breaking news
Anakapalle District Latest News
-
ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు
తుమ్మపాల: ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బందికి అనకాపల్లిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ పురస్కారాలు అందజేశారు. త్రివర్ణ శోభితం అనకాపల్లి: స్థానిక మెయిన్రోడ్డులో గల న్యాయస్థానాల ఆవరణలో జిల్లా పదో అదనపు న్యాయమూర్తి నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. న్యాయమూర్తులు నాగేశ్వరరావు, రామకృష్ణ, ధర్మారావు, రమేష్, విజయలక్ష్మి, నిఖితా సెంగర్, బార్అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా, ఆయన సతీమణి, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిఖితా సెంగర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ఎస్పీ తుహిన్ సిన్హా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తుమ్మపాల: కలెక్టరేట్లో కలెక్టర్ విజయ కృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు. బాపూజీ బాటలో నడవాలి అనకాపల్లి టౌన్: వైఎస్సార్ సీపీ జిల్లా ఆఫీస్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాఽథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాపూజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో వినియోగించుకోలేకపోతున్నామని చెప్పారు. అందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, రాష్ట్ర కార్యదర్శులు దంతులూరి దిలీప్ కుమార్, బొడ్డేడ ప్రసాద్, నియోజకర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,84 వ వార్డుల ఇన్చార్జులు కె.ఎం. నాయుడు, కోరుకొండ రాఘవ, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాఽథ్, పార్టీ సీనియర్ నాయకులు కొణతాల మురళీ కృష్ణ, బొడ్డేడ శివ, కె.ఎం. నాయుడు, గైపూరి రాజు, దాడి నారాయణ రావు, ఉగ్గిన అప్పారావు, జ్ఞానదీప్, నీటిపల్లి లక్ష్మి, నడిపల్లి శోభ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దేరుకు వరద పోటు
మాడుగుల: మండలంలో అధికంగా జలవనరులున్న పెద్దేరు జలాశయం కేచ్మెంట్ ఏరియాలో గత రెండు రోజులుగా అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయానికి శుక్రవారం ఉదయం నుంచి వరద నీరు పోటెత్తుతోంది. 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అప్రమత్తమైన జలాశయం అధికారులు 600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136. 45 మీటర్లకు చేరుకుంది. అప్రమత్తంగా ఉండాలి పెద్దేరు ఏటిబాధిత గ్రామాలైన డి. గొటివాడ, సత్యవరం, జేడీపేట, వీరవల్లి, జంపెన, గొటివాడ అగ్రహారం, ఓడపాడు గ్రామాలకు చెందిన రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. పెద్దేరు జలాశయానికి వరద ఎక్కువగా వచ్చి చేరుతోందని చెప్పారు. దీంతో జలాశయం నుంచి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారని తెలిపారు. రాత్రి పూట రైతులతో పాటు పశువుల కాపరులు పెద్దేరు నదిలో దిగరాదన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాలకు చెందిన వీఆర్వోలకు సమాచారం అందజేసినట్టు చెప్పారు. -
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
● మెలిపాక జగన్నాథపురం వద్ద యథేచ్ఛగా తవ్వకాలు అచ్యుతాపురం రూరల్ : మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. వరుస సెలవులు రావడంతో అధికారులు పట్టించుకోరనే ధీమాతో మెలిపాక జగన్నాథపురం వద్ద గల కొండను శుక్రవారం యథేచ్ఛగా తవ్వి, గ్రావెల్ను అక్రమంగా తరలించారు. అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా గ్రావెల్ మాఫియా మండల శివారం గ్రామమైన మెలిపాక జగన్నాథపురం నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలించింది. గ్రావెల్ తరలింపునకు ఏకంగా రోడ్డునే ఏర్పాటు చేశారు. జగన్నాథపురం, చూచుకొండ వెళ్లే రహదారి మధ్యలో రోడ్డు నుంచి కొండ వరకూ సుమారు 20 అడుగుల వెడల్పుతో రెండు కిలోమీటర్ల పొడవున రోడ్డును నిర్మించి, భారీ ఎత్తున గ్రావెల్ను తరలించారని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్టవేయాలని వారు కోరారు. -
ఐపీఎస్ఽ అఽధికారి సత్యనారాయణకు రాష్ట్రపతి మెడల్
నక్కపల్లి: కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి మెడల్కు ఎంపికయ్యారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది. ఈ మెడల్ను రిపబ్లిక్డే రోజున రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. సత్యనారాయణ 1998 ఉత్తరప్రదేశ్ కేడర్ నుంచి ఆగ్రా ఏఎస్పీగా తొలి పోస్టింగ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం లక్నోలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో పనిచేస్తున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సబ్బవరం: మండలంలోని చిన్నయ్యపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం హైవేను ఆనుకుని బోర్రమ్మగెడ్డ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. ముళ్ల పొదల్లో పడివున్న మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి సబ్బవరం పరిధి కావడంతో సబ్బవరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐ దివ్య, సిబ్బందితో కలిసి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తుప్పల్లో పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించి వెలికి తీయించారు. శరీరం బాగా ఉబ్బిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సుమారు 40–45 ఏళ్ల వయసున్న మృతుడి శరీరంపై నిక్కరు, బనియన్, చేతికి రాగి కడియం ఉంది. మరణించి నాలుగైదు రోజులై ఉంటుందని సీఐ తెలిపారు. ఒక బిచ్చగాడు వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలో సంచరించేవాడని, ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. మృతుడు ఆ బిచ్చగాడేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ తెలిపారు. -
రంగస్థల కళాకారుడికి సన్మానం
మునగపాక: గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా ఆహ్వాన నాటిక పోటీల్లో రెండో రోజైన శుక్రవారం రంగస్థల నటుడు, దర్శకుడు ముసిలినాయుడును ఘనంగా సన్మానించారు. మునగపాక నందీశ్వర కళా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. కళారంగానికి ముసిలినాయుడు అందించిన సేవలను కొనియాడారు. అంతకముందు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ.. మునగపాకలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమయ్యే నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, గ్రామీణ యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గునుపూడి యువకుడి మృతి
నాతవరం:మండలంలో గునుపూడి గ్రామానికి చెందిన పైల కుశరాజు( 25) కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పైల అప్పలనాయుడు, బుజ్జమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. డిగ్రీ చదివిన పెద్ద కొడుకు కుశరాజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ ప్రైవేటు కంపెనీలో ఆరు నెలల కిందట ఉద్యోగంలో చేరాడు. గురువారం కుశరాజు వేరే వ్యక్తితో కలిసి బైక్పై వస్తుండగా వ్యాన్ ఢీకొనడంతో మృతి చెందాడు. చేతికందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు బోరు విలపిస్తున్నారు. గ్రామంలో అందరితో సరదగా ఉండే కుశరాజు మరణించడంతో స్నేహితులు రోదించారు. శుక్రవారం సమాచారం తెలిసిన వెంటనే కుటుంబు సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లారు. కుశరాజుకు సోదరుడు, సోదరి ఉన్నారు. సోదరికి ఇటీవల వివాహం జరిగింది. -
హరేకృష్ణ వైకుంఠంలో కృష్ణాష్టమి వేడుకలు
తగరపువలస: గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించిన భక్తదాస ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు బాల గోపాలునికి ఉయ్యాలసేవతో ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరాధాకృష్ణుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. శనివారం శ్రీకృష్ణ భగవానునికి మహాభిషేకాలు, మహా మంగళ హారతి ఇవ్వనున్నారు. మిగిలిన రెండు రోజుల పాటు యథావిధిగా ఉయ్యాల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించనున్నారు. -
దొంగతనం కేసులో ఇరికించారని యువకుడి ఆత్మహత్య
బుచ్చెయ్యపేట: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడి మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. మూడు నెలల కిందట బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడైన అయితరెడ్డి శివకుమార్తోపాటు మృతుడు ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసుల కథనం. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన కృష్ణమూర్తి ఈనెల 4వ తేదీన గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్లో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్లో చికిత్స పొందుతుండగానే.. తాను దొంగతనం చేయలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బుచ్చెయ్యపేట పోలీసులే కారణమని నోట్ రాశాడు. యువకుడి మరణంతో ఉద్రిక్తత కృష్ణమూర్తి శుక్రవారం కేజీహెచ్లో మరణించడంతో.. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపైన, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు. మృతదేహం అడ్డగింత కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యానులో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని అయితంపూడి తీసుకురాకుండా బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చెయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో బుచ్చెయ్యపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాను బుచ్చెయ్యపేట రాకుండా రాజాం మీదుగా పెదమదీన నుంచి అయితంపూడి గ్రామానికి పంపించారు. అయితంపూడి గ్రామంలోకి రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యానును కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చెయ్యపేట తరలించడానికి ప్రయత్నించారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చెయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కడపటి వార్తలు అందే వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మూడు నెలల క్రితం చోరీ కేసులో అరెస్ట్ బెయిల్పై వచ్చాక ఈనెల 4న గడ్డి మందు తాగడంతో అస్వస్థత తన దుస్థితికి ఇద్దరు గ్రామస్తులు, ఇద్దరు పోలీసులే కారణమని నోట్ బాధితుడి మృతితో బుచ్చెయ్యపేట స్టేషన్ ముట్టడికి కుటుంబ సభ్యుల యత్నం అడ్డుకున్న పోలీసులు.. బుచ్చెయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తత -
ఉచిత బస్సుతో మహిళలకు ఆర్థిక ఆసరా
● హోం మంత్రి అనిత ● స్త్రీశక్తి పథకం ప్రారంభం అనకాపల్లి టౌన్: ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజీ ఆవరణలో సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆమె ప్రారంభించారు. బస్సులో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన బస్సులో హోం మంత్రితోపాటు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కొంతదూరం ప్రయాణించారు. జేసీ జాహ్నవి, జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి వి.ప్రవీణ, డీఎస్పీ శ్రావణి పాల్గొన్నారు. నర్సీపట్నంలో.. నర్సీపట్నం: నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో సీ్త్రశక్తి పథకాన్ని డిపో మేనేజర్ ధీరజ్ శుక్రవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, ట్రాఫిక్ మేనేజర్ మోహన్రావు, కౌన్సిలర్లు చింతకాయల రాజేష్, శ్రీకాంత్, పాల్గొన్నారు. -
దొంగ ఓట్లతో గెలిచి సంబరాలా?
● జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం దేవరాపల్లి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచి, టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అడుగడుగునా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన పోలీస్, పోలింగ్ అధికార్లు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సానుభూతి ఓటర్ల స్లిప్లను లాక్కొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకొన్నారని, వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి పోలింగ్ కేంద్రాలను నుంచి వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి సహా ఇతర నాయకులుందర్నీ హౌస్ అరెస్టు చేసి అన్ని పోలింగ్ కేంద్రాలను హస్తగతం చేసుకొని రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల జరిగే ప్రాంతంలోని వారితో కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేశారని, ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు, ఫోటోలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అన్ని ఆధారాలు, సాక్ష్యాలను బయటపెట్టినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార టీడీపీకి అంత ప్రజాబలం ఉంటే ఇంతగా బరితెగించి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. -
సమగ్ర పురోగతి దిశగా..
మహనీయుల అడుగుజాడల్లో..సాక్షి, అనకాపల్లి: ఎందరో దేశభక్తులు, మహనీయులు వీరోచిత పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా భారతావనిని మనకు అందించారని, వారి ఆశయాల బాటలో పయనిద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతి సాధించేలా కృషి చేద్దామని పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోం మంత్రి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం త్రివర్ణ పతాకానికి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి వందన సమర్పణ చేశారు. పరేడ్ కమాండర్ పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా, పోలీస్ బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మూడు రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి, పోలీస్ గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీ4 కార్యక్రమం ద్వారా గుర్తించిన 53 వేల నిరుపేద కుటుంబాలను దాతల సాయంతో ఆదుకుంటామని చెప్పారు. జిల్లాలో 2.43 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.161.45 కోట్లు అందించామన్నారు. దీపం–2 కింద మొదటి విడతలో 3.23 లక్షల మంది, రెండో విడతలో 3.4 లక్షల మందికి సబ్సిడీ అందించామన్నారు. ● ఎన్ఆర్ఈజీఎస్లో 2.7 లక్షల వేతనదారులకు రూ.234.7 కోట్ల ఉపాధి ● 2.58 లక్షల మందికి సామాజిక పింఛన్ల పంపిణీ ● 23 గిరిజన గ్రామలకు రూ.125.08 కోట్లతో 23.13 కి.మీ రహదారులనిర్మాణం ● అంగన్వాడీ కేంద్రాల ద్వారా 15,462 మంది గర్భిణులు, బాలింతలకు, 51,593 మంది పిల్లలకు రూ.96 కోట్లతో పోషకాహారం ● బీసీ కార్పొరేషన్ ద్వారా 2265 మందికి మహిళలకు 19 సెంటర్ల ద్వారా కుట్టుమిషన్ శిక్షణ ● ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 4331 మంది ఆరోగ్యశ్రీ సేవలకు రూ.8.37 కోట్ల చెల్లింపు ● పంచాయతీరాజ్ శాఖలో 1734 సీసీ రోడ్లు మంజూరు కాగా 1371 రోడ్లు పూర్తి ● పీఎం ఆవాస్ యోజన పథకంలో 62,498 ఇళ్లకు గానూ 32,823 ఇళ్ల నిర్మాణం పూర్తి ● రూ.45 కోట్లతో 130 భారీ, మెగా తరహా పరిశ్రమల స్థాపన ● నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో 3,257 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ పాఠశాలలకు చెందిన 11 విద్యార్థి బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాయి. వందేమాతరం గీతంతో మాతా శిశు సంక్షేమ శాఖ, చిల్డ్రన్హోంకు చెందిన చిన్నారులు ప్రదర్శన ప్రారంభించారు. నర్సీపట్నంలోని మాతా శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్ హోమ్ చిన్నారుల బృందానికి మొదటి బహుమతి, అచ్యుతాపురం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు రెండో బహుమతి, కశింకోట ఐడబ్ల్యూహెచ్సీ బాలికల పాఠశాల విద్యార్థులకు మూడో బహుమతి లభించాయి. అన్ని ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 422 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 422 మంది అధికారులు, ఉద్యోగులు, పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కలెక్టర్, జేసీ, ఎస్పీలతో కలిసి హోం మంత్రి అనిత వాటిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వి.వి.రమణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కె.బాలాజీ, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. పేదరికాన్ని నిర్మూలిద్దాం అన్ని రంగాల్లో ప్రగతి సాధిద్దాం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి అనిత ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల శకటాలు డీఆర్డీఏ శకటానికి ప్రథమ బహుమతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) శకటం ప్రథమ బహుమతిని సొంతం చేసుకోగా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) శకటం ద్వితీయ బహుమతి, రవాణా, పరిశ్రమలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలు మూడో బహుమతి సొంతం చేసుకున్నాయి. విద్యుత్, పట్టు పరిశ్రమ, విద్య, భూగర్భ గనులు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయ శాఖలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, జిల్లా క్రీడా సాధికార సంస్థ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ స్టాళ్లు ఏర్పాటు చేశారు. -
ఈ డోలీమోతలు ఇంకెన్నాళ్లు!
నర్సీపట్నం : గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గొలుగొండ మండలం, డొంకాడ గిరిజనులు అబిద్సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు డోలీ యాత్ర నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు మాట్లాడుతూ డొంకాడ గ్రామంలో కొందు గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు. జీవో నెంబరు 726 ఇంపాక్ట్ నిధుల నుంచి పంచాయతీకి 2023లో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తయినప్పటికీ నేటికి అధికారులు రోడ్డు పనులు మొదలు పెట్టలేదన్నారు. రహదారి సౌకర్యం లేక డోలీ మోతతో వైద్యం కోసం గర్భిణులు పాంగి మువ్వల, కొండ తామల జ్యోతి, సీత మార్గం మధ్యలో మరణించడం జరిగిందన్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, స్కూల్ లేక కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. చందాలు వేసుకుని నడవడానికి వీలుగా గ్రామస్తులే రోడ్డు వేసుకుంటున్నారన్నారు. డొంకాడతో పాటు పిత్రిగడ్డ, నీళ్లు బంద, పెద్ద గరువు గ్రామాలకు రోడ్లు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు డొంకాడ గ్రామానికి రోడ్డు వేయాలని లేని పక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఎవో, పీఆర్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో తాంబలి సత్తిబాబు, గేమిల సుబ్బారావు, తాంబూలా అప్పారావు, సీఐటీయు జిల్లా కార్యదర్శి రాజు పాల్గొన్నారు. -
400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
చౌడువాడలో 400 అడుగుల జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా కార్యక్రమం హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు కె.కోటపాడు : చౌడువాడ పంచాయతీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. 400 అడుగుల జాతీయ జెండాతో హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రోడ్డు మార్గంలో భారీ జాతీయ జెండాతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, పంచాయతీ కార్యదర్శి బి.సురేష్బాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్ ఏటుకూరి రాజేష్ పాల్గొన్నారు. దేవరాపల్లి: తెనుగుపూడి డా. బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక గురుకుల విద్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్పాల్ జాతీయ జెండా ఊపీ ప్రారంభించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారతమాతాకి జై, మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించామని ప్రిన్సిపాల్ తెలిపారు. కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు తుమ్మపాల : 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. మువ్వన్నెల రంగుల కాంతుల వెలుగులో కార్యాలయ భవనం గురువారం రాత్రి మరింత అందంగా కనిపించింది. శుక్రవారం పంద్రాగస్టు వేడుకలకు జిల్లా యంత్రాంగా ఏర్పాట్లు చేసింది. హోంమంత్రి అనిత కలెక్టరేట్లో జెండావిష్కరణ చేయనున్నారు. -
చెరువులో కాలుజారి రైతు మృతి
చీడికాడ : చెరువులోకి దిగుతున్న పశువులను బయటకు మళ్లించబోయి కాలుజారి చెరువులో పడి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఖండివరంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ బి.సతీష్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామాని చెందిన ఈర్లె రామునాయుడు(50) గురువారం మధ్యాహ్నం తమ పశువులను మేతకు తోలుకెళ్లాడు. గ్రామ సమీపంలో గల పెద్ద చెరువులోకి పశువులు దిగేందుకు ప్రయత్నించగా వాటిని ఆపే దిశగా రామునాయుడు ప్రయత్నించగా కాలుజారి చెరువులో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై మృతుడు భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. -
కళా రంగానికి పుట్టినిల్లు మునగపాక
మునగపాక : నేటి యుగంలో కళారంగానికి పుట్టినిల్లుగా మునగపాక రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పేర్కొన్నారు. ఏటా నాటిక పరిషత్లు నిర్వహిస్తూ ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తున్న గ్రామీణ యువజన మందిరం సేవలు మరువరానివన్నారు. మునగపాక నందీశ్వర కళా ప్రాంగణం తులసీ కళావేదికపై గ్రామీణ యువజన మందిరం 61వ వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా అహ్వాన నాటిక ప్రదర్శనలను ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ యువజన మందిరానికే దక్కుతుందన్నారు గ్రామీణ యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, పెద్దలు కాండ్రేగుల జగ్గారావు, పెంటకోట సత్యనారాయణ, కోనపల్లి రామ్మోహనరావు, అలంక ప్రకాశరావు, యువజన మందిరం కార్యవర్గ సభ్యులు మళ్ల జోగారావు, మళ్ల రామజోగినాయుడు, ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగస్థల కళాకారులు కాండ్రేగుల జగ్గారావును సత్కరించారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు ఉమ్మడి విశాఖ జిల్లా ఆహ్వాన నాటిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పెందుర్తికి చెందిన శ్రీగౌరీ నటరాజా డ్రమాటిక్ అసోసియేషన్ వారి చీమా..చీమా..ఎందుకు కుట్టావ్, మాతృదేవోభవ నాటికలు అలరించాయి. నాటిక ప్రదర్శనలను కళాభిమానులు పెద్ద సంఖ్యలో తిలకించారు. -
ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పండి
నిరసన వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలుబీచ్రోడ్డు: ‘మా ఓటు భద్రం.. చోరీ కానివ్వకండి’.. ‘ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పండి’, ‘బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ఆపండి’అని విదసం నాయకులు డిమాండ్ చేశారు. విస్తృత దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డా.బూసి వెంకట రావు ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భారత ఎన్నికల కమిషనర్ను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి పౌరుడికి ఒకే ఓటు, ఒకే విలువ ఉండగా.. దేశంలో ఇటీవల జరుగుతున్న ఓట్ల చోరీపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. బీహార్లో ఎస్ఐఆర్, కర్ణాటకలోని మహాదేవపురలో జరిగిన ఓట్ల మాయాజాలంపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం.. ప్రశ్నించిన వారినే నిందిస్తోందని ఆయన విమర్శించారు. బీహార్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నారని, ఇది ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. మహాదేవపుర ఎంపీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో బయటపడ్డ వేలాది నకిలీ ఓటర్లపై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదసం నేతలు సోడా దాసి సుధాకర్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కరరావు, డి.నిర్మల, ఫ్రాన్సిస్, ఉత్తరాంధ్ర రాజ్యాంగ హక్కుల నేత బాగం గోపాల్, బనాస అధ్యక్షుడు టి.శ్రీరామ్ మూర్తి, పట్టా రామప్పారావు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర చరిత్రకు ఆనవాళ్లు.. ఈ స్థూపాలు
చోడవరం: బ్రిటిష్ పాలనలో చోడవరానికి ఒక ప్రత్యేక స్థానమే ఉంది. ఒక పక్క మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు స్వాతంత్య్రం ఉద్యమం చేసే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి అనేక మంది భాగస్వామ్యమై వందేమాతరం అంటూ అడుగులో అడుగు వేయగా.. మరో పక్క హార్డింజ్ అనే బ్రిటిష్ గవర్నర్ చోడవరం కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేశారు. ఆ బ్రిటిష్ అధికారి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఓ గెస్ట్ హౌస్ కూడా అప్పట్లో నిర్మించారు. అదే చోడవరం హార్డింజ్ గెస్ట్ హౌస్. నాటి చరిత్రకు నేటికీ సాక్ష్యాలుగా ఉన్న కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15న దేశంలో నిర్మించిన అతి కొద్ది జెండా స్థూపాల్లో ఒకటి చోడవరంలో ఉంది. ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్య్రానికి ఈ జెండా స్థూపాలే నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా నాటి జెండా స్థూపాలు అమరవీరుల త్యాగఫలాన్ని నేటి తరానికి గుర్తు చేస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి నేటి భారతం వరకు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న చోడవరంలో ఉన్న రెండు జెండా స్థూపాలకు ఎంతో చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించిన క్షణమే దేశ వ్యాప్తంగా మువన్నెల జెండా ఎగురవేసేందుకు పలు చోట్ల రాత్రికి రాత్రే సంబరాల నడుమ జెండా స్థూపాలను నిర్మించారు. ఆప్పుడు నిర్మించిన జెండా స్థూపాల్లో చోడవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన స్థూపం ఒకటి. ఈ జెండా స్థూపానికి నేటికి 77 ఏళ్లు. బ్రిటిషు ప్రభుత్వంలో అప్పటి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన డి.రామదాసు ఈ జెండా స్థూపాన్ని నిర్మించి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తుప్పుపట్టని మిశ్రమ లోహంతో తయారు చేసిన ఇనుప గొట్టంతో ఈ జెండా దిమ్మను నిర్మించారు. అందుకే ఈ స్థూపం ఎన్ని దశాబ్దాలైనా చెక్కుచెదరలేదు. హార్డింజ్ గెస్ట్ హౌస్ వద్ద బ్రిటిష్ జెండా ఎగిరేందుకు గెస్ట్ హౌస్ బంగ్లాకు ఎదురుగా ఒక స్థూపాన్ని నిర్మించి దాని చుట్టూ ఒక వృత్తాకారంలో దిమ్మను కట్టారు. ఆ స్థూపం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తెల్లదొరలు దేశాన్ని వదిలివెళ్లిపోయారని తెలిసిన వెంటనే ఈ స్థూపంపై బ్రిటిష్ జెండాను దించి భారతీయ మువ్వన్నెల జెండాను అప్పటి స్థానికులు ఎగురవేశారు. సుమారు వందేళ్ల కిందట నిర్మించిన ఈ స్థూపం చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఈ రెండు స్థూపాలు స్వాత్రంత్య ఉద్యమానికి ఆనవాళ్లుగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. హార్డింజ్ గెస్ట్హౌస్లో ఇటీవల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు చోట్ల ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చెట్టు కూలి బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి
పాయకరావుపేట రోడ్డు పక్కన వున్న పెద్ద చెట్టు పడి డెక్కన్ కెమికల్స్లో పని చేస్తున్న ఉద్యోగి మృతి చెందాడు. సీఐ జి.అప్పన్న అందించిన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, దూళ్లపేటకు చెందిన తోట శ్రీనివాసరావు (34) అనే వ్యక్తి డెక్కన్ కెమికల్స్లో ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్గా ఇఅండ్హెచ్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. శ్రీనివాసరావు గురువారం ఉదయం ఉద్యోగరీత్యా కంపెనీకి వెళ్తున్నాడు. రాంభద్రపురం దాటిన తర్వాత రోడ్డుకి కుడివైపున వున్న పెద్ద గన్నెరు వృక్షం ఉదయం 8.30 గంటల సమయంలో నేలకొరిగి బైక్ పై వెళ్తున్న శ్రీనివాసరావుపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావుతో పాటు బైక్పై ప్రయాణిస్తున్న మరో ఉద్యోగి ప్రమాదం నుంచి తప్పించుకోగా, స్వల్పగాయాలయ్యాయి. అతనిని తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చెట్టు కింద పడి ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని రోడ్డును తొలచి బయటకు తీశారు. తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. డెక్కన్ కెమికల్స్ యాజమాన్యం పడిపోయిన చెట్ల క్రేన్ సహాయంతో తొలగించారు. -
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్ : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ క్రమంలోనే అచ్యుతాపురం ఎస్టీబీఎల్లో అద్దెకు నివాసముంటున్న కొండల గాయత్రి (21) బుదవారం ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే సీఐ నమ్మి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మన్యం జిల్లా, వీరఘట్టం మండలానికి చెందిన మృతురాలు గాయత్రికి 2024 మార్చ్ నెలలో శంకర్రావుతో వివాహమైంది. గాయత్రి భర్త అచ్యుతాపురం ఎంఎస్ఎంఈలో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. గాయత్రి భర్త ఉదయం 9.30 గంటలకు ఉద్యోగ రీత్యా విధులకు హాజరై తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే సరికి గాయత్రి వంటగదిలో చున్నీతో ఉరివేసుకుని మృతి చెంది ఉండడం గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మృతురాలు గర్భం పోవడంతో పలుమార్లు ఇరుగు పొరుగు వారితో తన గర్భం పోయిందని చెబుతూ ఆవేదన చెందినట్టు విచారణలో తెలిసిందన్నారు. అయితే క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్న కారణంగానే ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసి ఇతర కారణాలపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
రూ.లక్ష విలువ చేసే టేకు దుంగలు పట్టివేత
కోటవురట్ల : అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. నర్సీపట్నం ఫారెస్టు రేంజరు రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం..టేకు కలప అక్రమంగా రవాణా అవుతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఫారెస్టు రేంజరు రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బంది యండపల్లి వద్ద బుధవారం రాత్రి నిఘా వేశారు. ఎటువంటి అనుమతి లేకుండా టేకు దుంగలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. వాహనం దాలింపేట కర్రల మిల్లు యజమాని శ్రీరామ్మూర్తికి చెందినదిగా గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఫారెస్టు రేంజరు రాజేష్ మాట్లాడుతూ కొంత కాలంగా అక్రమంగా టేకు కలప రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో దాడి చేసినట్టు తెలిపారు. పట్టుబడిన టేకు కలప విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా అక్రమంగా కలప రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా కర్రల మిల్లుల వ్యాపారులు అనధికారికంగా కలపను నిలువ చేస్తే కర్రల మిల్లు లైసెన్సు రద్దుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. -
శ్మశానవాటికలో పచ్చనేత పాగా!
