breaking news
Anakapalle District Latest News
-
హోం మంత్రి రైతులను మభ్యపెట్టడం తగదు
● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు ధ్వజంనక్కపల్లి: మండలంలో రెండో విడత భూములు సేకరిస్తున్న గ్రామాల్లో రైతులకు హోం మంత్రి వంగలపూడి అనిత వాస్తవాలు చెప్పాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు కోసం మొదటి విడతలో 2080 ఎకరాలు కేటాయించగా, రెండో విడతలో 3,800 ఎకరాల సేకరణ కోసం కాగిత, నెల్లిపూడి, డీఎల్పురం, వేంపాడు గ్రామాల్లో రైతులతో గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సోమవారం హోం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో రైతులతో సమావేశమై మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. భూములిస్తేనే అభివృద్ధి జరుగుతుందని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారన్నారు. దీన్ని వారంతా వ్యతిరేకించడంతో మాట మార్చారన్నారు. నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక పక్క ఏపీఐఐసీ వారు గ్రామాల వారిగా సేకరించే భూములను సర్వే నంబర్లతో సహా గుర్తించి కలెక్టర్కు లేఖ రాస్తే, ఇంకా నోటిఫికేషన్ ఎందుకన్నారు. భూములు తీసుకునే ఉద్దేశం లేనప్పుడు గ్రామసభలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి డీఎల్పురం వద్ద క్యాప్టివ్ పోర్టు నిర్మించేందుకు అనుమతి ఇచ్చారన్నారు. దాంతో మత్స్యకారులు వేట సాగించే పరిస్థితి ఉండదన్నారు. మిట్టల్ స్టీల్ప్లాంట్పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేస్తే పక్కనే క్యాంపు కార్యాలయం వద్ద నుంచి హోం మంత్రి వచ్చి వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. ఓట్లేసి గెలిపించిన రైతుల కంటే కార్పొరేట్ వర్గాలే ముఖ్యమనే ధోరణితో వ్యవహరించారన్నారు. సమావేశంలో సీపీఎం మండల కన్వీనర్ మనబాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరి జయంతి ఏర్పాట్ల పరిశీలన
పార్కులో ఏర్పాట్లు పరిశీలిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128 జయంతి వేడుకలను ఈ నెల 4న కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులు వద్ద ఘనంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ అల్లూరి పార్కును ఆయన మంగళవారం పరిశీలించారు. పార్కులో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అధికారులు, కమిటీ సభ్యులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ, అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పట్టాభిరామ్ సూచనలు అమూల్యం
పట్టాభిరామ్ను జ్ఞాపికతో సత్కరిస్తున్న మాజీ వీసీ ముర్రు, ఖాసిమ్ (ఫైల్) కె.కోటపాడు : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ మృతి పట్ల అయ్యన్న విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె.ఖాసిమ్ సంతాపం తెలిపారు. తమ విద్యాసంస్థలతో పట్టాభిరామ్కు మంచి అనుబంధం ఉందని తెలిపారు. గతంలో ఇక్క పదో తరగతి విద్యార్థులకు పరీక్షలంటే భయాందోళనలను తొలగించి మానసికంగా సిద్ధం చేసేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అమూల్యమైన సూచనలు అందించారని తెలిపారు. పట్టాభిరామ్ మృతి పట్ల ఖాసిమ్తో పాటు రాజమండ్రి నన్నయ యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్స్లర్ ముర్రు ముత్యా లనాయుడు సంతాపాన్ని ప్రకటించారు. -
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
● 32 కి.మీ.పరిధిలో లైట్లు, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు ● 132 పాయింట్లలో తాగునీటి సదుపాయం ● స్నానఘట్టం వద్ద గజ ఈతగాళ్లు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తుల రద్దీని, ట్రాఫిక్ను నియంత్రించడానికి పోలీస్ బందోబస్తు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలు, రద్దీ ప్రదేశాల వద్ద తోపులాటలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సౌకర్యాలు, వైద్య సేవలు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 32 కిలోమీటర్ల మేర 132 పాయింట్లలో తాగునీటి సౌకర్యం, 400 మరుగుదొడ్లు, పారిశుధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన అంబులెన్సులు, 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్ఎం లేదా ఆశ కార్యకర్తను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గంలో, రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైన మేరకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. సింహగిరిపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రణ పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా చూసుకోవాలని, గిరి ప్రదక్షిణ జరిగే దారిలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తులకు సాంకేతిక సాయం అత్యవసర సమయాల్లో ప్రత్యేక యాప్ ద్వారా సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ‘అస్త్రం’యాప్ ద్వారా సహాయం పొందవచ్చని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, హనుమంతువాక, ఇసుకతోట జంక్షన్ల వద్ద తాత్కాలిక వంతెనలు నిర్మించాలని సీపీ సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే కౌంటర్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావు, డీఆర్వో భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, రెవెన్యూ, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ సమీక్ష సింహాచలం: సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్.. దేవస్థానం అధికారులతో కలిసి మంగళవారం ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. సింహాచలంలోని కొండదిగువ తొలిపావంచా, అడవి వరం జంక్షన్, ముడసర్లోవ, విశాలాక్షినగర్, తెన్నేటి పార్క్, లుంబినీ పార్క్ బీచ్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధారలోని మాధవస్వామి ఆలయం, హైవే, ఎన్ఎస్టీఎల్, లక్ష్మీనగర్, గోపాలపట్నం మీధుగా తిరిగి సింహాచలం చేరుకునే గిరి ప్రదక్షిణ మార్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భక్తుల కోసం ప్రదక్షిణ మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులు, తాగునీటి పాయింట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరంతర పారిశుధ్య పర్యవేక్షణకు సిబ్బందిని, డస్ట్బిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. రాత్రి వేళలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చీకటి ప్రదేశాల్లో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్గమధ్యలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ, దేవస్థానం అధికారులు సమన్వయంతో ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. దేవస్థానం ఈవో త్రినాథరావు, ఈఈ రమణ, జోనల్ కమిషన్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన సింహాచలం: గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్.. నగర సీపీ శంఖబ్రత బాగ్చి, జేసీ మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవదార, మురళీనగర్, ప్రహ్లాదపురం, కుమారి కల్యాణమండపం మీదుగా సింహాచలంలోని తొలిపావంచా వరకు ఆయన సందర్శించి.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం తొలిపావంచా వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత
● కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: జూలై నెలను డెంగ్యూ నివారణ మాసంగా పాటించాలని, డెంగ్యూ వ్యాప్తి పట్ల ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో జాతీయ డెంగ్యూ మాసోత్సవం –2025 పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూపై అవగాహన కల్పించేందుకు మాసోత్సవాలు నిర్వహించాలని డీఎంహెచ్వో బాలాజీని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం పెంచడం, తాగునీటి నిల్వల వద్ద చెత్త తొలగించడం, దోమల వృద్ధి నిరోధక చర్యలు తీసుకోవడం వంటి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. నెల రోజుల పాటు కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని జిల్లా మలేరియా అధికారి కె.వి. దొరను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, గ్రామీణ శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుని సమష్టిగా డెంగ్యూపై జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ కృష్ణారావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జ్యోతి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు. -
రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో రావికమతం వ్యక్తి మృతి
రావికమతం: రాజమండ్రి వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన ముక్కా నాగేశ్వరరావు(53) మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కా నాగేఽశ్వరరావు కడియం నర్సరీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా వ్యాన్లో వెళుతుండగా రాజమండ్రి వద్ద టైర్ పాంక్చర్ అయ్యింది. పంక్చర్ వేయించడానికి నాగేశ్వరరావు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని రాజమండ్రి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యవతి, కుమారుడు హేమంత్ (25), కుమార్తె (22) ఉన్నారు. ఈ ఘటనపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కారులో 107 కేజీల గంజాయి పట్టివేత
● యూపీకి చెందిన ఇద్దరు నిందితులు అరెస్టు చోడవరం: కారులో అక్రమంగా తరలిస్తున్న 107 కేజీల గంజాయిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు. చోడవరం ఎఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బీఎన్రోడ్డులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌరీపట్నం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, వడ్డాది నుంచి చోడవరం వైపు వస్తున్న కారును ఆపి సోదా చేశారు. అందులో మూడు బస్తాల్లో నింపిన 107 కేజీల గంజాయిని గుర్తించారు. దాంతోపాటు కారును స్వాధీనం చేసుకుని, ఉత్తరప్రదేశ్కు చెందిన నిందితులు జితేంద్ర, వహీద్ అహ్మద్లను అరెస్టు చేసినట్టు ఏఎస్ఐ తెలిపారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించామన్నారు. -
స్నేహితురాలి ఇంటికే కన్నం
● ఇంటికి కబుర్లు చెప్పడానికి వచ్చి 18 తులాల బంగారు ఆభరణాల చోరీ ● నిందితురాలి అరెస్ట్, రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీ పెందుర్తి : స్నేహితురాలి ఇంటికే కన్నం వేసింది ఓ ఘనురాలు. కబుర్లు చెబుదామని రోజూ ఇంటికి వచ్చి నగలు భద్రపరిచే ప్రదేశాన్ని కనిపెట్టి చాకచక్యంగా ఎత్తుకుపోయింది. దాదాపు మూడు నెలల తరువాత స్నేహితురాలిపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం పెందుర్తి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ క్రైం విభాగం ఏసీపీ డి.లక్ష్మణరావు ఆయా వివరాలను వెల్లడించారు. సింహచలం సమీపంలోని విరాట్నగర్కు చెందిన రెయ్య జ్యోతి, చినముషిడివాడకు చెందిన ఎస్.వాణి స్నేహితులు. జ్యోతి భర్త కెనరా బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. కాగా వాణి తరచూ జ్యోతి ఇంటికి వచ్చేది. కబుర్లు చెబుతూ ఇంటిలో కలియతిరిగేది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 15న వాణి జ్యోతి ఇంటికి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోయింది. రాత్రికి ఇంట్లో పడకగదిలో బంగారం మాయం అయినట్లు జ్యోతి గుర్తించింది. తొలుత ఎవరో ఎత్తుకుపోయారని భావించారు. కొద్దిరోజులకు తన స్నేహితురాలు వాణి తన ఇంటికి రావడం మానేసింది. దాంతో పాటు ఆమె నడవడికలో మార్పులు రావడాన్ని గమనించిన జ్యోతి ఆమెను అనుమానించి జూన్ 9న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల సూచనలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెందుర్తి క్రైం పోలీసులు వాణిపై నిఘా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాణి నేరం చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్ట్ చేసి రూ.15 లక్షల విలువైన 228.73 గ్రాములు(సుమారు 18 తులాలు) బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబరిచిన క్రైం విభాగం వెస్ట్ జోన్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పెందుర్తి ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీలు జి.నాగరాజు, టి.పద్మజ, పీసీలు పి.పైడిరాజు, జీవీవీ కిషోర్, టి.శివప్రసాద్, బి.దేముడుబాబు, ఎల్.కె తాతారావు, ఆర్.సంతోషిలను ఉన్నతాధికారులు అభినందించారు. -
9న భవన నిర్మాణ కార్మికుల సమ్మె
అనకాపల్లి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన ఒక రోజు సమ్మె తలపెట్టినట్టు ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ తెలిపారు. మండలంలో మూలపేట గ్రామంలో మేస్త్రి సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదన్నారు. సహజ, ప్రమాదంలో చనిపోయిన కార్మికులు కుటుంబాలకు ఇచ్చే బీమా పరిహారం, పెండింగ్ క్లెయిమ్స్కు తక్షణమే నిధుల విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సీహెచ్ అప్పలరాజు, కార్యదర్శి మారేడిపూడి సత్యనారాయణ, నాయకులు గుమ్మాల నాగేశ్వరరావు, సత్తిబాబు, గణేష్, రామునాయుడు, పాల్గొన్నారు. -
‘తొలి అడుగు’.. రసాభాస
● గ్రామ కమిటీలపై నిలదీసిన టీడీపీ నేతలు ● ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే బండారు చిందులు ● రెండు వర్గాలుగా విడిపోయి కార్యకర్తల కుమ్ములాట ● దేవరాపల్లిలో చెప్పులు విసురుకున్న పార్టీ నేతలు ● రచ్చరచ్చగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశం దేవరాపల్లి: తొలి అడుగే తడబడింది. అట్టహాసంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతల ప్రశ్నలతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కంగుతిన్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. దేవరాపల్లిలోని రైవాడ అతిథి గృహ ఆవరణలో టీడీపీ ముఖ్య నాయకులతో మంగళవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశం రసాభాసగా మారింది. గ్రామాల్లో ఇంటింటా పర్యటనపై ఎమ్మెల్యే బండారు కేడర్కు దిశానిర్దేశం చేస్తుండగా.. సీనియర్ టీడీపీ నాయకుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ జోక్యం చేసుకొని ఏకపక్షంగా, రహస్యంగా జరిగిన టీడీపీ గ్రామ కమిటీల వివరాలు తెలిపాలని కోరారు. ఆయా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు చర్చిద్దామని ఎమ్మెల్యే మాట దాట వేశారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత దేవరాపల్లికి చెందిన మరో నాయకుడు గొర్లి దేముళ్లు సైతం నూతన కమిటీలలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందని ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే బండారు సహనం కోల్పోయారు. తీవ్ర ఆగ్రహావేశంతో ‘నీకు పార్టీతో సంబంధం లేదు, నిన్ను పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశాన’ంటూ విరుచుకుపడ్డారు. సమావేశం ముగుస్తున్న క్రమంలో మళ్లీ చిటిమిరెడ్డి సూర్యనారాయణ గ్రామ కమిటీలపై నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలని కోరగా ‘ముందు నీ గ్రామంలో సమస్య పరిష్కరించుకో’ అంటూ ఎమ్మెల్యే శివాలెత్తిపోయారు. తనను పదేపదే ప్రశ్నిస్తే నిన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చిటిమిరెడ్డిపై కేకలు వేయడంతో అక్కడున్న పార్టీ శ్రేణులంతా నివ్వెరపోయారు. పదే పదే పార్టీ నుంచి సస్పండ్ చేస్తానని బెదిరింపులకు దిగడం పట్ల వారు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతమందిని సస్పెండ్ చేస్తారో చేసేయండి అంటూ బాహాటంగా ఒక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎదురుతిరిగారు. దీంతో సమావేశం ముగించి అక్కడి నుంచి ఎమ్మెల్యే కారు ఎక్కి వెళ్లిపోయారు. కేడర్ తప్పు చేస్తే సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యే బండారు సహనం కోల్పోయి మాట్లాడటాన్ని పార్టీ నాయకులు పలువురు బాహాటంగా తప్పు పట్టారు. అనంతరం టీడీపీలోని రెండు వర్గాలకు చెందిన టీడీపీ నేతలు పరస్పర దూషణలతో బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అరుపులు కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. -
వైవిధ్యం
ఆషాఢం..ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ముంచంగిపుట్టు: జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. గిరిజన గూడాల్లో పండగ సందడి వ్యవసాయం కలిసిరావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పూజలు పూరీ జగన్నాథుని రథయాత్ర తరువాత నిర్వహణ గ్రామ పొలిమేరల్లో ఆధ్యాత్మిక వాతావరణం పూర్వీకుల నుంచి ఆనవాయితీ సంస్కృతీ సంప్రదాయాలను ప్రాధాన్యమిస్తున్న ఆదివాసీ గిరిజనులు -
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ ప్రతినిధుల పర్యటన
క్యాప్టివ్ పోర్టు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మిట్టల్ కంపెనీ ప్రతినిధులు నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం మండలంలో పర్యటించారు. కంపెనీ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను వారు పరిశీలించారు. అమలాపురం, డీఎల్ పురం, వేంపాడు, బోయపాడు తదితర గ్రామాల్లో స్టీల్ప్లాంట్ కోసం మొదటి విడతలో 2080 ఎకరాలను కేటాయించింది. జాతీయ రహదారి కాగిత నుంచి స్టీల్ప్లాంట్ వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీంతో కంపెనీ ప్రతినిధులు తమకు కేటాయించిన భూములను, అక్కడ ఏపీఐఐసీ వారు చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు స్టీల్ప్లాంట్ కోసం కేటాయించిన భూములు, వాటి వివరాలు, భౌగోళిక స్వరూపాన్ని కంపెనీ ప్రతినిధులకు చూపించారు. ముఖ్యంగా డీఎల్పురం వద్ద కంపెనీ నిర్మించే క్యాప్టివ్ పోర్టు పరిసరాలను పరిశీలించారు. వెసల్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం మొదటి విడతలో పోర్టు నిర్మాణం కోసం 168 ఎకరాలు అవసరం కానుంది. వీరి మిట్టల్ కంపెనీ ప్రతినిధుల వెంట తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఉన్నారు. -
గౌరవప్రదమైనది వైద్య వృత్తి
● అంకితభావం, సేవా దృక్పథంతో మెలగాలి ● డాక్టర్స్ డే వేడుకలో కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ప్రజారోగ్యమే ధ్యేయంగా అంకిత భావంతో వైద్య సేవలందజేయాలని, రోగుల పట్ల సేవా దృక్పథంతో మెలగాలని కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్యులందరికీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవంలో ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ కృష్ణారావు తదితర వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వైద్యుని పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని, ఆవశ్యకమైనదని, ప్రజారోగ్య శ్రేయస్సుకు వైద్యులందరూ కృషి చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి సామాజిక ప్రగతికి దోహదపడతాయని ఆమె అన్నారు. జిల్లాలో గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల ఆవశ్యకత చాలా ఉందని, ఇప్పటికే చాలామంది వైద్యులు కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. సమాజంలో తమ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా వైద్య సేవలందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జ్యోతి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రశాంతి, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
పడుతూ.. లేస్తూ.. పాఠశాలకు..
● అధ్వానంగా సీతంపాలెం–పెదబోదిగల్లం రోడ్డు ● బురద రోడ్డులో విద్యార్థుల రాకపోకలు నక్కపల్లి: శివారు గ్రామాల విద్యార్థులు రోజూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలలకు చేరుకుంటున్న పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమించాయి. వర్షం పడితే పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఇటువంటి దుస్థితినే నక్కపల్లి మండలంలో పెదదొడ్డిగల్లు, సీతంపాలెం(శివారు) గ్రామాల విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్నారు. సీతంపాలెం గ్రామంలో ఉన్న యూపీ పాఠశాలను ఇటీవల ప్రభుత్వం రేషనలైజేషన్లో పెదబోదిగల్లం పాఠశాలలో విలీనం చేసింది. గ్రామస్తులంతా ఆందోళన చేయడంతో తిరిగి యూపీ పాఠశాలను గ్రామంలోనే కొనసాగిస్తున్నారు. అయితే 8, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదబోదిగల్లం పాఠశాలకు నిత్యం వెళ్లొస్తున్నారు. ఈ రెండు గ్రామాలకు మధ్యలో పోలవరం కాలువ ఉంది. కాలువ నిర్మాణపు పనులు చేసే కాంట్రాక్టర్ రోడ్డును ఇష్టానుసారం తవ్వేసి గ్రావెల్తో అప్రోచ్ రోడ్డు వేయకుండా తూతూమంత్రంగా మట్టి రోడ్డు వేసి వదిలేశారు. వర్షం పడితే ఈ రోడ్డు అంతా చెరువులా తయారై బురదగా మారుతోంది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడడంతో సీతంపాలెం, బోదిగల్లం రోడ్డు అధ్వానంగా తయారైంది. మంగళవారం బోదిగల్లం పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు నరకయాతన పడ్డారు. రోడ్డుపై చేరిన వర్షపు నీటిలో నుంచే ఇబ్బందులు పడుతూ పాఠశాలకు చేరుకున్నారు. సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు బురదలో జారి పడి గాయాలు పాలవుతున్నారు. మట్టి రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో ఏమాత్రం ఆదమరిచినా బురదలో జారి పోలవరం కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. బడికెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగొచ్చే వరకు భయాందోళనతో ఎదురు చూడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. కె.జె.పురం జంక్షన్లో వర్షానికి ఇళ్లలోకి చేరిన నీరు అనకాపల్లి టౌన్: జిల్లా అంతటా మంగళవారం తడిసి ముద్దయింది. ఇటీవల కాలంలో అక్కడక్కడ మాత్రమే కురిసిన వర్షం ఈసారి జిల్లా మొత్తాన్ని తడిపేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులతో వాన కురుస్తూనే ఉంది. జిల్లాలో 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనకాపల్లిలో 28.4 మి.మీ., రావికమతంలో 21.4, ఎస్.రాయవరం 12.4, దేవరాపల్లి 11.2, కె.కోటపాడు 10, నక్కపల్లి 10, మాడుగుల 9.8, మునగపాక 9.4, బుచ్చెయ్యపేట 9.2, పరవాడ 9, చోడవరం 8, చీడికాడ 7.8, అచ్యుతాపురం 7.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తమ పొలాలను దుక్కు దున్ని నారుమడులకు సిద్ధం చేస్తున్నారు. సీతం పాలెం, బోదిగల్లం గ్రామాల మధ్య బురదగా ఉన్న రోడ్డులో ఒకరి చేయి ఒకరు పట్టుకుని వస్తున్న విద్యార్థులు బురద రోడ్డులో నీరు చేరడంతో గట్లపై నుంచి పడుతూ లేస్తూ రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు -
రూ.1.2 కోట్ల విలువైన సెల్ఫోన్ల రికవరీ
అనకాపల్లి: చోరీకి గురైన 625 సెల్ఫోన్లను పదో విడతలో రికవరీ చేశామని, వీటి విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 5,600 ఫిర్యాదులు నమోదు కాగా.. 9 విడతల్లో 2,711 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 10వ విడతతో కలిపి మొత్తం 3,336 మొబైల్ ఫోన్లను (రూ.5.27 కోట్ల విలువైన) రికవరీ చేశామన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో ఫోన్లను కనుగొని రికవరీ కోసం జిల్లా పోలీసులతో ప్రత్యేకంగా ఒక టీమ్ను ఏర్పాటు చేశామశ్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా, పోలీస్ స్టేషన్కు రాకుండా, మొబైల్ వివరాలను తెలియజేసి రికవరీ చేసే విధానాన్ని అమలు చేసి ప్రజలకు సౌలభ్యం కల్పించామన్నారు. ఫోన్ పోయిన వెంటనే సెల్ నంబర్ 93469 12007కు హాయ్ అని వాట్సప్ మెసేజ్ పంపి వచ్చే లింకు ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చన్నారు. www.ceir.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, సైబర్ సెల్–సోషల్ మీడియా సీఐ బెండి వెంకటరావు, ఎస్బీ సీఐలు బాల సూర్యారావు, లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, రమేష్, గఫూర్, ఐటీ కోర్ ఎస్ఐ బి.సురేష్ బాబు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ భవనానికి భూమి పూజ
అనకాపల్లి: మండలంలో ఏఎంఎఎల్ కళాశాల జంక్షన్ సమీపంలో ఏపీ రెవెన్యూ జిల్లా సర్వీసెస్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి సోమవారం కలెక్టర్ విజయకృష్ణన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత అనకాపల్లిలో రెవెన్యూ శాఖకు భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చేరువ కావాలన్నారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను మరింత బాధ్యతాయుతంగా పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ కి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.రాజేష్, ఏపీ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంటి, ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ ఎస్.ఎస్.వి.నాయుడు, జిల్లా అధ్యక్షుడు రత్నం, జిల్లా కార్యదర్శి ఎలమంచిలి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ల దొంగ అరెస్ట్
అచ్యుతాపురం రూరల్ : వేర్వేరు చోట్ల ఐదు బైకులను దొంగతనం చేసిన కశింకోట మండలం చెరకాం గ్రామానికి చెందిన రెడ్డి పైడంనాయుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నమ్మి గణేష్, ఎస్ఐ సుధాకర్ సోమవారం అచ్యుతాపురం కూడలిలో తనిఖీలు చేస్తుండగా టీవీఎస్ మోపెడ్పై వస్తున్న రెడ్డి పైడంనాయుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా వేర్వేరు చోట్ల 5 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అచ్యుతాపురం పోలీసులు తెలిపారు. -
చిన అప్పనపాలెంలో ఆలయ హుండీల చోరీ
● నగదు, బంగారం, వెండి వస్తువులతో పరారీ బుచ్చెయ్యపేట: మండలంలో చిన అప్పనపాలెంలో పైడితల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం ఉదయం గుడికి వెళ్లిన భక్తులు ఇక్కడ తలుపులు తెరచి, హుండీలు లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మవారి మెడలో వస్తువులతోపాటు ఆలయంలో సీసీటీవీ హార్డ్ డిస్క్ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టుకుపోయారు. ఆలయంలో హుండీ, గర్భగుడిలో మరొక హుండీతోపాటు పంచలోహ విగ్రహానికి ధరించిన పావు తులం బంగారు మంగళసూత్రాలు, 10 తులాల వెండి తాడులు ఎత్తుకుపోయారు. అమ్మవారి మెడలో ఉన్న మరో 50 తులాల వెండి వస్తువులను తీసి పక్కన పడేశారు. పగులగొట్టిన ఒక హుండీని ఆలయం వెనకాల, మరో హుండీని, తాళాలను పంట పొలంలో పారేశారు. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీంని రప్పించి విచారణ చేస్తున్నారు. -
చెరువును ప్రైవేటు భూమిగా మార్చేశారు..
