో రాజగోపాల్రెడ్డి తెలిపారు. పూర్ణామార్కెట్ దరి దయారామ స్వీట్ షాప్ పక్క నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన ఘాట్ రోడ్డును భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. -
పారిశ్రామికవేత్త?
మీలో ఎవరుచోటా నేతలు, కార్యకర్తలకు టీడీపీ బంపర్ ఆఫర్ పార్టనర్షిప్ సమ్మిట్లో ఒప్పందాల కోసం ఏర్పాట్లురండి బాబు.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. మంచితరుణం మించిన దొరకదు.. ఫైల్ పట్టుకుంటే.. పండగే.. ఒప్పందం కుదుర్చుకోండి.. భూములను దోచుకోండి.! కండువా పక్కన పెట్టు.. కొత్త పరిశ్రమ పెడుతున్నట్లు నటించు..! ఉన్న పరిశ్రమ చూపించి.. కొత్త రాయితీలు కొట్టెయ్యొచ్చు..! ఈ ఆఫర్ కేవలం రెండు రోజుల మాత్రమే.. అది కూడా ఈ నెల 14, 15 తేదీల్లోనే.! మీరు పచ్చనేత అయితే చాలు.. అర్హత పొందినట్లేనంటూ టీడీపీ నేతలు.. కొత్త సీసాలో పాత సారా పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం చేసిన హడావుడికి మరోసారి శ్రీకారం చుడుతున్నారు. టీడీపీ నేతలకు ఇస్తున్న సరికొత్త బంపర్ ఆఫర్ ఏంటంటే..? సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వం 2016, 2018లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఈ రెండు సదస్సుల్లోనూ లక్షల కోట్ల రూపాయిలు పెట్టుబడులు వచ్చేశాయంటూ ఊదరగొట్టారు. భారీ పరిశ్రమలు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి.. ఎంవోయూలు చేసుకున్నారంటూ ఒప్పందపత్రాలు మార్చుకుంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. తీరా చూస్తే.. లెక్కల్లోనే లక్షల కోట్లు మిగిలాయి.. ఫొటోలకే ఎంవోయూలు పరిమితమయ్యాయి. తర్వాత ఆరా తీస్తే.. టీడీపీ ప్రభుత్వం అసలు బండారం బట్టబయలైంది. సదస్సులకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో.. స్థానికంగా ఉన్న వారితో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలకు సూటు, బూటు వేసి.. పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వందల కోట్ల రూపాయిల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చినట్లుగా ప్రకటించేసి.. అడ్డంగా దొరికిపోయారు. చింత చచ్చినా.. పులుపు చావదన్నట్లుగా.. అబద్దాల పునాదులపై ప్రచారపటాటోపాలు నిర్వహిస్తూ.. ప్రజల సాక్షిగా అబాసుపాలవుతున్నా.. టీడీపీ మాత్రం తన వక్ర బుద్ధి వీడలేకపోతోంది. త్వరలో జరగబోయే సదస్సుకు కూడా ఇదే తరహాలో డమ్మీ పారిశ్రామికవేత్తల కోసం జాబితా తయారు చేస్తోంది. పరిశ్రమ ఉంటే చాలు.. పనైపోద్ది.! ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు అధిష్టానం టాస్క్ అప్పగించింది. తమ పరిధిలో పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారనే జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చోటా నేతలు, కార్యకర్తల్లో ఎవరైనా రెస్టారెంట్స్, హోటల్స్, బ్రిక్స్, టైల్స్ ఇలా.. చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నా.. వారితో పార్టనర్ షిప్సమ్మిట్లో కొత్తగా ఒప్పందాలు చేసుకునేలా ఏర్పాట్లు నడుపుతున్నట్లు సమాచారం. ఆశించిన మేర పారిశ్రామికవేత్తలు రాకపోతే.. ఎంవోయూల సంఖ్య అధికంగా చూపించుకునేందుకు టీడీపీ తహతహలాడుతోంది. అయితే.. 2018లో ఎంవోయూలు చేసుకున్న వారికి మాత్రం ఇందులో మినహాయింపునిస్తున్నారు. మళ్లీ వారినే పిలిపిస్తే.. పరువు పోతుందన్న భయంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. స్టేజ్ పైకి పిలిచేంత పరిశ్రమ సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పడంతో.. ఆ తరహా పరిశ్రమలున్న వారి వివరాలు తయారుచేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్న సదస్సుకు జనం రాకపోతే.. నవ్వులపాలవుతామన్న భయంతో మరోసారి అదే దొడ్డిదారిలో వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూ పందేరం కోసం టీడీపీ నేతల కొత్త ఎత్తుగడలు! సమ్మిట్ పేరుతో ఇదో యవ్వారం నడుస్తుండగా.. సందట్లో సడేమియాలా.. ఒప్పందాల పేరుతో భూ పందేరాలకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూల పేరుతో ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి.. వాటిని అధికారికంగా కొట్టేసేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో ఉన్న టూరిజం భూముల్లో పర్యాటక ప్రాజెక్టులు, ఏపీఐఐసీ భూముల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సదస్సులో ఎంవోయూలు మార్చుకుంటూ.. తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తమ అనుచరగణంతో ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 241.92 ఎకరాల టూరిజం భూములను పర్యాటక ప్రాజెక్టులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వందలాది ఎకరాలున్న ఏపీఐఐసీ భూములను వివిధ పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ.. మంచి ప్రాజెక్టులతో వస్తే భూ కేటాయింపులు రాయితీలతో ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇదే పేరుతో మొత్తం భూములను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేందుకు సమ్మిట్ పేరుతో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భాగస్వామ్య సదస్సు పేరుతో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం తెరతీయబోతోందనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. -
భక్తిశ్రద్ధలతో ఫణిగిరి ప్రదక్షిణ
రాంబిల్లి(అచ్యుతాపురం): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాంబిల్లిలో ఫణిగిరి ప్రదక్షిణను బుధవారం ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ కొండపై వెలసిన ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. తెల్లవారు జామున ధారపాలెం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ 24 కిలో మీటర్ల మేర సాగింది. శివనామ స్మరణ చేస్తూ వందలాది మంది భక్తులు నడక సాగించారు. చిన్నాపెద్దా, ముసలిముతక అన్న తేడా లేకుండా.. ఒకవైపు కాళ్లు కాలుతున్నప్పటికీ మండుటెండను లెక్కచేయకుండా భక్తి పారవశ్యంతో భారీ ఎత్తున ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల సేవలో... గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు మార్గ మధ్యంలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సేవలందించారు. మజ్జిగ, అల్పాహారం అందజేశారు. పలు కూడళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, భక్తులకు చికిత్స చేశారు. గిరి ప్రదక్షిణ సాగిన ప్రాంతాల్లో రహదారిని చదును చేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. అప్పారాయుడిపాలెం జంక్షన్, కొత్తూ రు, గోకివాడ, మూలజంప, మూల కొత్తూరు, మడకపాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఎర్రవరం, ఉప్పవరం, కొండకర్ల జంక్షన్, చోడపల్లి, అచ్యుతాపురం జంక్షన్, వెదురువాడ, గొర్లె ధర్మ వరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా రాధామాధవ స్వామి ఆలయానికి ఊరేగింపు చేరుకుంది. భక్తులు ఆకాశ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సహకారం పక్కదారి
