breaking news
Anakapalle District Latest News
-
ఆస్పత్రి ప్రాంగణంలో ఆటస్థలమా..?
నాతవరం : స్ధానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూటమి నేతలు, అధికారులు కుమ్మకై ్క పీహెచ్సీ ప్రాంగణంలో ఆటస్థలం పనులు చేపట్టడంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు తెలిపారు. పీజీఆర్ఎస్లో సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అర్జీ అందజేసి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాతవరం పీహెచ్సీకి 1960లో దాత మూడు ఎకరాలు జిరాయితీ భూమి ఇచ్చారన్నారు. ఆ భూమిలో ఆస్పత్రి భవనాలు నిర్మించాలని దాతలు కోరారన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆట స్థలం నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరు చేయడంతో సర్పంచ్కు, పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఆస్పత్రి ప్రాంగణంలో ఆట స్థలం నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. దీనిపై ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, మండల ప్రత్యేకాధికారి మంగవేణికి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆస్పత్రి స్థలంలో ఆటస్థలం నిర్మిస్తే పీహెచ్సీ అప్గ్రేడ్కు స్ధల సమస్య వస్తుందన్నారు. దీనిపై పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల శాఖ అద్యక్షుడు చెక్కా జోగిరాజు, నాతవరం మాజీ వైస్ సర్పంచ్రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు అపిరెడ్డి మహేష్ పాల్గొన్నారు. -
పూడిమడకను విభజించాలని వినతి
అచ్చుతాపురం రూరల్ : అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీని రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 20 వేల జనాభా ఉన్న గ్రామాన్ని పూడిమడక, కడపాలెం గ్రామ పంచాయతీలుగా విభజించాలని, అత్యధిక జనాభా కారణంగా పరిపాలన భారం పెరిగి అభివృద్ధి జరగడం లేదని తెలిపారు.కడపాలెం, కొండపాలెం, ఎస్సీ కాలనీ, పళ్ళిపేట, పెద్దురు, జాలరిపాలెం గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు చొరవ తీసుకుని పుడిమడక ప్రజలకు మెరుగైన సేవల కొసం ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. ఆర్డీఓ షేక్ ఆయిషాకు రెండు పంచాయితీలు కోరుతూ వినతిపత్రం అందజేస్తున్న పూడిమడక ప్రజలు -
నిరసన గళంపై ఆంక్షలు
నక్కపల్లి/ఎస్.రాయవరం: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిన సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ సీపీఎం నాయకులు సోమవారం తలపెట్టిన ప్రదర్శనలను పోలీసులు భగ్నం చేశారు. సామాన్యుల పక్షాన నిలిచిన అప్పలరాజుపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని నిరసన తెలపడానికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అని ఆందోళనకారులు మండిపడ్డారు. నక్కపల్లిలో సోమవారం దుకాణాలు, విద్యాసంస్ధలు, వాణిజ్య సంస్ధలు మూసివేసి నిరసన తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అయితే సీపీఎం నాయకులు చేస్తున్న ఆందోళనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. వీరందర్నీ పోలీసు స్టేషన్కి తరలించి 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టినట్లు సీఐ మురళి తెలిపారు. అడ్డురోడ్డులో బంద్ నిర్వహించేందుకు వచ్చిన పలువురు సీపీఎం నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు అడ్డురోడ్డులో గస్తీ నిర్వహించి బంద్ జరగకుండా కాపాలా కాశారు. బంద్ నిర్వహించడానికి ముందుగా జంక్షన్కు చేరుకున్న సీపీఎం మండల బాధ్యుడు ఎం.సత్తిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వి.వెంకన్న, జిల్లా కమిటీ సభ్యుడు వి.వి.శ్రీనివాసరావులను అరెస్టు చేసి ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మరికొంతమంది సీపీఎం నాయకులు, స్థానికులు కలిసి అడ్డురోడ్డు జంక్షన్కు వచ్చి నినాదాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో వ్యాను తీసుకుని వచ్చి మరికొంతమందిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
ఇంటర్ బాలిక ఆత్మహత్య
కోటవురట్ల : రాట్నాలపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థిని మున్నూరు మౌనిక (17) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తల్లి అచ్చియ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. మౌనిక ఆదివారం ఉదయం పుస్తకాలు కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లింది. కొంత సేపటికి చర్చి దగ్గర ఉన్నాను వచ్చేస్తాను అని తల్లికి ఫోన్లో చెప్పింది. దాంతో కుమారుడు శశికుమార్ను చర్చి దగ్గరకు వెళ్లి చెల్లిని తీసుకురమ్మని పంపించింది. శశికుమార్ వెళ్లే సరికి మౌనిక కోటవురట్లలోని టెంట్ హౌస్ వద్ద అక్కడ పనిచేస్తున్న కుమార్ అనే యువకుడితో గొడవ పడడం చూశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మౌనిక రాత్రి 6.30 గంటల ప్రాంతంలో తలుపులు వేసుకుంది. అనుమానం వచ్చి శశికుమార్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే సీహెచ్సీకి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి అచ్చియ్యమ్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఘటనా స్థలం పరిశీలించగా సూసైడ్ నోట్ను గుర్తించారు. అందులో మౌనిక తాను లోకేష్ అనే యువకుడిని ప్రేమించానని, అదే సమయంలో పందూరుకు చెందిన మరో యువకుడు కుమార్తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారడంతో ఈ విషయం తెలిసిన లోకేష్ తనతో మాట్లాడడం మానేశాడని పేర్కొంది. లోకేష్ మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేక తన వల్ల తల్లిదండ్రులకు అవమానం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు నోట్లో పేర్కొంది. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
హాహాకారాలు
తెల్లారితే నిద్ర లేచి గమ్యం చేరుకోవచ్చు అనుకున్నారు. తమ రైలు ప్రయాణం సాఫీగా సాగిపోతుందనుకుని ధీమాగా నిద్రకు ఉపక్రమించారు. ఒక్కసారిగా పెద్ద కేకలు.. తాము ప్రయాణిస్తున్న రైల్లో మంటలు వ్యాపిస్తున్నాయని తెలుసుకున్నారు. ప్రాణాలను దక్కించుకోవడానికి నిద్రమత్తులోనే రైలు నుంచి దిగేశారు. ఈ క్రమంలో మంటలు పెరిగిపోయాయి. దిగేలోపు ఒక వృద్ధుడు అగ్నికీలలకు బలైపోయాడు. మిగిలిన వారంతా పెను ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డారు. అర్ధరాత్రి వేళ యలమంచిలి రైల్వేస్టేషన్ ప్రయాణికుల హాహాకారాలతో ప్రతిధ్వనించింది. అర్ధరాత్రి ● టాటానగర్–ఎర్నాకుళం రైలులో అగ్ని ప్రమాదం ● యలమంచిలి స్టేషన్లో దగ్ధమైన రెండు కోచ్లు.. వృద్ధుడు మృతి ● అప్రమత్తతతో తప్పిన భారీ ప్రమాదం ● ఘటనకు కారణాలపై రాని స్పష్టత ● పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న రైల్వే అధికారులు మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మంటల్లో బోగీలు (ఇన్సెట్) కాలిపోయిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కోచ్లుయలమంచిలి రూరల్: యలమంచిలి స్టేషన్లో ఆగి ఉండగా మంటలు చెలరేగడం.. లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తంగా కావడం.. ఒక ప్రయాణికుడు చెయిన్ లాగడంతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న (18189) ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు క్షణకాలంలో స్పందించడం వల్ల ఒక్కరు తప్ప పెనుప్రమాదం నుంచి ప్రయాణికులంతా బయటపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఈ ట్రైన్లోని రెండు కోచ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి 12–45 గంటలకు యలమంచిలి రైల్వేస్టేషన్కు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది వుండడంతో ఒక పైలట్ను దింపడానికి ట్రైన్ ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ఆ తరువాత కాసేపటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రైలు ముందుకు కదల్లేదు. ప్రెజర్ డౌన్ అయిపోయి కదల్లేదని గుర్తించారు. ఏమైందోనని డ్యూటీలో ఉన్న లోకో పైలట్ కిందకి దిగి పరిశీలిస్తుండగా బీ1, ఎం2 ఏసీ కోచ్ల నుంచి పొగలు రావడం కన్పించాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెన్సార్లు ఉంటాయని, వాటివల్ల రైలు కదలదని స్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదంలో బీ1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అగ్నికి ఆహుతయ్యారు. ప్రాణభీతితో పరుగులు.. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో మొదట బీ1 ఏసీ కోచ్లో మంటలు చెలరేగినట్టు రైల్వే అధికారులు గుర్తించారు. తర్వాత పక్కనే ఉన్న ఎం2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన బోగీలోని ప్రయాణికులు నిద్రలో ఉన్న మిగతా ప్రయాణికులను అప్రమత్తం చేశారు. లగేజీని తీసుకుని కొందరు, వదిలిపెట్టి మరికొందరు ప్రాణభీతితో బయటకు పరుగులు తీశారు. అనంతరం క్షణాల్లో రెండు బోగీలకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. రైల్వే స్టేషన్లో పాయింట్స్మెన్ అగ్ని ప్రమాదాన్ని నివారించే పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో యలమంచిలి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయలేదని రైల్వేస్టేషన్ సిబ్బంది తెలిపారు. రైల్వే ఎస్ఎస్ ఆకుల సురేష్కుమార్ నేరుగా ఫైర్ స్టేషన్కు వెళ్లి కబురు చెప్పారు. వెంటనే అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పక్కనున్న ఎం1కు మంటలు వ్యాపించకుండా రైల్వే సాంకేతిక సిబ్బంది కోచ్ను వేరు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం, ఉన్నతాధికారుల పరిశీలన ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని నిర్ధారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. విశాఖ రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం ప్రమాదంలో కాలిపోయిన రెండు బోగీలను పరిశీలించింది. ప్రమాద కారణాలకు సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీ1 బోగీలో 76, ఎం2లో 82 మంది మొత్తం 158 మంది ప్రయాణికులున్నట్టు గుర్తించారు. వీరిలో బీ1 బోగీలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) బెర్త్ వద్ద బెడ్రోల్స్ ఉన్నచోట నుంచే మంటలు మొదట వ్యాపించినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనా, మానవ తప్పిదం కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తేలాల్సివుందని డీఐజీ సత్య ఏసుబాబు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు డీఆర్ఎం వెల్లడించారు. ప్రమాదంపై రైల్వేశాఖ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ట్రైను ఏసీ కోచ్ల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సీసీ కెమెరాల ఫుటేజీ లభ్యమైతే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లా పోలీసు, రైల్వే అధికారుల తక్షణ స్పందనతో టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాద తీవ్రత తగ్గిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అందరూ సకాలంలో త్వరితగతిన స్పందించడం వలన మంటలు ఇంకా వ్యాప్తి చెందకుండా చూశామని సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆగ్రహం విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం కలెక్టర్ విజయ్ కృష్ణన్ యలమంచిలి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైలు బోగీలను పరిశీలించారు. ప్రమాద కారణాలను లోకో పైలెట్లను అడిగి తెలుసుకున్నారు. రైలులో మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను ఎవరూ పట్టించుకోకపోవడంపై కలెక్టర్ స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఇంతటి ప్రమాదం జరిగి గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు, వాళ్లతో ఉన్న పిల్లలకు పాలు, నీరు ఇవ్వడం తెలియదా? అంటూ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. తమకు సమాచారం ఆలస్యంగా తెలిసిందని వారు చెప్పగా, అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అధికారులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదం జరిగితే మా వాళ్లకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా.. అని ప్రశ్నించారు. రెవెన్యూకు తెలియకుండా పనిచేసుకుపోతారా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేస్తానని హెచ్చరించారు. కేసు నమోదు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాద ఘటనపై తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తుని ప్రభుత్వ రైల్వేపోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు చెప్పారు. వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియాకాలి బూడిదైన కోచ్ను పరిశీలిస్తున్న క్లూస్ టీం సభ్యుడుచివరిగా భార్యకు ఫోన్.. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు చంద్రశేఖర్ సుందర్ చనిపోయినట్టు మొదట యలమంచిలి సీఐ ధనుంజయరావు గుర్తించారు. అతను మరణానికి కొద్ది నిమిషాల ముందు తన భార్యకు ఫోన్ చేసి, రైలులో ఏదో ప్రమాదం జరుగుతోందని, భయమేస్తోందని, వెంటనే కుమార్తె, అల్లుడిని పంపించాలని కోరాడు. అంతలోనే ఫోన్ సంభాషణ ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మంటలు అతన్ని బలి తీసుకున్నాయి. బయటకు రాలేక ప్రయాణిస్తున్న బోగీలోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. తాము కారులో వస్తామని చెప్పి తండ్రిని విజయవాడ వెళ్లేందుకు రైలెక్కించామని మృతుని కుమార్తె, అల్లుడు పోలీసులకు చెప్పారు. రైల్వేస్టేషన్లో విగత జీవిగా ఉన్న చంద్రశేఖర్ సుందర్ను చూసి వారు గుండెలవిసేలా రోదించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించామని యలమంచిలి తహసీల్దార్ వరహాలు చెప్పారు. మృతుడు చంద్రశేఖర్ సుందర్ తనతో తీసుకెళ్లిన బ్యాగులో రూ.6.50 లక్షలు నగదు, బంగారం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో కొన్ని నోట్లు కాలిపోయినట్టు గుర్తించారు. వాటిని రైల్వే పోలీసులు స్వాధీనపర్చుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ శివయ్యే కాపాడాడు నేను వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఆదివారం మధ్యాహ్నం టాటాలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఈ ట్రైన్ అర్ధరాత్రి యలమంచిలి రైల్వేస్టేషన్ చేరుకునేసరికి పెద్ద పెద్ద మంటలు, పొగలు వ్యాపించాయి. ఏదో ప్రమాదం జరుగుతుందని భావించి నేను నా లగేజీతో బయటకు వచ్చేశాను. గాఢనిద్రలో వుండగా ఈ ప్రమాదం జరిగినప్పటికీ సురక్షితంగా బయటపడ్డాం. –రామకృష్ణన్, ప్రయాణికుడు చాలా అదృష్టం నేను టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో విశాఖ నుంచి బయల్దేరాను. రైలు ఎక్కిన గంట లోపే మేమున్న ఎం2 కోచ్లో పొగ వ్యాపించింది. నాకు ఇంకా నిద్రపట్టకపోవడంతో చూసే సరికి బీ1 కోచ్లో మంటలు వ్యాపించాయి. దీంతో మా బోగీలో వున్న ప్రయాణికులందరినీ పెద్ద కేకలు పెట్టి నిద్రలేపాను. దీంతో అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడం మా అదృష్టమే. –సూర్యప్రకాష్, దువ్వాడ -
ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా అధ్యక్షునిగా సూర్యనారాయణ
ఏపీ ఎన్జీజీవోఎస్ నూతన కార్యవర్గం అనకాపల్లి: ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా అధ్యక్షునిగా పి.సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థా నిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ హాల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షునిగా పి.దాలినాయుడు, ఉపాధ్యక్షులుగా ఎ.జె.సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు, డి.ఆనందరావు, ఎస్.సత్యనారాయణ, రేవతి, కార్యదర్శిగా డి.శేషుకుమార్, సహాయ కార్యదర్శులుగా యు.ఎస్.వి.శ్రీనివాసరావు, సీహెచ్. బాబూరావు, డి.కొండలరావు, ఎస్.శ్రీనివాసరావు, కె. కిరణ్కుమార్రాజు, వి.చిరంజీవి, సి.సంతోష్కుమార్, పి.త్రినాథ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.వి.రమణబాబు, కోశాధికారిగా పి.త్రినాథ్తోపాటు మరికొంతమంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కొత్త కమిటీ మూడు సంవత్సరాలు పదవిలో ఉంటుంది. -
ప్రజా సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు
అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఎస్.రాయవరం : ప్రజా సమస్యలపై మాట్లాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయిందని పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.అక్రమంగా అరెస్టు అయిన సీపీఎం అప్పలరాజు కుటుంబసభ్యులను ధర్మవరం అగ్రహారంలో సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లా ఆర్డర్ అదుపులో లేదని, పోలీసులు, అధికారులు నాయకులు, మంత్రులు ఏం చెబితే అదే చేస్తున్నారని విమర్శించారు. బల్క్డ్రగ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు అప్పలరాజును ఆందోళన సద్దుమణిగాక అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రజాప్రయోజనాలపై ప్రశ్నించే వారిని గడిచిన 20 నెలలుగా అరెస్టులు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. తప్పుడు విధానాలతో కూటమి నేతలు ముందుకు వెళితే రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ పరామర్శలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు ఎస్ఏఎన్ మధువర్మ, ఉపాధ్యక్షుడు వెదుళ్ల బంగారి, యూత్ అధ్యక్షుడు నల్లపురాజు వెంకటరాజు, నాయకులు కర్రి శ్రీను, చొప్పా రాజు, పోలిశెట్టి శ్రీను, శ్రీపాదుల సూర్యనారాయణమ్మ, సుంకర సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు
బుచ్చెయ్యపేట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంపై పలువురు లబ్ధిదారులు ఆగ్రహం చెందుతున్నారు. బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్లల్లో రక్తహీనతను తగ్గించి వారి ఆరోగ్యం బాగుండాలని, పోషకాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తోంది. నాణ్యతకు దిలోదకాలిచ్చి కుళ్లిన గుడ్లను సరఫరా చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. దిబ్బిడి–2 అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేశారు. గ్రామానికి చెందిన బాలింత పెదిరెడ్ల సునీతకు ఈనెలలో అంగన్వాడీ కేంద్రంలో అందించిన కోడిగుడ్లు సగానికిపైగా కుళ్లిపోయాయి. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడిగుడ్లతో సోమవారం ఆమె ఇంట్లో ఆమ్లెట్ వేసుకోవడానికి చూడగా గుడ్లు కుళ్లిపోవడమే కాక పగలగొట్టిన గుడ్ల నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో ఆమె విస్తుపోయింది. గత మూడు దఫాలుగా అందించిన కోడిగుడ్లలో సగానికి పైగా కుళ్లినవే వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇటీవల మల్లాం భూపతిపాలెంలో కూడా అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లను పిల్లలకు అందించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం చెందారు. -
రెండేళ్ల ప్రాయంలోనే అనాథగా....
దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి జంక్షన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగయ్యపేట పంచాయతీ శివారు సీతంపేట గ్రామానికి చెందిన జంజూరు అర్జున్ (35) మృతి చెందాడు. ఆనందపురం సమీపంలోని ఓ రెస్టారెంట్లో అర్జున్ చెఫ్ (కుక్)గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా వాహనం అదుపు తప్పి సమీపంలో ఉన్న గోతిలో పడిపోయా డు. అటుగా వెళ్తున్న కొందరు ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించి, వాహనం నెంబర్ ఆధారంగా ఆన్లైన్ చెక్ చేయగా లభించిన ఫోన్ నెంబర్కు కాల్ చేయడంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. అతని కుటుంబీకులు వెంటనే అక్కడికి చేరుకొని అర్జున్ను కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు జుంజురి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. అనాథగా మారిన చిన్నారి సీతంపేటకు చెందిన అర్జున్కు దేవరాపల్లికి చెందిన గౌరీతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు యశ్విన్ ఉన్నాడు. ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన గౌరి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల వ్యవధిలోనే మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతున్న అర్జున్ ఇపుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని రెండేళ్ల ప్రాయంలోనే భగవంతుడు తల్లిదండ్రులను దూరం చేసి, అనాఽథని చేశాడంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన మంత్రి లోకేష్
అనకాపల్లి : ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల కష్టాలను తీర్చడంలో విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విద్యార్థుల సమస్యలపై బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 6400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మటిక్ చార్జీలు పెంచాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలు, విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు రాజన్న దొరబాబు, జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
నేడు వడ్డాదిలో గిరి ప్రదక్షిణ
బుచ్చెయ్యపేట : వడ్డాది వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి గిరి ప్రదక్షిణ చేయడానికి దేవస్ధానం అధికారులు, పాలక వర్గం, ఉత్సవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. గత ఏడేళ్లుగా వడ్డాదిలో వేంకటేశ్వరస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తుండగా పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది గిరి ప్రదక్షణ విజయవంతం చేయడానికి ముందస్తు ప్రచారం చేశారు. వేంకటేశ్వరస్వామి తొలిమెట్టు నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించి శివాలయం రోడ్డు మరిడిమాంబ పాదాలు,కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హై స్కూల్,జూనియర్ కాలేజీల మధ్య రోడ్డు, బీఎన్ రోడ్డు, వేంకటేశ్వరస్వామి ఆర్చ్ లోపల నుంచి మూడు కిలోమీటర్లు పొడవునా గిరి ప్రదక్షిణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి,భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను గజ, గరుడ వాహనంపై ఉంచి ఊరేగించడానికి రథాలను సిద్ధం చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పేరపు రమేష్,ఆడపా శ్రీనివాస్, ఇంటి గాటీలు,దొండా సాయి,పెంటకోట ప్రసాద్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు, పలువురు యువకులు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పులిహార, పండ్లు, గ్లూకోజ్ ఇతర ప్రసాదాలు అందించనున్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులతో పాటు సాధారణ భక్తులకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. -
సత్వర పరిష్కారం
భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్తో తుమ్మపాల : భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఅర్ఎస్. కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి తీసుకున్న అర్జీల గూర్చి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అదేవిధంగా డివిజను, మండల, గ్రామస్థాయిలలో నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందజేసిన ధరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి ధరఖాస్తుదారునికి తెలియజేయాలని, పరిష్కారం కాని ధరఖాస్తుల గూర్చి వారికి అందుకుగల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో మునుపెన్నడు లేనివిధంగా మొత్తం 410 అర్జీలు నమోదవ్వగా, వాటిలో 222 అర్జీలు రెవెన్యూ శాఖ పనితీరు కారణంగా పరిష్కారం కాని సమస్యలపైనే న మోదయ్యాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అఽధికారులు పాల్గోన్నారు. పంచాయతీల విభజనపై నిరసనలు పంచాయతీల విభజనపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు గ్రామాల ప్రజలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ వద్ద చేసిన నిరసనలు ఇరువర్గాల మధ్య ఆందోళనలకు తెరతీసాయి. కశింకోట మండలం జి.భీమవరం పంచాయతీ పరిధిలో ఉన్న సింగవరం గ్రామాన్ని విభజించి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలంటూ సింగవరం గ్రామస్తులు నిరసనలు చేపట్టగా, విభజనకు వ్యతిరేకంగా పంచాయతీని కలిపే ఉంచాలంటు జి.భీమవరం గ్రామస్తులు నిరసన తెలిపారు. అంతకుముందు సింగవరం గ్రామస్తులకు మద్దతుగా వచ్చిన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు కోన గురవయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలలుగా ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిందన్నారు. రెవెన్యూ పరిధి ఉన్నప్పటికీ సింగవరం గ్రామాన్ని జి.భీమవరం పంచాయతీలో ఉంచడంతో అక్కడ పాలకులు గ్రామాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని, కనీసం గ్రామానికి 40 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా ఏకపక్షంగా జి.భీమవరం గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని, తక్షణమే అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుచేయాలని కోరారు. గ్రామాలు వేరైన రెండు గ్రామాల ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలసిమెలసి ఉన్నామని, కొందరు నాయకులు స్వార్ధం కోసం ప్రత్యేక పంచాయతీ నినాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఒకే పంచాయతీగా కొనసాగించాలని జి.భీమవరం గ్రామస్తులు తెలిపారు. మౌలిక వసతులు పట్టించుకోరా... రోడ్డు ఏర్పాటుతో పాటు ఇళ్ల మురుగునీరు రాకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు కల్పించాలని కొత్తూరు గ్రామం శారదానగర్ 12వ వీధి వాసులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. 40 ఏళ్లుగా శాశ్వత నివాసాల్లో ఉంటున్నా పాలకులు గాని, అధికారులు గాని పారిశుధ్య నిర్వహణ, మౌలిక సౌకర్యాల కల్పనపై కనీసం పట్టించుకోవడం లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామసభల్లోను కూడా ప్రస్తావించినా పరిష్కారం దొరకడం లేదన్నారు. ఇంటిపన్నులు కట్టించుకోవడంపై ఉన్న శ్రద్ధ మంచినీరు, పారిశుధ్యంపై ఉండకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వికలాంగ పింఛను మంజూరు చేయరూ... తండ్రి శ్రీనుతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన వికలాంగుడు కిమిడి శివకుమార్ మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా వికలాంగుడిగా ఉన్న తన కుమారుడికి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ నక్కపల్లి మండలం పెదదొడ్డిగుళ్ల గ్రామానికి చెందిన కిమిడి శ్రీను తన కుమారుడు కిమిడి శివకుమార్ను తీసుకుని కలెక్టరేట్లో వినతి అందించారు. 90 శాతం మాన షిక వికలాంగుడిగా ఉన్న తన కుమారుడి స్ధితిగతులను చూసైన పించన్ అవకాశం కల్పించాలని కోరారు. -
సాంకేతిక ప్రమాదమా? బీడీ కాల్చడం వల్లా?
టాటానగర్–ఎర్నాకుళం రైలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే పోలీసులు సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఇది సాంకేతిక లోపంతో జరిగిందా? లేదా మానవ తప్పిదమా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో స్థానిక పాయింట్స్మెన్ ఏసీ కోచ్ల్లో వుండే ప్యానెల్బోర్డుల నుంచి పవర్ సప్లయి రాకుండా ఎంసీపీని ఆపేశారు. సాధారణంగా ప్యానెల్బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని రైల్వేశాఖ సాంకేతిక సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బోగీల్లో ప్యానెల్ బోర్డులు భద్రంగానే ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే బీ1 కోచ్లో ప్రయాణికుడు బీడీ కాల్చినట్టు గుర్తించిన రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బీడీ లేదా సిగరెట్లు వెలిగించడానికి ఉపయోగించిన అగ్గి పుల్ల పడేయడం వలన అక్కడున్న నైలాన్ దుప్పట్లు, ఉన్ని రగ్గులు, ఇతర వస్త్రాలకు నిప్పంటుకుని అగ్నికీలలు వ్యాపించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీల్లో టాయిలెట్లలో కాల్చిపడేసిన సిగరెట్టు ముక్కలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగా ఏమైనా మంటలు వ్యాపించాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
100 రోజుల ప్రణాళికపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణ తగదు
అనకాపల్లి : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికను పర్యవేక్షించే పనిని విద్యాశాఖతో సంబంధం లేని ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు అప్పగించడం అభ్యంతరకరమని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడమేని అన్నారు. సెలవు రోజుల్లో కూడా పనిచేయాలనే నిబంధన పెట్టి, పండగ సెలవుల్లో ఈ ప్రణాళికను అమలు చేయమనడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రణాళిక అమలు చేస్తున్నప్పటికీ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో ఒక స్లిప్ టెస్ట్ నిర్వహించి 24 గంటల్లో ఆ పరీక్ష పేపర్లను దిద్ది ఆన్లైన్లో మార్కులు అప్లోడ్ చేయమనడం విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుందని తెలిపారు. -
నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించాలి
అనకాపల్లి టౌన్: రాష్ట్రప్రభుత్వం నూతన వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను నియమించాలని, ఐఆర్ మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాఽథ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయించాలని, డీఏ, ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. సంఘం సీనియర్ నేత బి.వెంకటపతి రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. విద్యా శాఖపై ఇతర శాఖల అధికారుల పెత్తనం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వి.వి.ఎ. ధర్మారావు, ఎస్.దుర్గా ప్రసాద్, మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, సన్యాసినాయుడు, కొణతాల గణేష్, నూకేష్, బాపునాయుడు, నరసయ్య నాయుడు, కన్నారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోటి దేవతలు ఒక్కటయ్యేవేళ..