నిన్నటి వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న చెరువును.. నేడు రూ.20 కోట్ల విలువ చేసే ప్రైవేటు భూమిగా మార్చేస్తూ జిల్లా అధికారుల ఆదేశాలతో 22ఏ నుంచి తొలగించేసిన రెవెన్యూ అధికారులు తీరుపై నిరసనగా యలమంచిలి మన్సిపాలిటీ పరిధిలోని పెదపల్లి, మంత్రిపాలెం, పెదగొల్లలపాలెం గ్రామాల యువకులు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ యర్రవరం రెవెన్యూ పరిధిలో చెరువుగా ఉన్న సర్వే నం.286లో 12.49 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం 3.27 ఎకరాలను సర్వే నం.286–2బీగా సబ్ డివిజన్ చేసి ప్రైవేటు వ్యక్తుల పేరున రాసిచ్చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు భూమిని తనకు కేటాయిస్తూ కలెక్టర్ ప్రొసిడింగ్స్ ఇచ్చారంటూ అప్పలరాజు అనే వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, చెరువును కాపాడాలని కోరుతూ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణలను ప్రోత్సహించడంపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసిడింగ్స్ను పునః పరిశీలించాలని, 22ఏ తొలగింపు ప్రొసిడింగ్స్ను రద్దు చేయాలని కోరారు. -
భూములు ఆన్లైన్ చేయాలని నిరసన
భూములను ఆన్లైన్ చేయాలంటూ నిరసన తెలుపుతున్న రైతులు పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా భూములను ఆన్లైన్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ మాకవరపాలెం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులు కోడూరు పరిధిలో ఉన్న తమ భూములను ఆన్లైన్ చేయకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రైతుల నుంచి ఎకరాకు రూ. లక్ష చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు కాకపోవడంతో గత్యంతరం లేక అప్పులు చేసి నగదు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. రెవెన్యూ అధికారులు గ్రామంలో భూములను సర్వే చేసి ఆన్లైన్ చేయాలని పీజీఆర్ఎస్లో అధికారులను కలిసి విన్నవించుకున్నారు. -
చర్చలు లేవు.. సమాధానాలు లేవు
● తూతూమంత్రంగా కౌన్సిల్ సమావేశం యలమంచిలి రూరల్: అజెండాలో అంశాలపై చర్చ లేదు.. సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలపై స్పష్టమైన సమాధానాలు లేవు.. విద్యుత్ శాఖ ఏఈపై కొత్తపాలెం వార్డు సభ్యుడి ఆగ్రహం.. మున్సిపాలిటీలో విలీనమై 14 ఏళ్లయినా అభివృద్ధి జాడ లేనందున కొక్కిరాపల్లిని పంచాయతీగా డీనోటిఫై చేయాలన్న డిమాండ్.. ఇదీ సంక్షిప్తంగా యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోని ప్రధానాంశాలు. యలమంచిలి పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం చైర్పర్సన్ పిల్లా రమాకుమారి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 22 అంశాలపై చర్చ లేకుండానే ముగించారు. పారిశుధ్యం, తాగునీరు, రెవెన్యూ, వీధిలైట్లు, విద్య, నీటి పారుదల తదితర శాఖల అధికారులు తమ శాఖల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రగతి గురించి సభ్యులకు వివరించారు. పారిశుధ్య నిర్వహణ బాగులేదని చైర్పర్సన్ రమాకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధిలైట్ల నిర్వహణపై ఫిర్యాదులు చేస్తున్నా సకాలంలో పరిష్కారం కావడంలేదని, రంగా వారి వీధిలో లైట్లు వెలగడం లేదని సంబంధిత విభాగం అధికారులకు రెండు నెలలుగా చెబుతున్నా పట్టించుకోలేదని మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా, మరికొందరు సభ్యులు లేవనెత్తారు. సిబ్బంది కొరత కారణంగా ఆయా ప్రాంతాల్లో వారానికొకసారి మాత్రమే వీధి దీపాలను మార్చే అవకాశం ఉందని చైర్పర్సన్ చెప్పారు. కొత్తపాలెంలో కచ్చా రోడ్డు సమస్య ఎంతోకాలంగా సమావేశంలో ప్రస్తావిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్ రాపేటి సంతోష్ అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను బకాయిలు వసూలు కావడం లేదని ఆర్వో విశ్వేశ్వరరావు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపునకు సభ్యులు తోడ్పాటునందించాలని ఎంఈవో ఎం.శ్రీనివాసరావు కోరారు. తమ గ్రామంలో విద్యుత్తు సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని చెబుతుండగా విద్యుత్తు శాఖ ఏఈ కనకరాజు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై రామారాయుదుపాలెం వార్డు సభ్యుడు సుంకర మరిణేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు చెప్పేది వినరా అని ఏఈని ప్రశ్నించారు. పట్టణంలో మొబైల్ టాయిలెట్లు, జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో మున్సిపాలిటీ నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోఆప్షన్ సభ్యురాలు బీబీ కోరారు. కొక్కిరాపల్లిని పంచాయతీగా డీనోటిఫై చేయాలి సమావేశం ఆఖర్లో 23వ వార్డు సభ్యుడు మజ్జి రామకృష్ణ ఓ వినూత్న డిమాండ్ పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 14 ఏళ్ల క్రితం కొక్కిరాపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తే మంచిదని నమ్మబలికి తమ గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. అభివృద్ధి జరగకపోగా ఆస్తి పన్ను పెరిగిందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలకు లేకుండా చేశారని, అందుకే కొక్కిరాపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించి పంచాయతీగా డీనోటిఫై చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు తీర్మానం చేయాలన్నారు. తన డిమాండ్ను పరిగణనలోకి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ వైస్ఛైర్మన్ బెజవాడ నాగేశ్వర్రావు, దూది నర్సింహమూర్తి, పిట్టా సత్తిబాబు, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
● కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు ● అర్జీల స్వీకరణతో సరిపెట్టేస్తున్నారని ఆవేదన ● మొత్తం 313 అర్జీల నమోదు
ప్రతి వారం తప్పని ప్రదక్షిణలు తుమ్మపాల: అర్జీదారుల ఆవేదన, అసహనాల మధ్య సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం సాగింది. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రతి వారం ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంౖపై అధికారులను ప్రశ్నిస్తే కలెక్టరేట్ సిబ్బంది జోక్యం చేసుకుని బయటకు పంపేస్తున్నారని పలువురు వాపోయారు. కాళ్లరిగేలా కలెక్టరేట్కు వస్తే అర్జీలను పరిష్కరిస్తామని నోటి మాటగా చెప్పడమే పరిష్కారంగా చూపిస్తూ ఎండార్స్మెంట్తో అధికారులు ముగించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే స్పందించాల్సిన ఫిర్యాదులకు కూడా 75 రోజులు, 105 రోజులు గడువు చూపిస్తూ పీజీఆర్ఎస్ వెబ్సైట్ రూపొందించారని కూటమి సర్కారుపై అర్జీదారులు మండిపడుతున్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, రమామణి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 313 అర్జీలు నమోదయ్యాయి. వాటిలో 164 ఫిర్యాదులు రెవెన్యూ శాఖ పరిధిలో రాగా.. మిగిలినవి వివిధ శాఖల్లో నమోదయ్యాయి. ●అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ జి.శివానందం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి లక్షల రూపాయలకు ఇతరులకు విక్రయించేశారని, రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఆక్రమణదారులు బోర్డును తొలగించి నిర్మాణ పనులు వేగవంతం చేశారని తెలిపారు. తక్షణం అధికారులు స్పందించాలని కోరారు. -
జిల్లా అధికారుల సంఘం కార్యవర్గం ఏకగ్రీవం
కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారుల సంఘం కార్యవర్గం తుమ్మపాల: జిల్లా అధికారుల సంక్షేమం కోసం జిల్లా అధికారుల సంఘం నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. సోమవారం జరిగిన జిల్లా అధికారుల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వివిధ అంశాలపై చర్చ అనంతరం, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడిగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జి.రామారావు, గౌరవ అధ్యక్షుడిగా జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జనరల్ సెక్రటరీగా డీఆర్డీఏ పీడీ శచీదేవి, జాయింట్ సెక్రటరీగా డ్వామా పీడీ పూర్ణిమాదేవి, కోశాధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్డీసీ రమామణి, డీఈవో అప్పారావు నాయుడు, ఏపీసీఎస్ఎస్ ఎ.సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు కలెక్టర్ కె.విజయ కృష్ణన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. -
పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నది
● ఎస్పీ తుహిన్సిన్హా అనకాపల్లి: పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైనా, సమాజ రక్షణ కోసం చూపిన నిబద్ధత, సమర్థత, సేవా భావం ప్రశంసనీయమని ఎస్పీ తుహిన్సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందిని సోమవారం తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోలీస్ శాఖలో 35 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తూ విశిష్ట సేవలందించారన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఎలమంచిలి రూరల్ అదనపు ఎస్ఐ ననేపల్లి సత్యనారాయణ, సీసీఎస్ ఎస్ఐ నట్టి సత్యనారాయణ, అనకాపల్లి ట్రాఫిక్ అదనపు ఎస్ఐ షేక్ రషీద్, పీసీఎస్ ఎస్ఐ షేక్ మదీనా వల్లి, డీసీఆర్బీ ఏఎస్ఐ జి.అర్జునరావు, పరవాడ ఏ్ఎస్ఐ బి.ఎ. నాయుడులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎ.ఓ.ఎ.రామ్కుమార్, సీఐలు ఎస్.లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, ఎస్.బాల సూర్యారావు, టి.లక్ష్మి, కె.అప్పలనాయుడు, బి.రామకృష్ణ, ఎస్ఐ బి.సురేష్బాబు, పి.రమేష్, పి.కామేశ్వరరావు, ఎస్.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
24 గంటలూ జగన్నాథుని ఉచిత దర్శనం
ఇంద్రద్యమ్న హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం అనకాపల్లి టౌన్: పట్టణంలోని గూడ్స్రోడ్ ఇంద్రద్యమ్న హాల్లో కొలువైన జగన్నాథ స్వామిని 24 గంటలూ ఉచిత దర్శనం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు ఉదయం గంట సేపు మాత్రమే అవకాశం కల్పించడంపై ‘సాక్షి’దినపత్రికలో ‘జగన్నాథుని ఉచిత దర్శనం గంటసేపే’అని ఆదివారం ప్రచురితమైన కథనానికి ఆలయ ఈవో బి.మురళీకృష్ణ స్పందించారు. 24 గంటలూ ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. -
‘తనఖా పెడితే.. ఇల్లే నాది అంటున్నాడు’
అండిబోయిన రమేష్ తనఖా పెట్టిన ఇంటిని శాశ్వతంగా స్వాధీనం చేసుకున్న వ్యక్తి నుంచి తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ రెండు నెలలుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తున్నా అధికారులు కనీసం స్పందించడం లేదని అనకాపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగుడు అండిబోయిన రమేష్ ఆరోపించారు. పట్టణంలో గాంధీనగరం అంజయ్యకాలనీలో ఫ్లాట్ నెం.7లో తన పేరున ఇల్లు ఉందని, ఆర్థిక అవసరాలతో వి.రమణ అనే వ్యక్తికి రూ.3 లక్షలకు తనఖా పెట్టానని, రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించే ప్రయత్నం చేశానని, డబ్బు తీసుకోకుండా ఇల్లు తనది అంటున్నాడని వాపోయారు. దివ్యాంగుడైన తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, న్యాయం చేయాలని పోలీస్, కలెక్టరేట్ అధికారులకు నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. -
స్థలం ఆక్రమణపై ఫిర్యాదు
పూర్వీకుల నుంచి తన వాటాగా వచ్చిన స్థలాన్ని తన సోదరుడు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెల్లిముక్కు అప్పలకొండ అర్జీ అందజేశారు. తన తండ్రి అప్పన్నకు గ్రామంలో ఉన్న 6 సెంట్లను గ్రామపెద్దలు మూడు భాగాలుగా విభజించి కుమారులకు కేటాయిస్తూ తీర్మానం చేశారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా పెద్ద తమ్ముడు ఈశ్వరుడు దౌర్జన్యంగా తన సథలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించి, స్థలం ఇప్పించాలని వేడుకున్నాడు. -
బీఎన్ రోడ్డులో చేపల వేటతో నిరసన
బీఎన్ రోడ్డులో వలతో చేపలు పడుతూ నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు, ప్రజలు రోలుగుంట: స్థానిక నర్సీపట్నం – భీమిలి ఆర్అండ్బీ రోడ్డు దుస్థితిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఎం నాయకులు కె.గోవింద, ఇ.చిరంజీవిల ఆధ్వర్యంలో సోమవా రం స్థానిక మండల కార్యాలయ సముదాయం కూడలి సమీపంలో చెరువును తలపిస్తున్న రోడ్డు గుంతలో వలతో చేపల పడుతూ తమ నిరసన తెలిపారు. సీపీఎం నాయకుడు మాట్లాడుతూ ఈ గోతుల రోడ్డులో రాకపోకలు చేసే వాహనదారులు అదుపు తప్పి బోల్తాపడి గాయాల పాలవుతున్నారన్నారు. కొవ్వూరు, కె.నాయుడుపాలెం, పాపంపేట, అంట్లపాలెం తదితర గ్రామాల నుంచి గర్భిణులను గాని, క్షతగాత్రులను గాని 108 వాహనంలో తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ రోడ్డు మెరుగుపరచి రవాణా కష్టాలు తీరుస్తామని బూట కపు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాన్ని దూషించిన ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఇప్పుడు ఏం చేస్తున్నారు.. నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. -
ఈనెల కూడా కందిపప్పు లేనట్టే..!
అనకాపల్లి టౌన్ : కందిపప్పు బలవర్ధకమైన ఆహార పదార్ధం. చక్కగా ప్రోటీన్ లభిస్తుంది. సామాన్యుడు చౌకధరల దుకాణంలో లభించే కందిపప్పుకు అర్రులు చాస్తుంటాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు, రాగులు, గోధుమపిండి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాగులు, గోధుముల సంగతి పక్కన పెడితే కనీసం కందిపప్పు సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నెల కూడా కందిపప్పును అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 7652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి నిలిచిపోయాయి. కొన్ని నెలలు అరకొరగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఆరు నెలలుగా పూర్తిగా నిలిపివేసింది. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సచివాలయ బదిలీలు పూర్తి
● జిల్లావ్యాప్తంగా 3,258 మందికి స్థానచలనం ● కూటమి ఎమ్మెల్యే సిఫార్సు ఉన్నవారికే అనుకూల పోస్టింగ్సాక్షి, అనకాపల్లి: సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 25 నుంచి విశాఖలో జరుగుతున్న కౌన్సెలింగ్ సోమవారంతో ముగిసింది. ఐదు రోజులపాటు ఆయా విభాగాల కార్యాలయాల్లో ఆఫ్లైన్ విధానంలోనే కౌన్సెలింగ్ జరిగింది. అనకాపల్లి జిల్లాలో మొత్తం 522 సచివాలయాల్లో 3,824 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో ఐదేళ్ల కాలపరిమితి పూర్తయిన 3,258 మంది బదిలీల ప్రక్రియలో పాల్గొన్నారు. సొంత మండలంలో పనిచేసే వెసులుబాటు లేకపోవడంతో గ్రామ సచివాలయ ఉద్యోగులు పలు ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం రేషనలైజేషన్ విధానంలో భాగంగా జనాభా ప్రాతిపదికన క్లస్టర్ల వారీగా సచివాలయాలను కుదించడం, విస్తీర్ణం ఆధారంగా రైతు సేవా కేంద్రాలను కుదించడంతో సచివాలయం, రైతు సేవా కేంద్రాలు లేనిచోట ఐదేళ్లు పూర్తిగాని ఉద్యోగులు ఎక్కడా పోస్టింగ్ లేకుండా హోల్డ్లో ఉండిపోయారు. సచివాలయాలను మూడు గ్రేడ్లుగా విభజించారు. 2,500 లోపు జనాభా ఉంటే ‘ఏ’ గ్రేడ్గా నిర్ణయించి, ఆ సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటే చాలని నిర్ధారించారు. జనాభా 2,500–3,500 వరకూ ఉంటే ‘బి’ గ్రేడ్ సచివాలయంగా 7 లేదా 8 మంది ఉద్యోగులు ఉండాలి. ఇక 3,500కు పైగా జనాభా ఉన్న సచివాలయాలను సీ–గ్రేడ్గా పరిగణిస్తారు. 8 మంది ఉద్యోగులు ఉండాలని నిర్ణయించారు. సిఫార్సు ఉంటేనే నచ్చిన చోటకు.. కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ ఉన్నవారికే అనుకూల పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గం నుంచి కూటమి ప్రజాప్రతినిధులు తమ పార్టీ అనుకూల ఉద్యోగుల జాబితా సంబంధిత అధికారులకు పంపించి కావలసిన విధంగా బదిలీలు చేయించుకున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖ లేని వారికి ఎక్కడో మారుమూల గ్రామానికి బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేశారో అధికారులకే తెలియకుండా పోయింది. బదిలీ అయ్యింది వీరికే.. వివిధ హోదాల్లో బదిలీ జరిగిన వారి సంఖ్య ఇలా ఉంది.. అగ్రికల్చర్ అసిస్టెంట్లు–170, యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లు–187, ఏఎన్ఎం–442, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు–315, ఫిషరీస్ అసిస్టెంట్లు–45, హార్టికల్చర్ అసిస్టెంట్లు–89, మహిళా పోలీస్ అండ్ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు–312, పంచాయతీ సెక్రెటరీలు –155, డిజిటల్ అసిస్టెంట్లు–348, సర్వే అసిస్టెంట్లు–377, వీఆర్వోలు 75, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు–326, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీలు–46, వార్డు ఎనిమిటీస్ సెక్రెటరీలు–45, వార్డు ఎడ్యుకేషన్ సెక్రెటరీలు–50, వార్డు ఎనర్జీస్ సెక్రెటరీలు–3, వార్డు హెల్త్ సెక్రెటరీలు–53, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీలు–38, వార్డు రెవెన్యూ సెక్రెటరీలు–39. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రెటరీలు–52, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రెటరీలు–47, వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రెటరీలు–44 మందికి బదిలీ జరిగింది. -
కథ అడ్డం తిరిగింది
● టీడీపీ సానుభూతిపరులతో హోంమంత్రి మంతనాలు ● మిట్టల్ స్టీల్ప్లాంట్కు భూములివ్వాలని ఒత్తిడి ● ససేమిరా అన్న రైతులు.. ● ప్రాణాలిచ్చి అయినా కాపాడుకుంటామని స్పష్టీకరణడామిట్ నక్కపల్లి : మండలంలో ఏర్పాటు కాబోయే ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ స్టీల్ప్లాంట్కు భూములు ఇవ్వమని రైతులను ఒప్పించాలని ప్రయత్నించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు సోమవారం చుక్కెదురైంది. ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ ఎస్డీసీ అనిత, తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. దీనికి పాత్రికేయులు, ఇతర పార్టీలకు చెందిన రైతులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం టీడీపీ సానుభూతిపరులైన అతికొద్ది మంది రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టీల్ప్లాంట్కు భూములు ఇవ్వాలని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశానికి వచ్చిన పలువురు రైతులు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని, సర్వే చేయడానికి వస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. ఇదీ నేపథ్యం.. విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రాజయ్యపేట, చందనాడ, వేంపాడు, డీఎల్పురం, అమలాపురం గ్రామాల్లో 4500 ఎకరాలు సేకరించింది. ఈ భూముల్లో 2వేల ఎకరాలు బల్క్డ్రగ్ పార్క్ కొరకు కేటాయించింది. మరో 2080 ఎకరాలను ఈ ఏడాది తెరమీదకు వచ్చిన ఆర్సిలర్ మిట్టల్ ీస్టీల్ప్లాంట్కు ఎకరా రూ.51.39 లక్షల చొప్పున కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ మొదటి విడతలో ఏడాదికి 7.3 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసేందుకు భూములు కేటాయించాలని కోరడంతో ఇటీవలే ప్రభుత్వం స్టీల్ప్లాంట్కు భూములు కేటాయించింది. అయితే ఈ స్టీల్ప్లాంట్ టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు అదనంగా మరో 3265 ఎకరాలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత రంగంలోకి దిగి, రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేపట్టారు. మీరంతా భూములు ఇచ్చి సహకరిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని భూసేకరణకు అడ్డు రావద్దని కోరారు. అయితే తరతరాలుగా ఈ భూములే తమకు ఆధారమని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు స్పష్టం చేశారు. సర్వే కోసం భూముల జోలికి వస్తే ప్రాణాలొడ్డి అయినా అడ్డుకుంటామన్నారు. దీంతో సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖంగుతిన్నారు. ఏం చేయాలో తోచక ఇప్పటికిప్పుడే భూములు సేకరించడం లేదని, నోటిఫికేషన్ విడుదల చేయలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమేనంటూ సముదాయించుకున్నారు. రైతులపై ఒత్తిడి పెంచేందుకేనా...! ఈ సందర్భంగా సమావేశానికి వెళ్లిన పలువురు రైతులు బయటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే అయిన హోంమంత్రి సమావేశం ఏర్పాటు చేయడంతో రైతులకు అండగా నిలుస్తారని ఆశతో వెళ్లామని, కానీ భూములు ఇవ్వాలని ఒప్పించే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను విభజించి పాలించే ప్రయత్నాలు చేస్తున్నారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లోకి వచ్చి రైతులతో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్న వాదన వినిపిస్తున్నారు. -
అన్ని వ్యాపార సంస్థలు జీఎస్టీ పరిధిలోకే..
తుమ్మపాల: కొన్ని వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కింద నమోదు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ పన్ను వలయానికి భిన్నంగా ఉన్నాయని, వారిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ స్పష్టం చేశారు. జీఎస్టీ రెవెన్యూ వసూళ్లలో ప్రగతి సాధించాలనే అంశంపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ వై.కిరణ్ కుమార్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ పరిధికి వెలుపల ఉన్న వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావడానికి వీలుగా జిల్లా పరిశ్రమల శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అటువంటి వర్తకులు సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులు, వాణిజ్య పన్నుల శాఖకు తక్షణమే పంపించాలన్నారు. పాత బకాయిదారులను తక్షణమే గుర్తించాలని, జిల్లాలో వస్తు సేవల పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, బకాయిదారుల ఆస్తులను గుర్తించడంలో జీఎస్టీ అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను, లీడ్ బ్యాంక్తో పాటు ఇతర బ్యాంకు అధికారులను ఆదేశించారు. జీఎస్టీ అధికారుల నుంచి జారీ చేసే నోటీసుల్లో బకాయిదారులకు సంబంధించి ఖాతా వివరాలు, వారి ఖాతాలను స్తంభింపజేయడం వంటి అంశాల ఆవశ్యకతను కలెక్టర్ అధికారులకు వివరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల అధికారులు బకాయిదారులకు సంబంధించి ఆస్తుల వివరాలు, బిల్డర్లకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ వివరాలను జీఎస్టీ అధికారులకు అందించాలన్నారు. అక్రమ మైనింగ్పై మైనింగ్ అధికారులు, రవాణా శాఖ అధికారులు వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ అపర్ణ, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ అధికారి మన్మధరావు, జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.మనోరమ, జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ కె.సత్యనారాయణ, ఎంపీడీవోలు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవరికీ మినహాయింపు లేదు జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలి సమన్వయ కమిటీ అధికారుల సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ -
ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూశాఖ కీలకం
అనకాపల్లి టౌన్: ప్రజలతో నిత్యం మమేకమై రెవెన్యూ సేవలందించే వీఆర్వోలకు ఐక్య వేదిక ఒకటి ఉండడం ఎంతో అవసరమని కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన వీఆర్వోల సంఘం నూతన బిల్టింగ్ నిర్మాణానికి శంకుస్థాపన పనులు ఆదివా రం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి లక్ష రూపాయలు సొంత నిధుల ను ఇస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా చేయడంలో రెవెన్యూ శాఖ పాత్ర అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి, ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బి. వెంకటేశ్వరావును శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.అయేషా, సంఘం నాయకులు ఎస్.టి.రామదాసు, ఎ.శశి, సిహెచ్ ఇరుకునాయుడు పాల్గొన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ వీఆర్వోల సంఘ భవనానికి శంకుస్థాపన -
అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
చోడవరం: పార్టీలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చోడవరం సమన్వయకర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక లక్ష్మమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ కల్యాణమండపంలో చోడవరం మండల కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. పట్టణం, మండలం నలుమూల నుంచి వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకావడంతో పార్టీ కేడర్లో నూతనుత్తేజం వచ్చింది. ఈ సందర్భంగా అమర్నాఽథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులపై కూడా కూటమి నాయకులు దౌర్జన్యాలకు దిగడం ప్రభుత్వ రాక్షసిపాలనకు అద్దం పడుతోందని చెప్పారు. వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ను స్థానిక ఎమ్మెల్యే మానసికంగా వేధించారని తెలిపారు. ఇటువంటి దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. వచ్చే నెల 8వతేదీన వైఎస్సార్ జయంతిని అన్ని గ్రామాల్లో ఘనంగా జరపాలన్నారు. అదేవిధంగా త్వరలో నిర్వహించే ఇంటింటికీ వెళ్లి కూటమి ఏడాదిపాలనలో వైఫల్యాలను తెలియజేసే కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్తలు అంకితభావంతో నిర్వహించాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నిత్యం ప్రజలను మోసం చేస్తూనేఉన్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలను, ప్రభుత్వ అధికారులను, ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు బాబు షూరిటీ..మోసం గ్యారంటీ అనే నినాదంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. చోడవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ చంద్రబాబు మోసాలపై ప్రజలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివరించాలన్నారు. అనంతరం నాయకులను పార్టీ కార్యకర్తలు పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, ఎంపీపీ గాడి కాసుఅప్పారావు, పంచాయతీ ఉపసర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డి వెంకట్రావు, దేవరల్లి సత్య, జిల్లా యూత్, రైతు విభాగాల అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, బొడ్డేడ సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, పట్టణ ప్రతినిధులు పందిరి శ్రీనువాసరావు, గూనూరు రాజు, చవితిన బాబూరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, పీఏసీఎస్ అధ్యక్షులు శానాపతి సత్యారావు, దన్నిన వెంకట్రావు, పుట్రేవు శ్యామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ -
వీఆర్ఎస్పై అయోమయం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం రెండో విడత ప్రకటించిన వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) దరఖాస్తు విషయంలో ఉద్యోగుల్లో అయో మయం నెలకొంది. మూడో బ్లాస్ట్ఫర్నేస్ ప్రారంభించినందున ప్లాంట్ పరిస్థితులు బాగుపడే అవకాశం ఉందని ఉద్యోగులు ఒకవైపు ఆశావాహంగా ఆలోచిస్తుండగా.. రానున్న రోజుల్లో మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న భయం మరోవైపు వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ వీఆర్ఎస్ పట్ల ఉద్యోగులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆర్థిక సదుపాయాల కోత వంటి కారణాల వల్ల ఈ ఏడాది మార్చి నెలలో వచ్చిన మొదటి వీఆర్ఎస్కు స్పందన లభించింది. అప్పట్లో కూడా వీఆర్ఎస్ పరిహారం, పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ మొత్తం ఇస్తారా... లేదా అనే సందేహాలతో 1,613 మంది మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. యాజమాన్యం వారికి సకాలంలో అన్నీ చెల్లించడంతో అప్పుడు దరఖాస్తు చేయనివారు తప్పు చేశామన్న భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో పెరిగిన పని ఒత్తిడి, పూర్తి జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి వీఆర్ఎస్ వస్తే కనీసం మూడు వేల మంది దరఖాస్తు చేస్తారని అందరూ ఊహించారు. అయితే అంత స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత బడ్జెట్లో మిగిలిన సొమ్ము మేరకు మాత్రమే ఈసారి వీఆర్ఎస్ ఇస్తారని, ఊహాగానాలు వినిపించడం, ఇప్పటికే సిబ్బంది బాగా తగ్గిన నేపథ్యంలో చాలా విభాగాల్లో విభాగాధిపతులు వచ్చిన దరఖాస్తులను అంగీకరించేది లేదని చెబుతుండడంతో చాలా మంది డీలా పడి దరఖాస్తు చేయనట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటివరకు 850 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. అయితే జూలై 15 వరకు గడువు ఉన్నందున చివరలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తున్నది. స్టీల్ప్లాంట్ ముఖ చిత్రం ముందుకురాని స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ఇప్పటివరకు కేవలం 850 దరఖాస్తులు -
యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
అనకాపల్లి : కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదువుడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ రహదారి సత్యగ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పురస్కారాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో స్కాలర్షిప్స్ ఇవ్వడం విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఇంటర్లో 992 మార్కులతో మొదటి స్థానం సాధించిన రందాసు శ్రీజకు రూ. 5000, మెమెంటో, 985 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన చందక రోస్నకు రూ.2500, మెమెంటో, పదోతరగతిలో 594 మార్కులతో మొదటి స్థానం సాధించిన బాలబోయిన బాలాజీకి రూ.5000 మెమెంటో, 592 మార్కులతో ద్వితీయస్థానం సాధించిన పల్లా అనుష్కకు రూ.2500, మెమెంటోతో పాటు, మరో 200 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నగదు, కాలేజీ బ్యాగ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భరణికాన సాయినాథరావు (బాబురావు ), ఉమ్మడి విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు భరణికాన రామారావు, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
బాసలు చేశారు... బాటలు మరిచారు!