చోడవరం : అధికారపార్టీ నాయకుల భూ ఆక్రమణలకు అడ్డూ అదుపూలేకుండా పోతోంది. బంజరు భూములు, కొండగెడ్డలే కాకుండా ఏకంగా శ్మశాన స్థలాన్నే ఆక్రమించడానికి పూనుకున్నాడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. ఇతడి ఆక్రమణ నుంచి తమ శ్మశానాన్ని రక్షించాలని కోరుతూ చోడవరం తహసీల్దార్కు, ఎమ్మెల్యేకు స్థానికులు గురువారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...చోడవరం మండలం గవరవరం గ్రామంలో మూడు శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో ఒకటి కొన్ని వీధుల వారు వినియోగించుకోవడానికి కేటాయించారు. దీనిని గతంలో కొందరు ఆక్రమించుకోగా గ్రామస్తులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు గ్రామస్తులకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి యధావిధిగా ఈ శ్మశానవాటికను గ్రామస్తులు వినియోగిస్తున్నారు. తాజాగా ఈ శ్మశాన వాటికలో కొంత భాగాన్ని ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చప్పగడ్డ వెంకటస్వామినాయుడు ఆక్రమించుకొని బడ్డీలు ఏర్పాటు చేశాడు. దీంతో గ్రామస్తులు తిరుగుబాటు చేసి ఆయనను ప్రశ్నించారు. ఈ స్థలాన్ని తాను గుండుపు నారాయణమ్మ అనే వాళ్ల దగ్గర కొనుగోలు చేశానంటూ సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో గ్రామస్తులను ఎదిరించి టీడీపీ నాయకుల బడ్డీలు కూడా పెట్టాడు. దీనిపై గ్రామస్తులు చోడవరం తహాసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం ఇచ్చి తమ శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజుకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకుంటామని, సర్వే చేసి రికార్డులు పరిశీలించి సర్వే చేసి న్యాయబద్దంగా స్థలాన్ని అప్పగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిగారు. ఇదిలావుండగా గ్రామస్తుల తరపున గతంలో కోర్టుకు వెళ్లి ఈ స్థలం గ్రామానికి చెందిన శ్మశాన వాటికదే అని పోరాటం చేసిన వారిలో ఇదే మాజీ సర్పంచ్ కూడా ఉన్నారని, తీరా అధికారం వచ్చాక ఆయనే ఆ శ్మశాన స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు హెచ్చరించారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో వేచలం విద్యార్థిని ఘనత
దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వేచలం హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థిని బొడబళ్ల చైతన్య సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మేరకు బాపట్ల జిల్లా చీరాలలో ఇటీవల జరిగిన 36వ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చైతన్య విశేష ప్రతిభ కనబరిచింది. అండర్–16 విభాగంలో పెంటాత్లీన్(60 మీటర్లు రన్నింగ్, 80 మీటర్లు హార్డిల్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, 600 మీటర్లు రన్నింగ్) సత్తా చాటి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకుంది. సెప్టెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకున్న విద్యార్ధిని చైతన్యను ఎంఈవో–1 సిహెచ్. ఉమ ఎంఈవో–2 వి.ఉషారాణి, ఇంచార్జ్ హెచ్ఎం పి. వెంకటరావు, స్థానిక ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో జరిగే జాతీయ స్థాయిలో పోటీలలో సైతం సత్తా చాటి మరిన్ని మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. -
మిట్టల్ ముద్దు!
గంగపుత్రుల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్ లాండింగ్ సెంటరు నిర్మాణాన్ని (జెట్టీ) కూటమి ప్రభుత్వం మరుగున పడేసింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్ ల్యాండింగ్ సెంటరు నిర్మించడం మానేసి మిట్టల్ స్టీల్ప్లాంట్ ప్రయోజనాల కోసం కార్గోపోర్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేసి, ఆగమేఘాల మీద భూములు కేటాయించింది. దీనిపై మత్య్సకార వర్గాలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మత్స్యకారులు వద్దు, ● కూటమి ప్రభుత్వం తీరుపై గంగపుత్రుల ఆగ్రహం ● గత ప్రభుత్వంలో జెట్టీ కోసం రూ.24 కోట్ల కేటాయింపు ● ఫిష్ ల్యాండింగ్ సెంటరు నిర్మాణానికి జీవో ● కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోని వైనం నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో 17 మత్య్సకార గ్రామాలున్నాయి. సుమారు 25 వేలమంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 10 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేటను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. ప్రాణాలకు తెగించి వీరు వేటాడి తెచ్చిన మత్స్య సంపద నిల్వ చేసుకోవడం, భద్రపరచుకోవడం, మార్కెటింగ్ చేసుకోడానికి సరైన సదుపాయాలు లేవు. లక్షలాది రూపాయల విలువైన మత్స్యసంపదను వేటాడి తెచ్చుకుంటున్నప్పటికీ మార్కెటింగ్ చేసుకోలేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజా సంకల్పపాదయాత్రలో మత్య్సకారుల సమస్యలు స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని 2023లో నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు సమీపంలో మినీ జెట్టీ(ఫిష్ ల్యాండింగ్సెంటరు) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. ఈ జెట్టీ నిర్మాణానికి మొత్తం రూ.24.77 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేంద్రం తన వాటా కింద రూ.14.86 కోట్లు కేటాయించగా రాష్ట్రప్రభుత్వ వాటాకింద రూ.9.90కోట్లు మంజూరు చేసింది. ఈ జెట్టీ నిర్మాణానికి అవసరమైన పదెకరాల స్థలాన్ని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక ప్రాంతాల్లో ఎంపిక చేశారు. రిజర్వ్ ఫారెస్టుకు చెందిన స్థలం కావడంతో వారికి ప్రత్యామ్నాయంగా పదెకరాలను కేటాయించి ఎంపిక చేసిన భూమిలో జెట్టీ నిర్మించాలనేది గత ప్రభుత్వ నిర్ణయం. జెట్టీ నిర్మాణానికి గుర్తించిన భూములను ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు, రాష్ట్ర, జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు సైతం పరిశీలించి అనువైన ప్రాంతంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో ఇవీ ప్రతిపాదనలు... ● రూ.2.32 కోట్లు వెచ్చించి జెట్టీ ఇతర భవనాల నిర్మాణం. ● రూ.33లక్షల వ్యయంతో పచ్చదనం,మొక్కల పెంపకం ● రూ.34లక్షలతో వాహనాల పార్కింగ్ సదుపాయం ● రూ.1.86కోట్లతో చేపలను ఎండబెట్టుకునేందుకు 2 ఫ్లాట్ఫారాల నిర్మాణం ● రూ.15లక్షల వ్యయంతో ట్రక్ పార్కింగ్ నిర్మాణం ● రూ.21లక్షల వ్యయంతో మత్య్స సంపద కోసం లోడింగ్ సెంటరు (షెడ్లు) నిర్మాణం ● రూ.1.11 కోట్ల వ్యయంతో చేపల కొనుగోళ్లు, అమ్మకాల కోసం పెద్ద హాళ్ల నిర్మాణం ● రూ.5.94 లక్షలతో ఫిష్ల్యాండింగ్ ఫ్లాట్ఫారాలు ● రూ.32.24లక్షలతో బీచ్ ల్యాండింగ్ ఫ్లాట్ఫారం ● రూ.7.11కోట్ల వ్యయంతో జెట్టీ వద్ద మెకనైజ్డ్, మోటారుబోట్లు, ఇంజిజన్లు తెప్పలు పార్కింగ్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా భవనాలు, షెడ్ల నిర్మాణం ● రూ.1.98 కోట్లతో జెట్టీ నిర్మించే ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం ● రూ.64 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువల నిర్మాణం ● రూ.1.14కోట్ల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం ● రూ.9.88లక్షల వ్యయంతో వ్యర్థజలాలను శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు ● రూ.46.92లక్షల వ్యయంతో వలలు, మరమ్మతులు, భద్రపరచుకునే షెడ్ల నిర్మాణం ● రూ.39.42లక్షల వ్యయంతో విశ్రాంతి భవనాల నిర్మాణం ● రూ.10లక్షల వ్యయంతో మరుగుదొడ్ల ఏర్పాటు ● రూ.27.22లక్షల వ్యయంతో తాగునీరు, వాడుకనీరు కోసం ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం వంటి ప్రతిపాదనలు చేశారు. ● జెట్టీ నిర్మించే ప్రాంతం చుట్టూ బయోఫెన్సింగ్, పటిష్టమైన రక్షణ గేటు కోసం రూ.9.16 లక్షలు కేటాయించారు. ● రూ.16 లక్షలతో నీటివనరులైన బోర్లు, గొట్టపు బావులు, మోటార్లు భూస్టర్ క్లీనింగ్ సదుపాయాలు ● రూ.80.85 లక్షల వ్యయంతో విద్యుత్ సదుపాయం, ట్రాన్స్ఫార్మర్లు, వీధిదీపాల సదుపాయాలు ● విద్యుత్ సరఫరా, కనెక్షన్ల కోసం మరో రూ.80 లక్షలు కేటాయించారు. ● ముందస్తు అధ్యయనాల కోసం రూ.20 లక్షలు, అత్యవసర పరిస్దితుల్లో ఖర్చు చేసేందుకు రూ.60 లక్షలు కేటాయించారు.అన్నీ సవ్యంగా జరిగి జెట్టీ నిర్మాణం పూర్తయితే తమ బెంగ తీరినట్లేనని గంగపుత్రులు భావించారు, భూసేకరణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్ల జెట్టీ నిర్మానణం ఆలస్యమైంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా జెట్టీ నిర్మాణం నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు సైతం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్య్సకారుల కోసం ఫిష్ ల్యాండింగ్ సెంటరు నిర్మిస్తామని హామీలు గుప్పించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇంతలోనే మిట్టల్ స్టీల్ప్లాంట్ తెరమీదకు రావడంతో జెట్టీ అంశం మరుగున పడింది. మిట్టల్ స్టీల్ప్లాంట్కు రారష్ట్రపభుత్వం ఈ ఏడాది 2400 ఎకరాలు కేటాయించేసింది. ఈ భూముల్లో మిట్టల్ కంపెనీ సొంత అవసరాల కోసం కార్గో పోర్టు (కాప్టివ్పోర్టు) నిర్మించనుంది. 148 ఎకరాల్లో నిర్మించే ఈ క్యాప్టివ్ పోర్టుకు కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసింది. దీంతో జపాన్కు చెందిన మిట్టల్ప్రతినిధుల బృందం పోర్టు నిర్మించే ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు రావడం జరిగింది. వేటాడిన మత్య్స సంపద ఎండబెట్టుకునేందుకు ప్లాట్ఫారాలు భద్రపరచుకునేందుకు స్టోర్ రూములులేక, ఇంజిన్లు, వలలు భద్రపరచుకునేందుకు స్టోర్రూములు, మార్కెటింగ్ చేసుకునేందుకు షెడ్లు లేక మత్య్సకారులు ఇబ్బంది పడుతూంటే జెట్టీ నిర్మించాల్పిన ప్రభుత్వం మిట్టల్ కంపెనీ కార్గోపోర్టుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిఒ ప్రభుత్వ తీరుతో ఇక జెట్టీ విషయం మరుగున పడినట్లేనని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గంగపుత్రులను మోసం చేసిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జెట్టీ లేక శానా ఇబ్బందులు జగనన్న ప్రభుత్వం మత్స్యకారుల కోసం జెట్టీ మంజూరు సేసింది. డబ్బులు కూడా ఇడదల సేసింది. పదెకరాల భూమి కూడా సూడ్డం జరిగింది. టెండర్లు పూర్తయి జెట్టీ కడతారనుకునే సమయంలో ఎన్నికలు వచ్చేయి, జెట్టీ పని ఆగిపోయింది. ఈ పెబుత్వమైన కడతాది ఆని ఆశపడ్డాం. కానీ స్టీల్ప్లాంట్ ఓళ్లు పోర్టు కట్టుకునేందుకు పెబుత్వం అనుమతి ఇచ్చిందంట. ఇంక మాకు జెట్టి కడతారనే ఆశలు పోయాయి. మమ్మల్ని పెబుత్వం మోసం సేసింది. సముద్రపు ఒడ్డున సదుపాయాలు లేక సానా ఇబ్బంది పడతన్నం. జెట్టీ కడితే మేము పడే కట్టానికి పెతిపలం దక్కేది. –మైలపల్లి సూరిబాబు, మత్స్యకారుడు రాజయ్యపేట -
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.రాయవరం : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెదగమ్ములూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇరువురు ఎంపికై నట్టు వ్యాయామ ఉపాధ్యాయులు నిర్మల తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్పోర్ట్స్’ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన బాలికల విభాగం పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు చెప్పారు. పాఠశాలలో 10 వ తరగతి చదవుచున్న కనిగిరి హరిని,పోలిశెట్టి పావనిలు ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు సుధామాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి స్నేహితులు ఈ విద్యార్థులను అభినందించారు. ఈ నెల 25వ తేదీన అమరావతి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొని ఆడతారన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు ఎంపికకావడం పట్ల శిక్షణ ఇచ్చి వ్యాయామ ఉపాద్యాయురాలిని, ప్రతిభ క్రీడాకారులను అభినందించారు. -
గవర్నర్ విందుకు బాక్సింగ్ క్రీడాకారిణికి ఆహ్వానం
నర్సీపట్నం : బాక్సింగ్ క్రీడాకారిణి బొంతు మౌనిక కళ్యాణంకు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. నర్సీపట్నంకు చెందిన మౌనికకు కలెక్టర్ ద్వారా రాజ్భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి లేఖ పంపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం గవర్నర్ బంగ్లాలో ప్రముఖులకు ఇచ్చే విందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. శాప్ బాక్సింగ్ సెంటర్లో ఐదేళ్ల నుంచి శిక్షణ పొందుతూ 10కి పైగా జాతీయ స్థాయి పోటీల్లో ఒక స్వర్ణ పతకం, 2 రజత, ఒక కాంస్య పతకం సాధించింది. 14 స్టేట్ లెవెల్ పోటీల్లో 8 స్వర్ణ, 2 రజత పతకాలు సాధించింది. గవర్నర్ బంగ్లా నుంచి ఆహ్వానం రావడంతో మౌనిక కళ్యాణంను పలువురు అభినందించారు. -
యాచకులు లేని నగరంగా విశాఖ
అల్లిపురం (విశాఖ): యాచకులు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పది నెలల కిందట నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమానికి ఒక రూపు వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని యాచకులకు తగిన ఆశ్రయం కల్పించి, వారిని గౌరవప్రదమైన జీవితం వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీపీ తెలిపారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణమని వివరించారు. రోడ్లపై భిక్షాటన చేసే నిరాశ్రయులను రోజూ చూసి బాధపడేవాడినని, ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి ప్రయత్నించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, హార్బర్ సీఐ సింహాద్రి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తిరుపతిరావు, సీఐ చప్పా ప్రసాద్(వీఆర్), నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం ఒక్క రోజే 243 మంది యాచకులను గుర్తించి, వారికి క్షవరం, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చి, టిఫిన్తో పాటు భోజనం కూడా అందించినట్లు తెలిపారు. 243 మందిలో 45 మంది బాగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి అప్పగించినట్లు వివరించారు. మానసిక స్థితి సరిగా లేని 9 మందిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించామన్నారు. మిగిలిన 189 మందిని వివిధ పునరావాస కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. -
కొలిక్కి రాని చర్చలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురం వాసులకు నేవల్ బేస్ అధికారులకు గురువారం జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. పైడమ్మ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నిస్తున్న డీజీఎన్పీ సిబ్బందిని అడ్డుకుంటున్న స్థానికుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న వాగ్వాదం సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించడంతో డీజీఎన్పీ సిబ్బంది వెనుదిరిగారు. తర్వాత వాడనర్సాపురం వాసులు తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన అర్జెంట్ పని నిమిత్తం మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత మత్స్యకారులతో స్థానిక పోలీసు అధికారులు చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే తమ గ్రామాన్ని తరలించాల్సి వస్తే అప్పుడు మాత్రమే చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలి తప్ప ప్రస్తుతం ఎటువంటి పనులు చేపట్టినా అడ్డుకుంటామని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. అయితే గ్రామస్తులు కోరిన చోట ఫెన్సింగ్ వేయకుండా వదిలి మిగిలిన ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేస్తామని నేవల్ అధికారులు చెప్పడం గమనార్హం. -
మహాప్రసాదం నిత్యాన్నదానం
సింహగిరిపై నిత్యాన్నదాన పథకంలో సింహాచలం దేవస్థానం అందించే అన్నప్రసాదాన్ని భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదం స్వీకరించే తిరుగుపయనం అవ్వాలని చాలా మంది భక్తులు తపిస్తుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన అప్పన్న నిత్యాన్నదాన పథకం అమల్లోకి వచ్చి నేటి(ఆగస్టు 14)తో 36 వసంతాలు పూర్తిచేసుకుని 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డిస్తున్న సిబ్బందినేటితో 36 వసంతాలు పూర్తిచేసుకున్న సింహాచల దేవస్థానం నిత్యాన్నదాన పథకంసింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు రోజూ దేశ విదేశాలకు చెందిన భక్తులు వస్తుంటారు. వీరిలో ఒడిశా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులే ఎక్కువ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించాలని 1989 ఆగస్టు 14న నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగులే ఈ పథకానికి రూ.50 వేలు తొలి విరాళం అందించారు. అప్పటి నుంచి ఈ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూ.38 కోట్లకు పైగా విరాళాలు 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి నిత్యాన్నదాన డిపాజిట్లు 36 కోట్ల 45 లక్షల 41 వేల 720 రూపాయలకు చేరుకున్నాయంటే అది భక్తులకు సింహాచలేశుడిపై ఉన్న అచంచల విశ్వాసమే..! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మరో రూ.2.20 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఈ విరాళాలను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యం దేవస్థానం అన్నప్రసాదం అందిస్తోంది. దాతలకు ప్రత్యేక ప్రాధాన్యత నిత్యాన్నదాన పథకానికి విరాళాలందించే దాతలకు ప్రత్యేక గుర్తింపు ఉటుంది. రూ.10,116 ఆపై విరాళం అందించే దాతలకు దేవస్థానం బాండ్లు అందిస్తుంది. ఆ రోజు పరిస్థితి ఆధారంగా స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. దీంతోపాటు ఏడాదిలో వారు కోరుకున్న రోజున వారి పేరు మీద భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ వివరాలను ఆ రోజు అన్నప్రసాద భవనం బోర్డులో పేర్కొంటారు. రూ.10,116 లోపు వచ్చే విరాళాలను స్వల్ప విరాళాలుగా పరిగణిస్తారు. వాటిని ప్రోవిజన్స్, ఇతర ఖర్చులకు వెచ్చిస్తారు. రోజువారీ అన్నప్రసాదం సింహగిరిపై ఉన్న అన్నప్రసాద భవనంలో రోజూ ఉదయం 11.30కు వడ్డన ప్రారంభమవుతుంది. సోమ నుంచి శుక్రవారం వరకు రోజూ 2 వేలు నుంచి 3,500 మందికి, శనివారాలు 5–7 వేలు, ఆదివారం రోజుల్లో 4–6 వేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తారు. రోజూ రాత్రి పూట 200–500 మంది భక్తులకు కదంబం(ముక్కల పులుసు అన్నం) అందిస్తారు. మార్చి 31 నాటికి రూ.36.45 కోట్లకు చేరిన డిపాజిట్లు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మరో రూ.2.20 కోట్లురుచి చాలా బాగుంది శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం బాగా జరిగింది. కుటుంబ సభ్యుల కోరికతో తొలిసారి అన్నప్రసాదం స్వీకరించా. రుచి బాగుంది. సాంబారు ఎంతో నచ్చింది. అన్నప్రసాదం రుచి ఎలా ఉందో భక్తుల అభిప్రాయాలు తీసుకోవడం బాగుంది. – ఆర్.రావు, భిలాయ్ మహా ప్రసాదంగా భావిస్తా.. సింహాచలేశుడి దర్శనానికి తరచూ వస్తుంటాను. అన్నదాన భవనంలో భోజనం తప్పకుండా చేస్తాను. మహాప్రసాదంగా అనుకుంటాం. దాతల సహకారంతో సింహాచలం దేవస్థానం చేస్తున్న అన్నదానం ఎంతో గొప్ప కార్యక్రమంగా భావిస్తాను. – మణి, విజయనగరం భక్తులకు నాణ్యమైన భోజనం అన్నప్రసాదాన్ని భక్తులకు రుచిగా అందించేందుకు ఎప్పటికప్పుడు నాణ్యత పరిశీలిస్తాం. దీనిపై అధికారులకు ప్రత్యేక సూచనలిస్తాం. ఆఖరి పంక్తి వరకు భక్తులందరికీ ఒకే రకమైన నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. దాతల ప్రోత్సాహం చాలా ఎక్కువ. – వి.త్రినాథరావు, ఈవొ, సింహాచలం దేవస్థానం -
గంజాయి కేసులో నలుగురి అరెస్ట్
అనకాపల్లి టౌన్: గంజాయి కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బెంగళూరుకు చెందిన మోహన్ (39), మిధున్ (21), అరవింద్(23), మనోజ్ కుమార్ (24) ఈ నెల 11న కారులో బెంగళూరు నుంచి అరకు చేరుకుని 17 కిలోల గంజాయి కొన్నారని తెలిపారు. దాన్ని బెంగళూరులో అధిక ధరకు అమ్మాలని రోడ్డు మార్గంలో వెళ్తుండగా బట్టపూడి గ్రామం వద్ద తనిఖీల నేపథ్యంలో పోలీసులను చూసి కారు వేగంగా నడిపారన్నారు. దీంతో అనుమానం వచ్చి కారును అడ్డగించి పోలీసులు సోదా చేశామన్నారు. కారు డిక్కీలో ఉన్న గంజాయి, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను బుధవారం కోర్టుకు హాజరు పరిచినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ ఎస్ఐ జి. రవికుమార్, హెచ్సీ సోంబాబు, పీపీలు శంకర్, వెంకట్రావులను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ జి. అశోక్కుమార్ పాల్గొన్నారు. -
ఇదీ నేపథ్యం..!
పరవాడ మండలం దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2, 360–3, 360–2 సర్వే నెంబర్లలో మొత్తం 13.25 ఎకరాల భూమిని నలుగురు మాజీ సైనికోద్యోగులకు (రమణమ్మ, ఎస్.వేణుగోపాల్ రెడ్డి, ఏఎస్ఆర్కే కుమార్, ఆర్.రామచంద్రరావు) కేటాయించారంటూ రికార్డుల్లో ఉంది. ఈ భూములను వారి నుంచి గతంలోనే కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు భూ వివాదాలు నడుస్తున్నాయని.. భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మంత్రి అయ్యన్న ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ కూడా నిర్వహించారు. దీంతో గతంలో జరిగిన భూలావాదేవీలపై నిషేధం విధించారు. ప్రధానంగా మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములపై లావాదేవీలు జరగకుండా నిషేధం కొనసాగింది. ఈ నేపథ్యంలో దేశపాత్రునిపాలెం పరిధిలోని 13.25 ఎకరాల భూముల లావాదేవీలపై కూడా నిషేధం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా సిట్లో 360–1, 360–2 సర్వే నెంబర్లు లేవని అపెక్స్ కమిటీ మెమోను చూపిస్తూ ప్రైవేటు సంస్థకు 6.26 ఎకరాల భూమిని కట్టబెట్టడం గమనార్హం. -
గంగాదేవిపేట వద్ద ఆటో–కారు ఢీ
మునగపాక: మండలంలోని గంగాదేవిపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన ఆటో ప్రయాణికులతో అనకాపల్లి వెళ్తుండగా అదే సమయంలో మునగపాక మండలం తిమ్మరాజుపేటకు చెందిన కారు అనకాపల్లి నుంచి మునగపాక వైపునకు వస్తోంది. కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆటోకు కూడా నష్టం వాటిల్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
అనకాపల్లి డిపో గ్యారేజి గేటు వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు అనకాపల్లి: ప్రజారవాణా శాఖ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్, డిపో అధ్యక్షుడు ఎ.ఎం.రావులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బుధవారం ధర్నా చేపట్టారు. విశ్రాంత ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని, అనారోగ్య సెలవులకు పూర్తిగా జీతం చెల్లించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థపరంగా వేతనాలు చెల్లించాలని, తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలని తదిత ర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. డిపో కార్యద ర్శి కె.ఎన్.వి.రమేష్, కోశాధికారి ఎం.బి.రాజు, నాయకులు కె.ఎన్.భూషణం, పి.వి.ఆర్.మూర్తి, బి.ఆర్.ఎ.రావు, తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ సంస్థలతో రైతులకు అన్యాయం
అనకాపల్లి: మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే దేశంలో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని సంయుక్త కిసాన్ రైతు మోర్చా, రైతు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పట్టణ పురవీధుల గుండా రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాల్ని మారుస్తుందన్నారు. కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని, పది సంవత్సరాలు దాటిన ట్రాక్టర్లపై నిషేధాన్ని తొలగించాలని, రైతుల భూములు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధానం ఆపాలనే డిమాండ్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ రైతు మోర్చా జిల్లా కన్వీనర్ కర్రి అప్పారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, రైతు కూలీ సంఘం కన్వీనర్ కోన మోహన్, జిల్లా వృత్తిదారుల కన్వీనర్ గంటా శ్రీరామ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి వీవీ శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు, ఎస్వీ నాయుడు, తేలయ్య బాబు, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రెండు తులాల బంగారం కోసం చిన్నాన్నని చంపేశాడు..