● రేపే వైకుంఠ ఏకాదశి ● ఉపమాకలో ఘనంగా ఏర్పాట్లు విద్యుత్ కాంతులీనుతున్న ఉపమాకలోని స్వామివారి ఆలయంనక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాకలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని ఈనెల 30వ తేదీ మంగళవారం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మూడు కోట్ల మంది దేవతలకు రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించిన రోజు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పర్వదినం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు ఇక్కడ ఉదయం 3 గంటలకు తొలి అభిషేకం చేస్తారు. ముక్కోటి ఏకాదశినాడు సాయంత్రం స్వామివారిని రంగనాథుడిగా అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించి పుణ్యకోటి వాహనంపై వేంచేయింపజేస్తారు. ఉపమాకలో అనునిత్యం ఉత్తరద్వార దర్శనమే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. తద్వారా ముక్తికి మార్గం సుగమమయిందని భక్తులు భావిస్తారు. తిరుపతి, సింహాచలనం, అన్నవరం, భద్రాచలం తదితర వైష్ణవ క్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశినాడే ఉత్తరద్వార దర్శనం కల్పిస్తే.. ఉపమాకలో అనునిత్యం ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ గరుడాద్రి పర్వతంపై స్వామివారు కల్కి అవతారంలో స్వయంవ్యక్తమై షఢ్భుజాలతో అశ్వారూఢుడై వెలిశారు. 8 వాహనాల్లో తిరువీధి సేవలు ముక్కోటి ఏకాదశినాడు ఎక్కడా లేని విధంగా ఉపమాక పుణ్యక్షేత్రంలో ఎనిమిది వాహనాల్లో తిరువీధి సేవలు నిర్వహిస్తారు. రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని పొన్న వాహనంలో, రుక్మిణి సహిత వేణుగోపాలస్వామిని ఆంజనేయ వాహనంపై, సీతారాములను పల్లకిపై, ఇతర వాహనాలపై బాలరాముడు, తాండవ కృష్ణుడు, ప్రాకార పెరుమాళ్లను ఉంచి తిరువీధి సేవలు నిర్వహిస్తారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని, గోపురాలను సర్వాంగ సుందరంగా పూలమాలలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చేశారు. బేడా మండపం, మహాద్వారం, ధ్వజస్తంభాల వద్ద పూలాలంకరణ చేసి పెంటార్లు, షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనాలు కల్పిస్తామని, సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవలు జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. సింహగిరి సిద్ధం సింహాచలం: ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుక లకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించనున్నారు. పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధ న వంటి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై వేంజేంపు చేస్తారు. తెల్లవారుజాము న 5 గంటలకు ఉత్తర ద్వారం వద్ద మేలిముసుగు తొలగించి దర్శనాలకు అనుమతిస్తారు. -
వినోదాల వేదిక.. సంక్రాంతి వేడుక
కాలు దువ్వుతున్న పందెం కోళ్లు ఎడ్లు, గుర్రపు పందాలకు సిద్ధం ఖరీదైన ఆహారంతో ప్రత్యేక శిక్షణ మాడుగుల: తెలుగువారి పండగలలో సంక్రాంతి భిన్నమైనది. పాడి పంట ఇంటికి వచ్చే సమయం కావడంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్దలకు పూజలతోపాటు హరిదాసులు, డూడూ బసవన్నలను ఆదరిస్తారు. రంగ వల్లికలతో శోభ చేకూరుస్తారు. అందులో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడతారు. కనుమ రోజున పశు సంపదకు పూజలు చేస్తారు. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి సందడే సందడి. వీటన్నింటినీ మించిన కొసమెరుపు ఒకటుంది. భోగీ పండగ నుంచి ప్రారంభమయ్యే తీర్థాలు స్వగ్రామాలకు ఇళ్లకు చేరుకునే బస్తీ జనాలకు వినోదాన్ని పంచుతాయి. కోడి పందాలు, ఎడ్లు, గుర్రపు పరుగు పందాలు ప్రత్యేక ఆకర్షణ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటిని ఆసక్తిగా వీక్షిస్తారు. తీర్థాలలో పంచదార చిలుకలు, రంగుల రాట్నాలు చిన్నారులను అలరిస్తాయి. నెల రోజుల ముందు నుంచే శిక్షణ పందెంరాయుళ్లు నెల రోజుల ముందు నుంచే ఎడ్లకు శిక్షణ అందిస్తారు. రేసు గుర్రాలకు, పందెం కోళ్లకు కూడా తర్ఫీదు అందిస్తారు. వీటికి ఖరీదైన ఆహారం అందించడంతోపాటు సకల సదుపాయాలు సమకూరుస్తారు. పండగకు రెండు వారాలకు పైగా సమయం ఉండడంతో ప్రస్తుతం పోటీలకు వాటిని సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. గతంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి గ్రామాల్లో వేకువజాము నుంచే హరిదాసులు పదాలు పాడుతూ సంచరించేవారు. గంగిరెద్దులను ప్రదర్శించేవారు సన్నాయి ఊదుతూ సందడి చేసేవారు. రానురాను ఆ సంప్రదాయాలకు ఆదరణ తగ్గుతోందని వారు వాపోతున్నారు. -
క్లిక్..ఆర్డర్
స్మార్ట్ షాపింగ్లో స్టైల్దే అగ్రస్థానం సాక్షి, విశాఖపట్నం: ఫంక్షన్కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..! ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్స్టామార్ట్లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు. 2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్ని ఇంటికి రప్పించుకుంటున్నారు. ● విశాఖలో 434 శాతం పెరిగిన బ్యాగులు, వాలెట్ల విక్రయాలు ● ఐఫోన్ నుంచి గోల్డ్ కాయిన్ దాకా.. ఫాస్ట్ షాపింగ్ ● ఆన్లైన్ కొనుగోళ్లలో కిరాణేతర వస్తువులదే హవా ● ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడి ఏం ఆర్డర్ చేస్తున్నారంటే? ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు 434 శాతం పెరిగాయి. క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు 374 శాతం మేర నమోదయ్యాయి. నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు 249 శాతం వృద్ధి చెందాయి. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 161 శాతం, పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు 166 శాతం పెరిగాయి. స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు 100 శాతం వరకు వృద్ధి చెందాయి. నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. -
బావిలో పడి విశాఖ డెయిరీ ఉద్యోగి మృతి
కె.కోటపాడు : మండలంలో పాతవలస గ్రామానికి సమీపంలో గల బావిలో ప్రమాదవశాత్తూ పడి విశాఖడెయిరీలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్న పిల్లా కొండలరావు(32) మృతిచెందాడు. మృతుడి సోదరుడు అప్పలనాయుడు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపిన వివరాలు..రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన కొండలరావు కె.కోటపాడులో విశాఖడెయిరీలో వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తూ భార్య శిరీష, కుమారుడు, కుమార్తెతో స్థానికంగా నివాసముంటున్నాడు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం కొండలరావు బహిర్భూమికని బైక్పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య శిరీష ఈ సమాచారాన్ని బంధువులకు, స్థానిక విశాఖడెయిరీ ఉద్యోగులకు తెలిపింది. రాత్రంతా కొండలరావు కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం పాతవలసకు వెళ్లే మార్గంలో కొండలరావు బైక్ను గమనించారు. ఆ పరిసరాల్లో గాలిస్తుండగా నేల బావిలో మృతదేహాన్ని గమనించారు. కొండలరావు మృతిపై కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు ఆయన చెప్పారు. భర్త మృతితో భార్య శిరీష,కుమార్తె, కుమారుడు గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
అలరించిన నాటికలు
అనకాపల్లి: నేటి యువతరానికి ఆసక్తిపెంచే విధంగా నాటికలను ప్రదర్శించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక జార్జిక్లబ్ ఆవరణలో హైదరాబాద్ మహతి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. గతంలో గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించే సమయంలో ప్రదర్శించిన నాటకాలను అక్కడ ప్రజలు ఎంతగానో తిలకించేవారని చెప్పారు. యువ తరానికి నాటకాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మొదటి నాటిక ‘సమయం’ గుంటూరు అభినయ్ ఆర్ట్స్ ప్రదర్శించిన సమయం నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దానిని అనుకూలంగా మార్చుకుంటే సామాన్యుడు రాజవుతాడు.. రాజు కుబేరుడవుతాడు. కానీ అదే సమయాన్ని మర్చిపోయి పరుగెడితే అందమైన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. సమయాన్ని వదిలేస్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో దీనిలో వివరించారు. ఈ నాటికను స్నిగ్థ రచించగా, ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. ‘నువ్వో సగం–నేనో సగం’... హైదరాబాద్, మల్లీశ్వరి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘నువ్వోసగనం–నేనోసగం’ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. నాటిక సారాంశం....సీ్త్రకి ఆర్థిక స్వాతంత్య్రం కావాలి మగవారితో సమాన హక్కులు కల్పించాలి కానీ ఏదైనా సగం..సగం.. నువ్వెంతో నేనూ అంతే అన్న ధోరణిలో ఉండే సంసారం సవ్వంగా నడవదు... కష్టాల్లో సుఖాల్లో, కలిమిలో లేమిలో కలిసిమెలిసి జీవించేదే నిజమైన దాంపత్యం అన్ని తెలియజేసేదే ‘నువ్వో సగం–నేనోసగం’ నాటిక.. దీనికి పొలిమేట్ల సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జార్టీక్లబ్ అధ్యక్షుడు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, కార్యదర్శి బుద్ధ కాశీవిశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విశాఖ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమ వా రం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ తెలిపారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. కాగా.. ఇండోర్ గేమ్స్(టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్)ను గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. బాలబాలికలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాలికల విభాగంలో చెస్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాలుర విభాగంలో కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ పోటీలు జరుగుతాయని వివరించారు. -
నాలుగు నెలల పసికందు మృతి
● వైద్యుడి నిర్లక్షమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ ● వైద్య సేవల లోపం లేదని డాక్టర్ వివరణనర్సీపట్నం: వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే తమ నాలుగు నెలల బిడ్డ మరణించాడని చింతపల్లి మండలం తాజంగి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పాంగి చంద్రమ్మ, పూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ రెండు రోజులుగా జ్వరం, వాంతులతో బాధ పడుతుండడంతో నర్సీపట్నంలోని వినాయక చిల్డ్రన్ హాస్పటల్కు తీసుకువచ్చామని వారు తెలిపారు. హాస్పటల్కు తీసుకురాగానే డాక్టర్ అయ్యప్ప ఆదేశాల మేరకు సిబ్బంది బాబుకు ఇంజక్షన్ ఇచ్చారని, టెస్ట్లు చేయించుకురమ్మని దినేష్ మెడికల్ ల్యాబ్కు పంపించారని చెప్పారు. బాబును ల్యాబ్ తీసుకువెళ్లామని, రక్తం తీస్తుండగా ఏడ్చి ఏడ్చి మృతి చెందాడని, సకాలంలో వైద్యం అందక తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డాక్టర్ అయ్యప్పను వివరణ కోరగా వ్యాధి నిర్ధారణ కోసం బాబుకు టెస్టులు చేయించమని దినేష్ మెడికల్ ల్యాబ్కు పంపించామని, వచ్చే లోగానే బాబు మరణించటం బాధాకరమని డాక్డర్ తెలిపారు. బాబు బంధువులు తనపై ఆరోపణలు చేయటం వల్ల పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
నాట్య మయూరాలు
కె.కోటపాడు/పాయకరావుపేట: హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో 4,608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు నృత్యం చేసి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. కె.కోటపాడు మండలం కింతాడ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ఉపసర్పంచ్ ముత్యాలనాయుడుల మనుమరాలు తాన్విశ్రీ , కావ్యశ్రీ నృత్య కళాశాలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. వీరికి నిర్వాహకులు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఈ ప్రదర్శనలో తమ పాప తాన్విశ్రీ పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందని తల్లిదండ్రులు ఈశ్వరరావు, మాధవి తెలిపారు. తాన్విశ్రీ సుజాతనగర్లో శోభిల్లు కళా నిలయంలో శిక్షణ పొందుతున్నట్టు వారు చెప్పారు. తమ విద్యార్థులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొనడం ఆనందంగా ఉందని కావ్య శ్రీ నృత్య కళాశాల శిక్షకురాలు ఏలూరి దీపిక తెలిపారు. పాయకరావుపేటకు చెందిన 32 మంది బాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. -
జాతర
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పర్యాటకసందర్శకులతో కిటకిటలాడుతున్న ఉమ్మడి విశాఖ నగరం, అల్లూరి జిల్లాకు పోటెత్తిన పర్యాటకులు గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు జనవరి రెండో వారం వరకూ హోటల్స్, రిసార్టులు ఫుల్ గత ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టులతో వెలుగుతున్న విశాఖ పెద్ద పల్లకిలో తిరువీధి సేవలు తిరువీధి సేవలో పాల్గొన్న అర్చకులు, భక్తులు నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల సందర్భంగా స్వామివారికి పెద్ద పల్లకిలో తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి నిత్యపూజలు, అర్చనల అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి, ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని పెద్దపల్లకిలోను, గోదాదేవి అమ్మవారిని చిన్నపల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై పన్నెండో పాశురాన్ని విన్నపం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు పాల్గొన్నారు.సాక్షి, విశాఖపట్నం : అల్లంత దూరాన ఎగసిపడే సాగర కెరటాలు ఒకవైపు.. మంచు దుప్పటి కప్పుకుని ఆహ్వానించే మన్యం అందాలు మరొకవైపు.. ఈ ప్రకృతి రమణీయతను చూసేందుకు పర్యాటక లోకం పరుగున వస్తోంది... నీలి సముద్రం పర్యాటకుల జన సంద్రాన్ని చూసి మురిసిపోతోంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి వెల్లువలా వస్తున్న సందర్శకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్ సెలవులు.. ఇయర్ ఎండింగ్ కలిసి రావడంతో గత ప్రభుత్వ సమయంలో మొదలైన ప్రాజెక్టులు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో కొత్తందాల్ని చూసేందుకు పర్యాటక లోకం విశాఖ వైపు క్యూ కట్టింది. సాగర తీరంలోని ఇసుక తిన్నెల నుంచి.. మన్యం అడవుల్లోని మంచు కొండల వరకు ఎటు చూసినా సందర్శకుల సందడే కనిపిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా ప్రకృతి ప్రేమికులు పోటెత్తడంతో.. విశాఖ జిల్లా పర్యాటక కేంద్రాలన్నీ ‘హౌస్ఫుల్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మారిపోతున్న క్యాలెండర్ పేజీలు.. మరువలేని జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు పర్యాటకుల పరుగులు.. వెరసి విశాఖలో పర్యాటక జాతర మొదలైంది. క్రిస్మస్ సెలవులు, వారాంతం, నూతన సంవత్సర వేడుకలతో కలిసి.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ పర్యాటకులతో పోటెత్తింది. సూర్యోదయపు అందాలతో మెరిసే ఆర్కే బీచ్ నుంచి, సాహసాలకు నిలయమైన రుషికొండ వరకు.. ప్రశాంతతను పంచే కై లాసగిరి నుంచి, ప్రకృతి ఒడిలో సేదతీర్చే తెన్నేటి పార్క్ వరకు ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగి, ఇటీవల అందుబాటులోకి వచ్చిన కై లాసగిరి ‘గ్లాస్ బ్రిడ్జి’ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వంతెనపై నడుస్తూ సాగరాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరకు, పాడేరు వంటి మన్యం ప్రాంతాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఇప్పుడు పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. కై లాసగిరి రోప్వే ఎక్కేందుకు కొండ దిగువన క్యూ కట్టిన సందర్శకులు25 శాతం పెరిగిన పర్యాటకం గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ తర్వాత విశాఖ చూస్తున్న అతిపెద్ద పర్యాటక సీజన్ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా అనంతగిరిలోని బొర్రా గుహలను ఒక్క ఆదివారమే ఏకంగా 20 వేల మంది సందర్శించడం విశేషం. జూ పార్క్, కై లాసగిరి వంటి చోట్ల ప్రవేశ టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఈ సందడి జనవరి రెండో వారంలో ముగిసే సంక్రాంతి సెలవుల వరకు కొనసాగే అవకాశం ఉంది. హోటళ్లు ఫుల్.. ఈ విపరీతమైన రద్దీ కారణంగా నగరంలోని స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్లు, పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ‘నో వెకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ముందుగా రిజర్వేషన్లు చేసుకోని వారు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లాలోని లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో సాధారణ గదులే కాదు, చివరికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా నిండిపోయాయంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రుషికొండ -
విగతజీవులుగా సముద్ర జీవరాశులు
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట తీరంలో ఆదివారం విషాదకర దృశ్యం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో సముద్ర జీవరాశులు విగతజీవులుగా మారి అలల తాకిడికి తీరానికి కొట్టుకువచ్చాయి. వీటిలో ప్రధానంగా కటిల్ఫిష్లతో పాటు తాబేళ్లు, ముళ్లకప్ప చేపల కళేబరాలు బీచ్ అంతటా పడి ఉండటం స్థానికులను కలచివేసింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యం, మత్స్యకారుల బోట్లు బలంగా తగిలినప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తాయని తీరప్రాంత మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. అరుదైన సముద్ర జీవులు ఇలా ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు చేరుతుండటం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. -
పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
‘ఈ ఏడాది విశాఖకు పర్యాటకుల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ 50 వేల మంది కంటే ఎక్కువ మంది విశాఖలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని మా పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, హరిత రిసార్టులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మెరుగైన ఆతిథ్యం అందించేందుకు మా సిబ్బంది అదనపు సమయం పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ -
విద్యుత్ షాక్ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం
అచ్యుతాపురం రూరల్: ఆపదలో ఉన్న వారికి అచ్యుతాపురం హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందజేస్తోంది. విద్యుత్షాక్కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన నవీన్కు ఆ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. ఆదివారం రూ.1.02 లక్షలు అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వీలుగా తమకు విరాళాలు అందజేస్తున్న వారికి సంస్థ అధ్యక్షుడు రెడ్డి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్స్ నాయుడు, రెడ్డి చిరంజీవి, రాజాన అశోక్, డాక్టర్ సుధీర్, డాక్టర్ వెంకట్, సురేష్, గొర్లి వెంకటేష్, కొల్లి నాయుడు, పిడి శివాజీ, ధర్మిరెడ్డి శ్రీనివాస్, లాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హోం మంత్రి కోసమే అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్
యలమంచిలి రూరల్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యయప్రయాసలు తగ్గించేలా అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఉన్న యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సమీపంలో ఉన్న అనకాపల్లి డివిజన్లో కలిపారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. ప్రజలెవరి నుంచీ ఎలాంటి అ భ్యంతరాలు లేకుండా ప్రక్రియ చేపట్టామని, కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం యలమంచిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్కపల్లిలో కాకుండా అడ్డురోడ్డులో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డురోడ్డు మండల కేంద్రం గానీ గ్రామ పంచాయతీ గానీ కాదన్నారు. రైల్వేస్టేషన్, న్యాయస్థానాలు, 200 పరిశ్రమలు యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న చోట కాదని కొత్త డివిజన్ను అడ్డురోడ్డులో ఏర్పాటు చేయడానికి కారణం హోం మంత్రి అనిత ను సంతృప్తి పరచడం కోసమేనన్నారు. ప్రజల మనోభావాలకు విలువ లేదా? యలమంచిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్, పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీర్మానాలు చేశాయని, పలు వర్గాల ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారని ధర్మశ్రీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు లేఖ ఇచ్చారని, తీర్మా నం చేశారని అయినా చంద్రబాబు ప్రభుత్వం ప్ర జాభీష్టాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాటకు విలువ లేదని, అనకాపల్లి ఎంపీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయ మని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యలమంచిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ధర్మ శ్రీ చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు ఎర్రయ్యదొర, అచ్యుతాపురం, రాంబిల్లి వైఎస్సార్సీపీ నాయకులు కోన బుజ్జి, గొట్టుముక్కల శ్రీనుబాబు మాట్లాడారు. రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వర్రావు, పిల్లా త్రినాథరావు, వార్డు కౌన్సిలర్లు గొర్లి వెంకట్, దూది నర్శింహమూర్తి, పిట్టా సత్తిబాబు, రాపేటి సంతోష్, ఈరిగిల గణేష్, కోరుమిల్లి శ్రీను, ద్వారపురెడ్డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభీష్టాన్ని పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం యలమంచిలి ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేస్తున్నారు? అడ్డురోడ్డు కనీసం పంచాయతీ కూడా కాదు ప్రభుత్వ నిర్ణయంపై నిప్పులు చెరిగిన కరణం ధర్మశ్రీ -
జిల్లా వీఆర్వోల సంఘం కార్యవర్గం
నూతనంగా ఎన్నికై న గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనకాపల్లి టౌన్/కె.కోటపాడు: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమిరపు శశిధర్, ఉపాధ్యక్షుడిగా పూడి సురేష్, ప్రధాన కార్యదర్శిగా ఈరెళ్ళ శివ శంకర్, అసోసియేట్ అధ్యక్షుడిగా వేవాడ చిన్నం నాయుడు, కోశాధికారిగా ఆశ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శంకర్, బి.శ్రీనివాసరావు, డి.రాజేష్, పలివెల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వరి పంటతో ట్రాక్టర్ దగ్ధం
● రూ.1.20 లక్షల నష్టం బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాదిలో వరి పంటతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన బొబ్బాది రాజు తన పొలంలో సాగు చేసిన వరి చేనును నాలుగు రోజుల కిందట కోశాడు. ఆదివారం దానిని ట్రాక్టర్లో లోడ్చేసి, పాక దగ్గరకు తీకొస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వరి పంటతో పాటు ట్రాక్టర్ తొట్టె దగ్ధమైంది. సమీపంలో ఉన్న రైతులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో బొబ్బాది రాజుకు చెందిన ఎకరా వరి పంటతో పాటు విజయరామరాజుపేటకు చెందిన కాశీనాయుడు ట్రాక్టర్ తొట్టె కాలిపోయి, రూ.1.20 లక్షల నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటంతా కాలిపోవడంతో ఏడాది తిండి గింజలు దక్కని పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతు రాజు వాపోయాడు. -
మిగిలిన మూడు మండలాలను ‘అనకాపల్లి’లోనే కొనసాగించాలి
వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త ప్రసాద్ మునగపాక: ప్రజల నిరసనకు తలొగ్గి మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని, అయితే నియోజకవర్గంలో మిగతా మూడు మండలాలను కూడా ఈ డివిజన్లోనే ఉంచాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా నక్కపల్లి కొత్త డివిజన్లో కలిపేలా జీవో జారీ చేయడంతో రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి పలు ఉద్యమాలు చేపట్టిన ఫలితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన మూడు మండలాలను కూడా అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించేలా చూడాలని కోరారు. -
నాగులాపల్లి సొసైటీకి ఉత్తమ అవార్డు
అవార్డు అందుకుంటున్న పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి భాస్కరరావు, సీఈవో స్వామి మునగపాక: నాగులాపల్లి పీఏసీఎస్ (సొసైటీ) జాతీయ సహకార అభివృద్ధి సంస్థ అందించే ఉత్తమ ప్రతిభ అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆదివారం సంఘ పర్సన్ ఇన్చార్జి యల్లపు వెంకట భాస్కరరావు, సీఈవో మళ్ల స్వామి పురస్కారం అందుకున్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సహకార ఉత్సవాల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. రైతులకు రుణ పంపిణీ, సంక్షేమ పథకాల అమలుతోపాటు సభ్య రైతులకు మెరుగైన సేవలు తదితర అంశాల్లో రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న నాగులాపల్లి సొసైటీని ఉత్తమ సొసైటీగా గుర్తించి అవార్డుతోపాటు రూ.25 వేలను అందజేశారు. రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ జి.వీరాంజనేయులు, సహకార సంఘాల అడిషనల్ రిజిస్ట్రార్ ఆనంద్బాబు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు ఎన్.రఘురామ్, రాష్ట్ర సహకార బ్యాంక్ ఎండీ ఆర్వీ రామకృష్ణారావు, ఎన్సీబీసీ రీజనల్ మేనేజర్ గోస్వా చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని భాస్కరరావు, స్వామిలు తెలిపారు. -
పీహెచ్సీ ఆవరణలో ఆటస్థలం వద్దు
నాతవరం : స్థానిక పీహెచ్సీ ఆవరణలో ఆట స్థలం ఏర్పాటు చేయరాదని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, వైస్ ఎంపీపీ పైల సునీల్, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులు మండల ప్రత్యేకాధికారి మంగవేణికి ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న నియంత వ్యవహార శైలిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం కొంతసేపు నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాతవరంలో పీహెచ్సీ ఏర్పాటుకు ఇదే గ్రామానికి చెందిన దాత 1960లో స్థలం ఉచితంగా ఇచ్చారన్నారు. ఆ స్థలంలో అప్పట్లో నిర్మించిన భవనం శిథిలం కావడంతో గత వైఎస్సార్సీపీ హయాంలో సుమారుగా రూ.2 కోట్లతో నూతన భవనం నిర్మించామన్నారు. ఈ పీహెచ్సీని 30 పడకల స్థాయికి పెంచేందుకు గతంలో ప్రతిపాదనలు చేశామన్నారు. ఇటీవల ప్రభుత్వం నాతవరం గ్రామంలో ఆటలు అడుకునేందుకు గ్రౌండ్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ గ్రౌండ్ నిర్మాణం స్థానిక కూటమి నేతల ప్రోత్సాహంతో పీహెచ్సీ స్థలంలో పనులు చేపట్టారన్నారు. పీహెచ్సీ స్థలంలో ఆటస్థలం నిర్మాణం చేస్తే పీహెచ్సీకి అప్గ్రేడ్కు స్థల సమస్య వస్తుందన్నారు. గ్రౌండ్ నిర్మాణం కోసం స్థలం నాతవరం గ్రామంలో నాలుగు చోట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని అక్కడ గ్రౌండ్ నిర్మిస్తే అందరికి బాగుంటుందన్నారు. నాతవరం గ్రామంలో గ్రౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లుగా గానీ పీహెచ్సీ స్థలంలో ఆట స్థలం నిర్మాణానికి సంబంధించి పంచాయతీ పాలకవర్గానికి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేకాధికారి జి, మంగవేణిి మాట్లాడుతూ మీరు చెప్పిన విషయం పరిశీలిస్తానన్నారు. కార్యక్రమంలో గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి గొర్లె వరహాలబాబు, వైఎస్సార్సీపీ నాతవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు శెట్టి లచ్చబాబు, వైఎస్సార్సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు వైఎస్సార్సీపీ మండల మహిళా ఉపాధ్యక్షురాలు రాధ, నాతవరం మాజీ ఉప సర్పంచ్ రాంబాబు, సోషల్ మీడియా అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ, పార్టీ నాయకుడు అపిరెడ్డి మహేష్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమాలపై కక్ష సాధింపు చర్యలు తగవు
అనకాపల్లి : ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా పీడీయాక్ట్ కేసు నమోదు చేసి, జైల్లో పెట్టడం అన్యాయమని, బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల సహకారంలో ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు ఎన్.భద్రం అన్నారు. స్థానిక మొయిన్రోడ్డు పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో విషపూరిత బల్క్ డ్రగ్ పార్కుకు భూములు కోల్పోతున్న రైతులు జరుపుతున్న ఉద్యమానికి అండగా నిలిచారని నెపంతో అనకాపల్లి జిల్లా సీపీఎం నాయకుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజును అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనకాపల్లి సీపీఐ జోనల్ కార్యదర్శి తాకాశి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
సీపీఎం నేతపై పీడీ యాక్ట్ రద్దు చేయాలి
నర్సీపట్నం: ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, అప్పలరాజు భార్య లక్ష్మి శనివారం నర్సీపట్నంలో కలెక్టర్ విజయ్కృష్ణన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రౌడీలు, స్మగ్లర్లు, దేశద్రోహులుపై పెట్టాల్సిన కేసులను అప్పలరాజుపై పెట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రౌడీలు బయట హల్చల్ చేస్తున్నారన్నారు. పీడీ యాక్ట్ పెట్టడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే పీడీ యాక్ట్ రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
చినగోగాడలో భూ వివాద ం
చీడికాడ : ఒకే తల్లికి పుట్టిన వారికి వారసత్వంగా సంక్రమించిన భూమిలో సమాన హక్కులు ఎందుకుండవంటూ మండలంలోని చినగోగాడకు చెందిన బోనుగు మల్లేశ్వరి, నారాయణ దంపతులు రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రశ్నించి తమ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బొనుగు వరహాలమ్మకు ఏడుగురు సంతానం వారిలో ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా నారాయణ అనే మరో వ్యక్తిని వరహాలమ్మ దత్తత తీసుకుంది. నారాయణమ్మ పేరిట సర్వే నెంబర్ 10–6డిలో 57 సెంట్లు భూమి ఉంది. వరహాలమ్మ పెంపుడు కుమారుడు నారాయణకు ఈ 57 సెంట్లు భూమిలో ఏమీ రాయలేదు. మిగిలిన ఐదుగురు కుమార్తైలెన పెదిరెడ్ల సత్యవతి, దొండా శ్రీదేవి, కర్రి సాయిలక్ష్మి, పెదిరెడ్ల సంధ్యారాణి, గనిశెట్టి కృష్ణవేణిలతో పాటు ఇంకో కుమారుడైన బోనుగు శ్రీనివాస్లకు ఒక్కొక్కరికి 0.11.4 సెంట్లు చొప్పున భూమిని పంచి అప్పగించారు. అయితే పెంపుడు కొడుకు నారాయణకు వరహాలమ్మ కుమార్తె పెదిరెడ్ల సత్యవతి కుమార్తె అయిన మల్లేశ్వరినిచ్చి వివాహం జరిపారు. సత్యవతి తనకు తల్లిద్వారా సంక్రమించిన 0.11.4 సెంట్లు భూమిని తన కుమార్తె అయిన మల్లేశ్వరికి రాసింది. ఈ మేరకు మల్లేశ్వరికి సుమారు 12 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 10–6డి పేరిట 0.11 సెంట్లకు ఖాతా నెంబర్ 269తో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. అయితే జగనన్న భూ సర్వేలో మల్లేశ్వరికి తెలియకుండా 10–6డి గల 0.55.20 సెంట్ల భూమిని వరహాలమ్మ కుమారుడు శ్రీనివాస్ మృతి చెందడంతో భార్య లక్ష్మి పేరిట దిగువ స్థాయి రివెన్యూ సిబ్బంది రికార్డులో నమోదు చేసినట్టు తెలుసుకున్న మల్లేశ్వరి ఈ ఏడాది ఆగస్టులో పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీనిని పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది ఆ సర్వే నెంబరులో గల మొత్తం భూమి శ్రీనివాస భార్య లక్ష్మికే చెందుతుందని రిపోర్టు ఇచ్చారు. దీంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వివాదాస్పద భూమిలో భూమిలో ప్రహరీ నిర్మాణానికి ఐరన్ బీమ్లు వేయడంతో పాటు దానిపై ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించగా మల్లేశ్వరి అడ్డుకుంది. దీంతో లక్ష్మి వర్గీయులు తహసీల్దార్ లింకన్ను ఆశ్రయించడంతో ఆయన పోలీసు బందోబస్తుతో ప్రహరీ నిర్మాణానికి సహకరించాలని ఎస్ఐకు లేఖ ద్వారా కోరారు. ఈ మేరకు శనివారం ఎస్ఐ సతీష్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. అయితే మల్లేశ్వరి సర్వే నెంబర్ 10–6డిలో గల తన తల్లి ద్వారా సంక్రమించిన 0.11 సెంట్లు భూమికి సంబంధించి టైటిల్ డీడ్– భూ పాసుపుస్తకాన్ని చూపించి తనకు వాటాగా వచ్చిన భూమి అప్పగించాలని ఆర్ఐ కృష్ణ, వీఆర్వో శ్రీనును డిమాండ్ చేసింది. దీంతో అవాకై ్కన రెవెన్యూ అధికారులు పరిశీలించి వస్తామని చెప్పి మల్వేశ్వరి వద్ద గల పాస్ పుస్తకం నకలు వివరాలు సేకరించి వెనుదిరిగారు. ఎస్ఐ సతీష్ తహసీల్దార్ లింకన్తో ఫోన్లో మాట్లాడి పూర్తి స్థాయి పరిశీలించాలని కోరి అక్కడ నుంచి సిబ్బందితో వెనుదిరిగారు. -
ఒకే కాన్పులో ఆవుకు రెండు పెయ్యిలు జననం
తెనుగుపూడి శివారు రొంగలిపేటలో ఒకే కాన్పులో జన్మించిన రెండు పెయ్యిలుతో ఆవు దేవరాపల్లి : తెనుగుపూడి శివారు రొంగలిపేటకు చెందిన రైతు సింగంపల్లి బంగారయ్య ఆవుకు ఒకే ఈతలో రెండు ఆవు పెయ్యిలు శుక్రవారం జన్మించాయి. రెండు పెయ్యిలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నాయని రైతు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై పశువైద్యాధికారి కె.మంజుషారాణి వద్ద ప్రస్తావించగా కృత్రిమ గర్భధారణ సమయంలో ఒక అండాశయాన్ని ఒక వీర్యం కలవడం ద్వారా ఒక పెయ్యి జన్మించడం సాధారణంగా జరుగుతుందని, ఒకేసారి రెండు అండాశయాలు విడుదలై రెండు వీర్యాలతో కలవడం ద్వారా రెండు పెయ్యిలు జన్మించే అవకాశం ఉంటుందన్నారు. ఇలా ఒకే కాన్పులో రెండు పెయ్యిలు జన్మించడం 7 శాతం మేర మాత్రమే అరుదుగా జరుగుతాయన్నారు. -
స్లో..లార్!