అధ్వానంగా బీఎన్ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని కూటమి పాలకులు బురదలో కూరుకుపోయిన వాహనాలను ట్రాక్టర్లతో లాగుతున్న డ్రైవర్లు బుచ్చెయ్యపేట : ఎన్నికల్లో గెలిస్తే ముందుగా భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్) రోడ్డు బాగు చేస్తామన్న కూటమి నేతల మాటలు కోటలు దాటాయి. శిథిలావస్థకు చేరిన రోడ్డును బాగు చేయడం దేవుడెరుగు కనీసం గోతులను పూడ్చి రవాణా సదుపాయం కల్పించడానికి కూటమి నేతలు చేతులెత్తేశారు. గత ప్రభుత్వం రోడ్లను బాగు చేయడంలో విఫలమైందని, తాము అధికారంలోకి వస్తే రోడ్లు బాగు చేసేస్తామన్న కూటమి నేతలు ఎమెమల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, ఎంపీ రమేష్ ఇపుడు బీఎన్ రోడ్డు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వడ్డాది, శింగవరం, విజయరామరాజుపేట, ఎల్బీ పురం, బంగారుమెట్ట, లక్ష్మీపురం పొలాలు వద్ద, మేడివాడ, గర్నికం, రోలుగుంట, గోవాడ తదితర ప్రాంతాల వద్ద పెద్దపెద్ద గోతులు పడ్డాయి. గోతుల్లో వర్షం నీరు చేరి తారు రోడ్డు బురద మట్టి రోడ్డులా తయారైంది. పలు గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఐదు అడుగుల లోతు వరకు రోడ్డు మధ్యలో గోతులు పడడంతో ప్రతి రోజు ఆటోలు, వ్యాన్లు, లారీలు బురదలో కూరుకుపోతున్నాయి. బురదలో కూరుకుపోతున్న వాహనాలను పొక్లెయిన్లు, ట్రాక్టర్లకు తాడు కట్టి బయటకు లాగుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులు, బాలింతలు బీఎన్ రోడ్డులో ప్రయాణానికి నరకయాతన పడుతున్నారు. ఆటోలు ఇతర వాహనదారులు ఈ రోడ్డులో ప్రయాణించి బేరింగ్లు పోయి వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆయా వాహనదారలు ఆవేదన చెందుతున్నారు. ప్రయాణానికి నరకంగా మారిన బీఎన్ రోడ్డును బాగు చేయాలని ఇటీవల వడ్డాది గోతుల్లో వలలు వేసి చేపలు పడుతూ పలువురు నిరసన తెలిపారు. అయినా కూటమి నేతలు, అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికై నా కూటమి నేతలు, ఆర్అండ్బీ అధికారులు స్పందించి బీఎన్ రోడ్డు బాగు గురించి చర్యలు చేపట్టాలని, సుఖ ప్రయాణం కల్పించాలని చోడవరం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. చెరువులను తలపిస్తున్న గోతులు బురదలో కూరుకుపోతున్న వాహనాలు -
జనసేన నేత ఫ్లెక్సీ చించివేత
మునగపాక: మొన్న బీజేపీ–టీడీపీ, నిన్న టీడీపీలో గ్రూపుల గోల..కాగా నేడు జనసేనలోనూ వర్గపోరు బయటపడింది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో మండల స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో వివాదం ముదురుతూ వస్తుంది. తాజాగా జనసేన మండల పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరశురామ్ జన్మదినం సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్డులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలో కొంతమంది ఫొటోలు ప్రొటోకాల్కు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో పాటు శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత ఫ్లెక్సీని చించివేశారు. విషయం తెలుసుకున్న జనసేన మండల పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరశురామ్ ఈ విషయమై మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చురుగ్గా రైల్వే జోన్ పనులు
ఆరిలోవ(విశాఖ): ముడసర్లోవ వద్ద నిర్వహిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముడసర్లోవ ప్రాంతంలో విశాఖ కేంద్ర కారాగారం ఎదురుగా రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. దీనిలో సుమారు ఆరు నెలల కిందట ల్యాండ్ టెస్టింగ్ పనులు చేపట్టడంతో పనులు ప్రారంభించారు. నెల రోజులుగా పూర్తిస్థాయి పనులు జరుపుతున్నారు. ప్రస్తుతం 14 ఎకరాల్లో విశాలమైన 12 అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేపట్టారు. అండర్ గ్రౌండ్లో రెండు ఫ్లోర్లు, పైన 10 ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. వర్షా కాలంలో పనులకు ఎలాంటి ఆటంకంగా రాకుండా ముందు జాగ్రత్తగా ఇసుక తీసుకొచ్చి నిల్వ ఉంచారు. రైల్వే జోన్ రీజనల్ మేనేజర్ కార్యాలయంతోపాటు ఉన్నతాధికారుల క్వార్టర్స్ అన్నీ ఇక్కడే నిర్మిస్తున్నారు. -
కళకళలాడుతున్న జలాశయాలు
తాండవ జలాశయంమాడుగుల: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి మండలంలో అధిక జలవనరులు గల పెద్దేరు జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.40 మీటర్లకు చేరుకోవడంతో జలాశయ అధికారులు ఒక గేటు ద్వారా 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్దేరు జలాశయం ఆయకట్టు 15వేల ఎకరాల్లో ఖరీఫ్లో రైతులు వరి సాగు చేయనున్నారు. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో దమ్ము పట్టి, మడులు సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న తాండవనీటి మట్టం నాతవరం: తాండవ రిజర్వాయర్లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. తాండవ ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 367.1 అడుగులకు నీటి మట్టం చేరింది. తాండవ రిజర్వాయర్ ప్రమాదస్థాయి నీటి మట్టం 380 అడుగులు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో వరి సాగుకు తాండవ రిజర్వాయర్ నుంచి ఆగస్టు నెలలో నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. నీటి విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండడంతో ఈలోపు వర్షాలు కురిసి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుందని ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. తాండవ ఆయకట్టు పరిధిలోని రైతులంతా ఖరీఫ్లో వరినాట్లు వేసేందుకు వరినారుమడులు సిద్ధం చేసుకోవాలన్నారు. శివారు ఆయకట్టుకు సైతం నీటిని సరఫరా చేసేందుకు కాలువలో పూడిక తీత పనులు చేస్తున్నామని జేఈ చెప్పారు. -
ప్రకృతి సేద్యం.. లాభసాటి వ్యవసాయం
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం గతేడాది సాగు చేసిన రైతుల సంఖ్య 32,374 ఈ ఏడాది లక్ష్యం 47,108 గతేడాది సాగు విస్తీర్ణం 35,590 ఎకరాలు ఈ ఏడాది లక్ష్యం 52,004 ఎకరాలు సాక్షి, అనకాపల్లి: రసాయనాలు విరివిగా వాడటంతో భూసారం క్షీణించడం.. పంటల దిగుబడి తగ్గిపోవడం.. రైతు నష్టాలపాలై దిగులు చెందడం కనిపిస్తోంది. ఇది వినియోగదారుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో రైతులు ముందుగానే చీడపీడల నుంచి తమ పంటను కాపాడుకునే విధంగా వారిని ప్రకృతి సేద్యం వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఈమేరకు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానం, విత్తనశుద్ధి గురించి వివరిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడని పంట విత్తనాలు, దేశవాళీ విత్తనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లో 165 గ్రామ పంచాయతీల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం విస్తృతం చేస్తున్నారు. బీజామృతంతో ఎంతో మేలు ప్రకృతి వ్యవసాయంలో విత్తనాల ఎంపిక ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. దేశవాళీ విత్తనాలను సేకరించి, వాటిని శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా పంట దిగుబడి బాగుంటుంది. తెగుళ్ల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు విత్తే సమయంలోనే బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. భూమి నుంచి సంక్రమించే తెగుళ్లను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆవు మూత్రం, పేడ, పొడి సున్నం, పొలం గట్టు మీద మట్టి లేదా దోసెడు పుట్టమన్నుతో బీజామృతాన్ని తయారు చేస్తారు. విత్తనాలను ప్లాస్టిక్ కాగితంపై పోసి తగినంత బీజామృతం పోసి కలపాలి. విత్తనాలకు బీజామృతం బాగా పట్టిన తర్వాత కొద్దిసేపు నీడన ఆరబెట్టుకొని విత్తుకోవచ్చు. నారును, మొక్కలను కూడా బీజామృతంలో ముంచి నాటుకోవచ్చు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సాగు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానంలో తొలకరి చినుకులు పడక ముందే సాగు ప్రక్రియను ప్రారంభిస్తారు. వివిధ రకాల పంటలను (నవధాన్యాలు, ఇతర విత్తనాలు) కలిపి విత్తుతారు. పచ్చిరొట్ట, ధాన్యపుజాతి, పప్పుజాతి, నూనెజాతి, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి ఇలా 30 రకాల విత్తనాలు వేయడం ద్వారా భూమి సారవంతంగా తయారవుతుంది. ఈ పీఎండీఎస్ అవశేషాలను భూమిలో కలియదున్నడం వల్ల రసాయనిక ఎరువులైన డీఏపీలో ఉన్న అన్ని రకాల పోషకాలు అందుతాయి. దీని ద్వారా వానపాములు అభివృద్ధి చెంది భూమి గుల్లబారుతోంది. ప్రకృతి వ్యవసాయంలో పండించే ధాన్యంతో భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. జిల్లాలో 52 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే 47 వేల ఎకరాల వరకు చేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పీఎండీఎస్ పూర్తికానుంది. సేంద్రియ పద్ధతిపై అవగాహన జిల్లాలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడంపై ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ అధికారులు నెల రోజులుగా అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగు ఎక్కువగా నాతవరం మండలంలోని చిన గొలగొండపేట, పెద గొలుగొండపేట, ఎస్.బి.పట్నం, పి.కొత్తగూడెం, సరుగుడు, సుందరకోట, కె.వి.శరభవరం గ్రామాల్లో జరుగుతుంది. గొలుగొండ, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, కోటవురట్ల, పాయకరావుపేట, అనకాపల్లి, కశింకోట మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతితో అందరికీ మేలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఎరువులు, పురుగు మందులు వేసి పండించే పంటల కారణంగా క్యాన్సర్కు గురవుతున్నారు. ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ సాగు పెంచాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎఫ్ (ప్రీ మాన్సూన్ సోయింగ్) విత్తనాలతో మొదటి దశ ప్రారంభించాం. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే ముందు భూమి ఎండిపోకుండా, భూసారం పెరిగేలా నవధాన్యాలను విత్తుతారు. దీంతో రైతుకు లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది. ఈ ఏడాదిలో ప్రకృతి వ్యవసాయం విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నాం. – లచ్చన్న, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి -
కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు రక్షణ కరవు
● కేజీబీవీ ప్రిన్సిపాల్పై దురుసుగా ప్రవర్తించిన చోడవరం ఎమ్మెల్యే, కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా ఉద్యోగులకు రక్షణ కరవైందని, కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణను చోడవరం ఎమ్మెల్యే, కూటమి నేతలు దూషించి, ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సుమారు నాలుగున్నర గంటల పాటు నిలుచోబెట్టడం అన్యాయమన్నారు. అనకాపల్లి పట్టణంలో శారదాకాలనీలో అన్నపూర్ణ స్వగృహానికి అమర్నాథ్, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ కరణం ధర్మశ్రీ, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆదివారం వెళ్లి, పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ కేజీబీవీ ప్రిన్సిపాల్కు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. అన్నపూర్ణ కశింకోట మండలం తేగాడగ్రామం కేజీబీవీలో ప్రిన్సిపాల్గా పనిచేసిన సమయంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారని, ఆమెను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సత్కరించిందన్నారు. 2022లో సాధారణ బదిలీల్లో వడ్డాది కేజీబీవీకి ఆమె వెళ్లారని, చోడవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాటల కారణంగా ప్రిన్సిపాల్ను వేధించడం అన్యాయమన్నారు. ప్రిన్సిపాల్ను వేధించిన ఎమ్మెల్యే, కూటమి నాయకులపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ యోగాంధ్ర సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే... బుచ్చెయ్యపేట ఎంపీడీవోను మానసికంగా వేధించడంతో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారన్నారు. వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణను కూటమి నేతలు వేధించడం అన్యాయమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. చోడవరంలో కూటమి నేతలు కుమ్ములాట వల్ల వేరు కుంపట్లుగా ఏర్పడ్డారని, ఆధిపత్యంకోసం అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ను చోడవరం ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించుకుని, మానసికంగా వేధించడం అన్యాయమన్నారు. ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు అరాచకాలు పెరిగిపోయాయన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తే, కూటమి నేతలు ఆమైపె దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత మాట్లాడుతూ చోడవరం ఎమ్మెల్యే... మహిళా ప్రిన్సిపాల్ను దూషించడం తగదన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తే, కూటమి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాఽథ్, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు గైపూర్ రాజు, 80వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం.నాయుడు, పార్టీ నేతలు బొడ్డేడ శివ, దొడ్డి హరిబాబు, మునూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మిట్టల్ స్టీల్ప్లాంట్కు అదనంగా భూములివ్వం
నక్కపల్లి: ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం ఏపీఐఐసీ చేస్తున్న అదనపు భూసేకరణతో రైతులకు తీరని నష్టం కలుగుతుందని, వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఇతర వృత్తుల వారు జీవనోపాధి కోల్పోతారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నెల్లిపూడిలో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు నాయకులు గింజాల రమణ, అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే నక్కపల్లి మండలంలో రైతుల నుంచి ఐదు వేల ఎకరాలకు పైగా భూములు సేకరించి బల్క్ డ్రగ్పార్క్, స్టీల్ప్లాంట్లకు కేటాయించారని, స్టీల్ప్లాంట్ టౌన్ షిప్ కోసం నెల్లిపూడి, వేంపాడు, డీఎల్ పురం, కాగిత గ్రామాల్లో మరో 3,265 ఎకరాలు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సేకరించే భూముల్లో మామిడి, జీడి, కొబ్బరి పంటలు పండే భూములు ఉన్నాయని, ఈ భూముల్లో ఉన్న తోటల వల్ల రైతులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఉద్యాన వన పంటలు ఎక్కువగా పండే భూములను లాక్కోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారులు ఎనిమిది గ్రామాల్లో నివసిస్తున్నారని ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసి, వారి జీవనోపాధి దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జాతీయ రహదారికి తీరప్రాంతానికి మధ్యలో ఉన్న భూములన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోను మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. అదేవిధంగా క్యాప్టివ్ పోర్టును మిట్టల్ స్టీల్ప్లాంట్కు కేటాయించడాన్ని కూడా వారు తప్పుపట్టారు. పోర్టు నిర్మిస్తే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. క్యాప్టివ్పోర్టు స్టీల్ప్లాంట్ ఆధీనంలో ఉంటే మత్స్యకారులు వేటలేక మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. అదనపు భూసేకరణను అడ్డుకుని తీరుతామన్నారు.రైతుల ఆమోదం లేకుండా అదనంగా సేకరించే భూముల కోసం సర్వే చేస్తున్నారని, ఈ సర్వేని అడ్డుకుని తీరుతామని తెలిపారు. ఈ సమావేశంలో రైతులు అవతారం రాజు,తాతరాజు, సూరిబాబు,చినతాతలు తదితరులు పాల్గొన్నారు. డీఎల్ పురంలో కూడా రైతులు నిరసన తెలిపారు. క్యాప్టివ్పోర్టుతోమత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థకం అఖిల పక్ష సమావేశంలోరైతులు స్పష్టీకరణ -
టార్గెట్లు పూర్తి చేయడం మా వల్ల కాదు
● గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగుల ఆవేదన నక్కపల్లి: పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని,నెలవారీ టార్గె ట్లు పూర్తిచేయడం మా వల్లకాదంటూ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. యలమంచిలి సబ్ డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న జీడీఎస్లు ఆదివారం ఉపమాకలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఎస్బీ అకౌంట్లు, ఐపీపీబీ అకౌంట్లు,టీడీ పాలసీలు సుకన్యయోజన పథకం టార్గెట్లు ఇచ్చిన సకాలంలో పూర్తిచేయలంటూ ఒత్తిడి చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈసమావేశంలో జీడీఎస్ ఉద్యోగుల డివిజన్ కార్యదర్శి డి.ఎస్.ఆర్. ప్రసాద్,మాజీ కార్యదర్శి కె. మనోహర్,సంఘనాయకులు విశ్వేశ్వరరావు, సీహెచ్ భద్రం, దయానంద్,బి.వి.రమణ,నాగేంద్రరావు, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలి
అచ్యుతాపురం: అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తరణ బాధితులకు నగదు రూపంలో పరిహారాన్ని ఇవ్వాలని, టీడీఆర్ల రూపంలో వద్దని రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం క న్వీనర్ ఆర్.రాము డిమాండ్ చేశారు. ఆదివా రం మండల కేంద్రం అచ్యుతాపురంలో వారు నిర్వాసితుల తరఫున నిరసన వ్యక్తం చేసి, నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూములు, ఇళ్లు, దుకాణాలకు తక్కువ మార్కెట్ ధర చూపిస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బ్రహ్మాజీ, కర్రి అప్పారావు, రామ సదాశివరావు, ఎస్.కనుమనాయుడు, బుద్ధ రంగారావు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పడిగాపులు
మహారాణిపేట(విశాఖ) : బదిలీల కౌన్సెలింగ్ కోసం ఆదివారం ఉదయాన్నే జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సాయంత్రం వరకు పడిగాపులు పడ్డారు. తిండితిప్పలు లేకుండా జిల్లా పరిషత్ ఆవరణలో గట్లు మీద, ఖాళీ ప్రాంతాల్లో నిరీక్షించారు. కౌన్సెలింగ్కు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 442 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులో 95 శాతం మంది ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు ఉన్నారు. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉదయాన్నే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకోగా సాయంత్రం వరకు పిలవలేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియక ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన చెందారు. కూటమి ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పెద్ద సంఖ్యలో రావడంతో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అడిగిన పోస్టింగ్లు, ఇతర వ్యవహారాల వల్ల కౌన్సెలింగ్ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఖాళీల జాబితా చివరి నిమిషం వరకు బయట పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. కాగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రి వరకు కొనసాగింది. తొలుత దివ్యాంగులు, స్పౌజ్, అనారోగ్య పీడితులకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీలు నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి. కార్యదర్శుల కౌన్సెలింగ్లో గందరగోళం డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్డు సంక్షేమ కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. జీవీఎంసీ పరిధిలో 473 మంది కార్యదర్శులున్నారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యూసీడీ పథకం సంచాకులు పి.ఎం.సత్యవేణి ఆధ్వర్యంలో కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. ప్రతి కార్యదర్శి మూడు ఆప్షన్లు ఇస్తే.. అందులో ఒకటి ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు. ఒకే ఆప్షన్ ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియ సులభతరమవుతుందని కార్యదర్శులు అడగడంతో అధికారులు ససేమిరా అన్నారు. కార్యదర్శులు పట్టువిడవలేదు. దీంతో అధికారులు, కార్యదర్శుల మధ్య గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లేఖలు తీసుకువచ్చిన వారికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వరకు ప్రారంభంకాని బదిలీల కౌన్సెలింగ్ భారీగా సిఫార్సు లేఖలు..పైరవీలకే పెద్దపీట -
బడి కష్టాలపై కదలిక
దేవరాపల్లి: అనంతగిరి మండల పరిధిలోని పినకోట పంచాయతీ శివారు సొలబొంగి గిరిజన విద్యార్థులు చదువుల కోసం పడుతున్న ఇబ్బందులపై అధికారుల్లో కదలిక వచ్చింది. పడవలపై, బురద రోడ్డులో ప్రమాదకర ప్రయాణం చేస్తూ చదువులు సాగించడంపై సాక్షిలో ‘ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్న చిత్రం కూడా సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైంది. ఈ కథనాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించి స్థానిక విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వారి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావునాయుడు, అల్లూరి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ డా.వి.స్వామినాయుడు, రెండు జిల్లాలకు చెందిన అధికారులతో కూడిన బృందం శనివారం అటవీ ప్రాంతం గుండా బురదమయంగా మారిన రహదారి, పొలాల గట్ల మీదుగా 5 కిలోమీటర్ల దూరం నడిచి అతి కష్టం మీద సొలబొంగి గ్రామానికి చేరుకుంది. దూరదూరంగా ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని 13 మంది విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతుండగా మరో నలుగురు అర్ధంతరంగా చదువు మానేసినట్లు గుర్తించారు. ఈ వివరాలను అక్కడి నుండే అల్లూరి జిల్లా కలెక్టర్కు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలియజేశారు. పరిష్కారానికి తక్షణ నిర్ణయాలు అల్లూరి కలెక్టర్ ఆదేశాలతో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న 8 మంది అక్కడే చదువుకునే విధంగా ఎన్ఆర్ఎస్టీసీ (నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేసి విద్యా వలంటీర్ ద్వారా విద్యాబోధన అందిస్తామని ఏపీసీ తెలిపారు. అలాగే 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ఐదుగురు విద్యార్థులతోపాటు బడి మానేసిన నలుగురు విద్యార్థులను పినకోట, జీనబాడులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ సంక్షేమ పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. వీరభద్రపేట నుంచి సొలబంగి వరకు తాత్కాలికంగా పొక్లెయిన్తో మట్టి రహదారి చదును చేసే పనులను గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వేణుగోపాల్, ఏఈఈ గణేష్ దగ్గరుండి చేపట్టారు. అంతకు ముందు దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తామరబ్బ యూపీ స్కూల్ను సందర్శించారు. వీరి వెంట అనంతగిరి మండల ఏటీడబ్ల్యూవో కె.వెంకటరమణ, ఎంఈవో కె.బాలాజీ, దేవరాపల్లి మండల ఎంఈవోలు సిహెచ్.ఉమ, వి.ఉషారాణి, తామరబ్బ, పినకోట సర్పంచ్లు టోకురి రామకృష్ణ, ఎస్.గణేష్ ఉన్నారు. మానవత్వం చాటిన డీఈవో సొలబొంగి మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించిన అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు మానవత్వం చాటారు. సొలబొంగి గ్రామంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గమ్మెల రమణను దత్తత తీసుకున్నారు. ఉన్నత చదువులకు తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. సొలబొంగి గ్రామాన్ని సందర్శించిన అల్లూరి, అనకాపల్లి జిల్లాల అధికారులు ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న విద్యార్థుల కష్టాలపై సాక్షి కథనాలకు స్పందన విద్యాశాఖ మంత్రి ఆదేశంతో ఐదు కి.మీ. కాలినడకన చేరుకున్న అధికారులు ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు ఎన్ఆర్ఎస్టీసీ ద్వారా విద్యాబోధనకు ఆదేశాలు 3–5 తరగతుల విద్యార్థులను, బడిమానేసిన వారిని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేందుకు నిర్ణయం సొలబొంగికి పొక్లెయిన్తో తాత్కాలిక రహదారి చదును పనులు ప్రారంభం -
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
● స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం: మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. మున్సిపాలిటీలో శానిటేషన్ నిర్వహణకు రూ.85 లక్షలతో కొనుగోలు చేసిన కాంపాక్టర్, రెండు ట్రాక్టర్లను స్పీకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ను నడిపారు.అనంతరం మాట్లాడుతూ ఉత్తరవాహిని వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్తను తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిందాల్ సంస్థకు ఇప్పటి వరకు 400 టన్నుల చెత్తను తరలించామని, ఆ సంస్థ విద్యుత్ తయారీలో దీనిని వినియోగిస్తుందని చెప్పారు. కాలువల్లో చెత్త తొలగింపునకు పొక్లెయిన్, రూ.52 లక్షలతో కాంపాక్టర్, రూ.30 లక్షలతో రెండు ట్రాక్టర్లు, రూ.8 లక్షలతో తోపుడుబండ్లు, డస్ట్బిన్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. 1,750 వీధిలైట్లు ఏర్పాటు చేశామన్నారు. చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో వి.వి.రమణ, కౌన్సిలర్ సీహెచ్.పద్మావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, తహసీల్దార్ రామారావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
చీటీల పేరుతో మోసం..టీడీపీ నేతపై కేసు
యలమంచిలి రూరల్:చీటీలు,అధిక వడ్డీల ఆశచూపి పలువురి వద్ద భారీగా డబ్బు వసూలు చేసి, మోసం చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు దాడిశెట్టి పైడియ్య(నానాజీ)పై యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చీటీల ద్వారా 116 మంది రూ.64 లక్షలు మోసపోయినట్టు బాధితుడు తేటకలి భూషణరావు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదైంది. నిందితుడు పైడియ్య బాధితులు భారీగానే ఉన్నట్టు తెరువుపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.గ్రామంలో పాలసంఘంలో వేతన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడంతో తెరువుపల్లి,చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనను బాగా నమ్మి రూ.3కోట్లకు పైగా అప్పుగా ఇచ్చారు. ఇటీవల నిందితుడు కుటుంబంతో సహా గ్రామం నుంచి పరారవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.పరారైన నిందితుడు దాడిశెట్టి పైడియ్య(నానాజీ) కోసం పోలీసులు గాలిస్తున్నారు.అతని ఫోన్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు. -
జగన్నాథుని ఉచిత దర్శనం గంటసేపే
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గూడ్స్రోడ్లోని ఇంద్రద్యుమ్న హాల్లో కొలువుదీరిన జగన్నాథ స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించే విషయంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తుండగా ఇందులో కేవలం గంటసేపు ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల వరకూ మాత్రమే ఉచిత దర్శనం కల్పించి, మిగతా రోజంతా రుసుం వసూలు చేస్తుండడంతో అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. రూ.20, రూ.30 టిక్కెట్పై దర్శకల్పిస్తుండడంతో పేద భక్తులు ఇబ్బందులకు గురతున్నారు. ఏటా తొమ్మిది రోజుల పాటు జగన్నాథ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గవరపాలెం అగ్గిమర్రి చెట్టు వద్ద ఉన్న జగన్నాథ స్వామి దేవస్థానంలో వేంచేసిన జగన్నాథస్వామి, బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ఏటా ఉత్సవాల సందర్భంగా గూడ్స్ రోడ్ వద్ద ఇంద్రద్యుమ్న హాల్లో దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో పలు చిరువ్యాపారులు వివిధ ఆట బొమ్మల షాపులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. జగన్నాథుని దర్శించుకోవడానికి పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా భక్తులు వస్తుంటారు. దీంతో ఆలయానికి భారీగానే ఆదాయం సమకూరుతుంది. పెద్ద ఆలయాల్లో సైతం వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శనాలతో పాటూ రోజంతా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తారు. కానీ అందుకు భిన్నంగా పెద్దగా భక్తులు రాని సమయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఉచిత దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..!
● వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ ● అభ్యంతరాల కోసం జూలై 17 వరకు గడువు పొడిగింపు ● వాటిపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమక్షంలోనే పరిశీలన ● ఈ నెల 30 నుంచి జూలై 17 వరకు సమీక్షలు ● కూటమి నేతలకు లబ్ధి చేకూరేలా ప్లాన్లో మార్పులకు కసరత్తు విశాఖ సిటీ : అంతా అనుకున్నట్లే చేస్తున్నారు. విశాఖ బృహత్తర ప్రణాళిక–2041లో మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ తంతు పూర్తి చేసేందుకు ముహూర్తం పెట్టేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పేరుతో తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు పూనుకుంటున్నారు. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీ ఆయా ఎమ్మెల్యేల సమక్షంలోనే అభ్యంతరాలపై సమీక్షించాలని నిర్ణయించారు. ఒకవైపు ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తేదీలు ఖరారు చేసినప్పటికీ.. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించడం విశేషం. ఇందులో కూటమి ‘రియల్ వ్యాపారానికి’ అనుగుణంగా ప్లాన్లో సవరణలు చేసే అవకాశం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తోంది. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగింపు వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్–2041లో పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కేవలం 755 మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాస్తవానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తాయని కూటమి ప్రజాప్రతినిధులు భావించారు. ఆ సంఖ్యను అడ్డుపెట్టుకుని ఇప్పటికే సిద్ధమైన మాస్టర్ప్లాన్–2041పై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. కానీ నామమాత్రంగానే అభ్యంతరాలు రావడంతో కూటమి నేతలు కంగుతిన్నారు. దీంతో ఈ అభ్యంతరాల స్వీకరణ గడువు మరోసారి పొడిగించారు. జూలై 17వ తేదీ వరకు ఫిర్యాదులు చేయవచ్చని తాజాగా ప్రకటించారు. వీఎంఆర్డీఏ కార్యాలయానికి, ఆన్లైన్లో ఫిర్యాదులు ఎక్కువగా రాకపోవడంతో ఆయా జిల్లాల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట తదితర ప్రాంతాల వారి సౌలభ్యం కోసమంటూ అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో స్వీకరించనున్నారు. అలాగే ఎస్.కోట, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల ప్రాంతాల వారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జూలై 14, 15 తేదీల్లో ఫిర్యాదులను అందించే అవకాశం కల్పించారు. పరిశీలనలో సిఫార్సులకే పెద్ద పీట? మాస్టర్ప్లాన్ కోసం వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల సమక్షంలోనే వీటి పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అభ్యంతరాలను పరిశీలించనున్నారు. నిర్ణీత తేదీ, సమయాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 16, 17 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఎంఆర్డీఏ కార్యాలయం 3వ అంతస్తులో మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కేవలం కూటమి ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల రియల్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంతో మాస్టర్ప్లాన్లో సవరణకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభ్యంతరాల పరిశీలన ఇలా.. తేదీ నియోజకవర్గాలు సమయం వేదిక జూన్ 30, జూలై 1 అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి 11 నుంచి 5 వరకు అనకాపల్లి ఆర్డీఓ ఆఫీస్ జూలై 3, 4 పెందుర్తి గాజువాక 11 నుంచి 5 వరకు వీఎంఆర్డీఏ ఆఫీస్ జూలై 7, 8 విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ 11 నుంచి 5 వరకు వీఎంఆర్డీఏ ఆఫీస్ జూలై 10,11 విశాఖ తూర్పు, భీమిలి 11 నుంచి 5 వరకు వీఎంఆర్డీఏ ఆఫీస్ జూలై 14, 15 ఎస్.కోట, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి 11 నుంచి 5 వరకు విజయనగరం కలెక్టరేట్ -
కూటమి పాలన.. నయవంచన
బాండ్లపై సంతకం పెట్టారు.. ఇప్పుడేమంటారు? సాక్షి, అనకాపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి పార్టీలు చేసిన మోసాలను ప్రజల వద్ద ఎండగడతామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అలవి కాని ఎన్నో హామీలు గుప్పించి వాటిపై ఇంటింటికీ హామీలు, సంతకాలతో బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. శనివారం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొత్స సత్య నారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు. ముందుగా మహానేత వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు తదితరులతో కలిసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎన్నికల ముందు త్రికరణ శుద్ధితో అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు చెత్తబుట్టకే పరిమితం చేసిన మేనిఫెస్టోను ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి కూటమి పార్టీల మోసాలు ప్రజలకు వినిపిస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు గురించి చంద్రబాబు ఒకలా.. లోకేష్ మరోలా.. అధికారులు ఇంకోలా ఎవరికి తోచిన విధంగా వారు అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అంటున్నారు.. ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తారో తెలియని పరిస్థితిలో ప్రజలున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యో గాలు లేదా రూ.3 వేల భృతి ఎప్పుడిస్తారో తెలీదు.. ఆడబిడ్డ నిధిని పీ–4కు లింక్ చేశామంటున్నారు.. టీడీపీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మహిళలు, రైతులు మోసపోతూనే ఉంటారన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు విడుదల చేయలేదన్నారు. ఇలాంటి శుష్క వాగ్దానాలను ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తులో ఇవ్వకుండా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరిట ఎన్నికలకు ముందు వారిచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక వారి మోసాలను ఎండగడదామన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి తాటతీస్తామంటున్నారు.. పవన్ కల్యాణ్ అయితే మక్కలు విరగ్గొడతామంటున్నాడు.. ఇచ్చిన హామీ లు నెరవేర్చకపోతే ప్రజలే మీ మక్కలు విరగ్గొడతారని హెచ్చరించారు. అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో ఎంతమందిని పెడతావో పెట్టుకో.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడేదే లేదన్నారు. నిలదీద్దాం రండి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో ఇంటికీ రూ.2 లక్షల 40 వేలు జమ అవుతాయని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమ్మించారని, బాండు కూడా రాసిచ్చారని.. ఇప్పుడు వాటిపైనే నిలదీద్దామన్నారు. ఇటీవల ఒక పచ్చ పత్రికలో కొత్త పరిశ్రమలు వచ్చేస్తున్నాయంటూ పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకున్నారని, ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 8 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని అవాస్తవాలు రాయించుకుంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. పొదిలి, పల్నాడు, గుంటూరు పర్యటనల్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూస్తే కూటమి ప్రభుత్వానికి దడ పుడుతోందన్నారు. వచ్చే ఏడో తేదీ నాటికి అన్ని నియోజకవర్గాలల్లో విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి చేయాలన్నారు. ఏడాది పాలనపై తీవ్ర వ్యతిరేకత మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. కూటమి పార్టీల మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని ప్రజలంతా ఇప్పటికే పశ్చాత్తాపానికి గురవుతున్నారని చెప్పారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై పెద్దస్థాయిలో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరల నుంచి భూమి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలకు భద్రత లేదు.. చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చుమీరాయన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి మాట్లాడుతూ.. మూడు పార్టీలు ఆరు గ్రూపులుగా కూటమి పాలన సాగుతోందని, ఇసుక నుంచి గ్రావెల్, మద్యం వరకు అన్నీ దోచుకుంటున్నారన్నారు. సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, కన్నబాబురాజు, మలసాల భరత్కుమార్, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, బొడ్డేడ ప్రసాద్, వ్యవసాయ సలహామండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, ముఖ్యనేతలు దంతులూరి దిలీప్కుమార్, చింతకాయల సన్యాసిపాత్రుడు, ఈర్లె అనురాధ, మిలటరీనాయుడు, రుత్తల యర్రాపాత్రుడు, మందపాటి జానకీ రామరాజు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, పుల్లేటి వెంకటేష్, పాలిశెట్టి సురేష్రాజు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 8లోమిగతా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ డౌన్లోడ్ శాసనమండలి విపక్ష నేత బొత్స, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అమర్నాథ్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఉచిత బస్సు నుంచి గ్యాస్ సిలిండర్ వరకూ హామీలిచ్చి మహిళలను, అన్నదాత సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట యువతను మోసగించారని మండిపడ్డారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛను ఇస్తామని ఇచ్చిన హామీ హుష్ కాకి అయిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎటువంటి షరతులు లేకుండా..అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ సంతకం చేసి బాండ్లు ఇచ్చారన్నారు. అవేవీ నెరవేరక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ వారి పక్షాన నిలబడి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఐదు వారాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి కూటమి పార్టీల మోసాలు ప్రజలకు వివరిద్దామన్నారు. -
చోడవరంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం
చోడవరం: నియోజకవర్గ కేంద్రం చోడవరంలో ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంభూ విఘ్నేశ్వరస్వామి దేవాలయం సమీపంలో హార్డింజ్ గెస్ట్ హౌస్ ఆవరణంలో 63అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శనివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకూ గ్రామీణ జిల్లాలో ఇంత భారీ మట్టి విగ్రహాన్ని ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహం ఏర్పాటు, ఇతర సెట్టింగ్లకు సుమారు రూ. 25లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహం తయారీకి రెండు నెలల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. సద్భావన కమిటీ, చోడవరం కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూజా కార్యక్రమాన్ని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పసుమర్తి సాంబ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గూనూరు మల్లునాయుడు, కొప్పాక రాజేష్, గూనూరు పెదబాబు తదితరులుపాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు -
వైజాగ్లో..
వందేభారత్ నిర్వహణ డిపోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం విశాఖలో కోచింగ్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా తెలిపారు. రైల్వే యార్డులో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. రైళ్ల నిర్వహణ పనుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు 24 గంటలు ఈ డిపో పనిచేస్తోందన్నారు. దువ్వాడలో వందేభారత్ రైళ్ల స్టాప్ పాయింట్ కోసం వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు వివరించారు. అలాగే విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ నియామకం జరిగిందని, వారి కార్యాలయం కోసం 3, 4 ప్రాంతాలను తాత్కాలికంగా పరిశీలిస్తున్నామన్నారు. విశాఖ నుంచి దువ్వాడ వరకు కొత్త రైల్వే లైను పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పనులకు ఉన్న కోర్టు కేసుల అడ్డంకి తొలగిపోయిందని, ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. మల్లివీడు వద్ద గతి శక్తి టెర్మినల్..! కొత్తవలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత గల మల్లివీడు రైల్వే స్టేషన్ వద్ద గతిశక్తి టెర్మినల్ (జీసీటీ) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మెకానికల్ హ్యాండ్లింగ్, వేర్ హౌసింగ్, ట్రక్ రిపేర్ సెంటర్, ఫ్యూయలింగ్ సెంటర్ ఏర్పాటుకానున్నాయి. మెకానికల్ హ్యాండ్లింగ్ ద్వారా రేకుల లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం అవుతుంది. తద్వారా రేకుల అందుబాటు సమయం కూడా పెరుగుతుంది. తద్వారా రేకుల కొరత కూడా కొద్ది మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఆగస్టులో టెండర్ దాఖలుకు గడువు ఉంది. ఇది పూర్తిగా రైల్వే స్థలంలోనే ఏర్పాటు కానుంది. శాటిలైట్ స్టేషన్లుగా మరింత అభివృద్ధి..! విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం రోజూ 50 వేల మంది వరకూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే లైన్లు తక్కువగా ఉండటం వల్ల రైళ్ల వేగం కూడా దువ్వాడ నుంచి తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త రైల్వే లైన్ల పనులు సాగుతున్నాయి. 3, 4 రైల్వే లైన్ల పనులు జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దువ్వాడ, పెందుర్తి శాటిలైట్ స్టేషన్లుగా మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా విశాఖ రైల్వే స్టేషన్పై భారం తగ్గుతుంది. ఇప్పటికే దువ్వాడ స్టేషన్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పెందుర్తి స్టేషన్లోనూ అభివృద్ధి పనులు చేపడతాం. దువ్వాడలో వందేభారత్ స్టాప్ కోసం ప్రతిపాదనలు ప్రస్తుతం వైజాగ్–సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు రైళ్ల నిర్వహణ సికింద్రాబాద్లోని డిపోలో జరుగుతోంది. విశాఖలో ఈ రైళ్ల నిర్వహణ కోసం డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఈ డిపో పనులు ప్రారంభించాలని నిర్ణయించాం. అదేవిధంగా ఈ రైళ్లును దువ్వాడ స్టేషన్లోనూ నిలపాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉంది. దీనిపై వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. దువ్వాడ నుంచి పలాసకు రయ్.. రయ్! దువ్వాడ నుంచి పలాస వరకు రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా జారీచేశాం. రానున్న 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించాం. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సందర్భంగా ఎటువంటి ప్రమాదాలకు... రైల్వే లైన్ల క్రాసింగ్కు అవకాశం ఉండదు. తద్వారా రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా ప్రయాణికులు గమ్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. 8లోమిగతా అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో ఏర్పాటు విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఇక వేగవంతం దువ్వాడ–పలాస మధ్య రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ మల్లివీడు వద్ద పీపీపీ పద్ధతిలో గతి శక్తి టెర్మినల్ ఏర్పాటు దక్షిణ కోస్తా రైల్వే జీఎం కార్యాలయం కోసం 3, 4 స్థలాల పరిశీలన ‘సాక్షి’తో వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు..! కోర్టు కేసుతో రైల్వే స్టేషన్లో పనులు ముందుకు సాగలేదు. చివరకు కోర్టు కేసు గెలిచాం. పనులు ప్రారంభిస్తాం. మొత్తం 14 ఫ్లాట్ఫారంలను ప్రధాన బిల్డింగ్ను ప్రయాణికులు చేరేందుకు వీలుగా 72 మీటర్ల పొడవైన కాంకోర్స్ ఏర్పాటవుతుంది. ఇక్కడ ప్రయాణికులు సేదతీరేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఫ్లాట్ఫారం సైజు కూడా పెరుగుతుంది. ఇక జ్ఞానాపురం వైపు స్టేషన్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ఫారంల నిర్మాణం ఉంటుంది. మల్టీ లెవల్ కారు పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గత 8 నెలలుగా నిలిచిన పనులు పట్టాలెక్కనున్నాయి. -
పొలాలకు నీరు విడుదల
వడ్డాదిలో గేటు ఎత్తి నీరు విడుదల చేస్తున్న రైతు సంఘ నాయకులు బుచ్చెయ్యపేట: పెద్దేరు రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని కస్పా పొలాలకు శుక్రవారం విడుదల చేశారు. స్థానిక రైతు సంఘం నాయకులు దాడి పెద గోవింద,దాడి చిన గోవింద తదితర్లు వడ్డాదిలో కస్పా కాలువపై ఉన్న గేట్లు ఎత్తి సాగునీరు విడుదల చేశారు. వడ్డాది,చిన అప్పనపాలెం,పోలేపల్లి,గౌరీపట్నం,దిబ్బిడి, బుచ్చెయ్యపేట తదితర గ్రామాలకు చెందిన రైతులకు ఈ కాలువ కింద భూములన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో రైతులు వరి ఆకుమడులు వేసేందుకు నీరు విడుదల చేశారు. -
బైక్పై తరలిస్తున్న 56 కిలోల గంజాయి పట్టివేత
కె.కోటపాడు : ఆనందపురం కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన చెల్లం తవాసీని ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆనందపురం కూడలి వద్ద సిబ్బందితో కలిసి ఎస్ఐ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటువైపుగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న చెల్లం తవాసీని పోలీసులు ఆపారు. వాహనానికి రెండు వైపులా ఉంచిన సంచులను కిందకు దించి తనిఖీలు చేయగా.. 56 కిలోల గంజాయిని గుర్తించారు. ద్విచక్ర వాహనం, నిందితుడి వద్ద ఉన్న సెల్ఫోన్ను సీజ్ చేసి, చెల్లం తవాసీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. పట్టుకున్న 56 కిలోల గంజాయి విలువ రూ.2.80 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. -
జనం మధ్య జగన్నాథుడు
అంగరంగ వైభవంగా తొలి రథయాత్రసుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు రథంపై కొలువుదీరారు. స్వామి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. రథం లాగేందుకు పోటీ పడ్డారు. గవరపాలెం మర్రిచెట్టు వద్ద కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి తొలి రథయాత్ర శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వామివారికి పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. రథం ఆలయం నుంచి గవరపాలెం పురవీధుల మీదుగా చిననాలుగురోడ్ల జంక్షన్, కోట్నివీధి, మళ్ల వీధి మీదుగా సాగి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంద్రద్యుమ్న హాల్కు చేరుకుంది. ఇక్కడ తొమ్మిది రోజులపాటు రోజుకొక అవతారంలో ప్రజలకు స్వామివారు దర్శనమిస్తారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సీఐలు టీవీ విజయ్కుమార్, వెంకటనారాయణ, ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడుగులలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జగన్నాథస్వామి ఆలయం నుంచి నూతన ఇంద్రద్యుమ్న హాల్ వరకు మంగళ వాయిద్యాలు, భజనల నడుమ కన్నుల పండువగా రథయాత్ర సాగింది. – అనకాపల్లి టౌన్/మాడుగుల -
టీడీపీలో ముసలం.!