విశాఖ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి అవినీతి మరకలు అంటుకున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో మంట పుట్టిస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులో అవినీతి, అక్రమాలపై ఆప్కాబ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. డీసీసీబీ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్పైనే అదే పార్టీకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. పదోన్నతులపై దుమారం గత నెలలో డీజీఎం నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతులు నిర్వహించారు. దీని కోసం పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కూడా పాటించలేదని బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బంధువు ఈ వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు జనసేనకు చెందిన నేతలే ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు చేస్తుండడం విశేషం. రూ.30 లక్షలు దుర్వినియోగం? గతంలో ఈ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్సనల్ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఖర్చు రూ.3 వేలు మాత్రమే. నాలుగు నెలల క్రితం నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30 లక్షలకు పైగా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కారు, దాని డీజిల్ పేరుతో రూ.లక్షలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ పేరుతో రూ.3 లక్షలు, రూ.1.8 లక్షలతో యాపిల్ డెస్క్టాప్, రూ.80 వేలతో కొత్త ల్యాప్టాప్ బలవంతంగా బ్యాంకు నిధుల నుంచి కొనిపించినట్లు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కేవలం లబ్ధిదారులు లంచాల వాటా ఇవ్వని కారణంగా డీసీసీబీ విశాఖ బ్రాంచ్లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాన్ని (పీఎంఈజీఎస్ )అమలు చేయడాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అలాగే స్టార్ హోటల్స్ నుంచి భోజనం పార్సిల్స్ను రప్పిస్తూ బిల్లులు బ్యాంకుకు పెడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. బ్యాంకు పరిధిలోని సహకార సంఘాలు అన్నింటి నుంచి నెలకు రూ.లక్ష మామూలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో పాటు తమ బినామీలకు రూ.కోట్లలో రుణాలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. రుణం పునరుద్ధరించాలంటే ఒక శాతం తక్కువ వ్యవధి రుణాలను(షార్ట్ టర్మ్ లోన్స్) తిరిగి పునరుద్ధరించే క్రమంలో రుణం మొత్తంలో ఒక శాతం కమీషన్గా తీసి పక్కన పెట్టాలని హుకుం జారీ చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకులో అవినీతి ఆరోపణలు, పదోన్నతుల్లో మూమూళ్ల వసూళ్లు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్, సీబీసీఐడీలతో దర్యాప్తు జరిపించి అక్రమంగా వసూలు చేసిన నిధులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయాలని కోరారు. -
ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు
విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అనకాపల్లి: కొత్తజిల్లాల్లో ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్థానిక గవరపాలెం నిదానందొడ్డి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా విద్యుత్శాఖ సర్కిల్ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తున్నట్టు చెప్పా రు. ఎంఆర్టీ, డీపీఈ, సివిల్, ఏపీటీఎస్ కార్యాలయాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయని, వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్శాఖ సీఎండీ పృథ్వీతేజ్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విద్యుత్శాఖ జిల్లా సర్కిల్ అధికారి జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గవరపాలెంలో గల నూకాంబిక అమ్మవారి బాలాలయంలో అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో 10 సబ్ స్టేషన్లకు అనుమతి కె.కోటపాడు: జిల్లాలో ఇప్పటికే 10 సబ్ స్టేషన్లకు అనుమతులను ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చౌడువాడలో రూ.3.65 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం స్విచ్ను ఆన్ చేసి సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20వేల ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ను ఉచి తంగా సమకూర్చనున్నట్టు తెలిపారు. గ్రామంలో మంచినీటి ట్యాంక్, సీసీ రోడ్లు ప్రారంభించారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం మాడుగుల రూరల్: మండలంలోని కింతలిలో నూతనంగా నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మండలంలో మరో విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
పేట డైవర్షన్ రోడ్డుపై నుంచి రాకపోకలు ప్రారంభం
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం,నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో విజయరామారాజుపేట డైవర్షన్ రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మోంథా తుఫాన్కు విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. దీంతో పది రోజులుగా విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు, చోడవరం ప్రాంతాలకు తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. నెల రోజుల కిందట వర్షాలకు పేట డైవర్షన్ రోడ్డు దెబ్బతినగా అప్పట్లో అధికార్లు సిమెంట్ గొట్టాలు, గ్రావెల్ వేసి రోడ్డు ఏర్పాటు చేశారు. వేసిన రోడ్డు నెల రోజులు తిరగక ముందే వర్షాలకు మళ్లీ కోతకు గురైంది. దీంతో ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేసి, బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు మహారాణిపేట(విశాఖ): జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు 2వ స్థాయీ సంఘం, 10.30కు 3వ, 11కు 4వ, 11.30కు 5వ, 12కు 1వ, 7వ, 12.30 గంటలకు 6వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా శాఖలకు సంబంధించినప్రగతి నివేదికలతో సమావేశాలకు హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. -
ఇదేం వివక్ష!