పీఎం సూర్యఘర్కు అంతంతమాత్రంగా స్పందనసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పీఎం సూర్యఘర్కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సబ్సిడీ, రుణ సదుపాయంతో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఏపీఈపీడీసీఎల్ ఆశించిన ప్రగతిని సాధించలేకపోతోంది. మరోవైపు.. ఏదో సాధించేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. సోలార్ రూఫ్టాప్లని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలంటూ డిస్కమ్లపై పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి.. సోలార్పైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 12 శాతం లక్ష్యాన్ని కూడా చేరలేక..! ఈపీడీసీఎల్ పరిధిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారు 3 లక్షల మంది వరకు ఉండగా.. సోలార్ ప్లాంట్లను కేవలం 36 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ అమర్చుకున్నారు. కనీసం 12 శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ పథకం ప్రకారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 36 వేల గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విశాఖ పరిధిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. 200 యూనిట్లు పై చిలుకు విద్యుత్ వినియోగదారులు 1.83 లక్షల మంది విశాఖలో ఉండగా 13,500 కిలోవాట్లు సామర్థ్యంతో 3,750 మంది మాత్రమే అమర్చుకున్నారు. అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మందికి 8,712 కిలోవాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 15 మందికి 48 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు మాత్రమే అమర్చారు. దీంతో అనుకున్న స్పందన లేకపోవడంతో కచ్చితంగా పరిధిలోకి వచ్చే వారందరినీ.. పీఎం సూర్యఘర్ పథకం లోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఈపీడీసీఎల్ ఉద్యోగులు బేజారవుతున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాల కంటే సూర్యఘర్ ఒత్తిడే ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామనీ.. ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన తర్వాత.. పాడైతే.. దాన్ని బాగుచేసేందుకు అధిక భారం పడుతుందనీ.. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదనీ.. అయినా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సర్కిల్ పరిధిలో 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగదారులు1.83 లక్షల మంది విశాఖలో సోలార్ ప్లాంట్లు అమర్చుకున్నది3,750 (13,500 కిలోవాట్లు) అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మంది (8,712 కిలోవాట్లు) అల్లూరి సర్కిల్ పరిధిలో15 మంది (48 కిలోవాట్లు)కరెంట్ అమ్మితే మీకే లాభం అని చెప్పండహో..! అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఎఫ్పీసీసీఏ చార్జీలంటూ బిల్లు చూస్తే గుండె గుభేల్మనిపించేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసన్న ఆయన ఓవైపు విద్యుత్ బిల్లుల్ని అమాంతం పెంచేసి.. మరోవైపు.. సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరించేందుకు యత్నిస్తున్నారు. సోలార్ రూఫ్టాప్ పెట్టుకుంటే బిల్లు కట్టకపోవడంతో పాటు కరెంటు అమ్ముకొని లాభాల్ని పొందొచ్చంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెలకు 360 నుంచి 450 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్ను ఏపీఈపీడీసీఎల్కు విక్రయించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు వివరించాలంటూ ఉద్యోగుల్ని ఆదేశించారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్లవారీగా టార్గెట్స్ విధించారు. నిర్దేశించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తుండటంతో.. పీఎం సూర్యఘర్ అధికారుల మెడపై కత్తిగా మారింది. టార్గెట్ పూర్తి చేయలేదని కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల చిర్రుబుర్రు తలనొప్పిగా మారిందంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పటివరకు డిస్కమ్ పరిధిలో 36 వేల మంది ఏర్పాటు -
విద్యార్థులపై కోతి దాడి
రావికమతం: స్థానిక హైస్కూల్లోకి కోతి చొరబడి ఇద్దరు విద్యార్థులను గాయపరిచింది . స్థానిక మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న హైస్కూలోకి శనివారం ఓ కోతి ప్రవేశించి వేపాడ భాగ్యశ్రీ ,తాడి దుర్గా తేజపై దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం హరిబాబు ,ఉపాధ్యాయులు వేపాడ సత్యనారాయణ,ధనంజయ్ తదతరులు ఎంపీడీవో మహేష్ కు,తహసీల్దార్ కార్యాలయంలో,ఎంఈవోకు వినతిపత్రాలు అందజేశారు. -
బర్త్ వెయిటింగ్ హాల్కు శంకుస్థాపన
నర్సీపట్నం : నర్సీప ట్నం ఏరియా ఆస్పత్రి అవరణలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 35 లక్షలతో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2.10 కోట్లతో ఆసుపత్రికి కార్పొరేట్ హంగులు, బర్త్ వెయిటింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తుని, పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడకు వస్తున్నారన్నారు. గర్భిణులు డెలివరీ డేట్కు రెండు రోజుల ముందే ఆసుపత్రికి వచ్చి, వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశామన్నారు. కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ వారు సీఎస్ఆర్ గ్రాంటు నుంచి నిధులు ఇచ్చారన్నారు. -
ఎంఎస్ఎంఈ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్పై చర్యలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పూడి రెవెన్యూ పరిధిలో గల ఎంఎస్ఎంఈ కళాశాలలో విద్యార్థులు, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్కు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జీఎం రాజశేఖర్ రంగంలోకి దిగి, శనివారం కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులతో పాటు అధికారులతో చర్చలు జరిపారు. ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసిన విద్యార్థుల వద్ద వివరాలు తెలుసుకొన్నారు. ఐదుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మరో విభాగాధిపతి వెంకటేశ్వరరావును ప్రిన్సిపాల్గా నియమించాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. ప్రిన్సిపాల్ను మారుస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులు శాంతించారు.సోమవారం నుంచి యథావిధిగా తరగతులు నిర్వహించాలని యాజమాన్యం ఆదేశించింది. ఏఐఎస్ఎఫ్ ఆందోళన... ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అయితే యాజమాన్యం ఏఐఎస్ఎఫ్ సభ్యులను లోనికి అనుమతించలేదు.ఇదే సమయంలో జీఎం రాజశేఖర్ రావడంతో చర్చలు జరిపారు. ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జి,కార్యదర్శి ఫణీంద్రకుమార్,జిల్లా నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
నర్సీపట్నం: వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు అప్పగించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. విద్య, వైద్యంను ప్రజలకు అందించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని చెప్పారు. విశాఖలో జరిగిన ప్రధాన మంత్రి కార్యక్రమం, పరిశ్రమల సమ్మెట్ల పేరిట రూ.వేల కోట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథాగా ఖర్చు చేసిందన్నారు. దీని వల్ల ఒకరికై నా ఉపాధి కలిగిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ డబ్బుతో పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చని చెప్పారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పటికీ ఒకరే ముందుకువచ్చారని, ఒక డాక్టర్ వేశారని, మేము కాదని కిమ్స్ యాజమాన్యం ప్రకటించడం చంద్రబాబు ప్రభుత్వంపై వారుకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ అరెస్ట్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. బల్క్డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన సీసీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించటం అన్యాయమన్నారు. జిల్లాలో తీరప్రాంతంలోని భూములని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు.ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజయ్యపేట ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో బల్క్డ్రగ్ పార్కును పెట్టబోమని సీఎం చంద్రబాబునాయుడు నోటి మాటగా చెప్పారని, అలాకాకుండా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఆ భూములను మిట్టల్ కంపెనీకి అప్పజెప్పేందుకు ప్రభుత్వం నాటకం ఆడుతోందని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అడిగర్ల రాజు, సాపిరెడ్డి నారాయణమూర్తి, గౌరీ, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
మునగపాక/నక్కపల్లి : వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించనున్నారు. మరో పక్క జిల్లాలో కొత్తరెవెన్యూ డివిజన్ ఏర్పాటులో మార్పులు జరిగాయి. ముందుగా ప్రకటించినట్టు నక్కపల్లి కేంద్రంగా కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 27వ తేదీన మునగపాక మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి డివిజన్లో కలుపుతున్నట్లు ప్రభుత్వం జీవో నంబర్ 1491 విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో భాగంగా నక్కపల్లి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు విలీనం చేస్తున్నట్లు జీవోలో పొందుపరిచారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతుల సహకారంతో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రైతులు, ప్రజలతో కలిసి ధర్నాలు, మానవహారాలు నిర్వహించింది. నక్కపల్లి డివిజన్లో కాకుండా అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగించే చూడాలని కోరుతూ మునగపాకలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీతో కలిసి వారం రోజుల పాటు దీక్షలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలనుంచి వస్తున్న అభ్యంతరాలకనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముందుగా ప్రకటించినట్టు నక్కపల్లి కేంద్రంగా కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నక్కపల్లి రెవెన్యూ డివిజన్కు మోకాలడ్డినట్లు సమాచారం.అడ్డురోడ్డుకేంద్రంగా రెవెన్యూ డివిజన్ఏర్పాటు చేస్తూ అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి మండలాలతోపాటు, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, మండలాలను ఈ డివిజన్లో చేర్చనున్నారు. మునగపాక మండలాన్ని మాత్రం అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని నిర్ణయించారు.నర్సీపట్నం డివిజన్లో ఉన్న చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్లో కలిపేందుకు నిర్ణయించారు. భిన్నాభిప్రాయాలు ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లి కేంద్రంగానే కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలంనుంచి నక్కపల్లి తాలూకా కేంద్రంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అంతా నక్కపల్లి తాలూకా కార్యాలయాలనుంచే జరుగుతుందనిపలువురు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, నక్కపల్లి తాలూకా కేంద్రాలుగా ఉండేవని,తర్వాత మండలాలుగా ఏర్పాటయ్యాయని అంటున్నారు. నక్కపల్లిని కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా డివిజన్ ఏలా ఏర్పాటు చేస్తారన్న పశ్నలు తలెత్తుతున్నాయి.కనీసం పంచాయతీకూడా కానీ అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం తగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఉమ్మలాడ జంక్షన్ వద్ద శనివారం ఓ వ్యాన్ దగ్ధమైంది. ఖాళీ సిగరెట్ ప్యాకెట్ల లోడ్తో కోల్కతా నుంచి కోయంబత్తూరు వెళుతున్న వ్యాన్ ఉమ్మలాడ జంక్షన్కు వచ్చే సరికి ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో మంటలు వ్యాపించాయి. అదే రూట్లో ప్రయాణిస్తున్న వారు ఈ విషయాన్ని డ్రైవర్కు తెలపడంతో వ్యాన్ను నిలిపివేశాడు. మంటలు తీవ్రంగా వ్యాపించి వాహనం ముందుభాగంతో పాటు ఖాళీ సిగరెట్ పెట్టలు దగ్ధమయ్యాయయి. ఈ ప్రమాదం వల్ల రూ.10 లక్షల నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరావు తెలిపారు. -
రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డుకు చంద్రగ్రహణం
నక్కపల్లి: రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డు నిర్మాణానికి చంద్రగ్రహణం పట్టింది. నక్కపల్లి , ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు అనుసంధానం చేస్తూ పలు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు గత వైఎస్సార్సీసీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.8 కోట్ల వ్యయంతో రేబాక నుంచి సీతం పాలెం, తిరుపతి పాలెం మీదుగా అల్లుమియ్యపాలెం నుంచి కోటవురట్ల, నర్సీపట్నం వెళ్లేందుకు సుమారు 11.6 కిలో మీటర్ల మేర తారు రోడ్డు నిర్మించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మిస్తే రేబాక , అల్లుమియ్యపాలెం మీదుగా కోటవురట్ల, నర్సీపట్నం చేరుకునేందుకు సుమారు 20 కిలోమీటర్లదూరం తగ్గడంతోపాటు, సమయం ఆదా అవుతుంది. గత ఏడాది ఫిబ్రవరి16న అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కగ్రామానికి కూడా సరైన రోడ్డు సదుపాయం కల్పించకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను తమ ప్రభుత్వంలోనే మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలోనే నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయంటూ ఫొటోలు, వీడియోలు తీయించి సోషల్మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికే దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగు కల్వర్టులు నిర్మించారు. తర్వాత మధ్యలో ఆగిపోయాయి. 10 నెలలుగా బ్రేక్ రేబాక నుంచి సీతంపాలెం వరకు 3 కిలోమీటర్ల సిమెంట్ వెట్మిక్స్ వేసి రోలింగ్ చేసి వదిలేశారు. సుమారు 10 నెలలనుంచి ఈ పనులను అలాగే వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డుపై బీటీ వేయకపోవడం వల్ల రాళ్లు లేచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తిచేయాల్సి ఉంది. కానీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రేబాక, తిరుపతిపాలెం, అల్లుమియ్యపాలెం గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న మామిడి, జీడితోటల నుంచి సేకరించి పండ్లను ఈమార్గంలోనే రవాణా చేయాలి. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతారయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. రహదారి కష్టాలు తీర్చాలి రోడ్డు పనులు నిలిచిపోయి 10 నెలలు అయింది. రాళ్లు పైకి లేచిపోతున్నాయి. ఈ రోడ్డుపూర్తయితే నక్కపల్లి, కోటవురట్ల మధ్య రహదారి సదుపాయం మెరుగు పడుతుంది. గిరిజనుల రహదారి కష్టాలు తొలగిపోతాయి. కాంట్రాక్టర్ను అడిగితే సంక్రాంతి తర్వాత తిరిగి మొదలు పెడతామంటున్నారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుపూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. 27ఏడిఆర్06 – సాదిరెడ్డి శ్రీను, సర్పంచ్,రేబాక వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గిరిజన గ్రామాలకు తారు రోడ్డు సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా నాటి సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లి రూ.8 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. అప్పట్లోనే పనులు సగం పూర్తయ్యాయి. తాజాగా ఈ రోడ్డుకు తమ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందంటూ టీడీపీ నాయకులు సోషల్మీడియాలో ప్రచారం చేసుకున్నప్పటికీ పనులు పూర్తిచేయలేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు పూర్తిచేయించాలి. – వీసం రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి -
అంగన్వాడీల యాప్సోపాలు
అంగన్వాడీ కార్యకర్తలు యాప్లతో ఆపసోపాలు పడుతున్నారు. యాప్లను నిర్వహించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్ల్లో లబ్ధిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, అనకాపల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో కార్యకర్తలు, లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 1,908 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటికి చంద్రబాబు సర్కార్ 1,409 (5జీ)స్మార్ట్ మొబైల్స్ను అందజేసింది. పంపిణీ చేసిన 10 రోజులకే సగానికిపైగా ఫోన్లు పనిచేయడం మానేశాయి. గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయసున్న పిల్లల తల్లులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపును (ఫేషియల్ రికగ్నేషన్)ను, రోజు వారీ వివరాలను బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్లలో నమోదు చేసిన తర్వాతే సరకులు అందించాలి. సర్వర్ సమస్య కారణంగా ఆయా యాప్లు తరచూ మొరాయిస్తున్నాయి. ఒక్కోసారి రెండు, మూడు గంటల పాటు పనిచేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలల పాటు కాలయాపన చేసి..ఇటీవల 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. అవి మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. రెండు వారాలకే సర్వర్ సమస్యతో మొబైల్లో ఉన్న యాప్లు మొరాయిస్తున్నాయి. కొత్తగా ఇచ్చిన ఈ 5జీ మొబైల్స్కు ఒక వైపు నెట్వర్కు సమస్య..మరో వైపు యాప్ వెర్షన్ సమస్య వంటి సాంకేతిక సమస్యలతో అప్లోడింగ్ ఆలస్యమవుతోంది. దీంతో సూపర్ వైజర్లు, ఉన్నతాధికారుల నుంచి అంగన్వాడీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు కంటే యాప్ల పనే ఎక్కువగా ఉండడంపై అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళితే వెర్షన్ అప్టుడేట్ అయిన తరువాత ఆ సమస్య ఉండదంటున్నారు. పని పెరిగి.. బోధన తగ్గి.. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహార వినియోగం, పిల్లలు, బాలింతలు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతి రోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్–ఎ రికార్డు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శకుల రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్ హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర అంశాలను యాప్లలో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్లలో నమోదు ప్రక్రియ కష్టంగా మారింది. గతంలో లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదు కాకపోయినా రిజిస్టర్లో సంతకం తీసుకుని, సరుకులు అందజేసేవారు. ఇప్పుడు ముఖ ఆధారిత గుర్తింపును తప్పనిసరి చేశారు. సర్వర్ సమస్యల కారణంగా యాప్లు మొరాయిస్తుండడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పనితోనే కార్యకర్తలకు రోజులో ఎక్కువ సమయం గడిచిపోతుడడంతో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల చదువు అటకెక్కుతోంది. అంగన్వాడీ సూపర్ వైజర్లు, ఉన్నతాధికారులు అధికారులు ఈ వివరాలు నమోదు చేయడంలో ఆలస్యమైతే చాలు..వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తారు. ఫోన్ మీద ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారు. దీంతో పిల్లలకు చదువు చెప్పడంపై దృష్టి పెట్టకుండా వీటి నమోదుపైనే అధికంగా దృష్టి సారిస్తున్నారు. వస్తువులున్నా.. లేనట్లు చూపుతూ.. యాప్ పనిచేయకపోవడంతో బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్లలో వివరాలు సక్రమగా నమోదు కావడం లేదు. గర్భిణులు ఆస్పత్రిలో పేషియల్ అంటెడెన్స్ వేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక గర్భిణి పేరు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపు నమోదు కాకపోతే..తరువాత నెలకు వారికిచ్చే పౌష్టికాహారం స్టాక్ రాదు. ఈ యాప్ పనిచేయకపోవడంతో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ‘బాలసంజీవని’ యాప్లో రోజూవారీ గర్భిణులు, బాలింతలు, పిల్లలు హాజరు నమోదు చేసుకోవాలి. లబ్ధిదారులు, పిల్లలు ఫేస్ రికగ్నేషన్ అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా ఆ రోజు మెనూ కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సరుకులు రాక, పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా అప్టుడేట్ చేయాల్సి ఉంటుంది. ‘పోషణ ట్రాకర్ యాప్’లో అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలు, సేవలు, లబ్ధిదారుల నిర్వహణను పర్యవేక్షణ, పోషకాహార పంపిణీ, పెరుగుదల, ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయాలి. బాల సంజీవని యాప్లో పోషకాహారం వివరాలు నమోదు చేసి, లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదుకు ప్రయత్నిస్తే.. ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అని చూపుతూ మొరాయిస్తోంది. కొన్ని సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సరకులు నిల్వ ఉన్నా.. లేవని చూపుతోంది. ఇలా వచ్చినప్పుడు వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి వీలుపడదు. సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తికావడం లేదు. కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న ఆధారిత గుర్తింపు వివరాలు.. వారికి సరకులు అందించేటప్పుడు తీసుకునే ఫేషియల్ రికగ్నేషన్ సరిపోలడం లేదు. పోషణ్ ట్రాకర్ యాప్లో ఈకేవైసీ నమోదులోనూ జాప్యమవుతోంది. తరచూ ‘ఎరర్ర్’ అని చూపుతూ నిలిచిపోతోంది. జిల్లాలో ఇలా... అంగన్వాడీ కేంద్రాలు 1,908 మెయిన్ కేంద్రాలు 1,725 మినీ కేంద్రాలు 183 అంగన్వాడీ వర్కర్లు 1,882 మంది హెల్పర్లు 1,665 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులు 59,890 మంది అందజేసిన స్మార్ట్ మొబైల్స్ 1,409 లబ్ధిదారుల ముఖ హాజరు నమోదులో ఇబ్బందులు సర్వర్ సమస్యతో తరుచూ మొరాయింపు మరోపక్క రికార్డులతో సతమతం రోజు వారీ వివరాలు అప్లోడ్ చేయాలంటూ అధికారుల నుంచి ఒత్తిడి పౌష్టికాహారం పంపిణీలో సాంకేతిక సమస్యలు మున్నాళ్ల ముచ్చటగా మారిన 5జీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన పది రోజులకే సగానికి పైగా పనిచేయని ఫోన్లు -
కొత్తకోట ఏఎస్ఐకు రాష్ట్ర స్థాయి పురస్కారం
అవార్డు అందుకుంటున్న ఏఎస్ఐ అప్పారావు రావికమతం: మండలంలో కొత్తకోట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ అప్పారావు కమెండేషన్ డిస్క్ –2025, బ్రాంజ్ డిస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు జిల్లాలో 14 మందిని ఎంపిక చేస్తూ డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొత్తకోట ఏఎస్ఐ అప్పారావు తన 36 ఏళ్ల సర్వీస్లో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేయడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అమరావతిలో డీజీపీ నుంచి పురస్కారం అందుకున్నారు. 1989లో ఏఆర్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. 2005లో సివిల్ కానిస్టేబుల్, 2010లో హెడ్ కానిస్పేబుల్గా, 2014లో ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, జి.మాడుగుల, సీలేరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది అభినందించారు. -
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు
రావికమతం : టి.అర్జాపురం శివారు చిలకవానిపాలెం ఇటికుల బట్టీ దగ్గరలో బి.ఎన్.రోడ్డు మార్గంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా వమ్మంగి, ధర్మవరం గ్రామాలకు చెందిన షేక్ మీరా సాహెబ్, వాసులు ఇరువురు కాకినాడ నుంచి పాడేరు వెళుతుండగా వి.మాడుగుల మండలం కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన కోన జగ్గారావు, పొంగలిపాక గ్రామానికి చెందిన శెట్టి నాయుడు ఇరువురు కలిసి నర్సీపట్నం వైపు వెళ్లుతున్నారు. చిలకవానిపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ మీరా సాహెబ్కు చేతికి, వాసుకు తలకు బలమైన గాయాలయ్యాయి. కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని క్షతగాత్రులకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు అందలేదని కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఆర్ఏఆర్ఎస్.... సర్కారు కేర్లెస్
చెరకు, చిరుధాన్యాల రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా గత ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ఆర్ఏఆర్ఎస్లో పీఎంఎఫ్ఎంఈ (ప్రైమ్మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్ప్రైజెస్) పథకం కింద రూ.3.7 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిగా నిధులు విడుదలైనా..నేటి వరకూ అందులో మెషినరీకి టెండర్ ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదు. శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, అనకాపల్లి : చెరకుపై ఆధారపడి జీవించే రైతులు..ఏజెన్సీ ప్రాంతం, ఆ ప్రాంత సమీపంలో ఉన్న రైతులు పండించే మిల్లెట్స్, పనస పంటల ద్వారా అధిక లాభాలార్జించే విధంగా ఆర్ఏఆర్ఎస్లో ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ప్రోత్సాహంతో పీఎంఎఫ్ఎంఈ (ప్రైమ్మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్ప్రైజెస్) పథకంలో భాగంగా రూ.3.7 కోట్లతో ఈ మోడల్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఎగుమతి చేసేందుకు, రైతులకు ప్రయోజనం చేకూర్చి, అధిక లాభార్జించేందుకు ఆర్ఏఆర్ఎస్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. 2023లో అప్పటిఅనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎన్జీరంగా అగ్రి యూనివర్శిటీ వీసీ విష్ణువర్దన్రెడ్డి ఈ ఇంక్యుబేషన్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే ఇంక్యుబేషన్ భవనం నిర్మాణం పూర్తయింది. అలాగే ప్రారంభించడం కూడా జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిగా నిధులు విడుదలైనా..ఆనాటి నుంచి నేటి వరకూ కనీసం అందులో మెషినరీకు టెండర్ ప్రక్రియను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేదు. నిధులున్నా నిర్మాణం జరగకుండా మూలన పడేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆ ప్రాజెక్టును కాలయాపన చేస్తూ వచ్చారు. ఇంక్యుబేషన్ కేంద్రంలో యంత్రాలు కొనుగోలు చేసి..ఒక థర్డ్పార్టీ ఏజెన్సీకి మార్కెటింగ్ ప్రక్రియను అప్పగిస్తే ఇప్పటికే రైతులకు మేలు చేకూరి ఉండేది. చెరకు, చిరుధాన్యాలు, పనస పండించే రైతులకు అండగా నిలవడంతో పాటు అధిక లాభాలు చేకూరుతాయి. ప్రధానంగా చెరకు ఆధారిత రైతులందరికీ ఇదో మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. వీరితో పాటు పనస, మిల్లెట్స్ పండించే గిరిజన రైతులు కూడా అధిక లాభాలు ఆర్జించవచ్చు.. ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తయితే రైతులే అతితక్కువ ధరతో ఉత్త్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్ఏఆర్ఎస్ ద్వారానే ఎగుమతి చేసి లాభాలు ఆర్జించవచ్చు. రైతులకు లాభసాటిగా.. ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేసే సౌకర్యాలను ఎప్పటికప్పుడు రైతులకు వివరించడం, చిన్నపాటి సంస్థలకు వాటి వ్యాపార సరళిలో మెలుకువలు చెబుతారు. బెల్లం ఉత్పత్తులు, బెల్లం పొడి, జొన్న బిస్కెట్లు, ఓట్స్ బిస్కెట్లు, జెల్లీలు, చాక్లెట్లు, పల్లి చెక్కీలు, పనస జామ్, పనస విత్తన పిండి, పనస పట్టు వంటి ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతులు చేస్తారు. ●వీటిలో చెరకు ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఘన బెల్లం, పొడి బెల్లం, బెల్లం విలువ ఆధారిత ఉత్పత్తులు, బెల్లం జొన్న బిస్కెట్లు, బెల్లం ఓట్సు బిస్కెట్లు, బెల్లం జెల్లీలు, బెల్లం చాక్లెట్లు, బెల్లం పల్లి చెక్కీలను తయారు చేస్తారు. ●చిరు ధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ నుంచి చిరు ధాన్యాల పిండి, చిరు ధాన్యాల మాల్ట్, చిరు ధాన్యాల పోషక బార్, మల్టీ మిల్లెట్ దోశ మిక్స్, మల్టీ మిల్లెట్ రొట్టె, పఫ్డ్ చిరుధాన్యాలు, చిరుధాన్యాల అటుకులు తయారు చేస్తారు. ●పనస ప్రాసెసింగ్ యూనిట్ నుంచి పనస జామ్, పనస విత్తన పిండి, ఉడికించడానికి సిద్ధంగా ఉన్న లేత పనసపొట్టు తయారు చేస్తారు. నిధులున్నా మూలన పడేశారు.. రైతులకు ప్రయోజనం చేకూరాలనే ముందు చూపుతో ఆర్ఏఆర్ఎస్కు రూ.3.7కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ను తీసుకొచ్చాం. మా హయాంలో భవనం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాం. నాలుగు సార్లు కేంద్ర బృందం వచ్చింది. అప్పుడు గ్రాంట్ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ వారు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే నిధులు మంజూరు చేస్తారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. బెల్లం, చిరు ధాన్యాలు, పనస ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతులు చేయడం, ఒక వేల రైతులే మార్కెటింగ్ చేసుకుంటారంటే వారికే తక్కువ ధరకే ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. ఇది అతి పెద్ద మోడల్ ప్రాజెక్టు. ఎంఎస్ఎంఈతో అనుసంధానం చేసిన ప్రాజెక్టు ఇది. ఏడాదిన్నరగా నిధులున్నా..ప్రభుత్వం మూలన పడేసింది. అందులో మెషనరీకి టెండర్ కూడా వేయకపోవడం విచారకరం. – భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లిచెరకు, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తుల తయారీ..మూడు రకాల చెరకు, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తులను తయారు చేసి వాటిని నేరుగా రైతులకు ఇవ్వడం, లేదా ఎగుమతి చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నాణ్యమైన బెల్లం తయారీతో పాటు బెల్లం ఆధారిత ఉత్పత్తులు, చిరు ధాన్యాలు, పనస ఉత్పత్తులను ఇక్కడ నుంచే దేశం నలుమూలల ఎగమతులు చేయవచ్చు. దీంతో చెరకు, చిరుధాన్యాలు, పనస పండించే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అధిక లాభాల ఆర్జించేందుకు దోహదపడనున్నాయి. నాణ్యమైన బెల్లం తయారీకి బెల్లం పొయ్యి నమూనా, రూ.3.5 కోట్లతో చెరకు, చిరు ధాన్యాలు, పనసల ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే..వాటిలో రూ.1.37 కోట్లతో చెరకు ప్రాసెసింగ్ లైన్లు, రూ.66 లక్షలతో చిరు ధాన్యాల ప్రోసెసింగ్ లైన్లు, రూ.21 లక్షల పనస ప్రోసెసింగ్ లైన్లు, రూ.25 లక్షలతో ఆహార ప్రయోగశాల ఏర్పాటు చేశారు. -