● నాటు తుపాకీతో హత్య చేసిన వ్యక్తి అరెస్టు నిందితుడు అప్పారావుని విలేకరుల ముందు హాజరుపరచి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐ కొత్తవలస : కేవలం రెండు తులాల బంగారం కోసం జరిగిన వివాదం వరసకు చిన్నాన్న అయిన సిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చి చంపడానికి దారి తీసిందని విజయనగరం డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(70)ను తన మేనకోడలు భర్త అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు ఈ నెల 5వ తేదీన అతి సమీపం నుంచి నాటు తుపాకీతో కాల్చి చంపాడు. సీఐ సిహెచ్.షణ్ముఖరావు కేసు నమోదుచేశారు. నిందితుడు కోటపాడు రోడ్డు సీతంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ స్థానిక విలేకరులకు వెల్లడించారు. నిందితుడు అప్పారావు భార్య ఏడాదిన్నర కిందట మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, భూమి ఇతర ఆస్తులు మేనమామ అయిన మృతుడు సిమ్మ అప్పారావు వద్ద ఉన్నట్టు తెలిపారు. సదరు బంగారం, భూమి ఇవ్వాలని నిందితుడు అప్పారావు మృతుడు అప్పారావుని పలుమార్లు అడిగాడు. అయినా బంగారం ఇవ్వకపోవడంతో ఈ నెల 5న నిందితుడు తన సొంత ఆటోలో ముసిరాం వచ్చి మరోసారి బంగారం ఇవ్వమని అడిగాడు. ఆయన నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో గుండైపె కాల్చడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. పాతవలస సమీపంలో ఉంచిన తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
పడకేసిన పల్లె వైద్యం
● వైద్య ఆరోగ్యశాఖలో కొరవడిన సమయపాలన ● పీహెచ్సీ వద్ద ఎఫ్ఆర్ఎస్ వేసి తాపీగా వెళుతున్న ఎంఎల్హెచ్పీలు ● సమయానికి తెరుచుకోని విలేజ్ క్లినిక్లు గాడి తప్పిన సమయపాలన నర్సీపట్నం: వైద్య ఆరోగ్యశాఖలో సమయపాలన కొరవడింది. అత్యవసర సేవల నిమిత్తం వైద్య ఆరోగ్యశాఖలో ముఖ ఆధారిత గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్)కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇది విలేజ్ క్లినిక్ ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలకు వరంగా మారింది. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్లను ఉదయం 9 గంటలకు తెరవాల్సి ఉంది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు (ఎంఎల్హెచ్పీలు) విలేజ్ క్లినిక్లతోపాటు పీహెచ్సీల వద్ద ఎఫ్ఆర్ఎస్ వేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వీరు దీనిని ఆసరాగా చేసుకుని నిర్ణత సమయానికి పీహెచ్సీలకు చేరుకుని అక్కడ ఎఫ్ఆర్ఎస్ వేసుకుని ధీమాగా విలేజ్ క్లినిక్లకు వెళుతున్నారు. పీహెచ్సీలకు ఆయా గ్రామాల విలేజ్ క్లినిక్లు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్లకు వెళ్లే సరికి సమయం 10.30 నుంచి 11 గంటలు అవుతోంది. వీరు స్థానికంగా నివాసం ఉండకుండా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎల్హెచ్పీల నిర్వాకం వల్ల గ్రామస్థాయిలో వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రాల్లోని పీహెచ్సీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన పీహెచ్సీల వైద్యాధికారులు సైతం విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించటం లేదు. ఇదే అదునుగా ఎంఎల్హెచ్పీలు ఇష్టానుసారంగా విధులకు హాజరువుతున్నారు. పర్యవేక్షణ శూన్యం జిల్లాలో 46 పీహెచ్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 424 విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. గ్రామస్థాయిలోనే ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఒక్కొక్క కేంద్రానికి సుమారు రూ.25 లక్షలు వెచ్చించి విలేజ్ క్లినిక్లను నిర్మించింది. విలేజ్ క్లినిక్ల ఎంఎల్హెచ్పీలు స్థానికంగా ఉండాలనే నిబంధనలు సైతం ఉన్నాయి. ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. పీహెచ్సీల వద్ద ఎఫ్ఆర్ఎస్ వేసుకుని ధీమాగా క్లినిక్లకు వెళ్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి తిరుగు ప్రయాణమై 4 గంటలకు పీహెచ్సీల పరిసర ప్రాంతాలకు చేరుకుని ఎఫ్ఆర్ఎస్ వేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు. క్లినిక్ల నిర్వహణను ఆశా కార్యకర్తల మీద వదిలేస్తున్నారు. దీనిని ప్రతి రోజు ఒక దినచర్యగా మార్చుకున్నారు. వీరు క్లినిక్లో రెండు గంటలకు మించి ఉండటం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది సమయపాలన పాటించటం లేదు. ఉపేక్షించేదిలేదు... సమయపాలన పాటించని ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. విధిగా ఉదయం 9 గంటలకు విలేజ్ క్లినిక్లను తెరవాలి. పీహెచ్సీల్లో ఎఫ్ఆర్ఎస్ వేసే సిబ్బందిని గుర్తించి, జిల్లా వైద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వీరజ్యోతి, ఏడీఎంహెచ్వో, నర్సీపట్నం నర్సీపట్నం మండలం, వేములపూడి పీహెచ్సీ పరిధి బోడపాలెం విలేజ్ క్లినిక్ ఎంఎల్హెచ్పీ కీర్తన ఉదయం 9 గంటలకు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. వేములపూడి నుంచి బోడపాలేనికి వెళ్లాలంటే 11 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ ఆమె బుధవారం ఉదయం 9.01 గంటలకు వేములపూడి పీహెచ్సీకి వెళ్లే మెయిన్ రోడ్డుపై ఎఫ్ఆర్ఎస్ వేసుకుని బోడపాలెం బయలుదేరారు. అక్కడకు సమీపంలో ఉన్న పి.కె.పల్లి వేములపూడికి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కేంద్రానికి సంబంధించిన ఎంఎల్హెచ్పీ సంతోషలక్ష్మి వేములపూడి పీహెచ్సీలో ఎఫ్ఆర్ఎస్ వేసుకుని 9.35 గంటలకు పి.కె.పల్లి బయలుదేరారు. ఆక్సాహేబుపేటకు వేములపూడికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కేంద్రం ఎంఎల్హెచ్పీ కూడా ప్రతిరోజు వేములపూడిలో ఎఫ్ఆర్ఎస్ వేసుకుని ఆక్సాహేబుపేట వెళుతున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో ఇదే తంతు నడుస్తోంది. -
జటిలంగానే పైడమ్మ చెరువు వివాదం
రాంబిల్లి (అచ్యుతాపురం): వాడనర్సాపురానికి ఆనుకుని ఉన్న పైడమ్మ చెరువు వివాదం జటిలంగానే ఉంది. 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువే ఇప్పుడు వాడనర్సాపురంతో పాటు 21 గ్రామాల ప్రధాన నీటి వనరు. ఆయా గ్రామాల మీదుగా ప్రవహించే వరద నీరు ఈ చెరువుకే చేరుతోంది. నీటి పారుదల శాఖ పరిధిలో ఉండే ఈ చెరువును బుధవారం చుట్టూ ఫెన్సింగ్ వేయాలని నేవల్ బేస్ అధికారులు, డీజీఎన్పీ సిబ్బంది ప్రయత్నించడంతో వాడనర్సాపురం వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిపాటి వాగ్వాదంతో కూడిన చర్చలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో చెరువుపై హక్కులు వదులుకునేది లేదని స్థానిక మత్స్యకారు చెబుతున్నారు. కానీ కొద్ది సంవత్సరాల క్రితం రెవెన్యూ శాఖ ద్వారా దఖలు పడిన ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి తీరాలని డీజీఎన్పీ ధృడ నిశ్చయంతో ఉండటంతో వివాదం కొలిక్కి రాలేదు. కాగా గ్రామస్తుల ఆమోదం, పంచాయతీ తీర్మానం లేకుండా చెరువును దఖలు పరచడం కుదరదని పేర్కొనడంతో గురువారం పోలీసుల సమక్షంలో ఫెన్సింగ్ పనులు ప్రారంభించాలని నేవల్ బేస్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి ఈ గ్రామస్తులకు ఫోన్లు వెళ్లాయి. స్టేషన్కు వచ్చి కలవాలని, శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించడంతో గ్రామస్తులు సైతం తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కలిసి సమస్యను వివరించిన వాడనర్సాపురం వాసులు రెండవ విడతలో గ్రామాన్ని తరిలిస్తే తప్ప చెరువును వదులుకోబోమని పట్టుబడుతున్నారు. తీర ప్రాంతంలో ఆంక్షలు, శారదా నదిలోకి వెళ్లేందుకు ఉన్న అడ్డంకుల నేపథ్యంలో ఉన్న చెరువుని ఎలాగైనా తమకు వనరుగా ఉంచుకోవాలని స్థానికులు ఆశించడంలో ఎటువంటి తప్పు లేదని ప్రజా సంఘాల వాదన. ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం.. పైడమ్మ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని నేవల్ బేస్ సిద్ధం కావడం, ఈ మేరకు పోలీసుల సహకారం కోరడం వంటి పరిణామాలతో గురువారం పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉన్న నేవల్ బేస్ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలను సైతం కొన్ని సందర్భాల్లో పట్టించుకోరు. అదే సమయంలో సున్నితమైన తమ భవితవ్యం విషయంలో రాజీపడే ధోరణిలో మత్స్యకారులు లేరు. ఈ క్రమంలోనే బుధవారం చర్చలు సాఫీగా సాగి నేవల్ బేస్, డీజీఎన్పీ సిబ్బంది వెనక్కి వెళ్లినప్పటికీ గురువారం మళ్లీ పనులు మొదలు పెట్టే పరిస్థితి కనిపించడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలయింది. సహజంగా తీర ప్రాంత వాసులు కాస్త ఉద్వేగంగానే ఉంటారు. అదే సమయంలో తమ ఉనికి, భవితవ్యానికి సంబంధించిన అంశం కావడంతో ఎంతకై నా పోరాడే తత్వం కలిగి ఉంటారు. మత్స్యకారుల జీవన ఆధారం, ఉన్నతాఽధికారుల పట్టుదల వంటి పరిణామాలతో పరిస్థితి ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. రెండు వర్గాలను నియంత్రించగలిగే వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పవచ్చు. మళ్లీ ఫెన్సింగ్ పనుల్ని అడ్డుకున్న వాడనర్సాపురం వాసులు తమ గ్రామం ఉన్నంత కాలం చెరువుని వదులుకోబోమని పునరుద్ఘాటన వెనుదిరిగిన నేవల్ బేస్, డీజీఎన్పీ సిబ్బంది నేడు పోలీసుల సమక్షంలో పనులు చేపట్టే అవకాశం -
స్టీల్ మెల్ట్ షాప్–2లో 72 హీట్లతో కొత్త రికార్డు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ మరో అద్భుతమైన ఘనతను సాధించింది. స్టీల్ మెల్ట్ షాప్–2 (ఎస్ఎంఎస్–2) విభాగంలో మంగళవారం అత్యధికంగా 72 హీట్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 2021 జనవరి 30న సాధించిన 68 హీట్ల రికార్డును ఇది అధిగమించింది. ఈ రికార్డు సాధనలో భాగంగా మూడు షిఫ్టుల్లోనూ 24 చొప్పున మొత్తం 72 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రెండు స్టీల్ మెల్ట్ షాపులలో కలిపి మొత్తం 133 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. అంతేకాకుండా మూడు బ్లాస్ట్ ఫర్నేస్లలో కలిపి 19,037 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి కావడం విశేషం. ఈ రికార్డు సాధనలో కృషి చేసిన ఉద్యోగులను స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులు అభినందించారు. -
400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
మద్దిలపాలెం (విశాఖ): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూ పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఈ ర్యాలీ సిరిపురం కూడలి, ఏయూ ఇన్ గేట్ మీదుగా మళ్లీ పరిపాలన భవనం వద్ద చేరుకోవడంతో ముగిసింది. రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు, డీన్ కె.రమా సుధ, ఎస్.హరినాథ్, ఎన్.ఎం.యుగంధర్, డి.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. -
సిట్లో భూములుహాంఫట్!
అక్రమాల ‘కేడీ’..! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై నిషేధాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘సిట్’ నివేదికలోని భూములపై మాత్రం ఎడాపెడా నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. ఇప్పటికే ఎండాడలో రూ.100 కోట్ల విలువైన 5.10 ఎకరాల భూమిపై నిషేధాన్ని ఎత్తివేసి ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా పరవాడలోని 6.26 ఎకరాలను సైతం ఓ ప్రైవేటు సంస్థ పరం చేసింది. ఈ భూమి విలువ రూ.70 కోట్లకు పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం సిట్లో ఫలానా సర్వే నెంబర్లు లేవంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అపెక్స్ కమిటీ మెమోను చూపించడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా అనకాపల్లి జిల్లా కలెక్టరు 6.26 ఎకరాల భూమిపై నిషేధం ఎత్తివేస్తూ గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పరవాడలోని దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2 సర్వే నెంబర్లలోని 6.26 ఎకరాల భూమి నేరుగా ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంలో బీచ్ రోడ్లో ఉండే సు‘కుమార్’డు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఇందులో సదరు వ్యక్తి వాటా రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే కొమ్మాది, మధురవాడ, పరవాడలోని మరికొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూములపై నిషేధం ఎత్తివేయించేందుకు సదరు బ్రోకర్ భారీ స్థాయిలో డీల్స్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ● నేరుగా ప్రైవేటు సంస్థకు భూ బదలాయింపు ● సిట్లో లేవని.. అందుకే నిషేధం ఎత్తివేశామంటూ మెలిక ● భూమి విలువ రూ.70 కోట్లు ● సు‘కుమారు’డి వాటా రూ.10 కోట్లు అపెక్స్ కమిటీ పేరుతో అక్రమాలు...! కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ నివేదికపై అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అపెక్స్ కమిటీ తమకు అనుకూలమైన సర్వే నెంబర్లను సిట్ నివేదిక నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశపాత్రునిపాలెంలోని 360–1, 360–2 సర్వే నెంబర్లకు చెందిన 6.26 ఎకరాల భూమిని సిట్ నివేదికను తప్పించినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా 2025 ఫిబ్రవరి 14న అపెక్స్ కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో రూపంలో ఆదేశాలు జారీచేసింది. దీని ఆధారంగా అనకాపల్లి కలెక్టర్ పైరెండు సర్వే నెంబర్లలోని భూములపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే సదరు మాజీ సైనికోద్యోగుల పేరు మీద కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా గతంలో విక్రయించిన ప్రైవేటు సంస్థ పేరు మీదనే ఉత్తర్వులు జారీచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సు‘కుమార్’ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరవాడలో 6.26 ఎకరాలపై నిషేధం ఎత్తివేత సు‘కుమార’ంగా చక్రం తిప్పేశాడుదేశపాత్రునిపాలెంలోని 6.26 ఎకరాల భూమిపై నిషేధం ఎత్తివేసేలా చేసిన వ్యవహారంలో బీచ్ రోడ్లో ఉండే సు‘కుమార్’ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కూడా ఆ భూమిని తిమ్మిని బమ్మిని చేసినందుకుగానూ ఆయాచితంగా లభించిందనే ప్రచారం ఉంది. సదరు వ్యక్తి ఓ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేకు బినామీగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. అతడి వద్ద మరో రూ.1,000 కోట్ల విలువ చేసే ఫైల్స్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పరవాడ భూవ్యవహారంలో సదరు వ్యక్తికి రూ.10 కోట్ల వాటా దక్కినట్టు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యే ద్వారా కీలక మంత్రికి.. తద్వారా చినబాబుకు దగ్గరగా ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్లోని భూములకు కూడా చక్రాలు వచ్చి ప్రైవేటువ్యక్తుల పరమవుతుండటం గమనార్హం -
ప్రైవేటు బస్సు బోల్తా
కశింకోట: నూతలగుంటపాలెం వద్ద బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి ఎనిమిదిమంది గాయపడ్డారు. ఎస్ఐ పి.మనోజ్కుమార్ అందించిన వివరాలు.. ఒడిశా రాష్ట్రంలోని అడ్డుబంగి నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు.. ముందు వెళుతున్న వాహనాన్ని తిప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి నూతలగుంటపాలెం రిలయన్స్ బంక్ వద్ద రోడ్డు పక్కనున్న పల్లపు ప్రాంతంలోకి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భరతన్, కృష్ణారావు, పార్వతి, ఉమా, మాధవి, సనాతన రాయ్, పి.శ్రీరాములు, రాములమ్మ, బృందావతి, కె.మోహన్రావు గాయపడినవారిలో ఉన్నారు. ప్రమాదం జరిగే సరికి బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. సంఘటన స్థలాన్ని సీఐ అల్లు స్వామినాయుడు సందర్శించి, కేసు దర్యాప్తు చేపట్టారు. ఎనిమిది మందికి గాయాలు -
గవర్నర్ విందుకు క్రీడాకారుడు చరణ్కు ఆహ్వానం
కూర్మన్నపాలెం: వాలీబాల్ క్రీడాకారుడు అట్టాడ చరణ్కు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. వడ్లపూడిలోని కణితి కాలనీలో నివాసముంటున్న చరణ్కు శ్రీకాకుళం కలెక్టర్ ద్వారా రాజ్భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి లేఖ పంపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం గవర్నర్ బంగ్లాలో ప్రముఖులకు ఇచ్చే విందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. చరణ్ తన మేనమామల వద్ద ఉంటూ.. విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో చరణ్ కాంస్య పతకం సాధించాడు. గవర్నర్ బంగ్లా నుంచి ఆహ్వానం రావడంతో చరణ్ను పలువురు అభినందించారు. -
సుంకాల ఉచ్చులో రొయ్య
కుదేలైన ఆక్వా రంగం● తగ్గిన రొయ్యల ఎగుమతులు ● ఇప్పటికే పతనమైన ధరలు ● భరోసా ఇవ్వని కూటమి ప్రభుత్వంమహారాణిపేట: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి రాజసం తెచ్చిపెట్టి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టిన బంగారు రొయ్య.. నేడు అమెరికా వాణిజ్య విధానాల కారణంగా తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. దేశ రొయ్యల ఉత్పత్తిలో అగ్రగామిగా.. ఆక్వా హబ్గా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్.. ముఖ్యంగా విశాఖ తీరం, మునుపెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుంది. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధించడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో మన రొయ్యల పోటీ సామర్థ్యం దెబ్బతింది. ఫలితంగా ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం, ఎగుమతులు నిలిచిపోవడంతో లక్షలాది మంది ఆక్వా రైతులు, మత్స్యకారులు, పరిశ్రమ కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే, ఈ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపడం ఖాయం. కుప్పకూలిన ధరలు.. భారత రొయ్యల ఉత్పత్తులపై అమెరికా ఏకపక్షంగా 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించడమే ఈ సంక్షోభానికి మూల కారణం. ఇదే సమయంలో, ఈక్వెడార్ వంటి పోటీ దేశాలపై కేవలం 10 శాతం సుంకం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత రొయ్యలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా ఎగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయి, స్థానిక మార్కెట్లో ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. గతంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ. 270 పలకగా, ఇప్పుడు అది రూ. 230కి పడిపోయింది. ఈ ధరల పతనంతో రైతులు టన్నుకు రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు కూలిపోవడంతో, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని ఆసరాగా చేసుకున్న స్థానిక వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని రైతులు, మత్స్యకారులు, పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమెరికాతో దౌత్య, వాణిజ్యపరమైన చర్చలు జరిపి, సుంకాలను తగ్గించేలా లేదా పూర్తిగా తొలగించేలా ఒత్తిడి తీసుకురావాలి. నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి. టన్నుకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదా నష్టపరిహారం అందించడం వంటి చర్యలు చేపట్టాలి. విద్యుత్, రొయ్యల మేత వంటి కీలకమైన వాటిపై సబ్సిడీలను పెంచి, సాగు వ్యయాన్ని తగ్గించాలి. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి.. యూరప్, ఇతర ఆసియా దేశాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించడానికి ఎగుమతిదారులకు ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలి.’అని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే.. రాబోయే సీజన్లో రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమపై ప్రభావం ఈ సంక్షోభం కేవలం రైతులకే పరిమితం కాలేదు. దీని ప్రభావం మొత్తం సరఫరా గొలుసుపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100–150 ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లోని 15 ఫ్యాక్టరీలు ఎగుమతి ఆర్డర్లు లేక ఉత్పత్తిని భారీగా తగ్గించాయి. దీనివల్ల వేలాది మంది కార్మికులు, ముఖ్యంగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల మేత, మందుల సరఫరాదారులు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, రవాణా రంగం కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఏడాదికి రూ. 25వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఈ కీలక రంగం కుదేలవడం రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగిస్తోంది. -
బదిలీలు సరే... జీతాలెప్పుడో..!
● టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులకు అందని వేతనాలు ● టీచర్లకు ఐడీ కేటాయింపుల్లో జాప్యం ● రెండు నెలలుగా జీతాల్లేవు.. మూడో నెలా అదే పరిస్థితి ● జిల్లాలో 3 వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు, టీచర్లు, సిబ్బంది ఎదురుచూపులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం చవిచూస్తోంది. ఇటీవల రెండు నెలల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన జరిగిన సాధారణ బదిలీల్లో స్థాన చలనమైన ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులకు కూటమి సర్కార్ జీతాల విషయంలో చుక్కలు చూపిస్తోంది. బదిలీల ప్రక్రియ ముగిసి విధుల్లో చేరి రెండు నెలలు పూర్తయి..మూడో నెల కూడా సగమైంది. జీతాలు మాత్రం చెల్లించకుండా ప్రభుత్వం అవస్ధలపాలు చేస్తోంది. సాక్షి, అనకాపల్లి : జూన్ నెలలో జీతం రాలేదు..జులైలో జీతం రాలేదు. ఆగస్టు నెల అయినా జీతం వస్తుందా..అని వేలాది మంది టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు సిబ్బంది ఎదురు చూపులు చూస్తున్నారు? బదిలీలను సాకుగా చూపి ప్రభుత్వం జీతాలను చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో పాటు విద్యా, ట్రెజరీ శాఖల సమన్వయ లోపంతోనే ఉపాధ్యాయులకు ఈ పరిస్థితి దాపురించింది. తమ జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, అధికారులు ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. బదిలీలు పూర్తయినా..సమస్యలు అలాగే... సాధరణ బదిలీల్లో ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులకు భారీగా బదిలీలు జరిగాయి. రెవెన్యూలో ఉమ్మడి విశాఖ జిల్లా స్దాయిలో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంటు, వీఆర్వోలకు బదిలీలు జరిగాయి. ఈ బదిలీలు ప్రక్రియ పూర్తయినా..అక్కడక్కడా డిప్యూటేషన్ సమస్యలు ఇప్పుటికీ కొనసాగుతున్నాయి. నిషేధం ఎత్తి వేసిన తర్వాత కూడా బదిలీలను జిల్లా కలెక్టర్ కొనసాగిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి జూన్, జులై, ఆగస్టు మాసాల్లో ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూలు ఫీజులు, ఇతర విద్యా సామాగ్రి కోసం వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బదిలీలు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, కొత్త ఇంటి అడ్వాన్సులు, ఇంటి అద్దెల రూపంలో మరింత ఖర్చు పెరుగుతుంది. వీటిన్నింటికి తోడు జీతాలు సకాలంలో రాకపోవడంతో నెలసరి ఈఎంఐల చెక్కు బౌన్సులు, పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్ వంటి చెక్ బెన్సులు అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పరిస్ధితి ఇంత దారుణంగా ఉంది. ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 15వ తేదీ నాటికి అన్ని పూర్తయ్యాయి. అయితే ఇప్పటికీ అనేక మంది ఉపాధ్యాయులకు పోజిషన్ ఐడీలు కేటాయించలేదని తెలుస్తోంది. దీంతో జూన్ నెలకు సంబంధించిన జులై నెల జీతాలు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు అందలేదు. అలాగే జులై నెలకు సంబంధించిన జీతాలు ఆగస్టు మొదటి వారంలో అందుకునే అవకాశం లేదని తెలుస్తోంది. త్వరితగతిన జీతాలు వేయాలి బదిలీ అయిన ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు సొంత ప్రాంతం నుంచి వారి కుటుంబాలతో వెళ్లారు. రవాణా ఖర్చులు, ఇంటి అద్దె, అడ్వాన్స్ రూపంలో ఎక్కువగా ఖర్చు పెట్టారు. మరోవైపు జూన్ నెలల్లోనే బదిలీలు అవ్వడంతో కావడంతో పిల్లల స్కూలు ఫీజు, విద్యార్థులకు పుస్తకాలు, ఇతర ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈ పరిస్దితుల్లో జీతాలు అందకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చొరవ చూపించి త్వరితగతిన జీతాలు వచ్చేలా చేయాలని కోరుతున్నాను. – టి.ఆర్.అంబేద్కర్, యూటీఎఫ్ జిల్లా సెక్రెటరీ -
జల ప్రవాహంలో బిక్కుబిక్కుమని..