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చీడికాడ: మోంఽఽథా తుఫాన్ పరిహారం పంపిణీలో వివక్ష తగదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ స్టేట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం ఆయన కోనాం శివారు గిరిజన గ్రామం గుడివాడను సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు బుచ్చయమ్మ, దేముడమ్మ, రాజులమ్మ తదితరులు బూడి వద్దకు వచ్చి తమ గోడు వినిపించారు. మోంథా తుఫాన్లో తమ ఇల్లు దెబ్బతిన్నా తమకు తక్షణ సహకారం అందించకుండా ఒక వర్గానికి చెందిన వారికే నిత్యావసర వస్తువులు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బూడి తహసీల్దార్ కిషోర్ లింకన్ను ఫోన్లో సంప్రదించి మరోమారు కోనాం, వి.బి.పేట పంచాయతీలోని అన్ని గిరిజన గ్రామాల్లో తుఫాన్ నష్టాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీలు, కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అందించారన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి కానరాలేదన్నారు. తుఫాన్ ధాటికి ఇళ్లు దెబ్బతిని తమ ఆస్తులు నష్టపోయిన వారికి మనవత్వంతో ఆదుకోవాల్సింది పోయి కొందరికే పరిహారం అందించడం తగదన్నారు. రేషన్ సరఫరా వాహనాలను రద్దు చేయయడంతో 6 కిలోమీటర్లు దూరంలో గల కోనాం రేషన్ డిపోకి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితి గిరిజనులకు కల్పించారన్నారు. వెంటనే ఆయా గ్రామాల్లో తుఫాన్ నష్టాన్ని మరోసారి పరిశీలించి బాధితులు అందరికీ న్యాయం చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణమూర్తి, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు కిముడు చిన్నమ్మలు, ధర్మిశెట్టి స్వాతి తదితరులున్నారు. -
తుఫాన్ సాయం కొందరికే..!
మోంథా తుఫాన్ సహాయంలో కూటమి ప్రభుత్వం వివక్ష చూపింది. భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా నష్టపోయిన బాధితులకు సాయం అందించే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వారం ఏర్పడ్డ మోంథా తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, నేత కార్మికులతో పాటు, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు ప్రభుత్వం 50 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో బంగాళ దుంపలు, కిలో ఉల్లిపాయలు గ్రామాల్లో రేషన్డిపోల ద్వారా మత్స్యకారులకు అందజేస్తోంది. అయితే మిగిలిన సామాజిక వర్గాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో తూర్పు తీర ప్రాంతం వెంబడి 18 మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 25 వేలకు పైగా మత్స్యకారులు జీవిస్తున్నారు. దాదాపు 1400కి పైగా బోట్లు తెప్పలు ఉన్నాయి. ఒక్కో తెప్పపై ఆరుగురు చొప్పున 8వేల మందికి పైగా మత్స్యకారులు వేటకు వెళ్తుంటారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేటపై ఆధార పడిన మహిళలు కూడా వివిధ గ్రామాల్లో చేపలు విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతుంటారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో రేషన్ కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం తుఫాను సాయం కింద ఈ బియ్యాన్ని నిత్యావసర సరుకులను అందజేస్తోంది. ఇలా నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో మత్స్య కారులు, చేనేత కార్మికులు, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులను 13,681 మందిని గుర్తించారు. వీరికి మాత్రమే ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తోంది. మత్య్సకార గ్రామాల్లో కేవలం మత్స్యకారులే కాకుండా రజకులు, శెట్టి బలిజ, దళితులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, యాదవులు, కాపులు, వెలమ తదితర వెనుకబడిన సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. రేషన్ కార్డు కలిగిన ఇలాంటి వారు మరో 30వేల మందికి పైనే ఉంటారు. వీరెవరికీ రేషన్ బియ్యం, ఇతరత్రా సరుకులు అందించలేదు. తుఫాన్ వల్ల తాము కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయామని కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండిపోయామని, మత్స్యకారులతోపాటు, తాము కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలపాకు, అపరాలు, కూరగాయలు, ఉద్యానవన రైతులకు కూడా ఎంతో నష్టం వాటిల్లింది. వీరెవరికీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందించలేదు. తమ గ్రామాల్లో ఇతర సామాజిక వర్గాల వారు కూడా నివసిస్తున్నారని, తుఫాన్ కారణంగా వారు కూడా ఎంతో నష్టపోయినా వారికి ప్రభుత్వం సాయం అందించకపోవడం సమంజసం కాదని మత్స్యకారులు కూడా ఆక్షేపిస్తున్నారు. తమతోపాటు మిగిలిన బాధితులకూ తుఫాన్ సాయం కింద నిత్యావసరాలు అందించాలని రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. చేతివృత్తులపై ఆధారపడ్డ రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, శెట్టిబలిజ, గుల్ల కార్మికులు, దళితులకు సాయం అందించకపోవడం దారుణమన్న వాదన వినిపిస్తోంది. తుఫాన్ సాయంలో కూడా కూటమి ప్రభుత్వం వివక్ష చూపడం పట్ల బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో వివక్ష లేదు.. గత ప్రభుత్వంలో తుఫానులు సంభవించినప్పుడు కులాల వారీగా కాకుండా తుఫాను ప్రభావిత గ్రామాల్లో రేషన్కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం తరపున సహాయం పంపిణీ చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఏడాదిపాటు బాధితులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. తుఫాన్ సాయంలో ఎటువంటి వివక్ష లేకుండా, అన్ని సామాజిక వర్గాల వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు, మత్స్యకార సామాజిక వర్గాలవారు సైతం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. మా గోడు పట్టదా... మేము కూడా మత్స్యకార గ్రామంలోనే నివసిస్తున్నాం. తుఫాను వల్ల మేము కూడా ఉపాధి కోల్పోయాం. కల్లుగీత, తాటాకులు అమ్ముకోవడం, వ్యవసాయ కూలి పనులకు వెళ్తుంటాం. వారం రోజుల పాటు గడప దాటలేదు. తుఫాను ప్రభావం కారణంగా మత్య్సకారులు మినహా ఇతర కులాల వారికి నిత్యావసరాలు ఇవ్వకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఉచితంగా సరుకులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం మాపై వివక్ష చూపించడం దారుణం. మేమేం పాపం చేశాం.. –చిట్టిమని రాంబాబు, అమలాపురం దళితులను విస్మరించడం సరికాదు.. తుఫాన్ వల్ల కేవలం ఒక వర్గం వారే నష్టపోయారని భావించడం తగదు. దళితులు కూడా నష్టపోయారు. వారం రోజుల పాటు కూలి పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు సాయం చేయకపోవడం బాధగా ఉంది. ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి తుఫాన్ సాయాన్ని అందించాలి. –కుంచా సురేష్, జగన్నాథపురం మిగిలిన సామాజికవర్గాలకు మొండి చేయి -