హైవేపై టిప్పర్ దగ్ధం
యలమంచిలి రూరల్ : షార్ట్ సర్క్యూట్తో టిప్పర్ లారీ దగ్ధమైన ఘటన యలమంచిలి మండలం పులపర్తి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీ39యూవై0459 నంబరు గల టిప్పర్ లారీ అన్నవరంలో బొగ్గు అన్లోడ్ చెసి తిరిగి విశాఖపట్నం వెళ్తుండగా పులపర్తి వద్దకు చేరుకున్న సమయంలో ఇంజన్ నుంచి పొగలు, మంటలు వస్తున్నట్టు గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపి కిందకు దిగిపోయాడు. కొద్దిసేపటికే వాహనమంతా మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో సమాచారం అందుకున్న యలమంచిలి విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది అగ్నిమాపక శకటంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. హైవేపై రాకపోకలు సాగించే వాహనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక కేంద్రం అధికారి రాంబాబు తెలిపారు. -
ఏడు ద్విచక్రవాహన యజమానులకు జరిమానా
యలమంచిలి రూరల్ : మైనర్లకు వాహనాలిస్తే వాహన యజమానులదే బాధ్యత అని,చట్టప్రకారం మైనర్లకు వాహనాలివ్వడం నేరమని యలమంచిలి ట్రాఫిక్ ఎస్సై బి రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి యలమంచిలి పట్టణంలో పలుచోట్ల విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పలువురు యువకులకు పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు మైనర్లు బైకులు నడుతూ పట్టుబడ్డారు. ఆ వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ.5035 చొప్పున, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.1035 చొప్పున జరిమానాలు విధించారు. ర్యాష్ డ్రైవింగ్,హెల్మెట్ ధరించకుండా బైకులు నడపడం వల్ల వచ్చే అనర్థాలను యువకులకు వివరించారు. రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. వేగం కన్నా ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యమని చెప్పారు. -
28 నుంచి నాటకోత్సవాలు
అనకాపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలు స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు బీఎస్ఎంకే జోగినాయుడు తెలిపారు. క్లబ్ ఆవరణలో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతరించిపోతున్న నాటికలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో నాటికలకు అనకాపల్లి జిల్లా పుట్టినిల్లన్నారు. హైదరాబాద్ మహతి క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 28 సాయంత్రం 6 గంటలకు గుంటూరు వారిచే ‘సమయం’నాటిక ప్రదర్శన జరుగుతుందని, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభిస్తారన్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ మల్లీశ్వరి ఆర్ట్స్ వారిచే ‘నువ్వో సగం–నేనో సగం’నాటిక, 29 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారిచే ‘సీ్త్ర మాత్రే నమః’నాటిక, రాత్రి 8 గంటలకు కాకినాడ, బీవీకే క్రియేషన్స్ వారిచే ‘కన్నీటికి విలువెంత’, ఈనెల 30 సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారిచే ‘మాయాజాలం’, రాత్రి 8 గంటలకు పెందుర్తి నటరాజ డ్రమెటిక్ అసోసియేషన్ వారిచే ‘నీళ్లు–నీళ్లు’నాటికల ప్రదర్శనలు ఉంటాయన్నారు. నాటిక ప్రదర్శనల ప్రతిరోజు లక్కీ డిప్ డ్రా ద్వారా ప్రేక్షకులకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, క్లబ్ సభ్యులు డి.రామకోటేశ్వరరావు, కె.బి.ఎం.వెంకటరావు, కాండ్రేగుల వాసు, ఆడారి రమణ, జి.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్గా కృష్ణవేణి
నర్సీపట్నం : నేషనల్ బాక్సింగ్ క్రీడాకారిణి కె.కృష్ణవేణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్గా ఉద్యోగం సాధించింది. బాక్సర్గా 14కు ఫైగా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ చెస్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే 15కు పైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో 10కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది. నర్సీపట్నం ప్రభుత్వ జెడ్పీ బాలికల హైస్కూల్లో చదువుకుని ఆమె బాక్సింగ్ నేర్చుకుంది. తండ్రి శ్రీను కరాటే క్రీడాకారుడు కావడంతో ఆమెను బాక్సింగ్ క్రీడాకారిణిగా రాణించేందుకు ప్రోత్సహించారు. విద్యార్థి దశ నుంచి నింజాస్ అకాడమీ కోచ్ అబ్బు వద్ద బాక్సింగ్లో తర్ఫీదు పొందింది. కోచ్గా ఉద్యోగం రావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అకాడమీ మెంబర్లు హర్షం వ్యక్తం చేశారు. -
రేపు మెగా జాబ్మేళా
అనకాపల్లి: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఈనెల 27న అడ్డురోడ్డు గ్రామం ఎస్.వి.ఎస్ డిగ్రీ కళాశాలలో 17 కంపెనీలతో మెగా జాబ్మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వరకు చదువుకొని, 18 నుంచి 40 సంవత్సరముల కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరైన నిరుద్యోగులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్వ్యూలకు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని, ఆధార్కార్డు, ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లు జెరాక్స్ను తీసుకుని రావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు సెల్.8247505171 నంబర్లను సంప్రదించాలని కోరారు.నేడు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు మహారాణిపేట : జెడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఆమె చాంబర్ సమీపంలోని వి.సి.హాలులో 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా ఉదయం 11 నుంచి 2 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశాలకు హాజరుకావాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నర్సీపట్నం : మాకవరపాలెం మండలం, పైడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బూరుగుపాలెం గ్రామానికి చెందిన వానపల్లి లోవరాజు (23) రాచపల్లి అన్రాక్ పయనీర్ రిఫైనరీ కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా బైక్లు ఢీ కొనడంతో లోవరాజు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. అంబులెన్స్లో విశాఖకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చేతికి అందించి వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి ఎస్ఐ దామోదర్నాయుడు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీ కొండచిలువ హతం
వాకపల్లి మెట్ట సమీపంలో స్థానికుల చేతిలో హతమైన భారీ కొండ చిలువ దేవరాపల్లి: మండలంలోని వాకపల్లి మెట్ట సమీపంలో గురువారం భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. స్థానిక పంట పొలాల్లో సంచరిస్తూ రైతుల కంట పడింది. సుమారు 10 అడుగుల మేర పొడవున్న కొండ చిలువను చూసిన రైతులు ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కొంత సేపటి తర్వాత తేరుకున్న రైతులు పశువులకు ప్రమాదం పొంచి ఉండడంతో అతి కష్టం మీద కర్రలతో కొట్టి హతమార్చారు. గ్రామంలో తొలిసారిగా భారీ కొండ చిలువ రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా వీక్షించారు. -
వెలుగురేఖ సమైక్య
అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు! ‘మాది రాజాం. మా అమ్మ ఐస్క్రీం పార్లర్లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా. – భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నాను. – రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ’సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం. ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది. – సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం ప్రతి అడుగులో తోడున్నారు! రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ME)లో జూనియర్ ఇంజనీర్గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ. –దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కరపత్రం నా జీవితాన్ని మార్చింది! బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ గారి నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్గా స్థిరపడ్డా. – షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ పేద విద్యార్థులకు బాసట దత్తత తీసుకుని ప్రోత్సాహం రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం కొనసాగిస్తున్న సేవాయజ్ఞం వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం -
ఇంటి స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య కోట్లాట
రావికమతం: మండలంలోని కొత్తకోటలో ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య జరిగిన కోట్లాటలో ముగ్గురు గాయపడ్డారు. కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు కొత్తకోటకు చెందిన అడ్డూరి భూలేక, కలం రాజమోహన్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 218–6లో గల 206 గజాల ఇంటి స్థలాన్ని శ్యామల దగ్గర 2016లో కొనుగోలు చేశామని రాజమోహన్ తెలిపారు. 218 సర్వే నంబర్లో 1947లో తమ పూర్వీకులు 780 గజాలు కొనుగోలు చేశారని ఆనంద్ పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. రాజమోహన్ కోర్డుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని గురువారం వివాదాస్పద స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అడ్డూరి అనంద్, తండ్రి భూలేక అభ్యంతరం తెలిపారు. దీంతో కలం రాజమోహన్, అతడి తల్లి లక్ష్మి, అడ్డూరి భులేక, ఆనంద్ ఘర్షణ పడ్డారు. చేతికి దొరికిన వస్తువులతో పరస్పరం దాడులు చేసుకుని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఆనంద్, భులేక, కలం రాజమోహన్ల తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారికి కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చిక్సిత చేయించి అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గాయపడ్డ కలం రాజమోహన్, అడ్డూరి భులేక, అడ్డూరి ఆనంద్ -
భగవద్గీత కంఠస్థ పోటీల్లో జిల్లాకు బహుమతులు
అక్షయ ఈర్ల జ్యోతిపి.హన్విక సుమలత అనకాపల్లి: విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రస్థాయి భగవద్గీత 12వ అధ్యాయం కంఠస్థ పోటీలు ఈనెల 25న విజయవాడలో జరిగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన ఒకటో విభాగంలో పి.హన్విక (యలమంచిలి) ప్రథమ బహుమతి, నాలుగవ విభాగంలో పి. హేమ అక్షయ తృతీయ బహుమతి(యలమంచిలి), మహిళా విభాగంలో ఈర్ల జ్యోతి (కొత్తూరు, అనకాపల్లి) ద్వితీయ బహుమతి, ఎం. సుమలత (అనకాపల్లి) ప్రోత్సాహక బహుమతి గెలిపొందినట్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ్ శ్రీకాళహస్తి జిల్లా అధ్యక్షుడు డి.డి.నాయుడు, కోశాధికారి గోకవరపు రమేష్ గురువారం తెలిపారు. -
నేటి నుంచి అమల్లోకి కొత్త రైల్వే చార్జీలు
తాటిచెట్లపాలెం: భారతీయ రైల్వే ప్రకటించిన సవరించిన ప్రయాణ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు కొత్త చార్జీల వివరాలను వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై స్వల్ప భారం పడనుండగా, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, సామాన్యులకు మాత్రం రైల్వే శాఖ ఊరటనిచ్చింది. సబర్బన్/సీజన్ టికెట్లకు మినహాయింపు: సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి, మంత్లీ సీజన్ టికెట్ కలిగిన వారికి చార్జీలలో ఎటువంటి పెంపు లేదు. స్వల్ప దూర ప్రయాణికులకు ఊరట: ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి పాత చార్జీలే వర్తిస్తాయి. వీరిపై ఎటువంటి అదనపు భారం ఉండదు. ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
ఘనంగా పగల్పత్తు ఉత్సవాలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకిలో వేంజేపచేశారు. తెల్లవారుజామున ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో తిరువీధి వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 10వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. -
సెస్ చెల్లించని నెయ్యి లారీ నిలిపివేత
బలిఘట్టం మార్కెట్ యార్డు చెక్పోస్టు వద్ద నెయ్యి లారీని నిలిపివేసిన మార్కెట్ కమిటి సిబ్బంది నర్సీపట్నం : వ్యవసాయ మార్కెట్ కమిటీ సెస్ కట్టకుండా తరలిస్తున్న నెయ్యి లారీని బలిఘట్టం చెక్పోస్టు వద్ద మార్కెట్ యార్డు సిబ్బంది పట్టుకున్నారు. మార్కెట్ కమిటీకి సెస్ చెల్లించకుండా వ్యాపారస్తులపై ప్రత్యేక దృష్టిసారించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఇటీవల సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఇటీవల మార్కెట్ కమిటీ సిబ్బంది ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి నర్సీపట్నం నుంచి నెయ్యితో వెళ్తున్న లారీని బలిఘట్టం చెక్పోస్టు వద్ద సిబ్బంది పట్టుకున్నారు. సిబ్బంది లారీ వే బిల్లులను పరిశీలించారు. సుమారు రూ.కోటి 27 లక్షల నెయ్యిని తరలిస్తున్నారు. దీని ప్రకారం మార్కెట్ కమిటీకి సెస్ రూపంలో రూ.లక్షా 27 వేలు వ్యాపారి చెల్లించాల్సి ఉంది. సెస్ చెల్లించిన తరువాతే లారీని విడిచి పెడతామని మార్కెట్ కమిటీ సిబ్బంది వ్యాపారికి సూచించారు. వ్యాపారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో చెక్పోస్టు వద్దే లారీని నిలిపివేశారు. -
అనుమానమే ఉసురు తీసింది...
యలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలో ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన మాయ స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు.మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని,నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
● ములకలాపల్లిలో అగ్నిప్రమాదం ● రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం ● రూ.5 లక్షల నగదు, 8 తులాల బంగారు అభరణాలు అగ్నికి ఆహుతి ● కట్టుబట్టలతో బాధితులు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు ఆహుతి దేవరాపల్లి : మండలంలోని ములకలాపల్లిలో ఓ ఇంటిలో గురువారం చోటుచేసుకున్న విద్యుత్ షార్టు సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ ఈశ్వరమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల నగదు, 8 తులాల మేర బంగారు అభరణాలు, వెండి ఆభరణాలు, సర్టిఫికెట్లు, ఇంటిలోని ఇతర సామగ్రితో సహా అగ్నికి ఆహుతయ్యాయి. వెరసి సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్ ఈశ్వరమ్మ కుమారుడు అప్పాసాహెబ్ ఇటీవల మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. క్రిస్మస్ సెలవు కావడంతో అప్పాసాహెబ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అదే ఇంటిలో ఉంటున్న తన బావ, అక్క కలిసి గురువారం మాంసం దుకాణం వద్దకు వెళ్లగా, అప్పాసాహెబ్ తన పిల్లలతో కలిసి చోడవరం వెళ్లారు. దీంతో అతని తల్లి ఇంటికి తాళం వేసి పొలం పనికి వెళ్లిపోయింది. ఎవరూ లేని సమయంలో ఈశ్వరమ్మ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులతో పాటు చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకొని చూడగా అప్పటికే ఇళ్లంతా కాలి బూడిదయ్యింది. తిండిగింజలతో సహా బూడిద... ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంక్లో కొంత బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 2 లక్షలు, తన మేనల్లుడు రఫీ వ్యాపారం నిమిత్తం అప్పుగా తెచ్చిన మరో రూ. 2 లక్షలు, తన తల్లి దాచుకున్న రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, వెండి అభరణాలు కాలిబూడిదయ్యాయని బాధిత ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు భోరున విలపించారు. వీటితో పాటు సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు, గృహోపకరణాలు సహా తిండి గింజలు ఇతర సామగ్రి పూర్తిగా కలిబూడిద కావడంతో కట్టుబట్టలతో వారంతా రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... తన కుమారుడికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో తన కష్టాలు గట్టెక్కాయని ఆనందపడుతున్న తరుణంలో ఇల్లు, ఇంట్లో సామగ్రి అంతా కాలి బూడిదవ్వడంతో బాధిత ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. -
క్రషింగ్ చేపట్టకపోతే ఆందోళన ఉధృతం
చోడవరం: ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్గేటు వద్ద గురువారం రైతు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం, సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఫ్యాక్టరీని కాపాడతామని, చెరకు రైతులకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చోడవరం, మాడుగుల కూటమి ఎమ్మెల్యేలు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు రైతులను పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయంగా తీసురాలేకపోయారని వారు ధ్వజమెత్తారు. తమను గెలిపిస్తే ఫ్యాక్టరీని ఆధునికీకరించి, చెరకు రైతులకు టన్నుకి రూ. 4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులు, రైతు కూలీలతో ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేపోయి, రైతులను మోసంచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఫ్యాక్టరీకి ప్రభుత్వ సాయం తెచ్చి రైతుల చెరకు బకాయిలు వెంటనే తీర్చాలని, అదే విధంగా ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని మూసివేసే ఆలోచన చేస్తే రైతులు, కార్మికులు అంతా కలిసి ఐక్యంగా ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. చెరకు రైతుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం చెప్పాలని, మూసివేసే ఆలోచన విరమించుకుని క్రషింగ్ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు లేక ఆకలితో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, ఏడువాక సత్యారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, మూడెడ్ల శంకర్రావు, సమితి ప్రతినిధులు దండుపాటి తాతారావు, దొడ్డి అప్పారావు, జెర్రిపోతుల నానాజీ, సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, సోమిరెడ్డి నాయుడు, ప్రజా సంఘం ప్రతినిధి వరప్రసాద్, వ్యవసాయ కూలీ సంఘం ప్రతినిధి కోన మోహన్రావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పాము కాటుతో మహిళ మృతి
బుచ్చెయ్యపేట: నీలకంఠాపురం గ్రామానికి చెందిన మహిళ పాము కాటుతో మృతి చెందింది. గ్రామానికి చెందిన మలమంచిలి ధనలక్ష్మి(25) మంగళవారం చోడవరం మండలం దామునాపల్లిలో పుట్టింటికి వెళ్లింది. పొలంలో వరి కుప్పలు పెడుతున్న తల్లిదండ్రులకు పొలం గట్లపై నుంచి నడిచి భోజనాలు తీసుకెళ్తుండగా ఆమె కాలిపై పాము కాటు వేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త శ్యామ్ సంతోష్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
1200 లీటర్ల సారా పులుపు ధ్వంసం
నాతవరం: అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం మండలంలో పెడిమికొండ అటవీ ప్రాంతంలో సారా తయారు చేసే బట్టీలపై ఆకస్మికంగా దాడులు జరిపారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల పులుపును ధ్వంసం చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ పెడిమి కొండ అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధం చేసిన పులుపును ధ్వంసం చేశామని, నిర్వాహకులు పరారయ్యారని తెలిపారు. సారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేసి, మిగిలిన సామాగ్రిని స్టేషన్కు తరలించామన్నారు. -
అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత
బుచ్చెయ్యపేట: ఆర్.శివరాంపురం ఫారెస్ట్ పరిధిలో నీలగిరి చెట్లు అక్రమంగా నరికివేతకు గురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో కలప తరలిపోవడంలో ఫారెస్ట్ అధికారుల ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన వారే కలప తరలిస్తున్నారని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ రేంజర్ సతీష్కు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోరుకొండ రవికుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఫారెస్ట్ బీట్ వాచర్ సత్యారావును వివరణ కోరగా అటవీ ప్రాంతంలో గ్రేడింగ్ చేసిన పనులు తప్ప, అమ్మకాలు చేయలేదన్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు తెలిపామన్నారు. -
ప్రేమ, త్యాగం, దయకు ప్రతీక క్రిస్మస్
అనకాపల్లి: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొంటారని, ప్రేమ, దయ, శాంతి మార్గాన్ని ఏసుప్రభువు చూపారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీసెల్ అధ్యక్షుడు పెతకంశెట్టి జోసఫ్ ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించి, కేక్ కట్ చేసి అమర్నాథ్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి పార్టీ శ్రేణులకు, పాస్టర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలు, మతాలు సమానంగా జీవిస్తున్నాయన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఏసుక్రీస్తు పశువుల పాకలో అర్ధరాత్రి జన్మించారని, శాంతి, కరుణను ఉద్భోధించారని అన్నారు. అనంతరం పాస్టర్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ బి.వరాహ సత్యవతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రమేష్, 80వ వార్డు ఇన్ఛార్జ్ కె.ఎం.నాయుడు, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సన్ని జెమ్స్, పాస్టర్లు తిమోతి, ప్రకాష్, బెనర్జీ, సీనియర్ నాయకులు దొండా రాంబాబు, కాండ్రేగుల విష్ణుమూర్తి, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు పాల్గొన్నారు. -
వేగవంతంగా విద్యా రుణాలు
తుమ్మపాల: తల్లిదండ్రుల సిబిల్ స్కోర్ చూడకుండా వేగంగా విద్యా రుణాలు మంజూరు చెయ్యాలని కలెక్టర్ విజయ కృష్ణన్ బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ), బ్యాంకు రుణాలపై జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) 2వ త్రైమాసిక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు రైతులకు, సూర్య ఘర్ సోలార్ రూఫ్టాప్కు, పరిశ్రమలకు వ్యవసాయ, డెయిరీ, పౌల్ట్రీ ఉపాధి రంగాలకు స్వయం సహాయక బృందాలకు త్వరతగతిన రుణాలు మంజూరు చేసి లక్ష్యాలకు మించి రుణాలు అందించాలన్నారు. విద్యా రుణాలకు, యువతకు స్వయం ఉపాధి పథకాల మంజూరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకు అధికారులకు తెలిపారు. జిల్లాలో బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాలు మంజూరు చెయ్యాలని తెలిపారు. నిరర్థక బ్యాంకు ఖాతాలలో గల నగదుకు సంబంధికులను గుర్తించి అందజేయాలని తెలిపారు. పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్ధిక చేయూతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఈ–క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించాలని తెలిపారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.సత్యనారాయణ గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలను, రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్ పాయిఐట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ జితేంద్ర శర్మ, ఆర్బీఐ ఎల్డీవో నవీన్ కుమార్, ఏపీజీబీ రీజనల్ మేనేజర్ సతీష్, డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మోహన్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిపై టీడీపీ నేతల కన్ను
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం చినరాచపల్లి వద్ద ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి యథేచ్ఛగా దుక్కులు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణదారులకు పట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న ఊటగెడ్డ రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు బుధవారం ట్రాక్టర్లతో చదును చేశారు. పట్టపగలు యంత్రాలతో పనులు చేశారు. గతంలో నీరు–చెట్టు పనుల్లో భాగంగా రిజర్వాయర్లోని పూడిక మట్టిని తొలగించారు. అయితే ఈ రిజర్వాయర్లోకి ఎగువభాగం నుంచి నీరు వచ్చే గెడ్డలను పూడిక మట్టితో కప్పి వేసి ఆక్రమించేందుకు యత్నించారు. ఆ సమయంలో పత్రికల్లో వార్తలు రావడంతో ఈ భూమిలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చరిక బోర్డు ఉండగానే తాజాగా ట్రాక్టర్తో ఆక్రమణదారులు దుక్కులు చేసే పనులు చేపట్టారు. ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటరమణను సంప్రదించగా రిజర్వాయర్ భూమి ఆక్రమణకు సంబంధించి రామన్నపాలెం మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు (టీడీపీ), అడిగర్ల శ్రీనివాసరావు (టీడీపీ)లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే దుక్కులు చేస్తున్న ఒక ట్రాక్టర్, అక్కడే ఉన్న ఒక బైకును సీజ్ చేసి పోలీసులకు అప్పగించామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనా కేసులు తప్పవని హెచ్చరించారు. -
అతి వేగంతో అనర్థం..
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ విషాదకర ఘటన యలమంచిలి పట్టణం అయ్యప్పస్వామి ఆలయానికి సమీపంలో ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. ఇక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ముగ్గురు యువకులతో అతివేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. యలమంచిలి మండలం రేగుపాలెంకు చెందిన రాజాన సాయి తేజ(23), రాజాన గౌతమ్(17), పక్కుర్తి కార్తీక్ (17) బుధవారం సాయంత్రం తమ గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో యలమంచిలి పట్టణానికి వచ్చారు. తిరిగి రేగుపాలెం వెళ్తుండగా మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ వెళ్లి ఆటోను ఢీకొట్టారు. బైకు నడుపుతున్న రాజాన సాయితేజతో పాటు మిగిలిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలంలోనే సాయితేజ తల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ఆటోలో ఉన్న జి.యేసు, కె.భారతి, ఎ.నూకరాజు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులందరికీ ఆటోల్లో యలమంచిలి సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురు యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు వైద్యాధికారి నిహారిక తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ రాజాన సాయితేజ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మిగిలిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు. -
మట్టి పన్ను కట్టం.. ఏం చేసుకుంటారో చేసుకోండి!