● మునగపాక మండలంలో వర్గాలుగా చీలిపోయిన క్యాడర్ ● ఓ వర్గం జనసేన ఎమ్మెల్యే సుందరపుతో అంటకాగుతున్న వైనం ● నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రగడ వైపు మరోవర్గం ● టీడీపీ మండల కమిటీల నియామకంతో రచ్చకెక్కిన నాయకులు ● ఆత్మీయ సమావేశం పేరిట మునగపాకలో ఓ వర్గం సమావేశం ● హాజరు కాని ప్రగడ, ఆయన అనుచరులుమునగపాక: మునగపాక మండలం టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. ఇంత వరకు గుట్టుచప్పుడు కాకుండా పెరుగుతూ వచ్చిన అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబికింది. ఇందుకు పార్టీలో ఇటీవల నియమించిన నూతన కార్యవర్గాలే ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావుకు, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనుచరులుగా చెలామణి అవుతున్న టీడీపీ శ్రేణుల మధ్య గత కొంత కాలంగా విబేధాలు ఉన్నాయి. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు దాడి ముసిలినాయుడు, మొల్లేటి సత్యనారాయణ ఒక వర్గంగా ఉంటూ ఎమ్మెల్యే విజయకుమార్కు అనుచరులుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులుగా చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీలో ఇటీవల నూతన కమిటీల నియామకం చేపట్టారు. ఈ నియామకంలో భాగంగా మునగపాకకు చెందిన పెంటకోట విజయ్ను పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రకటించారు. ఎమ్మెల్యే అనుచరులుగా ఉంటున్న టీడీపీ నాయకులు ఈ నియామకాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో శుక్రవారం మునగపాకలో శ్రీనివాసరావు, ముసిలినాయుడు, సత్యనారాయణ తదితరులు ఆత్మీయ సమావేశం పేరిట కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మొదటి నుంచి టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు కమిటీల్లో ఎలా నియామకాలు చేస్తారంటూ ఆవేదన వెల్లగక్కారు. కార్యకర్తల అభీష్టం మేరకు కమిటీల ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. నియోజకవర్గ టీడీపీ నేతలు కొంత మందిని ప్రోత్సహించేలా కమిటీల నియామకం చేపట్టారంటూ బాహాటంగా విమర్శలు గుప్పించారు. తాము ఎక్కడా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేయకున్నా తమను పక్కన పెట్టారని పలువురు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలంటే పార్టీలో నెలకొన్న విబేధాలను సరి చేయాలని, లేకుంటే ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి అవకాశం ఇచ్చినట్లవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని, పెద్దలు జోక్యం చేసుకొని కార్యకర్తల అభీష్టం మేరకు కమిటీలు వేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులతో పాటు మంత్రి లోకేష్ దృష్టికి కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మొత్తమ్మీద మండల టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
రిటైర్డ్ హోంగార్డుకు ఆర్థిక సాయం
రామునాయుడుకు చెక్కును అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: పరవాడ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందిన కె.రామునాయుడుకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల హోం గార్డులు ఒక రోజు వేతనం రూ.4,04,965 అందజేశారు. ఈ మొత్తం చెక్కును ఎస్పీ తుహిన్సిన్హా శుక్రవారం తన కార్యాలయంలో ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు పదవి వీరమణ పొందినా, అనారోగ్య కారణంగా మృతి చెందినా హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. హోంగార్డులు పోలీస్ శాఖలో ఒక భాగమేనన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి ఏ రామ్కుమార్, సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
● ముఖ్యఅతిథులుగా శాసనమండలి విపక్ష నేత బొత్స, రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● జిల్లాలో కేడరంతా హాజరు కావాలని అమర్నాథ్ పిలుపుసాక్షి, విశాఖపట్నం: పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మధ్యా హ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి టౌన్లోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పీఏసీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, పార్లమెంట్ సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేసిన మోసాలను గడప గడపకు వెళ్లి ఎండగట్టేందుకు నిర్వహించే ‘బాబు షూరిటీ..మోసాలు గ్యారెంటీ’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆరు వారాల పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో ప్రజల వద్దకే వెళ్లి క్యూఆర్ కోడ్ ద్వారా కూటమి మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చారో.. వాటిలో ఏ పథకాలు ఇచ్చారో.. ఎన్ని ఎగవేశారో స్పష్టంగా తెలియజేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా 2024 ముందు కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునే విధంగా టెక్నాలజీ కల్పించామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
ఉపాధ్యాయుడు దుర్మరణం
గొలుగొండ: లింగంపేట సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదుగా ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు పాంగి లక్ష్మణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. అల్లూరి జిల్లా నడింపాలెం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లక్ష్మణమూర్తి నర్సీపట్నం సమీప లక్ష్మీపురంలో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. గొలుగొండ మండలం లింగంపేట సమీపంలో చోద్యం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్పై అతివేగంగా వస్తూ ఆయనను బలంగా ఢీకొట్టారు. ఉపాధ్యాయుడు రోడ్డుపై పడి అక్కడకక్కడే దుర్మరణం చెందారు. స్వల్పంగా గాయపడిన ఇద్దరు యువకులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణమూర్తి మృతదేహాన్ని గొలుగొండ ఎస్ఐ రామారావు పోస్టుమార్టుం కోసం నర్సీపట్నం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు భద్రతా చర్యలు
పరవాడ: రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో ఈ నెల 23న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ప్రమాదం తీరు తెన్నులను ట్రాఫిక్ పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు భద్రత పరిరక్షణ చర్యలపై రోడ్డు ఇంజినీరింగ్లో తగు మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా రవాణాశాఖ అధికారి జి.మనోహర్, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్లతో సమీక్ష జరిపారు. అలాగే ప్రమాద స్థలంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు, వేగ నియంత్రణ, సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ, ప్రమాదకరంగా ఉన్న మలుపులు, డివైడర్లు, సైన్ బోర్డుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష జరిపి, సూచనలిచ్చారు. ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడగా 15 మంది గాయపడ్డారని, క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. సమీక్షలో రవాణా శాఖాధికారి జి.మనోహర్, పరవాడ సబ్డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె.ప్రవీణ్కుమార్, పి.గోపీకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ● ఎస్పీ తుహిన్ సిన్హా -
21న ఓటరు జాబితా విడుదల
● 30 లోపు అభ్యంతరాల స్వీకరణ ● ఈవీఎం గోదాములు తనిఖీలో డీఆర్వో సత్యనారాయణరావు తుమ్మపాల: ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో సమస్యలు, పొరపాట్లు వంటి అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు తెలిపారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోదాములను ఆర్డీవో షేక్ ఆయిషా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసి ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను, సీసీకెమెరాల పనితీరును పరిశీలించారు. తాళాలు తీయించి గోదాముల లోపల ఈవీఎంలను, అగ్నిమాపక పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవీఎం గోదాముల వద్ద భద్రతా సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు, లాగ్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ పార్టీల నేతలతో చర్చించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఆయన చాంబర్లో జరిగిన మాసాంతపు సమావేశంలో డీఆర్వో మాట్లాడారు. ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపిన సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి మార్పులు చేర్పులపై సంబంధిత అధికారులకు నివేదిక ఇచ్చినట్లయితే జులై 21న ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు అదే నెల 30వ తేదీ లోపు స్వీకరిస్తామన్నారు. ఆగస్టు 2న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఓటరు జాబితాలను నాణ్యతగా తయారు చేసేందుకు మరింత మంది బూత్ స్థాయి అధికారులు, ఎలక్ట్రోరల్ అధికారుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒకే డోర్ నంబర్లో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు వివిధ వార్డుల్లో ఓట్లు నమోదై ఉన్నాయని, వాటిని సరిచేసి ఒకే చోట చేర్చాలని వైఎస్సార్సీపీ నేత జాజుల రమేష్ కోరారు. ఇలా వివిధ రాజకీయ పార్టీ నేతలు లేవనెత్తిన సందేహాలను డీఆర్వో నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఆర్. వెంకటరమణ, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంటు ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి. శ్రీనివాసరావు, కె.హరినాథబాబు, ఆర్.శంకరరావు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారుల్లో కదలిక
● 5 కి.మీ. నడిచి అర్ల పంచాయతీ చేరుకున్న డీఈవో, తహసీల్దార్, ఎండీపీవో ● ఎన్ఆర్ఎస్టీసీ స్కూలు పునఃప్రారంభానికి హామీ ● అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు సిఫారసురోలుగుంట: అర్ల గిరిజన పంచాయతీ శివారు కొండ శిఖరాగ్రాన గల గిరిజన గ్రామాల విద్యార్థుల అవస్థల గురించి తెలుసుకొని అధికారులు స్పందించారు. ఆ చిన్నారుల నడకయాతన గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు వారిలో కదలిక తీసుకువచ్చాయి. జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు శుక్రవారం రోలుగుంట వచ్చారు. ఎంఈ వో జానుప్రసాద్, తహసీల్దార్ ఎస్.నాగమ్మ, ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావులతో కలిసి అయిదు కిలోమీటర్లు పైబడి కొండపైకి కాలినడకన చేరుకున్నారు. పెదగరువు, కొత్తలోసింగి, పాతలోసింగి గ్రా మాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. తమ పిల్లలు చదువు కోసం ఆరు కిలోమీటర్ల దూరంలోని వై.బి.పట్నం, 10 కిలోమీటర్ల దూరంలోని బి.బి.పట్నం గ్రామాలకు కాలినడకన వెళుతున్నారని వారి కష్టాలు చెప్పుకున్నారు. గతేడా ది సెప్టెంబర్లో తమ అభ్యర్థన మేరకు గ్రామంలోనే ఎన్ఆర్ఎస్టీసీ స్కూలు నిర్వహించారని, ఈ ఏడాది పునఃప్రారంభించలేదని వివరించారు. తమ గ్రామాల్లో పూర్తిస్థాయిలో పాఠశాల ఏర్పాటు చే యాలని కోరారు. గతంలో ఈ గ్రామాలకు రూ.2.50 లక్షలు మంజూరైతే తూతూమంత్రంగా పనులు చేశారని, వర్షాలకు కొట్టుకుపోయి య థాస్థితికి వచ్చిందన్నారు. రవాణా మార్గం లేక రో గులను చికిత్స కోసం డోలీలో తరలించాల్సి వస్తుందన్నారు. డీఈవో అప్పారావునాయుడు కొత్తలోసింగి, పాతలోసింగి గ్రామాల్లో ఒకటి నుంచి అయిదు వరకు చదువుతున్న 22 మంది విద్యార్థులు ఉ న్నారని, పెదగరువు గ్రామంలో బడి ఈడు పిల్లలు అయిదుగురు ఉన్నట్టు గుర్తించి వై.బి.పట్నం ఎంపీపీ పాఠశాల హెచ్ఎం ఏకా నర్సింహమూర్తిని రప్పించి హాజరు పట్టీని సరిపోల్చారు. సంతృప్తి చెందిన ఆయన ఎన్ఆర్ఎస్టీసీ స్కూలును మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయిదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్కు నివేదిస్తామని చెప్పారు. గిరిజన సంఘ నాయకులు కె.గోవింద, ఆ గ్రామాల పెద్దలు కిలో నర్సయ్య, వెంకట్రావు పాములు, సత్తిబాబు, సీఆర్పీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
గుడి,బడి ధ్యాసే లేదు..గల్లీగల్లీలో ‘బెల్ట్’ లొల్లి
గ్రామాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగుతోంది. గల్లీగల్లీలో మందు దొరుకుతోంది. అర్ధరాత్రి వరకూ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రేటు పెంచి అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో మద్యం బాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మరో వైపు గుడి, బడి సమీపంలో షాపులు నిర్వహిస్తుండడంతో పూటుగా తాగిన మందుబాబులు వీరంగం సృష్టిస్తూ విద్యార్థులను, భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ● విచ్చలవిడిగా మద్యం విక్రయాలు ● భయాందోళనలలో గొడిచర్లలో పాఠశాల విద్యార్థులు ● మామ్మూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులునక్కపల్లి: కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులై పారుతోంది. ఇష్టానుసారం బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారు. బడి, గుడి అన్న ధ్యాసే లేకుండా ఎక్కడపడితే ఏర్పాటు చేసేస్తున్నారు. గొడిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు అతి సమీపంలో జగన్నాథపురం వెళ్లే రూట్లో బెల్టుషాపు ఏర్పాటు చేసి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. బెల్ట్షాపు ముందునుంచే జగన్నాథపురం, ముకుందరాజుపేట, దోసలపాడు, చీడిక , కొత్తూరు, రమణయ్యపేట, రేబాక,తిరుపతిపాలెం, గుల్లిపాడు గ్రామాలనుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ గొడిచర్ల పాఠశాలలో చదువుకుంటున్నారు.దాదాపు 800 మందికి పైగా విద్యార్థులు సుమారు 3నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలనుంచి గొడిచర్ల పాఠశాలకు కాలినడక, సైకిళ్లపై, ఆటోల్లో వస్తారు. ఈ మార్గంలో బెల్టు షాపు ఉండడంతో విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ బెల్టుషాపునకు సమీపంలోనే గ్రామ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినీవిద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బెల్టుషాపు పరిసరప్రాంతాలను వినియోగిస్తారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బెల్టుషాపు ముందునుంచే రాకపోకలు సాగించవలసి రావడంతో మద్యం మత్తులోఎవరు ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తారోనన్న భయంతో బాలికలు ఆందోళన చెందుతున్నారు. లైసెన్సు పొందిన దుకాణాల యజమానులే గ్రామాల్లో అమ్మకాలను పెంచడం కోసం బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని బెల్ట్షాపుల్లోను ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ ఎంఆర్పీ రూ.100 ఉంటే గ్రామాల్లో బెల్టుషాపుల్లో రూ.150 వసూలు చేస్తున్నారు. బీరు బాటిల్కు రూ.50 నుంచి రూ.100 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఉపమాక వెంకన్న ఆలయానికి వెళ్లే రోడ్డులో.. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్న ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులోకూడా రెండు మద్యం దుకాణాలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విక్రయాలే కాకుండా షాపు వద్దే సేవించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రహదారిలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని చూసి భక్తులు విస్తుబోతున్నారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ కలిగిన బార్ల వద్ద మాత్రమే మద్యం సేవించాల్సి ఉంటుంది.కానీ నక్కపల్లి మండలంలో షాపుల వద్ద ఎంచక్కా సకల సదుపాయాలు కల్పించి అక్కడే తాగే ఏర్పాట్లు చేస్తున్నారు. -
పూల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..
● హైవేలో అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీ ● కడియం నుంచి పూలు తెస్తున్న బొలేరో వ్యాన్ ఢీ ● వ్యాన్ డ్రైవర్ సహా మహిళ దుర్మరణం ● మరో మహిళకు తీవ్ర గాయాలు ● జమాదులపాలెంలో ఘటన కశింకోట: జమాదులపాలెం జంక్షన్ వద్ద జాతీ య రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కోల్కత్తాకు వెళ్తున్న కంటైనర్ను బొలేరో వ్యాన్ ఢీకొంది. దాంతో వ్యాన్ డ్రైవర్ సహా ఒక మహిళ దుర్మరణం చెందారు. మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం.. కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన పూల వ్యాపారి కన్నూరు లక్ష్మి(40)తోపాటు మరో మహిళ తూర్పు గోదావరి జిల్లా కడియం వద్ద పూలు కొనుగోలు చేసి గాజువాకలో అమ్మకానికి వ్యాన్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న ఈ వ్యాన్ అదేమార్గంలో ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీని బలంగా ఢీకొంది. దీంతో కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పి. సత్యనారాయణ (25), పూల వ్యాపారి లక్ష్మి(40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి మండలం కోడూరుకు చెందిన పూల వ్యాపారి ఎన్. వరలక్ష్మి (40) తీవ్రంగా గాయపడింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరిన సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావులతోపాటు పోలీసులు క్షతగాత్రురాలిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సలహాపై విశాఖ కేజీహెచ్కు తరలించారు. కేబిన్లో ఇరుక్కున్న మృతదేహాలు.. వ్యాన్ డ్రైవర్ పక్క సీటులో లక్ష్మి కూర్చొంది. దీంతో అతడితోపాటు ఆమె కూడా మృత్యువాత పడింది. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో మృతదేహాలు చిక్కుకోవడంతో కేబిన్ నుంచి బయటకు అతికష్టం మీద పోలీసులు వెలికితీసి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమాదం వల్ల వాహనాల ప్రయాణానికి అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాద వాహనాలను రోడ్డుపై తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతి చెందిన వారిలో లక్ష్మిది పేద కుటుంబం. భర్త వరహాలు గాజువాక వద్ద కళాసీ పని చేస్తున్నాడు. లక్ష్మి నాలుగేళ్లుగా కడియం నుంచి పూలు తెచ్చి గాజువాకలో అమ్ముకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఆమె పెద్ద కుమార్తె మాధవి తిరుపతిలో డీ ఫార్మసీ, చిన్న కుమార్తె కావేరి స్థానికంగా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లి లక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలు లక్ష్మి భర్త వరహాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కె. లక్ష్మణరావు తెలిపారు. -
అల్లూరి జయంతి ఏర్పాట్లు పరిశీలన
మాట్లాడుతున్న ఆర్డీవో రమణ గొలుగొండ: అల్లూరి పార్కులో వచ్చే నెల 4న అల్లూరి జయంతి ఘనంగా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు సర్వం సిద్ధం చేయాలని నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ ఆదేశించారు. కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరి సమాధుల ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు పక్కాగా ఉండాలని తహసీల్దార్ శ్రీనువాసరావుకు సూచించారు. ఆ రోజు రాష్ట్రంలో ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులకు అల్లూరి ఉత్సవ కమిటీ సహకారం అందించాలని కోరారు. -
ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు
గుండె తరుక్కుపోయే కఠిన వాస్తవం.. చదువు కోసం చిన్నారులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రమాదకర ప్రయాణం.. పడవపై రైవాడ జలాశయం దాటి, కొండలు గుట్టల్లో నడిచి, పొరుగు జిల్లా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలల సాహస కృత్యం.. వారి దీనావస్థ కఠిన హృదయులను సైతం కదిలిస్తుంది.. గిరిజన ప్రాంతంలో పుట్టిన పాపానికి ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టం పగవారికి కూడా వద్దనిపిస్తుంది. ● నాటు పడవలో.. బురదలో కాలినడకన రాకపోకలు ● 5 కి.మీ దూరంలో ఉన్న బడికి ప్రమాదకర ప్రయాణం ● అనంతగిరి మండలం సొలబంగు బాలల అవస్థలు ● దేవరాపల్లి మండలం తామరబ్బ పాఠశాలలో చదువు ● గ్రామానికి రోడ్డు, బడి లేక చిన్నారుల ఇక్కట్లు ● పిల్లలు ఇంటికి చేరుకునే వరకు భయాందోళనలో తల్లిదండ్రులు దేవరాపల్లి: రైవాడ జలాశయానికి ఆవల.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని గిరిజన ప్రాంతం ఉంది. పినకోట పంచాయతీ శివారు సొలబొంగు గ్రామానికి చెందిన బాలలు చదువు కోసం ప్రాణాలకు తెగించి, అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి, పాఠశాల లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన 12 మంది విద్యార్థులు దేవరాపల్లి మండల పరిధిలోని తామరబ్బ ఎంపీయూపీ పాఠశాలకు పడవపైన, కాలినడకన వచ్చి చదువుకుంటున్నారు. సొలబొంగు నుంచి తామరబ్బకు చేరుకోవాలంటే రెండు మార్గాలు. వీరభద్రపేట మీదుగా పొలాల గట్లపై జారు బురదలో సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాలి. వర్షం పడితే ఈ మార్గంలో రాకపోకలు సాగించడం కష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా సొలబొంగు నుంచి నాటు పడవపై రైవాడ జలాశయంలో సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రయాణించి, దేవరాపల్లి మండల పరిధిలోని లోవ ముకుందపురం గ్రామానికి చేరుకొని.. అక్కడి నుంచి మళ్లీ ఒక కిలోమీటరు మేర చెట్లు, పుట్టల గుండా కర్రలు చేత పట్టుకొని ప్రయాణించి తామరబ్బ పాఠశాలకు చేరుకోవాలి. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురవడంతో విద్యార్థులు పడవపైనే పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరభద్రపేట రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలిపివేయడంతో తమకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయని సొలబొంగు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామంలో 16 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 70 మంది వరకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తులు సైతం నిత్యావసర సరకుల కోసం పడవపైన, లేదా వీరభద్రపేట మీదుగా తామరబ్బ వైపునకు చేరుకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రామానికి చెందిన గర్భిణులు ఆసుపత్రికి చేరుకోవాలంటే సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని దేవరాపల్లి ఆసుపత్రే దిక్కు. దారీ తెన్నూ లేదు మా గ్రామానికి దారీ తెన్నూ లేదు. మా గ్రామంలో బడి లేక పిల్లల్ని దేవరాపల్లి మండలంలోని తామరబ్బ స్కూల్కు పంపిస్తున్నాం. నా కుమార్తె అంజలి 4వ తరగతి చదువుతోంది. సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పొలాల గట్ల మీదుగా తుప్పలు, డొంకలను దాటుకుంటూ నడిచి వెళ్తున్నారు. వర్షం కురిస్తే కాలినడక మార్గం బురదమయంగా మారుతుంది. ప్రభుత్వం స్పందించి మా పిల్లలు పడుతున్న కష్టాలను తీర్చాలి. – దిప్పల దేముడుబాబు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు ప్రభుత్వం స్పందించాలి మాకు ఎలాగూ చదువు లేదు.. మా పిల్లలనైనా చదివించాలని ఆశ పడుతున్నాం. నా కూతురు శివజ్యోతి ఒకటో తరగతి చదువుతోంది. ప్రస్తుత వర్షాలకు వీరభద్రపేట మార్గం అడుగు తీసి అడుగు వేయలేని విధంగా బురదమయంగా మారింది. ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో నాటు పడవలపై పిల్లలను లోవ ముకుందపురం వరకు పంపిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి బడి, రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలి. –గమ్మెల రాజు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు -
సతీష్ ఇంటికి కుళాయి
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన నేతలు ● సూపర్ సర్పంచ్పై హోం మంత్రికి ఫిర్యాదునక్కపల్లి/ ఎస్రాయవరం: జనసేన కార్యకర్త ఇంటికి కుళాయి ఏర్పాటు వ్యవహారాన్ని పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీకి చెందిన సూపర్ సర్పంచ్ వ్యవహారాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎట్టకేలకు తమ పార్టీకి చెందిన సతీష్ ఇంటికి పోలీసులు, అధికారుల సాయంతో శుక్రవారం కుళాయి ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం మండలం జేవీపాలెంలో జనసేన గ్రామశాఖ అధ్యక్షుడు సతీష్ ఇంటికి కుళాయి వేయకుండా స్థానిక సూపర్ సర్పంచ్, మండల టీడీపీ సమన్వయకమిటీ సభ్యుడు వజ్రపు శంకర్రావు అడ్డుపడిన విషయం తెలిసిందే. అధికారుల దృష్టికి తీసుకెళ్లి కుళాయి వేయించుకునే పనులు ప్రారంభించడంతో సతీష్పై, అతని తల్లిపై శంకర్రావు గురువారం దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ తదితరులు బాధిత కుటుంబానికి అండగా నిలిచి సతీష్ ఇంటికి కుళాయి వేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఈ పరిణామంతో రెండు పార్టీల మధ్య అగాధం మరింత పెరిగే అవకాశం ఉందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. -
పీజీ సెట్లో ర్యాంకుల పంట
నర్సీపట్నం: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే ఏపీ పీజీ సెట్ ఫలితాల్లో నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో మంచి ర్యాంకులు సాధించారు. ఎం.కామరాజు హిస్టరీలో 24వ ర్యాంకు, జె.వరలక్ష్మి కామర్స్లో 101వ ర్యాంకు, కె.చాందిని బోటనీలో 127, ఎల్.అశ్విని బోటనీలో 214, సిహెచ్.మౌనిక పొలిటికల్ సైన్స్లో 256, కె.నందిని బోటనీ 307, సిహెచ్.దుర్గాప్రసాద్ కామర్స్ 347, కె.సంజన బోటనీ 379, ఎన్.రోహిణి బోటనీ 587, జి.రమ్య రాజేశ్వరి దేవి కెమికల్ సైన్స్లో 610 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. డాక్టర్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారు. గణితంలో ఎన్.వినయ్ కుమార్ 18వ ర్యాంకు, వృక్షశాస్త్రంలో ఎ.లక్ష్మీశ్రావణి 97, గాయత్రి 127, వి.శ్యామల 184 ర్యాంకులు సాధించారు. రసాయన శాస్త్రంలో కె.మధు కిరణ్ 144వ ర్యాంకు సాధించారు. పీజీ సెట్లో జ్యోత్స్నకు 4వ ర్యాంకు యలమంచిలి రూరల్: ఏపీ పీజీ సెట్లో యలమంచిలికి చెందిన రావాడ జ్యోత్స్న సత్తా చాటింది. ఆమె కెమికల్ సైన్సెస్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. స్థానిక గీతాంజలి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన జ్యోత్స్న ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది. తమ కుమార్తెకు ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు నాగేశ్వరరావు, కరుణకుమారి ఆనందం వ్యక్తం చేశారు. పీజీ పూర్తి చేసి మంచి ఉన్నత ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని జ్యోత్స్న సాక్షికి తెలిపింది. -
వసతి గృహ విద్యార్థినులపై కుక్క దాడి
● ఏడుగురికి గాయాలు నాతవరం ఆస్పత్రిలో బాధిత విద్యార్థినులు నాతవరం: మండలంలోని తాండవ గిరిజన బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థినులపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు విద్యార్థినులు గాయపడ్డారు. ఇక్కడ వసతి గృహం వద్ద అదనపు భవనం నిర్మాణం కోసం కొంతమేర ప్రహరీ తొలగించారు. దాంతో కుక్క లోపలకు చొరబడి ఒక్కసారిగా విద్యార్థినులపై దాడికి పాల్పడింది. కె.బాబి, కె.రమ్య, జంప దుర్గ, జంప వశిష్ట, కె.మీనాక్షి, కె.నారిముని, టి.భానుమతి గాయపడ్డారు. వీరిని వసతి గృహ సిబ్బంది నాతవరం పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్సనందించి అనంతరం నర్సీపట్నం సీహెచ్సీకి తీసుకెళ్లి మరో వ్యాక్సిన్ వేయించారు. -
స్టీల్ప్లాంట్కు భూములు ఇచ్చేది లేదు
● గతంలో సేకరించిన భూములకు పరిహారం నేటికీ చెల్లించలేదు ● వేంపాడులో రైతుల నిరసననక్కపల్లి : మండలంలో ఏర్పాటు చేయబోతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్ టౌన్షిప్ కోసం భూములు ఇచ్చే ప్రసక్తి లేదని వేంపాడుకు చెందిన పలువురు రైతులు స్పష్టం చేశారు. సీపీపీ ఆధ్వర్యంలో వీరంతా వేంపాడులో నిరసన తెలిపారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను స్టీల్ప్లాంట్ కోసం ఇచ్చేసి తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు అన్నారు. ఇప్పటికే 2100 ఎకరాలు ప్రభుత్వం స్టీల్ప్లాంట్ కోసం కేటాయించిందన్నారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు, రైతు నాయకులు సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం నక్కపల్లి మండలాన్నే ఎంచుకోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రైతుల నుంచి కారు చౌకగా కొనుగోలు చేసి అధిక ధరలకు కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తున్నారన్నారు., పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. స్టీల్ప్లాంట్ కోసం అదనంగా మరో 3200 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం దారుణమన్నారు. నెల్లిపూడి, వేంపాడు, డిఎల్ఫురం, కాగిత గ్రామాలను ఎంచుకున్నారన్నారు. భూములు ఇవ్వడానికి ఈ గ్రామాల రైతులు అంగీకరించడడం లేదన్నారు. ఎనిమిదో రోజుకు చేరిన మత్స్యకారుల ఆందోళన కాగా అమలాపురంలో మత్స్యకార సొసైటీ భూముల్లో ఏపీఐఐసీ వారు రోడ్డు పనులు చేపట్టాడాన్ని నిరసిస్తూ మత్య్సకారులు చేపట్టిన ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ గ్రామంలో కనకమహాలక్ష్మి సొసైటీకి ప్రభుత్వం 30 ఏళ్ల క్రితం 43 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చిందని మత్స్యకారులు తెలిపారు. ప్రస్తుతం బల్క్ డ్రగ్ పార్క్ కొరకు ఈ భూములను ఏపీఐఐసీ వారు సేకరించారని, మత్స్యకార సొసైటీకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేస్తున్నారన్నారు. నష్టపరిహారం చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని సీపీఎం నాయకులు అప్పలరాజు, మత్స్యకార నాయకులు పెదకాపు తాతారావు ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పనులు అడ్డుకున్నామన్నారు. పోలీసులను రప్పించి బెదిరించాలని ప్రయత్నిస్తోందని, బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు కొనసాగించాలన్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని మత్య్సకారులు తెలిపారు. రాంబిల్లిలో ఎన్ఈవోబీ కోసం సేకరించిన సొసైటీ భూములకు మత్స్యకారులకు నష్టపరిహారం ఇచ్చారని ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. -
వెదురు పెంపకంతో అధిక లాభాలు
● జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణరావికమతం : డీఆర్డీఏ పీడీ అదేశాల మేరకు గురువారం రావికమతం వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ,జీవనోపాదుల విభాగం మరియు ఇండస్ట్రీయల్ ఆప్ బాంబుస్ అఫ్ బెంగళూరు వారు సంయుక్తంగా మండలంలో వెదురు పంటపై అవగాహన కల్పించారు.మండలంలో వెదురు పెంపకానికి 200 మంది రైతులను గుర్తించాలని బెంగళూరుకు చెందిన ఇండస్ట్రియల్ ఆప్ బ్యాంబుస్ సంస్థ ప్రతినిధి కుసుమ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు త్రిపుర రకానికి చెందిన వెదురు మొక్కలను ఉచితంగా రైతులకు అందజేస్తామన్నారు. ఈ మెక్కలు నాటాడానికి ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఒక రైతు వెదురును పెంచేందుకు కనీసం 37 సెంట్లు భూమి ఉండాలన్నారు. నాటిన నాలుగు ఏళ్ల తరువాత ఎదిగిన వెదురును తమ సంస్థ కొనిగోలు చేస్తుందని వివరించారు. ఒక్కసారి నాటితే 100 సంవత్సరాలు వరకు వెదురును అమ్ముకోవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ , ఏపీఎం ఈశ్వరరావు, సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పాయకరావుపేట: యువకులు, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటిని అలవాటు చేసుకుంటే బానిసై భవిష్యత్ నాశనమవుతుందని జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (మాదక ద్రవ్యాలు రహిత భారతం)లో భాగంగా పట్టణంలో వాక్థాన్ నిర్వహించారు. స్థానిక కల్యాణ మండపం నుంచి గౌతమ్ థియేటర్ వరకు విద్యార్థులు, అధికారులు, నాయకులు ర్యాలీగా వెళ్లారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. తొలుత కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఏఎస్పీ మాట్లాడారు. గంజాయి, హెరాయిన్, వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల భవిష్యత్ నాశనమవుతుందన్నారు. కార్యక్రమంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీవిద్య, పాయకరావుపేట సీఐ జి.అప్పన్న, కూటమి నాయకులు తోట నగేష్, గెడ్డం బుజ్జి, పెదిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరహాలు, చించలపు పద్దూ, కొప్పిశెట్టి వెంకటేష్, రెవెన్యూ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ● వాకథాన్లో ఏఎస్పీ మోహన్రావు -
దిక్కెవరు?