ఖండివరం ఉపాధి హామీ పథకం టీఏపై విచారణ
చీడికాడ: ఖండివరం ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ మోహన్రావుపై కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం గ్రామంలో ఏపీడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఖండివరంలో ఉపాధి పనులు పరిశీలించే టెక్నికల్ అసిస్టెంట్ మోహన్రావుపై గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు పీజీఆర్ఎస్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఏపీడీ శ్రీనివాసరావు సచివాలయంలో ఫిర్యాదుదార్లతో పాటు మేట్లతో విచారణ చేపట్టారు. రెండేళ్లలో ఒక్క రోజు మాత్రమే టెక్నికల్ అసిస్టెంట్ పని ప్రదేశానికి వచ్చి కొలతలు తీశారని, మిగతా రోజుల్లో వీఆర్పీ(ఎఫ్ఏ)మస్తర్లు, కొలతలు తీసుకెళ్లేవారని ఖండివరం గ్రామానికి చెందిన ఉపాధి మేట్లు ఏపీడీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సచివాలయంలో తలుపులు ముసి విచారణ చేపట్టడంపై కూలీలు, గ్రామస్తులు విచారణ అధికారి శ్రీనివాసరావు, ఏపీవో గంగునాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకం ప్రారంభం నుంచి వీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న మోసూరి ఏసుబాబును రాజకీయ దురద్దేశంతో కొంత మంది గ్రామానికి చెందిన కూటమి నాయకుల ఒత్తిడితో విధుల నుంచి తొలగించారని మండల కో–ఆప్షన్ సభ్యుడు షేకు సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు ఆరోపించారు. తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఏపీడీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. టెక్నికల్ అసిస్టెంట్ మోహన్రావు రెండేళ్లలో ఒక్క రోజే ఫిల్డ్కు వెళ్లి కొలతలు తీసుకున్నట్లు మేట్లు తెలియజేశారన్నారు. వీఆర్పీని సస్పెండ్ చెయ్యడంపై తనకు తెలియదన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. -
విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు. ఆరిలోవ కాలనీ, టీఐసీ పాయింట్, బాలాజీనగర్, రవీంద్రనగర్, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, హనుమంతవాక, మధురవాడ పరిధి శివశక్తినగర్, శారదానగర్, సాయిరాం కాలనీ, వికలాంగుల కాలనీ పరిసర కొండవాలు ప్రాంతాలు, తగరపువలస, భీమిలి, ఆనందపురం, మురళీనగర్, మాధవధార, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి మహారాణిపేట, డాబాగార్డెన్స్, ఓల్డ్సిటీ, బీచ్రోడ్డు, అల్లిపురం, జ్ఞానాపురం, మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో గుర్తించగలిగే స్థాయిలో ఈ భూ ప్రకంపనలున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. కార్తీకమాసం పూజలు, వాకింగ్, పాలప్యాకెట్ల కోసం అప్పటికే నిద్రలేచిన ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో మంచాలు, కబ్ బోర్డుల నుంచి వస్తువులు దొర్లిపడ్డ చోట మరింత ఆందోళన చెందారు. తమ వారిని నిద్రలేపి మరీ కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 3 నుంచి 10 సెకన్ల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెప్తున్నారు ఇద్దరు మహిళలకు గాయాలు భూ ప్రకంపనల సమయంలో జీవీఎంసీ రెండోవార్డు సంతపేటలో నందిక రమణ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గేటు రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదు విశాఖలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7 మాగ్నిట్యూడ్గా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల వద్ద 10 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంపాలు, వల్కనోలపై అధ్యయనం చేస్తున్న వల్కనో డిస్కవరీ సంస్థ వెల్లడించింది. నగరంలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి -
ఒకేరోజు పంచారామాల సందర్శన
కార్తీకం ‘స్పెషల్’ సాక్షి, అనకాపల్లి: పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు శైవ క్షేత్రాలకు యాత్రకు వెళుతున్నారు. ప్రతి ఏటా వీరి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. దీంతో భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. ఇప్పటికే రెండు దఫాలుగా బస్సులను స్పెషల్ దర్శనానికి రవాణా చేశారు. ప్రైవేట్ సర్వీస్లు కన్నా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనే భక్తులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే మూడేళ్లుగా ఆర్టీసీ కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడిపింది. దానికి తగ్గట్లుగానే భక్తులు కూడా బస్లను బుక్ చేసుకుంటున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణంతో ఈ ఏడాది పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు బిజీగా ఉండడంతో..ఆల్ట్రా డీలక్స్ బస్సులనే శైవక్షేత్రాల ప్రత్యేక యాత్రకు కేటాయించారు. ఇందుకోసం శివాలయాలకు వెళ్లే భక్తుల కోసం పంచరామాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పా టు చేసింది. ఇప్పటికే అక్టోబర్ 28వ తేదీన, నవంబర్ 2వ తేదీన రెండు దఫాలుగా సర్వీసులను నడిపారు. ఈ సర్వీసులను కార్తీక మాసం మొత్తం నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం నవంబర్ 9, 11వ తేదీల్లో కూడా ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను నడుపుతుంది. ఈ ప్యాకేజీలతోపాటు వన భోజనాలు, ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను కూడా ప్రకటించారు. ఆన్లైన్లో, డిపో కౌంటర్లలో టికెట్లు కార్తీక మాసంలో ఒకే రోజు పంచారామాల క్షేత్ర దర్శనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అందుకు తగ్గట్లుగానే ఆర్టీసీ కూడా బస్సు సర్వీసులను నడుపుతుంది. ప్రతి ఆదివారం అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి బస్సులు బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి సోమవారం రాత్రి మళ్లీ ఆయా డిపోలకు చేరుకుంటాయి. టికెట్లను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్లో, డిపో కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం వారు ప్రయాణించే చోటుకు బస్సు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్సుతో తగ్గిన సర్వీసులు.. కార్తీక మాసంలో పంచారామాల శైవ క్షేత్రాల యాత్రకు ఎక్కవగా బస్సులను ఆర్టీసీ నడిపేది. ఇప్పుడు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సులు కొరత రావడంతో కేవలం ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను మాత్రమే నడుపుతుంది. మూడేళ్లగా ఈ శైవక్షేత్రాల యాత్రకు భక్తులకు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, ఆల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సులను నడిపేది. కానీ ఈ ఏడాది ఈ బస్సులన్నీ రద్దీగా ఉండడంతో కేవలం ఆల్ట్రా డీలక్స్ సర్వీసులనే నడుపుతుంది. దీంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గుముఖం పట్టింది. కార్తీక మాసంలోనే ఎక్కువగా ఆర్టీసీలకు లాభం వచ్చేది..ఈ ఏడాది అది కాస్త తగ్గిందని ఆర్టీసీ అధికారులు సైతం చెబుతున్నారు. ప్రతి ఆదివారం స్పెషల్.. వచ్చే ఆదివారం 09 వ తేదీ, 16వ తేదీల్లో అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి పంచరామాల పుణ్యక్షేత్రాలకు ఆల్ట్రా డీలక్స్ బస్సులు బయలుదేరుతున్నాయి. ముందుగా టికెట్స్ బుక్ చేసుకోనే భక్తులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చు. లేదంటే అనకాపల్లి డిపో సెల్నంబర్ 7382913967, నర్సీపట్నం డిపో సెల్ నంబర్ 9494811855లను సంప్రదించాలి. –వి.ప్రవీణ, ప్రజారవాణా శాఖ జిల్లా అధికారిఅనకాపల్లి డిపో నుంచి.. -