గొలుగొండ: ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బందికి మట్టి పన్ను కట్టం..ఏం చేసుకుంటారో చేసుకోండి.. పేదలకు ప్రభుత్వం న్యాయం చేయకుండా మట్టిపై ఎలా పన్ను కట్టగలమని చీడిగుమ్మల గ్రామంలో సుమారుగా 100 మంది వరకు రైతులు, కూలీలు, ట్రాక్టర్ యజమానులు ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. చీడిగ్ముమల గ్రామంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ యజమానులు, ఇటుక బట్టీ కూలీలు ట్రాక్టర్లపై పొలంతో మట్టి తీసుకు వస్తున్న సమయలో ఏఎంఆర్ సంస్ద ప్రతినిధులు ట్రాక్టర్కు రూ.405 పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. పునాదులు, ఇటుక తయారీకి పొలంలో మట్టి తీసుకు వెళుతున్నామని, దీనిపై ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించలేమని వారు బదులిచ్చారు. అయితే డబ్బులు కడితేనే తప్ప ట్రాక్టర్లు వెళ్లడానికి వీలు లేదని సంస్ధ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో పోలవరం, చీడిగుమ్మల, ఎరకంపేట, అయ్యన్నపాలెం, ఎర్రవరం, ఏఎల్పురంకు చెందిన ట్రాక్టర్ యజమానులంతా ఐక్యంగా ఆందోళనకు దిగారు. మట్టి తరలించడం ఆపడం కుదరదన్నారు. చిన్న ఇల్లు కట్టుకొనే సమయంలో ఈ పన్ను కడితే కనీపం పునాదికి రూ.60 వేల వరకు ఖర్చవుతుందని, ఇక పేదవారు ఇల్లు ఎలా కట్టుకోగలరని అన్నారు. రైతులు, ఇటుక కూలీల పక్షాన చీడిగుమ్మల గ్రామ టీడీపీ అధ్యక్షుడు కామిరెడ్డి గోవింద్ నిలబడి ఏఎంఆర్ సంస్థ వల్ల పేదలకు ఎంతో అన్యాయం జరుగుతోందన్నారు. ఈఏఎంఆర్ సంస్థ ప్రతి గ్రామంలో సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఈ మట్టిపై పన్ను వసూళ్లు చేయడం పట్ల ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఈ దందాను తక్షణం అపాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల అవసరం కోసం మట్టి తరలించడానికి మండల తహసీల్దార్ నుంచి అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని ఇన్చార్జి జియాలజిస్టు వెంకటరావు తెలిపారు. ఈ వివాదం పెద్దది కావడంతో ఆయన ఈ గ్రామాన్ని సందర్శించారు. రైతులు మట్టి తీస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాకే మట్టి తరలించుకోవాలని, ప్రస్తుతం మట్టి తరలింపు ఆపాలని సూచించారు. -
ఎస్పీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు
అనకాపల్లి: లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు శుభ పరిణామమని, క్రిస్టియన్ సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, అపారమైన సహనం, క్షమాగుణం వంటి విలువలను క్రీస్తు మానవాళికి అందించారని, వాటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఆర్ఐ మన్మథరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?
దేవరాపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజుపై నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని స్థానిక సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రం దేవరాపల్లిలో అప్పలరాజుపై తప్పుడు కేసులను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేత డి.వెంకన్న మాట్లాడుతూ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు మూడు నెలల వ్యవధిలో ఏడుసార్లు అప్పలరాజు అరెస్టు అయ్యారనే నెపంతో తప్పుడు సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉద్యమానికి మద్దతు పలికిన సీపీఎం నేతపై ఈ కేసులు నమోదు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు బల్క్డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొని మత్స్యకారులకు తీవ్ర ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. సిహెచ్.దేముడు, సిహెచ్.రాంబాబు, పి.దేముడు, కె.శ్రీను, కె.సుధాకర్, ఆసిబోయిన నాయుడు, సిహెచ్.లక్ష్మి తదితర సీపీఎం శ్రేణులు పాల్గొన్నారు. అప్పలరాజు కుటుంబ సభ్యులకు పరామర్శ ఎస్.రాయవరం: సీపీఎం నాయకుడు అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసి అడవివరం సెంట్రల్ జైల్లో పెట్టడం దారుణమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అన్నారు. ధర్మవరం అగ్రహారంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను బుధవారం సీపీఎం కేంద్ర కమిటీ బృందం పరామర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గణిశెట్టి సత్యనారాయణ తదితరులు కుటుంబ సభ్యులను కలిశారు. అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం అడ్డురోడ్డు జంక్షన్లో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, చమనబాల రాజేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే విడుదల చేయాలి అనకాపల్లి: ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుపై పీడీ యాక్టు రద్దుచేసి, తక్షణమే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్క్ అనుమతులు రద్దు చేయాలని ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించిన ిఅప్పలరాజుపై పీడీయాక్టు కేసులు బనాయించి, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం అప్రజాస్వామికమని, ప్రభుత్వం తక్షణమే కేసును -
వికసిత్ భారత్కుసుంకపూరు యువకుడు
కోటవురట్ల: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్డీ)–2026కు మండలంలోని సుంకపూరుకు చెందిన పోలిరెడ్డి శ్యామ్కుమార్ ఎంపికయ్యారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో గుంటూరులో నిర్వహించిన పోటీలో పోలిరెడ్డి శ్యామ్కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయిలో 2026 జనవరి 12న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వీబీవైఎల్డీకి శ్యామ్కుమార్ ఎంపికయ్యారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో ‘ప్రజాస్వామ్యం–ప్రభుత్వంలో యువత పాత్ర’ అనే అంశంపై తన ఆలోచనలను పంచుకోనున్నట్టు శ్యామ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం శ్యామ్కుమార్ జాగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్నారు. తనకు ఈ అవకాశం దక్కడం ఎంతో గర్వంగా ఉందని శ్యామ్కుమార్ తెలిపారు. -
కరుణ కురిసిన రాత్రి..
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 202530న రామగిరి ప్రదక్షిణ మునగపాక: మండలంలోని రామగిరి కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ నెల 30న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ధనుర్మాసంలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా గిరి ప్రదక్షిణకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30న సాయంత్రం 6 గంటలకు ఆలయ మెట్ల వద్ద నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ జగన్నాథపురం, నరేంద్రపురం, చెర్లోపాలెం గ్రామాల మీదుగా సుమారు 6 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుందన్నారు. కేథలిక్ దేవాలయంలో ఏసు జననందృశ్యాన్ని తిలకిస్తున్న క్రిస్టియన్ సోదరులుసెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో అలంకరణ -
రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల
రెండు నియోజకవర్గాలనే కాక రెండు జిల్లాలను కలిపే ముఖ్యమైన రహదారి అది.. రూ.24 కోట్ల ఆర్అండ్బీ నిధులతో అడ్డురోడ్డు నుంచి రామచంద్రపురం వరకు నిర్మిస్తున్నారు. అంత వ్యయం చేస్తున్న రోడ్డు నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పనులు జరిగే తీరు గమనిస్తున్న ప్రజలు పెదవి విరుస్తున్నారు. కూటమి పార్టీలకు ఇష్టుడైన కాంట్రాక్టర్కు అప్పచెప్పడం వల్లే నిధులు దుర్వినియోగమవుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లి/ఎస్.రాయవరం: అడ్డురోడు– నర్సీపట్నం ఆర్అండ్బీ మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పనుల ప్రారంభంలోనే డొల్లతనం బయటపడుతోంది. సుమారు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది. పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలను కలిపే రహదారి మాత్రమే కాక ఈ మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా దారి తీస్తుంది. ప్రతి రోజు వేలాదిమంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎనిమిది నెలల ముందు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ఇటీవలే ప్రారంభమయ్యాయి. రూ.24 కోట్ల ఆర్ అండ్ బీ నిధులతో నిర్మించే ఈ రోడ్డు పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి కూటమి పార్టీలకు బాగా కావాల్సిన వాడు కావడంతో పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. అడిగే నాథులేరి? రూ.24 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న రోడ్డు నాలుగు కాలాల పాటు మన్నాలంటే నాణ్యత పాటించాలి. క్రషర్ నుంచి తెచ్చిన నల్లపిక్కను నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. పాతరోడ్డుపై ఉన్న చెత్తను, మట్టిని పూర్తిగా శుభ్రం చేసి దానిపై నల్లపిక్క, బూడిద, లైట్గా తారు కలిపి రోడ్డుపై తడుపుతూ బాగా రోలింగ్ చేయాలి. మరోసారి రోలింగ్ చేసి తదుపరి తారు రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. బెర్మ్ల వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లపిక్క, బూడిద తారు కలిపి పటిష్టంగా రోలింగ్ చేయాలి. బెర్మ్లు పటిష్టంగా లేకపోతే రోడ్డు కోతకు గురై క్రమేపీ మొత్తం పాడయిపోతుంది. గతంలో అయితే నల్లపిక్కలో బంకమన్ను కలిపి రోడ్డుపై వేసి బాగా రోలింగ్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అలా ఎవరూ చేయడం లేదు. పాత రోడ్డును అలాగే వదిలేసి దానిపై బూడిద కలిపిన పిక్కను వేసి తూతూమంత్రంగా రోలింగ్ చేస్తున్నారు. రోలింగ్ సమయంలో నీటితో తడపాలి. కానీ ఎక్కడా నీటితో తడిపిన దాఖలాలు కనిపించడం లేదు. వేసిన పిక్క వేస్తున్నట్లుగానే పైకి లేచిపోతోంది. నీటితో తడిపి రోలింగ్ చేసిన తర్వాత తారురోడ్డు వేస్తే నాణ్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇలా వేయడం వల్ల తారు రోడ్డు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే చోట ఇంజినీరింగ్ సిబ్బంది కనిపించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల రోడ్డు పనులు నాణ్యతాలోపంతో జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్లే మార్గం అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి ముఖద్వారమైన అడ్డురోడ్డు నుంచి నిత్యం వేలాది మంది వందలాది వాహనాల్లో నర్సీపట్నం రాకపోకలు సాగిస్తుంటారు. అంత ముఖ్యమైన రోడ్డయినా అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే మాదిరిగా గునిపూడి నుంచి పెంటకోట వెళ్లు రోడ్డు వేయడం వల్ల అది నెల రోజులకే పెచ్చులు ఊడిపోయిందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయించి చేతులు దులుపేసుకుంటే సరిపోదని, నిబంధనలు, నాణ్యత పాటిస్తున్నారో లేదో హోం మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కట్టుకున్నవాడే కాలయముడు
యలమంచిలి రూరల్: ఒక ఊరూ.. ఒక జిల్లా కాదు..రాష్ట్రాల సరిహద్దు దాటి, తాళికట్టిన బంధాన్ని కాదని, నమ్మినవాడి వెంట వచ్చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి 8 ఏళ్ల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలికి వచ్చారు. తానే సర్వస్వమని నమ్మిన ఇల్లాలి ఊపిరిని అనుమాన భూతంతో లాగేశాడు. తమ ఇద్దరికి పుట్టిన నాలుగు నెలల ఆడబిడ్డ ముఖం కూడా చూడకుండా, అతి కిరాతంగా భార్యను కడతేర్చాడు. యలమంచిలి పట్టణం ధర్మవరం సీపీ పేటలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలివి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత కబీర్ నగర్ జిల్లా నందలూరు గ్రామానికి చెందిన రాకేష్, మాయ దంపతులు 8 ఏళ్ల కిందట యలమంచిలి పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చారు.అంతకుముందే మాయకు వివామైంది. తన మొదటి భర్త ద్వారా 12 ఏళ్లు వయస్సున్న కాజల్ అనే కుమార్తె కూడా వుంది. కుమార్తె పుట్టిన తరువాత ఆమెకు ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేశ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాకేశ్ మాయను వివాహం చేసుకుని 8 ఏళ్ల కిందట ఉపాధి కోసం యలమంచిలి పట్టణానికి వచ్చారు. రాకేశ్, మాయ దంపతులు యలమంచిలిలో కాపురం వుంటూ ధర్మవరం సీపీ పేటలో ఒక తుక్కు (స్క్రాప్) దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాకేష్, మాయ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆ చిన్నారికి నాలుగు నెలలు. గత కొంతకాలంగా భార్య మాయ తమ సొంతూరుకు చెందిన ఒక యువకుడితో ఫోన్ ద్వారా తరచూ మాట్లాడుతున్నట్టు రాకేష్ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లొచ్చిన రాకేష్ తన భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించి ఆవేశంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య మాటా, మాటా పెరిగింది. ఈ సమయంలో నియంత్రణ కోల్పోయిన రాకేష్, ఆవేశంలో అతి కర్కశకంగా ప్రవర్తించాడు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి, అక్కడున్న స్క్రూ డ్రైవర్తో ఛాతికి, మెడకు మధ్య భాగాన పొడిచేశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆటోలో స్థానిక కమలా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. యలమంచిలి సీహెచ్సీకి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి కుటుంబ సభ్యులు వచ్చే వరకూ మృతదేహం పాడవ్వకుండా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు సీఐ ధనుంజయరావు చెప్పారు. తన భార్యను తానే హత్య చేశానని రాకేష్ అంగీకరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటనలో నాలుగు నెలల చిన్నారి అనాథగా మారింది. స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాపను సాయంత్రం వరకు సంరక్షించారు. పోలీసులు పసిబిడ్డను అనకాపల్లి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్కు ఆ పాపను అప్పగించారు. -
ప్రతిభ గల దివ్యాంగులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు శిక్షణ
అనకాపల్లి : దివ్యాంగ బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో జోనల్ స్థాయి దివ్యాంగులకు పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్ష సహిత విద్యా ఆధ్వర్యంలో క్రీడాపోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగ బాలలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడా విభాగం ప్రతినిధి శంకరయ్య మాట్లాడుతూ, శారీరక దారుఢ్య పరీక్షల ద్వారా ఎంపికై న దివ్యాంగ బాలలకు వచ్చే ఏడాది జనవరి మాసంలో నెల రోజుల పాటు కడపజిల్లా గండికోటలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జోనల్ స్థాయిలో ప్రతిభ సాధించి క్రీడాకారులకు కడపలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కడపలో శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు మార్చి, ఏప్రిల్ మాసంలో లడఖ్లో మరింత కఠినమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు, అక్కడ శిక్షణ పూర్తి అయిన తరువాత బాలలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ క్రీడల్లో అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, విశాఖ జిల్లాల దివ్యాంగుల బాలబాలికలకు పోటీలు నిర్వహించడం జరిగిందని, జిల్లా సహిత విద్య సమన్వయకర్త డి.రామకృష్ణనాయుడు చెప్పారు. ఈ పోటీల్లో 182 మంది క్రీడాకారులు పాల్గొనగా జోన్ నుంచి 10 మంది దివ్యాంగ బాలబాలికలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు నీరజ, భాస్కర్, పి.గిరి ప్రసాద్ పాల్గొన్నారు.రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం -
కాలిన గాయాలతో వృద్ధురాలు మృతి
రావికమతం: మేడివాడ శివారు అప్పలమ్మపాలెంలో చలి మంట కాగుతూ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు పాచిల చిలుకమ్మ (72) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. చిలుకమ్మ ఆమె అక్క కొడుకు మిరియాల కొండబాబు సంరక్షణలో ఉంటోంది. సోమవారం రాత్రి ఇంటి దగ్గర చలి కోసం మంట కాగుతుండగా ప్రమాదవశాస్తూ చీరకు నిప్పు అంటుకొని శరీరం కాలిపోయింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను స్థానికులు సహాయంతో మనవడు రావికమతం ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజిహెచ్కు తరలించారు. వృద్ధురాలు చిలుకమ్మ విశాఖ పట్నం కేజిహెచ్లో చిక్సిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిలుకమ్మ మృతిపై మిరియాల కొండబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. -
ఆదర్శ రైతు అరుణకు పుడమి పుత్ర అవార్డు
కశింకోట: మండలంలోని సుందరయ్యపేట గ్రామానికి చెందిన మండల ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నిర్వాహకురాలు, ఆదర్శ రైతు కూండ్రపు అరుణకు పుడమి పుత్ర 2024 పురస్కారం లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞాన్ ప్రతిష్టన్ సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నకిరేకల్లో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేంద్రరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశంసా పత్రం, జ్ఞాపికను పురస్కారంగా అందించి సత్కరించారు. అరుణను ఆదర్శంగా తీసుకొని యువ రైతులు ప్రకృతి సేద్యాన్ని చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించి ఆరోగ్య సమాజంగా రూపుదిద్దుకోవడానికి దోహదపడాలని వారు ఆకాంక్షించారు. తనకు ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
ఎన్టీపీసీ నుంచి రూ.1.21 కోట్ల సీఎస్సార్ నిధులు
● ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగం తుమ్మపాల: ప్రజల వైద్యసేవల కోసం మెరుగైన సౌకర్యాల ఏర్పాటుతోపాటు పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఎన్టీపీసీ సీఎస్సార్ నిధులను అందించిందని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె చాంబర్లో ఎన్టీపీసీ సింహాద్రి తన సీఎస్సార్–సీడీ కింద మంజూరు చేసిన రూ.కోటి 21 లక్షల 50 వేలు, రూ.50 లక్షల చెక్కులను వేర్వేరుగా కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్, 6 పీహెచ్సీలు, 3 యూపీహెచ్సీల అభివృద్ధికి, క్రిటికల్ కేర్ యూనిట్కు రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించినట్టు చెప్పారు. ఇప్పటికే రూ.72.50 లక్షల మొదటి విడత మొత్తాన్ని విడుదల చేశారని చెప్పారు. పోలీస్ శాఖకు మద్దతుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ రూ.50 లక్షలను మంజూరు చేసిందని, నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇప్పటికే మొదటి విడత రూ.25 లక్షలు విడుదల చేసిందన్నారు. -
ఇంటి పన్ను వసూళ్ల పక్కదారిపై విచారణ
యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో పక్కదారి పట్టిన ఇంటి పన్నుల వసూళ్ల నగదు వ్యవహారంపై నర్సీపట్నం డీఎల్పీవో ఎస్.సత్య సూర్యనారాయణ మూర్తి మంగళవారం విచారణ జరిపారు. ఏటికొప్పాక పంచాయతీలో సుమారు రూ.4.23 లక్షలకు పైగా ప్రజల నుంచి వసూలైన పన్నుల సొమ్మును బిల్ కలెక్టర్ రమణబాబు సొంత అవసరాలకు వాడుకున్నట్టు తెలిసిందే. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడం, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లడంతో డీఎల్పీవో మూర్తి మంగళవారం యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ కలెక్టర్ వి. రమణబాబును ప్రశ్నించారు. పంచాయతీ ఖతాలో జమ చేయాల్సిన సొమ్ము సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కాలంలో పన్నుల వసూళ్లకు సంబంధించిన బిల్లు, లెడ్జర్, రశీదు పుస్తకాలను ఆయన తనిఖీ చేశారు. ఏటికొప్పాక పంచాయతీలో నిధులు పక్కదారి పట్టినా పంచాయతీ కార్యదర్శి ఎందుకు నిర్లక్ష్యం చూపారని ఆరా తీశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బిల్ కలెక్టర్ రమణబాబు చోడవరం పంచాయతీ పరిధిలో పని చేసినపుడు కూడా నిధుల పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి పంపనున్నట్టు డీఎల్పీవో తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని, బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. లైనుకొత్తూరు, జంపపాలెం పంచాయతీ కార్యదర్శులు ఆయన వెంట ఉన్నారు. పన్నుల వసూళ్లు 24.33 శాతమే నర్సీపట్నం డివిజన్లో 364 గ్రామపంచాయతీలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16.98 కోట్లు పన్నుల రూపంలో వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 24.33 శాతం అంటే రూ.4.94 కోట్లు మాత్రమే వసూలైనట్టు డీఎల్పీవో మూర్తి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా రూ.12.4 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్లైన్లో ఇంటి పన్ను మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. దీనివల్ల పంచాయతీల్లో పన్ను వసూళ్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొత్తగా అమలులోకి వచ్చిన ఈ పద్ధతిని ప్రజలంతా సద్వినియోగపర్చుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.జాతీయస్థాయి ఖోఖో పోటీలకు అచ్యుతాపురం విద్యార్థి -
పోస్టల్ నిధుల గోల్మాల్పై విచారణ
నర్సీపట్నం : నాతవరం మండలం, మన్యపురట్లలో తపాలాశాఖలో జరిగిన నిధుల స్వాహాపై మంగళవారం గ్రామంలో విచారణ జరిగింది. ఇక్కడ పోస్టుమాస్టర్గా పని చేసిన రావాడ సోమరాజు పలు ఖాతాల నుంచి దాదాపు రూ.7లక్షలు స్వాహా చేశారు. ఆలస్యంగా మేలుకున్న తపాలాశాఖ అధికారులు సోమరాజును ఇది వరకే సస్పెండ్ చేశారు. ఇక్కడ నిధులు గోల్మాల్కు సంబంధించి సాక్షి ఈ నెల 17వ తేదీన పోస్టల్ బ్రాంచ్లో రూ.7లక్షలు గోల్మాల్ శీర్షికన వార్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కదలిన తపాలా శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. తపాలాశాఖ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రమేష్లు బ్రాంచిని తనిఖీ చేశారు. నాలుగు గ్రామాలకు సంబంధించి 321 ఖాతాదారుల నుంచి నిధులు స్వాహా జరిగినట్టు తెలిసింది. అయితే విచారణ విషయం తెలియక పలువురు ఖాతాదారులు హాజరు కాలేకపోయారు. స్వాహా సొమ్ముపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సూపరిండెంటెంట్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. స్వాహా సొమ్ము రికవరీకి అన్ని చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులకు నష్టం జరగకుండా సూచించారు. -
మరింత చేరువగాఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు
నర్సీపట్నం: ఆర్టీసీ పార్శిల్ డోర్ డెలివరీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా ప్రజా రవాణాధికారి డి.ప్రవీణ సిబ్బందికి సూచించారు. డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె నర్సీపట్నం డిపోలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాన్ని సందర్శించారు. డోర్ డెలివరీ సేవలపై డీఎం ధీరజ్ను ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. డోర్ డెలివరీ సౌకర్యాన్ని ఆర్టీసీ 84 పట్టణల్లో అందిస్తుందన్నారు. ఒక కేజీ నుంచి 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. అతి తక్కువ చార్జీలతో అతి వేగంగా భద్రంగా డోర్ డెలివరీ చేయటం ఆర్టీసీ వల్ల సాధ్యమన్నారు. డోర్ డెలివరీ సేవలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ ఎ.గంగాధర్, అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
● ఉత్సాహంగా ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ క్రీడా పోటీలు ● గిరిజన ఉత్పత్తులు, ఆహార పదార్థాలతో 68 స్టాళ్లు ఏర్పాటు క్రీడా మస్కట్తో అతిధులు స్టాల్స్ను తిలకిస్తున్న పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కృష్ణ తేజస్టాల్స్ను సందర్శించి పరిశీలిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్,చిత్రంలో అవార్డు గ్రహిత జ్యోతి సురేఖ ఆర్చరీ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్మహారాణిపేట: పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఉత్సవ్ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన 68 స్టాళ్లు లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, బాంబూ చికెన్ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఉత్కంఠగా సాగిన క్రీడా పోటీలు ఖేలో ఇండియా కబడ్డీలో 10 రాష్ట్రాల నుంచి 18 టీమ్లు భాగస్వామ్యమయ్యాయి. అందులో పురుష జట్లు 10, మహిళా జట్లు 8 పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవగా, రన్నర్ జట్టుగా ఒడిశా, మూడో స్థానంలో తెలంగాణ, గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో జార్ఖండ్గా విజేతగా నిలవగా, రన్నర్గా మధ్యప్రదేశ్ జట్టు నిలిచింది. మూడో స్థానంలో మహారాష్ట్ర, ఒడిశా జట్లు ఉన్నాయి. ●ఆర్చరీ క్రీడా పోటీలో 8 రాష్ట్రాలకు చెందిన 20 మంది క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా గోల్డ్ మెడల్, రాజస్థాన్కు చెందిన బద్రీ లాల్ మీనా సిల్వర్ పతకం సాధించుకున్నారు. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించుకున్నారు. మహిళా వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా గోల్డ్ మెడల్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి సిల్వర్ పతకం సాధించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ●సాయంత్రం క్రికెట్ స్టేడియంలో నమూనా క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. అధికారులు, క్రీడాకారులు, గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్కి పేట విద్యార్థిని
పాయకరావుపేట: శ్రీప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థిని తుంపాల శ్వేత జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విద్యార్థిని ఎన్సీసీ 3వ ఆంధ్రా బాలికల బెటాలియన్ నుంచి ఎంపికై ందని చెప్పారు. ఈనెల 29 నుంచి జనవరి 25 వరకు జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో శిక్షణ తీసుకుని, 26న ఢిల్లీలో జరిగే ఆర్డీ పరేడ్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. శ్వేతను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
క్రిస్మస్ కాంతులు
కశింకోట సెయింట్స్ జాన్స్ స్కూలులో క్రీస్తు జననం నాటిక ప్రదర్శనకశింకోట: జిల్లా అంతటా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. చర్చిలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన నక్షత్రాలు కాంతులు వెదజల్లుతున్నాయి. కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూలులో మంగళవారం మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు జననం నాటికను విద్యార్థులు ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడి ఆంధ్ర కల్వరీ సెంటినరీ బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు మిరుమిట్లుగొలుపుతున్నాయి. పాలెం మందిరం, గవరపేట, బయ్యవరం, తాళ్లపాలెం, ఉగ్గినపాలెం, జమాదులపాలెం, తేగాడ, పేరంటాలపాలెం, జోగారావుపేట, జి.భీమవరం, కన్నూరుపాలెం, సుందరయ్యపేట, తీడ, చెరకాం, అచ్చెర్ల, గొబ్బూరు, ఏఎస్పేట, నరసింగబిల్లి, చింతలపాలెం, నూతలగుంటపాలెం, సోమవరం, ఏనుగుతుని, విసన్నపేట, వెదురుపర్తి, తదితర గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక తుమ్మపాల: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ విజయ్ కృష్ణన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అన్నారు. జిల్లా మైనార్టీ శాఖ అధికారి సత్య పద్మ, ఏవో రాధాకృష్ణ, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవిందు సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, డీఎస్పీ ఎం.శ్రావణి, పాస్టర్లు జాన్పాల్, జపనీస్ శాస్త్రి, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్రావెల్ లీజు రద్దు చేయాలని వెంకటాపురంవాసుల ధర్నా
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వెంకటాపురం గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మంజూరు చేసిన గ్రావెల్ క్వారీ లీజులు రద్దు చేయాలంటూ స్థానికులు మంగళవారం ఆందోళన చేశారు. సర్వే నంబర్ 156/పీ లోని 12.5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీలక్ష్మీ నరసింహ మినరల్స్కు లీజు మంజూరు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని కాలుష్య సమస్య పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ధార ఈ ప్రాంతం గుండా వెళ్తుందని వారు తెలిపారు. అంతేకాకుండా యాదవ కులస్థులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలోని కొండల వద్ద పశువులను మేపుతామని, ఇప్పుడు గ్రావెల్ తవ్వకాలు జరిపితే తమ పశువులకు రక్షణ, మేత ఉండదని వారు వివరించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. -
బ్రహ్మాస్త్రం
● కన్నుకుట్టి కుతంత్రం.. కుంటిసాకుతో అడ్డంకులు చిరుద్యోగిపైవిశాఖ సిటీ : వీఎంఆర్డీఏ అధికారుల రాజకీయాలకు ఒక చిరుద్యోగిని బలి చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి నిబంధనల్లో డొంకలు వెతుకుతూ ఆర్ఐపై వేటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉండడం అధికార పార్టీకి కన్నుకుట్టింది. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న కుతంత్రంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ముందస్తుగా చేసుకున్న బుకింగ్ను కూడా రద్దు చేయించింది. దీనికి అధికారులతో చెప్పించిన కుంటి సాకు దుమారం రేపుతోంది. అంతటితో ఆగకుండా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించడం ఇప్పుడు సంస్థలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలకు కింది స్థాయి సిబ్బందిని బలి చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఏడాదిన్నరలోనే వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల్లో కోత.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. స్టీల్ప్లాంట్లో కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నా పట్టించుకోకపోవడం.. విశాఖలో విలువైన భూములను ఊరూపేరు లేని బోగస్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడం.. ఇలా చంద్రబాబు వరుస నిర్ణయాల పట్ల ప్రజలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ఆ పార్టీల నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దీంతో అధికార పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి నేతలు వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సుమారు 1400 మంది వైఎస్సార్సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆ పార్టీ ఈ చేరికలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన చేరికల కార్యక్రమం కోసం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాను ముందస్తుగా ఆ పార్టీ నేతలు బుకింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రుసుము కూడా చెల్లించారు. ముందస్తు బుకింగ్ ఉన్నప్పటికీ.. వైఎస్సార్సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోడానికి చంద్రబాబు సర్కార్ అధికార బలాన్ని ప్రదర్శించింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని వీఎంఆర్డీఏ అధికారులపై ఒత్తిడి చేసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక కుంటి సాకులతో చేరికల కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. ఉదయం 10.30 గంటలకు చిల్డ్రన్స్ ఎరీనా కార్యక్రమం ఉండడంతో ఈలోగానే సిబ్బందితో గేటుకు తాళం వేయించారు. చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వాటిని తొలగించారు. అంతేకాకుండా చిల్డ్రన్స్ ఎరీనా హాల్లో ఆకస్మాత్తుగా ఏసీ పనిచేయడం లేదని, మరమ్మతులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని రద్దు చేశారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. ఎటువంటి సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంతలో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక పథకం ప్రకారమే తమ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చిల్డ్రన్స్ ఎరీనా గేటు ముందే బైఠాయించి కొంత సేపు నిరసన తెలిపారు. అనంతరం అక్కడే సుమారు 1,400 మందిని పార్టీలో చేర్చుకున్నారు. వీఎంఆర్డీఏలో రాజకీయాలకు చిరుద్యోగి బలి వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమానికి ముందస్తు అనుమతులున్నా రద్దు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు చిల్డ్రన్స్ ఎరీనాలో చేరికల సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఆర్ఐపై వేటు వై.కిరణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు -
బలవంత భూసేకరణ రైతుల పాలిట శాపం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణమూర్తి అనకాపల్లి టౌన్: పరిశ్రమల పేరుతో బలవంత భూసేకరణ రైతులకు భూమి మీదే నరకం చూపిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. స్ధానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం ‘జిల్లాలో పరిశ్రమల పేరుతో బలవంత భూసేకరణ’ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిశ్రమల పేరుతో సేకరించిన భూములు పూర్తి వినియోగంలో లేవన్నారు. పోరాడి సాఽధించుకున్న విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు స్వంత గనులు కేటాయించమని కోరలేని మన రాష్ట్ర ఎంపీలు మిట్టల్ స్టీల్ప్లాంట్కు స్వంత గనులు కేటాయించమని కోరడం సిగ్గుచేటన్నారు. సీపీఐ 100 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలు నేడు పథకాలుగా మారాయన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రస్తుతం కోరలు తీసిన పాములాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శ్రీరామచంద్రయ్య మాట్లాడుతూ నక్కపల్లి మండలంలో నిర్మిస్తున్నవి అత్యంత ఎక్కువ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట భూములు, తర్వాత ఖనిజాలు, ఆ తర్వాత ప్రభుత్వ సంస్ధలను పీపీపీ పేరుతో కార్పొరేట్లకు ధారాదత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు. అమరావతికి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల్లో 71 శాతం మందికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. 29 గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పి భూములు సేకరించి అవేమీ ఇప్పటి వరకూ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.విమల, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
● పేదోడి కడుపు మండింది.. మట్టి పన్నుపై గట్టి ప్రతిఘటన
● తిరగబడ్డ ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ● ఏటిగైరంపేటలో అనధికార వసూళ్లపై గ్రామస్తుల మండిపాటు గొలుగొండ: చంద్రబాబు పాలనలో అక్రమార్కు లు చెలరేగిపోతున్నారు. మట్టి కావాలన్నా పన్ను కట్టాలట. ట్రాక్టర్ మట్టి తరలించడానికి ఏకంగా రూ.410 పన్ను కట్టమని అనధికార సంస్థ బళ్లను ఆపడంతో ప్రజలు తిరగబడ్డారు. పాక, ఇంటి కప్పుడుకు సొంత పొలంలో మట్టి తరలించడానికి పన్ను కట్టమంటే వారికి చిర్రెత్తుకొచ్చింది. సొమ్ము చెల్లించకపోతే ట్రాక్టర్, లారీ, పొక్లెయిన్ సీజ్ చేస్తామని చెప్పడంతో అడ్డుకోవడానికి మీరెవరంటూ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఏటిగైరంపేట గ్రామ పరిధిలో ఒక రైతు పొలం వద్ద పాక వేశారు. దీనికి కప్పుడు మట్టి అవసరం కావడంతో వేరొక ప్రాంతంలో తన పొలంలోని మట్టిని ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇంతలో ఏఎంఆర్ అనే సంస్థ సిబ్బంది వచ్చి ట్రాక్టర్లను నిలిపివేశారు. యూనిట్ మట్టి తరలించాలన్నా రూ.410 పన్ను కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఏటిగైరంపేట, పాలకపాడు, పుత్తడిగైరంపేట గ్రామాలకు చెందిన ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండిపడ్డారు. గ్రామాల్లో మట్టి తరలిస్తే చంద్రబాబు పాలనలో రూ.410 పన్ను ఎందుకు కట్టాలని దుయ్యబట్టారు. మేం కట్టం.. ఏం చేసినా పర్వాలేదని తిరుగుబాటు చేశారు. వ్యవసాయ కుటుంబాల్లో దిబ్బ లుగా ఉన్న పొలాన్ని చదును చేయడం, లోతుగా ఉన్న పొలంలో మట్టివేయడం జరుగుతుంది. అ లాంటి సమయంలో పన్ను కట్టమనడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. అసలు ఈ ఏఎంఆర్ సంస్థకు ఏ అనుమతులు ఉన్నాయని నిలదీశారు. ట్రాక్లర్లను అడ్డుకుంటే తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇక్కడ ఉన్న సిబ్బంది మెల్లగా జారుకున్నారు. అయ్యన్ననే అడుగుదాం.. ఇలా పేద ప్రజలకు అన్యాయం చేయడంపై బుధవారం స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లి సమస్య వివరిస్తామని ట్రాక్టర్ యజమానులు తెలిపారు. పేదలకు అన్యాయం చేసే ఈ సంస్థ ఎక్కడ నుండి వచ్చిందో తెలపాలని, తమకు న్యాయం చేయాలని కోరతామన్నారు. పాక, ఇంటి అవసరాల కోసం సొంత పొలంలో మట్టి తరలిస్తే ట్రాక్టర్కు రూ.410 ఎలా పన్ను విధిస్తారు.. ఎందుకు ఇవ్వాలని అయ్యన్న ఇంటి వద్దకు వెళ్లి అడుగుతామన్నారు. ఇలా అయితే తామెలా బతకాలని ట్రాక్టర్ యజమాని సత్తిరాజు ఆవేదనగా ప్రశ్నించారు. -
గండం గడిచింది..