దేవరాపల్లి: సుందర సరియా జలపాతం కొన్ని గంటలపాటు వారి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని విశాఖ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన 32మంది సందర్శకులు ప్రాణాలు అర చేత పెట్టుకొని బిక్కుబిక్కు మని గడిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలోని సరియా జలపాతం సందర్శనకు మంగళవారం ఉదయం వీరు వెళ్లారు. మధ్యా హ్నం సమయంలో భారీ వర్షం రావడంతో జలపాతానికి ముందు ఉన్న గెడ్డ ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులంతా అవతలి వైపు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేవరాపల్లి, చీడికాడ ఎస్లు వి.సత్యనారాయణ, బి.సతీష్, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులతో కలిసి మూడు గంటలపాటు శ్రమించారు. గెడ్డ ఉధృతి తగ్గిన తర్వాత రోప్ సహాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చా రు. రాత్రి 10 గంటల సమయంలో దేవరాపల్లి ప్రాంతానికి తీసుకువచ్చారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సీఐ పైడపునాయుడు, చీడికాడ ఎస్ఐ బి.సతీష్, అనంతగిరి, దేవరాపల్లి తహసీల్దార్లు వీరభద్రచారి, పి.లక్ష్మీదేవి, జీనబాడు పంచాయతీ కార్యదర్శి రమ్య వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ వర్షాకాలంలో జలపాతాల సందర్శనలు వద్దని సూచించారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణ, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులను, స్థానికులను డీఎస్పీ అభినందించారు. దేవరాపల్లి చేరుకున్న పర్యాటకులకు స్థానికంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు. సరియా వద్ద చిక్కుకున్న 32 మంది పర్యాటకులు భారీ వర్షానికి జలపాతం దారిలో గెడ్డ ఉధృతి గెడ్డ ఆవల చిక్కుకుపోయిన సందర్శకులు అప్రమత్తం చేసిన అనకాపల్లి ఎస్పీ రోప్ సహాయంతో రక్షించిన పోలీసు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది -
వరుణ కటాక్షం...జల ‘తాండవ’ం
నాతవరం : తాండవ రిజర్వాయరుకు సంబంధించి ఈ ప్రాంతంలో గత యాభై ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈ ఏడాది కూడా మరోసారి ప్రకృతి అక్షలారా నిజం చేసింది. మండలంలో తాండవ రిజర్వాయరు నిర్మించాక మొట్ట మొదటిసారి ప్రాజెక్టు ప్రధాన గేట్లు ఎత్తి ఆయకట్టు కు నీటిని 1974లో కాలువ ద్వారా విడుదల చేశారు. తాండవ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన రోజు తర్వాత కూడా ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది. ఈ ఆనవాయితీ సుమారుగా 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుందని ఈ ప్రాంతీయులు అంటున్నారు. తాండవ రిజర్వాయరులో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో కూడా ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేస్తే కచ్చితంగా వర్షం పడుతుంది. ఈఏడాది ఖరీఫ్ పంటసాగుకు నీరు విడుదల చేయ గా ఆ రోజు నుంచి మండలంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతోంది. తాండవ ప్రాజెక్టు నుంచి నీటిని ఆదివారం విడుదల చేసే సమయంలో 371,5 అడుగులు నీరు ఉండేది. ఇటీవల కురిసిన వర్షానికి ఇన్ ఫ్లో నీరు ప్రాజెక్టులోకి రావడంతో మంగళవారం సాయంత్రానికి 372,5 అడుగుల కు పెరిగిందని ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. -
పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ప్రణాళిక
అచ్యుతాపురం : పరిశ్రమల జరిగే ప్రమాదాల నివారణకు తగిన ప్రణాళికలు కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ప్రమాదం జరిగితే స్పందించాల్సిన విధానంపై తగిన సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నివారణకు సేప్టీ ట్రైనింగ్ ఇస్తున్నామని, దీనిపై తగిన పర్యవేక్షణ కలిగి ఉన్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల వద్ద గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రదేశాల వద్ద నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అతి వేగ నివారణ, హెల్మెట్ వినియోగం నిరంతర ప్రచార, అమలు జరిగే చూడాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని,ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిష్టం ద్వారా తనిఖీలు చేయాలని సూచించారు. పెండింగ్ ఫైల్స్ సీడీల పరిశీలన, కేసుల పురోగతిపై సూచనలు ఇచ్చారు. నేరాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. గంజాయి రవాణా, నాటు సారా తయారీపై ఎప్పటికప్పుడు దాడులు చేయాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు రౌడీ షీటర్లపై నిఘా, చెడు ప్రవర్తన కలిగిన వారి పట్ల ప్రత్యేక దృష్టి ఉంచాలని అన్నారు. సీసీటీవీల ఏర్పాటుపై ఆసక్తి, ప్రోత్సాహం కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. సీఐ గణేశ్,ఎస్ఐలు సుధాకర్,వెంకటరావు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అచ్యుతాపురం పోలీస్స్టేషన్ సందర్శన -
వెంకటాపురం మాదిరిగా మాకూ నిధులివ్వాలి
ఎస్.రాయవరం: ఎనిమిది వందల ఓట్లు ఉన్న వెంకటాపురం గ్రామానికి ఏడాదిలో రూ.3 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అదే ప్రాతిపదికన నియోజకవర్గంలో ఉన్న 108 గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు, కూటమి నాయకులు ముక్కుసూటిగా మంత్రికి విన్నవించారు. మండలంలో వెంకటాపురం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆమె మంగళవారం విచ్చేశారు. ముందుగా మండల కేంద్రం నుంచి వెంకటాపురం వరకు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ఆసక్తికరంగా లేకపోవడంతో ఎస్.రాయవరం దాటాక స్కూటీ ఎక్కి మంత్రి ప్రయాణం చేశారు. లింగరాజుపాలెం వెళ్లే సరికి స్కూటీని కూడా పక్కన పెట్టి తన వాహనంపై వెంకటాపురం చేరుకున్నారు. ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ రాజ్, జెడ్పీటీసీ నిధులతో చేపట్టిన పార్క్, సీసీ, తారు రోడ్లను ఆమె ప్రారంభించారు. అనితమ్మ పేరున ఏర్పాటు చేసిన పార్కుకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను అంగన్వాడీ టీచర్లు, వెలుగు సిబ్బంది, వీఆర్పీలు, ఆశా వర్కర్లతో నింపేశారు. ట్రాక్టర్ల ర్యాలీ కారణంగా తలెత్తిన ట్రాఫిక్లో కలెక్టర్ కారు చిక్కుకుపోయింది. దీంతో ప్రారంభోత్సవాలు ముగిసే సరికి కలెక్టర్ విజయ కృష్ణన్ మంత్రిని కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో రమణ, వ్యవసాయ అధికారులు ఉమాప్రసాద్, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు. కర్రివానిపాలెం గ్రామానికి చెందిన 100 శాతం వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులు మంగళవారం మంత్రికి తమ గోడును విన్నవించుకున్నారు. దిగుమర్తి కుసుమ, పోతు పల్లవి తమకు రూ.15 వేలు పింఛన్కు అర్హత ఉన్నా ఇవ్వడం లేదని వాపోయారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రూ.15 వేలు పింఛన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు కృషి అచ్యుతాపురం రూరల్ : పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. మంగళవారం స్థానిక ఎంఎస్ఎంఈ కేంద్రంలో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి అనితకు కూటమి నాయకుల విజ్ఞప్తి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం -
విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించాలి
ఎస్.రాయవరం : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. జాతీయ నులిపురుగులు దినోత్సవం పురస్కరించుకుని లింగరాజుపాలెం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థులకు నులిపురుగులు మాత్రలు పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. విద్యార్థులకు చదువుతో పాటు పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. చేతి గోళ్లు కత్తిరించి శుభ్రంగా ఉంచుకునేలా చేయాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీటిని అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. మరుగుదొడ్డి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలతో పాటు విద్యాలక్ష్యాలను కూడా వివరించాలని సూచించా రు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హైమావతి, డీఈవో అప్పారావు, సర్వసిద్ధి పీహెచ్సీ వైద్యాఽధికారి వాసంతి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ లింగరాజుపాలెం హైస్కూల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ -
ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి
రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని, ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు ధర్నా చేశారు. ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణంతో తమకు బేరాలు తగ్గిపోతాయని, ఆటోల కొనుగోలు కోసం చేసిన అప్పులకు నెలనెలా ఈఎంఐలు చెల్లింపులు ఇక కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.25 వేలు వాహనమిత్ర పథకం కింద అందజేసి, ఆదుకోవాలన్నారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలపై వ్యాట్ తగ్గించాలని, వడ్డీ లేని రుణాలతో రూ.4 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
దూసుకొచ్చిన మృత్యువు
డాబాగార్డెన్స్(విశాఖ): ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాసన వేడుకతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఆ వేడుకను విజయవంతంగా ముగియగా.. సంతోషంగా తిరిగి ప్రయాణమవుతున్న ఆ ముత్యాలమ్మకు తెలియదు, అది తన జీవితానికి చివరి ప్రయాణమని. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వెంటాడి, కబళిస్తుందని... ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాసన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చారు. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్కు చేరుకున్నారు. బొబ్బిలికి వెళ్లే తన చిన్న కుమార్తెను బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లెవెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుం డగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. సంతోషంగా ముగిసిన అన్నప్రాసన వేడుక, మరుసటి రోజే విషాదాన్ని మిగిల్చింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట (ఎస్.కోట)కు చెందిన గేదెల ముత్యాలమ్మ (47) తన గ్రామానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ద్వారకా బస్టాండ్కు చేరుకున్నారు. ఎస్.కోటకు వెళ్లే ప్లాట్ఫాం వద్ద ఆమె బస్సు కోసం వేచి ఉన్నారు. సుమారు 4.50 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లెవెలుగు బస్సు (హైర్ బస్సు) డ్రైవర్ చంద్రరావు బస్సును అతి వేగంగా ప్లాట్ఫాంపైకి పోనిచ్చాడు. ఈ క్రమంలో బస్సు కోసం వేచి ఉన్న ముత్యాలమ్మను తీవ్రంగా ఢీకొనడంతో ఆమె బస్సు, ప్లాట్ఫాం వద్ద ఉన్న స్తంభం మధ్య నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఢీకొని మహిళ మృతి మరొకరికి గాయాలుడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్లోని ప్లాట్ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
మండల కేంద్రాల్లో వాలీబాల్ కోర్ట్ల ఏర్పాటుకు చర్యలు
జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశంతుమ్మపాల: మండల ప్రధాన కేంద్రాల్లో వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించి, మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, క్రీడాస్ఫూర్తి అలవడుతుందన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2 అవుట్ డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదం చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 50 సెంట్లలో భూమిని సేకరించి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్లో స్విమ్మింగ్ ఫుల్కు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మండల కేంద్రాల్లో 20 సెంట్లలో భూమిని సేకరించి వాలీబాల్ కోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పికెల్ బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి కొలతలు, నిధుల వివరాలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎల్.వెంకటరమణ, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, యలమంచిలి, అనకాపల్లి మునిసిపల్ కమిషనర్లు, ఏపీఐఐసీ డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్, సమగ్ర శిక్ష కార్యనిర్వాహక ఇంజినీర్ నరసింహమూర్తి పాల్గొన్నారు. -
నర్సీపట్నంలో ఈదురుగాలుల బీభత్సం
నర్సీపట్నం : పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని మెయిన్రోడ్తో పాటు వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. గచ్చపు వీధి, తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఆర్డీవో కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు అంతరాయం లేకుండా నేలకూలిన చెట్లను ఫైర్ సిబ్బంది తొలగించారు. అయినప్పటికీ రాత్రి 8 గంటల వరకు విద్యుత్ లేక చీకట్లు అలముకోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విరిగిన స్తంభాలు, నేలకూలిన చెట్లు -
నక్కపల్లిలో హాకీ ఎంపికలు
నక్కపల్లి: ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జోనల్ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలు సోమవారం జరిగాయి. నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న హాకీ కోర్టులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హాకీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 29న విశాఖలో జరిగే జోనల్ స్థాయి పోటీలకు నక్కపల్లి బీఎస్ హాకీ క్లబ్ నుంచి 8 మంది, యలమంచిలి నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎల్.వి.రమణ తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ ఆదేశాల మేరకు జరిగిన ఈ పోటీల్లో ఎంపికై న విజేతలు జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. -
ఎస్పీ కార్యాలయానికి 35 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి పీజీఆర్ఎస్కు సోమవారం 35 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూతగాదాలు–25, కుటుంబ కలహాలు–4, మోసాలకు సంబంధించినవి–2, వివిధ విభాగాలకు చెందినవి–4 అర్జీలు అందాయి. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ వెంకన్న, అర్జీదారులు పాల్గొన్నారు.జిల్లా సమాచార శాఖ వాహనానికి బహిరంగ వేలం తుమ్మపాల: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వీడియో కవరేజ్ వాహనానికి ఈ నెల 21వ ఉదయం 11 గంటలకు కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి. రమణ తెలిపారు. కాలపరిమితి ముగిసి, నిరుపయోగంగా ఉన్న మహీంద్రా నిస్సాన్ (ఏపి31 టి5083, 1993 మోడల్) వాహనాన్ని బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,000 ధరావతు సొమ్ము చెల్లించవలసి ఉంటుందని, వేలం దక్కించుకున్న వారు జీఎస్టీతో సహా మొత్తం నగదు వెంటనే చెల్లించాలని తెలిపారు. వాహనాన్ని కార్యాలయ పని వేళల్లో పరిశీలించవచ్చని, వేలం వేయడం, రద్దు చేసే అధికారం కార్యాలయ అధికారికి ఉందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం.9100442488 కు సంప్రదించాలని కోరారు. విస్తృతంగా ‘జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్’ డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, పార్కులు, రిజర్వ్ ప్రదేశాలు, ఇతర ప్రజా ఆస్తులను పరిరక్షించడం చాలా ముఖ్యమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ఆస్తులపై హక్కులు పూర్తిగా ప్రభుత్వం, జీవీఎంసీకే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, ఆక్రమణకు ప్రయత్నించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు నగరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం జీవీఎంసీ ‘ఆపరేషన్ లంగ్స్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని విస్తృతం చేసిందని కమిషనర్ తెలిపారు. -
తిరంగా...ఘనంగా
● 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభిస్తున్న సర్పంచ్ అక్కునాయుడు, హెచ్ఎం శేఖర్ కె.కోటపాడు : ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 75 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ జరిపారు. ర్యాలీని పాఠశాల నుంచి స్థానిక సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, పీఎంసీ కమిటీ చైర్మన్ కిల్లి సింహాచలంనాయుడు, హెచ్ఎం శేఖర్, పీఈటీ కె.చిట్టి ప్రసాద్ ప్రారంభించారు. ప్రతి విద్యార్థి దేశభభక్తిని పెంచుకోవాలని హెచ్ఎం శేఖర్ ఆకాంక్షించారు. -
ముగిసిన ఖోఖో పోటీలు
పాయకరావుపేట: మూడు రోజులుగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలో జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్–7 తెలుగు రాష్ట్రాల బాల బాలికల ఖోఖో పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర ఖోఖో చాంపియన్ షిప్ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 180కి పైగా జట్లు, 2000 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజేతలకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల పరిశీలకుడు సిహెచ్.ఎల్.ఎం.శ్రీనివాస్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.అపర్ణ, వివిధ ప్రాంతాల విద్యార్థులు, కోచ్లు, మేనేజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతల వివరాలు అండర్–19 బాలికల విభాగంలో సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానంలో, వెరిటాస్ సైనిక్ స్కూల్ తిరుపతి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్ –19 బాలుర విభాగంలో వెరిటాస్ సైనిక్ స్కూల్, తిరుపతి జట్టు ప్రథమ, ఫార్ూచ్యన్ బటర్ఫ్లై స్కూల్, మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్–17 బాలికల విభాగంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్, పాయకరావుపేట ప్రథమ, మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లిషు మీడియం స్కూల్, అనంత్పూర్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. అండర్–17 బాలుర విభాగంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్, పాయకరావుపేట ప్రథమ, ఎకార్ట్ స్కూల్, తిరుపతి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో హీల్ స్కూల్, నరసింగపాలెం ప్రథమ, సూర్యా అకాడమీ స్కూల్, హైదరాబాద్ జట్టు ద్వితీయ స్థానంలో మెరిశాయి. అండర్ –14 బాలుర విభాగంలో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్, పాయకరావుపేట ప్రథమ, ఏకశిల ఇంటర్నేషనల్ స్కూల్, మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు సిహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. -
జిల్లా వాలీబాల్ బాలికల జట్టు ఎంపిక
అనకాపల్లి : ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్లో శాప్ వాలీబాల్ బాలికల జట్టు ఎంపిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి ఎల్.వి.రమణ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి 14 మంది బాలికలు హాజరయ్యారని, జిల్లా జట్టుగా 12 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. విశాఖలో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగు జోనల్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని, అక్కడ గెలుపొందిన జట్టు ఈనెల 21 నుంచి 25 వరకు విజయవాడలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ జట్లకు కోచ్ కం మేనేజర్లుగా జాతీయ వాలీబాల్ రిఫరి భీశెట్టి శ్రీనివాసరావు, విల్లూరి ప్రసాద్ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు ఎల్లపు గోవింద, రాపేటి సీతారాం, దాడి ఓం శివ, పీలా రమణారావు, బుద్ధ శివ, కె.ఆర్.కె సత్యనారాయణ పాల్గొన్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
● జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని రైతుల ఆందోళన ● ఫ్రీ బస్సు పథకంపై ఆటో డ్రైవర్ల నిరసన ● పీజీఆర్ఎస్లో 291 అర్జీల నమోదు తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పలు ప్రజా సంఘాలు, రైతుల నిరసనలతో హోరెత్తింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపడుతున్న భూసేకరణలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆవేదనను నిరసనల రూపంలో తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ ఉపాధికి గండి పడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఇలా నిరసనలు, విన్నపాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పీజీఆర్ఎస్ నమోదు శిబిరం వద్ద కంప్యూటర్లు పనిచేయలేదు.దీంతో ఫిర్యాదుదారులు అర్జీలు పట్టుకుని క్యూలోనే నిరీక్షించారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు. మొత్తం 291 అర్జీలు నమోదయ్యాయి. బల్క్ డ్రగ్ పార్కుకు భూమిలిచ్చేది లేదు.. బల్క్ డ్రగ్ పార్క్ కోసం భూసేకరణ నోటీస్6(ఎ)ను ఉపసంహరించుకోవాలని కోరుతూ నక్కపల్లి మండలం సీహెచ్ఎల్ పురం పరిధిలో జానకియ్యపేట గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. గ్రామంలో 192 ఎకరాల పచ్చని భూమిని సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, పర్యావరణ, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించే ప్రమాదకరమైన పరిశ్రమకు భూములిచ్చేది లేదంటూ తేల్చిచెప్పారు. గత నెల 25న నక్కపల్లి తహసీల్దార్కు అభ్యంతర లేఖలు అందజేశామని, ఈ నెల 6న చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తీవ్రంగా వ్యతిరేకించామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేని తమకు తాతముత్తాల నుంచి సంక్రమించిన భూములు ఇచ్చేదిలేదని, తక్షణమే భూసేకరణ నోటీసులు రద్దు చేయాలని కోరారు. వీహెచ్పీ సభ్యుల నిరసన గోశాలపై ఫిర్యాదు చేసినందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుడు సోమిరెడ్డి రాజుపై హత్యాయత్నం చేసిన దుండగులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లుకు చెందిన కొంతమంది రక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ముఠాగా ఏర్పడి గోవుల అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారంపై సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేశారన్న కక్షతో ముఠా ముఖ్య సభ్యులు, రౌడీ షీటర్ గొర్ల దేవుళ్ళు, గోకులపాడుకు చెందిన సమ్మంగి నానాజీ, నానేపల్లి లక్ష్మణ్ తండ్రి రాజబాబు ఇంటిలోకి చొరబడి చంపేందుకు ప్రయత్నించారని, తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. -
వితంతు పింఛన్ నిలిపివేశారు..
అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తూ నెలకు రూ.7 వేలు వేతనం తీసుకుంటున్న తనను ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తూ వితంతు పింఛన్ మంజూరు చేయడం లేదని మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన రావాడ రమణమ్మ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. వికలాంగుడైన భర్త మాణిక్యం గతేడాది నవంబర్లో మరణించారని, అతని పింఛన్ తనకు భర్తీ చేసి వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నా అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని వాపోయింది. చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు సామాజిక పింఛన్ అందిస్తున్నా తనకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. -
కూటమి నాయకుల విధ్వంసంపై ఫిర్యాదు
తుమ్మపాల : మండలంలో బట్లపూడి పంచాయతీ రాయుడుపేటలో సామాజిక భవనం మెట్లను ఆదివారం మధ్యాహ్నం కూటమి నాయకులు యంత్రాలతో ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సామాజిక అవసరాల కోసం 2003లో మండల పరిషత్ నిధులతో చేపట్టిన సామాజిక భవనాన్ని కూటమి నాయకులు నిబంధనలు పాటించకుండా ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ సెలవు దినం నాడు మెట్లను ధ్వంసం చేసి సామాజిక భవనం కూల్చేందుకు ప్రయత్నించడంపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. -
పైడమ్మ చెరువును వదిలేయండి సారూ...!
ఇదీ నేపథ్యం... రాంబిల్లి(అచ్యుతాపురం): తీర ప్రాంత గ్రామాలు ఒక్కొక్కటిగా తమ ఉనికి కోల్పోతూ స్థానిక మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్న వేళ రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురం వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైడమ్మ చెరువును కాపాడుకొనేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు, జాతీయ స్థాయిలోని పరిశోధన కేంద్రాలకు భూములు తీసుకున్నప్పుడు ఒక విధంగా స్పందించిన అధికారులు కాగితాల్లో కనిపించే నిబంధనలను అమలు చేస్తూ ఏ మాత్రం అక్షర జ్ఞానం లేని గంగ పుత్రుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. నావికా దళం కోసం చేపడుతున్న నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే సముద్రంపై పట్టు కోల్పోయి వేట కోసం తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్ ఆయకట్టు కాల్వలకు వలస పోతుండగా, మిగిలిన వారికి కాస్తో కూస్తో ఆధారంగా ఉన్న చెరువు విషయంలోనూ ఇపుడు ఆందోళనకు గురవుతున్నారు. ఊరు తరలించే వరకూ ఆంక్షలొద్దు... ఉపాధి లేక వలస బాట పట్టిన వాడనర్సాపురం వాసులకు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైడమ్మ చెరువు కాస్తో కూస్తో ఊరటనిస్తుంది. దీనిలో 30 ఎకరాలు పోగా ఉన్న వంద ఎకరాల చెరువు వినియోగం విషయంలోనైనా గ్రామం తరలించే వరకూ ఆంక్షలు విధించొద్దని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఒక వైపు సముద్రంలో ఆంక్షలు, మరోవైపు పరిశ్రమల వల్ల తీరాల్లో తగ్గిన మత్స్య సంపద కారణంగా చెరువులే తమకు అండగా నిలుస్తున్నాయని చెబుతున్నారు. ఫెన్సింగ్ పనుల అడ్డగింత నేవల్ బేస్కి సంబంధించి డీజీఎన్పీ (ఏజీ) పాత్రుడు ఆధ్వర్యంలో సోమవారం పైడమ్మ చెరువు వద్ద ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తారని తెలుసుకున్న వాడనర్సాపురం వాసులు చర్చలు జరిపారు. ముందుగా అధికారులు ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని తరలించిన తర్వాతే చెరువు ఫెన్సింగ్ పనులు చెపట్టాలని, పంచాయతీ ఆమోదం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రెవెన్యూ యంత్రాంగం ఈ చెరువుని నేవల్ అధికారులకు ఎలా అప్పగిస్తుందని వారు ప్రశ్నించారు. చర్చల్లో రామారావు, చింతకాయల ఎర్రయ్య, కొవిరి సోమేశ్వరరావు, కారే రాముడు, సూరాడ అప్పలరాజు, వాసుపల్లి సూరిబాబు, మైలపల్లి లోవరాజులు డీజీఎన్పీ ప్రతినిధికి వినతి పత్రం అందజేశారు. వాడనర్సాపురం వాసుల వేడుకోలు చెరువు చుట్టూ ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని వినతి నేడు నేవల్ బేస్ అధికారులతో గ్రామస్తుల చర్చలు..?రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురంలో 3700కు పైగా జనాభా ఉన్నారు. కూత వేటు దూరంలో సముద్రం ఉంది. మరో కిలోమీటర్ దూరంలో శారదా నది ఉంది. 2005లో నేవల్ బేస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2008 నుంచి పరిహారం ఇవ్వడం ప్రారంభించారు. అప్పట్లో భూమికి రూ.3లక్షలు చొప్పున పరిహారం, వృత్తి కోల్పోయిన వారికి ప్యాకేజీ కింద లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు. ఒకవైపు సముద్రం, మరోవైపు శారదా నది, దీనికి తోడు పైడమ్మ చెరువుపై ఆధారపడి చేపల వేట చేసే ఇక్కడి మత్స్యకారులకు నేవల్బేస్ వచ్చిన తర్వాత పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇప్పటికే 100 కుటుంబాలకు చెందిన వారు శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. తాజాగా పైడమ్మ చెరువుకు ఫెన్సింగ్ వేయాలన్న ప్రతిపాదన మత్స్యకారులకు సమస్యగా మారింది. ఫెన్సింగ్కు తాము ఒప్పుకునేది లేదని ఇక్కడ వారు చెప్తున్నారు. -
ఆర్భాటమే!