శ్రీరాముని భూమికి విస్తుపోయిన దేవదాయ శాఖ అధికారులు ఎస్.రాయవరం: యలమంచిలి దేవదాయ డివిజన్ కార్యనిర్వహణాధికారి పరిధిలో ఎస్.రాయవరం మండలం సైతారుపేట గ్రామంలోని శ్రీరామాలయానికి సర్వే నంబరు 141లో 1.04 ఎకరాల భూమి ఉంది. గ్రామానికి చెందిన వీసం సన్యాసినాయుడు కుటుంబం ఈ భూమిని ఆలయానికి రాసిచ్చింది. ఈ భూమికి ఆనుకుని ఓ అధికార పార్టీ నాయకుడి ఇల్లు ఉంది. ఆ నాయకుడి ఇంటికి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రహదారి నిర్మించడం కోసం ఆలయ భూమి ఆక్రమణకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా దేవదాయ జిల్లా అధికారిణికి స్థానిక టీడీపీ నేత ఈ రహదారి నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటారో చూస్తాను అంటూ చెప్పి మరీ సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. దీన్ని సీరియస్గా పరిగణించిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భవిష్యత్తులో ఈ ఆలయ భూమిలో క్రమంగా మరిన్ని ఆక్రమణలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించి చర్యలకు ఉపక్రమించారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు సైతారుపేట శ్రీరామాలయం భూమిలో గ్రామానికి చెందిన టీడీపీ నేత దౌర్జన్యంగా రహదారి నిర్మాణం చేస్తున్నారంటూ యలమంచిలి దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ డి.ఉమాదేవి ఈ నెల 11న రాత పూర్వకంగా ఎస్.రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణ నిలుపుదల చేయాలని, దీనికి బాధ్యులెవరనేది ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా పోలీసులు స్పందించలేదు. సైతారుపేట రామాలయానికి ఉన్న 1.04 ఎకరాలకు సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని కోరుతూ యలమంచిలి దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కె.సాయివెంకట తేజ.. ఎస్.రాయవరం తహసీల్దార్కు ఈ నెల 20న మీసేవ ద్వారా దరఖాస్తు చేయడంతో పాటు అధికారికంగా లేఖ ద్వారా కోరారు. రెవెన్యూ అధికారులు కూడా స్పందించకపోవడంతో ఆక్రమణదారులు ఇప్పటికే ఆలయ భూమిలోంచి పంచాయతీ చెత్తతో రహదారి నిర్మాణం కోసం పూనుకున్నారు. దేవుని భూమిని కాపాడాలి మా తాత వీసం సన్యాసినాయుడు శ్రీరామునిపై భక్తితో ఇక్కడ భూమిని రాసిచ్చారు. సదుద్దేశంతో ఇచ్చిన భూమిని ఇక్కడ కొందరు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. పంచాయతీ పాలకుల సపోర్టుతోనే ఇదంతా జరుగుతోంది. దేవుని భూమిలో రహదారి నిర్మాణానికి పంచాయతీ పాలకులు ఎలా ఆమోదం చెబుతారు. కళ్లముందే మా కుటుంబం ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూమిని ఆక్రమించుకుంటున్నారు. గతంలోనే దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాను. ఆలయ భూమిని ఆక్రమించుకోవడం దురదృష్టకరం. అధికారులు ఆక్రమణను ఆపాలి. – వీసం వెంకట లలిత, ఆలయ ట్రస్టీ సైతారుపేట శ్రీరామాలయం భూమిని ఆక్రమించుకుని వేస్తున్న రహదారి సైతారుపేటలో ఆలయ భూమిలో రహదారి నిర్మాణం రెవెన్యూ, పోలీసులకు దేవదాయ శాఖ అధికారుల ఫిర్యాదు అధికార పార్టీ నేత ఒత్తిడితో ఆక్రమణకు ప్రోత్సాహం ఆలయ భూమికి గురువారం సర్వే చేస్తామని సచివాలయ సర్వేయర్ దేవదాయ శాఖ అధికారులకు నోటీసు ఇచ్చారు. ఈ మేరకు దేవదాయ అధికారులు, శ్రీరామాలయం ట్రస్టీ గురువారం ఉదయం భూమి వద్దకు చేరుకున్నారు. అయితే సర్వేయర్ మాత్రం భూమికి సర్వే చేయడానికి వీలుపడదని, సర్వే చేయాల్సిన భూమి హద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు ఇవ్వలేదని చెప్పడంతో దేవదాయ శాఖ అధికారులు కంగుతిన్నారు. సర్వే ప్రొసీజర్ ప్రకారం హద్దుల్లో ఉన్న వారికి కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉండగా సచివాలయ సర్వేయర్ ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేసి ఆక్రమణకు సహకరించడానికే చూస్తున్నారని శ్రీరామాయలం ట్రస్టీ వీసం వెంకట లలిత ఆరోపించారు. రెవెన్యూ అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అందరికీ నోటీసులు ఇచ్చి భూమికి సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తామని సర్వేయర్ చెప్పారు. దీంతో దేవదాయ శాఖ అధికారులు చేసేదేమీలేక అక్కడ్నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఆలయ భూమి ఆక్రమణను అడ్డుకోవడానికి యత్నిస్తున్న దేవదాయశాఖ అధికారులకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహాయ నిరాకరణ చేయడం, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సచివాలయ ఉద్యోగుల మెడపై బదిలీ కత్తి
●ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగుల సంఖ్య 3,464 ●బదిలీ షెడ్యూల్.. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు సాక్షి, అనకాపల్లి: సచివాలయాల్లో ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని బదిలీ చేయాలన్న నిబంధనను కూటమి నేతలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఉద్యోగుల మెడపై బదిలీ కత్తి వేలాడదీసి వారిని లొంగదీసుకునేందుకు ఆయుధంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే పైనుంచి అనధికార ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. స్థానిక కూటమి నేతలు ఔనన్న వారిని, ఎమ్మెల్యే రికమండేషన్ ఉన్న వారిని కోరిన చోట నియమించాలని చెప్పడంతో పలువురు సచివాలయ ఉద్యోగులు నాయకుల చుట్టూ ప్ర దక్షిణలు మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన సచివాలయ ఉద్యోగులంటే గుర్రుమీదున్న కూటమి నేతలు బదిలీ అవకాశాన్ని కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. సొంత మండలాల్లో పనిచేయకూడదన్న నిబంధన అందులో భాగ మేనంటున్నారు. బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఆఫ్లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఐదేళ్లు పూర్తయితే బదిలీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఐదేళ్లపాటు పనిచేసిన ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు 2020 అక్టోబరులో కొందరు, నవంబరులో మరికొందరు విధుల్లో చేరారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తి చేస్తేనే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో చేరిన ఉద్యోగులకు మూడేళ్లు మా త్రమే పూర్తి కావడంతో వారి బదిలీకి అవకాశం లే దు. మ్యూచువల్, రిక్వెస్ట్, స్పౌజ్, అనారోగ్య స మ స్యలు ఉన్న వారు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు గ్రేడ్లుగా విభజన.. సచివాలయాలను మూడు గ్రేడ్లుగా విభజించారు. 2,500 లోపు జనాభా ఉంటే ‘ఏ’ గ్రేడ్గా పరిగణిస్తారు. ఆ సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులే ఉండాలి. జనాభా 2,500–3,500 మధ్య ఉంటే ‘బి’ గ్రేడ్గా గుర్తిస్తారు, 7 లేదా 8 మంది ఉద్యోగులు ఉండాలి. ఇక 3,500కు పైగా జనాభా ఉన్న సచివాలయాలను సీ–గ్రేడ్గా పరిగణిస్తారు. ఈ సచివాలయంలో 8 మంది ఉద్యోగులు ఉండాలని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో 522 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. వివిధ విభాగాల్లో 3,824 మంది విధులు నిర్వహిస్తున్నారు. 465 సచివాలయాల్లో పనిచేస్తున్న ఐదేళ్లు దాటిన వారిని ప్రస్తుతం బదిలీ చేస్తున్నారు. వీటిలో ఏ గ్రేడ్ సచివాలయాలు 119, బీ–గ్రేడ్–165, సీ–గ్రేడ్– 181 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే 3464 మంది ఉద్యోగులకు బదిలీ కౌన్సెలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే అనుకూల పోస్టింగ్ స్థానిక నేతలకు అంగీకారమైతేనే అక్కడ నియామకం సచివాలయాల్లో ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ -
జగన్నాథ రథయాత్రకు గట్టి బందోబస్తు
అనకాపల్లి : ప్రశాంతమైన వాతావరణంలో జగన్నాథస్వామి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందకు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ శ్రావణి అన్నారు. స్థానిక గవరపాలెం అగ్రిమర్రిచెట్టు వద్ద కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి దేవస్థానంలో తొలి రథయాత్ర ఏర్పాట్లను గురువారం ఆమె పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ పరిశీలించి, కమిటీ సభ్యులతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం జగన్నాథస్వామి రథోత్సవం గవరపాలెం నుంచి రైల్వే స్టేషన్గూడ్స్ రోడ్డు ఇంద్రజ్యుమ్నహాలు వరకూ జరుగుతుందని, స్వామివారు అక్కడ నవరాత్రులు భక్తులకు వివిధ రూపాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని డీఎస్పీ చెప్పారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ కార్య నిర్వహణ అధికారి బి మురళీ, కమిటీ సభ్యులు బుద్ధ ఆదిలక్ష్మి, యల్లబిల్లి ధనలక్ష్మి, కాండ్రేగుల మహాలక్ష్మి, పేకేటి తులసి, భుగాతా కోటేశ్వరరావు, యండపల్లి చంద్రశేఖర్, మంగళపల్లి వి.వి. సుబ్రహ్మణ్యం, బొడ్డేడ వెంకట చలపతిరావు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణి గవరపాలెంలోని ఆలయం వద్ద ఏర్పాట్ల పరిశీలన -
లంకెలపాలెం జంక్షన్లో ప్రమాదాలు నివారించండి
● ఎస్పీ తుహిన్ సిన్హాకు ఐక్య వేదిక సభ్యుల వినతి అనకాపల్లి టౌన్: లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా రాజకీయ ఐక్యవేదిక సభ్యులు కోరారు. స్థానిక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాజువాక నుంచి అనకాపల్లి వచ్చేటప్పుడు ఇక్కడ జంక్షన్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అటువైపుగా వచ్చే వాహనాలకు వేగ నియంత్రణ లేదని, అక్కడ సిగ్నల్స్ దూరం నుంచి సరిగా కనిపించడం లేదని వివరించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్య వేదిక సభ్యులు కనిశెట్టి సురేష్ బాబు, గాడి బాలు, సూదికొండ మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
చీటీల పేరుతో మోసం
● కె.కోటపాడు పోలీసులకు బాధితుల ఫిర్యాదు ● చౌడువాడలో ఘటనకె.కోటపాడు : చీటీల పేరుతో సుమారు రూ.4 కోట్ల మేర మోసం చేసిన ఘటన మండలంలోని చౌడువాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి పెదిరెడ్డి పద్మజతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వద్ద తాము మోసపోయామంటూ బాధితులు గురువారం కె.కోటపాడు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ ధనుంజయ్తో బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌడువాడ గ్రామానికి చెందిన పెదిరెడ్ల పద్మజ 2016 నుంచి చీటీలు నిర్వహిస్తోంది. ఆమె వద్ద చౌడువాడతో పాటు గరుగుబిల్లికి చెందిన సుమారు 200 మంది లక్షల్లో చీటీలు కట్టారు. చీటీలు పాడుకున్న వారిలో కొంత మందికి చెల్లింపులు జరపగా, మరికొందరు వడ్డీ డబ్బులకు ఆశపడి ఆమె వద్దనే చీటీ డబ్బులు ఉంచేవారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి పద్మజతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు కనిపించడం లేదు. దీంతో చీటీలు కట్టిన 200 మంది మోసపోయామంటూ కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. -
డిష్యుం..డిష్యుం..
● జేవీపాలెంలో జనసేన గ్రామాధ్యక్షుడిపై టీడీపీ సూపర్ సర్పంచ్ దాడి ● ఇంటింటి కుళాయి పనుల వద్ద వివాదం ● మహిళలపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేత ● గణపర్తి పాల సంఘ అధ్యక్ష ఎన్నికలో టీడీపీ–బీజేపీ వైరం కూటమి నేతల గణపర్తిలో టీడీపీ–బీజేపీ మధ్య తారస్థాయిలో విభేదాలు మునగపాక: కూటమి కూర్పు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. పై స్థాయిలో కూటమి పెద్దలంతా ఒక్కటిగా కలిసి ఉన్నామంటూ చెప్పుకుంటున్నా కింద స్థాయిలో మాత్రం మూడు పార్టీల మధ్య రోజురోజుకు అగాధం పెరుగుతూనే వస్తోంది. తాజాగా మండలంలోని గణపర్తి పాల సంఘం అధ్యక్ష ఎన్నికకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం రాత్రి టీడీపీ–బీజేపీ శ్రేణులు డిష్యూం, డిష్యూంకు దిగాయి. దీనిలో భాగంగా పాల సంఘం అధ్యక్షునిగా టీడీపీ నుంచి మాజీ సర్పంచ్ రామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు త్రినాథ్ నిలబడేందుకు ముందుకొచ్చారు. పది సంవత్సరాలుగా అధ్యక్షునిగా త్రినాథ్ కొనసాగడంతో ఈసారి అతను తప్పుకోవాలంటూ టీడీపీ నేత రామనాగేశ్వరరావు వర్గీయులు కోరారు. ఇందుకు త్రినాథ్ వర్గీయులు తమకు విశాఖ డెయిరీ పెద్దల సహకారం ఉందని, ఈ విషయమై ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకునే స్థాయికి వివాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చలు జరిగినా ఫలితం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఈ వివాదానికి సంబంధించి ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లడంతో కూటమిలో కుమ్ములాట చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద కూటమిలో కుంపటి రాజేసుకుందనడంలో సందేహం లేదు. ఏడాది పాలనలోనే కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పై స్థాయిలో కూటమి పెద్దలంతా ఒక్కటేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. కింద స్థాయిలో మాత్రం వివాదాలు రాజుకుంటున్నాయి. పరస్పర దాడులకు సైతం దిగేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఎస్.రాయవరం మండలం జేవీపాలెంలో ఇంటింటి కుళాయి విషయమై జనసేన గ్రామాధ్యక్షుడిపైనా మహిళలపైనా టీడీపీ సూపర్ సర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మునగపాక మండలం గణపర్తి పాల సంఘం అధ్యక్ష ఎన్నికలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వైరం తారస్థాయికి చేరి కొట్లాటకు దిగారు. -
మత్తు వదలి.. ముందుకు కదిలి..
డ్రగ్స్ రహిత సమాజం కోసం అనకాపల్లిలో వాకథాన్ అనకాపల్లి: మాదక ద్రవ్యాలను అరికట్టాలని, ప్రజల్లో చైతన్యం తేవాలని అనకాపల్లిలో గురువారం భారీ స్థాయిలో వాకథాన్ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీని కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా ఎకై ్సజ్ సహాయ కమిషనర్ సూర్జిత్ సింగ్ ప్రారంభించారు. విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ క్రీడామైదానానికి చేరుకొని ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసే ఉద్దేశంతో విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని, వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికిపోతున్నారని చెప్పారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం అరికట్టేందుకు 5 స్టాటిక్ చెక్పోస్టులు, 38 డైనమిక్ చెక్పాయింట్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలతో నిఘా ముమ్మరం చేశామన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలాజీ, ఆర్డీవో షేక్ ఆయిషా, డీఎస్పీ శ్రావణి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి సుజాత, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, సీఐలు టి.వి.విజయకుమార్, ఎం.వెంకటనారాయణ, గఫూర్, చంద్రశేఖర్, బాల సూర్యారావు, లక్ష్మి, అశోక్ కుమార్, అల్లు స్వామినాయుడు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కాలేజీ, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా స్వామి
నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యదర్శిగా నర్సీపట్నానికి చెందిన సిహెచ్.బి.ఎల్.స్వామి ఎన్నికయ్యారు. గురువారం ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహా సభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై న సీనియర్ జర్నలిస్టు స్వామి 30 సంవత్సరాల నుంచి పాత్రికేయ రంగంలో ఉన్నారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో పనిచేసిన స్వామి జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పలుసార్లు సేవలందించారు. జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర యూనియన్ కార్యదర్శి పదవికి ఈ ప్రాంతం నుంచి మొదటిసారిగా ఎన్నికై న స్వామికి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. -
మృత్యువుతో పోరాడి ఓడారు
● లంకెలపాలెం లారీ బీభత్సం ● ఐదుకు చేరిన మృతుల సంఖ్య పరవాడ/రావికమతం: లంకెలపాలెం కూడలిలో మార్కెట్ లారీ సృష్టించిన బీభత్సంలో విషాదం కొనసాగుతోంది. ఈ నెల 23న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వేర్వేరు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. మృతులను కంటైనర్ డ్రైవర్ రేఖ అప్పలరాజు(విజయరాంపుర అగ్రహారం, రాంబిల్లి మండలం), వాహనచోదకుడు సాలాపు రాంకుమార్ (కొత్తకోట, రావికమతం మండలం)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అప్పలరాజు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో, రాంకుమార్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, ప్రమాదం జరిగిన రోజే అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చెంనాయుడు, రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, అగనంపూడి వాసి ఎర్రప్పడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొంత మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. -
గప్చుప్గా ప్రజాభిప్రాయ సేకరణ
● అనుమతులు లేకపోయినా దర్జాగా కొండ తవ్వకాలు ● ఇప్పటికే మూడు కిలోమీటర్ల మేర అక్రమంగా రోడ్డు నిర్మాణం ● ఫిర్యాదులు చేసినా పట్టించుకోని తహసీల్దార్ అనకాపల్లి టౌన్: నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఓ కొండ తవ్వకాలతో పాటు రోడ్డు నిర్మాణంపై ఫిర్యాదుల మేరకు అధికారులు గుట్టుచప్పుడుగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీస సమాచారం లేకుండా తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి నివేదిక తయారు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బవులవాడ పంచాయతీ రావు గోపాలరావు కాలనీలో సర్వే నంబర్లు 70, 74, 75లలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొండను తవ్వి సమీపంలో ఉన్న క్వారీలకు లారీలు వెళ్లేందుకు వీలుగా దర్జాగా రోడ్డును నిర్మించారు. దీంతో కొంత మంది గ్రామస్తులు ఈ విషయంపై కలెక్టర్, తహసీల్దార్కు ఫిర్యాదులు చేశారు. అయినా మూడు కిలోమీటర్ల మేర అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగించారు. పలు ఫిర్యాదుల మేరకు ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం రోడ్డు పనులను తహసీల్దార్ రూరల్ ఎస్ఐల సహాయంతో ఆపించారు. అప్పటి నుంచి ఎలాగైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని భావించిన మైనింగ్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేసింది. అందుకు అధికారుల సహకారం తీసుకున్నారు. దీంతో ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా గప్చుప్గా తహసీల్దార్ విజయ్కుమార్, మైన్స్ ఏజీ కె.పురుషోత్తమ నాయుడు, రూరల్ ఎస్ఐ రవికుమార్, తదితర అధికారులతో కాలనీలోని రామాలయంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వాస్తవానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటే గ్రామంలో దండోరా వేయాలి. పత్రికా ప్రకటనలు ఇవ్వాలి. బహిరంగ ప్రదేశంలోనే సమావేశం నిర్వహించాలి. కానీ ఇవేమీ పాటించకుండానే తూతూ మంత్రంగా కానిచ్చేశారు. ఈ సమావేశంలో పలువురు ఈ రోడ్డు నిర్మాణం వల్ల బండరాళ్ళు తమ ఇళ్లపై పడిపోతాయని, జరగరానిది ఏమైనా జరిగితే ఏవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మరికొంత మంది గ్రామంలో అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు. అయితే ప్రలోభాలకు గురైన కొంత మంది అమాయకులు ఈ రోడ్డు ఏర్పాటుతో తమకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ క్రమంలో ఒకానొక దశలో గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉపాధి ఎర చూపి.. రావు గోపాలరావు కాలనీలో ప్రజలంతా రెక్కాడితే గానీ డొక్కాడని వారు. అత్యధికులు దినసరి కార్మికులు, పేదలు. చిన్నపాటి ప్రలోభాలకు లొంగిపోతారని తెలుసుకున్న మైన్స్ మాఫియా బాబులు కొంత మందికి రూ.1500 చొప్పున పంపిణీ చేసి, ప్రజాభిప్రాయ సేకరణలో తమకు అనుకూలంగా మాట్లాడేలా చేసుకున్నారు. గ్రామ స్థాయి నాయకులకు అడిగినంత ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయడానికి మీకే అధికారాలు ఉన్నాయని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ విజయకుమార్ను సంప్రదించగా.. కాలనీలో 25 మంది అభిప్రాయాలు సేకరించామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తామని చెప్పారు. కొండపై అనధికారికంగా రోడ్డు కోసం తవ్వితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీసులను కోరినట్టు వివరించారు. -
రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు
దేవరాపల్లి: దేవరాపల్లి–ఆనందపురం ఆర్అండ్బీ రోడ్డులో కాశీపురం–సంజీవమెట్ట గ్రామాల మధ్య బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మహిళ పరిస్థితి విషయంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన సుగుణ అనే మహిళ తన కుమార్తే హాఫ్ శారీ ఫంక్షన్కు బంధువులను ఆహ్వానించడం కోసం ద్విచక్ర వాహనంపై వచ్చి దేవరాపల్లి నుంచి ఇంటికి వెళ్తున్నారు. దేవరాపల్లికి చెందిన వసంతకుమార్, నారాయణరావుతో పాటు మరో యువకుడు ద్విచక్ర వాహనంపై ఆనందపురం నుంచి వస్తున్నారు. సంజీవమెట్ట సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు బలంగా ఢీకొట్టాయి. ఈప్రమాదంలో సుగుణ తలపై బలమైన గాయంతో పాటు రెండు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మిగతా ఇద్దరు యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్సీకి తరలించగా.. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించినట్లు సీహెచ్సీ వైద్యాధికారి సురేంద్ర బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని దేవరాపల్లి ఎస్ఐ టి.మల్లేశ్వరరావు పరిశీలించి, ప్రమాదం జరిగిన ప్రాంతం వేపాడ మండల పరిధిలోకి వస్తుంద ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్ట్
కశింకోట: మండలంలోని కొత్త అచ్చెర్ల గ్రామంలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం.శ్రావణి విలేకరులకు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. కొత్త అచ్చెర్ల గ్రామంలో ఈ నెల 16న తన ఇంటి వద్ద నిమ్మదల ధనలక్ష్మి గడ్డి కోస్తోంది. పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన శీలం కార్తీక్(24) బైక్తో ఆమె వద్దకు వచ్చి ఆగాడు. రాజాం గ్రామానికి దారెటు అని మాటలు కలిపాడు. బైకును ఆన్లోనే ఉంచాడు. ధనలక్ష్మి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును గుర్తించాడు. వెంటనే వాటిని తెంచుకుని పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అల్లు స్వామినాయుడు పర్యవేక్షణలో ఎస్ఐలు కె.లక్ష్మణరావు, పి.మనోజ్కుమార్, కానిస్టేబుళ్లు డి.మహేష్, గోపీ, శ్రీనివాస్, మూర్తిలతో కూడిన బృందం నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీలు, నిఘా సమాచారంతో ఎట్టకేలకు నిందితుడ్ని గుర్తించారు. దొంగిలించిన బంగారు పుస్తలతాడును విక్రయించేందుకు బయ్యవరం వద్ద విశాఖకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేసి, చోరీ సొత్తును, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రైవేటు ఉద్యోగం మానేసి బెట్టింగ్ వ్యసనంతో అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో నగదు కోసం చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావు, మనోజ్కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
కోతలు.. సాంకేతిక తిప్పలు
తరగపువలస: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న తీరుకు పొంతన లేకుండా పోయింది. ‘తల్లికి వందనం’పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15,000 చొప్పున ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిబంధనల పేరుతో లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. మాట నిలబెట్టుకోకపోగా.. సాంకేతిక లోపాల పేరుతో అర్హులకు సైతం అన్యాయం చేస్తూ తల్లుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ‘ఎవ్వరికీ ఎగ్గొట్టం’అన్నారు.. ఇప్పుడేమో.? ‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం’అని ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘నిబంధనల సాకుతో ఎవరికీ ఎగ్గొట్టం’అంటూ నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన తల్లులకు ఇప్పుడు ఎదురవుతున్నవి కోతలు, కష్టాలే. తొలి ఏడాది గుండు సున్నా.! అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం మాట మార్చింది. తొలి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టేసింది. ఎట్టకేలకు ఈ ఏడాది తల్లికి వందనం అమలు చేయగా.. అనేక నిబంధనలు విధించి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హామీ ఇచ్చిన పూర్తి మొత్తం అందకపోవడం, సాంకేతిక సమస్యలతో అర్హుల జాబితా నుంచి పేర్లు గల్లంతవ్వడం వంటి ఘటనలతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ సిత్రాలు ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోతలతో జమ జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటోవార్డు సంతపేటలో తెలుగు రామలక్ష్మి, మద్దిల చిట్టితల్లి, అడివరపు పుష్పలత అనే మహిళల ఖాతాలకు రూ.13 వేలకు బదులుగా రూ.10,900 వంతున జమ అయ్యాయి. ఒక్కొక్కరికి రూ.2,100 కోత విధించడంపై బాధితులు ప్రశ్నిస్తే.. ‘ఎంత పడితే అంతే’అంటూ సచివాలయ సిబ్బంది, బ్యాంకర్లు సమాధానమిస్తున్నారు. ఇచ్చిన హామీకి, జమ అవుతున్న మొత్తానికి పొంతన లేకపోవడంపై తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానంతో అనర్హత సంతపేటకు చెందిన బోని ఈశ్వర్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రేష్ట 2వ తరగతి, సాత్విక 5వ తరగతి చదువుతున్నారు. ఆయన ఆధార్ నంబర్కు అదనంగా వేర్వేరు ఇంటి పేర్లు కలిగిన అయిదుగురు ఈశ్వర్ పేర్లు లింక్ అయ్యాయి.. దీంతో ఆయన విద్యుత్ వాడకం నెలకు 150 యూనిట్లు దాటకపోయినా, రికార్డుల్లో 900 యూనిట్లుగా చూపిస్తోంది. ఈ సాంకేతిక తప్పిదం కారణంగా ఆయన పిల్లలకు పథకం అందలేదు. వారం రోజులుగా ఈయన విద్యుత్ కార్యాలయం, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా డీలింక్ కావడం లేదు. అలాగే, ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ గుమ్మడివానిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాము, అతని భార్య లక్ష్మి ఆధార్ నంబర్లకు ఏపీఈపీడీసీఎల్కు బదులు చిత్తూరు జిల్లా పరిధిలోని ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించిన బిల్లులు అనుసంధానం అయిపోయాయి. దీంతో విద్యుత్ బిల్లు రూ.2 వేలు దాటిందని చూపి, ఇంటర్ చదువుతున్న కుమారుడికి పథకం వర్తించలేదు. దీంతో బాధితులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒకవైపు సాంకేతిక లోపాలను సరిదిద్దడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంటే.. మరోవైపు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నాటి మాటలకు, నేటి చేతలకు పొంతన లేదని, ‘తల్లికి వందనం’పథకం తల్లులకు ఆనందం బదులు ఆవేదననే మిగులుస్తోందని బాధితులు వాపోతున్నారు. ‘తల్లికి వందనం’లో సిత్రాలివీ.. -
హైడ్రో పవర్ ప్లాంట్కు అనుమతులను తక్షణమే రద్దు చేయాలి
● మారిక, చింతలపూడి మధ్య హైడ్రోప్రాజెక్టు నిర్మిస్తే‘ రైవాడ’కు ముప్పు ● ఆయకట్టు రైతులు పోరాటానికిసిద్ధం కావాలి ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్నదేవరాపల్లి: అనంతగిరి మండలం పెదకోట, దేవరాపల్లి మండలంలోని చింతలపూడి, మారిక గ్రామాల మధ్య హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అల్లూరి జిల్లా పెదకోట ఏరియాలో 1800 మెగావాట్స్, దేవరాపల్లి మండలం చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్య 900 మెగా వాట్స్ సామర్థ్యంతో లూప్ పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీలను, ఇతర పేద ప్రజలను వారి ఆవాసాల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమని చెప్పారు. చింతలపూడి, మారిక గ్రామాలను ఖాళీ చేసేందుకు అదాని ప్రతినిధులు పూనుకోవడం అన్యాయమన్నారు. వేపాడ మండలం మారిక, దేవరాపల్లి మండలం చింతలపూడిలో శారదానదిపై ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో రైవాడ జలాశయం ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు సైతం తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. 1/70 చట్టాన్ని, ఐదవ షెడ్యూల్ వర్తించే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోకుంటే రైవాడ ఆయకట్టు భూములు బీడులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారిక, చింతలపూడి గ్రామాలను ఖాళీ చేయించే పనులను అదాని గ్రూపు సంస్థల ప్రతినిధులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మారిక గ్రామ ప్రజలు సామాజిక ఆర్థిక సర్వేను అడ్డుకున్నారని, వీరి స్ఫూర్తితో రైవాడ ఆయకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. -
ఐఐఎస్ఈఆర్లో సాయి అనీష్కు 434వ ర్యాంకు
పాయకరావుపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) బుధవారం ప్రకటించిన ఫలితాలలో శ్రీప్రకాష్ విద్యార్థి జి.సాయిఅనీష్ జాతీయ స్థాయిలో 434వ ర్యాంకు సాధించాడు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, జేఈఈతో పాటుగా అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుండడంతో ఇటువంటి ఫలితాలు సాధ్యమవుతున్నాయని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్.భానుమూర్తి తెలిపారు. ప్రతిభ కనబరిచిన సాయిఅనీష్ను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మునగపాక: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడని ఆశ పడిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. కశింకోట మండలం జోగారావుపేటకు చెందిన ప్రగడ రాజు,లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు చిరంజీవి(27) తన అమ్మమ్మ గ్రామమైన నారాయుడుపాలెంలో చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు. చిరంజీవి స్థానికంగా సీలింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తన స్నేహితుడు కేశెట్టి ధర్మరాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై నారాయుడుపాలెం నుంచి అనకాపల్లి వైపునకు వెళ్తుండగా తోటా–మూలపేట ఆర్చి సమీపంలో అనకాపల్లి నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనక కూర్చొన్న చిరంజీవి తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. బైక్ నడుపుతున్న ధర్మరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరితో సరదాగా ఉండే చిరంజీవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అటు జోగారావుపేట ఇటు నారాయుడుపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
హిందూ మతవ్యాప్తికి ఐక్యంగా పనిచేయాలి
మాడుగుల రూరల్: గ్రామాల్లో అన్యమత వ్యాప్తి వల్ల హిందూమతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని వీహెచ్పీ భజరంగదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రావాడ రాజశేఖర్ పేర్కొన్నారు. కె.జె.పురం జంక్షన్లో గల కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రాపేట రామకొండలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజు రాత్రి వీహెచ్పీ గ్రామ కమిటీ సభ్యులు గ్రామాల్లో సామూహిక హారతి ఇవ్వాలని సూచించారు. మండల కమిటీలు ప్రతి నెలలో సత్సంగాలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ యువకులు మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిస కాకుండా సత్ప్రవర్తన, సద్భావనతో మెలగాలని కోరారు. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్, సమరతాసేవా ఫౌండేషన్ వంటి సంస్థలు హిందూ మత ఉద్ధరణకు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రాపేట రామకొండలరావు మాట్లాడుతూ మండలంలో 56 గ్రామ కమిటీలు ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో మండల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు కరణం దేముళ్లు, మండల సత్సంగ్ ప్రముఖ్ పాచిల అప్పారావు, మండల లీగల్ సెల్ కన్వీనర్ పేర్ని శంకర్, దుర్గావాహిని ప్రముఖ్ కరణం వెంకటలక్ష్మి, మండల వీహెచ్పీ ఉపాధ్యక్షుడు అప్పాన ప్రసాదు, కోశాధికారి పరిమి కాసుల జగ్గారావు, పీలా శ్రీనివాసరావు, ఆళ్ల వెంకట గంగాధర్ జగన్నాథరావు, జామి చిన్న , పలువురు వీహెచ్పీ గ్రామ కమిటీ సభ్యులు, సత్సంగ్ సభ్యులు పాల్గొన్నారు. వీహెచ్పీ, భజరంగదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ -
‘నషా ముక్త్ భారత్’లో భాగస్వాములు కండి
తుమ్మపాల: యువత గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి దురాచారాలకు బానిసలు కాకుండా వారిలో చైతన్యం కలిగించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ కార్యక్రమంపై ఆమె ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా అధికారులతో కలిసి ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని గురువారం సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమన్ని ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేలా రూపొందించాలన్నారు. ర్యాలీలో యువత, మహిళలు, విద్యార్థులు, గ్రామ, వార్డు సచివాలయల సిబ్బంది మరియు ఆశా, అంగన్వాడీ వర్కర్లు ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. నేటి తరానికి, రేపటి భవిష్యత్ పౌరులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజం అందించాలంటే, ఈ విధమైన చైతన్య ర్యాలీలు కీలకమన్నారు. జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలసి ర్యాలీలో పాల్గొని ‘నషా ముక్త భారత్ అభియాన్’ లక్ష్యాన్ని సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓలు షేక్ అయిషా, వి.వి.రమణ, డీఎస్పీలు, సీఐలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఫార్మా గ్యాస్ లీక్ ఘటనపై విచారణ ఏదీ..?