రాంబిల్లి ఫణిగిరి గిరి ప్రదక్షిణ నేడే
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కొలువు ఉన్న ఫణిగిరి ప్రదక్షిణ ఈనెల 5వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తయ్యాయి. మూడు మండలాల పరిధిలో 24 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున చేపట్టనున్నారు. బుధవారం తెల్లవారుజామున భక్తులు ధార భోగాపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ధారపాలెం, పంచదార్ల, కొత్తూరు, గోకివాడ, మూలజంప, మడక పాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల చోడపల్లి, అచ్యుతాపురం, వెదురువాడ, గొర్ల ధర్మవరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా రాధా మాధవ స్వామి ఆలయానికి యాత్ర చేరుకోనుంది అనంతరం ఆకాశధారలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉమా ధర్మలింగేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే స్వామివారికి అవసరమైన గొడుగుకు నిధులను దాతలు సమకూర్చారు. 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భక్తులు నడిచేందుకు వీలుగా రహదారులను చదును చేసే పనులు చేపట్టారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల వైద్య సేవల నిమిత్తం అచ్యుతాపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు మూడు చోట్ల వైద్య శిబిరాలను, అంబులెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల సరిహద్దుల్లో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు అనకాపల్లి జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతోంది. -
తాండవ స్పిల్ వే నుంచి నీటి విడుదల
నాతవరం: తాండవ జలాశయం ప్రస్తుతం నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుందని, ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వర్షం నీరు ప్రవహించడం వల్ల స్పిల్ వే గేట్ల నుంచి మిగులు నీరు విడుదల చేస్తున్నట్టు తాండవ జలాశయం డీఈఈ అనురాధ తెలిపారు. మంగళవారం నుంచి తాండవ జలాశయం నుంచి నీరు విడుదల చేయడం జరుగుతుందని, జలాశయం దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాండవ జలాశయం గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379కి చేరుకుందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి తాండవ జలాశయానికి ఇన్ఫ్లో ద్వారా 1430 క్యూసెక్కులు నీరు రాగా స్పిల్ వే గేట్లు ద్వారా 1237 క్యూసెక్కుల నీటిని నదిలోనికి విడిచిపెట్టడం జరుగుతుందన్నారు. దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమరావతి మాక్ అసెంబ్లీకి కాశీపురం విద్యార్థిని
దేవరాపల్లి: కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సింగంపల్లి వెంకట సాయి మేఘన అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయిలో విద్యార్థ్ధులకు వ్యక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. మాడుగులలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీలలో వెంకట సాయి మేఘన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.‘మేకింగ్ ఇండియా– వికసిత్ ఆంధ్రప్రదేశ్’, భారత రాజ్యాంగ ఆవశ్యకత, పౌరుల హక్కులు, విధులు తదితర అంశాలపై ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించి మాడుగుల నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీకి అర్హత సాధించింది. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని శాసనసభలో జరిగే మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో వెంకట సాయి మేఘన పాల్గొంటుందని స్థానిక హెచ్ఎం రాజేటి సుజాత తెలిపారు. ఎంపికై న విద్యార్ధినితో పాటు గైడ్ టీచర్ కొట్టాన రాంబాబును మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్.ఉమ, వి. ఉషారాణి, హెచ్ఎం సుజాత అభినందించారు. -
దేవాలయాలు, స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు
తుమ్మపాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న శివాలయాలు, ప్రముఖ దేవాలయాలు, స్నానఘట్టాలు, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి రెవెన్యూ, దేవదాయశాఖ, పోలీసు, వైద్యశాఖ, ఎంపీడీవోలతో దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. దేవాలయాల్లో ప్రజల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లకు బారికేడ్లు, మంచినీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర, నదీ స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధం చేసుకోవాలని, మహిళలు బట్టలు మార్చుకోవడానికి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన వివరాలు తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు తీసుకుని వారితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని తగినంత భద్రతా ఏర్పాట్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాంబిల్లి మండలం పంచదార్ల, అనకాపల్లి మండలం సత్యనారాయణస్వామి గిరి ప్రదక్షిణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, మంచినీరు, ప్రతి మూడు కిలోమీటర్లకు వైద్య శిబిరం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ దేవాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటుకు దేవదాయ శాఖ నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖకు అందిస్తున్నారని, దానికి తగినట్టుగా పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం రావడం లేదన్నారు. ప్రతి దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి దేవాలయానికి ప్రవేశ, నిష్క్రమ మార్గాలు విడిగా ఉండాలని, నిష్క్రమణ మార్గాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. భోజనం, ప్రసాదం కౌంటర్లు తగినన్ని ఏర్పాటు చేయాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా ఎండోమెంటు అధికారి కె.ఎల్. సుధారాణి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో.. వినికిడి సమస్య!