ఉచితం... ఉన్న బస్సులతోనే ఉచిత ప్రయాణం ప్రస్తుతం జిల్లాలోని రెండు డిపోలలో ఉన్న బస్సులతోనే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. అదనపు బస్సులు లేవు. రద్దీని బట్టి బస్సుల ట్రిప్పులను పెంచుతాం. ఉచిత ప్రయాణానికి సంబంధించి కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మరమ్మతులకు గురైన బస్సులు కండిషన్ కూడా మెరుగుపరిచి అందుబాటులోకి తీసుకువచ్చాం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ఉచిత ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుంది –వి. ప్రవీణ, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ● -
ప్రైవేటు దాహం
మిట్టల్పై మోహం● రాయితీల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న మిట్టల్ స్టీల్స్ ● రాయితీలు ఇవ్వకపోతే ప్లాంట్ మూసివేస్తామంటూ హెచ్చరికలు ● ఇక్కడా అదే తరహా బెదిరింపులుంటాయని విమర్శలు ● ఇప్పటికే మిట్టల్ ప్లాంట్కు రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలిచ్చిన కూటమి ● స్టీల్ప్లాంట్కు తక్షణమే రూ.30 వేల కోట్ల సాయం కోరుతున్న ప్రజాసంఘాలు విశాఖ ఉక్కును ఉద్ధరిస్తామంటూనే.. ప్రైవేటు జపం చేస్తున్న కూటమి సర్కారు మిట్టల్ బెదిరింపులు మామూలుగా ఉండవు మిట్టల్ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేశాక ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి చేరుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో ఇదే మిట్టల్ సంస్థ అక్కడి ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది. ఇప్పుడిస్తున్న రాయితీలు సరిపోవడం లేదనీ.. తాము కోరినంత రాయితీ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే ప్లాంట్ మూసేస్తామంటూ హెచ్చరిస్తోంది. దీంతో భయాందోళనలకు గురైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో 92 మిలియన్ డాలర్ల భారీ రాయితీలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. మిట్టల్ని పెంచి పోషిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపైనా ఇలాంటి బెదిరింపులు తప్పవని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. కూటమి ఎంపీల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ప్లాంట్ను కాపాడేందుకు ఒక్కసారి కూడా కూటమి ఎంపీలు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లలేదు. కానీ.. మిట్టల్ స్టీల్ప్లాంట్కు సకల సదుపాయాలు కల్పించాలని కోరేందుకు మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, విశాఖ ఎంపీ భరత్ నేతృత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వద్ద సాగిలపడ్డారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఏ ఒక్కరోజూ కోరని కూటమి ఎంపీలు మిట్టల్ ప్లాంట్కు మాత్రం సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని మోకరిల్లుతున్నారు. విశాఖ ఉక్కుపై కూటమి ఎంపీలు, ప్రభుత్వ తీరుచూసి విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తోంది. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెబుతుండగా.. మరోవైపు ప్లాంట్కు కొద్ది దూరంలోనే మిట్టల్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిశ్రమను నిలబెట్టేందుకు రూపాయి కూడా విదల్చని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్స్పై వ్యామోహంతో ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించడం విస్మయానికి గురి చేస్తోంది. మొదట్లో కొద్దోగొప్పో రాయితీలు అడిగి ఆ తర్వాత ప్రభుత్వం నెత్తినెక్కి కూర్చుంటుంది మిట్టల్ సంస్థ. దక్షిణాఫ్రికాలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు మిట్టల్ సంస్థ కోరుతోంది. భవిష్యత్తులో ఏపీ పరిస్థితి కూడా ఇలా మారకముందే మేల్కొనాలని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి. స్టీల్ప్లాంట్కు పునరుజ్జీవనంపై దృష్టి సారించకుండా మిట్టల్కు మోకరిల్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాడు ప్రగల్భాలు పలికి.. ఎన్నికల ముందువరకూ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత విశాఖ ఉక్కును ముక్కలు చేసేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరతామని మరోసారి కుండబద్దలుగొట్టింది. అయినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్లాంట్ మూసివేసేందుకు పూర్తిగా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కుకు కొద్ది దూరంలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ప్రజలు, ఉద్యోగుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు, పవన్కళ్యాణ్ అండ్ కో మిట్టల్కు మోకరిల్లుతున్నారు. స్టేజ్–1లో మిట్టల్ పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ సంస్థకు కావల్సిన సమస్త సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిట్టల్పై ఎందుకంత మోజు? మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేసి.. ప్రజల జీవనోపాధి, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర గల విశాఖ ఉక్కుని పరిరక్షించాలన్న ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సొంత గనులు కేటాయించాలని పదేపదే కోరినా పట్టించుకోని ఎంపీలు.. ఇప్పుడు మిట్టల్కు సొంత గనులు కేటాయించాలని కోరడం దుర్మార్గం. ప్రభుత్వ తీరు చూస్తే విశాఖ స్టీల్ప్లాంట్ని పూర్తిగా బలహీనపరచడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మిట్టల్ సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంత మోజు చూపిస్తోందో అర్థం కావడం లేదు. ఎంపీలు ప్రైవేటుకు ఊడిగం చేయడం హేయమైన చర్య. ఇప్పటికై నా కళ్లు తెరిచి స్టీల్ప్లాంట్కు రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం తీసుకొచ్చి ఆంధ్రుల హక్కుని బతికించాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
● ఇప్పటికే చాలా రూట్లలో బస్సు సర్వీసుల కొరత ● పలు బస్సులు బ్రేక్ డౌన్ ● కొత్త బస్సుల ఊసే లేదు.. ● సీ్త్ర శక్తి పథకం..ప్రచార ఆర్భాటమేనా.. ● ప్రయాణికుల్లో ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం అమలు గురించి ఆర్భాటంగా ప్రచారం చేసింది. ఆచరణలో మాత్రం శూన్యం కనపడుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీనికోసం డీఎం నుంచి సీఎం వరకు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సన్నద్ధం అంటూ సన్నాహాక సమావేశాలు పెడుతున్నారు. వాస్తవంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చాలినన్ని బస్సులు లేవు. కొత్త బస్సుల ఊసే లేదు. దీంతో ఈ పథకం ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టనుందన్న వాదన వినిపిస్తోంది. నర్సీపట్నం : అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో మొత్తం అన్ని రకాల బస్సులు 204 వరకు ఉన్నాయి. ఈ బస్సులు ప్రస్తుతం జిల్లా ప్రజల రవాణా అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉంది. రద్దీ వేళల్లో ఆక్యుపెన్సీ వంద శాతం మించిపోతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం తదితర పట్టణాలకు చదువుకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రూట్ల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు ఎక్కలేని పరిస్థితి ఉంది. నిత్యం ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు బస్సుల కోసం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సీ్త్రశక్తి పథకం ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ రేటు మరింత పెరగనుంది. ఈ పెరుగుదలకు అనుగుణంగా బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. కొత్తగా ఒక్క బస్సును కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే కాలం చెల్లిన బస్సులతోనే ఈ పథకాన్ని నడిపించాలని చూస్తున్నారు. నర్సీపట్నం డిపోలో 106 బస్సులు ఉండగా 93 బస్సులు తిరుగుతున్నాయి. మిగిలిన బస్సులు బ్రేక్ డౌన్లో ఉన్నాయి. బ్రేక్ డౌన్లో బస్సులను కూడా రోడ్ల మీదకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బస్సును విరామం లేకుండా తిప్పాలని చూస్తున్నారు. అంతే తప్ప కొత్త బస్సులు ఊసులేదు. ఇప్పటికే అరకొర బస్సులతో ఆగచాట్లు పడుతున్న విద్యార్థులు ఉచిత ప్రయాణంతో తాము మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. లేని బస్సులకు ఉచితం.. ప్రభుత్వం పాసింజర్లతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణం ఉచితం అని ప్రకటించింది. అయితే ఈ ఎక్స్ప్రెస్ బస్సులు అరకొరగా మాత్రమే ఉన్నాయి. నర్సీపట్నం డిపోలో 12 ఎక్స్ప్రెస్ విశాఖపట్నం, చింతపల్లి రూట్ల్లో మాత్రమే తిరుగుతాయి. అనకాపల్లి డిపోలో 4 మాత్రమే ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మిగతా డిపోల్లో కూడా ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్య చాలా పరిమితం. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఎక్స్ప్రెస్ వరకే కాకుండా సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్ బస్సులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు కోరుతున్నారు. -
నేడు డీవార్మింగ్ మాత్రల పంపిణీ
అనకాపల్లి: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈనెల 12న నిర్వహిస్తున్నట్టు డీఎంఅండ్హెచ్వో ఎం.హైమావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, 1 సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు సగం మాత్రను నీటిలో కరిగించి తాగించాలని, రెండు నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులకు మాత్రను మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత చప్పరించేటట్లు వేయడం జరుగుతుందన్నారు. -
కదంతొక్కిన గోవాడ రైతులు
● సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి ● కార్మికులు, రైతుల బకాయిలు చెల్లించాలి ● లేదంటే ఉద్యమం ఉధృతం ● కలెక్టరేట్ వద్ద ఆందోళనతుమ్మపాల : గోవాడ చెరకు కర్మాగారం దినదిన గండంగా నడుస్తోందని, వచ్చే సీజన్లో ఫ్యాక్టరీ నడుపుతారో లేదోననీ రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు, కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు, కార్మిక సంఘాలు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని, రైతులు, కార్మికులకు గత సీజన్లో బకాయి పడ్డ రూ.30 కోట్లు వెంటనే చెల్లించాలని, ఆధునికీకరణకు రూ.100 కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలో ఉన్న ఏకై క సహకార షుగర్ ఫ్యాక్టరీ కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేసిన రైతుల దశల వారి పోరాటంలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో రైతు సంఘ నాయకులు తాతారావు, రమణ, ఏరువాక శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ కార్మిక రామునాయుడు, సీఐటీయు నాయకులు వి.వి. శ్రీనివాసరావు, గంట శ్రీరామ్, కర్రి అప్పారావు, నాయుడు, గండి నాయనబాబు, రైతులు పాల్గొన్నారు. -
విద్యుత్ లోడు క్రమబద్ధీకరణకు రాయితీ
అనకాపల్లి : గృహాల్లో అదనపు విద్యుత్లోడ్ను క్రమబద్దీకరణకు ఈ ఏడాది డిశంబర్ 31వ తేదీ వరకూ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ విద్యుత్ వినియోగదారులకు అవకాశం కల్పించిందని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి. ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గృహాల్లో అదనపు విద్యుత్లోడ్ను వినియోగించుకుని విద్యుత్ వినియోగదారులు ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 30వ తేదీ వరకూ స్వచ్ఛందంగా 7010 మంది వినియోగదారులు 50శాతం రాయితీని వినియోగించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 50శాతం రాయితీతో కిలోవాట్ను గృహ వినియోగదారులు తగ్గించుకోవచ్చని ఎస్ఈ ప్రసాద్ చెప్పారు. అదపులోడ్ అసలు ధర తగ్గింపు ధర 1కిలో వాట్ 2250 1250 2కిలో వాట్ 4450 2450 3కిలో వాట్ 6650 3650 4కిలో వాట్ 8850 4850 5కిలో వాట్ 11050 6050 -
విద్యా రంగ పరిరక్షణే ధ్యేయం
అనకాపల్లి: ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్, రాష్ట్ర కౌన్సిలర్ ఈ.ఎల్లయ్యబాబు కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వారు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు పాలకులు చూస్తున్నారని, పోరాటాలు చేసే సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రయోగశాలగా చూడకూడదని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు మార్చడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భారతీయ విద్య కూడా పురోభివృద్ధి చెందాలన్నారు. మూఢ నమ్మకాలు, కులతత్వం, ప్రాంతీయతత్వం, మతతత్వాన్ని విడనాడే దిశగా విద్యా సంస్కరణలు ఉండాలని వారు పిలుపునిచ్చారు. సాంకేతిక విద్య, వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారాయని, ఉన్నత విద్య అందరూ అభ్యసించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహ అధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు, జిల్లా కార్యదర్శి జి.ఎస్.ప్రకాష్, యూటీఎఫ్ నాయకులు మామిడి బాబురావు, రవి, బండారు శంకర్, ఎం.కె.శ్రీకాంత్, రాము, వెంకటరమణ, ఆశ పాల్గొన్నారు. -
ఆర్సీడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి
పాయకరావుపేట : రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన గుడిమెట్ల రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్సీడీఎస్ అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డి నుంచి నియమాక పత్రం అందినట్టు రాజశేఖర్రెడ్డి తెలిపారు. తనకు ఆర్సీడీఎస్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఆర్సీడీఎస్ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి వెంగలరెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు వై.సురేంద్రరెడ్డికి, కో ఆర్డినేటర్ వి.వి.ఎస్.ఎన్ రెడ్డి బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
హోరా హోరీగా ఖోఖో పోటీలు
పాయకరావుపేట : శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో ఈ నెల 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న అండర్ –14,17,19 బాలుర, బాలికల విభాగంలో జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్ –7 అంతరాష్ట్ర ఖోఖో పోటీలకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచి 180 కి పైగా జట్లు , సుమారు 2000 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పోటీలు నువ్వా నేనా అన్నట్లు హోరా హోరీగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ అండర్ – 19 బాలికల విభాగంలో ప్రథమ స్ధానం సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్, ద్వితీయ స్థానం వెరిటాస్ సైనిక్ స్కూల్ తిరుపతి, తృతీయ స్ధానాన్ని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, ఖమ్మం గెలుచుకున్నారు. మిగిలిన విభాగాల్లో జట్లు పోటీల్లో తమ సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ దిశగా దూసుకు వెళ్తున్నారు. విజేతలకు సోమవారం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం జరుగుతుంది. కార్యక్రమంలో సీబీఎస్ఈ పరిశీలకులు సిహెచ్ఎల్ఎం శ్రీనివాస్, విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఆంధ్రా, తెలంగాణా నుంచి పోటీలకు హాజరైన విద్యార్ధులు, కోచ్లు మేనేజర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తెగిపడిన విద్యుత్ వైరు మృత్యు పాశమై...
చీడికాడ : మండలంలోని జైతవరానికి చెందిన ఒక మహిళా రైతు విద్యుత్ షాకు గురై మృతి చెందినట్లు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జైతవరం గ్రామానికి చెందిన లాలం లక్ష్మమ్మ(36) ఆదివారం ఉదయం పశువులకు మేత కోసం గడ్డి కోసేందుకు సమీప గ్రామమైన బి.సింగవరం పొలాల్లోకి వెళ్లింది. ఉదయం వెళ్లిన లక్ష్మమ్మ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మృతురాలి కుమారుడు పొలంలోకి వెళ్లి చూశాడు. అక్కడ తెగిపడిన విద్యుత్ వైరు మృతురాలికి అంటుకుని ఉండగా వైరును కర్రతో వేరు చేశాడు. మృతురాలి శరీరంపై విద్యుత్ షాకుతో అయిన కాలిన గాయాలు గుర్తించారు. ఘటనపై మృతురాలి భర్త కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. విద్యుత్షాక్తో మహిళా రైతు మృతి -
కింగ్స్పై సన్షైనర్స్ ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్లో విజయవాడ సన్షైనర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కాకినాడ కింగ్స్పై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విజయవాడ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా, కాకినాడకు ఇది రెండో ఓటమి. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో టాస్ ఓడి తొలుత విజయవాడ బ్యాటింగ్కు దిగింది. టాప్ ఆర్డర్ విఫలమైనా, చివరిలో జహీర్ (57 నాటౌట్), తేజ (46 నాటౌట్) అద్భుత బ్యాటింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. కాకినాడ బౌలర్లలో స్పిన్నర్ ఆంజనేయులు మూడు వికెట్లు తీశాడు. అనంతరం 196 పరుగుల లక్ష్యఛేదనలో కాకినాడ కింగ్స్కు ఓపెనర్లు అర్జున్ (48), కెప్టెన్ భరత్ (34) తొలి వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. అయితే వారు ఔటైన తర్వాత కాకినాడ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రవికిరణ్ (31) మినహా మిగతా వారు విఫలం కావడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 171 పరుగులకు ఆలౌట్ అయింది. విజయవాడ బౌలర్లు పృథ్వీ, టి.భరత్ చెరో మూడు వికెట్లతో కాకినాడ పతనాన్ని శాసించారు. అదరగొట్టిన కెప్టెన్ హేమంత్ ఏపీఎల్లో భాగంగా వైఎస్సార్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు రాయలసీమ రాయల్స్పై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భీమవరం బుల్స్, రాయలసీమ రాయల్స్ను కట్టడి చేసింది. రాయల్స్ కెప్టెన్ రషీద్ (56) అర్ధశతకంతో రాణించినప్పటికీ.. ఆ జట్టు చివర్లో అనూహ్యంగా కుప్పకూలింది. కేవలం 17 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను కోల్పోయి, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 139 పరుగులకు ఆలౌటైంది. బుల్స్ బౌలర్లలో సత్యనారాయణ మూడు వికెట్లు తీయగా, హరిశంకర్, మునీష్, హేమంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ అద్భుత ఇన్నింగ్స్తో సునాయాసంగా గెలిచింది. హేమంత్ 65 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి వంశీకృష్ణ (27 నాటౌట్), సూర్యతేజ (23 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో బుల్స్ జట్టు 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపుల నిర్వహణ ● మరోసారి దివ్యాంగులకు వైద్య పరీక్షలు ● చిన్న తేడా ఉన్నా పింఛన్ తొలగించాలని ఆదేశాలు
మొత్తం దివ్యాంగులు 21,306 ఆర్థోపెడిక్ 12,238 అంధులు 2,373 ఈఎన్టీ 2,287 మానసిక 4,408 రీ వెరిఫికేషన్ జరిగినవి 16,187 రీ వెరిఫికేషన్ చేయాల్సినవి 5,119 పింఛన్ల నిలుపుదల అంచనా 5-12 శాతం మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ ప్రక్రియతో దివ్యాంగుల్లో అలజడి నెలకొంది. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న భయాందోళన మొదలయింది. రీ వెరిఫికేషన్లో సర్టిఫికెట్ రద్దు చేస్తే, వైకల్య శాతం తగ్గిస్తే.. లాంటి ఆలోచనలు వారిని మరింత ఆదోళనకు గురిచేస్తున్నారు. రీ వెరిఫికేషన్కు రాని వారికి తాజాగా పింఛన్ కోత పడింది. ఆరు నెలల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. అనారోగ్యం, ఇతర కారణాలతో రీ వెరిఫికేషన్కు రాలేని వారి పింఛన్లకు ఆ తర్వాతి నెల్లో కోత విధిస్తున్నారు. మొన్న మంచాన పట్టిన వారిని, నిన్న మానసిక వికలాంగులను వదల్లేదు. ఇప్పుడు అంధుల బతుకుల్ని మరింత అంధకారంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యారు. రెండో విడత ఏరివేత వివిధ కేటగిరిల్లో రూ.6 వేలు నుంచి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న దివ్యాంగుల ఏరివేత కార్యక్రమానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో వీరు 21,306 మంది ఉండగా ఇప్పటి వరకు 16,187 మంది రీ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా 5,119 మందికి రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వీరిలో కొంత మంది వివిధ కారాణాల వల్ల రీ వెరిఫికేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పింఛన్ నిలుపుదల చేశారు. ఎంత మందికి నిలుపుదల జరిగిందన్న విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది. కూటమి సర్కార్ ప్రగల్బాలు ఎన్నికలకు ముందు దివ్యాంగుల పింఛన్ పెంపుపై ప్రగల్బాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇపుడు లబ్ధిదారుల తగ్గింపు కుట్రకు తెరతీసింది. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు తెలివిగా రీవెరిఫికేషన్ బాట పట్టింది. పరిశీలన చేయించుకోని వారికి తర్వాతి నెల నుంచే పింఛన్ కట్ చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్లు తీసుకునే వారి మీద ర్యాండమ్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, 6 వేలు పింఛను తీసుకున్న మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరికి పరీక్షల నిమిత్తం సంబంధిత ఆస్పత్రులకు రప్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏ సాకు పేరిట తమ జీవనాధారమైన పింఛన్కు కోత పెడతారోనని దివ్యాంగుల్లో ఆందోళన నెలకొంది. -
వృద్ధురాలి హత్యకేసులో నిందితుడు అరెస్టు
చీడికాడ : మండలంలోని బోయపాడు(ఎల్.బి.పట్నం)లో శనివారం జరిగిన వృద్ధురాలి హత్య ఘటనలో నిందితుడు పవన్సాయిని ఆదివారం అరెస్టు చేసినట్టు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుదరా పవన్సాయి అనే యువకుడు గంజాయి, మద్యానికి బానిసవగా, కుటుంబసభ్యులు అతడిని విశాఖలో గల మానసిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. బతుకు తెరువు కోసం ఆ యువకుడి తల్లిదండ్రులు కంచరపాలెం వలసవెళ్లగా యువకుడు వారి వద్దనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు బోయపాడు వచ్చిన పవన్సాయి 9వ తేదీ తెల్లవారు జామున బహిర్భూమికి వెళుతున్న వృద్ధురాలు గండి పైడితల్లమ్మపై మద్యం మత్తులో కర్రతో కొట్టి అనంతరం బండరాయితో మోది చంపాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందుతుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఎస్ఐ బి.సతీష్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
● వైఎస్సార్సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత గొలుగొండ : కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం సాయంత్రం ఏఎల్పురంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వల్ల మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నాయకులు అనేక అబద్దపు హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు మోసపోయారన్నారు. మహిళల కు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని బస్లకు మాత్రమే పరిమితం చేయడం జరుగుతుందని కూటమి పాలకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీని వల్ల ఉచిత బస్ ప్రయాణం పధకం పక్క దారి పట్టిందన్నారు. బడిగుడి అనే తేడా లేకుండా రాష్ట్రం, జిల్లా, మండలాల్లో మద్యం దుణాకా లు ఇవ్వడం జరిగిందని, ఇది చాలదన్నట్టు ప్రస్తుతం పర్మిట్ రూంలకు వీలు కల్పిస్తూ కొత్త గా చట్టం తీసుకురావడం వల్ల మహిళలు రోడ్డు మీదిగా రావాలంటే బయపడే పరిస్థితి వచ్చిందన్నారు. తల్లికి వందనం పథకంలో చాలామంది తల్లులకు అన్యాయం జరిగిందని, నేటికీ చాలామందికి ఆర్థికసాయం అందలేదని ఆరోపించారు. -
లారీని ఢీకొట్టి దెబ్బతిన్న కారు..
కశింకోట : కశింకోట వద్ద జాతీయ రహదారిపై అదృష్ట్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి సురక్షితంగా త్రుటిలో బయటపడ్డారు. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న కారు కశింకోట పోలీస్స్టేషన్ వద్దకు చేరేసరికి ముందు వెళుతున్న లారీని తప్పించుకొని ముందుకు వెళ్లడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో లారీని కారు పక్కగా ఢీకొంది. దీంతో కారు వెనక చక్రం, పక్క భాగం దెబ్బతిన్నాయి. అయితే ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబం డ్రైవర్, భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరాయం కలిగింది . ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి, పోలీసులు ట్రాఫిక్ నియంత్రించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కారులో ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం -
తాండవ నీటిని పొదుపుగా వాడుకోవాలి
● స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత ● తాండువ నీటి విడుదల నాతవరం : తాండవ రిజర్వాయర్ నీటిని రైతులు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఖరీఫ్ పంట సాగు కోసం తాండవ నీటిని ఆదివారం స్పీకర్ అయ్యన్న, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడుతూ జిల్లాలోనే మేజరు ప్రాజెక్టు అయిన తాండవను మనమంతా కాపాడుకుని, మన తర్వాత తరం వారికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తాండవ ప్రాజెక్టు అభివృద్ధికి ఇంత వరకు రూ.8 కోట్లు మంజూరు చేశానన్నారు. తాండవను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడును ఇటీవల రూ.20కోట్లు అడగగా.. ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నాతవరం నుంచి తాండవ ప్రాజెక్టు రోడ్డును ఇరిగేషన్ నుంచి ఆర్అండ్బీకి విలీనం చేశామని, రూ.8 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టును మొదట సారిగా సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాండవ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామన్నారు. డీఈ అనురాధ మాట్లాడుతూ తాండవలో 372.0 అడుగులు నీరు ఉందని, రోజుకు 500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తే 65 రోజులు ప్రవహిస్తుందన్నారు. ప్రస్తుతం కాలువల ద్వారా 100 క్యూసెక్కులు నీటిని విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ జోగుబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఈఈ బాల సూర్యం, జేఈ శ్యామ్కుమార్, ఆర్డీవో వి.వి.రమణ, స్థానిక నాయకుడు నందిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 14న నేషనల్ డాగ్ షో
మర్రిపాలెం (విశాఖ): సెప్టెంబర్ 14న నేషనల్ డాగ్ షో నిర్వహిస్తున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఆర్ అండ్ బీ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా సహకారంతో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్లో ఈ డాగ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఊటీ, కొడైకెనాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్కతా, జార్ఖండ్, చత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి 50 జాతులకు చెందిన 300 కుక్కలు ఈ షోలో పాల్గొంటాయని వివరించారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, రాజేశ్వరరావు, సీరట్ల శ్రీనివాస్, సూర్యప్రకాష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
13న ‘క్విట్ కార్పొరేట్స్’ నిరసన ర్యాలీ
అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకిస్తూ ఈనెల 13న క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రైతు సంఘాల నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పలు రైతు సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా అమెరికా, బ్రిటన్ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేపడుతుందని, రైతులకు నష్టదాయకంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ చట్టా న్ని సవరించే ముసాయిదాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక చట్టాలను కాలరాసే 4 లేబర్ కోడ్ల అమలు, ప్రజలపై విద్యుత్ భారం మోపేలా అదానీ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు చర్యలు చేపడుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల కోసం వేలాది ఎకరాల భూ సేకరణ చేపడుతూ, సన్న చిన్న కారు రైతులను, దేశ ప్రజలను నిర్వాసితులను చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ‘క్విట్ ఇండియా‘ ఉద్యమస్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్స్‘ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కన్వీ నర్ కర్రి అప్పారావు, రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు గాడి బాలు, సీఐటీయు జిల్లా నాయకులు ఆర్.శంకర్ రావు, శ్రీనివాసరావు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ సురేష్ బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు పాల్గొన్నారు. ఈ నిర్లక్ష్యానికి చికిత్స ఏదీ..! -
పాత, కొత్త ధరలు ... రూ.ల్లో(50 కిలోల బస్తా) ఎరువు రకం పాత ధర కొత్త ధర పొటాష్ 1535 1800 20–20–013(ప్యాక్డ్) 1300 1425 20–20–013(గ్రోమోర్) 1300 1350 20–20–013(పీపీఎల్) 1300 1400 డీఏపీ 1350 1350 10–26–26 1470 1800 14–35–14(గ్రోమోర్) 1700 1800 28–28–0 17
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ● రకాన్ని బట్టి బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకు పెరుగుదల ● సగం పెట్టుబడి ఎరువులకే వెచ్చించాల్సి వస్తోందంటున్న రైతన్నలు ● జిల్లాలో రెండు సీజన్లలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు ● ఆందోళన చెందుతున్న రైతులు ఎరువు.. మరింత బరువు!యలమంచిలి రూరల్ : రాష్ట్రంలో కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులపై ఎరువుల ధరలు దరువు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓవైపు సాగు ఖర్చులతో పాటు పెరిగిన ఎరువుల ధరలతో రైతులు సతమతమవుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకూ... జిల్లాలో ఖరీఫ్,రబీ సీజన్లలో రైతులు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారు. వీటి కోసం సుమారుగా 51,277 మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తారు. వీటిలో సుమారుగా 22,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను పంటల సాగులో వినియోగిస్తుంటారు. ఇందులో యూరియా, డీఏపీ, 28–28–0 రకం ఎరువుల ధరలు మినహాయిస్తే మిగతా వాటి ధరలు బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. రైతులపై అదనపు భారం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 64,101 హెక్టార్లు, రబీలో 16,011 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దీనిలో సింహభాగం వరి సాగవుతోంది. ఈ పంటల సాగుకోసం సుమారుగా 51,277 మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తారని వ్యవసాయాధికారుల అంచనా. వీటిలో సుమారు 22 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఉంటుంది. ఒక యూరియా బస్తా 50 కేజీలు బరువు ఉంటుంది. సరాసరిన బస్తాకు రూ.100 చొప్పున పెరిగిన ధరను లెక్కిస్తే జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. అమాంతం పెరిగిన ధరలతో ఆశించిన దిగుబడులు రాక,సాగు వ్యయం తడిసిమోపెడవడంతో ఆశించిన లాభం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. వారికి అప్పులే మిగులుతున్నాయి. నియంత్రణ లేని ధరలు యూరియాపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంది. కాంప్లెక్స్ ఎరువుల విషయంలో నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు తయారీ ఖర్చుల ఆధారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఫాస్ఫరస్, పొటాష్ ధరల పెరుగుదలతో కాంప్లెక్స్(మిశ్రమ) ఎరువుల తయారీ ధరలు పెరిగాయి. ఎరువుల ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు. దీంతో పంటల సాగు ఖర్చు ఎకరాకు రూ.2 వేల వరకు పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. సాగుకయ్యే ఖర్చులో సగం పెట్టుబడి ఎరువులకే వెచ్చించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. అన్నదాతలకు పిడుగులాంటి వార్త. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో వరుసగా రెండోసారి ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే కష్టాలు, నష్టాలు మోస్తూ ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు ఎరువుల రూపంలో మరోసారి అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలతో జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. మొత్తం 51వేల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువుల వినియోగం ఇందులో 22 వేల మెట్రిక్ వరకు కాంప్లెక్స్ ఎరువుల వాడకం జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్ల అదనపు భారం మోయలేని భారం అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. పెరిగిన ధరలతో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. – కర్రి అప్పారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఇంత ఖర్చుతో సాగు ఎలా..? పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం భారంగా మారిన తరుణంలో ప్రభుత్వాలు ఇలా ఎరువుల ధరలు పెంచడం దారుణం. ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల మేం వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో మా ప్రాంతంలో రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోతే అప్పుల పాలుకాక తప్పదు. – కాళ్ల శ్రీనివాసరావు, రైతు, పోతురెడ్డిపాలెం, యలమంచిలి మండలం -
బల్క్డ్రగ్ పార్క్ను అడ్డుకోవాల్సిందే!