● జాతీయ మానవహక్కుల సంఘం సీరియస్ ● సుమోటోగా విచారణకు స్వీకరించిన వైనం ● ఈ నెల 11న ఎస్ఎస్ ఫార్మాలో గ్యాస్ లీకై ఇద్దరు దుర్మరణం ● మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగాత్రుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ● రెండు వారాల్లో నివేదిక పంపాలని సీఎస్కు, అనకాపల్లి ఎస్పీకి నోటీసులు సాక్షి, అనకాపల్లి: ఫార్మా కంపెనీ ప్రమాదంపై స్పందించే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అలసత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీ యాంశమయింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో గల ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 11న గ్యాస్ లీకై న ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన విష యం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సు మోటోగా కేసును స్వీకరించింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఏపీ సీఎస్కు, అనకాపల్లి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు అందించిన నష్ట పరిహారం, క్షతగాత్రుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటన జరిగి రెండు వారాలు అయినా జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు విచారణ కమిటీ వేయలేదంటూ ప్రశ్నించింది. ఈ ఘటనలో మానవ తప్పిదం ఉందని.. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఆదేశించింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని ఆదేశించింది. అంతేకాకుండా నష్టపరిహారం, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నతాధికారులెవరూ పర్యవేక్షించలేదు.. ఫార్మా కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో గల ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో ఇంత ప్రమాదం జరిగినా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఇద్దరూ కనీసం సందర్శించలేదని, క్షతగాత్రుడికి వైద్యం అందుతుందో లేదో కూడా పర్యవేక్షించలేదంటూ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఫార్మా కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిపై ప్రభుత్వ అధికారులు చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని సీఐటీయూ నాయకులు మండిపడుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే.. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో మూడో అంతస్తులో కామన్ ఎప్లియింట్ ట్రీట్మెంట్ ప్లాంటులో ఏర్పాటు చేసిన సాల్వెంట్ ట్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న షిప్ట్ సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ శరగడం కుమార్, హెల్పర్ బన్సాలి నాయుడులు సాల్వెంట్ ట్యాంకు లెవిల్స్ను పరిశీలిస్తున్న సమయంలో ట్యాంకు నుంచి భారీ ఎత్తున విష రసాయనాలు లీకయ్యాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న చంద్రశేఖర్, కుమార్లు విష వాయువును పీల్చడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న హెల్పర్ బైసాల్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. -
త్వరితగతిన పైప్లైన్ పనులు పూర్తి చేయాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం అనకాపల్లి: అనకాపల్లి జోన్లో చేపట్టిన ప్రధాన నీటి సరఫరా పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందిచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మండలంలో తుమ్మపాలలో జీవీఎంసీ నీటిసరఫరా హెడ్ వాటర్ పంప్హౌస్ను, కొత్త పైప్లైన్ పనుల మ్యాప్ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ప్రధాన పైపులైన్ పనులు ఈ ఏడా ది సెప్టెంబర్ నాటికి పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.నీటి సరఫరా సమయంలో నీటి నాణ్యతలో టర్పిడిటీ స్థాయిలను క్రమం తప్పకుండా ఉద్యోగులు పరిశీలించాలన్నారు. జీవీఎంసీ నీటిసరఫరా పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్.రవి, జోనల్ సిబ్బంది పాల్గొన్నారు. గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం ఆరిలోవ (విశాఖ): విశాఖ, అనకాపల్లి జిల్లా ల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి సంబంధించి శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆయా గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 589 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష సమయంలో మరికొందరు విద్యార్థులు దర ఖాస్తులతో చేరుకోవడంతో.. గురుకులం ప్రిన్సిపాల్ రత్నవల్లి వారికి కూడా అవకాశం కల్పించారు. -
వైజాగ్ టు చైనా
అక్రమంగా రేషన్ బియ్యం రవాణాసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాష్ట్రంలోని రేషన్ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో రైస్ వైన్గా పిలిచే సంప్రదాయ మద్యపానీయం హువాంగ్జియు తయారీలో విరివిగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడి డిమాండ్కు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖలోని పలు షిప్పింగ్ కంపెనీలు రేషన్ బియ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాయి. రేషన్ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పలు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్టీ)ల్లో ఈ నెల 23, 24 తేదీల్లో దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ వద్ద 150 మెట్రిక్ టన్నుల బియ్యం, గేటు వే ఈస్ట్ ఇండియా సీఎఫ్టీలో 156 మెట్రిక్ టన్నులు, పంచవటి టోల్గేట్ వద్ద 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారమంతా ప్రధానంగా టీడీపీకి చెందిన కార్గో వ్యాపారే నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి. పట్టుకున్నవి రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మొదటి దఫా ల్యాబ్ నివేదికల్లో రేషన్ బియ్యం కాదంటూ నివేదిక రాగా.. రెండో నివేదిక కూడా అదేవిధంగా వచ్చేలా వివిధ రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. రెండో శాంపిల్పై వచ్చే ల్యాబ్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అంతా అమ్యామ్యాలే...! కొన్నాళ్ల క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం నానా హంగామా చేసింది. దీంతో సాధారణ బియ్యం ఎగుమతి కూడా అక్కడి నుంచి చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది విశాఖ నుంచి ఎగుమతులకు తమ మకాం మార్చారు. రేషన్ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది. తాజాగా రేషన్ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలోని రేషన్ మిల్లులతో పాటు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రేషన్ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మలుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను కస్టమ్ హౌస్ బ్రోకరేజీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనంతరం కస్టమ్స్ నుంచి అనుమతులు పొందుతున్నాయి. తరువాత రేషన్ మిల్లుల నుంచి తీసుకొచ్చి విశాఖలో ఉన్న పలు కంటైనర్ టెర్మినల్ ఫ్రైట్ స్టేషన్ల (సీఎఫ్టీ)లో నిల్వ ఉంచి.. కంటైనర్ల ద్వారా ఎగుమతులు చేపడుతున్నారు. టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయాల్సిన అధికారులు.. కూడా ఈ రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు. ఒక్క కంటైనర్ లోడ్ చేస్తే అధికారులకు రూ.50 వేల చొప్పున చెల్లింపులు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రమేమింటే గత ఏడాది డిసెంబర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు నిర్వహించిన గేట్ వే వద్ద ఈ రేషన్ బియ్యం పట్టుబడటం గమనార్హం. రైస్ వైన్లో బియ్యాన్ని వినియోగిస్తున్న చైనా అక్కడి డిమాండ్ను సొమ్ముచేసుకుంటున్న మాఫియా రేషన్ షాపుల ఏర్పాటుతో చెలరేగిపోతున్న ముఠా తాజా దాడుల్లో 473 టన్నుల బియ్యం పట్టివేత కీలక సూత్రధారి టీడీపీ కార్గో వ్యాపారే..! రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ నివేదికలు? చైనా డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకే...! వాస్తవానికి చైనాలో సంప్రదాయ రైస్ వైన్కు డిమాండ్ ఉంది. చైనీస్ రైస్ వైన్ అని కూడా పిలువబడే హువాంగ్జియును ప్రధానంగా చైనాలోని జియాంగ్నాన్ ప్రాంతంలో ఉడికించిన బియ్యాన్ని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనికి ఉండే ప్రత్యేకమైన రుచితో పాటు తక్కువ ఆల్కహాల్ (8 నుంచి 20) శాతం, మంచి పోషక విలువలు ఉండటంతో చైనీయులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి. దీనికి 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో ఉండే ఈ రైస్ వైన్ డిమాండ్కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి బియ్యాన్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడి డిమాండ్ ఇక్కడి రేషన్ బియ్యం మాఫియాకు కలిసివస్తోంది. ఇక్కడి నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడంలో టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ల్యాబ్ నివేదిక పేరుతో...! పట్టుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్కు పంపించామని.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు మొదటి దాడుల్లో పట్టుకున్న 150 మెట్రిక్ టన్నుల బియ్యంలో పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా.. రేషన్ బియ్యం కాదని నివేదిక వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన బియ్యం నమూనాల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ నివేదికలు కూడా రేషన్ బియ్యం కాదని వస్తాయా? అవునని వస్తాయా అనేది చూడాల్సి ఉంది. దాడుల్లో పట్టుకున్న బియ్యం అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం అని స్పష్టంగా ప్రకటనల్లో పేర్కొన్న అధికారులు.. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా, నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం విశేషం. -
సింగపూర్ ప్రయాణికులకు శుభవార్త
విశాఖ సిటీ: విశాఖ నుంచి సింగపూర్ విమాన ప్రయాణికులకు శుభవార్త. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో స్కూట్ విమానయాన సంస్థ సింగపూర్ ఫ్లైట్ను అప్గ్రేడ్ చేసింది. దీంతో సీట్ల సామర్థ్యం పెరిగింది. ఇప్పటి వరకు 180 సీట్లతో ఏ320సీఈఓ విమాన సర్వీసు అందుబాటులో ఉంది. దీని స్థానంలో బుధవారం నుంచి ఏ321ఎన్ఈఓ విమానాన్ని విశాఖ ఎయిర్పోర్టు నుంచి సింగపూర్కు నడుపుతోంది. ఇందులో 236 సీట్లు ఉన్నాయి. ఫలితంగా విశాఖ–సింగపూర్ విమాన సర్వీస్లో మరో 56 మంది అధికంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది. -
సంపద సృష్టి
నక్కపల్లి: ప్రకృతిసిద్ధంగా లభిస్తున్న ఖనిజ సంపదను లూటీ చేస్తూ టీడీపీ నేతలు లక్షలు ఆర్జిస్తున్నారు. హోం మంత్రి ఇలాకా.. పాయకరావుపేట నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రావెల్, ఇసుక, మట్టిని దోచుకుంటున్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా గ్రావెల్, మట్టి తవ్వితే సహించేది లేదని.. వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఒకపక్క హెచ్చరికలు చేస్తున్నా దోపిడీ దర్జాగా సాగుతోంది. ఆమె అనుచరులే ఈ ఖనిజ సంపదను ఇష్టానుసారం సొంతం చేసుకుంటున్నారు. దీన్ని బట్టి మంత్రి హెచ్చరికలకు అర్థాలు వేరులే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హోం మంత్రి హెచ్చరించినప్పటికీ యథేచ్ఛగా జరుగుతున్న ఖనిజ దోపిడీని అరికట్టడంలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. మంత్రికి తెలియకుండానే టీడీపీ నాయకులు ఇంత ధైర్యం చేస్తారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.200 కోట్ల విలువైన ఖనిజ సంపద లూటీ ఎస్.రాయవరం మండలంలో శంకర్రావు అనే టీడీపీ సీనియర్ నేత వేమగిరిలో గ్రావెల్ను ఇష్టానుసారం తవ్వేసి సమీపంలో ఉన్న కంపెనీలకు, సీసీ రోడ్లు, భవనాలు నిర్మించే వారికి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నక్కపల్లి మండలంలో చందనాడ, ఎన్.నర్సాపురం, అమలాపురం, బోయపాడు గ్రామాల్లో ఏపీఐఐసీ వారు సేకరించిన భూములు, కొండల్లో నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వేసి సంబంధిత కాంట్రాక్టర్లకు పక్కనే ఉన్న ఔషధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఏడాది పాలనలో సుమారు రూ.200 కోట్లు విలువైన ఖనిజ సంపదను కూటమి నాయకులు లూటీ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మండలాల్లో దోపిడీ చేసిన ఖనిజ సంపదను స్థానికంగానే కాకుండా రాంబిల్లి, యలమంచిలి పాయకరావుపేట, తుని ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇంతదారుణంగా ఖనిజ సంపద దోపిడీ జరుగుతున్నా హోం మంత్రి ఆదేశాలు మాత్రం ఎక్కడా అమలు కావడంలేదు. బహిరంగంగానే ఆమె ఈ హెచ్చరికలు చేస్తున్నా టీడీపీ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆమె చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని, సీరియస్గా చేశారా, లేదా ప్రచారం కోసం చేశారా అన్నది మంత్రికే తెలియాలని పలువురు అంటున్నారు. గ్రావెల్, మట్టితోపాటు, తీరప్రాంతాల్లో సముద్రపు ఇసుకను సైతం ఇదే విధంగా తరలిస్తున్నారు. పరస్పర ఫిర్యాదులు.. అధికారులకు తలనొప్పులు పాయకరావుపేట మండలంలో శ్రీరాంపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఖనిజ దోపిడీ గురించి టీడీపీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం. ఇద్దరు మండల టీడీపీ నాయకుల మధ్య పదవుల విషయంలో వచ్చిన అసంతృప్తుల కారణంగానే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే తప్ప పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వాహనాలను పట్టుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రమేనంటూ పలువురు వాపోతున్నారు. తాజాగా ఆరు రోజుల క్రితం టీడీపీకి చెందిన సర్పంచ్ ఒకరు 100 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పాయకరావుపేట మండలంలో నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడులు నిర్వహించి రెండు ఎక్సవేటర్లు, ఏడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలా పట్టుకున్న వాహనాలను విడిచిపెట్టాలని టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకుడొకరు పోలీసులపై ఒత్తిడి చేశారు. పట్టించేది వాళ్లే, వదిలేయాలని ఒత్తిడి చేయాలనేది టీడీపీ వాళ్లే కావడంతో ఏం చేయాలో దిక్కుతోచక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇరు వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక మనకెందుకులే అంటూ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. హోం మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా దోపిడీ ఖనిజ సంపద టీడీపీ నేతల ఖాతాలోకి గద్దల్లా వాలిపోతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, కోటవురట్ల మండలాల్లో గ్రావెల్ మట్టి తవ్వకాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొండలు, చెరువులు కనిపిస్తే చాలు కూటమి నాయకులు, గ్రావెల్ మాఫియా పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారు. రేయింబవళ్లు ఎక్సవేటర్లు, పొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. ఉచితంగా లభిస్తున్న ఈ గ్రావెల్ను లారీ ఒక్కంటికి రూ.5 వేలకు, ట్రాక్టర్ రూ.2 వేలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గడచిన పది రోజుల నుంచి పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో పాయకరాని చెరువు, లక్ష్మీపతిరాజు చెరువులో రాత్రి పూట వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేసి సమీపంలో ఉన్న ఇటుక బట్టీలకు, నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇళ్లకు అమ్ముకుంటున్నారు. ఎస్.నర్సాపురం, పెద్దిపాలెం, పెంటకోట, గునిపూడి, బంగారయ్యపేట సమీపంలో ఉన్న కొండల్లో ఉన్న గ్రావెల్ను తవ్వేసి అమ్మేస్తున్నారు. మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే.. తన నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వితే సహించబోనన్న హోం మంత్రి అనిత యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోని వైనం చివరకు టీడీపీలో ఇరు వర్గాల విభేదాలతో ఖనిజ దోపిడీపై ఫిర్యాదులు అయినా చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న అధికారులు -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఏలేరు కాలువకు శాపం
● లీకేజీ ద్వారా కాలువలో తగ్గిన నీటి ప్రవాహం ● పూడికలు, మరమ్మతులపై నిర్లక్ష్యం నాతవరం: ఏలేరు కాలువలో పూడికతీత, మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో లీకేజీ ద్వారా నీరంతా వృధాగా పోతుంది. విశాఖపట్నం స్టీల్ప్లాంటుకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి కాలువద్వారా నీటిని తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 154 కిలో మీటర్ల పొడవునా ఏలేరు కాలువ ఉంది. ఈ కాలువ ద్వారా విశాఖపట్నం ప్రజలకు తాగునీరు ఎన్టీపీసీ, గంగవరం పోర్టు, ఏపీఐఐసీ తదితర పరిశ్రమలకు నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి నీటి అసవరాలను బట్టి 250 నుంచి 300 క్యూసెక్కులు నీటిని తరలిస్తుంటారు. ఏలేరు కాలువలో ప్రతి ఏటా వేసవిలో పూడిక తీసి కాలువకు మరమ్మతులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈఏడాది వేసవిలో ఏలేరు కాలువలో పూడికతీత పనులతో పాటు మరమ్మతు పనులు చేపట్టలేదు. ఏలేరు కాలువలో ఎక్కడ చూసినా పూడిక పెరిగిపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. తుపానులు, వర్షాల సమయంలో నీటి ఉధృతికి అనేక చోట్ల కాలువ గట్టు కోతకు గురై గండిపడేలా దర్శనమిస్తున్నాయి. గం డి పడేలా దర్శన మిస్తున్నాయి. నాతవరం మండలంలో 12 పంచాయతీల పరిధిలో సుమారుగా 25కిలో మీటర్ల మేర ఏలేరు కాలువ ప్రవహిస్తుంది. జిల్లేడుపూడి వద్ద ఏలేరు కాలువకు సొరంగం మార్గం 3 కిలోమీటర్లు మేర ఏర్పాటు చేశారు. ఎ.శరభవరం, లింగంపేట, మన్యపురట్ల, ఉప్పరగూడెం, గునుపూడి, రాజుపేట అగ్రహారం , పీకేగూడెం, నాయుడుపాలెం, చినగొలుగొండపేట, పి.జగ్గంపేట, ఎం.బి.పట్నం గ్రామాల వద్ద ఏలేరు కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పూడికతో పాటు ఏలేరు కాలువ శిథిలం కావడంతో నిత్యం లీకేజీ ద్వారా నీరంతా వృధాగా పోతుంది. ఎ.శఽరభవరం వద్ద పంటపొలాల్లో ఏలేరు కాలువలో లీకేజీ నీరు ప్రవాహం చూస్తే ఆయకట్టు భూములకు నీరు విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. కాలువలో పూడిక తీసి బలహీనంగా ఉన్న ఏలేరు గట్లు పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై ఏలేరు కాలువ జేఈ గోపీనాథ్ మాట్లాడుతూ పూడికతీత మరమ్మతులు చేసేందుకు రూ.60 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం మండలం వేములపూడి దగ్గర ఏలేరు కాలువలో పూడికతీత పనులు చేస్తున్నామన్నారు. నీరు వృథాగా పోకుండా ఏలేరు కాలువలో నీటి ప్రవాహం తగ్గిస్తామన్నారు. -
సెజ్ పరిశ్రమలకు సమ్మె నోటీసులు
అచ్యుతాపురం రూరల్: దేశవ్యాప్త కార్మిక సమ్మెలో పరిశ్రమల కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని యాజమాన్యాలకు మంగళవారం సిటు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తున్నాయన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఆర్ సత్తిబాబు, సన్యాసిరావు పాల్గొన్నారు. -
రహదారిపై మద్యం వాహనం బోల్తా
అచ్యుతాపురం రూరల్: అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వస్తున్న మద్యం వాహనం మంగళవారం కొండకర్ల కూడలి సమీపంలో రోడ్డు అడ్డంగా బోల్తా పడింది. ఆవును తప్పించడంలో అదుపుతప్పి వాహనం బోల్తాపడినట్టు సంఘటన స్థలంలో ఉన్న వారు తెలిపారు. బీరు బాటిల్లు, మద్యం సీసాలు కిందపడి పగిలిపోయాయి. ఎంత నష్టం కలిగింది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. రహదారి చిన్నది కావడంతో మితిమీరిన వేగం, అదుపుచేయలేక పోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇష్టారాజ్యంగా వాహనాలు మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాలకు గురౌతున్నారని ప్రజలంటున్నారు. -
ఈ ఏడాది 60 మంది ముందుకు..
పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి మొక్కుకునేవారు ఈ వేషాలు వేయడానికి ముందుకు వస్తారు. అభినయం అక్కరలేకపోయినప్పటికీ కేవలం వేషం ద్వారా గ్రామస్తులు, బంధువులను మెప్పిస్తుంటారు. వేసిన పౌరాణిక పాత్రలో ఒదిగిపోతారు. కళాకారులు ఎక్కువైతే పలువురు ఒకే పాత్రలో అలరిస్తుంటారు. ఈ ఏడాది ముచ్చర్ల ఉత్సవ కమిటీ ఈ నేలవేషాలకు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తుంది. ఎండ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు ప్రవేశించినా గత వైభవానికి తగ్గకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన అనుపోత్సవంలో 60 మంది వరకు నేలవేషగాళ్లు అలరించారు. వీరిని చూడటానికే చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ముచ్చర్ల తరలివచ్చారు. -
లంకెలపాలెం ఘటనలో గాయపడిన కొత్తకోట యువకులు
రావికమతం: లంకెలపాలెం కూడలి వద్ద సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో రావికమతం మండలం కొత్తకోటకు చెందిన ఇద్దరు యువకులు సాలాపు రామ్కుమార్(రాంకీ), (27), తురాల శేషు(26) తీవ్రంగా గాయపడ్డారు. రామ్కుమార్, శేషు ఇద్దరూ నర్సీపట్నం శ్రీరామ్ చిట్స్లో కొంత కాలంగా పనిచేస్తున్నారు. ఇరువురు వాయిదాలు రికవరీ చేయడానికి బైక్పై విశాఖపట్నం వెళ్లి తిరిగి రాత్రి కొత్తకోట వస్తుండగా, లంకెలపాలెం కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగారు. ఆ సమయంలో వెనుక వైపు గాజువాక నుంచి వేగంగా వస్తున్న లారీ సిగ్నల్ వద్ద ఆగకుండా ముందువున్న వాహనాలను తొక్కుకుంటూ దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. బైక్పై ఆగివున్న రామ్కుమార్, శేషులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్కుమార్ కుడి కాలు, నడుముకు, శేషు తలకు, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. రామ్కుమార్ని కేజీహెచ్కు, శేషును మెడికవర్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ అక్కడే వైద్యం పొందుతున్నారు. -
సరదాతో పాటు మొక్కు
పురాణ పురుషుల వేషాలు ధరించడం వెనుక మొక్కు, సరదా, ఆనందం దాగి ఉంది. పూర్వం నుంచి మా గ్రామంలో వస్తున్న ఆనవాయితీ. –షిణగం అప్పలస్వామి, ముని వేషధారి మా గ్రామానికే పరిమితం మా గ్రామంలో తప్ప ఇంకా ఎక్కడా ఈ వేషాలు కట్టం. కొందరు మాత్రం బయట గ్రామాలకు వెళ్తుంటారు. మేకప్, అలంకరణ ఖర్చులు భరిస్తుంటారు. – షిణగం అప్పలరాజు, చిత్రగుప్తుడు వేషధారి -
మిత్రుడిని పరామర్శించిన కాసేపటికే..