మహారాణిపేట: వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట గత వైఎసా్స్ర్ సీపీ ప్రభుత్వంలో వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను కూటమి ప్రభుత్వం మూలకు చేర్చింది. నాలుగు మాసాలుగా ఈ పరికరాల సరఫరా లేకపోవడంతో ఈఎన్టీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ కొందరు అర్హత కొల్పొయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఘనం ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రంగా ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) ప్రభుత్వ ఇక్కడ ఆస్పత్రికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 30–50 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో అనేక శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో చేశారు. ఒక్కో రోగి కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలూ నిర్వహించారు. బాధిత చిన్నారులు పైసా ఖర్చు లేకుండానే వినికిడి సామర్థ్యం పొందారు. ఇప్పుడిదంతా గతం. నాలుగు నెలలుగా నిరీక్షణ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాల శస్త్ర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. నాలుగు నెలలుగా వినికిడి సమస్యతో బాధపడే చిన్నారులకు నిర్వహించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిలిచిపోయాయి. ఈ పరికరాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావడం, వాటిని అమర్చేందుకు వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరికరాల కొనుగోలుకు అనుమతులు రాకపోవడంతో చికిత్సలు నిలిపేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 మంది చిన్నారులు ఈ శస్త్ర చికిత్సల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలోనే చికిత్స చేయాలి పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు ఆత్యాధునిక శస్త్ర చికిత్స విధానం ఇప్పుడు ఈఎన్టీ ఆస్పత్రిలో చేస్తున్నారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చిన్నతనంలో చేయాలి. మూడేళ్ల లోపు చిన్నారులకు ఈ శస్త్ర చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగేళ్లు దాటాక కొందరు, ఐదేళ్ల తర్వాత మరికొందరు గుర్తించగలుతున్నారు. చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి, వారు శస్త్రచికిత్సకు అర్హులు అని నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా వయస్సు ఐదేళ్లు దాటిపోతే ఒక్కోసారి ఈ చికిత్స విజయవంతం కాదని వైద్యులు చెప్తున్నారు. దీంతో చాలా మంది చిన్నారుల వయస్సు దాటి పోతోందని, దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని తల్లిదండ్రులు, వైద్యులు కోరుతున్నారు. శస్త్రచికిత్స కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు హేమవర్షిత్, టి.కన్నారావు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పథకాల పట్ల కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీతో ఇన్నాళ్లూ ఆటాడుకుంది. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మె బాట పడితే తప్ప, వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పుట్టుక నుంచే వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిలిపేసి.. తమకు ప్రజల ఆకాంక్షలేవీ కనబడవు.. వినబడవని నిరూపించుకుంటోంది. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
కె.కోటపాడు: ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో భాగంగా పాతవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను స్థానిక సర్పంచ్ జామి శ్రావణ్, ఎంపీటీసీ వర్రి రామునాయుడు ప్రారంభించారు. అండర్–14 బాల బాలికల విభాగంలో అనకాపల్లి, నర్సీపట్నం, అల్లూరి, విశాఖపట్నం, భీమిలి డివిజన్ల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన బాలుర, బాలికల జట్ల నుంచి 24 మందిని ఎంపిక చేయనున్నట్లు హెచ్ఎం నాగేశ్వరరావు తెలిపారు. విద్యా కమిటీ చైర్పర్సన్ జామి ఉమాదేవి, పీడీలు బి.కృష్ణ, కె.చిట్టి ప్రసాద్, తమ్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు దార్లపూడి విద్యార్థులు ఎస్.రాయవరం: జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన దార్లపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు హెచ్ఎం జాన్మెతెషెలా మంగళవారం తెలిపారు. బాలికల ట్రిపుల్ జంప్లో పి.నాగమౌనిక, జె.తారకలక్ష్మి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వారిని వ్యాయామ ఉపాధ్యాయురాలు నిర్మల, తదితరులు అభినందించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గాంధీనగరం విద్యార్థులు అనకాపల్లి: స్థానిక గాంధీనగరం జీవీఎంసీ హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఎన్.హర్షవర్దన్, టి.లోవరాజు కబడ్డీలో రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు స్థానిక స్కూల్ ఆవరణలో వారిని మంగళవారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం టి.సంధ్య కుమారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ పోటీలు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకూ కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి హెచ్.నేతాజీ, ఉపాధ్యాయుడు కె.అప్పారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు పాల్గొన్నారు. -
టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి
తుమ్మపాల: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూకలెక్టరేట్లో మంగళవారం డీఆర్వో సుబ్బలక్ష్మికి ఫ్యాప్టో జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు చిన్నారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి బోధనలో ఉన్న ఉపాధ్యాయులు టెట్ రాయాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన మార్పులు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ఎస్.దుర్గాప్రసాద్, ఆచంట రవి, కార్యవర్గ సభ్యులు కె.పరదేశి, సిహెచ్.నాగేశ్వరరావు, ధర్మారావు, అక్కు నాయుడు, మామిడి బాబూరావు, మధు, సింహాచలం నాయుడు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వేగం