● రోడ్డు ప్రమాదంలో బైక్తో సహా లారీ కింద చిక్కుకున్న ఇద్దరు యువకులు ● సీఐ హుటాహుటిన లారీలో సరకు అన్లోడ్ చేయించడంతో దక్కిన ప్రాణాలునర్సీపట్నం: పట్టణ సీఐ గఫూర్ చొరవతో రోడ్డు ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. పట్టణంలో రాధామాధవి లాడ్జి సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన యువకులు చిలుకు వరప్రసాద్, మాకిరెడ్డి చందు గాయపడ్డారు. వరప్రసాద్ తీవ్రంగా గాయపడడంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. చంద్ర ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరూ క్రికెట్ పోటీలకు వజ్రగాడ గ్రామం వెళ్లి తిరిగి బైక్పై వస్తున్నారు. సివిల్ సప్లయి రైస్తో లారీ నర్సీపట్నం వైపు వస్తుంది. లారీని తప్పించబోయి వీరి బైక్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకుపోయింది. వారిద్దరూ లారీ కింద ఇరుక్కుపోయారు. డ్రైవర్ సమయస్పూర్తితో లారీని నిలిపివేశాడు. లారీ ముందుకు వెళ్తే చందు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వెనక్కు వెళ్తే వరప్రసాద్ ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. సమీపంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విధుల్లో ఉన్న సీఐ గఫూర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, వెంటనే పొక్లెయిన్ రప్పించి లారీలోని బియ్యం బస్తాలను అన్లోడ్ చేయించారు. దీంతో లారీ కింద ఇరుక్కున్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సీఐ, లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వరప్రసాద్ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ తరలించారు. -
వైద్య విద్య జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు
మహారాణిపేట (విశాఖ): మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి, శ్రీ , కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నివారణ చట్టం 2017 అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును, ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మందుల పంపిణీ, ఉద్యోగ అవకాశాలు, గృహ వసతి, బీమా వంటి సౌకర్యాలపై చర్చించారు. అసెంబ్లీలో ఆమోదించిన అంశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావాలని, నిబంధనల అమలులో జాప్యం జరిగితే వెంటనే సరిదిద్దాలని చైర్మన్ అధికారులకు సూచించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఎయిమ్స్ వంటి సంస్థలకు కేంద్రం నుంచి అందుతున్న సహకారం, పురోగతిపై కూడా చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య విద్యా విభాగం పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ సౌరబ్ గౌర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే.నీలకంఠరెడ్డి, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్డాక్టర్ పద్మావతి, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 36 అర్జీలు
అర్జీదారుల సమస్యను విని సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడుతున్న ఎస్పీ అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 36 ఆర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని అక్కడ నుంచి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు – 25, మోసపూరిత వ్యవహారాలు – 1, ఇతర విభాగాలకు చెందినవి –10 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరింత సులభతరం
డాబాగార్డెన్స్ (విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, సేవల టికెట్ల జారీ ప్రక్రియను దేవదాయ శాఖ డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందే వీలు కల్పించారు. మన మిత్ర యాప్ నంబరు 9552300009, దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ aptemples.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఏపీ టెంపుల్స్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, లాగిన్ అయిన తర్వాత టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ను ప్రింట్ తీసుకోవడం, ఫోన్లో చూపించడం ద్వారా స్కాన్ చేయించుకుని భక్తులు వేగంగా దర్శనం పొందవచ్చు. ప్రసాదాల కొనుగోలుకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇప్పటికే 315 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శనం చేసుకోగా, 74 మంది భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రసాదాలను పొందినట్లు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు, సేవలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ విధానం ఎంతో దోహదపడుతుందన్నారు. -
కుమ్ములాటలు
టీడీపీలో సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో కుమ్ములాటలు తార స్థాయికి చేరాయి. పచ్చనేతల మధ్య విభేదాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు.. అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరిపై మరొకరు పార్టీ అధినేత దగ్గర ఫిర్యాదు చేసుకునే వరకూ వచ్చింది. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైన పీలా గోవిందు సత్యనారాయణకు అధిష్టానం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతోపాటు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా కొనసాగిస్తోంది. అంతేకాకుండా స్థానిక జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆయన సమీప బంధువు కావడంతో నియోజకవర్గంలో పీలా గోవిందు కాసింత స్పీడ్ పెంచారు. ఏ పని జరగాలన్నా అధికారులు సైతం పీలా గోవిందునే సంప్రదిస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి.. ఒక వర్గానికే పార్టీలో పదవులు దక్కుతున్నాయని, ఇన్చార్జి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకే కొమ్ముకాస్తున్నాడని, టీడీపీని పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తాళ్లపాలెం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఇద్దరూ ఒకరిపై ఒకరు వేర్వేరుగా ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు మాజీల వ్యవహార శైలిపై గడిచిన కొన్ని నెలల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో నిఘా ఉంచిన చంద్రబాబు ఇద్దరికీ వేర్వేరుగా క్లాస్ తీసుకున్నట్టు భోగట్టా. ఇద్దరు మాజీలపై సీఎం ఆగ్రహం ‘అన్నీ గమనిస్తున్నాను.. అంతా తెలుసుకున్నాను.. చేసింది చాలు ఇక ఆపండి.. తీరు మార్చుకోకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు’ అంటూ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీలో ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇద్దరిపై కోపంతో ఊగిపోయారని సమాచారం. అయితే గతంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన మాజీ మంత్రి.. ఇప్పుడు మళ్లీ తమపై పెత్తనం చెలాయించడమే కాకుండా టీడీపీలో విభేదాలు సృష్టించి గ్రూపు రాజకీయాలకు తెర లేపుతున్నాడని.. అంతేకాకుండా అనకాపల్లి పట్టణ నడిబొడ్డున దౌర్జన్యంగా విలువైన భూములను కబ్జా చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు ఇవ్వగా.. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీని గాలికి వదిలేశాడని, ఒకే కుటుంబానికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడని మాజీ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదులు విన్న చంద్రబాబు ఇద్దరిపై తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ‘మీ బాగోతాలన్నీ తెలుసు.. సమాచారం అంతా నా దగ్గర ఉంది.. అంతా చూస్తూనే ఉన్నా.. అర్జెంటుగా ప్రస్తుత వివాదాన్ని క్లియర్ చేయండి.. నేను జోక్యం చేసుకునేంతవరకు సాగదీయకండి.. తమాషాగా ఉందా’ అంటూ మాజీ మంత్రిని ఘాటుగా హెచ్చరించినట్లు అదే పార్టీలో సీనియర్ నాయకులు చెబుతున్నారు. ‘పద్ధతి మార్చుకో.. నువ్వు మార్చుకోకపోతే నేనే మార్చేస్తా.. అంతవరకు తెచ్చుకోకు.. జాగ్రత్త’ అంటూ మాజీ ఎమ్మెల్యేకు చురకలు అంటించినట్లు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ హెచ్చరికలతో ఇద్దరు మాజీలలో అధినేత చంద్రబాబుపై మరింత కోపం పెరిగింది. నిజాలు చెబుతుంటే వాటిని సరిదిద్దాలి గానీ మాపై అరుస్తున్నారెందుకు అంటూ ఇరువురు సమీప సీనియర్ నాయకుల వద్ద వాపోయినట్టు సమాచారం. సీఎం హెచ్చరికలతో ఇద్దరు మాజీల్లో మార్పు వస్తుందా..? లేదా తగ్గేదేలే అంటూ గ్రూపు రాజకీయాలు.. కబ్జాలు కొనసాగిస్తారో వేచి చూడాలంటూ టీడీపీ వర్గాలు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి. పచ్చనేతల్లో తారస్థాయికి విభేదాలు అనకాపల్లిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ పోరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద ఒకరిపై ఒకరు ఫిర్యాదులు విలువైన భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రిపై ఆరోపణ ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఇద్దరిపై చంద్రబాబు సీరియస్ ఇద్దరి బాగోతాలు తెలుసని, పద్ధతి మార్చుకోకపోతే తానే మారుస్తానని టీడీపీ అధ్యక్షుడి హెచ్చరిక దీంతో అధినేతపైనే గుర్రుగా ఉన్న ఇద్దరు నేతలు -
చలిమంట కాస్తుండగా నిప్పంటుకుని వృద్ధురాలికి గాయాలు
రావికమతం: అప్పలపాలెం గ్రామంలో చలిమంట కాస్తుండగా ప్రమాదవశాస్తూ చీరకు నిప్పంటుకొని వృద్ధురాలు గాయపడిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలివి. మండలంలో మేడివాడ పంచాయతీ శివారు అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన పాచిల చిలుకమ్మ(60) చలికి మంట కాస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సహాయంతో మనవడు రావికమతం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
గోవాడ సుగర్స్లో వెంటనే క్రషింగ్ ప్రారంభించాలి
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ను వెంటనే ప్రారంభించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఆవరణంలో అఖిల పక్ష నాయకుల సమావేశం సోమవారం జరిగింది. రైతు సంఘం, సీపీఐ రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులు, చెరకు రైతు సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించడంలో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది సెప్టెంబరు 30వతేదీన నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ మహాజనసభను ఇప్పటి వరకూ నిర్వహించలేదని, గత సీజన్కు సంబంధించిన చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంటు ఇవ్వాలని, ఈ ఏడాది క్రషింగ్ చేయడానికి కావలసిన పనులన్నీ చేపట్టాలని, వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో ఏడువాక సత్యారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అప్పలరాజు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు తాతారావు, దొడ్డి అప్పారావు, శానాపతి సత్యారావు, సూరిబాబు, పప్పల జయదేవ్, మూడెడ్ల శంకర్రావు, జెర్రిపోతుల నానాజీ, శరగడం రామునాయుడు, గణపతినాయుడు, మోహన్రావు, పోతల ప్రకాష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
తుమ్మపాల : సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గూర్చి వాటి కారణాలు వివరంగా తెలియజేయాలన్నారు. అర్జీదారులు తమ అర్జీల సమాచారం కోసం 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 344 అర్జీలు నమోదు జరిగాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా సమన్వయ అధికారి ఎస్.సుబ్బలక్ష్మి, సిపిఓ జి.రామారావు, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, గృహనిర్మాణ పథకం సంచాలకులు కె.సరోజినీ, శచిదేవి, సూర్యలక్ష్మి, శ్రీనివాస్, డీఈవో జి.అప్పారావు నాయుడు, జిల్లా ఎక్సయిజ్ అధికారి వి.సుధీర్ పాల్గొన్నారు ప్రత్యేక పంచాయతీకి వినతి ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కశింకోట మండలం జి.భీమవరం గ్రామపరిధిలో గల సింగవరం గ్రామస్తులు కలెక్టర్లో జరిగిన పీజీఆర్ఎస్లో విన్నవించారు. తక్కువ జనాభా రిత్యా కొన్నేళ్ల క్రితం సింగవరం గ్రామాన్ని జి.భీమవరం గ్రామ పంచాయతీలో విలీనం చేయడంతో గ్రామాభివృద్ధి వెనకబడిందని తెలిపారు. ఇంటిపన్నులు, ఇతరాత్ర రూపాల్లో పంచాయతీకి వస్తున్న ఆదాయాన్ని జి.భీమవరం గ్రామానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారని వాపోయారు. తమ గ్రామంలో 650 మంది ఓటర్లు, 1,250 మంది జనాభా ఉన్నారని, ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు అన్ని విధాలుగా అర్హత కలిగి ఉందని తెలిపారు. ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందించి కలెక్టరేట్ గేటు వద్ద నిరసన తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కోసం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చేయాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ బొంతు రమణ అన్నారు. ఓబీసీ నాయకులు పొలమర శెట్టి ఆదిమూర్తి, బుద్ధ మహేష్ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కావాలి... యలమంచిలి కేంద్రంగా నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని యలమంచిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు, ఫెన్షనర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ ప్రజలకు దూరాభారంగా ఉంటుందని, అన్ని వసతులతో యలమంచిలి పట్టణం ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మలకొండ బాబు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడారిపూరి జగన్నాథం, యలమంచిలి బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నక్కా శివశంకర్, ఎల్లపు రాజు కలెక్టర్ను కోరారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు కలెక్టరేట్ ఎదుట మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించి విడుదల చేసిన జీవో 1491ను సవరించాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండలంలోని సర్పంచ్లతో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 తేదీన అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న యలమంచిలి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న నక్కపల్లి డివిజన్లో కలుపుతూ జీవో విడుదల చేసిందన్నారు. నక్కపల్లి డివిజన్ను తామంతా స్వాగతిస్తున్నామని అయితే సుదూర ప్రాంతంలో ఉండే నక్కపల్లి డివిజన్లో మాత్రం యలమంచిలి నియోజకవర్గాన్ని మినహాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను సవరించేలా చర్యలు తీసుకొని యథావిధిగా అనకాపల్లి డివిజన్లో ఉండేలా చూడాలన్నారు. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మాణం అమలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,సర్పంచ్లు సుందరపు తాతాజీ, చదరం నాయుడు,భీశెట్టి గంగప్పలనాయుడు,బొడ్డేడ శ్రీనివాసరావు,ఇందల నాయుడు,జాజుల వెంకటరమణ,పార్టీ నాయకులు కాండ్రేగుల జగన్, పిన్నమరాజు రవీంద్రరాజు, శ్రీపతి రామకృష్ణ పాల్గొన్నారు. -
బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లోనే సమర్పించాలి
● జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో అప్పారావునాయుడు అనకాపల్లి టౌన్: ´ëuý‡Ô>ÌSÌSMýS$ ^ðl…¨¯]l {糆 ¼Ë$ϯ]l$ ï³G-‹œ-G…-G‹Ü §éÓÆ> M>MýS$…yé yîlyîl-Ðø AMú…sŒæ §éÓÆ> ïÜG-‹œ-G…-G‹Ü {sñæ•fÈ ´ùÆý‡t-ÌŒæ-ÌZ¯ól çܼ-ÃsŒæ ^ólĶæ*ÌS° hÌêÏ Ñ§éÅ-Ô>Rê-«¨M>Ç Wyìlz A´ëµ-Æ>-Ð]l#-¯é-Ķæ¬yýl$ ™ðlÍ-´ëÆý‡$. ç³rt-׿…ÌZ° so¯ŒS VýSÆŠḥæÏÞ OòßæçÜ*-P-ÌŒæÌZ hÌêÏ ç³Ç-«¨ÌZ E¯]l² ÑÑ«§ýl ´ëuý‡Ô>-ÌSÌS {糫§é-¯ø´ë-«§éÅ-Ķæ¬-ÌS™ø ÝùÐ]l$ÐéÆý‡… Oòœ¯é¯ŒSÞ çÜ…º…-«¨™èl ÑçÙ-Ķæ*-ÌSOò³ Õ„ýS׿, AÐ]l-V>-çßæ¯]l çÜÐ]l*-ÐólÔèæ… fÇ-W…¨. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$™èl* {ç³çÜ$¢™èl… Ñyýl$-§ýl-OÌñæ¯]l {V>…sŒæ QÆý‡$a-ÌS¯]l$ ¯]l*™èl¯]l Ñ«§é¯]l… §éÓÆ>¯ól ¯]lÐðl*§ýl$ ^ólĶæ*-ÌS-¯é²Æý‡$. °«§ýl$-ÌS¯]l$ ѧéÅ-Æý‡$¦ÌS AÀ-Ð]l–-¨®MìS çÜ{MýS-Ð]l$…V> Ѱ-Äñæ*W…^é-ÌS-¯é²Æý‡$. ç³§ø ™èlÆý‡VýS† ç³È„ýS-ÌSOò³ Ķæ*„ýS¯ŒS ´ëϯŒS¯]l$ MýSr$t-¨-rt…V> AÐ]l$Ë$ ^ólĶæ*ÌS-¯é²Æý‡$. ÇÝùÆŠ‡Þ ç³Æý‡Þ¯ŒS ÔóæQÆŠæ, QVóS‹Ù ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
కేంద్ర వర్శిటీల్లో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మునగపాక : కేంద్ర విశ్వ విద్యాలయాల పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కర్నాటక కేంద్ర విశ్వ విద్యాలయం డీన్, ప్రొఫెసర్ దొడ్డి వెంకట రమణ కోరారు. సోమవారం ఆయన మునగపాక పీఏసీఎస్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి జనవరి 14లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష మార్చిలో ఉంటుందన్నారు. డిసెంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం తమ యూనివర్సిటీలో ఉన్న 30 పీజీ కోర్సులకు అదనంగా మరో 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ విశ్వ విద్యాలయంలో చదువుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే పలు ఉపకార వేతనాలను పొందగలరని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం హర్షణీయం
సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు.కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా కేంద్రంలో 1925లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకలు సోమవారం ఘఽనంగా జరిగాయి.ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న నాణ్యమైన కాఫీ గింజలు, వాటి నాణ్యతను వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా మరింత నాణ్యమైన కాఫీ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా గిరిజన రైతులు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ బ్రాండింగ్లో అరకు కాఫీని మరింతగా ప్రమోట్ చేసి విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించనున్నట్టు ఆయన చెప్పారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మునగపాక : అప్పుల భారం భరించలేక మండలంలోని చూచుకొండ గ్రామంలో గడ్డిమందు తాగిన వ్యక్తి సోమవారం మృతి చెందాడని ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట వెంకట స్వామినాయుడు(49) గతంలో బ్రాండిక్స్లో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఆర్థిక సమస్యలతో అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక ఆదివారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడు వెంకటస్వామి నాయుడుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన వెంకట స్వామి నాయుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా సోమవారం వెంకటస్వామి నాయుడు మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
స్పెషల్ రైళ్లు పొడిగింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. ●విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ స్పెషల్ విశాఖలో ప్రతీ సోమవారం రాత్రి 7.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 23వ తేదీ వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–విశాఖపట్నం(08584) స్పెషల్ తిరుపతిలో ప్రతీ మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు పొడిగించబడింది. ●విశాఖపట్నం–తిరుపతి(08547) వీక్లీ స్పెషల్ విశాఖలో ప్రతీ బుధవారం రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 25వ తేదీ వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–విశాఖపట్నం(08548) స్పెషల్ తిరుపతిలో ప్రతీ గురువారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 26వ తేదీ వరకు పొడిగించబడింది. ●విశాఖపట్నం–చర్లపల్లి(08579) వీక్లీ స్పెషల్ ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలును ఫిబ్రవరి 27వ తేదీ వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి–విశాఖపట్నం(08580) వీక్లీ స్పెషల్ ప్రతీ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటిరోజు ఉద యం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలును ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించారు. పలు రైళ్లు రీ షెడ్యూల్ ఖరగ్పూర్ డివిజన్, నారాయణగడ్–భద్రక్ రైల్వేస్టేషన్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ సంబంధిత పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచ పలు రైళ్లు ఆయా తేదీల్లో ఆలస్యంగా బయల్దేరనున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. ●హౌరా–సికింద్రాబాద్(12703) ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఈ నెల 24, 26, 28వ తేదీల్లో 3 గంటలు ఆలస్యంగా, 23, 27వ తేదీల్లో గంట ఆలస్యంగా బయల్దేరుతుంది. ●సికింద్రాబాద్–హౌరా(12704) ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఈ నెల 23న 4 గంటలు, 26న 2 గంటలు, 27న 130 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●ఎస్ఎంవీ బెంగళూరు–అగర్తలా(12503) ఎక్స్ప్రెస్ ఈ నెల 23వ తేదీన 4గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●హౌరా–ఎస్ఎంవీ బెంగళూరు (12245) దురంతో ఎక్స్ప్రెస్ ఈ నెల 24వ తేదీన 2గంటలు, 26, 28వ తేదీలలో గంట ఆలస్యంగా బయల్దేరుతుంది. ●ఎస్ఎంవీ బెంగళూరు –హౌరా(12864) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23వ తేదీన 5గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●విల్లుపురం–ఖరగ్పూర్(22604) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23వ తేదీన 5 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. -
బాక్సింగ్లో బంగారు పతకాలు
వెంకటేశ్వరరావు చేతుల మీదగా మెడల్ అందుకుంటున్న మౌనిక నర్సీపట్నం : రాష్ట్ర స్థాయి 9వ మహిళా బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నంకు చెందిన బాక్సర్లు ఐదు పతకాలు సాధించారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ఈ నెల 20,21 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న బొంతు మౌనిక 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 81 కిలోల విభాగంలో ఏడిద లక్ష్మి, 54 కిలోల విభాగంలో రాజ రాజేశ్వరి, 52 కిలోల విభాగంలో జి.సాయి, 70 కిలోల విభాగంలో వై.హాసిని కాంస్య పతకాలు సాధించారు. ద్రోణాచార్య అవార్డు, ఏపీ బాక్సింగ్ ప్రెసిడెంట్ ఐ.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. -
కొత్త పింఛన్లు తక్షణం మంజూరు చేయండి
నక్కపల్లి: చంద్రాబాబు ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నా కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్సి వీసం రామకృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పింఛన్ల కోసం 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీ లందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని బూటకకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 50 ఏళ్లు కాదు కదా 70 ఏళ్లు వచ్చిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదని అన్నారు. పింఛన్ల కోసం పండుటాకులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారన్నారు. వృద్ధాప్య పింఛన్లే కాకుండా వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు సైతం మంజూరు చేయలేదని తెలిపారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు మాసాలకొకసారి వలంటీర్ల ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్లు మంజూరు చేశామని, నక్కపల్లి మండలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 6వేలకు పైగా కొత్తపింఛన్లు మంజూరు చేసామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు. -
సంపద పోయినా.. ప్రాణం దక్కలేదు
అచ్యుతాపురం రూరల్: అరుదైన బ్లూ వేల్ను (నీలి తిమింగలం) రక్షించాలన్న మత్స్యకారుల ప్రయత్నాలు వృథా అయ్యాయి. అందుకోసం వారు సుమారు రూ.3 లక్షల విలువైన వలను, రూ.లక్ష విలువైన మత్స్య సంపదను కోల్పోయారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ భారీ తిమింగలానికి మూడు రోజుల అనంతరం సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిపారు. పూడిమడక తీరంలో శనివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ నీలి తిమింగలం చిక్కిన విషయం తెలిసిందే. మత్స్యకారులు వెంటనే ఆ తిమింగలాన్ని తిరిగి సముద్రంలో విడిచి పెట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని మత్స్యకారులు అరుదైన నీలి తిమింగలాన్ని కాపాడే క్రమంలో విలువైన వలను, తిమింగలంతోపాటు వలకు చిక్కిన మత్స్య సంపదను సముద్రంలో విడిచిపెట్టి మానవత్వం చాటుకున్నారు. అయినప్పటికీ శనివారం రాత్రి తిమింగలం మృతి చెందడంతో తీవ్ర ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు పర్యటన హడావుడిలో ఉన్న సంబంధిత శాఖల అధికారులు ఆరోజు ఇటువైపు దృష్టి పెట్టలేదు. వారంతా సోమవారం రావడంతో మూడు రోజులపాటు తిమింగలం మృతదేహం వద్ద మత్స్యకారులు కాపలా కాశారు. సుమారు 10 సంవత్సరాల వయసు భారీ నీలి తిమింగలం జీవన ప్రమాణం సుమారు 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇక్కడ మృతి చెందిన నీలి తిమింగలం పొడవు, వెడల్పుతోపాటు వెన్నుపూస రింగులను బట్టి సుమారు 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం చేసినట్లు దోసూరు వెటర్నరీ వైద్యురాలులు ఉమా మహేశ్వరి, ఎంజేపురం వైద్యుడు జగదీశ్, మాడుగుల వైద్యుడు శివకుమార్ తెలిపారు. పోస్టుమార్టంలో నీలి తిమింగలం అవయవాలు సేకరించి విశాఖపట్నంలో ల్యాబ్కు తరలించాన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తరువాత తిమింగలం మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియజేస్తామన్నారు. తిమింగలాన్ని ఖననం చేసిన వారిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎం.రామకృష్ణ, ఇ.శివకుమార్, మైరెన్ ఎస్ఐ బిహెచ్.వి.ఎస్.ఎన్.రాజు, ఫిషరీస్ అధికారి రవితేజ, పూడిమడక వీఆర్వో అప్పలరాజు ఉన్నారు. పరిశ్రమల వ్యర్థాలే కారణం పరిశ్రమల వ్యర్ధ రసాయనాలను నేరుగా సముద్రంలో పైప్లైన్ల ద్వారా కలిపేయడం వలన విలువైన మత్స్య సంపద కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈమధ్యనే ఉప్పుటేరులో విలువైన మత్స్య జాతులు, సముద్రంలో ఆలివ్రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడ్డాయని, ఆ విధంగానే భారీ నీలి తిమింగలం స్పృహ కోల్పోయి మృతి చెందిందని మత్స్యకార నాయకుడు చేపల తాతయ్యలు పేర్కొన్నారు. ఇప్పటికై నా మత్స్య సంపదకు హాని కలగకుండా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ద్వారా పరిశ్రమల్లో వ్యర్ధాలను శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టాలని కోరుతున్నారు. రూ.3 లక్షల విలువైన వలను, లక్ష విలువ గల చేపలను కోల్పోయామని, ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. -
తాళ్లపాలెం సంతకు పండగొచ్చింది...