నక్కపల్లి : రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్పార్క్ను అడ్డుకుని తీరాల్సిందేనని మత్స్యకారులు నిర్ణయించారు. ఆదివారం రాజయ్యపేటలో మత్య్సకారులంతా వేటకు విరామం ప్రకటించి సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లాలని, అప్పటికీ స్పందన లేకపోతే తీరప్రాంత గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆదివారం రాజయ్యపేటలో సమావేశమయిన పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ బల్క్డ్రగ్ పార్క్ పేరుతో రాజయ్యపేట పరిసర ప్రాంత గ్రామాల్లో వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిపై ఈనెల 6వ తేదీన నక్కపల్లిలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో మత్స్యకారులు, యాదవ సామాజికవర్గానికి చెందిన వారు వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీలతోపాటు కొంతమంది జనసేన నాయకులు సైతం ఈ బల్క్డ్రగ్పార్క్ను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అయితే వారిని వేదిక వద్దకు రాకుండా పోలీసుల సాయంతో అడ్డుకున్నారన్నారు. ఇక్కడ ప్రమాదకర పరిశ్రమలు ఏర్పాటయితే రాజయ్యపేట, బోయపాడు, బుచ్చిరాజుపేట, తీనార్ల, తదితర గ్రామాల్లో నివసించేవారు అనేక ప్రాణంతకమైన వ్యాధులతో బాధపడతారన్నారు. బల్క్డ్రగ్ పేరుతో వందలాది కంపెనీలు ప్రారంభిస్తే ఈ ప్రాంతమంతా శ్మశానంగా మారుతుందన్నారు. పరిసరాల్లో జీవించడానికి ఎవరూ సాహసం చేయరన్నారు. గ్రామస్తులంతా పార్టీల కతీతంగా ఐకమత్యంగా బల్క్ డ్రగ్ పార్క్ను ఎదుర్కొవాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, కేసులకు భయపడే ప్రసక్తి లేదని సమావేశంలో తీర్మానించారు. రసాయన కంపెనీల వల్ల తాము పడే కష్టాలను ప్రజాభిప్రాయసేకరణలో చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదని మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అగ్గి రగిల్చిన టీడీపీ నేత వ్యాఖ్యలు ప్రజాభిప్రాయసేకరణలో ఒక టీడీపీ నేత కంపెనీకి అనుకూలంగా మాట్లాడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే వారు రెచ్చిపోయారన్న ప్రచారం జరుగుతోంది. వేదిక ముందు ఈ నాయకుడు మాట్లాడుతున్న సమయంలో వందలాది మంది మత్స్యకారులు అరుపులు కేకలతో నాయకుడి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బారికేడ్లు తోసుకుంటూ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుడి ప్రసంగాన్ని అడ్డుకోకుండా అతనికి వత్తాసు పాడిన రాజయ్యపేటకు చెందిన ఇద్దరు కార్యకర్తలపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. కంపెనీకి అనుకూలంగా మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన టీడీపీ నాయకుడిని బయటకు వచ్చేక కొంతమంది అడ్డుకుని నిలదీశారు. ‘కంపెనీ మా గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు... నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్... నష్టపోయేది మేము... పోయే ప్రాణాలు మావి...మీకేంటి సంబంధం?’ అంటూ నిలదీయడంతో సదరు నాయకుడు నీళ్లు నమిలాడు. రైతులకు ప్యాకేజీ, నష్టపరిహారం హోంమంత్రి వల్లే వచ్చిందంటూ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీంతో మత్స్యకారులు, వైఎస్సార్సీపీ, వామపక్ష నేతలు గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బల్క్ డ్రగ్పార్క్ ప్రజాభిప్రాయసేకరణపై ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత రావడానికి వేదికపై ఒక నాయకుడు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలే కారణమని టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇతని ప్రసంగ వీడియోను అసమ్మతి నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పార్టీ అధిష్టానం అతని వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధిని పార్టీ అధిష్టానం ప్రశ్నించినట్లు బోగట్టా. రాజయ్యపేట మత్స్యకారుల నిర్ణయం అవసరమైతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం త్వరలో కార్యాచరణ ప్రణాళిక -
కనకమహాలక్ష్మి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
డాబాగార్డెన్స్ (విశాఖ): ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. వీరితోపాటు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శోభారాణి, ఏఈవో రాజేంద్రకుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కొనసాగిన అప్పన్న ఆభరణాల తనిఖీ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి చెందిన ఆభరణాల తనిఖీ ఆదివారం రెండో రోజు కూడా కొనసాగింది. దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ తనిఖీలను నిర్వహించింది. సింహగిరిపై ఉన్న ఆలయ మ్యూజియంలోని స్వామివారి బంగారు, వెండి ఆభరణాలను, ఇతర వస్తువులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్లలో ఉన్న వివరాలకు అనుగుణంగా వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో ఈ బృందం నిర్ధారించింది. ఈ తనిఖీల్లో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్, దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది దేవస్థానం ఈవో ఎం.కె.టి.ఎన్. ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వారికి దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, డిప్యూటీ ఈవో రాధ, ఏఈవో రమణమూర్తి అవసరమైన వివరాలను అందజేశారు. -
సమర్థ న్యాయవాదులు అవసరం
విశాఖ లీగల్: న్యాయ వ్యవస్థ బలోపేతం కావడానికి సమర్థవంతమైన న్యాయవాదులు అవసరమని గుజరాత్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. స్వయంకృషి, సత్సంకల్పం మనిషి ఎదుగుదలకు మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివంగత న్యాయవాది ఎం.సత్యనారాయణ చిత్రపటాన్ని జస్టిస్ రాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. సహచర న్యాయవాదులు, న్యాయమూర్తులతో ఆయన కేసులను వివరించే తీరు, ప్రవర్తన నేటి యువ న్యాయవాదులకు ఆదర్శం కావాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ దిగువ స్థాయి నుంచి ఎదిగి, మంచి ప్రతిభతో, స్ఫూర్తితో ఎందరో న్యాయవాదులకు సత్యనారాయణ మార్గదర్శకంగా నిలిచారన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోర్టుల్లో సత్యనారాయణ వ్యవహరించిన తీరు తమకు ఎంతో నేర్పిందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యుడు పి.నర్సింగరావు, న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పి.నాయుడు, ప్రముఖులు పైలా సన్నీబాబు, నమ్మి సన్యాసిరావు, సత్యనారాయణ కుమారుడు, న్యాయవాది అనిల్ కుమార్, రాచకొండ ఉమా శాస్త్రి, జి.ఎం.రెడ్డి, చీమలపాటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ -
మేమూ గిరిజనులమే..
చీడికాడ: జిల్లాలోని 8 మండలాల్లో గిరిజనులు నివసిస్తున్నారని, వారికి ఏజెన్సీవాసుల వలె విద్య, వైద్యం తదితర రంగాల్లో సంక్షేమ పథకాలు అందజేయాలని పలు గిరిజన సంఘాల నేతలు కోరారు. కోనాంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సుందరపు విజయకుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు సంఘాలకు చెందిన గిరిజన నేతలు ఇరటా నర్సింహమూర్తి, ఎం.కొండలరావులు మాట్లాడుతూ మైదాన ప్రాంత గిరిజనులు ఎలాంటి ఆధారం లేక నిరుపేదలుగానే మిగిలిపోతున్నారని, 1/70 యాక్టును అమలు చేయాలని కోరారు. నాన్ షెడ్యూల్లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్లో కలిపి ఏజెన్సీ గిరిజనులకు అందుతున్న అన్ని చట్టాలు, సౌకర్యాలను మైదాన గిరిజన ప్రజలకు అందేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారు హామీ ఇచ్చారు. 1/70 యాక్టు మండలాలకు వర్తింప చేస్తే మిగిలిన గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బంది పడతారని, మండలం యూనిట్ గా కాకుండా గిరిజనులు ఉన్న పంచాయతీలకు వర్తింప చేసేలా కృషి చేస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యేకించి పీజీఆర్ఎస్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలని కోరగా నెలలో ఒకరోజు నర్సిపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కోనాం నుంచి వాలాబుకు (దేవరాపల్లి) రోడ్డు వేయాలని కోరగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే రూ 2.15 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని, అనుమతులు రాగానే రోడ్డు పూర్తి చేస్తామన్నా రు. జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గిరిజన ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టుతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినుల థింసా నృత్యంలో కలెక్టర్ విజయ కృష్ణన్, మాడుగుల ఎమ్మె ల్యే బండారు పాదం కలిపారు. ఈ సందర్భంగా డి–వార్మింగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, అధికారులకు మెమెంటో లు అందించారు. ఎంపీపీ తాళ్లపురెడ్డి రాజారాం, వైస్ ఎంపీపీ కిముడు చిన్నమ్మలు, సర్పంచ్ సలుగు ఈశ్వరమ్మ, మండల ప్రత్యేకాధికారి మూర్తి, తహసీల్దార్ లింకన్, ఎంపీడీవో హేమసుందరరావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందించాలనిమెదాన ప్రాంత అడవి బిడ్డల వినతి కోనాంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు థింసా నృత్యం చేసిన కలెక్టర్ -
ఘనంగా దేవీతల్లి ఆలయ పునః ప్రారంభోత్సవం
మునగపాక: మండలంలోని ఉమ్మలాడలోని దేవీతల్లి ఆలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ,ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్,మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు,వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పల్లె అప్పలనాయుడు,ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి, మొల్లేటి నారాయణరావు,శంకర్.కరోతి విజయకుమార్,ఆటో శ్రీను,నరసింగరావు,గణేష్, మొల్లేటి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.కాగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
ఉత్సాహంగా తెలంగాణ, ఆంధ్ర ఖోఖో పోటీలు
పాయకరావుపేట : క్లస్టర్ – 7 సీబీఎస్ఈ పాఠశాలలకు నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్ర ఖో ఖో పోటీలు శ్రీప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అండర్ –14,17,19 బాలురు, బాలికల విభాగంలో సుమారు 180 జట్లు 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, సీబీఎస్ఈ అబ్జర్వర్, ఖో ఖో ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అడ్డంకులు.. నిర్బంధం..అవమానం
ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు పర్యటనలో అలవి కాని ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. పోలీసుల ఓవరాక్షన్తో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గిరిజనుల సమస్యలు చెప్పేందుకు వచ్చిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులను సీఎంను కలిసేందుకు అవకాశం కల్పించకుండా అగౌరవ పరిచారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ శ్రేణులను పోలీసులు నెట్టేశారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వలేదు. హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులకు నిర్బంధం విధించారు. కొంతమందిని ఇళ్లు ఖాళీచేయించగా.. మిగతా వారిని ఇళ్లల్లోంచి బయటకు రాకుండా ఇబ్బందులు పాల్జేశారు.సీఎం చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా ఆంక్షలు పోలీసుల ఓవరాక్షన్పాడేరు : ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఏజెన్సీలో ప్రధాన సమస్యలను తీసుకువెళ్లేందుకు వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రయత్నించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డగించి నెట్టేయడం విమర్శలకు దారితీసింది. ఆహ్వానం మేరకు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అవమానపరిచారు. ఆదివాసీ ప్రాంతంలో సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు నెట్టేశారు. దీంతో వారి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా పాడేరు సెయింటాన్స్ స్కూల్ జంక్షన్ ప్రధాన రహదారి వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పార్టీ శ్రేణులు సుమారు మూడు గంటల పాటు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుంటుపడిన గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజన ప్రాంత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ఎన్నికల సభకు వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వస్తే జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని, స్పెషల్ డీఎస్సీతో భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారన్నారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో చట్ట సవరణ కోసం మాట్లాడించి గిరిజనుల్లో భయాందోళనలకు గురి చేశారన్నారు. ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు చేయడంతో గిరిజనులు రేషన్ సరుకుల కోసం అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో డోలీ మోతలు ఎక్కువై గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావన్నారు. వీటితోపాటు స్థానికంగా ఉన్న గిరిజన ప్రాంత సమస్యలపై తాను సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని ధ్వజమెత్తారు. ఆదివాసీ దినోత్సవంలో తాను హాజరై సమస్యలపై మాట్లాడితే గిరిజన ప్రాంతంపై కూటమి ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుందనే ఉద్దేశపూర్వకంగా పోలీసులతో అడ్డుకుని అవమాన పరిచారన్నారు. తాను ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని, గిరిజనులతో కలిసి మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆదివాసీల సంక్షేమం పక్కనబెట్టి.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ఆదివాసీలకు ఏ మాత్రం సంబంధం లేని ఎక్కడో జరిగిన ఘటనలు, హత్యా రాజకీయాలపై మాట్లాడటంతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చట్టాలు, హక్కులు, వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మాట్లాడకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఆయన పర్యటన సందర్భంగా మండలంలోని లగిసపల్లి వద్ద అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడకు సీఎం వచ్చి వెళ్లేంత వరకు ఆ ప్రాంతానికి కిలోమీటరు వరకు ఇళ్ల వద్ద ఎవ్వరూ ఉండకూడదని ముందుగానే హుకుం జారీ చేశారు. దీంతో కొంతమంది ఇళ్లు ఖాళీ చేయగా మిగతా వారు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. హెలిప్యాడ్ నుంచి వంజంగి గ్రామం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా పోలీసులు మోహరించారు. దీంతో దారిపొడవునా నివాసం ఉన్న ఆదివాసీ కుటుంబాలు చంద్రబాబు వచ్చి వెళ్లేంత వరకు భయంభయంగా గడిపాయి. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తమకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రజావేదిక వద్దకు పోలీసులు అనుమతించారని ఆదివాసీలు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికోసం సీఎం పర్యటన? ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర ఆవేదన పార్టీ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే నిరసన కూటమి ప్రభుత్వ చర్యలపై మండిపాటు ఆదివాసీ జేఏసీ ప్రతినిధులను అడ్డుకున్న బలగాలు గిరిజనుల సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు అవమానం పోలీసులు నెట్టేయడంతో ఉద్రిక్తత పాడేరు రూరల్: ముఖ్యమంత్రి చందబాబు పర్యటన ఎవరి కోసమని.. మరోసారి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర విమర్శించారు. చంద్రబాబుకు ఆదివాసీల సమస్యలు తెలియజేసేందుకు వెళ్తున్న ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలను గొందూరు జంక్షన్ వద్ద పోలీసులు అడుకుని నిర్బంధించారు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాలు, సమస్యలపై సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై నిలదీస్తారన్న భయంతోనే పోలీసులతో ఆదివాసీల ప్రతినిధులను అడ్డుకుని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఆదివాసీలను మోసం చేస్తారని.. మేము మోసపోవడానికి సిద్ధంగా లేమన్నారు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆదివాసీ నాయకులను రానీయకుండా చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబు పర్యటన వల్ల ఆదివాసీలకు ఒరిగిందేమి లేదన్నారు. సొంత పార్టీ నేతలకు కూడా కార్యక్రమానికి రాకుండా ఆంక్షలు విధించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు ఆదివాసీల నుంచి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు చిట్టపుల్లి క్షనివాస్పడాల్ తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాల్లో నిరుత్సాహం సీఎం పర్యటన గిరిజన సంఘాలతో పాటు సొంత పార్టీ నేతలను నిరుత్సాహపరిచింది. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు పలు సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలు, మహిళలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సభా ప్రాంగణంలోకి సొంత పార్టీ నేతలను సైతం రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు పడ్డారు. చాలామంది నిరుత్సాహంతో వెనుదిరిగారు. -
‘కృష్ణమూర్తిని బెదిరింపులకు గురిచేయలేదు’
బుచ్చెయ్యపేట : ఐయితంపూడి గ్రామానికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు బెదిరించారని అతని తండ్రి మహాలక్ష్మినాయుడు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితులైన కృష్ణమూర్తితో పాటు ఇదే గ్రామానికి చెందిన ఐయితరెడ్డి శివకుమార్ను జూన్ 2వ తేదీన విచారించామన్నారు. విచారణలో ఇద్దరూ దొంగతనం చేసినట్టు, రెండు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాన్నారు. దొంగతనం చేసినట్టు ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దగ్గర ఒప్పుకున్నారన్నారు. అదే రోజు నిందితులు ఇద్దరి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితులకు వైద్య పరీక్షలు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినపుడు వారి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. వారిని విచారణ పేరుతో కొట్టడం గాని తిట్టడం గాని చేయలేదన్నారు. కృష్ణమూర్తి తనకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల 4వ తేదీన విషం తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఇదే విషయమై కృష్ణమూర్తికి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామన్నారు. దీనిపై ఇతరుల చెప్పిన విషయాలపై లేనిపోని ఆరోపణలు చేయరాదని కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు విన్నవిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
పలు రైళ్లకు ఆయాస్టేషన్లలో హాల్ట్లు
తాటిచెట్లపాలెం: ఆయా ప్రాంతాల ప్రయాణికులు, ప్రజల అవసరాలకు తగినట్లుగా పలు రైళ్లకు ప్రయోగాత్మకంగా హాల్ట్లను ఇచ్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ● విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం(18518/ 18517) ఎక్స్ప్రెస్కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా మురిబహల్ స్టేషన్లో హాల్ట్ కల్పించారు. ● ధన్బాద్–అలెప్పి–ధన్బాద్(13351/13352) బొకారో ఎక్స్ప్రెస్కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా అంబోడల, తెరుబలి స్టేసన్లో హాల్ట్ కల్పిస్తున్నారు. ● బిలాస్పూర్–తిరుపతి–బిలాస్పూర్(17481/ 17482) ఎక్స్ప్రెస్కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా అంబోడల, తెరుబలి స్టేషన్ల్లో హాల్ట్ కల్పిస్తున్నారు. ● హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12808) సమతా ఎక్స్ప్రెస్కు ఈనెల 15వ తేదీ నుంచి, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్ప్రెస్కు ఈనెల 16వ తేదీ నుంచి తెరుబలి స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నారు. ● అమృత్సర్–విశాఖపట్నం–అమృత్సర్(20808 /20807) హిరాకుడ్ ఎక్స్ప్రెస్కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా నరాజ్ మార్తాపూర్ స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నారు. -
స్పీకర్ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం గురించి బహిరంగ సభలో ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారో రైతులకు చెప్పాలి. మా హయాంలో మంజూరు చేసిన ఏలేరు–తాండవ అనుసంధానం పనులను రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులకు సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులు ప్రజలు గమనిస్తున్నారు. –పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే ● -
సామాజిక కార్యకర్తపై దాడికి నిరసన
తాండవ సాగునీరు విడుదల నేడు నాతవరం: మండలంలోని తాండవ జలాశ యం నుంచి సాగునీటిని ఆదివారం విడుదల చేయనున్నట్టు తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ చెప్పారు. మధ్యాహ్నం 12.10 గంట లకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత నీటిని విడుదల చేస్తారని తెలిపారు. 2025–26 ఖరీఫ్ సీజనుకు గాను సాగునీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పరిధి లో ఉన్న రైతులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. విశాఖ ఉక్కు సోలార్ ప్లాంట్ పునరుద్ధరణకు టెండర్లు ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్లో గత మూడేళ్లుగా నిలిచిపోయిన 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను పునరుద్ధరించడానికి యాజమాన్యం టెండర్లు ఆహ్వానించింది. గతంలో ప్లాంట్ అంతర్గత అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. దీని పునరుద్ధరణ కోసం ఈ నెల 5న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18లోగా టెండర్లు దాఖలు చేయవచ్చు. టెండర్ దక్కించుకున్న సంస్థ ఆరు నెలల్లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎస్.రాయవరం: ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నూకరాజుపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ పలు సంఘాల నాయకులు ఎస్.రాయవరంలో నిరసన తెలిపారు. గోశాల అక్రమ నిర్వహణపై ఇచ్చిన ఫిర్యాదు మేర కు కక్షతో రౌడీ షీటర్ గొర్ల దేముడు, టీడీపీ నాయకుడు నమ్మింగి నానాజీ,టీడీపీ కార్యకర్త నానేపల్లి లక్షణ్లు ఇంటికి వచ్చి హత్యాప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసుల్లో తీవ్రత లేదని, ఇంటికి వచ్చి ముగ్గురు వ్యక్తులు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడితే హత్యాయత్నం కేసులు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. పట్టపగలు విచక్షణారహితంగా దాడి చేసినా, మండల కేంద్రం, పోలీస్స్టేషన్కు అతి సమీపంలో పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తే, పోలీసులు నత్తనడకన స్పందిస్తూ, సాధారణ సెక్షన్లు రెండు వేసి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. నిందితులను వెంటనే అదుపులోనికి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నూకరాజు ఇంటి వద్ద నుంచి ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. వైఎస్సార్ విగ్రహం జంక్షన్కు చేరుకుని మానవహారం నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావుకు వినతి పత్రం అందజేశారు. కాసేపు పోలీసులతో చర్చలు జరిపారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని సీఐ రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి రామాల శివనాగేశ్వరరావు, ఆర్.ఎస్. .ఎస్ కార్యకర్త సిద్దాబత్తుల చిట్టిబాబు, బీజేపీ నక్కపల్లి మండల అధ్యక్షుడు పొల్నాటి నానాజీ, ఆర్టీఐ కార్యకర్తలు పోలినాటి వీరబాబు, కోన బాబూరావు, కోడ బంగార్రాజు, గనగళ్ల రాము పాల్గొన్నారు.న్యూస్రీల్ఉత్సాహంగా పారా అథ్లెటిక్ పోటీలు విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్లో అంతర్ జిల్లాల పారా అథ్లెటిక్ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో జూనియర్ (19 ఏళ్లలోపు), సబ్–జూనియర్ (17 ఏళ్లలోపు) ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పి.వి.జి. ఆర్.నాయుడు ఈ పోటీలను ప్రారంభించి.. పాల్గొన్న అథ్లెట్లను అభినందించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రాక్, ఫీల్డ్ విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. టీ11–13 అంశాల పరుగు విభాగంలో ట్రాక్లో పరుగులందుకుని తగ్గేదేలే అంటూ పోటీపడ్డారు. ముఖ్యంగా వినికిడి లోపం ఉన్నవారు, మేధోపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలు కూడా ఈ పోటీల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన అథ్లెట్లు హర్యానాలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే అంతర్ రాష్ట్ర పారా అథ్లెటిక్ మీట్కు రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. -
బిషప్ డేనియల్ 75వ వసంత వేడుకలు
నర్సీపట్నం : యోరూషలేం ప్రార్ధనామందిరం నిర్వాహకులు రెవ డా..అరసాడ డేనియల్ 75వ జన్మదిన వేడుకలను సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వసంత వేడుకలను చర్చిలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఇన్మూనియల్ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ జీవన్ రాయ్, యుసీఐఎం అధినేత బిషఫ్ కెఆర్.సింగ్ విచ్చేసారు. డేనియల్, అమ్మాణి దంపతులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. డేనియల్ సేవలను వారు కొనియాడారు. ఈ వేడుకల్లో కృపాసిల్వన్, థామస్, నాహోర్, జాన్బాబు, కృపారావు, బెతస్ధ నారాయణరావు, జి.రవి, శరత్, ఆశ, రాణి పాల్గొన్నారు. -
గోవాడ సుగర్స్ను ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మనుగడను కాపాడేందుకు నేరుగా సభ్య రైతులే ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ కార్మికులు, ఏపీ రైతు సంఘాలు వారికి మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది క్రషింగ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్న సభ్యరైతులు ఆందోళన చెందుతూ తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేశారు. 2024–25 క్రషింగ్ సీజన్లో ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయకపోవడం వల్ల ఫ్యాక్టరీ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గతేడాదికి సంబంధించిన చెరకు బకాయిలు నేటికీ చెల్లించలేదు. అంతేకాకుండా ఈ ఏడాది క్రషింగ్ చేస్తారో లేదో తెలియని అగమ్యగోచరంగా ఉంది. దీనితో ఆందోళన చెందిన రైతులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆందోళన ఉధృతం అవుతుందని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రైతులు మాత్రం శాంతియుతంగానే తమ డిమాండ్లను తెలుపుతూ ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్యాక్టరీలో పరిపాలన భవనం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం చేయాలని, ఈ ఏడాది క్రషింగ్ సీజన్ ప్రారంభించాలని, అందుకు కావలసిన ఫ్యాక్టరీ ఓవరాయిలింగ్ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025–26లో రానున్న క్రషింగ్ సీజన్కు వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం, ప్రస్తుతం రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా రైతులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, ఏపీ చెరకు రైతు సంఘ నాయకులు పాల్గొని మద్దతు పలికారు. కూటమి సర్కారు కపట నీతి ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులందరిపై ఉందని మాజీ సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ మాజీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, మాజీ సర్పంచ్ పల్లేల వరహాలబాబు అన్నారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆదుకొని రైతులకు గిటుబాటు ధర కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు ఫ్యాక్టరీని ఆదుకోలేదని వారు ప్రశ్నించారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ ఎన్ని ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారని చెరకు రైతులంతా ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేయాలని, ముందుగా ఈనెల 11వ తేదీన కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు నిర్ణయించారు. ప్రజా, రైతు సంఘాల నాయకులు శ్రీనివాసరావు, నందారపు భాస్కరరావు, ఎస్వీనాయుడు, ఏడువాక శ్రీనివాసరావు, జగదీష్, దండుపాటి తాతారావు,శరగడం అప్పారావు, పీలా రమణ, కొణతాల గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే క్రషింగ్ సీజన్కు అవసరమైన గ్రాంటు ఇవ్వాలి రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగిన చెరకు రైతులు 11న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు నిర్ణయం -
సీఎం పర్యటనకు తాటిపర్తిలో హెలిప్యాడ్ ఏర్పాటు
భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా మాడుగుల: పాడేరులో శనివారం ఆదివాసీ దినోత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం మాడుగుల మండలం తాటిపర్తిలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. ఆర్డీవో వి.వి.రమణ, అదనపు ఎస్పీ ఎం.దేవిప్రసాద్, డీఎస్పీలు ఎం. శ్రావణి, పి.నాగేశ్వరరావు కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు, ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు. -
● ఏపీఎల్ ఆరంభం అదుర్స్
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ నాలుగో సీజన్ అట్టహాసంగా శుక్రవారం ప్రారంభమైంది. అయితే రెండో జట్లు బ్యాటింగ్కు దిగకముందే భారీ వర్షంతో మ్యాచ్ నిలిచింది. ఆరంభ మ్యాచ్లో కాకినాడ కింగ్స్పై టాస్ గెలిచి అమరావతి రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 229 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ భరత్కు రాహుల్ తోడై స్కోర్ను పరుగులెత్తించారు. సెంచరీకి చేరువ(96, 5 ఫోర్లు, 9 సిక్సర్లు)లో రాహుల్ ఔటవగా, భరత్(93, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా సెంచరీని చేజార్చుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ను 14 ఓవర్లలో 173 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. అమరావతి రాయల్స్ బ్యాటర్లు రాణించడంతో 13.2 ఓవర్లలోనే 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి, విజయకేతనం ఎగురవేశారు. భరత్, రాహుల్ సెంచరీల మిస్ వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదింపు 13.2 ఓవర్లలో అమరావతి రాయల్స్ లక్ష్య ఛేదన -
బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు రేపు