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ఆపై లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో రాంగ్రూట్లోకి వచ్చిన మినీ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి ప్రేమ సమాజం దగ్గర 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10.20 గంటలకు చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఆనందంగా వెళ్తున్న ఓ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గాజువాకలోని శ్రీహరిపురానికి చెందిన 8 మంది (ఏపీ 39 జీఎక్స్ 3891) మినీ వ్యాన్(టాటా మేజిక్)లో కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మినీవ్యాన్ను ఎడమ పక్కగా రాంగ్రూట్లోకి డ్రైవర్ నడిపాడు. దాంతో అక్కడే రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడం, ఆటో, మినీ వ్యాన్లో ప్రయాణికులు కేకలు వేయడంతో ఒక్కసారిగా ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మినీ వ్యాన్ ముందుభాగం నుజ్జయింది. ఆటో రోడ్డు పక్కగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్తో పక్కకు తొలగించారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదంగా నిర్ధారణ ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి సీఐ ధనుంజయరావు, యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన హైవే అంబులెన్సులు, ఇతర వాహనాల్లో ఆస్పత్రులకు తరలించారు. యలమంచిలి సీహెచ్సీ వైద్యాధికారి నిహారిక, వైద్య సిబ్బంది క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని అంబులెన్సుల్లో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. మినీ వ్యాన్(టాటా మేజిక్) డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన గొంది పెంటయ్య, బాదంపూడి లక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ప్రమాద సమయంలో ఆటోలో పది మంది, మినీ వ్యాన్లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆటోలో ఉన్న కశింకోట మండలం తీడ గ్రాామానికి చెందిన గొంది పెంటయ్య(56), నర్సీపట్నంలో ధర్మిరెడ్డి వీధికి చెందిన బాదంపూడి లక్ష్మి(65) చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారు. -
అడుగుకో గుంత.. హామీలు గోవింద
‘సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాష్ట్రంలో సుమారు 22,229 కిలోమీటర్ల రోడ్లను రూ.861 కోట్లతో బాగు చేస్తాం. నవంబర్ 20 తేదీన ప్రారంభిస్తున్నా.. సంక్రాంతి పండగ తరువాత గుంతల్లేని రోడ్లుగా తీరిదిద్దుతాం.... ఇది సీఎం చంద్రబాబు 2024 నవంబర్ 2న అనకాపల్లి జిల్లాలో పరవాడలో రోడ్లు మరమ్మతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చెప్పిన మాటలు’. రెండు రోజుల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. వారు చెప్పిన సంక్రాంతి వెళ్లి నేటికి 11 నెలలైంది.. వారి హామీ మాత్రం అమలుకాలేదు. ఇటీవల మోంథా తుఫాన్కు ఈ గుంతలు కాస్త పెద్ద గొయ్యిలుగా మారాయి. జిల్లాలో రహదారులు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని రోడ్లపై గుంతలు పూడ్చడమే కాదు ఆర్ అండ్ బీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొత్త రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. కొత్త రోడ్ల మాట దేవుడెరుగు.. గుంతలనే పూడ్చిన పాపానపోలేదు. మూడు జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన రహదారి రోలుగుంట – చోడవరం రోడ్డులో అడుగడుగునా ఉన్న గుంతలు వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల రహదారులు మరీ దారుణంగా ఉన్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో జిల్లాలో ఏకై క మేజరు ప్రాజక్టు తాండవ రిజర్వాయర్కు వెళ్లే నాతవరం–తాండవ రోడ్డులో గుంతులపూడ్చలేదు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదే కాదు నర్సీపట్నం, కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల మీదుగా వెళ్లే నర్సీపట్నం–రేవుపోల వరం రహదారి పరిస్థితి అలాగే ఉంది. ●అనకాపల్లి, కశింకోట మండలాల్లో ప్రధానంగా అనకాపల్లి–మామిడిపాలెం, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ, కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం పంచాయతీ పరిధిలోని రహదారుల్లో పూడ్చిన గుంతలు అనతికాలంలోనే యథాస్థితికి చేరుకున్నాయి. అధ్వానంగా రహదారులు.. నర్సీపట్నం నుంచి రేవుపోలవరం వరకూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7 కోట్లతో 18 కిలోమీటర్ల మేర రోడ్డు వేసింది. పెదబొడ్డేపల్లి నుంచి కోటవురట్ల మండలం రామచంద్రపురం జంక్షన్ శివారు వరకు తారురోడ్డు వేశారు. అక్కడి నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర పనులు మిగిలిపోయాయి. ఇందేశమ్మవాక వరకు రహదారి అధ్వానంగా తయారైంది. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఈ రోడ్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నేటికీ పనులు ప్రారంభించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇందేశమ్మవాక వద్ద పెద్ద గోతులు పడి దారుణంగా ఉంది. ●కై లాసపట్నం నుంచి రాజుపేట, లింగాపురం జంక్షన్ నుంచి కె.వెంకటాపురం, యండపల్లి నుంచి అన్నవరం, కొడవటిపూడి నుంచి కోదండరాంపురం గిరిజన గ్రామానికి, కె.వెంకటాపురం నుంచి తడపర్తి గ్రామానికి వెళ్లే రహదారులను నిర్మించాల్సి ఉంది. ●నక్కపల్లి మండలంలో గునిపూడి–బంగారయ్యపేట– పెంటకోట వరకూ రూ.1.40 కోట్లతో 8 కిలోమీటర్ల తారు రోడ్డు వేశారు. వేసిన మూడు నెలలకే తారు పెచ్చులూడిపోయింది. ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ టీడీపీ నాయకుడే. గుంతలు పూడ్చిన అనతికాలంలోనే అనకాపల్లి మండలంలో తొమ్మిది రహదారుల్లో సుమారు 50 కిలోమీటర్ల మేర రూ.72 లక్షలతో గుంతలు పూడ్చారు. అనకాపల్లి– తుమ్మపాల, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ, కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం పంచాయతీ పరిధిలో రోడ్లు మళ్లీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. కశింకోట మండలంలోని జి.భీమవరం నుంచి కన్నూరుపాలెం వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డులో సుమారు ఐదు కిలోమీటర్ల మేర రూ.7 లక్షలతో గుంతలు పూడ్చారు. అవి కూడా యథాస్థితికి వచ్చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిని వాహన చోదకుల పాలిట ప్రాణసంటంగా మారాయి. గంధవరం నుంచి వెంకన్నపాలెం, చోడవరం, విజయరామరాజు పేట, వడ్డాది, కోమళ్లపూడి, రావికమతం, కొత్తకోట, రోలుగుంట వరకూ బీఎన్ రోడ్డులో 48 కిలో మీటర్ల మేర గోతులు నూతుల్లా దర్శనమిస్తున్నాయి. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్(60:40)తో రూ.112 కోట్లు మంజూరు చేశారు. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్(ఎస్ఆర్ కన్స్ట్రక్షన్)కు రోడ్డు నిర్మాణ బాధ్యత అప్పగించారు. ఎన్నికలకు ముందు రూ.3 కోట్లతో కోమలపూడి నుంచి బంగారుమెట్ట వరకూ నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులు విస్తరణ పనులు చేశారు. మిగతా 44 కిలోమీటర్ల మేర రోడ్డు వేయకుండా వదిలేశారు. నిర్ణీత వ్యవధిలో రోడ్డు వేయకపోవడంతో గత ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టర్ని బ్లాక్లో పెట్టడానికి సిద్ధపడ్డారు. రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక ఎమ్మెల్యే ధర్నా కూడా చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయినా ఈ రోడ్డులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన సొంత నిధులు రూ.1.60 కోట్లతో సుమారు ఒక కిలోమీటరున్నర మేర సీసీ, బీటీ రోడ్లను వేయించారు. చోడవరం టౌన్ ప్రారంభంలో బల్క్మిల్క్ సెంటర్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకూ నిబంధనల ప్రకారం ఏడు అడుగులు విస్తరించి రోడ్డు నిర్మించారు. ఎన్నికల ముందు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా అలానే ఉంది. ఈ గోతుల కారణంగా ఇప్పటి వరకూ 30 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. సుమారుగా 40 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. -
అధ్యక్షా.. తాండవ రోడ్ల సంగతేంటి ?