లంకెలపాలెం ప్రమాదంలో కన్నుమూసిన అనకాపల్లి వాసులు అనకాపల్లి టౌన్: స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నీకేమీ పర్వాలేదు, మేమున్నామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రెవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం పరితపించారు. అంతలో తామే అనంతలోకాలకి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి లంకెలపాలెంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలివి.. అనకాపల్లి మళ్ళవీధికి చెందిన బండారు రమణ విశాఖపట్నం కేజీహెచ్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. అతనిని పరామర్శించడానికి మిత్రులు కర్రి అప్పాజీ, పచ్చికూర గాంధీ, కొణతాల నాయుడు కారులో వెళ్లి రమణకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో షీలానగర్ జంక్షన్లో వైన్ షాపులో పనిచేస్తున్న మరో స్నేహితుడు కొణతాల అచ్చియ్యనాయుడిని కారులో ఎక్కించుకొన్నారు. లంకెలపాలెం జంక్షన్లో సిగ్నల్ పడడంతో వీరి వాహనం ఆగింది. ఇంతలో వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొనడంతో వీరి కారు, సమీపంలో ఉన్న ద్విచక్రవాహనాలు, కంటెయినర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కొణతాల అచ్చియ్యనాయుడు, పచ్చికూర గాంధీ చనిపోగా కర్రి అప్పాజీ ప్రాణాపాయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అగనంపూడికి చెందిన ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. తలలో నాలుకలా ఉండే గాంధీ అందరికీ తలలో నాలుకలా ఉండే గాంధీ చనిపోయాడనే వార్తతో రేబాక గ్రామం ఉలిక్కిపడింది. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఉమ్మడి కుటుంబానికి తనే పెద్ద దిక్కు కావడంతో గాంధీ లేని లోటు తీర్చలేనిదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గాంధీకి భార్య, కూతురు, కొడుకు ఉండగా కూతురికి ఇటీవలే పెళ్లి చేశారు. మంగళవారం మధ్యాహ్నం వందలాదిమందితో గాంధీ అంతిమ యాత్ర జరిగింది. కొణతాల అచ్చియ్యనాయుడుకు వైన్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు. -
పునరావాస సమస్యలను పరిష్కరించాలి
అనకాపల్లి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్షలాది మంది గిరిజన, గిరిజనేతర ప్రజలు నిర్వాసితులయ్యారని,దశాబ్ద కాలంగా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూ ఉన్నప్పటికీ నిర్వాసితుల సమస్యలు నేటికీ పరిష్కరించలేదని రాష్ట్ర రైతు కూలీసంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రైతుకూలీల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పట్ల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నాయని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు, కొండమొదలు పంచాయతీ ప్రజలతో చేసుకున్న ఎంఓఈలు అమలు చేయకపోవడం, నేటికీ అనేక పునరావాస సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని, మారుతున్న ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టు నిర్మాణం చుట్టూనే దృష్టి పెడుతున్నాయి తప్ప, నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి గొర్లి రాజు, కమిటీ సభ్యులు అయితిరెడ్డి అప్పలనాయుడు, లగిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కిశోరి వికాసంతో బాలికల బంగారు భవితకు పునాది
నర్సీపట్నం: కిషోరి వికాసం కార్య క్రమం ద్వారా బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి పేర్కొన్నారు. నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి మున్సిపాలిటీలోని నాలుగు అంగన్వాడీ కేంద్రాలను పీడీ, సీడీపీవో జి.వి.రమణితో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 11 నుంచి 18 ఏళ్లు బాలికల విద్య, వైద్యం, మంచి ఆహారం అందించడమే కిషోర వికాసం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 154 వరకు బాల్య వివాహాలను నిలుపుదల చేశామన్నారు. డ్రాపౌట్స్ తిరిగి చదువుకొనేలా ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 1981 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాల్లో గర్భిణులు 8337, బాలింతలు 7059, ఆరు నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 43,231, మూడేళ్ల నుండి ఆరేళ్ల పిల్లలు 36433 మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో 4858 మంది పిల్లలను చేర్పించామన్నారు. అంగన్వాడీల్లో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నయిజ్డ్) ప్రక్రియ జిల్లాలో 89 శాతం పూర్త అయిందన్నారు. ప్రభుత్వం అనాథ పిల్లల కోసం మిషన్ వాత్సల్యం పేరుతో నెలకు రూ.4 వేలు ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. పోక్సో కేసు బాధితులకు ఐసీడీఎస్ ద్వారా రూ.2 లక్షల వరకు సహాయం అందిస్తామన్నారు. -
బదిలీ ఉపాధ్యాయుల జీతాల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల జీతాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. జిల్లా ఖజానా అధికారి వి.ఎల్.సుభాషిణికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లతో కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారని, పాత స్థానంలో పనిచేసిన కాలానికి నాన్–డ్రాయల్ తీసుకుని, కొత్త ప్లేస్లోనే జీతం బిల్లులు తయారు చేసుకునేందుకు ఎస్టీవోలకు తగిన సూచనలు చేయాలని ఆయన కోరారు. డీఈవో/సీఎస్ఈ శాంక్షన్ చేసిన క్యాడర్ స్ట్రెంత్ వివరాలను జిల్లాలోని ఎస్టీవోలకు సర్క్యులేట్ చేయాలని ఆయన కోరారు. -
టీడీపీ నేత ఘరానా మోసం
● చిట్టీలు, రుణాల పేరుతో రూ.4.26 కోట్లకు కుచ్చుటోపీ ● కుటుంబంతో సహా గ్రామం నుంచి పరార్ ● లబోదిబోమంటున్న బాధితులు యలమంచిలి రూరల్: చిట్టీలు, వడ్డీ ఆశ చూపి భారీగా రుణాలు తీసుకుని ఒక టీడీపీ నాయకుడు సుమారు రూ.4.26 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. నమ్మకమే పెట్టుబడిగా సుమారు 250 మందికి టోకరా వేసిన ఈ సంఘటన యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లిలో చోటు చేసుకుంది. బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలివి.. తెరువుపల్లి గ్రామానికి చెందిన దాడిశెట్టి పైడియ్య అలియాస్ నానాజీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గ్రామంలో విశాఖ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో వేతన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. పాడి రైతులతో ఉన్న సత్సంబంధాలను ఆసరాగా చేసుకుని, పలువురితో ఆర్థిక లావాదేవీలు నెరిపాడు. పైడిమాంబ చిట్ ఫండ్స్ పేరుతో రూ.లక్ష, రూ.2 లక్షల మొత్తాలకు పదికి పైగా చిట్టీల గ్రూపులు అనధికారికంగా నిర్వహిస్తున్నాడు. పాలకేంద్రానికి పాలు అందజేసే సభ్య రైతులకు చెల్లించాల్సిన వేతనాలను అప్పుగా తీసుకుని, ఆ మొత్తాలకు వచ్చే వడ్డీ సొమ్ముతో చిట్టీలు కట్టుకోవచ్చని ఆశ చూపాడు. అక్కడితో ఆగకుండా వందల మంది నుంచి రూ.3 కోట్ల వరకు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకున్న మొత్తాలకు సరిపడా మొత్తాన్ని క్రమం తప్పకుండా అడిగిన వెంటనే ఇవ్వడం, చిట్టీలను బాగా నిర్వహించడంతో గ్రామస్థులంతా దాడిశెట్టి పైడియ్యను బాగా నమ్మారు. ఇలా గత 15 ఏళ్లుగా గ్రామంలో 50 శాతానికి పైగా ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడు. మరో వందమందికి పైగా చిట్టీలు వేశారు. పిల్లల వివాహాలు, చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం పైడియ్యకు అప్పుగా ఇచ్చి పొదుపు చేస్తున్నామని భావించారు. కొందరు తమ బంగారు ఆభరణాలను వివిధ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద తాకట్టు పెట్టి మరీ పైడియ్యకు ముట్టజెప్పారు. చివరకు కొద్ది రోజులుగా వడ్డీ సక్రమంగా ఇవ్వకపోవడం, చిట్టీల డబ్బు, అప్పుగా తీసుకున్న సొమ్మును చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు డబ్బు ఇవ్వాలని పైడియ్యపై వత్తిడి తెచ్చారు. అప్పుగా తీసుకున్న మొత్తాలకు కొందరికి ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోట్లు ఇచ్చినట్టు తెలిసింది. తన మోసం బయటపడిందని తెలుసుకున్న టీడీపీ నాయకుడు పైడియ్య ముందుగా కుటుంబ సభ్యులను పంపించేశాడు. తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా గ్రామం నుంచి ఇటీవల సైలెంట్గా పరారయ్యాడు. తమను టీడీపీ నేత పైడియ్య మోసగించాడని తెలుసుకున్న బాధితులు రెండ్రోజులుగా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలియడంతో పోలీసులు కూడా దీనిపై ఆశ్చర్యపోతున్నారు. బాధితులు ఎవరు, వారికి ఎంత మొత్తంలో మోసం జరిగిందో వివరాలు సేకరిస్తున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు బాధితులకు చెప్పారు. ఈ వ్యవహారంపై యలమంచిలి రూరల్ ఎస్సై ఎం.ఉపేంద్రను సంప్రదించగా బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్నారు. చిట్టీల ద్వారా 115 మంది బాధితులు రూ.కోటికి పైగా డబ్బు నష్టపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. పైడియ్యకు చిట్టీలు కట్టాను మా గ్రామానికి చెందిన దాడిశెట్టి పైడియ్య వద్ద రూ.లక్ష చొప్పున రెండు చిట్టీలు కడుతున్నాను. మరొక రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాను. కొన్ని రోజుల నుంచి పైడియ్య కనిపించడంలేదు. ఆందోళనగా వుంది. అతనిని నమ్మి నా కష్టార్జితమంతా ఇచ్చాను. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చాను. –బండి పెంటారావు, తెరువుపల్లి రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చా నా జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సర్వస్వం పైడియ్యకే ఇచ్చేశాను. రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాను. రూ.లక్ష చిట్టీ నెల నెలా చెల్లిస్తున్నాను. నేను,నా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఇప్పుడు పైడియ్య కనిపించడంలేదు. ఫోన్ చేస్తే స్పందించడంలేదు. నాకు దిక్కుతోచడంలేదు. –బండి సూరిబాబు, తెరువుపల్లి -
మహిళా భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
నేను ఎప్పటికప్పుడు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తుంటాను. ఇక్కడ ధారలో స్నానాలు చేసిన అనంతరం దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు లేక ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మహిళలకు మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు. దూరాభారం నుండి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పన లేకపోవడంతో చెప్పుకోలేని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. –గుడివాడ లక్ష్మి, శివ భక్తురాలు, కశింకోట గ్రామం -
విత్తనాల పంపిణీలో రాజకీయం
వడ్డాదిలో వేర్వేరుగా అందించిన టీడీపీ నేతలు బుచ్చెయ్యపేట: రైతులకు వరి విత్తనాల పంపిణీలో కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు. వడ్డాది రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం రైతులకు సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ చేపట్టారు. ముందుగా గ్రామానికి చెందిన రాష్ట హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, టీడీపీ ముఖ్య నాయకులు దొండా నరేష్, సయ్యపురెడ్డి మాధవరావు, ఇంటి అప్పారావు, తలారి శంకర్, కనక, మేడివాడ రమణ, ముత్యాల సూరిబాబులతో కలిసి వరి విత్తనాలు పంపిణీ చేశారు. తరవాత ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు వర్గీయులు మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దొండా సన్యాసిరావు, కూటమి నేతలు దొండా గిరిబాబు, కోరుకొండ సూరి అప్పారావు, సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, దొండా నానాజీ, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, సింగంపల్లి రమేష్లతో కలిసి వరి విత్తనాలు పంపిణీ చేశారు. కూటమి నేతల వర్గ విభేదాల కారణంగా విత్తనాల కోసం వచ్చిన రైతులతో పాటు సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి ఇతర అధికారులు ఇబ్బందులు పడ్డారు. -
ఎవరికీ పట్టని ఆలయ రక్షణ
దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆలయ కట్టడాలు మాత్రం దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. ఆలయ శిల్ప కళానైపుణ్యం కనుమరుగవుతున్నా పట్టించుకునేవారు లేరు. ఆలయ స్తంభాలపై చెక్కిన శిలా శాసనాలపై తెలుపు సున్నం వేయడంతో అవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. ప్రాచీన ఆలయాల అభివృద్ధి పేరుతో శిథిలావస్థకు చేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అభివృద్ధి పేరిట తలపెట్టిన కార్యాచరణ అర్థంతరంగా ఆగిపోవడంతో గ్రావెల్ మట్టి ధార నీటిలో పడి ధార నీరు కలుషితమవుతోంది. ఈ పరిస్థితి భక్తులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. పురావస్తు శాఖ అనుమతితోనే తవ్వకాలు ధార ప్రదేశంలో ప్రహరీ గోడ కూలిపోకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టామని ఆలయ కార్యనిర్వహణాధికారి తేజ తెలిపారు. పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరణ ఇచ్చారు. తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. శిలా శాసనాలపై తెలుపు సున్నం.. శిథిలమైన ప్రాచీన శిల్ప కళ -
పీజీఈ సెట్లో సత్తా చాటారు
మునగపాక: ఏపీపీజీఈ సెట్ (ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025)లో జిల్లా విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. మునగపాకకు చెందిన సాయి మౌనిక జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో 5వ ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు పెంటకోట శ్రీనివాసరావు, మహలక్ష్మమ్మ దంపతులు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మౌనిక కష్టపడి చదివి ఎంటెక్ ప్రవేశపరీక్షలో సత్తా చాటింది. ఆమె ఏయూలో జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో నాలుగేళ్లపాటు బీటెక్ చదువుకుంది. పీజీఈసెట్లో 73 మార్కులతో 5వ ర్యాంక్ను సొంతం చేసుకుంది. నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలన్నదే తన ఆశయమని చెప్పింది. దేవరాపల్లి మండలం నుంచి ఇద్దరు.. దేవరాపల్లి: ఏపీపీజీఈ సెట్లో మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. దేవరాపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన సబ్బవరపు సాయి ఈశ్వర్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 65 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి రాజాబాబు ప్రైవేటు వైద్యం చేస్తుండగా, తల్లి గృహిణి. సాయి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థానంలో స్థిరపడటమే తన ఆశయమన్నాడు. వేచలం గ్రామానికి చెందిన బొడబొళ్ల నీరజ మెటలర్జీ విభాగంలో 66 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి అకుంనాయుడు మృతి చెందగా తల్లి కుమారి వ్యవసాయం చేస్తూ ఇద్దరు కుమార్తెలకు ఉన్నత చదువులు చెప్పిస్తోంది. పెద్ద కుమార్తె దివ్య హైదరాబాద్లో మార్కెటింగ్లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమార్తె నీరజ బీటెక్ పూర్తి చేసి ఏపీపీజీఈ సెట్ రాసింది. 7వ ర్యాంక్ సాధించిన నీరజ మాట్లాడుతూ ప్రభుత్వ కొలువు సాధించి తమ కోసం అహర్నిశలు కష్టపడుతున్న తల్లికి తోడుగా నిలవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. -
శివ.. శివా..
అచ్యుతాపురం రూరల్: రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీలోని ఓ మారుమూల గ్రామమైన ధారపాలెం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రముఖమైనది. చారిత్రక ప్రాధాన్యమున్న పంచదార్ల శివాలయంలో రాతి కట్టడాలను పరిరక్షించేందుకు ఈ క్షేత్రాన్ని పురావస్తు శాఖకు అప్పగించారు. అయితే నాటి శిల్ప సంపదను గానీ, ఆలయ పవిత్రతను గానీ కాపాడే చర్యలేవీ కానరాక ఈ ఆలయం రోజురోజుకూ కునారిల్లిపోతోంది. అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. సరైన మౌలిక సదుపాయాలు లేక భక్తుల అవస్థలు వర్ణనాతీతం. పంచదార్లలో పుణ్య స్నానం ఆచరించాక మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కూడా సరైన గదుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో పుణ్యక్షేత్రం పరిసరాలు మల విసర్జనలతో అపవిత్రమవుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల సమీపంలో మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. -
మారుమూల ప్రాంతాలకు వెళ్లమని ఒత్తిడి
రెండో రోజు కొనసాగిన ఎంటీఎస్ టీచర్ల నిరసన బీచ్రోడ్డు (విశాఖ): దూర ప్రాంతాలకు, రవాణా సౌకర్యం లేని మారుమూల పాఠశాలలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తోందని 1998, 2008 ఎంటీఎస్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండో రోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. మారుమూల పాఠశాలలను ఎంచుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తమలో చాలా మంది 55 ఏళ్లు పైబడిన వారని, 70 శాతం మంది మహిళలే ఉన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాలకు పంపి పని చేయమనడం బాధాకరమని వాపోయారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 32,000 వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ.. మారుమూల ప్రాంతాల్లో పనిచేయడం తమ శక్తికి మించిన భారం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆర్.సి.నంబర్ 39 ఉత్తర్వుల ప్రకారం తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని లేదా మైదాన ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండవ ఉపాధ్యాయునిగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద విశాఖ పరిస్థితి ప్రత్యేకమైనదని, తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
అరగంటలో దొరికిన సెల్ ఫోన్
కశింకోట: పోయిన అర్థ గంట వ్యవధిలోనే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కనుగొని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం.. స్థానిక కస్పావీధికి చెందిన విశారపు నాగరాజు పనికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతూ మార్గంమధ్యలో మంగళవారం సాయంత్రం సెల్ఫోన్ పోగొట్టుకున్నారు. ఇది సుమారు రూ.20 వేల ఖరీదు కలిగిన ఒప్పొ సెల్ఫోన్. భార్య సరోజినితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ పోయిన విషయాన్ని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లోని ఐటీ కోర్ విభాగానికి సమాచారం అందించారు. అక్కడి సిబ్బంది సమన్వయం చేసుకొని టవర్ లొకేషన్ ఆధారంగా ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బందితో వెళ్లి సెల్ఫోన్ను స్థానిక రౌతు వీధి ప్రాంతంలో నాలుగైదు ఇళ్లు పరిశీలించిన మీదట పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని బాధితులకు అప్పగించామని సీఐ తెలిపారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాకంపై కలెక్టర్కు ఫిర్యాదు
నర్సీపట్నం: పట్టణంలో రామారావుపేట పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణ వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని సామాజిక కార్యకర్త కె.శివనారాయణరాజు కలెక్టర్ విజయ కృష్ణన్కు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విద్యార్థులను కాలేజీలు, పాఠశాలల వద్ద దించి, రోడ్లపైనే బస్సులు, ఆటోలు, వ్యాన్లు నిలిపివేయటం వల్ల ప్రజలు రాకపోకలు సాగించేందుకు నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. విద్యాసంస్థల నిర్వాకం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లేదని శివనారాయణరాజు కలెక్టర్కు నివేదించారు. -
ధ్వజస్తంభంపై లేని శ్రద్ధ.. తవ్వకాలపై ఎందుకో?
పంచదార్ల క్షేత్రానికి ప్రధాన ఆలయమైన శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురున ధ్వజ స్తంభంపైన ఉండే శిఖరభాగం ఎప్పుడో హుద్హుద్ సమయంలో కూలిపోయింది. ధ్వజస్తంభం పూర్తిగా పాడైపోయినా నేటికీ పునఃప్రతిష్ట జరగలేదు. కానీ అభివృద్ధి పేరుతో వారికి నచ్చిన చోట జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ప్రాచీన శిల్పసంపదను కాపాడాల్సిన చోట పొక్లెయిన్తో పెకిలించవచ్చా అని ఆలోచించేవారే లేరు. పంచదార్ల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరిగితే స్థానికుల ఒత్తిడి మేరకు అధికారులు నిలిపివేయించినట్లు తెలుస్తోంది. ధార నీరు పూర్తిగా కలుషితమైపోతుంది. వర్షపు నీటికి గుంతల్లో నీరు చేరితే ఆ బురద నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది మంచి నీరుగా తాగేందుకు, వంటలు చేసుకునేందుకు ఉపయోగించలేకపోతున్నారు. ఏవైనా మూగ జీవాలు చూసుకోకుండా తవ్వకాలు చేసిన గోతుల్లో పడినట్లైతే ధార ప్రదేశం పూర్తిగా దుర్గంధభరితమైపోతుంది. పవిత్రమైన ధార అపవిత్రమై భక్తులకు అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. కానీ పట్టించుకునే వారెవరు? -
ఉద్రిక్తత నడుమ ‘ఎంటీఎస్’ కౌన్సెలింగ్
ఆరిలోవ (విశాఖ): మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు మంగళవారం ఆందోళనల నడుమ కౌన్సెలింగ్ జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియ చేపడుతున్నారని, తమను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కౌన్సెలింగ్కు ఎవరూ హాజరు కావద్దని ఎంటీఎస్ ఉపాధ్యాయులు మరోసారి డీఈవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన జరుగుతుండగానే 1998, 2008 డీఎస్సీ బ్యాచ్లకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ‘మేం కౌన్సెలింగ్కు హాజరవుతాం’అంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మిగిలిన వారు వారిని అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డీఈవో కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడంతో అధికారులు సుమారు 50 మందికి పైగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిన వారు బుధవారం జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఇదిలావుండగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం విశాఖ ఎంపీ శ్రీభరత్, ఇతర ఎమ్మెల్యేలను కలవనున్నట్లు ఎంటీఎస్ ఉపాధ్యాయ యూనియన్ నాయకులు తెలిపారు. -
విద్యుత్ అధికారులూ ఇదేం తీరు...?
నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి విద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి మధ్యలోంచి విద్యుత్ స్తంభాలు వేసి ఇల్లు కట్టుకోకుండా చేసారని, తక్షణమే తొలగించి మాకు న్యాయం చేయాలంటు కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామానికి చెందిన నారపిన్ని తాతారావు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తమకు కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అందులో వారం రోజుల క్రితం తమకు తెలియకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేసారని, విద్యుత్ సిబ్బందిని అడిగితే ఇప్పుడు తొలగించడం కుదరదంటున్నారని, ఇల్లు కట్టుకుందామనుకున్న లోపే ఇలా స్తంభాలు వేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, తక్షణమే విద్యుత్ స్తంభాలు తొలగించాలని కోరారు. -
పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారమేదీ..!
256 దరఖాస్తుల స్వీకరణ సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, పీజీఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమామణి, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాలరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించాలన్నారు. మొత్తం 256 అర్జీలు నమోదు కాగా రెవెన్యూ 125, సర్వే సెటిల్మెంట్ 21, పాఠశాల విద్య 17, పంచాయతీరాజ్ 13, విద్యుత్ శాఖ 12, పోలీస్ 10, మిగిలినవి వివిధ శాఖల్లో నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలాజీ, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావు నాయుడు, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుదీర పాల్గొన్నారు. తుమ్మపాల: ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఇచ్చే అర్జీల పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ వేదిక బయట పలువురు వృద్ధులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ అర్జీలపై పరిష్కారం చూపకుండా పొంతన లేని సమాధానాలతో అధికారులు ముగించేస్తున్నారని, కొన్నింటికి కనీసం అర్జీదారులను కూడా సంప్రదించడం లేదని చెబుతున్నారు. భూవివాదంపై ఫిర్యాదుకు స్పందన లేదు... కోర్టులో ఉన్న భూమికి సోదరులు వారి పేరున ఆన్లైన్ చేసుకుని అన్యాయం చేయడంపై ఈ నెల 2న కలెక్టరేట్లో ఇచ్చిన ఫిర్యాదుకు నేటికీ స్పందన లేదని, అధికారులను అడుగుదామంటే సిబ్బంది అడ్డుకుని బయటకు తరిమేస్తున్నారని ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన కొర్ని అప్పలనర్శ సోమవారం పీజీఆర్ఎస్ వేదిక వద్ద సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులిచ్చిన భూమికి తన పేరున పత్రాలు లేవని, ఎమ్మార్వోకి డబ్బులిచ్చి వారి పేరున నమోదు చేయించుకుని అన్నదమ్ములు భూమిని లాక్కుంటున్నారని ఆమె రోధించింది. తన తల్లి మరణించడంతో తనకీ కష్టాలు వచ్చాయని, తన తల్లి మరణ ధ్రువీకరణ పత్రం కూడా తనకు ఇవ్వకుండా సోదరులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపింది. దీనిపై 20 రోజుల క్రితం కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు అందించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. అధికారులు తన మొర ఆలకించి గ్రామంలో విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. మత్స్యకార రైతులకు న్యాయం చేయాలి విశాఖ, చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సేకరిస్తున్న శ్రీ కనకమహాలక్ష్మి సాగర మత్స్యపారిశ్రామిక సహకార సంఘం భూములకు నష్టపరిహారం మంజూరు చేసి నిరుపేద మత్స్యకార రైతులకు న్యాయం చేయాలని సంఘ రైతులు పీజీఆర్ఎస్లో డీఆర్వోకు విన్నవించారు. 1994లో నక్కపల్లి మండలం వేంపాడులో 44 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతులకు లీజుకిచ్చిందని, వాటినే నమ్ముకుని జీవిస్తున్నామని ఇప్పుడు భూములు సేకరించినప్పటికీ నష్టపరిహారం మంజూరు విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని, సొసైటీ భూములకు కూడా నష్టపరిహారం మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. భుక్తి లేకుండా చేశారు.. 20 ఏళ్లుగా రాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్న తనను అర్ధంతరంగా తొలగించి కూటమి పార్టీ మహిళకు అప్పగించారని, తనకు జీవనాధారం చూపించాలని అనకాపల్లి మండలం శంకరం గ్రామానికి చెందిన కొలుసు లక్ష్మి పీజీఆర్ఎస్లో విన్నవించింది. పాఠశాలలో వంట పనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నానని పేర్కొంది. పాఠశాలకు ఇద్దరు పిల్లలే రావడంతో ఒక రోజు మాత్రమే ఇంటి దగ్గరే వంట చేసి తీసుకొచ్చానని, ఉపాధ్యాయులు హెచ్చరించడంతో తరువాత నుంచి పాఠశాలలోనే వంట చేస్తున్నప్పటికీ తనపై రాజకీయ ముసుగు పులిమి తొలగించారని, తన పని తనకు ఇప్పించి ఆదుకోవాలని ఆమె కోరింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. రాట్నాలపాలేనికి చెందిన కాలాబత్తుల రాజ్కుమార్(56) ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులోని ఓ హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడు. హోటల్లో పని ముగించుకుని ఆదివారం రాత్రి కోటవురట్లకు వస్తుండగా రామచంద్రపురం జంక్షన్ దాటాక పైలట్ ప్రాజెక్టు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతనిని అంబులెన్సులో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. -
క్రైస్తవ వివాహాల లైసెన్స్ జారీ కర్తగా వెంకటరమణ
దేవరాపల్లి: క్రైస్తవ వివాహాల నిర్వహణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు లైసెన్స్ కర్తలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నుంచి దేవరాపల్లిలోని దైవ స్వరూపి చర్చి పాస్టర్ పలివిలి వెంకటరమణ (నతానియేలు)కు క్రైస్తవ వివాహాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. పది సంవత్సరాల పాటు వివాహ లైసెన్స్లు జారీ చేసేందుకు కాల పరిమితి విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, ఏలూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరికీ, గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు పాస్టర్లకు క్రైస్తవ వివాహాల లైసెన్సుల జారీకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
యువతను నట్టేట ముంచిన కూటమి సర్కార్
● ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిఇవ్వకుండా వంచన ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శ దేవరాపల్లి: రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శించారు. తారువలో సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ ఏడాది గడిచినా అమలు చేయకుండా యువతను మోసగించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ‘యువత పోరు’ పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువత తరలిరావడమే ఇందుకు నిదర్శనమన్నారు. 2014 ఎన్నికల్లోను ఇదే మాదిరిగా హామీలిచ్చి చంద్రబాబు యువతను మోసగించారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో వంచించిన కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● బయ్యవరం వద్ద ప్రమాదం ● బస్సు డ్రైవర్తో సహా 8 మందికి గాయాలు కశింకోట: మండలంలో బయ్యవరం వద్ద సోమవారం ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ సహా 8 మంది గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం...నర్సీపట్నం నుంచి విశాఖ వెళుతున్న నర్సీపట్నం డిపో ఆర్టీసీ లగ్జరీ బస్సు బయ్యవరం సరోజిని పరిశ్రమ వద్ద ముందు వెళుతున్న ట్రాలీ లారీని బలంగా ఢీకొట్టింది. ట్రాలీ డైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా ఎడమ వైపునకు మలుపు తిప్పుతుండగా బస్సు వేగంగా వచ్చి ట్రాలీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ కె. కల్యాణ్కుమార్ సహా కొప్పిశెట్టి సత్యనారాయణ, గెడ్డం పద్మ, నమ్మి రాజ్కుమార్, పసుపులేటి ప్రభాకర్, మాకిరెడ్డి రామలక్ష్మి, పి.గంగాధర్, మాకిరెడ్డి నారాయణమూర్తి గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వేరే బస్సులో తమ గమ్యాలకు తరలి వెళ్లారు. ప్రయాణికుడు మాకిరెడ్డి నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాలీ, ఆర్టీసీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఎం. శ్రావణి సందర్శించారు. బస్సు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. క్రేన్ సహాయంతో బస్సును అడ్డు తొలగించి ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్దీకరించారు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్న రోగులను సీఐ పరామర్శించారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. -
సచివాలయ విద్యుత్ కార్మికుల నిరసన
అనకాపల్లి: గ్రామ/వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్మాన్ గ్రేడ్–2 ప్రతిపాదిత బదిలీలు, రేషనలైజేషన్కు ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయడం అన్యాయమని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్యారావు అన్నారు. స్థానిక గవరపాలెం నిదానందొడ్డి విద్యుత్శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ జి.ప్రసాద్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించిన ప్రత్యేకమైన పని విధానం, 24 గంటలు అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో సచివాలయం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ, రీజనల్ అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, కె.మాధవి, కె.నాగ అప్పారావు, జేఎల్ఎం గ్రేడ్–2 నాయకులు అప్పలరాజు, శంకర్, అక్కునాయుడు, గంగాధర్, చంద్రరావు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమస్యలపై కలెక్టర్కి వినతి
అచ్యుతాపురం రూరల్: పూడిమడక మత్స్యకార ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మ శ్రీనివాస్, చేపల శ్రీరాములు విన్నవించారు. సరైన వసతి, మౌలిక సదుపాయాలు కూడా లేని దుస్థితిలో సుమారు 20 వేల పైబడి జనాభా ఉన్న పూడిమడక మత్స్యకారులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురౌతున్నారన్నారు. గత ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలతో పూడిమడక తుపాను బిల్డింగ్లో ఏషియన్ పెయింట్స్ సహకారంతో వైద్య సేవలు అందేవన్నారు. పీహెచ్సీ, హోమియోపతి ఆస్పత్రులు ఉండేవని, కానీ ఇప్పుడు ఆ సేవలు నిలిపివేశారని తెలిపారు. తక్షణమే అధికారులు చర్యలు చేపట్టి పీహెచ్సీ, హోమియోపతి ఆసుపత్రి తెరిపించి ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు కూడా నిలిపివేశారని, వెంటనే హార్బర్ పనులు చేపట్టి మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడాలని కోరారు. -
విద్యార్థులను ఇబ్బంది పెట్టడంలో రికార్డు
యోగాంధ్ర పేరుతో రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టడంలో చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తీసేశారు. ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి..ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా కుయుక్తులకు పాల్పడుతున్నారు. నారాయణ, చైతన్యలాంటి పైవేట్ విద్యాసంస్థలకు లాభం చేకూరేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. పేద విద్యార్థులకు ప్రోత్సాహం కరువైంది. –బొడ్డపాటి హేమంత్కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు -
అర్జీలకు పరిష్కారమేదీ?