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం వారపు సంతలో సోమవారం గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా సాగాయి. పూర్వ విశాఖ జిల్లా, కాకినాడ జిల్లాల నుంచి పెంపకందారులు, వ్యాపారులు గొర్రెలు, మేకలు అమ్మకానికి తీసుకు వచ్చారు. సుమారు వెయ్యి వరకు వచ్చాయి. వీటిని విశాఖ, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, పెంపకందారులు, హోటల్ యజమానులు వచ్చి కొనుగోలు చేసి వ్యాన్లు, ఆటోల్లో తీసుకు వెళ్లారు. పరిమాణం అనుసరించి రూ. ఐదారు వేల నుంచి రూ.30 వేల వరకు ఒక్కొక్కటి అమ్మకాలు సాగాయి. అలాగే గొర్రెలు, మేకల మందలను కూడా అమ్మకానికి తీసుకు రాగా, వాటి సంఖ్యను అనుసరించి రూ.నాలుగైదు లక్షలకు విక్రయించారు. అయితే ప్రస్తుతం సీజన్ కావడంతో ఎక్కువగా పిల్ల మేక, గొర్రెలతో అమ్మకానికి వచ్చాయి. సంక్రాంతి సమీపిస్తుండడంతో పందెం కోడి పుంజుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కటి రూ.2 వేల నుంచి రూ.పది వేల వరకు విక్రయాలు సాగాయి. కూరగాయలు కిలో పాదు చిక్కుడు రూ.100, వంకాయ రూ.80, దొండకాయ, బీట్రూట్, క్యారెట్, బీరకాయ రూ.70, టమాటా రూ.60, ఉల్లిపాయ, బంగాళాదుంప రూ.30 ధరలో విక్రయాలు జరిగాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా అదనంగా రూ.70 పెరిగింది. గత వారం రూ.50 ఉండగా, ఈ వారం రూ.120కి పెరిగింది. -
గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం
దేవరాపల్లి: రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బి.బాలునాయక్ తెలిపారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో దేవరాపల్లి మండల రైవాడ అథితి గృహానికి చేరుకొని స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5,459 కోట్లు కేటాయించిందని, కొన్ని పనులు జరుగుతుండగా మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు కొంతమేర అడ్డంకిగా మారినప్పటికీ ఇప్పటికే 128 పనులకు అనుమతులు సాధించామన్నారు. అకాల వర్షాలతో రోడ్ల నిర్మాణ పనులలో కొంత మేర జాప్యం జరిగిన మాట వాస్తమేనని, ఇకపై వేగవంతం చేసేందుకు విశాఖలో ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో సమీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పీఆర్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, పాడేరు ఈఈ కొండయ్య పడాల్, అరకు డీఈఈ రామం, మాడుగుల పీఆర్ డీఈఈ ఎ.శ్రీనివాసరావు, దేవరాపల్లి పీఆర్ ఏఈ పి.సుమతి తదితర్లు ఉన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి
దేవరాపల్లి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేవరాపల్లిలో ఉపాధి కూలీలతో కలిసి సోమవారం ఆయన నిరసన తెలిపారు. 2025 ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. 2025 చట్టం ప్రకారం వ్యవసాయ పనుల్లేని రోజుల్లో ఏడాదిలో 100 రోజులు ఎప్పుడైనా పనులు పొందే అవకాశం ఉండేదని, నేడు ఆ హక్కు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి గతంలో 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రం నిధులు కేటాయించేదన్నారు. ప్రస్తుత మార్పులతో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా మార్పులు చేశారన్నారు. తద్వారా రాష్ట్రంపై రూ. 2800 కోట్లు భార పడుతుందన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో బి.నాగేశ్వరరావు, శంకరరావు, మామిడి దేముడు, గణేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
అనకాపల్లి: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షులుగా వత్సవాయి శ్రీలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొంది చినబ్బాయ్, గౌరవాధ్యక్షునిగా పంపనబోయిన వెంకట్రావు, సహాధ్యక్షులుగా రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, కోశాధికారిగా జోగా రాజేష్, కార్యదర్శులుగా పొలిమేర చంద్రరావు, గుత్తుల సూర్యప్రకాశరావు, వైరాల రమేష్రావు, ఉప్పాడ రాము, పట్టా శ్రీరామచంద్రమూర్తి, జాలాది శాంతకుమారి, మురహరి సంతోష్, గేదెల శాంతి దేవి, చైతన్య, ఆడిట్ కమిటీ కన్వీనర్గా బయలుపూడి దేముడునాయుడు, సభ్యులుగా షేక్ సలీం, కాట్రపల్లి సత్తిబాబు, రొట్టెల లక్ష్మణరాజు, అనిమిరెడ్డి సాంబమూర్తి ఎన్నికయ్యారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు పదవిలో ఉంటుందని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుర్ల మురళీమోహన్ చెప్పారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. -
9వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా సూర్యనారాయణ
సూర్యనారాయణను అభినందిస్తున్న ఎమ్మెల్యే రాజు, న్యాయవాదులు చోడవరం: స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాధి చీపురుపల్లి సూర్యనారాయణ నియమితులయ్యారు. ఆయనను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యనారాయణ చోడవరం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీనియర్ న్యాయవాదిగా పేరున్న ఆయన ఏపీపీగా నియమితులవ్వడంపై బార్ అసోసియేషన్తో పాటు అంతా అభినందనలు తెలిపారు. ఆయనను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ గూనూరు పెదబాబు, మాజీ జెడ్పీటీసీ కనిశెట్టి మచ్చిరాజు, గవర కార్పొరేషన్ డైరక్టర్ బొడ్డేడ గంగాధర్ అభినందించారు. -
అలరించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు
చీడికాడ: మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా చుక్కపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు అలరించాయి. పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. జగన్మోహన్రెడ్డి దార్శనికుడని, అందువల్లనే ఆయన జన్మదినం అంటే పల్లెల్లో మందస్తు సంక్రాంతి పండగేనన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. విజయనగరం,ఉమ్మడి విశాఖ,తూ.గో జిల్లాలకు చెందిన 27 ఎడ్ల బళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో చీడికాడ, దేవరాపల్లి వైఎసా్స్ర్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, బూరే బాబురావు, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సుంకర లక్ష్మి, యూత్ అధ్యక్షుడు గొల్లవిల్లి స్వామినాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పోటీల్లో మాడుగుల మండలం కె.జె.పురానికి చెందిన కొయిలాడ మోహన్ బండి ప్రథమస్థానంలో నిలిచి బహుమతి గెలుచుకుంది. రెండవ స్థానంలో శ్రీ పరదేసిమాంబ వావిలపాడు బండి నిలిచింది. విజేతలకు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సభ్యులు సుంకర లక్ష్మీ, బాయిశెట్టి వెంకటరమణ, సకలా రమణ,పెంటకోట ఈశ్వరరావు బహుమతులు ప్రదానం చేశారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రామచంద్రపురం సమీపంలో పూర్వ విద్యార్దులు కలుసుకున్న దృశ్యం మాడుగుల రూరల్: ముఫ్ఫై తొమ్మిదేళ్ల క్రితం మాడుగుల జిల్లా పరిషత్ హైస్కూలులో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు మాడుగుల సమీపంలో గల రామచంద్రపురం వద్ద ఆదివారం కలుసుకున్నారు. 1985–86 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా ఒక చోట ఆత్మీయంగా కలుసుకొంటున్నారు. అప్పట్లో 85 మంది విద్యార్దినీ, విద్యార్దులు చదువుకోనగా, ఆదివారం 40 మంది ఒకే చోట కలుసుకోని తమ చిన్న నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. వీరి సమావేశానికి కృషి చేసిన వారిలో వడ్దాది శాంతేశ్వరావు, దంగేటి ప్రసాదు, కాళ్ల బాలకృష్ట, కోడూరు వెంకటరమణ, ద్వారపూడి కొండాజీ, బి.వి.జగన్నాథరావు ఉన్నారు. -
పల్స్పోలియోపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
నాతవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియా కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాయని డీపీఎం నేతల ప్రశాంతి అన్నారు. మండలంలో ఆదివారం పల్స్ పోలియా కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. తాండవ జంక్షన్లో పోలియా చుక్కలు వేసే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు. సరుగుడు పంచాయతీలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, చెర్లోపాలెంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టరు రాజాన వీర సూర్యచంద్ర, పెద గొలుగొండపేటలో సర్పంచ్ వైఎస్సార్సీపీ మండల శాఖ పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడు మిరపల వెంకటరమణ చిన్నారులకు పోలియా చుక్కలు వేశారు. నాతవరం,గునుపూడి పీహెచ్సీ వైద్యాధికారులు నాగభూషణరావు, ప్రసన్నకుమార్, చక్రవర్తి పాల్గొన్నారు.వైద్యాశాఖ డీపీఎం నేతల ప్రశాంతి -
రాజపుత్ర సమాజ్ అభ్యున్నతికి కృషి చేయాలి
రాజపుత్ర సమాజ్లోని ప్రముఖుల్ని సత్కరిస్తున్న దృశ్యం అచ్యుతాపురం: రాజపుత్ర సమాజ్లో ఉన్న పలువురు పేద విద్యార్థులను చదివించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అచ్యుతాపురం మండలంలోని కొండకర్లలో నిర్వహిహించిన అనకాపల్లి జిల్లా రాజ్పుత్ర సమాజ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. క్షత్రియుల్లో ఉన్న పేదవారి అభ్యున్నతికి రాజ్పుత్ర సమాజ్లో బాగా స్థిరపడిన వారు సహకరించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఎంఎల్సీ ఇందుకూరి రఘురాజు పిలుపునిచ్చారు. మాజీ ఎంఎల్సీ చైతన్య రాజు మాట్లాడుతూ క్షత్రియుల్లో పేద విద్యార్థులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మాట్లాడుతూ తాను కూడా క్షత్రియుల్లోని పేద విద్యార్థులను చదివించానని అన్నారు. మాజీ ఎమ్మెల్సీలు డీవీ సూర్యనారాయణ రాజు, పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన సంఘ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా క్షత్రియ విద్యార్థులకు సహకరించాలని కోరారు.అనకాపల్లి రాజ్పుత్ర సమాజ్ అధ్యక్షుడు దిలీప్కుమార్ను పలువుర్ని సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ క్షత్రియ ఫెడరేషన్ ఛైర్మన్ జీఎస్ రాజు, వైస్ చైర్మన్ కేకే రాజు, సీఎస్ఎన్ రాజు, రాధా సుందర సుబ్బరాజు, మంతెన లీలావతి, నరేంద్ర రాజు పాల్గొన్నారు. -
ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు ప్రోత్సాహం
మహారాణిపేట (విశాఖ): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఎలక్ట్రాన్ వైబ్–హ్యాక్ ఏపీ హ్యాకథాన్’ ఫలితాలను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ప్రకటించారు. విశాఖలోని సీవోఈఈటీ భవనంలో జరిగిన ఈ పోటీల్లో పలు స్టార్టప్ సంస్థలు తమ ప్రతిభను చాటాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, ఏపీట్రాన్స్కో జేఎండీ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్తో కలిసి ఆయన విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. పృథ్వీతేజ్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యమన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను ముందస్తుగా గుర్తించడం, హైటెన్షన్ లైన్లలో ఇన్సులేటర్ లోపాలను కనిపెట్టడం వంటి అంశాలపై స్టార్టప్లు వినూత్న పరిష్కారాలను చూపాయన్నారు. ప్రతిభావంతులైన యువతకు పైలట్ ప్రాజెక్టులు కేటాయించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ -
గాయపడిన హెచ్ఎం ఝాన్సీ మృతి
పాయకరావుపేట: బస్సెక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కిందపడి గాయపడిన ఎస్.నర్సాపురం జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం ఎం.ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ జి.అప్పన్న, ఎంఈవో రమేష్బాబు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. హెచ్ఎం ఎం.ఝాన్సీ (62) 20 వ తేదీ శనివారం పాఠశాలలో విధులు ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు పాయకరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి అనకాపల్లి వెళ్లడానికి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. బస్ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో ఆమె పుట్పాత్ నుంచి కాలు ఇరుక్కుపోయి కిందపడిపోయారు. వెంటనే ఆమెను ఉపాధ్యాయులు తుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి అక్కడ నుంచి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం శనివారం రాత్రి 2.30 గంటలకు మృతి చెందారు.హెచ్ఎం ఎం.ఝాన్సీ (ఫైల్), ఝాన్సీమృతదేహం -
సంక్రాంతికి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలి
● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుర్ల మురళీమోహన్ సమావేశంలో మాట్లాడుతున్న సుర్ల మురళీమోహన్ అనకాపల్లి: వచ్చే ఏడాది సంక్రాతికై న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ జూన్ 2023తో ముగిసిందని నేటివరకూ పీఆర్సీపై ప్రభుత్వ ఎటువంటి ప్రకటన చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుర్ల మురళీమోహన్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషనర్ని నియమించాలని, పీఆర్సీని అమలు చేసేలోగా మధ్యంతర భృతి (ఐఆర్) సంక్రాంతికి ప్రకటించాలని కోరారు. నేటి వరకూ మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా తక్షణమే ప్రకటించాలని ఆయన కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ బోధనకు సంబంధం లేని కార్యక్రమాలు పాఠశాలల్లో అమలు చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి, గౌరవాఽధ్యక్షుడు పంపాన వెంకటరావు, సహధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, జిల్లా కోశాధికారి జోగా రాజేష్, జిల్లా కార్యదర్శులు ప్రకాష్, రమేష్, శేషుకుమార్, చైతన్య, రాష్ట్ర కౌన్సిలర్లు ఎల్లయ్య బాబు, గేదెల శాంతిదేవి, మారిశెట్టి వెంకటప్పరావు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు జి.రాజు అన్నారు. స్థానిక నర్సింగరావుపేటలోని సీపీఎస్ కార్యాలయం మేడమైన సీపీఎస్ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు 10 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమలు నిర్వహించడం జరిగిందన్నారు. పీఎఫ్ఆర్డీఏ చట్టం 2013 నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా 2013కు ముందు నియామకం పొందిన ఉద్యోగులందరిలోపాటు, 2003 డీఎస్సీతోను పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీపీఎస్ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇ.కిషోర్, బి.రామాంజనేయులు, వి.మురళి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థాయికి దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలంలోని బోయిలకింతాడ చెరకు కాటా వద్ద కాటా పరిధిలోని గ్రామాల చెరకు రైతులు ఆదివారం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెరకు బండ్లు, రైతులతో కళకళలాడాల్సిన కాటా వద్ద రైతులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్ల మేర నిధులు కేటాయించి, రైతులకు, కార్మికులకు ఎన్నడూ కష్టాలు రానీయలేదని గుర్తు చేశారు. గతంలో సంక్రాంతి సీజన్లో రైతుల చేతిలో డబ్బులు ఉండేవని.. నేడు రెండు సీజన్లు గడుస్తున్నా పైసా విదిల్చే నాథుడు లేక రైతులు, కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.– పూర్తి వివరాలు 8లో -
ఉద్యమ కమిటీలో చీలిక!
● రాజయ్యపేటలో టెంట్ల తొలగింపు ● ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ లేకుండా తొలగింపు తగదని ఒక వర్గం అసంతృప్తి గ్రామంలో సమావేశమైన మత్స్యకారులురాజయ్యపేటలో నిరాహార దీక్ష కోసం వేసిన టెంట్లు తొలగిస్తున్న దృశ్యంనక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ దాదాపు 70 రోజులపాటు మత్స్యకారులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం ముగింపు పలికింది. ఆదివారం రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి నూకతాత ఆలయం వద్ద మత్స్యకారులు ధర్నా కోసం వేసిన టెంట్లను మత్స్యకారులతో తొలగింపజేశారు. టెంట్ల తొలగింపుపై మత్స్యకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైన హామీ లేకుండా టెంట్లు తొలగించడాన్ని కొంతమంది తప్పు పడుతూ ఆదివారం రాత్రి పోలీసు సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తామని హోం మంత్రి అనిత ఇచ్చిన హామీతో మత్స్యకారులు నెల రోజుల క్రితం తాత్కాలికంగా దీక్షను విరమించిన విషయం తెలిసిందే. శనివారం తాళ్లపాలెం వచ్చిన సీఎం చంద్రబాబు వద్దకు మత్స్యకారులను తీసుకెళ్లారు. ఆయన కేవలం రెండు నిమిషాలు మాట్లాడి ‘మీ గ్రామ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని, ఇంకా ఏమైనా సమస్యలుంటే హోం మంత్రి, కలెక్టర్తో మాట్లాడండి’ అని ముగించేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మత్స్యకారులు చేసేదేమీ లేక మెత్తబడ్డారు. ఇదే అవకాశంగా భావించిన అధికారులు ఆదివారం గ్రామంలోకి వెళ్లి నూకతాత ఆలయం వద్ద నిరాహార దీక్ష కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. గ్రామస్తులతో పోలీసుల సమావేశం తొలుత డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని సీఎం తెలియజేసినందున టెంట్లు స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయమని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీన్పార్క్ మాత్రమే ఏర్పాటు చేయాలని రాతపూర్వకంగా రాసివ్వాలని కొందరు మత్స్యకారులు కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు వెళ్లి కోరాలని కొంతమంది మత్స్యకారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత టెంట్లు తొలగించాలని సమావేశానికి వచ్చిన కొంతమంది మత్స్యకారులు సూచించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుని టెంట్లు తొలగించాల్సిందేనని, మీరే స్వయంగా టెంట్లు తొలగిస్తే బాగుంటుందని, తాము గనుక తొలగిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. కమిటీగా ఏర్పడిన వారిలో కొంతమంది టెంట్లు తీసేందుకు సిద్ధపడగా కొంతమంది సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ లేకుండా టెంట్లు తీయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద ఉద్యమ కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదని, కేవలం ఉద్యమాన్ని నీరు గార్చడం కోసమే రాజయ్యపేటలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. -
జూలో నల్ల హంసను దత్తత తీసుకొన్న చిన్నారి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. నగరానికి చెందిన అల్వార్దాస్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న నలం జెస్వికా అనే చిన్నారి తన పుట్టినరోజును పురస్కరించుకుని జూలోని ఒక నల్ల హంసను ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి జూను సందర్శించిన జెస్వికా, వన్యప్రాణుల పట్ల తనకున్న మక్కువను చాటుకుంది. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి. మంగమ్మ చిన్నారి జెస్వికాను ప్రత్యేకంగా అభినందించి, దత్తత ధ్రువీకరణ పత్రంతో పాటు అడాప్షన్ కిట్ను అందజేశారు. ఇంత చిన్న వయసులో వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావడం అభినందనీయమని ఆమె కొనియాడారు. జూలోని మూగజీవాల పోషణ, సంరక్షణ కోసం మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. -
పల్స్ పోలియో విజయవంతం
● జిల్లాలో 96.72 శాతం నమోదు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి/నర్సీపట్నం: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 96.72 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి తెలిపారు. ‘మన బిడ్డల భవిష్యత్తు–మన బాధ్యత’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశామని తెలిపారు. జిల్లాలో 1,446 కేంద్రాలలో 1,97,810 మంది చిన్నారులకు గాను 1,91,319మందికి డ్రాప్స్ వేశారు. జిల్లా రూరల్ ప్రాంతాల్లో 98.07 శాతం, అర్బన్ ఏరియాల్లూ 94.59 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం పోలియో డ్రాప్స్ వేసుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వచ్చి వైద్య ఆరోగ్య సిబ్బంది పోలియో డ్రాప్స్ వేస్తారని చెప్పారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరజ్యోతి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్ ఎన్.వి.సుధాశారద పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అనకాపల్లి బాలికల ప్రతిభ
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానం, బాపట్ల జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. ముగింపు కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ విజయ్కుమార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి, ఒలింపిక్ సంఘం కార్య నిర్వహణ కార్యదర్శి సునీల్కుమార్, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, కప్పులను అందజేసి అభినందించారు. జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
డీసీసీబీ చైర్మన్ తాతారావు చోడవరం : సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పేర్కొన్నారు. సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ మహాజన సభ ఆదివారం వెంకన్నపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబరు 36 అమలుతో పాటు సహకార ఉద్యోగులకు ఆరోగ్య బీమా మూడు లక్షల రూపాయల పెంపుదలతో పాటు 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల అమలు గురించి, తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి జి. రమణ, ఉపాధ్యక్షుడు అప్పారావు, లోవరాజు పాల్గొన్నారు. -
తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా వెంకటరావు
అనకాపల్లి జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం అనకాపల్లి: అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా గండేపల్లి వెంకటరావు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక రింగ్రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలిశెట్టి నూకేశ్వరరావు, కోశాధికారిగా రాజపూడి కోటేశ్వరావు, మరో 20 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గండేపల్లి వెంకటరావు చెప్పారు. అంతకుముందు సంఘం జిల్లా వనభోజన కార్యక్రమం జరిగింది. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి టౌన్: స్ధానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో మాగ్నేసియా కంపెనీ సీఎస్సార్ నిధులతో పలు కార్యక్రమం నిర్వహించారు. రూ.1.80 లక్షలతో నిర్మించే డి–అడిక్షన్ సెంటర్, పేషెంట్స్ వెయిటింగ్ హాల్, నూతన మార్చురీ భవన పనులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శంకుస్థాపన చేశారు. ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎంపీ లాడ్స్ నిధులతో పట్టణంలోని కీలక ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 80 సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్కార్పియో వాహనం, నాగార్జున సిమెంట్స్ వారు అందజేసిన 55 స్టాపర్ బోర్డులను ప్రారంభించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -
జనం మదిలో జగనన్న
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సంబరాలు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో వాడవాడలా పండగ వాతావరణం నెలకొంది. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా విస్తృత సేవా కార్యక్రమాలతో అభిమానం చాటుకున్నారు. అనేక చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు పండ్లు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఊరూరా కేక్ కటింగ్లు, సంబరాలు మిన్నంటాయి. బాణసంచా కాల్చి వేడుక జరుపుకొన్నారు.సాక్షి, అనకాపల్లి: అభిమానం ఉప్పొంగింది. సేవాభావం వెల్లివిరిసింది. అధినాయకుడి పుట్టిన రోజును అభిమానులు పండగలా చేసుకున్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సువర్ణ పాలనను ప్రజలు తలచుకున్నారు. జననేతా.. వర్థిల్లు వందేళ్లు.. అని ఆశీర్వదించారు. ● చోడవరం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం, గోవాడ శివాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోడవరంలో అమర్నాథ్ కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర యూత్ విభాగం సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య పాల్గొన్నారు. ● నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్, ఆయన తనయుడు విజయ్ అవినాష్తోపాటు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పెట్ల అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, స్టేట్ యూత్ విభాగం జాయింట్ సెక్రటరీ చింతకాయల వరుణ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం వృద్ధాశ్రమం, ఆర్సీఎం ఆస్పత్రి, ప్రభుత్వ ఆస్పత్రులలో వృద్ధులకు, రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు అందజేశారు. చుక్కపల్లిలో జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పాల్గొని కేక్ కట్ చేశారు. ● యలమంచిలి, అచ్యుతాపురంలలో పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కొండకర్ల ఆవ సమీపంలో ఇచ్ఛా ఫౌండేషన్లో ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ధర్మశ్రీ పాల్గొని.. దివ్యాంగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. మునగపాకలో పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కరణం ధర్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ పాల్గొన్నారు. ● పాయకరావుపేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు నిర్వహించిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో సమన్వయకర్త కంబాల జోగులు పాల్గొని కేక్ కట్ చేశారు. నక్కపల్లి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ నిర్వహించిన వేడుకల్లో కూడా కంబాల జోగులు పాల్గొని కేక్ కట్ చేశారు. అభయాంజనేయస్వామి ఆలయంలో జగన్మోహన్రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటవురట్ల మండంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్ఎస్ సీతారామరాజు, జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి కేక్ కట్ చేశారు. ● ఆనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కేక్ కట్ చేశారు. సత్యనారాయణపురం, కొత్తూరు, తుమ్మపాల గ్రామంలో, పట్టణంలోని 80వ వార్డులో, కశింకోట మండలంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. గవరపాలెంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు.ఉప్పొంగిన అభిమానం.. వెల్లివిరిసిన సేవాభావం జిల్లావ్యాప్తంగా ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు -
చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థాయికి దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. మండలంలోని బోయిలకింతాడ చెరకు కాటా వద్ద కాటా పరిధిలోని గ్రామాల చెరకు రైతులు ఆదివారం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా బోయిలకింతాడ గ్రామ ప్రధాన కూడలి నుంచి చెరకు కాటా వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కాటా ఎదుట ప్లకార్డులతో చెరకు రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ కూటమి పాలకుల తీరుతో రైతులు కంట తడి పెట్టే దయనీయ పరిస్థితి నెలకొందని, రైతులు ఉసురు తప్పకుండా తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు బండ్లు, రైతులతో కళకళలాడాల్సిన కాటా వద్ద నేడు రైతులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రూ. 90 కోట్ల మేర నిధులు ఫ్యాక్టరీకి కేటాయించి, ఐదేళ్ల పాలనలో రైతులకు, కార్మికులకు ఎన్నడూ కష్టాలు రానీయలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని ఆదుకుంటామని ఊరు వాడా ఊదరగొట్టిన ఈ ప్రాంత ఎంపీ, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ సమస్యలపై దృష్టి సారించక పోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ ప్రాంతానికి కొత్తగా ఫ్యాక్టరీలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఉన్న పరిశ్రమను కాపాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో సంక్రాంతి సీజన్లో రైతుల చేతిలో డబ్బులు ఉండేవని, నేడు రెండు సీజన్లు గడుస్తున్నా పైసా విదిల్చే నాధుడు లేక రైతులు, కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని అద్భుతంగా నడిపిస్తామని నమ్మబలికిన కూటమి నేతలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందాక రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఎండీ ద్వారా చెరకు సరఫరా చేయాలని కరపత్రాలు పంపిణీ చేయించిన ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడానికి ముఖం చాటేయడం అత్యంత దారుణమన్నారు. కూటమి నేతలు కేవలం ఓట్ల కోసమే రైతులకు మోసపూరిత హామీలు గుప్పించారని, ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా వారి తీరు ఉందని ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారం అక్టోబర్లో నిర్వహించాల్సిన సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభను ఇప్పటికీ నిర్వహించక పోవడం అన్యాయమన్నారు. ఫ్యాక్టరీ చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్, ఎండీ సైతం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఫ్యాక్టరీని ఎందుకు నడిపించలేక పోతున్నారో, రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ధ్వజమెత్తారు. మహాజన సభను తక్షణమే నిర్వహించి రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. తక్షణమే ఫ్యాక్టరీని తెరిపించి సుమారు రూ. 35 కోట్ల మేర నిధులు విడుదల చేస్తే తప్ప ఫ్యాక్టరీ మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం, పాలకులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు చెరకు రైతులు, కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే రైతుల పక్షాన నిలబడి ఉద్యమం చేపడతామని ముత్యాలనాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలం నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సీడీసీ డైరక్టర్ అన్నం రాము, వైఎస్సార్సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు అన్నం రామునాయుడు, పార్టీ నియోజకవర్గ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డా. వరదపురెడ్డి సింహాచలం నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు కెవి.రమణ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు గొర్రుపోటు సుధారాణి, ఉర్రూకుల అప్పారావు, సర్పంచ్లు చింతల సత్య వెంకటరమణ, రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు, దాడి జగన్, గూడెపు రాము, గంధం రామకృష్ణ, రెడ్డి సూర్యనారాయణ, టోకురి రామకృష్ణ, ఎంపీటీసీలు రొంగలి నారాయణమ్మ, పోతల వెంకటరావు, సీనియర్ నాయుకులు అన్నం రామునాయుడు, చల్లా నాయుడు, బండారు దేముడునాయుడు, భుగత వెంకటరమణ, రుత్తల రాంబాబు, గొర్లె రామ కొండలరావు, కాటిపాం పెదనాయుడు, దాసరి గోపి, బండారు ప్రసాద్, మజ్జి రాజు, రుత్తల రాంబాబు, వంటాకు శ్రీను, చింతు రాము, కిల్లాన వెంకటరమణ పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతపడే స్థాయికి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ తెరవక అల్లాడుతున్న కార్మికులు, రైతులు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం బోయిలకింతాడలో చెరకు కాటా ఎదుట రైతుల భారీ నిరసన -
ఒత్తిడిని జయించేందుకు ధ్యానమే ఆయుధం
ధ్యానంలో విద్యార్థులు, పెద్దలు నర్సీపట్నం: ఒత్తిడిని జయించేందుకు ధాన్యమే దివ్య ఔషాదమని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీమినీ స్టేడియంలో ఆదివారం హార్ట్పుల్నెస్ సంస్థ వారు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ధ్యాన తరగతులు ఏర్పాటుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హార్ట్పుల్నెస్ అవుట్రీచ్ రీజినల్ ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ మాచాలి మాట్లాడుతూ రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మావతి, జెడ్పీటీసీ సకల రమణమ్మ పాల్గొన్నారు. -
మా బాబుకి పునర్జన్మ ఇచ్చిన దేవుడు జగనన్న
మాది నర్సీపట్నం టౌన్లో శివపురం కాలనీ. మా బాబు పేరు కర్రి మోహిత్. వయస్సు ఐదు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. పుట్టిన ఏడు నెలలకే ట్రాకియోస్టమీ అనే శ్వాస కోశ వ్యాధితో బాధపడేవాడు. గొంతులో శ్వాసకు శ్లేష్మం అడ్డంకి ఉన్నప్పుడు.. వెంటిలేటర్ ద్వారా శ్వాసనాళం నుంచి దానిని తొలగించేవారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. మాట్లాడేవాడు కాదు..పాలు తాగేవాడు కాదు.చనిపోయే పరిస్థితికి వచ్చేశాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. తెలిసిన బంధువుల ద్వారా విశాఖ రెయిన్బో ఆస్పత్రిలో రెండేళ్ల పాటు వైద్యం చేయించాం. తరువాత అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి విజయవాడ బిజామ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అప్పటికే చాలా మంది వద్ద అప్పులు చేసి వైద్యం చేయించాం. ఎవరూ మాకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక మా బాబును ఇంటికి తీసుకొచ్చాం. అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ద్వారా సీఎం జగనన్నకు మా పరిస్థితిని చెప్పుకున్నాం. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5.8 లక్షలు అందజేశారు. విజయవాడలో బిజామ్స్ హాస్పిటల్లో గొంతులో శ్వాసనాళంలోకి (ట్రాకియా) నేరుగా గాలిని పంపించడానికి ఆపరేషన్ చేసి రంధ్రం ద్వారా ట్రాకియోస్టమీ ట్యూబ్ (గొట్టం) ఆపరేషన్ చేశారు. ఇప్పుడు వ్యాధి పూర్తిగా నయమైంది. స్కూల్లో కూడా జాయిన్ చేశాం. మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. మా కుమారుడికి పునర్జన్మను ఇచ్చిన దేవుడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. – కర్రి శంకరాచారి, సంయుక్త, నర్సీపట్నంఆపరేషన్ జరిగిన ప్రాంతాన్ని చూపుతున్న మోహిత్ తల్లిదండ్రులు సంయుక్త, శంకరాచారి -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజుకు ఢోకా లేదు..