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నర్సీపట్నంలో బలిఘట్టం–తుని రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర గుంతలను తూతూ మంత్రంగా పూడ్చారు. పూడ్చిన అనతి కాలంలోనే మళ్లీ గుంతలు పడ్డాయి. తీనార్ పాలెంలో గుంతల పూడ్చిన రోడ్డు కూడా ధ్వంసమైంది. గొలుగొండ మండలంలో కృష్ణదేవి పేట– కొంగ సింగి రోడ్డులో మూడు కిలోమీటర్ల గుంతలు పూడ్చారు. నాణ్యతాలోపం కారణంగా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. చోద్యం–విప్పలపాలెం రోడ్డులో ఐదు కిలో మీటర్ల మేర గుంతలు పూడ్చనేలేదు. దారమట్టం నుంచి గొలుగుండ వరకూ ఐదున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. జోగుంపేట–సాలిక మల్లవరం 3 కిలోమీట్లర మేర రోడ్డు కాదు కదా..కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. నాతవరం మండలంలో ‘నాతవరం–తాండవ’ రోడ్డు 7 కిలోమీటర్ల మేర పూర్తిగా ధ్వంసమైంది. రెండు జిల్లాల్లో 18 గ్రామాల ప్రజలు రోజూ రాకపోకలు సాగించే నాతవరం–తాండవ ఆర్అండ్బీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన తాండవ రిజర్వాయర్, సరుగుడు జలపాతాలకు ఇదే రోడ్డులో వెళ్లాలి. ఎన్నికలకు ముందు నాతవరం–తాండవ మధ్య రోడ్డును వేస్తామంటూ హామీ ఇచ్చి..అధికారం చేపట్టి 16 నెలలైనా ఆ రోడ్డు వైపు పట్టించుకున్న పాపాన పోలేదంటూ స్థానికులు వాపోతున్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు
నాతవరం: గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని చమ్మచింత జంక్షన్ వద్ద ఎస్సై, సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.40 వేలు విలువ చేసే ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో తిరువూరుకు చెందిన డి.దీపక్బాబు(24), కోయంబేడుకు చెందిన ఆర్.గౌతమ్(44), తిరువూరుకు చెందిన ఎ.హరీష్(22), కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలేనికి చెందిన తుమ్మ అప్పారావు(60)లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. ధారకొండలో గంజాయి కొనుగోలు చేసి తుని రైల్వే స్టేషన్ ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. -
అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
నర్సీపట్నం: వేదపండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, విద్యుత్ దీపాల కాంతుల నడుమ స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీనివాసుని కల్యాణంతో నర్సీపట్నం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ ఘట్టాన్ని కళ్లారా చూసి భక్తులు పారవశ్యం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో స్టేడియం ప్రాంగణం మార్మోగింది. తిరుమల శ్రీవారి అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. స్వామివారికి అర్చన, తోమాల సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. మారుమూల ప్రాంతాల్లో హైందవ ధర్మంపై ప్రచారాన్ని చేయడానికి గోవింద కల్యాణాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు లడ్డూతోపాటు కుంకుమ, హ్యాండ్ బుక్ అందజేశారు. స్వామి వారి కల్యాణంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, చింతకాయల విజయ్, సువర్ణ దంపతులు, కౌన్సిలర్ రాజేష్ దంపతులు, తదితరులు పాల్గొన్నారు. -
శంభో శివ శంభో
●కార్తీక దీపపు కాంతులతో శోభిల్లిన శైవక్షేత్రాలు ●భక్తిశ్రద్ధలతో రెండో సోమవారం పూజలు కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు దీప కాంతులతో శోభిల్లాయి. శివ నామస్మరణతో మార్మోగాయి. శివారాధన కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సూర్యోదయానికి ముందే భక్తులు నదులు, సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, శివాలయాల్లో పూజలు జరిపారు. ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, మహాన్యాస రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. – సాక్షి, నెట్వర్క్ -
వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందు కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అందుకు సంబంధించిన సమాచారం సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెండు వారాల్లో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో తాగునీటి పథకాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలన్నారు. ప్రతి మండలం, మేజరు పంచాయతీల్లో వరుసగా 25 సెంట్లు, 15 సెంట్ల స్థలాలను గుర్తించి, వాలీబాల్ కోర్టులు నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్తీక వన భోజనాలు ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు.ప్రతి షాపులో చెత్తబుట్టను ఉంచాలన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు విచ్చలివిడిగా రోడ్డుపై పారవేసే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్ కుమార్, డ్వామా పీడీ పూర్ణమాదేవి, గ్రామవార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, ఈవోపీఆర్డీ నాగలక్ష్మి, డీపీవో సందీప్ పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 85 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 82 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–24, కుటుంబ కలహాలు–4, చీటింగ్ –5, ఇతర విభాగలకు చెందనవి–49 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
చోడవరంలో మెగా జాబ్ మేళా రేపు
మెగా జాబ్ మేళా వాల్పోస్టర్ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి తుమ్మపాల: విద్యార్హతగల ప్రతి ఒక్కరికీ ఉద్యో గం అందించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. చోడవరంలో ఈ నెల 5న నిర్వహించనున్న జాబ్ మేళా వాల్పోస్టర్ను కలెక్టరేట్లో ఆమెతో పాటు జేసీ జాహ్నవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాలో 17 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 1,500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని చెప్పా రు. టెన్త్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీయువకులు జాబ్మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ ఎన్. గోవిందరావు మాట్లాడుతూ ఆసక్తి గల వారు తమ వివరాలను naipunyam.ap.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్ నంబర్తో పాటుగా బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్స్లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 94947 91935, 79811 02224 అనే ఫోన్నంబర్ల సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో ఎస్.సుబ్బలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.