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సామాన్యులకు అక్కరకు రావడం లేదు. పీజీఆర్ఎస్లో జిల్లా అధికారులను కలిసి కష్టాలు చెప్పుకోవచ్చన్న వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సిబ్బంది నిర్దయగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్కు వచ్చిన ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన కొర్ని అప్పలనర్శ ఉదంతమే అందుకు ఉదాహరణ. కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమిని తన సోదరులు వారి పేరున ఆన్లైన్ చేసుకొని తనకు అన్యాయం చేశారని ఆమె కలెక్టరేట్లో మూడు వారాల క్రితం ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయమని అడుగుదామంటే సిబ్బంది అడ్డుకుని బయటకు తరిమేస్తున్నారనిఆమె వాపోయింది. 8లో -
కళాకారులు చైతన్య దీపికలు
అనకాపల్లి: ప్రజానాట్య మండలి జిల్లా గౌరవాధ్యక్షునిగా రాజాన దొరబాబు, అధ్యక్షునిగా మర్రి రాజునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మెయిన్రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శిగా గొర్లె దేముడుబాబు, సహాయ కార్యదర్శులుగా కె.వి.రమణ, కొండబాబు, పొంతపల్లి రామారావు, వియ్యపు రాజు, బాబ్జీ, విత్తనాల పోతురాజు ఎన్నికయ్యారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై కమిటీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. జిల్లాలో అద్భుతమైన కళాకారులు ఉన్నారని, సమాజహితం కోసం ప్రజానాట్య మండలి కృషి చేస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ కళాకారులు కళారూపాల ద్వారా ప్రభుత్వ విధానాలపై ప్రజలను జాగృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు జి.గురుబాబు, వైఎన్ భద్రం, కోరుపల్లి శంకరరావు, ఫణీంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు భూ దాహం
● స్టీల్ప్లాంట్ టౌన్షిప్ కోసం కొత్తగా 3,265 ఎకరాల సేకరణ ● నేటి నుంచి నాలుగు గ్రామాల్లో సభల నిర్వహణ నక్కపల్లి: కూటమి సర్కారుకు భూదాహం తీరడం లేదు. పేదల నుంచి భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇప్పటికే 6 వేల ఎకరాలు సేకరించిన ఏపీఐఐసీ తాజాగా మరో 3,265 ఎకరాలపై కన్నేసింది. మంగళవారం నుంచి గ్రామ సభలు నిర్వహించి, ప్రజలను ఒప్పించేందుకు సిద్ధపడుతోంది. ఏపీఐఐసీ ద్వారా 2014లో నక్కపల్లి మండలం నుంచి 4500 ఎకరాలు సేకరించి, అందులో 2 వేల ఎకరాలను బల్క్డ్రగ్ పార్క్ కోసం కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన 2500 ఎకరాలను ఈ ఏడాది తెర మీదకు వచ్చిన ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు కేటాయించింది. బల్క్డ్రగ్ పార్క్ కోసం ఫేజ్ 2లో భాగంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఎకరాకు రూ.37 లక్షలు చెల్లిస్తామంటూ బేరాలాడుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా స్టీల్ప్లాంట్ టౌన్షిప్ కోసం 3265.94 ఎకరాలు సేకరించేందుకు సిద్ధపడుతోంది. నాలుగు గ్రామాల నుంచి సేకరించే యోచన ఏపీఐఐసీ నక్కపల్లి మండలంలోని నాలుగు గ్రామాల నుంచి 3265.94 ఎకరాలు సేకరించాలని యోచిస్తోంది. కాగితలో 225.55 ఎకరాల జిరాయితీ, 81.10 ఎకరాల ప్రభుత్వ భూమి, వేంపాడులో 784.57 ఎకరాల జిరాయితీ, 157.07 ఎకరాల ప్రభుత్వ భూమి, నెల్లిపూడిలో 1337.86 ఎకరాల జిరాయితీ, 242.30 ఎకరాల ప్రభుత్వ భూమి, డీఎల్ పురంలో 392.65 ఎకరాల జిరాయితీ, 44.82 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం 2740 ఎకరాల జిరాయితీ, 525 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా గోప్యంగా ఉంచింది. మంగళవారం నుంచి కొత్తగా భూములు సేకరించే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రామాల్లో సేకరించే భూములకు సంబంధించిన సర్వే నెంబర్లను గుర్తించింది. ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామిడి, జీడి, అరటి, వరి, వంటి పంటలు పండిస్తూ ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ భూములను సేకరించి తమకు అన్యాయం తలపెట్టాలని చూస్తోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు భూములు పంచడానికే ఈ భూసేకరణ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేక నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తారా అనేది స్పష్టం చేయడం లేదు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి సేకరిస్తారో తెలియజేయడం కోసమే మంగళవారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గ్రామసభలు అడ్డుకుంటాం సర్కారుకు భూ దాహం తీరడంలేదు. ఇప్పటికే 6 వేల ఎకరాలు సేకరించారు. మరో 3,265 ఎకరాలు సేకరించేందుకు సిద్ధపడుతున్నారు. నేలతల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు అన్యాయం చేయాలని కూటమి సర్కారు కుట్ర పన్నుతోంది. ఓట్లేసి గెలిపించిన రైతుల కంటే ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ప్రధానమని ప్రభుత్వం భావిస్తోంది, మంగళవారం నుంచి జరిగే గ్రామసభలను అడ్డుకుంటాం. రైతులను చైతన్యపరచి భూములు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి చెప్పిస్తాం. భూములు, నివాస ప్రాంతాలు లాక్కుంటే ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ జీవిస్తారు. గతంలో భూమిలిచ్చిన నిర్వాసితులకే ఇప్పటి వరకు పునరావాసం కల్పించలేదు. సరైన ప్యాకేజీ ఇవ్వలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. ఈ విషయాలను రైతులకు వివరించి భూసేకరణ అడ్డుకుంటాం. –వీసం రామకృష్ణ, వైఎస్సార్సీపీ నేత -
డీఈవోకు ఎంటీఎస్ ఉపాధ్యాయుల వినతి
అనకాపల్లి టౌన్: ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల్లో న్యాయం చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంపాల వెంకటరమణ కోరారు. స్థానిక డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998, 2008 బ్యాచ్లకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల్లో మైదాన ప్రాంతాలలో ఖాళీలను చూపించాలని, వారి వయసు రీత్యా ఏజెన్సీలో పనిచేయడం కష్టతరమన్నారు. ఎస్ఎస్సీ మూల్యాంకన రుసుంను వెంటనే విడుదల చేయాలన్నారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నక్కా శ్రీనుబాబు, ఉపాధ్యక్షుడు ఎం.వి.లోకేష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంటీఎస్ టీచర్స్ ఆగ్రహం
బీచ్రోడ్డు (విశాఖ): మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లు తమకు నివాస స్థలాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కనీస వేతనంపై సేవలు అందిస్తున్న తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సొంత ప్రాంతాలకు దగ్గరలోనే పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొన్న జీవో నంబర్ 39ను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని టీచర్లు ఆరోపించారు. అతి తక్కువ వేతనంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమ పట్ల కూటమి ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. జీవో 39కు విరుద్ధంగా 60–70 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇవ్వడం దారుణమన్నారు. అతి తక్కువ జీతంతో అంతదూరం వెళ్లి పనిచేయలేమని, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో పోస్టింగ్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఎంటీఎస్ టీచర్లు హెచ్చరించారు. -
ఇది కూటమి కుట్ర ప్రభుత్వం
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. వసతి దీవె న, విద్యార్థి దీవెన ఇవ్వలేదు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంతున ఒక్కొక్కరికీ రూ.36 వేలు బాకీ పడ్డారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన బకాయితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నాం. ఈలోగా ఏడాది నిరుద్యోగ భృతి బకాయిలతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. – పుల్లేటి వెంకటేష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
యువ గర్జన
జడివానలోమాట తప్పిన కూటమి సర్కారుపై ‘యువత పోరు’ బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు అనకాపల్లి రింగ్రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీనినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ సాక్షి, అనకాపల్లి: లక్షలాది ఉద్యోగాలన్నారు.. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఎన్నో ఆశలు కల్పించారు.. యువత కలలను కల్లలు చేశారు.. అందుకే కూటమి సర్కారు కుటిల బుద్ధికి నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం సోమవారం చేపట్టిన ‘యువత పోరు’కు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నినాదాల రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు. తొలుత అనకాపల్లి టౌన్లో రింగు రోడ్డు వద్ద గల వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టాలని భావించారు. కానీ పోలీసులు బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడ నుంచి సబ్బవరం హైవేలో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆర్చి వరకు కార్లతో మూడు కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ముందు యువత, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ధర్నా చేశారు. జాబు రాలేదు.. భృతి ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రీవెన్స్లో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణకు వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సారథ్యం వహించగా, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్రాజు, మలసాల భరత్కుమార్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా, పెందుర్తి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు పెదపాటి శేఖర్, తమరాన శ్రీను, నాగ నూకరాజు, జిల్లాలోని 24 మండలాల యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ సాగిన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి, ఇప్పుడు నిలువునా మోసగించారని యువత కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు అందజేస్తామని, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి.. మాట తప్పడంపై నిరసన వెల్లువెత్తింది. నెలకు రూ.3 వేల వంతున ఒక్కో నిరుద్యోగికి రూ.36 వేలు బాకీ పడ్డారు.. జిల్లాలో ఉన్న 2.30 లక్షల నిరుద్యోగులకు రూ.828 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కదం తొక్కిన నిరుద్యోగులు ఉన్న ఉద్యోగాలు పీకేశారు.. ఏడాది కూటమి ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు లేవు సరి కదా.. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య లేదు. కొత్త పరిశ్రమలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతి సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి.. ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి తీరుతాం. యువత, నిరుద్యోగులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. – జాజుల రమేష్, అనకాపల్లి నియోజకవర్గయువజన విభాగం అధ్యక్షుడు -
సమాచార శాఖ డీడీగా సదారావు బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖ రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా కె.సదారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటి వరకు నెల్లూరు డీడీగా సేవలందించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా విశాఖ ఉప సంచాలకులుగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జిగా డీడీగా వ్యవహరించిన డి.రమేశ్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు వి.మణిరామ్ను మురళీనగర్లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సదారావు నియామకం పట్ల సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
మోకాళ్లపై ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
నర్సీపట్నం: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకొని.. మోకాళ్లపై నిలుచొని నిరసన తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో త్వరలోనే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శి కరక మహేష్, ఉపాధ్యక్షుడు యర్రా ప్రకాష్, కోశాధికారి లాలం నాగేంద్ర పాల్గొన్నారు. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ తులసీ దళార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం 108 స్వర్ణ తులసీదళాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి 0అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. -
మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన వ్యక్తి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. పెందుర్తి సాయినగర్కు చెందిన రాపేటి నగేష్(45) ఆరోగ్యం క్షీణించి శనివారం రాత్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్, స్థానిక పెద్దలు శరగడం మధు, పెంటకోట రమణ అక్కడకు వెళ్లి నగేష్ కళ్లు దానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు ఇచ్చినవారు అవుతారని కుటుంబ సభ్యులను ఒప్పించారు. వెంటనే భర్త నేత్రాలు దానం ఇచ్చేందుకు నగేష్ భార్య హిమబిందు అంగీకరిస్తూ సంతకం చేశారు. అక్కడకు చేరుకున్న ఎల్వీ ప్రసాద్ సారథ్యంలోని మోషన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు నగేష్ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ నగేష్ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చూపిన తీరుపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. పెందుర్తిలో మృతి చెందిన వ్యక్తి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు -
పీఆర్ఎస్ఐ కార్యవర్గంలో విశాఖకు కీలక పదవులు
మహారాణిపేట: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) జాతీయ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో విశాఖకు చెందిన ఇద్దరు ప్రముఖులకు స్థానం లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం వివిధ రాష్ట్రాల నుంచి పీఆర్ఎస్ఐ ప్రతినిధులు హాజరై ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అజిత్ పాథక్ ఎన్నిక కాగా, విశాఖకు చెందిన స్వచ్ఛ భారత్ నిపుణుడు, రోటరీ జిల్లా–3020 మాజీ కార్యదర్శి, రోటరీ బ్లడ్ సెంటర్ మాజీ కార్యదర్శి, పీఆర్ఎస్ఐ విశాఖ శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి వరుసగా రెండవసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే కోరమాండల్ సంస్థ మీడియా సలహాదారు, హెచ్.పి.సి.ఎల్. మాజీ అధికారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు యు.ఎస్.శర్మను దక్షిణాది రాష్ట్రాలకు పీఆర్ఎస్ఐ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే 2025–2027 కాలానికి పలువురు కార్యనిర్వాహక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికై న నాయకత్వ బృందం పీఆర్ఎస్ఐ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుందని,, పబ్లిక్ రిలేషన్స్ మెరుగుదలకు, వృత్తిపరమైన అభివృద్ధికి కృషిచేయడానికి, సభ్యుల మధ్య నెట్ వర్కింగ్ను ప్రోత్సహించడం వంటి పనులను కొనసాగించడానికి కృషి చేస్తుందని జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి పేర్కొన్నారు. పీఆర్ఎస్ఐ జాతీయ కార్యవర్గాన్ని విశాఖ శాఖ అధ్యక్షుడు ఎం.కె.వి.ఎల్.నరసింహం, కార్యదర్శి ఎ.గోవిందరావు, కోశాధికారి ఎన్.వి.నరసింహం, ఉపాధ్యక్షుడు, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ (పీఆర్) ఆర్.పి.శర్మ, శంకర ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ కె.బంగారు రాజు, విశాఖ శాఖ పూర్వ అధ్యక్షుడు కె.రామారావు తదితరులు అభినందించారు. -
చివరికి నీరందేనా?
● తప్పులు,డొంకలతో నిండిన రైవాడ కాలువలు ● ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పూడిక తొలగించని అధికారులు ● శివారు ఆయకట్టుకు నీరందని పరిస్థితి ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు దేవరాపల్లి: రైవాడ జలాశయంలో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నా శివారు ఆయకట్టుకు సాగు నీరందని పరిస్థితి దాపురించింది. జలాశయం నుంచి ఆయకట్టుకు నీరందించే పంట కాలువలు పిచ్చి మొక్కలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. జలాశయం కుడి, ఎడమ ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువలు సైతం తుప్పలు, డొంకలు, పూడికతో నిండిపోయాయి. దీంతో ఈ ఏడాది చివరి ఆయకట్టుకు సాగు నీరు ప్రశ్నార్థకంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జలాశయం పరిధిలోని సాగు నీటి కాలువల్లో పూడిక తీత, తుప్పలు తొలగింపు, మరమ్మతులు తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. జలాశయం మట్టి గట్టు పటిష్టతతో పాటు కుడి, ఎడమ హెడ్ స్లూయిస్ అడుగు భాగంలో ఇనుప గేట్ల మరమ్మతులు, కుడి, ఎడమ కాలువల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు రూ. 3 కోట్లు మంజూరయ్యాయి. గ్రావెల్తో జలాశయం గట్టు పటిష్టం చేసే పనులు చేపట్టిన అధికారులు కాలువల్లో తుప్పలు, డొంకలు, పూడికలు తొలగించే పనులు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నారుమడుల తయారీలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఎటువంటి పెట్టుబడి సహాయం అందించక పోయినప్పటికీ అప్పులు చేసి మరీ ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారనుంది. జిల్లాలోనే వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ అన్నపూర్ణగా నిలిచిన రైవాడ జలాశయంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కలంగా నీటి నిల్వలతో కళకళలాడుతున్న రైవాడ జలాశయంపెదనందిపల్లి వద్ద తుప్పలు, డొంకలతో నిండిపోయిన రైవాడ జలాశయం పంట కాలువజలాశయం ఆయకట్టు వివరాలిలా... -
త్వరలో పనులు ప్రారంభిస్తాం
రైవాడ జలాశయం అభివృద్ధికి రూ. 3 కోట్ల మంజూరయ్యాయి. గ్రావెల్తో జలాశయం గట్టు పటిష్టం చేశాం. కుడి, ఎడమ ప్రధాన పంట కాలువల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికలు తొలగింపునకు, ఇంటెక్ చాంబర్ మరమ్మతు పనులకు అగ్రిమెంట్ పూర్తయ్యింది. పనులను వారంలోగా ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తాం. పిల్ల కాలువల్లో తుప్పలు, పూడికలు తొలగించే పనులు ఆయా నీటి సంఘాలకు అప్పగించాం. తక్షణమే పనులు చేపట్టాలని సూచించాం. –జి. సత్యంనాయుడు, డీఈ, రైవాడ జలాశయం -
పిడికిలి బిగిద్దాం..
అనకాపల్లి: యువతకు కూటమి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని, వైఎస్సార్సీపీ వారి తరపున పోరాడుతుందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘యువత పోరు’ పోస్టర్ను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నపురెడ్డి అదీప్రాజులతో కలిసి అమర్నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఇచ్చిన వాగ్దానం.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అమలు కాలేదన్నారు. నిరుద్యోగుల పక్షాన ‘యువత పోరు’ సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీలో యువతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, కీలక బాధ్యతలు వారికే అప్పగిస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజల తరపున పోరాడి మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 40 సంవత్సరాల అనుభవం గల చంద్రబాబు పాలనను.. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు సరిపోల్చి చూస్తున్నారని, 2027లో జమిలి ఎన్నికలు వస్తే అత్యధిక మెజార్టీతో సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యువజన విభాగం నేతలకు సత్కారం అనంతరం యువజన విభాగంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాథ్, అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు బాధపు హరికృష్ణ, నీటిపల్లి దివాకర్లను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్లు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మిగున్నయ్యనాయుడు, అనకాపల్లి, కశింకోట మండలాల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ కొణతాల మురళీకృష్ణ, 80, 84 వార్డు ఇన్చార్జ్లు కోరుకొండ రాఘవ, కె.ఎం.నాయుడు, గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు పల్లేల సాయి కిరణ్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కడిమిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. యువత పక్షాన పోరు బాట నేడు కలెక్టరేట్ వద్ద నిరసన మాట తప్పిన కూటమి సర్కారును నిలదీద్దాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పిలుపు ‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరణ నేడు అనకాపల్లిలో నిరుద్యోగులతో భారీ ర్యాలీ అనకాపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 23న ‘యువత పోరు’ నిరసన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి సోమవారం ఉదయం 9.30 గంటలకు ర్యాలీ బయలుదేరుతుందని, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. -
శంకరంలో బంగారం చోరీ
అనకాపల్లి టౌన్: తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగిన సంఘటన మండలంలోని శంకరం గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ రవికుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో నివాసముంటున్న శరగడం ఆదినారాయణ ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో అనకాపల్లి వెళ్లారు. అనంతరం అదే రోజు తొమ్మిది గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బ్యాగుల్లో సామాన్లు చిందరవందంగా ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం చోరీ జరిగినట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం క్లూస్ టీం సిబ్బంది వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వైజాగ్లోవండర్ పార్క్
విజ్ఞానం, వినోదం పంచే బయోడైవర్సిటీ పార్క్ ● తెలుగు రాష్ట్రాల బయాలజీ విద్యార్థుల సందర్శన ప్రకృతి అద్భుతాలకు చిరునామా ఈ పార్క్ కేవలం చెట్ల సమాహారం కాదు.. జీవవైవిధ్యానికి ఓ నిలువుటద్దం. అంతరించిపోతున్న జాతుల నుంచి విదేశీ వింతల వరకు ఇక్కడ కొలువుదీరిన ప్రతీ మొక్కకూ ఓ ప్రత్యేక కథ ఉంది. పార్క్ సమన్వయకర్త డాక్టర్ ఎం.రామమూర్తి పర్యవేక్షణలో ఈ మొక్కల విశిష్టతలను విద్యార్థులకు, సందర్శకులకు వివరిస్తుండటం ఇక్కడి అదనపు ఆకర్షణ. ఈ పార్కులోని కొన్ని మొక్కల గురించి తెలుసుకుందామా? పార్కులో పెంచుతున్న అరుదైన మొక్కలు నగర జీవితంలోని కాంక్రీట్ జంగిల్కు భిన్నంగా, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఉందా? అరుదైన మొక్కల గురించి తెలుసుకుంటూ, వాటి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా పెదవాల్తేరులోని బయోడైవర్సిటీ పార్క్ను సందర్శించాలి. రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఈ ఉద్యానవనం.. ఎన్నో వింతలు, విశేషాలతో ప్రకృతి ప్రియులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. – బీచ్రోడ్డుప్రేమను పంచే మొక్కలు ప్రేమకు గుర్తు గులాబీ పువ్వు మాత్రమే కాదు. అనేక అరుదైన మొక్కలు, వాటి పువ్వులు, ఆకులు కూడా ఉన్నాయి. బయోడైవర్సిటీ పార్కులో ఇటువంటి ప్రత్యేకమైన మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా చెట్లపై పేర్లు రాస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ‘వాలెంటైన్స్ ప్లాంట్’అనే ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉండటం వల్ల వాటిపై పేర్లు రాసుకోవచ్చు. ఇలా రాసిన పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. అలాగే ‘వాలెంటైన్స్ హార్ట్’అనే మరో అరుదైన మొక్క కూడా ఈ పార్కులో ఉంది. ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్క చూడటానికి లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది. ఈ ప్రత్యేకత ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మొక్కను ‘స్వీట్ హార్ట్’అని కూడా పిలుస్తారు. ఇంకా ‘మిలియన్స్ హార్ట్స్’మొక్క పార్కుకు వచ్చే యువతీ యువకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకే మొక్కకు వందల సంఖ్యలో గుండె ఆకారపు ఆకులు ఉండటం దీని ప్రత్యేకత. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతోనే దీనికి ‘మిలియన్స్ హార్ట్స్’అనే పేరు వచ్చింది. షేవింగ్ బ్రష్ ట్రీ పేరుకు తగ్గట్టే దీని పువ్వులు అచ్చం షేవింగ్ బ్రష్ను పోలి ఉంటాయి. ఇది ఒక ఎడారి మొక్క. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని పూల కేశాలు సన్నటి తీగల్లా ఉంటాయి. లావుగా ఉండే దీని కాండం నీటిని నిల్వ చేసుకుంటుంది. వేసవిలో నీటి కొరత ఏర్పడినప్పుడు, ఆ నీటినే వాడుకుని జీవిస్తుంది. ప్రకృతి ఎంత గొప్ప ఇంజినీరో చెప్పడానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. కృత్రిమ హౌస్లో ఆర్కిడ్ల సోయగం ప్రపంచంలోనే అత్యంత అందమైన పూల జాతుల్లో ఆర్కిడ్లు ఒకటి. వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మొక్కలు జీవ వైవిధ్య ఉద్యానవనంలో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ మొక్కలు సాధారణంగా చల్లని ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి మట్టిలో కాకుండా చెట్ల కాండాన్ని అల్లుకుని పెరుగుతూ, గాలిలోని తేమను పీల్చుకుంటూ జీవిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి అధికంగా పుష్పిస్తాయి. ఆర్కిడ్ల ఆకారాలు, రంగులు విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆర్కిడ్లు జీవించడానికి చల్లని వాతావరణం అవసరం.’అని సమన్వయకర్త రామ్మూర్తి తెలిపారు. అందుకే జీవ వైవిధ్య ఉద్యానవనంలో ప్రత్యేకంగా ఒక కృత్రిమ ఆర్కిడ్ హౌస్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ తొట్టెల్లో బొగ్గు, కొబ్బరి పీచులను ఉపయోగించి మొక్కలను సంరక్షిస్తున్నారు. డ్యాన్సింగ్ లేడీ, ఎరైడ్స్ మల్టీఫోర, డెండ్రోబియం ఎఫిల్లా, సింబిడియం వంటి అనేక రకాల ఆర్కిడ్ మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వాటికి పూసే పువ్వులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మన దేశంలో మేఘాలయ, సిమ్లా ప్రాంతాల్లో ఇవి అధికంగా కనిపిస్తాయి. కొండగోగు అంతరించిపోతున్న మొక్కల్లో ఇదొకటిగా చెబుతారు. ఈ మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని పచ్చి కొమ్మలకు మంటపెడితే భగ్గున మండుతాయి. పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలను అధికంగా ఆకర్షించే దీని పువ్వులు కప్పు ఆకారంలో ఉండటం మరో విశేషం. విద్యార్థులకు ప్రయోగశాల ఈ బయోడైవర్సిటీ పార్క్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయాలజీ విద్యార్థులకు ఒక సజీవ ప్రయోగశాలగా మారింది. తమ పరిశోధనలు, ప్రాజెక్టుల కోసం విద్యార్థులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. డాక్టర్ రామమూర్తి వారికి మొక్కల చరిత్ర, వాటి పెంపకం, వైద్య, పర్యావరణ ప్రయోజనాలను వివరిస్తూ వారిలో ప్రకృతిపై ఆసక్తిని పెంచుతున్నారు. -
తిండి లేదు.. నిద్ర లేదు
● యోగాంధ్రలో గిరిజన విద్యార్థుల అష్టకష్టాలు ● గురువారం సాయంత్రమే విశాఖకు కొందరి తరలింపు ● వసతి లేక ఇబ్బందులు.. గ్రౌండ్, బస్సుల్లోనే విద్యార్థుల నిద్రలు ● బురదలోనే భోజనాలు, తాగునీటి కోసం పాట్లు ● 5 వేల మందికి 10 టాయిలెట్లు.. కంపుతో అల్లాడిన చిన్నారులు ● అర్థాకలి.. నిద్ర లేక నీరసించినా గిన్నిస్ రికార్డు కొట్టిన విద్యార్థులు విశాఖ సిటీ: యోగాంధ్ర కార్యక్రమం పేరుతో కూటమి ప్రభుత్వం అభం శుభం తెలియని గిరిజన విద్యార్థులను అష్టకష్టాలు పెట్టింది. గిన్నిస్ రికార్డు పేరుతో అల్లూరి జిల్లా నుంచి వేల మంది చిన్నారులను నగరానికి తీసుకువచ్చి సరైన వసతి కల్పించకుండా నరకం చూపించింది. సక్రమంగా భోజనం పెట్టకుండా.. నిద్రపోవడానికి వసతి ఏర్పాటు చేయకుండా రోడ్డు పాల్జేయడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించారు. భోజనాల వద్ద తోపులాటల్లో నలిగిపోయారు. బురదలోనే భోజనాలు, టిఫిన్లు చేశారు. నిద్ర లేక నీరసించారు. టాయిలెట్ల కోసం క్యూ కట్టారు. కంపు భరించలేక అవస్థలు పడ్డారు. తాగునీటి కోసం ట్యాంక్ వద్ద ఎగబడ్డారు. అపరిశుభ్రమైన నీటితోనే గొంతులు తడుపుకున్నారు. యోగాసనాలు వేసేంత వరకు ఎండలోనే పడిగాపు లు కాశారు. రాత్రి గ్రౌండ్, బస్సుల్లోనే పడుకున్నారు. కూటమి ప్రభుత్వం సరైన వసతి సౌకర్యాలు కల్పించకపోయినప్పటికీ.. సగం నిండిన కడుపులతో.. ఎండ వేడికి గొంతెండుతున్నా.. నిద్ర లేక నీరసించినా.. 25 వేల మంది విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. విద్యార్థుల హాహాకారాలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లా నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాసనాలు చేయించి రికార్డు సాధించాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఇందుకోసం గురువారం రాత్రికే కొంత మంది గిరిజనులను నగరానికి తీసుకువచ్చింది. కానీ రాత్రి వసతి ఏర్పాట్లు చేయలేదు. సక్రమంగా భోజనాలు అందించలేదు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అర్ధాకలితోనే ఉన్నా రు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలోనే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అవస్థలు పడ్డారు. మరుసటి రోజు శుక్రవారం తెల్లవారుజామున మరికొంత మంది విద్యార్థులను అల్లూరి జిల్లా నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. వీరికి కూడా మధ్యాహ్నం సక్రమంగా భోజన ఏర్పాట్లు చేయలేదు. 25 వేల మంది పిల్లలను తీసుకొచ్చి ఎండలోనే ఐదు కౌంటర్లలో భోజనాలు వడ్డించారు. దీంతో విద్యార్థులు గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి వచ్చింది. రోడ్డు మీదే భోజనాలు చేశారు. అనంతరం చేతులు కడుక్కోడానికి మంచినీటికి కూడా లైన్లలో నిలబడాల్సి వచ్చింది. కనీసం వాటర్ బాటిళ్లు అందించకపోవడంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. కాళ్లకు చెప్పులు లేకుండా వాటర్ బాటిళ్లు మోస్తున్న విద్యార్థులుబురదలోనే భోజనాలు.. కంపుకొట్టిన టాయిలెట్లు యోగాంధ్రలో శనివారం ఉదయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. 5 వేల మందికి వేసిన ఒక్కో టెంట్కు కేవలం 10 తాత్కాలిక టాయిలెట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 25 వేల మందికి టెంట్లు వేశారు. దీంతో ఉదయం చిన్నారులు కాలకృత్యాలు తీర్చుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ టాయిలెట్లను శుభ్రం చేసే వారు లేక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. అయినప్పటికీ మరో దారి లేక ముక్కు మూసుకుంటూనే వెళ్లాల్సి వచ్చింది. అలాగే దాని పక్కనే టిఫిన్లు ఏర్పాటు చేశారు. బాత్రూమ్ల నుంచి వచ్చిన నీటితో బురదమయంగా మారిన గ్రౌండ్లోనే చిన్నారు లు అల్పాహారం తిన్నారు. ఇక మంచినీటి కోసం చిన్నపాటి యుద్ధమే చేశారు. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు అందించకుండా వాటర్ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేశారు. తీసుకొచ్చిన వాటర్ కంటైనర్లు నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. దీంతో చిన్నారులు వాటర్ ట్యాంకర్ వద్ద, డ్రమ్ముల్లో అడుగంటిన అపరిశుభ్రమైన నీటిని తాగుతూ సమస్యలు ఎదుర్కొన్నారు. -
మైదానం.. బస్సుల్లోనే నిద్ర
అల్లూరి జిల్లా నుంచి 25 వేల మందిని గిరిజన విద్యార్థులను తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. వీరికి స్వర్ణభారతి ఇండోర్ స్డేడియం, విశాఖ వ్యాలీ స్కూల్, పెందుర్తి ప్రాంతంలోని ఒక కల్యాణ మండలంలో శుక్రవారం రాత్రి వసతికి ఏర్పాట్లు చేశారు. అయితే 25 వేల మందికి అది సరిపోకపోవడంతో చాలా మంది విద్యార్థులను ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లోనే వదిలేశారు. దీంతో విద్యార్థులు గ్రౌండ్లోను, బస్సుల్లోనే ఇబ్బందులు పడుతూ పడుకున్నారు. అలాగే వసతి ఏర్పాట్లు చేసిన వారికి కూడా రాత్రి 10 గంటలకు తీసుకువెళ్లి మళ్లీ ఉదయం 3 గంటలకే సిద్ధం ఉండాలని ఆదేశించారు. తెల్లవారుజామునే అక్కడి నుంచి ఏయూ గ్రౌండ్కు తీసుకువచ్చారు. శనివారం తెల్లవారకముందే మళ్లీ వారు యోగాసనాలకు సిద్ధమయ్యారు. దీంతో వీరికి సరైన భోజనం, నిద్ర లేక నీరసించిపోయారు. ఉదయం 8 గంటలకు యోగాసనాల తర్వాత కూడా టిఫిన్లు అందించే విషయంపై కూడా దృష్టి పెట్టలేదు. కొంత మంది వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలకు ఆ బాధ్యతలు అప్పజెప్పడం, వేల సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో తోపులాట జరిగే అవకాశం ఉంటుందని భయపడి అనేక మంది విద్యార్థులు టిఫిన్ల కోసం వెళ్లలేదు. యోగాసనాల సమయంలో అందించిన కిట్లో ఉన్న అరటి పండు, బిస్కెట్, చెక్కీ తిని అర్ధాకలితోనే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు అల్లూరి జిల్లాకు బస్సులు ఎక్కారు. -
ఆదర్శ రైతు మృతి
కోటవురట్ల: మండలంలో కై లాస పట్నం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు, గ్రామ పెద్ద సిద్ధాబత్తుల చంటి అప్పారావు శనివారం మృతి చెందారు. చిన అప్పారావు పెద్ద కోడలు ఉమాదేవి జెడ్పీటీసీ కాగా, పెద్ద కుమారుడు సత్తిబాబు, చిన్న కుమారుడు నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంటి అప్పారావు మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ నడిచే సమయంలో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతుగా చంటి అప్పారావు పలు అవార్డులను అందుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు డి.వి. సూర్యనారాయణ రాజు, వైఎస్సార్ సీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి మండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణ రాజు తదితరులు చిన అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. -
విశాఖ అభివృద్ధి నా బాధ్యత
డాబాగార్డెన్స్(విశాఖ): విశాఖ నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘నగరంలో పారిశుధ్యం, సుందరీకరణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తా. పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తా. తాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీవీఎంసీకి అందే నిధులను సక్రమంగా వినియోగించి, విశాఖను మరింత అభివృద్ధి చేస్తా. ఇందుకోసం మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటా. స్వచ్ఛ సర్వేక్షణ్లో విశాఖకు ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తా. డీపీఆర్ ప్రకారం ప్రతిపాదించిన మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులకు జీవీఎంసీ తరఫున పూర్తి సహకారం అందిస్తా. ఆ పనులు వేగవంతమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటా’అని చెప్పారు. నగరంలోని ఖాళీ స్థలాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తానని నూతన కమిషనర్ తెలిపారు. పార్కులు, కూడళ్లను అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కాలువల్లోని పూడికను తొలగిస్తామన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై సర్వే నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దక్షిణ నియోజకవర్గం పాతనగరంలో సమస్యలున్నాయని, వాటిని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రోడ్ల అభివృద్ధిపై సర్వే నిర్వహించి, అడ్డంకులుంటే న్యాయపరంగా వాటిని పరిష్కరిస్తామని, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలోని సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పోలీస్ శాఖ, జీవీఎంసీ సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. తీర నగరమైన విశాఖను ఇతర నగరాలతో ‘సిస్టర్ సిటీ’లుగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని, నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులు వేగవంతం చేస్తాం పాతనగరం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్ -
హైస్కూల్ విద్య.. హైరానా
కశింకోట: నూతన విద్యా విధానంలో భాగంగా మండలంలోని మూడు ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించి, ప్రాథమిక పాఠశాలలకు పరిమితం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు కిలో మీటర్ల దూరంలోఉన్న హైస్కూళ్లకు అధిక వ్యయప్రయాసలకోర్చి అష్ట కష్టాలు పడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని ఉగ్గినపాలెం, అచ్చెర్ల, జి.భీమవరం ప్రాథమికోన్నత పాఠశాలలను నూతన విద్యా విధానంలో ఈ ఏడాది ఎత్తి వేశారు. ఆ పాఠశాలల స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో చదివే 6,7,8 తరగతుల విద్యార్థులు దూరంగా తాళ్లపాలెంలో ఉన్న హైస్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ● జి.భీమవరం పాఠశాలలో ఈ ఏడాది 5 నుంచి 6వ తరగతికి వచ్చిన వారు 19 మంది, 6 నుంచి 7వ తరగతికి వచ్చిన వారు 11 మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి తగ్గించడంతో విద్యార్థులు సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న తాళ్లపాలెం హైస్కూళ్లకు ఆటోల్లో చేరుకోవలసి వస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ విద్యార్థుల్లో కొందరు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపగా, మిగిలిన వారు ప్రభుత్వ హైస్కూల్లో చేరారు. ● అచ్చెర్ల ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిని కుదించడంతో 5 నుంచి 6వ తరగతికి వచ్చిన నలుగురు, 6 నుంచి 7వ తరగతికి వచ్చిన ఆరుగురు విద్యార్థులు ఐదు కిలో మీటర్ల పైగా ఉన్న తాళ్లపాలెం హైస్కూల్కు ఆటోల్లో రావలసి వస్తోంది. ● ఉగ్గినపాలెం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలకు పరిమితం చేయడంతో అక్కడ చదివే 5 నుంచి 6వ తరగతి వచ్చిన ఎనిమిది మంది, 6 నుంచి 7వ తరగతికి వచ్చిన ఏడుగురు సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న తాళ్లపాలెం హైస్కూలుకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలల స్థాయి తగ్గించి, విద్యార్థులకు విద్యను దూరం చేయడం, ఇబ్బందులకు గురి చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థులు మధ్యలో బడి మానేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలలను యథావిధిగా నిర్వహించాలని కోరుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి తగ్గింపుతో విద్యార్థులకు అవస్థలు దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి మధ్యలో బడి మానేస్తున్న పేద విద్యార్థులు -
పాలిటెక్నిక్ ప్రవేశ కౌన్సెలింగ్ ప్రారంభం
నర్సీపట్నం/తుమ్మపాల: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు శనివారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాల, అనకాపల్లి మండలంలోని రేబాక పాలిటెక్నిక్ కళాశాలల్లో మొదటి రోజు 1 నుంచి 15,000వ ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు హాజరయ్యారు. నర్సీపట్నం కాలేజీ ప్రిన్సిపాల్ తాతాజీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించారు. 3,567 ర్యాంకు వచ్చిన విద్యార్థి పి.విజయ్కుమార్తో మొదటి వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను పాలిటెక్నిక్ స్టేట్ సెక్రటరీ జి.వి.రామచంద్రరావు పరిశీలించారు. ధ్రువపత్రాల ను పరిశీలించి రశీదు, సర్టిఫికెట్ను అందజేశారు. తొలి రోజు ఈ సెంటర్లో 60 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. రేబాక సెంటర్లో 164 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐ.వి.ఎస్.ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు పొందిన సిగ్గు శ్రీవెంకట్ (556), లక్కవరపు ధరణి (1,233)ల సర్టిఫికెట్లను తొలుత పరిశీలించారు. ఆదివారం 15,001 నుంచి 32,000 ర్యాంకు వరకు గల విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.