ఈమె పుల్లేటికుర్తి అప్పలరత్నం. ఈమెది గొలుగొండ మండలం, గొలుగొండ గ్రామం. తండ్రి సత్తిబాబు టైలర్, తల్లి గృహిణి. తండ్రి సంపాదన మీదే కుటుంబ జీవనం సాగేది. 2019 నుంచి కాకినాడ కై ట్ కాలేజీలో మూడేళ్ల పాటు డిప్లమో చదింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.35 వేలు చొప్పున మూడేళ్లకు ప్రభుత్వం నుంచి రూ.1.05 లక్షలు ఫీజురీయింబర్మెంట్ కింద కాలేజీకి జమఅయింది. దీంతో మూడేళ్లు పైసా ఖర్చు లేకుండా డిప్లమో పూర్తి చేసింది. 2023లో రాజమండ్రి గైట్ కాలేజీ బీటెక్లో చేరింది. ఏడాదికి రూ.58 వేలు కాలేజీకి చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రెండు నెలల క్రితం కేవలం రూ.14 వేలు మాత్రమే ఇచ్చింది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్కు ఇబ్బంది పడలేదు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద ఫ్లిప్కార్ట్ స్టోర్ ఆఫీసు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి శనివారం మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇత్తంశెట్టి సూర్యనారాయణ(46) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొంది, కోలుకోవడంతో వారం రోజుల క్రితం ఇంటికి పంపించారు.మళ్లీ అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సూర్యనారాయణ మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శనివారం సాయంత్రం మృతుని స్వగ్రామం పోతురెడ్డిపాలెంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.ఇదే ప్రమాదంలో గాయపడిన సూర్యనారాయణ భార్య సత్యవతి కోలుకున్నారు. -
మూడు టన్నుల ధాన్యం చోరీ
దేవరాపల్లి: మండలంలో అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి అపహరించారు. ఎం.అలమండ, ఎన్.జి. నగరం గ్రామాలకు చెందిన రైతులు నూర్చి విక్రయించేందుకు తమ కల్లాల్లో సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను చోరీ చేశారు. సుమారు రూ. 3 లక్షల విలువైన 3 టన్నుల ధాన్యం చోరీకి గురైనట్టు బాధిత రైతుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. ఎం.అలమండ గ్రామానికి చెందిన పీలా బలరాం (16 బస్తాలు), పొలిపిరెడ్డి రమణ(10 బస్తాలు), గొల్లు నరసమ్మ(ఆరు బస్తాలు), రొంగలి సన్నిబాబు(నాలుగు బస్తాలు), ఎల్లపు ఈశ్వరరావు(మూడు బస్తాలు), ఎన్.జి. నగరానికి చెందిన రొంగలి వెంకటరావు(15 బస్తాలు), ఆదిరెడ్డి మౌళి (12 బస్తాలు), బర్ల త్రిమూర్తులు(3 బస్తాలు) ఽతదితర రైతులు తమ ధాన్యం బస్తాలు చోరీకి గురైనట్లు తెలిపారు. ప్రతీ ఏటా మాదిరిగా నూర్చిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి కల్లాల్లోనే టార్పాలిన్లతో కప్పి ఉంచామన్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న కల్లాల్లో ధాన్యం బస్తాలను అపహరించుకుపోయారని తెలిపారు. అర్ధరాత్రి వరకు తామంతా కల్లాల్లోనే ఉన్నామని, శనివారం తెల్లవారు జామున వచ్చి చూడగా కొన్ని బస్తాలు మాయమయ్యాని రైతులు వాపోయా రు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట దొంగల పాలైందని, గతంలో ఎన్న డూ ఇలాంటి దొంగతనాలు జరగలేదని అన్నదాతలు తెలిపారు. కల్లాల్లో ఉంచిన బస్తాలు అపహరణ -
రాష్ట్ర స్థాయి సైన్సు ఫెయిర్కు ఎంపిక
మాడుగుల రూరల్: రాష్ట్ర స్థాయి సెన్సు ఫెయిర్కు మండలంలో జి.అగ్రహారం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం బి. ఉమాశంకర్ శనివారం తెలిపారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 19 వ తేదీ శుక్రవారం చోడవరం హైస్కూల్లో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు ప్రయోగాలు అబ్బురపరిచాయి. గైడ్ ఉపాధ్యాయుడు దేవవర్మ సారథ్యంలో పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఆర్లె గాయత్రి, నందారపు లక్ష్మీ ప్రసన్నలు, మ్యాథమెటికల్ మోడలింగ్లో టవర్ ఆఫ్ హోనోయ్ (బ్రహ్మస్తంభం, మరియు మీ పుట్టిన తేదీ చెపుతా అనే అంశాలపై తయారు చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఆయా విద్యార్థులను పాఠశాల వర్గాలు అభినందించారు. కె.కోటపాడు: చోడవరంలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో మండలంలో ఎ.కోడూరు హైస్కూల్కు చెందిన విద్యార్థులు సుస్ధిర వ్యవసాయం కేటగిరిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయా విద్యార్థినులు ఈర్లె నవ్య, భార్గవిలను నిర్వాహకులు అభినందించి షీల్డ్లతో పాటు సర్టిఫికెట్లను అందించారు. ఈ ప్రదర్శన రాష్ట్ర స్ధాయికి ఎంపిక కావడంతో ఈ నెల విజయవాడలో 23, 24 తేదీల్లో జరిగే పోటీల్లో విద్యార్థులు ప్రదర్శిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఎంఈవోలు సత్యనారాయణ, డీవీడీ ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. -
దార్శనిక నేత సంక్షేమ ప్రదాత
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నవరత్నాలు చేరని కుటుంబం లేదు... సంక్షేమ పథకాల ఫలితం పొందని పేదవాళ్లూ లేరు... మ్యానిఫెస్టోలో నెరవేరని హామీ కూడా లేదు... పథకాల అమలులో మాట తప్పిందీ లేదు... ఎటువంటి కష్టకాలం వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా సంక్షేమ రథాన్ని దిగ్విజయంగా నడిపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జనం గుండెల నిండా ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనరంజక పాలనందించింది. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి బాటలు వేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన 1,341 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజాసేవలకు క్షేత్రస్థాయిలో వేదికగా మారాయి. 10,660 మంది ఉద్యోగులు, మరో 21 వేల మంది వలంటీర్లతో గడప వద్దకే పాలనను అందించారు. నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికీ నయాపైసా అవినీతికి ఆస్కారం లేకుండా చేర్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో జిల్లా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయింది. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించి, డిజిటల్ విద్యకు నాంది పలికారు. ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చారు. దేశానికే ఆదర్శంగా పాలన అందించారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాలనలో లబ్ధిపొందిన వారు తమ అభిమాన నాయకుడితో ఉన్న అనుబంధాన్ని, పొందిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. – సాక్షి, అనకాపల్లి ● జననేత జనరంజక పాలన దేశానికే ఆదర్శం ● విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ● నాడు–నేడు ద్వారా పాఠశాలలకు కొత్తరూపు ● సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు ● ఆరోగ్యశ్రీ ద్వారా పేదోడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం -
జగనన్న హయాంలో రైతులకు ఎంతో మేలు
ఈ చిత్రంలో రైతు పేరు పయిల నూకన్న నాయుడు. నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట చెందిన ఈయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. జగనన్న రైతు భరోసా కింద ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందింది. ప్రతిఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. అంతకు ముందు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన నూకన్న నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో అప్పుచేయకుండా వ్యవసాయం చేశాడు. గతంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేసేవాడు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో స్వగ్రామంలో అందజేయడంతో పీఏసీఎస్లు, వ్యవసాయశాఖ కార్యాలయా ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోయింది. ధాన్యం కొనుగోలు కూడా ప్రభుత్వమే చేపట్టింది. అన్ని విధాల రైతులకు ప్రయోజనం కలిగింది. దీంతో ఐదేళ్లపాటు ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోగలి గాడు. ఇతర పథకాల వల్ల కూడా నూకన్న నాయు డు కుటుంబానికి లబ్ధి చేకూరింది. మనవడికి అమ్మఒడి పథకం, డ్వాక్రా రుణ మాఫీ, ఇంటి స్థలం, వైఎస్సార్ చేయూత వంటి పథకాల వల్ల సుమారు మూడు లక్షల మేర లబ్ధిపొందాడు. -
పేద కుటుంబానికి ఆసరా..
ఈమెది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమాని మునగపాక మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన ముప్పిడి కొండబాబు,లక్ష్మి కుటుంబానికి పెద్ద ఎత్తున మేలు చేకూరింది. కొండబాబు స్థానికంగా పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి స్థాని కంగా ఆయాగా సేవలందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కుటుంబానికి పెద్దమొత్తంలో లబ్ధి చేకూరింది. కొండబాబుకు వచ్చే అరకొర వేతనంతో పాటు జగన్మోహన్రెడ్డి హయాంలో కుటుంబానికి వచ్చిన లబ్ధి ఆసరాగా నిలిచింది. అర్హులందరికీ పక్కా ఇళ్ల పథకంలో భాగంగా లక్ష్మికి పట్టా అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహకారం రూ.1.80 లక్షలకు మరికొంత సొమ్మును పోగుచేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ.45 వేల మేర రుణం మాఫీ అయింది . దీనికి తోడు వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.74వేల మేర లబ్ధిపొందారు. లక్ష్మి కుమారుడు కనకరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తుండడంతో వాహన మిత్ర పథకం ద్వారా రూ.ఏడాదికి రూ.10వేల చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ.40వేల మేర సాయం పొందాడు. రూ.10వేలతో చేదోడు పథకం కింద చిరు వ్యాపారం చేసింది. కనకరాజు కుమార్తెకు ఏటా అమ్మఒడి పథకం ద్వారా రూ.13వేల చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ.52వేల సాయం అందింది. జగన్మోహన్రెడ్డి సీఎం కాకముందు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారమని తరువాత పలు పథకాల రూపంలో లబ్ధి పొంది ఆనందంగా గడిపామని లక్ష్మి తెలిపారు.పేదల పక్షాన జగన్మోహన్రెడ్డి నిలుస్తూ ఎప్పుడు ఏ పథకం వస్తుందో ముందుగానే తెలిసేదని చెప్పారు.జగన్మోహన్రెడ్డి హయాంలో మా కుటుంబానికి మేలు చేకూరిందని ఆమె తెలిపారు.ముప్పిడి లక్ష్మి -
మచ్చలేని నేత వాజ్పేయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తున్న కూటమి నాయకులు అనకాపల్లి టౌన్: నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన మచ్చలేని నేత మాజీ ప్రధాని వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. స్థానిక జలగల మదుం జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. మాధవ్ మాట్లాడుతూ విలువలకు అద్దం పట్టే రాజకీయాలు చేసిన నాయకుడు వాజ్పేయి అన్నారు. టీడీపీ జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు విజయ్కుమార్, బండారు , కొణతాల రామకృష్ణ, కేఏఎస్ఎన్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. ఏబీ వాజ్పేయి విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేరు లేకపోవడంతో జనసేన శ్రేణులు కినుక వహించారు. -
నాడు విద్యార్థినిగా... నేడు ఉపాధ్యాయినిగా..
మునగపాక : ఎక్కడయితే పదో తరగతి వరకు చదువుకున్నారో అదే స్కూల్లో జరిగిన శిక్షణకు ఉపాధ్యాయురాలిగా హాజరవడం అరుదైన విషయం. అలాంటి అరుదైన సంఘటన మునగపాకలో శనివారం చోటు చేసుకుంది. మునగపాకకు చెందిన బుద్ద జగదాంబ మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో 1986–87లో పదో తరగతి చదువుకున్నారు. ఆ తరువాత ఉన్నత చదువులు పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా పలు ప్రాంతాల్లో పనిచేస్తూ వచ్చారు. కొంత కాలంగా మునగపాక మండలం పాటిపల్లి మోడల్ స్కూల్లో తెలుగు టీచర్గా సేవలందిస్తున్నారు. శనివారం మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ శిక్షణకు జగదాంబ హాజరయ్యారు. నాడు పదో తరగతి వరకు చదువుకున్న పాఠశాలలోనే తాను ఉపాధ్యాయురాలిగా శిక్షణకు హాజరు కావడం సంతోషంగా ఉందని జగదాంబ తెలిపారు. -
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కొత్తపెంట
దేవరాపల్లి: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కొత్తపెంట గ్రామం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారింది. పంచాయతీ భవనం లేక గతంలో పాత సామాజిక భవనంలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితి నుంచి...నేడు కార్పొరేట్ భవనాలను తలపించేలా ఒకే చోట గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మించడంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో సుమారు రూ. 4.50 కోట్లతో అభివృద్ధి పనులు, రూ. 14 కోట్ల మేర సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులకు అందించారు. వెరసి గ్రామంలో నలువైపులా తారురోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో గ్రామం సర్వాంగ సుందరంగ దర్శనమిస్తోంది. మండలానికి శివారున ఉన్న కొత్తపెంట గ్రామస్తులు ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రం దేవరాపల్లి వెళ్లి అష్టకష్టాలు పడేవారు. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామం నడిబొడ్డున రూ. 40 లక్షలతో అధునాతన హంగులతో గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించడంతో ప్రజల చెంతనే అన్ని సేవలు అందుతున్నాయి. గతంలో అనారోగ్యం వస్తే వైద్యం కోసం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రూ.20 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నిర్మించడంతో గ్రామంలోనే నిత్యం వైద్య సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లి వెళ్లి నానా అవస్థలు పడేవారు. ఊరిలోనే రూ.20 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించి తద్వారా ఎరువులు, విత్తనాలు అందజేసి రైతుల కష్టాలు తీర్చి రైతు పక్షపాతిగా జగన్మోహన్రెడ్డి ముద్ర వేసుకున్నారు. నాడు–నేడులో రూ.19.35 లక్షలతో స్థానిక ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఆధునికీకరించి మౌలిక సదుపాయల కల్పించి, మరో రూ. 11.25 లక్షలతో ప్రహారి నిర్మించారు. జల్జీవన్ మిషన్ స్కీమ్లో రూ. 1.07 కోట్లతో కొత్తపెంట, కొత్తూరులో రెండు మంచినీటి ట్యాంక్లు నిర్మించి, ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసి తాగు నీటి సమస్య నుంచి విముక్తి కల్పించారు. చేపట్టిన మరిన్ని అభివృద్ధి పనులు సుమారు రూ. 74 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 10 లక్షలతో సీసీ డ్రైనేజీలు, కొత్తపెంట నుంచి ఎన్.జి. నగరానికి రూ. 1.23 కోట్లతో తారు రోడ్డు, రూ. 36 లక్షల వ్యయంతో రెండు అంగన్వాడీ కేంద్రాలు, రూ. 20 లక్షలతో రెండు సామాజిక భవనాలు నిర్మించారు. రూ. 5 లక్షలతో మహిళా మండలి భవనం, రూ. 4 లక్షలతో శ్మశానంలో దహన వాటిక నిర్మించారు. కేవలం మూడు వేల జనాభా కలిగి, కుగ్రామాన్ని తలపించే కొత్తపెంట అప్పటి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సహాయ సహకారాలతో ఇప్పుడు పట్నాన్ని తలపిస్తుదంటే అతిశయోక్తి లేదు. అన్ని సౌకర్యాలు, సేవలు సమకూరాయి మా గ్రామం మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉండంతో గతంలో చిన్నపాటి ప్రభుత్వ సేవల కోసం దేవరాపల్లి వెళ్లి నానా అవస్థలు పడేవారం. మండల కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజంతా పనులు మానుకోవాల్సి వచ్చేది. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడంతో గ్రామంలోనే ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయి. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు దేవరాపల్లి వెళ్లి రోజంతా మండుటెండలో నరకయాతన పడేవారు. జగనన్న దయతో గ్రామ పొలిమేర దాటే పరిస్థితి లేకుండా ప్రస్తుతం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. ఆరోగ్యం బాగోకపోతే గతంలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందేవారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్లో నిత్యం 20 నుంచి 30 మందికి ఆస్పత్రి మాదిరిగా వైద్య సేవలు అందిస్తున్నారు. అప్పటి సీఎం జగన్, అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవ చూపించి సుమారు రూ.4.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. గ్రామస్తులకు రూ. 14 కోట్ల మేర సంక్షేమ పథకాల రూపంలో అందించారు. సర్పంచ్గా నా హయాంలో గ్రామం ప్రగతి బాట పట్టడం ఆనందంగా ఉంది. నాలుగైదు దశాబ్దాలలో జరగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేసి చూపించిన మాజీ సీఎం జగన్కు, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు తామంతా రుణపడి ఉంటాం. –రొంగలి వెంకటరావు, సర్పంచ్, కొత్తపెంట, దేవరాపల్లి మండలంఊరు మారింది.. జగనన్న పాలనలో మారిన కొత్తపెంట రూపురేఖలు ఒకే చోట సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు నలువైపులా తారురోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్న కొత్తపెంట గత ఐదేళ్లలో రూ.4.50 కోట్లతో అభివృద్ధి పనులు గ్రామస్తులకు రూ. 14 కోట్ల మేర సంక్షేమ లబ్ధి -
ముగిసిన విజన్–2 శిక్షణ
సబ్బవరం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు తమ జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమం విజన్–2 శుక్రవారంతో ముగిసింది. స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయంలో నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా ప్రాజక్ట్ మేనేజర్ పి.వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయం సహయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల ద్వారా సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆర్థిక, ఆర్థికేతర, సహకార సంఘాల చట్టాలపై, నాయకత్వంపై చర్చించినట్లు తెలిపారు. శిక్షణ ఆనంతరం సబ్బవరం మండలంలోని అన్ని పంచాయతీల్లో రెండు రోజుల పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో జీవన ప్రమాణాల మెరుగుదలకు సీసీల ద్వారా ఇంటర్ ఫేస్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సబ్బవరం, యలమంచిలి, గొలుగొండ, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, చోడవరం మండలాల ఏపీఎంలు, సీసీలు, సబ్బవరం మండలంలోని గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
చెరకు రైతుకు మేలు
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఇప్పటి వరకు ఈ నూతన ప్రయోగాన్ని చేశాం. చెరకు రైతుకు మేలు చేకూర్చేలా మా అధ్యాపకుల సహకారంతో ఈ ప్రయోగాన్ని అతి తక్కువ ఖర్చుతోనే చేశాం. త్వరలో ఆర్ఏఆర్ఎస్లో చెరకు తాండ్రను అందుబాటులోకి తీసుకొచ్చి ఆన్లైన్ ఆర్డర్ల మేరకు ఎగుమతులు కూడా ప్రారంభమవుతాయి. – భవ్యశ్రీ, తృతీయ సంవత్సర విద్యార్థి, పాలిటెక్నికల్ ఇంజినీరింగ్ జీర్ణక్రియకు సహాయకారి ఎటువంటి రసాయనాలు వేయకుండా చెరకు రసంతో చేసిన తాండ్రతో జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడమే కాకుండా శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి రక్షిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి మంచిది. – రమ్య, తృతీయ సంవత్సర విద్యార్థి, పాలిటెక్నికల్ ఇంజినీరింగ్ -
పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు
బీచ్రోడ్డు: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, అలాగే ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ అదాలత్లను నిర్వహిస్తున్నామని, డీడీవోల సమక్షంలో పెన్షనర్ల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించామని, ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరిన పత్రాలను త్వరగా పరిశీలించి బెనిఫిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ పేజీని ప్రారంభించి, దీని ద్వారా పెన్షన్ దారులు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్. మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ ప్రయోజనాల మంజూరులో కొంత జాప్యం జరిగేదని, అయితే డిజిటలైజేషన్ వల్ల ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్ దారులు ఈ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పార్సిళ్ల సేవల ద్వారా రూ.2.08 కోట్ల ఆదాయం
మాట్లాడుతున్న జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి ప్రవీణ అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) పార్సిల్ డోర్ డెలివరీ సేవల ద్వారా జిల్లాలో 2024–25 సంవత్సరానికి రూ.2.08 కోట్ల ఆదాయం లభించినట్టు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి వి.ప్రవీణ తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కార్యాలయం వద్ద 50 కిలోల డోర్డెలివరీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు పార్సిల్ బుకింగ్తో పాటు డోర్ డెలివరీ చార్జీలు చెల్లించినట్టయితే పార్సిల్ కౌంటర్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం పొందవచ్చన్నారు. పార్సిల్ సర్వీస్ ద్వారా 2022–23 ఏడాదిలో రూ.1.59 కోట్లు, 2023–24లో రూ.2.05 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు 63024 46142, 73829 18492, 99592 25595 అనే నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
అనకాపల్లి హైవేపై జలగలమదుం జంక్షన్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా తాళ్లపాలెం ఏపీ గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు పరిశీలించి, సూచనలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ కశింకోట: తాళ్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం శనివారం ఉదయం 11 గంటల నుంచి తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో పర్యటించనున్నారు. విశాఖ నుంచి హెలికాప్టర్లో ఉగ్గినపాలెం అమలోద్భవి హోటల్ వద్ద ఉన్న లేఅవుట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాళ్లపాలెం చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల సందర్శించి, సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం పంచాయతీ సమీపంలో వేదిక వద్ద బహిరంగ సభ జరగనుంది. దీన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఏర్పాట్లపై ఆయా ప్రాంతాలను సందర్శించి అధికారులతో సమీక్షించి పలు సూచనలిచ్చారు. ఎస్పీ తుహిన్ సిన్హా కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాళ్లపాలెం కూడలి నుంచి నర్సీపట్నం వైపు రోడ్డుపై ఉన్న గుంతలను ఆగమేఘాలపై పూడ్చారు. నేడు వాజ్పేయి విగ్రహావిష్కరణ అనకాపల్లి టౌన్/అనకాపల్లి: దేశ రాజకీయాలలో తనదైన శైలితో ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న స్ధానిక జాతీయ రహదారి జలగల మదుం జంక్షన్ వద్ద నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానల్ సభ్యుడు ఈర్లె శ్రీరామ్మూర్తి తెలిపారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. సీఎం పర్యటనలో 1500మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
గుర్రాజుపేట విద్యార్థికి ఐఈఎస్లో 128 ర్యాంకు
గొంప నవీన్ ఎస్.రాయవరం: మండలంలో గుర్రాజుపేటకు చెందిన గొంప నవీన్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్–2025) ఫలితాల్లో 128 ర్యాంక్ సాధించాడు. గొంప బాబూరావు, మంగతాయారుల రెండవ కుమారుడైన నవీన్ అడ్డురోడ్డు విశ్వశాంతి ప్రైవేటు స్కూల్లో 10 వ తరగతి వరకు చదివి పదికి 10 పాయింట్లు సాధించాడు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏపీఆర్జేసీలో ఇంటర్మీడియెట్, కేరళ రాష్ట్రం కాలికట్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. గేట్లో ఆల్ఇండియా ర్యాంక్ 186 సాధించాడు. నవీన్ తండ్రి రైతు, తల్లి టైలర్, అన్న గొంప నాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నవీన్ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు.