మహిళల ఉన్నతికి..గిరిజనులకు నూరుశాతం పనులతోపాటు ఉద్యోగాలు, పదవుల్లోను రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వంవలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు చట్టాన్ని తీసుకువచ్చారు. దీని వల్ల 50 శాతం మహిళలకు పలు పదవుల్లో అవకాశాలు లభించాయి. సాక్షి,పాడేరు: తెల్లవారితే కొండపోడు వ్యవసాయం.అటవీ ఫలసాయం,ఉత్పత్తుల సేకరణతోనే ఆదివాసీల జీవన విధానం ప్రారంభమవుతుంది.అడవులలో అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తులను వారపుసంతలకు తీసుకువచ్చి వాటిని విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో వారానికి కుటుంబ పోషణకు సరపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని గ్రామాలకు తీసుకువెళ్తుంటారు.గిరిజనుల జీవన విధానమంతా అనేక కష్టాలతో కూడుకున్నదే. ఇలా సాగుతున్న జీవన విధానంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ● గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో ఆజాతి గిరిజనుల సంక్షేమానికి గత ఐదేళ్లలో అఽధిక ప్రాధాన్యం ఇచ్చి మౌళిక వసతులు కల్పించారు. ● గిరిజనుల సంక్షేమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 352 సచివాలయాలను ఏర్పాటు చేసి, పరిపాలనను చేరువ చేసింది. విద్య, వైద్యం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ● అటవీ హక్కుల చట్టంలో భూమి పట్టాలు పొందిన సన్న, చిన్నకారు రైతులకు, మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులతో పాటు ప్రభుత్వ పథకాలు పొందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అటవీ భూములు సాగు చేస్తున్న 1,40,407మంది గిరిజనులకు 1.50లక్షల ఎకరాలను అటవీ భూములను పలు విడతలుగా పంపిణీ చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వహక్కులు కల్పించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక్క పట్టాకూడా ఇవ్వలేదు. అర్హులంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నత్తనడకన పనులు : జిల్లా కేంద్రమైన పాడేరులో రూ.500కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో రిఫరల్ కేసుల సంఖ్య తగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు లేవు. వైద్యాధికారుల పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. వైద్యకళాశాలకు అనుబంధంగా ఏర్పాటుచేస్తున్న 500 పడకల ఆస్పత్రి పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ● రంపచోడవరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టగా, దీనిపట్ల ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 146 పడకలతో నిర్మించే ఈ ఆస్పత్రికి రూ. 49.26 కోట్లు గత ప్రభుత్వం వెచ్చించింది. 2022 ఫిబ్రవరిలో ● నాడు–నేడు పథకంలో జిల్లాలోని 47 ఆరోగ్య కేంద్రాలను రూ.22.69 కోట్లతో అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. 12 పీహెచ్సీలకు రూ.18.74 కోట్లతో కొత్త ఽభవనాలను నిర్మించింది. ● జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదట విడతలో రూ.165.27 కోట్లతో 581 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. రెండవ విడతలో 967 పాఠశాలల అభివృద్ధికి రూ.108.96 కోట్లను వెచ్చించి అభివృద్ధికి బాటలు వేసింది. ● జిల్లాలోని 1.68 లక్షల మంది గిరిజన రైతులకు ఏటా రూ.127 కోట్ల రైతు భరోసా పథకంలో సాయం అందజేసింది. కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్నప్పటికీ వీరిలో సుమారు 25 వేల మందికి అన్నదాత సుఖీభవ సాయం కోత విధించింది. ● అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంగా రూ.629.72కోట్లతో పనులు చేపట్టింది ● జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గిరిజనులకు 5జీ నెనెట్వర్క్ సేవలు అందించే లక్ష్యంగా రూ.400 కోట్లతో 2,061 సెల్ టవర్లను మంజూరు చేసింది. సుమారు 700 గ్రామాలకు నెట్వర్క్ను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ● రాజమహేంద్రవరం నుంచి జిల్లా మీదుగా విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి మన్యానికి వరంలా మారింది.టూరిజం కారిడార్లో భాగంగా 251.12 కిలోమీటర్ల రోడ్డును రూ.2,109,14 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టింది. ఐ.పోలవరం, గంగవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, కొయ్యూరు, కృష్ణదేవిపేట, పెదవలస, రంపుల ఘాట్, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, అరకు, అనంతగిరి మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది. గిరిజనుల గుండెల్లో జగన్..ప్రత్యేక జిల్లాతో పాలన చేరువ..ఆదివాసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంనాడు ప్రగతి.. నేడు అథోగతి మన్యంలో విలక్షణ జీవనశైలి ఆదివాసీలది. వీరి అభ్యున్నతికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేసి అభివృద్ధి, పాలన చేరువ చేసింది. ఆధునికత దిశగా అడుగులు వేసేలా తీర్చిదిద్దితే.. ఆ తరువాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పాలన చేపట్టి సుమారు ఏడాదిన్నరకు చేరువ అవుతున్నా వీరి సంక్షేమానికి తీసుకున్న చర్యలు కానరావడం లేదు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. -
వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
అనకాపల్లి: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే వాలీబాల్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక శుక్రవారం జరిగింది. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోందని, ఇందులో పాల్గొనే జిల్లా జట్లను ఎంపిక చేశామని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి ఎల్.వి.రమణ చెప్పారు. శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలురు, 16 మంది బాలికలు పాల్గొన్నారని చెప్పారు. రిలో బాలుర విభాగంలో 25 మందికి ఈనెల 13 వరకు శిక్షణ ఇస్తున్నామని, వీరిలో ఎంపిక చేసిన 12 మంది బాలురు విశాఖలో ఈనెల 16 నుంచి 20 వరకు జరిగే జోనల్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. అక్కడ గెలుపొందిన జట్లు ఈనెల 21 నుంచి 25 వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జట్లకు కోచ్ కం మేనేజర్లుగా భీశెట్టి శ్రీనివాసరావు, విల్లూరి ప్రసాద్ వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు కె.ఎన్.వి సత్యనారాయణ, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు ఎల్లపు గోవింద, రాపేటి సీతారాం, ఆడారి హరి ప్రభాకర్, పీలా రమణారావు, బుద్ధ శివ, ఎల్లపు సత్యనారాయణ, శిలపరశెట్టి భాస్కరరావు, మోటూరి నాగేశ్వరరావు, పీఈటీలు ఎస్.వి.నరసింహం, కె.ఎం.నాయుడు పాల్గొన్నారు. -
మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన ఇంటి పెద్ద నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. చింతలగ్రహారం గవరపాలేనికి చెందిన కాళ్ల కన్నారావు(65) ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించి, నేత్రదానంపై అవగాహన కలిగించారు. దీంతో కన్నారావు భార్య లక్ష్మి, కుమారుడు ముత్యాలనాయుడు, కుమార్తె లక్ష్మి అంగీకారం తెలిపారు. దీంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సారథ్యంలోని మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు కన్నారావు నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. పుట్టెడు దుంఖంలోనూ కన్నారావు కుటుంబ సభ్యులు చూపిన మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు. -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పేట విద్యార్థులు
పాయకరావుపేట: నెల్లూరులోని అక్షర విద్యాలయంలో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్ – 7 అథ్లెటిక్స్ పోటీల్లో పాయకరావుపేట విద్యార్థులు సత్తా చాటారు. శ్రీప్రకాష్ విద్యార్థులు ఆదిత్యకుమార్, జయ సత్య, సునీల్ కుమార్, సత్య పవన్, దుర్గాప్రసాద్, ఎం.కేశవ్కుమార్ పలు విభాగాల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించారు. వీరంతా వారణాసిలోని అతులానంద్ కాన్వెంట్ స్కూల్లో జరగనున్న జాతీయ స్థాయి పాటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్, ప్రిన్సిపాల్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, కోచ్లు చిన్నా, శ్రీరామాంజనేయులు అభినందించారు. -
పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం’
డాబాగార్డెన్స్: పోలీసుల వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని బుచ్చెయ్యపేట మండలం ఐతంపూడి గ్రామానికి చెందిన ముచ్చకర్ల మహాలక్ష్మినాయుడు ఆరోపించారు. కేజీహెచ్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన కుమారుడు కృష్ణమూర్తికి ఏ పాపం తెలియదన్నారు. మూడు నెలల కిందట గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు అన్యాయంగా ఇరికించి జైలుకు పంపించారని వాపోయాడు. బెయిల్పై వచ్చిన కృష్ణమూర్తి, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తగాదాలను దృష్టిలో పెట్టుకుని తనను అన్యాయంగా ఇరికించినట్లు ముచ్చకర్ల శివతో ఫోన్లో మాట్లాడాడని చెప్పారు. గ్రామంలో మాట్లాడుకుందామని చెప్పినప్పటికీ శివ తన పలుకుబడితో పోలీసులకు ఫిర్యాదు చేశాడని, దీంతో పోలీసులు తన కుమారుడ్ని మళ్లీ స్టేషన్కు పిలవడంతో భయంతో ఆత్మహత్యకు యత్నించాడని సాక్షికి మహాలక్ష్మినాయుడు తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆయన కోరారు. -
● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా చూసినా తీరని కష్టాలు ● స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం ● గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిలో కూటమి ప్రభుత్వం
నాతవరం: సరుగుడు, సుందరకోట.. నాతవరం మండలంలోని అత్యంత క్లిష్టమైన గిరిజన పంచాయతీలు.. ఇవి 1/70 యాక్టు పరిధిలో ఉన్నాయి. ఈ రెండు పంచాయతీల పరిధిలో అసనగిరి, రామన్నపాలెం, ముంతమామిడిలొద్దు, తోరడ, దద్దుగుల, రాజవరం, మాసంపల్లి, అచ్చంపేట, యరకంపేట, శిరిపురం, బమ్మిడికలొద్దు, కొత్త దద్దుగుల, కొత్త లంకలు, పాత శిరిపురం శివారు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో గిరిజనులంతా గ్యాప్ ఏరియా భూముల్లో తుప్పలు, డొంకలను తొలగించి వ్యవసాయం సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొండల మీద ఉన్న భూములను బ్రిటిష్ హయాంలో సైతం సర్వే చేయకపోవడంతో సుమారు 10 వేల ఎకరాలను గ్యాప్ ఏరియా భూములుగా పరిగణిస్తున్నారు. అవి రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో గిరిజనులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేవీ వారికి అందడం లేదు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేసి అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి కలెక్టర్లకు విజ్ఞప్తి చేసుకుంటున్నా ఫలితం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో కొందరికి పట్టాలు వచ్చాయి. మిగతా వారికి పంపిణీ చేసే లోగా కూటమి ప్రభుత్వం వచ్చి ఆ ప్రక్రియను నిలిపివేసింది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు 2006 నుంచి అనేక మంది కలెక్టర్లు ఈ గిరిజన గ్రామాలను సందర్శించారు. ప్రస్తుత కలెక్టర్ విజయ కృష్ణన్, అంతకుముందు కలెక్టర్గా పనిచేసిన రవి పట్టాన్శెట్టి కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వారి ఆదేశాలతో గ్యాప్ ఏరియా భూములను సర్వే చేసేందుకు చర్యలు చేపట్టారు. రెండు జిల్లాల సరిహద్దులో గల గ్యాప్ ఏరియా భూములు ఎంతవరకు ఉన్నాయనేది హద్దులు నిర్ణయించారు. కానీ ఈ ప్రక్రియను పూర్తి చేసి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను నిర్ధారించే విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. అందని ఐటీడీఏ సదుపాయాలు పాడేరు ఐటీడీఏ ద్వారా కల్పించే సదుపాయాలు మైదాన ప్రాంతంలో గిరిజనులకు అందడం లేదు. గతంలో పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజనులకు అందిస్తున్న రాయితీలు, సదుపాయాలను కల్పించేవారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మైదాన ప్రాంత గిరిజనులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. గిరిజన ప్రాంతంలో అధికంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉండటంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసేవారు. ఇటీవల కాలంలో పూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైదాన ప్రాంత గిరిజనులను పట్టించుకోవడం మానేశారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే గిరిజనులకు మేలు సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు అందజేసి, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం అందించేది. ఈ రెండు పంచాయతీల్లో అర్హత ఉన్న 550 మందికి రైతు భరోసా పథకంలో డబ్బులు అందచేశారు. సర్వే చేసి ఇంకా 350 మందికి పైగా హక్కు పత్రాలు ఇవ్వడానికి సిద్ధం చేయగా ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చి ప్రక్రియ నిలిచిపోయింది. వాటిని నేటికీ ఇవ్వకపోవడంతో గత ఏడాది గ్రామంలో పర్యటనకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి స్పందన కానరాలేదు. గిరిజనులకు తీరని అన్యాయం రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాడేరు ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మైదాన ప్రాంతంలో ఉండే మాకు కూడా వర్తింపజేసేవారు. మాకు ఇప్పుడు ఎలాంటి సాయం అందడం లేదు. –బండి గంగరాజు, గిరిమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ, సరుగుడు ఇంకెవ్వరికి బాధలు చెప్పుకోవాలి మా గిరిజన గ్రామాల్లో ప్రధాన సమస్యలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్లకు తెలియజేశాం. గత ప్రభుత్వంలో మధ్యలో నిలిచిపోయిన అటవీ హక్కు పత్రాల పంపిణీని పూర్తి చేయమని స్పీకర్ను కోరాం. అయినా ఇంతవరకు గ్యాప్ ఏరియా సమస్య పరిష్కారం కాలేదు. – సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ, సరుగుడు గ్యాప్ ఏరియా.. విముక్తి లేదయా..! అసలే వెనుకబడ్డ గిరిజన ప్రాంతంలో ఈ అడవి బిడ్డల దుస్థితి మరింత జటిలమైన సమస్య.. కలెక్టర్లు వస్తున్నారు, వెళుతున్నారు, పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు వంటి నాయకులెందరికో గిరిజనులు తమ గోడు వినిపించారు.. గానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గ్యాప్ ఏరియా భూముల సమస్య అలాగే ఉంది. -
‘మయామీ ఆఫ్ ది ఈస్ట్’గా విశాఖ
● థీమ్ నగరాల అభివృద్ధికి వీఎంఆర్డీఏ ప్రణాళికలు ● భీమిలి, శొంఠ్యాంతో పాటు మరో రెండు చోట్ల ప్రదేశాల గుర్తింపు ● పీపీపీ విధానంలో అభివృద్ధికి సన్నాహాలు విశాఖ సిటీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో వినూత్న ప్రాజెక్టుల రూపకల్పనకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు విశాఖను ‘బే సిటీ’గా ‘మయామీ ఆఫ్ ది ఈస్ట్’గా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకోసం థీమ్ నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చి ఆర్థిక ప్రోత్సహం అందించే దిశగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ప్రత్యేకంగా థీమ్ బేస్డ్ టౌన్షిప్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ప్రాంతాలను గుర్తించగా.. మరో ప్రదేశాల గుర్తింపు తుది దశలో ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలన్న ఆలోచనలో ఉంది. నీతి ఆయోగ్ సిఫార్సులతో విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా తీర ప్రాంతం అదనపు ఆకర్షణగా నీతి ఆయోగ్ గుర్తించింది. దీంతో విశాఖను ఫ్లోరిడాలోని మయామీ నగరాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఫార్సులు చేసింది. దీని ప్రకారం వీఎంఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి పట్టణ క్లస్టర్ను ఒక ప్రత్యేక థీమ్ ఆధారంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఐటీ–ఇన్నోవేషన్, హెల్త్–వెల్నెస్, నాలెడ్జ్–ఎడ్యుకేషన్, టూరిజం–కల్చర్, లాజిస్టిక్స్–ట్రేడ్, వంటి రంగాలు ఆధారంగా వీటిని అభివృద్ధి చే యాలన్న ఆలోచనలో ఉన్నారు. విశాఖలో మూడు థీమ్ బేస్డ్ టౌన్షిప్ల నిర్మాణంపై వీఎంఆర్డీఏ అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే భీమిలి మండలం కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యం గ్రామాలను గుర్తించారు. -
చదివింపులు
చినబాబుకురూ.12 కోట్లఇప్పటికే చెల్లించిన రియల్టర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ పేరుతో రంగ ప్రవేశం ఎండాడలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టిన ఓ సంస్థ దసపల్లా భూముల వ్యవహారంలోని మరో రియల్టర్కు అప్పగింత విచారణ చేయాలని అన్ని పక్షాల నుంచి డిమాండ్ కమిటీ కష్టమంటూ కలెక్టర్ నివేదికతోనే స్పీకర్ను బుజ్జగించే యత్నం?సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఎండాడలోని 5.10 ఎకరాల భూ వ్యవహారంలో చినబాబుకు ఇప్పటికే రూ.12 కోట్ల చదివింపులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చెల్లింపుల వ్యవహారాన్ని మొత్తం దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత చూసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఎండాడలోని సర్వే నంబరు 14–1 లోని 5.10 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు ఇద్దరు రియల్ ఎస్టేట్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ఇప్పటికే ఎండాడలో పలు ప్రాజెక్టులు చేపట్టిన సంస్థ ఒకటి కాగా.. చినబాబు సామాజికవర్గానికే చెంది, దసపల్లా భూముల వ్యవహారాల్లో ఉన్న మరో సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ స్థలంలో 14 ఫ్లోర్ల వరకూ నిర్మించే అవకాశం ఉందని.. తక్కువలో తక్కువగా చదరపు అడుగుకు ప్రారంభంలోనే రూ.6 వేల వరకూ ధర పలికే అవకాశం ఉందని సదరు రియల్టర్లు లెక్కలు వేసినట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ పేరు మీద కొంత భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ సంస్థ నుంచి విశాఖకు చెందిన ఈ ఇద్దరు రియల్టర్ల చేతికి రానుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అనధికారికంగా ఒప్పందం జరిగినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ భూమి వ్యవహారంలో విచారణ చేయాలంటూ ప్రతిపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా స్పష్టమైన డిమాండ్లు వస్తున్నాయి. కమిటీ వేసి విచారణ చేయాలంటూ స్వయంగా స్పీకర్ కోరినప్పటికీ కుదరదని కలెక్టర్ నివేదికతోనే సరిపుచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా నేరుగా చినబాబు పాత్ర ఉండటంతో విచారణ జరిపేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరిన్ని భూములపై నిషేధం ఎత్తివేత..! వాస్తవానికి ఎండాడలోని 14–1 సర్వే నంబరుకు చెందిన 5.10 ఎకరాల భూమికి చెందిన రికార్డుల్లో రెవెన్యూ అధికారులనూ తికమక పెట్టే వ్యవహారాలు నడిచాయనే విమర్శలున్నాయి. ఫలానా పేరు మీద ఈ భూమి ఉందని...అయినప్పటికీ ఇది ప్రభుత్వ భూమి కావున రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ స్వయంగా గతంలో కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. తీరా నిషేధిత జాబితా నుంచి తొలగించే సమయానికి ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. వాస్తవానికి 14–1 సర్వే నంబరులోని భూమి చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద నమోదై ఉంది. అయితే తాజాగా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఈ భూమి మాజీ సైనిక అధికారికి చెందినదని, చెట్టిపల్లి సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఇందుకు భిన్నంగా అసలు వ్యక్తి సాగులోనే లేరంటూ వై.బాలిరెడ్డికి చెందినదంటూ ఆయన పేరు మీద బదలాయించాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పై నుంచి ఆదేశాలు వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేత ప్రధానంగా చక్రం తిప్పినట్టు సమాచారం. చినబాబు అండతో రెచ్చిపోయారనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు చినబాబుకు నేరుగా తమ సామాజిక వర్గానికి చెందిన నేతల ద్వారా హైదరాబాద్లో భారీగా ఎలక్షన్ ఫండ్ సమకూర్చడంతో ఈ నేతకు సదరు చిన్నబాబు వద్ద పలుకుబడి ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహారాలు నడుపుతుండటంతో సదరు దక్షిణ నియోజకవర్గ నేతపై ఆ పార్టీలోని ఇతర నేతలందరూ రుసరుసలాడుతున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఇంకా ఏమైనా ఫైల్స్ ఉంటే తన వద్దకు తీసుకురావాలంటూ సదరు దక్షిణ నియోజకవర్గ నేత కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే త్వరలో మరిన్ని ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారన్నమాట. కమిటీ కష్టం... కలెక్టర్ నివేదికతోనే సరి...! వాస్తవానికి ఎండాడ భూమి వ్యవహారంలో సొంత పార్టీ నేతల నుంచే విచారణ జరపాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఈ భూమి వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టర్కు లేఖ రాశారు. న్యాయవిచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు నివేదిక సమర్పించాలంటూ రెవెన్యూ మంత్రికి స్పీకర్ లేఖ ద్వారా ఆదేశించారు. ఇక మండలిలోని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మాజీ సైనికులకు చెందిన భూముల విషయంలో సీనియర్ అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారాల్లో అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల మధ్య ఏర్పడుతున్న అనైతిక సంబంధాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. జనసేన కార్పొరేటర్ సైతం విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలా అన్ని పార్టీల నేతలు ఎండాడ భూమి విషయంలో అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయాన్ని బలంగానే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం నామమాత్ర స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా కమిటీ వేయాలని రెవెన్యూ మంత్రికి రాసిన లేఖలో స్పీకర్ కోరగా.. కమిటీ వేయాలంటే ముఖ్యమంత్రి అనుమతి కావాలని తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేవలం కలెక్టర్ ఇచ్చిన నివేదికనే స్పీకర్కు.. రెవెన్యూ మంత్రి ఇవ్వనున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్వయంగా సొంత పార్టీకే చెందిన స్పీకర్ కోరినప్పటికీ ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ వ్యవహారంలో చినబాబు పాత్ర ఉండటం వల్లే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న అభిప్రాయం అందరిలోనూ బలపడుతోంది. -
6.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
● ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద లారీ స్వాధీనంయలమంచిలి రూరల్: అక్రమంగా లారీలో తరలిస్తున్న సుమారు 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని యలమంచిలి రెవెన్యూ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనపర్చుకున్నారు. వివరాలివి.. యలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో వెంకట దుర్గా రైసు మిల్లులో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన రేషన్ బియ్యం బస్తాల్లో ప్యాక్ చేసి ఏపీ 16 టీవై 4491 రిజిస్ట్రేషన్ నెంబరు గల లారీలో లోడు చేస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీనిని పట్టుకోవడానికి రెవెన్యూ అధికారులు పులపర్తి వెళ్లేసరికి అక్రమార్కులు లారీని అక్కడ్నుంచి ఏటికొప్పాక జగనన్న కాలనీకి తరలించారు. గ్రామస్థులకు అనుమానం వచ్చి కొందరు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా సమాచారం చేరవేశారు. తహసీల్దార్ వరహాలు ఆదేశాలతో డీటీ వినయ్కుమార్, ముగ్గురు వీఆర్వోలు ఏటికొప్పాకకు చేరుకునేసరికి రేషన్ బియ్యంతో ఉన్న లారీని అక్కడ్నుంచి తరలించుకుపోతుండగా ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద రెవెన్యూ అధికారులు వాహనాన్ని ఆపి స్వాధీనపర్చుకున్నారు. లారీలో 50 కేజీల బియ్యం ఉన్న 130 బస్తాలు ఉన్నట్టు డిప్యూటీ తహసీల్దార్ వినయ్కుమార్ తెలిపారు. నిబంధనల ప్రకారం దీనిపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థి
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి పోటీలకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపికయ్యాడు. కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం మీద వివిధ పోటీలను నిర్వహించారు. కళాశాల స్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో కళాశాలలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పి.విజయ్కుమార్ ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ నెల 6న విశాఖపట్నం డాక్టర్ వి.ఎస్.కృష్ణ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ నెల 11న విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. -
ఓటమి భయంతోనే టీడీపీ హత్యా రాజకీయాలు
● వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు త్రినాథరావు ● పులివెందులలో పార్టీ నేతల దాడిపై సర్వత్రా నిరసన అనకాపల్లి: ఓటమి భయంతో టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు త్రినాథరావు ధ్వజమెత్తారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి ఉప ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగివస్తున్న వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రాముపై హత్యాయత్నానికి పల్పడిన టీడీపీ గూండాలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారిపై దాడిని నిరసిస్తూ గురువారం స్థానిక రింగ్రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు విరక్తి చెందారని ఆమె పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు వస్తున్న జనాన్ని చూసి, కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకొని పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకట్ మాట్లాడుతూ రమేష్ యాదవ్పై దాడులు చేయించిన బీటెక్ రవి తమ్ముడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం.నాయుడు, యలమంచిలి జెడ్పీటీసీ సేనాపతి సంథ్యారాము, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు పల్లెల సాయి కిరణ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు బాధపు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే అరెస్టు చేయాలి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ నాయకులపై దాడికి పాల్పడిన టీడీపీ గుండాలను తక్షణమే అరెస్టు చేయాలని సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోన గురువయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేడ్కర్ను కాదని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కక్ష కట్టారన్నారు. పక్కా స్కెచ్తోనే దాడి దేవరాపల్లి: పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడిని వైఎస్సార్సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ ఖండించారు. తారువలో గురువారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ప్రజలను, వైఎస్సార్సీపీ సానుభూతిపరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు పక్కా స్కెచ్తోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేలా ఈసీ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
● 3 కేజీల గంజాయి, రెండు సెల్ఫోన్లు, బైక్ సీజ్ దేవరాపల్లి: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను దేవరాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరాంపురం వై జంక్షన్ వద్ద గురువారం ఎస్ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. విశాఖ సిటీలోని కంచరపాలేనికి చెందిన సిహెచ్. కార్తీక్, సబ్బవరానికి చెందిన సిహెచ్. ఎర్నిబాబు వేలంమామిడిలో గంజాయి కొనుగోలు చేసి దేవరాపల్లి మీదుగా బైక్పై తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరి నుంచి 3 కేజీల గంజాయిని, రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చోడవరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
2 రోజుల్లో నీడ్ అసెస్మెంట్ సర్వే పూర్తి చేయాలి
● ఎరువుల అవసరాలను గుర్తించండి ● కలెక్టర్ విజయ కృష్ణన్తుమ్మపాల: బంగారు కుటుంబాల అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శులు కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసెస్మెంట్ సర్వే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. పీ 4, ఎరువులు, డాక్యుమెంటేషన్ అప్లోడ్, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ ఎరువుల అవసరాలను ముందుగా గుర్తించాలని, పటిష్ట పర్యవేక్షణ జరపాలన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ఆక్టివ్, ఇన్ ఆక్టివ్ ఖాతాల వివరాలు పరిశీలించాలన్నారు. పీ 4లో మార్గదర్శి, బంగారు కుటుంబాల అనుసంధానం, అవసరాల సర్వే అంశాలను పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎవరినీ బలవంతం చేయవద్దని స్పష్టం చేశారు. పీ–4పై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా హేండ్బుక్ను రూపొందించాలన్నారు. ఇందులో సూచనలు పాటిస్తూ అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీవో జి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. షేడ్ నెట్స్పై రైతులకు అవగాహన కల్పించాలి షేడ్ నెట్స్పై రైతులకు మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్ నెట్స్పై ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి, కేతి టెక్ కంపెనీతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి 10 మంది రైతులను గుర్తించి వారి వివరాలను ఈ నెల 18వ తేదీ లోపు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు సమర్పించాలన్నారు. షేడ్ నెట్స్ వేసుకున్నట్లయితే చీడ, పీడలు రాకుండా ఉంటాయని, నీరు తక్కువగా అవసరం పడుతుందన్నారు. పంట దిగుబడి 3 రేట్లు అధికంగా వస్తుందన్నారు. ఒక్కసారి షేడ్ నెట్ వేసుకుంటే పదేళ్ల వరకు ఉపయోగపడుతుందన్నారు. షేడ్ నెట్ 13 సెంట్లలో 21 మీటర్లు వెడల్పు, 25 మీటర్లు పొడవు, 4 మీటర్లు ఎత్తు ఉంటుందన్నారు. టమాటా, మిరప, క్యాప్సికమ్, పుచ్చకాయలు, కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలను ఇందులో పెంచవచ్చన్నారు. యూనిట్ ధర రూ.3,22,800 కాగా, రైతు రూ.1,61,400 తన వాటాధనంగా ఖర్చు చేయాలన్నారు. హార్టికల్చర్ శాఖ నుంచి రూ.1,61,400లు సబ్సిడీ రూపంలో అందిస్తామన్నారు. మహిళా రైతులకు బ్యాంకు రుణాన్ని అందిస్తామన్నారు. గ్రామ సంఘ సహాయకురాలకు ఈ నెల 11న మండల స్థాయిలో పీ4 యాప్పై శిక్షణ ఇచ్చి యాప్ నమోదు చెయ్యాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.ఎ.రహీమ్, జిల్లా బిందు సేద్యం పథక సంచాలకురాలు జి.వి.లక్ష్మి, ఏపీఎంలు, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు. -
క్రీడలతో స్నేహ సంబంధాలు
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ని సన్మానిస్తున్న జిల్లా న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా విశాఖ లీగల్ : క్రీడలు మనుషుల మధ్య పోటీతత్వాన్ని పెంచి మంచి ఫలితాలు అందిస్తాయని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా సాంస్కృతిక వేడుకలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర కార్యశీలురని, వారికి ఆటవిడుపుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా అవసరమన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య మంచి వాతావరణాన్ని కలిగించడానికి ఈ వేడుకలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సిరిపురపు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈత పోటీల్లో జాతీయ స్విమ్మర్ న్యాయవాదుల సంఘం క్రీడా సాంస్కృతిక సంఘం కార్యదర్శి బాలాజీ, సంఘం సీనియర్ సభ్యుడు ఆడారి అప్పారావు, భారీ సంఖ్యలో న్యాయవాదులు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
మార్కెట్లకు శ్రావణ శోభ
● కొనుగోలుదారులతో దుకాణాల కిటకిట ● చుక్కలు చూపిస్తున్న పూజా సామగ్రి ధరలు ● కిలో చామంతులు రూ.800 నక్కపల్లి: సకల సంపదలకు ప్రతీక లక్ష్మీదేవి ఆరాధనకు ఊరూవాడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో పూజాసామగ్రి కొనుగోలుదారులతో నక్కపల్లి, అడ్డురోడ్డు, పాయకరావుపేట – తుని పట్టణాల్లో దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడాయి. పూలు, బంగారం, కిరాణా, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో గతంలో మాదిరిగా వరలక్ష్మి పూజకు అసవరమైన లక్ష్మీరూపులు కొనేందుకు మహిళలు ఆసక్తి చూపడం లేదు. గతంలో లక్ష్మీరూపులు రూ.1500 నుంచి రూ.3వేల వరకు లభించేవి. ఈ ఏడాది తక్కువ బరువులో లక్ష్మీరూపులు విక్రయించడం లేదు. గ్రాము బరువుగల లక్ష్మీరూపు రూ.9,800లకు విక్రయిస్తున్నారు. అన్ని బంగారం షాపుల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో లక్ష్మీరూపు కొనుగోలు చేసి అమ్మవారి పూజ చేసుకోవడం మా వల్ల కాదంటూ సామాన్య, మధ్య తరగతి మహిళలు చేతులేత్తెస్తున్నారు. కొద్దోగొప్పో స్థోమత ఉన్నవారు గ్రాము విలువల లక్ష్మీరూపులను కొనుగోలు చేస్తున్నారు. సామాన్యులైతే ఈ ఏడాది అమ్మవారికి పసుపు కుంకుమ, గాజులు, కొత్త చీర పిండివంటలతోనే కానిచ్చేసే పరిస్థితి నెలకొంది. పండ్లు, పూల ధరలకు రెక్కలు.. పండ్లు, పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. డజన్లలో అరటి పండ్లు రూ.80, చిన్నపాటి యాపిల్ రూ.250, దానిమ్మ రూ.360, జామకాయలు రూ.80 చొప్పున విక్రయించారు. పూల ధరలు చుక్కలను చూపించాయి. చామంతులు ఇంతులకందని పరిస్థితి నెలకొంది. కిలో చామంతి పూలు రూ.800, గులాబీలు కిలో రూ.400 చొప్పున విక్రయించారు. అంత ఖరీదు పెట్టి కొనలేక విడిగా కొనుక్కుందామంటే చామంతి పువ్వు ఒక్కొక్కటి ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. గులాబీలు రూ.10, కనకాంబరాలు మూర రూ.80, మల్లెలు రూ.100లకు విక్రయించారు. చామంతి, బంతి పూలను విడిగానే కొనుక్కోవాల్సి వచ్చింది. బత్తాయి, దానిమ్మ, జామ, యాపిల్ల ధరలు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని భారీగా పెంచేశారు. ఇంటిల్లిపాది సంగతి అలా ఉంచితే కనీసం అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలు చేసి నైవేద్యం పెట్టడానికయినా కిరాణా సరకులు కొందామంటే ధరలు చూసి సామాన్యులు గిలగిల కొట్టుకునే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసులు, బెల్లం, పంచదార, తదితర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. -
వృద్ధురాలి ఆత్మహత్య
కోటవురట్ల: అనారోగ్య కారణాలతో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి.. మండలంలోని రాజుపేట శివారు పి.రామన్నపాలేనికి చెందిన పల్లా సింహాచలం(66) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. కొంత కాలంగా ఆరోగ్యం బాగుండకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన ఇంటి బాత్రూంలో ఇనుప రాడ్కు నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెద్ద కుమారుడు వెంకునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు..
ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో అధికారులు మాకు గుర్తింపు ఇవ్వడం లేదు. జోగుంపేట ఎంపీటీసీగా, గొలుగుండ మండల వైస్ ఎంపీపీగా ఉన్న నాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కార్యక్రమాలకు ఏదో నామమాత్రంగా సమాచారం ఇస్తున్నారు. మొత్తం టీడీపీ నాయకులే ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. జీతాలైతే ఎన్నికల్లో కోడ్ కారణంగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ ఇవ్వనేలేదు. – జక్కు నాగమణి, వైస్ ఎంపీపీ, గొలుగొండ మండలం ● -
సుగర్ ఫ్యాక్టరీపై చంద్రబాబు,లోకేష్ హామీ గాలికి..
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫాక్టరీ ఆధునికీకరణపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు ఎన్నికల సమయంలో కె.కోటపాడు మండలం గొండుపాలెం సభలో అధికారంలోకి వస్తే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరించి ఆదుకుంటామని హామీ ఇచ్చి ఏడాది దాటిపోతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద యువగళం బహిరంగ సభలో నారా లోకేష్ సైతం ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీపై 24 వేల మంది సభ్య రైతులు, వెయ్యి మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఫ్యాక్టరీని మూత వేయాలని చూస్తే అధికార కూటమికి రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఒకప్పుడు సీజన్కు 5 లక్షల టన్నులకు పైగా క్రషింగ్ జరగగా, గత సీజన్లో లక్షా 9వేల టన్నులు మాత్రమే క్రషింగ్ జరిగిందన్నారు. 2024–2025 సీజన్లో చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజులకే రూ. 3వేలు చొప్పున పేమెంట్లు చేసేవారని, ప్రస్తుతం రైతులు, కార్మికులకు రూ. 30 కోట్లు మేర బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ మనుగడ కోసం కూటమి పార్టీల నాయకులు ఎందుకు నోరు మెదపకపోవడం లేదని ప్రశ్నించారు. -
రాజ్యాంగం ప్రజలందరినీ ఐక్యం చేస్తుంది
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోడ రఘురామ్ మద్దిలపాలెం: రాజ్యాంగం దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ(భోపాల్) మాజీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ తెలిపారు. ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో గురువారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఎండోమెంట్ లెక్చర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం, సామాజిక క్రమం రాజ్యాంగ దృక్పథం అనే అంశంపై ఉపన్యసించారు. ప్రజలు తమను తాము పాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవే చట్టాలని తెలిపారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన అందించేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ శతాబ్ది సంవత్సరంలో ఉన్న ఏయూ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించేలా క్యాలెండర్ను విడుదల చేసిందన్నారు. ఇందులో మొదటిదైన ఈ కార్యక్రమం ఏర్పాటు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం న్యాయ కళాశాల ప్రత్యేకతలను, ఎండోమెంట్ లెక్చర్ వివరాలు వివరించారు. ముందుగా న్యాయ కళాశాల వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం అక్కడ పలు పండ్ల మొక్కలను నాటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని పురస్కరించుకొని న్యాయ కళాశాలలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పని దొరికింది.. హ్యాపీ అన్నాడు..
ప్రమీలా పని దొరికింది. ఇంత కాలం ఖాళీగానే ఉన్నా. ఇక మనకు పర్వాలేదు. పిల్లలకు హ్యాపీ అంటూ వెళ్లిన తన భర్త, పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మరణించడంతో.. గుర్తు చేసుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న చింతకాయల ముత్యాలు భార్య ప్రమీల కేజీహెచ్ మార్చురీ వద్ద ఉన్నవారిని కంటతడి పెట్టించింది. అర్ధంతరంగా వదిలి వెళ్లిపోయావు నాయనా.. పిల్లల్ని ఎవరు చూస్తారంటూ ప్రమీల తల్లి(ముత్యాలు అత్త) వేదన అంతా ఇంతా కాదు. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్తుండగా ముత్యాలు మృతదేహాన్ని చూసి ప్రమీల సొమ్మసిల్లిపోయింది. వీరు ఇద్దరు పిల్లలతో బుక్కావీధిలో ఉంటున్నారు. -
దక్కని గౌరవం.. అందని వేతనం.!
● ఎంపీటీసీ సభ్యులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు ● 16 నెలలుగా విడుదల కాని గౌరవ వేతనం నిధులు ● అత్యధిక శాతం వైఎస్సార్సీపీ సభ్యులు కావడంతో నిర్లక్ష్యం ● ప్రొటోకాల్కు మంగళం పాడేసిన అధికారులు ● గ్రామాల్లో కూటమి నేతలకే పెత్తనం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 651 మంది ఎంపీటీసీలు సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వారంతా. పరిపాలనాపరమైన అంశాలలో వారి ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనాల్సిన వారిని కూటమి ప్రభుత్వం కరివేపాకులా తీసి పడేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజాస్వామ్యానికే అర్థం మారిపోయింది. ఎంపీటీసీలను పక్కన పెట్టి.. ఏ సంబంధం లేని కూటమి నాయకులు అధికారిక కార్యక్రమాలను అంతా తామై నడిపిస్తున్నారు. అధికారులు సైతం వారికి వత్తాసు పలికి ప్రొటోకాల్కు పూర్తిగా మంగళం పాడేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాస్త టీడీపీ, జనసేన పార్టీ కార్యక్రమాల్లాగా నిర్వహిస్తున్నారు. పోనీ ఎంపీటీసీ సభ్యుడిగా గుర్తింపు దక్కలేదు.. కనీసం వారికి వచ్చే గౌరవ వేతనం కూడా 16 నెలలుగా ఇవ్వడం లేదు. దీనికి కారణం గత స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు వైఎస్సార్సీపీకి దక్కడమే. అందుకే కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి అవమానిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గౌరవ వేతనానికీ దిక్కులేదు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీటీసీ సభ్యులకు గౌరవం ఇవ్వక పోగా.. వారికి ఇచ్చే గౌరవ వేతనం కూడా అందని పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనంగా అందివ్వాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం జూన్ 12న పగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలలకు మాత్రమే ఎంపీటీసీ సభ్యులకు గౌరవం వేతనం చెల్లించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2023 డిసెంబర్ వరకూ రెండు విడతలుగా గౌరవ వేతనాన్ని చెల్లించారు. మూడో విడత నిధులు విడుదల చేసేందుకు 2024లో బిల్లు పెట్టి చర్యలు తీసుకునే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వేతనాల చెల్లింపునకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి నేటి వరకు ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాల బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి విశాఖలో ఇదీ పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాలో 651 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో 405 ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన వారే. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరికి చోటు కల్పించకుండా కూటమి నాయకులతో పని కానిచ్చేస్తున్నారు. -
11 నుంచి సీజీఆర్ఎఫ్ క్యాంపు కోర్టులు
● సీజీఆర్ఎఫ్ చైర్మన్ సత్యనారాయణ సాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల 11న పలాస డివిజన్ కాశీబుగ్గ సెక్షన్, 13న నర్సీపట్నం డివిజన్ కోటవురట్ల సెక్షన్, 21న అమలాపురం డివిజన్ మలికిపురం సెక్షన్, 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్, 29న రంపచోడవరం డివిజన్లోని రాజవొమ్మంగి సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరుమార్పిడి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులను నేరుగా సీజీఆర్ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. అదేవిధంగా విశాఖపట్నం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న సీజీఆర్ఎఫ్ కార్యాలయానికి కూడా నేరుగా గానీ, లిఖిత పూర్వకంగాగానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సదస్సుల్లో చైర్పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు. -
చేనేత కళాకారులకు చేయూత
● కలెక్టర్ విజయ్ కృష్ణన్చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్ విజయ్ కృష్ణన్ అచ్యుతాపురం రూరల్: చేనేత కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం మండలంలోని దుప్పితూరు శ్రీ భద్రావతీ చేనేత సహకార సంఘం సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం మండల కాంప్లెక్స్లో ఉన్న సొసైటీని సందర్శించి అక్కడ తయారవుతున్న యోగా కార్పెట్స్, నవ్వారు తయారీ విషయమై చేనేతలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను కలెక్టర్కు వివరించగా.. అతి త్వరలో వారికి అవసరమైన ముడి సరకులు అందించి, క్లస్టర్ తరహాలో షెడ్ల నిర్మాణానికి భూమి కేటాయించి నిర్మాణాలు చేపడతామని, అక్కడే వృత్తి పనులు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వర్రావు మాట్లాడుతూ 1947లో స్థాపించిన నాటి నుండి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సంఘాన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్లిన మేనేజర్ మాడెం అప్పారావును అభినందించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ పాల్గొన్నారు. -
ఉలిక్కిపడిన విశాఖ
వెల్డింగ్ దుకాణంలో పేలిన సిలిండర్● భూకంపం వచ్చినట్లు అదిరిన వన్టౌన్ ● రెండు కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం ● ముగ్గురు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు ● 9 అడుగుల ఎత్తయిన గోడ దాటి పడిన మృతుల శరీర భాగాలు ● షాపు వెనుక 150 అడుగుల దూరంలో ఉన్న ఇళ్లపై పేలుడు ప్రభావం ● ఓ ఇంట్లో సీలింగ్ పడి చిన్నారికి గాయంవిశాఖ సిటీ : విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ విస్ఫోటనంతో పాత నగరం భూకంపం వచ్చినట్లు అదిరింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఫిషింగ్ హార్బర్ రోడ్డులో ఒక వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరి వ్యక్తుల శరీర భాగాలు 9 అడుగుల ఎత్తయిన గోడపై నుంచి ఎగిరి అవతల పడ్డాయి. పేలుడు కారణంగా సంభవించిన మంటల్లో చిక్కుకున్న నలుగురు తీవ్రంగా కాలిపోయారు. దీంతో వన్టౌన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కిలోమీటర్ల మేర ప్రజలను ఈ పేలుడు శబ్ధం భయాందోళనకు గురిచేసింది. చెల్లాచెదురైన శరీర భాగాలు సున్నపువీధి ప్రాంతానికి చెందిన చల్లా గణేష్(44) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే బుక్కా వీధిలో ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని తెరిచాడు. ఒడిశాకు చెందిన శ్రీను హెల్పర్గా పనిచేస్తున్నాడు. గురువారం హెల్పర్ శ్రీను(30)తో పాటు మరో ఇద్దరు వర్కర్లు ఎర్ర ఎల్లాజీ(45), సన్యాసిరావు(46)లను పనికి పెట్టుకున్నాడు. వీరు ఎప్పటిలాగే వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేస్తుండగా సాయంత్రం 4.30 గంటలకు సిలిండర్ పేలిపోయింది. అక్కడే ఉన్న యజమాని గణేష్, హెల్పర్ శ్రీనుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండా తునాతునకలైంది. పేలుడు ధాటికి మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేస్తున్న వర్కర్లు ఎర్ర ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు పక్కన ఉన్న స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు(27), ఇప్పిలి రంగారావు(53) ఆ మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో క్షతగాత్రుల తరలింపు భారీ ప్రమాదం జరిగినప్పటికీ ఘటనా స్థలానికి 108 అంబులెన్సులు రాకపోవడం గమనార్హం. కేవలం మృతదేహాల తరలింపు కోసం మాత్రమే అంబులెన్సును తీసుకొచ్చారు. నలుగురు క్షతగాత్రులను ఆటోలో తరలించడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో 90 శాతానికి పైగా కాలిన శరీరంతో బాధను తట్టుకోలేక.. ఆర్తనాదాలు పెడుతూ ఆటో ఎక్కడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఇద్దరి పరిస్థితి విషమం ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఎర్ర ఎల్లాజీ(45), సన్యాసిరావు(46), చింతకాయల ముత్యాలు(27), ఇప్పిలి రంగారావు(53)లను చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. వీరిలో చింతకాయల ముత్యాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఎల్లాజీ 95 శాతం, రంగారావు 75 శాతం మేర కాలిపోయారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 18 శాతం కాలిన గాయాలైన సన్యాసిరావును చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కంపించిన ఇళ్లు.. చిన్నారిపై పడిన సీలింగ్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో భూమి అదరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో సుమారు 200 మీటర్ల వరకు ఉన్న ఇళ్లు కంపించాయి. వెల్డింగ్ దుకాణానికి 150 అడుగుల దూరంలో ఉన్న ఒక ఇంట్లో సీలింగ్ కూలింది. ఆ ఇంట్లో గాయత్రీ అనే చిన్నారి(11)పై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో ఆమె తలకు గాయమైంది. మరికొన్ని ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి అధికారులు ఘటనా స్థలాన్ని కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ మమూర్ అశోక్, ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ సందర్శించారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యం గురించి వివరించారు. మృతులు చల్లా గణేష్(44), శ్రీను (30), చింతకాయల ముత్యాలు(27) క్షతగాత్రులు ఎర్ర ఎల్లాజి(45), టి.సన్యాసిరావు(46), ఇప్పిలి రంగారావు(53) ఏ సిలిండర్ పేలింది? ఘటనా స్థలంలో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ సిలిండర్ కూడా ఉంది. వీటిలో ఏ సిలిండర్ ప్రమాదానికి కారణమైందన్న విషయం తేలాల్సి ఉంది. సాధారణంగా డొమెస్టిక్ సిలిండర్ పేలితే అది ముక్కలైపోతుంది. కానీ అక్కడ ఉన్న సిలిండర్ బాగానే ఉంది. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు మూడు ఉండగా.. ఒకదానికి మాత్రం పైన వాల్వ్ పడిపోయి ఉంది. సాధారణ సిలిండర్ కంటే ఆక్సిజన్ సిలిండర్ పేలుడు కారణంగానే భారీగా విస్ఫోటనం సంభవిస్తుంది. చదరపు ఇంచ్కు 2 వేల పౌండ్ల ఒత్తిడితో సంభవించే ఈ పేలుడుకు భారీ నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ పేలితే మాత్రం 5 మీటర్ల పరిధిలో ఉన్న వారికి మృత్యు ప్రమాదం ఉంటుందని, గరిష్టంగా 32 మీటర్ల దూరంలో ఉన్న వారికి గాయాలయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రకారం ఈ ఘటనలో ఆక్సిజన్ సిలిండర్ పేలిందా? లేదా గ్యాస్ సిలిండర్ ప్రమాదానికి కారణమైందన్నది విచారణ చేయాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
సామాజిక కార్యకర్తపై హత్యయత్నం
సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : సామాజిక కార్యకర్త ఎస్.వి.ఎ.ఎస్.ఎస్.నూకరాజుపై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఈ మేరకు బాధితుడు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్ల దేముళ్లు, సంపెంగి నానాజీతోపాటు మరో యువకుడు గురువారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలోని నూకరాజు ఇంటికి వెళ్లి పథకం ప్రకారం హత్య చేయడానికి ప్రయత్నించారు. కుర్చీలు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ‘మా మీదే ఫిర్యాదు చేస్తావా.. మాతోనే పెట్టుకుంటావా.. నిన్ను బతకనిస్తామా’ అంటూ ఇష్టానుసారంగా దాడి చేశారు. ఎంత బతిమాలినా వినకుండా తీవ్రంగా కొట్టడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే ఆ ముగ్గురు నూకరాజుకు చెందిన రెండు సెల్ఫోన్లు, డెస్క్టాప్, సీసీ కెమెరా యూనిట్ పట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై వెంటనే ఎస్ఐ విభీషణరావుకు ఫిర్యాదు చేయగా ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. సీఐ రామకృష్ణారావు బాధితుడిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.గోవుల అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినందుకు..నూకరాజు మాట్లాడుతూ మండలంలోని పలు సమస్యల పరిష్కారం కోసం పలువురు వ్యక్తులు తన వద్దకు వస్తుంటారని, వాటి పరిష్కారంలో చొరవ చూపినందుకు తనపై పలువురు కక్ష కట్టినట్టు తెలిపారు. ఇటీవల గోవుల అక్రమ రవాణాకు సంబంధించి గుట్టు రట్టు చేయడంతో గొర్ల దేముళ్లు అనే రౌడీషీటర్ తనపై కక్ష కట్టినట్టు చెప్పారు. గొర్ల దేముళ్లు గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ఆవులను సంరక్షిస్తున్నట్టు చెప్పి, తన వద్ద ఉన్న గోదాములో ఉంచి ఆపై విక్రయాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇదే విషయమై తాను గతంలో లోకాయుక్త, జిల్లా కలెక్టర్, ఎస్పీ, తహసీల్దారులతోపాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.అంతేకాకుండా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, అదనపు డీజీపీ, ఇంటిలిజెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఇటీవల ‘సాక్షి’లో ‘రక్షకులు కాదు గో భక్షకులు’ శీర్షికతో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీంతోపాటు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ అనకాపల్లి ఎస్పీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. దీంతో గొర్ల దేముళ్లు తనను హతమార్చేందుకు పథకం రచించినట్టు సామాజిక కార్యకర్త నూకరాజు తెలిపారు. మున్ముందు కూడా తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. హత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.టీడీపీ నాయకుల అండతో గూండాగిరిటీడీపీ నాయకుల అనుయాయుల దందాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనితకు సన్నిహితుడిగా పేరున్న గొర్ల దేముళ్లు తన అనుచరులతో సామాజిక కార్యకర్త నూకరాజుపై హత్యాయత్నం చేయడం సంచలనం కలిగించింది. టీడీపీ నాయకుల భూఆక్రమణలు, అక్రమాలను ఆయన అడ్డుకుంటున్నారు. పాలకులు, అధికారులు, న్యాయమూర్తులకు ఫిర్యాదు చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. బాధితలకు అండగా నిలుస్తున్నాడు. అదే అక్రమార్కులకు కంటగింపుగా మారింది. గురువారం మధ్యాహ్నం జరిగిన దాడి ప్లాన్ ప్రకారం అడ్డు తొలగించాలన్న లక్ష్యంతోనే జరిగిందని అందరూ భావిస్తున్నారు. -
ఏయూలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు ప్రారంభం
మద్దిలపాలెం : బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం కోర్సుకి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోర్సును అందిస్తున్న తొలి ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తుందని చెప్పారు. అదేవిధంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ను జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. దీనికి సంబంధించి ఏయూలో ప్రత్యేక ల్యాబ్, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి దరఖాస్తు చేశామని చెప్పారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కోర్సుకి అవసరమైన వ్యవస్థను నిర్మించే దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కోర్సులో చేరిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలోకి వచ్చే సమయానికి క్వాంటమ్ రంగంలోని సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో ఆచార్యులను నిపుణులుగా తీర్చిదిద్దడానికి త్వరలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు తెలిపారు. విభిన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశ్రమల నిపుణులు ప్రత్యక్షంగా పాల్గొని ఆచార్యులకు శిక్షణ అందిస్తారని తెలిపారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
● వైఎస్సార్ సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా అనురాధ సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆ పార్టీ జోన్–1(ఉత్తరాంధ్ర జిల్లాల) మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన ఈర్లె అనురాధ అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈర్లె అనురాధను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీనైన తనకు వైఎస్సార్ సీపీలో వివిధ పదవులు కల్పించారని చెప్పారు. తనపై నమ్మకంతో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన పదవికి తగిన న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్సార్ సీపీ నుంచి కె.కోటపాడు జెడ్పీటీసీగా గెలిచిన అనురాధ.. పార్టీలో అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలిగా, మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్తగా, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. -
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
● చోడవరం మండలంలో రాత్రికి రాత్రే కొండలు కనుమరుగు ● పట్టించుకోని రెవెన్యూ, మైన్స్ అధికారులు చోడవరం: అక్రమ తవ్వకాలతో మండలంలో కొండలు పిండవుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఎవరికి తోచినంత వారు కొండలను యథేచ్ఛగా తవ్వేసుకుంటున్నారు. ముద్దుర్తి, నర్సాపురం, రాయపురాజుపేట, గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, వెంకన్నపాలెం, ఎం.కొత్తపల్లి, దుడ్డుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నడుస్తున్నాయి. దోచుకున్న వారికి దోచుకున్నంతగా కొండలను కొల్లకొడుతున్నారు. వాస్తవానికి ఎర్రమెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, మైన్స్ శాఖల అనుమతి పొందాల్సి ఉంది. చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. పొక్లెయిన్ల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంథవరం, అడ్డూరు, ముద్దుర్తి, నర్సాపురం, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి తమ భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఇందుకు స్థానిక వీఆర్వోలు సహకారం అందిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు గ్రామాల్లో టాస్క్ఫోర్స్ బృందాలంటూ మొక్కుబడిగా కమిటీలు వేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాక పోగా.. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా మైన్స్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
భవన నిర్మాణ కార్మికుల జిల్లా కమిటీ ఎన్నిక
రాంబిల్లి(అచ్యుతాపురం): భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కె.రామకృష్ణ(నర్సీపట్నం) ఎన్నికయ్యారు. రాంబిల్లిలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల మహాసభల్లో నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అడిగర్ల రాజు, ఉపాధ్యక్షులుగా పి.చిరంజీవి(పరవాడ), డి.శివ(నర్సీపట్నం), సహాయ కార్యదర్శిగా అప్పలనాయుడు(సబ్బవరం), కోశాధికారిగా జి.అప్పారావుతో పాటు 9 మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడతామన్నారు. -
రణరంగం
● బల్క్డ్రగ్ పార్కుపై ప్రజాభిప్రాయ సేక‘రణం’ ● వ్యతిరేకుల నోరు నొక్కేందుకు తీవ్ర యత్నాలు ● అడుగడుగునా పోలీసుల మోహరింపు ● ముందస్తు అరెస్టులపై మండి పడ్డ గంగపుత్రులు ● అడ్డంకులను దాటుకొని సభలో పాల్గొన్న బాధితులు ● చావనైనా చస్తాం గానీ బల్క్డ్రగ్ ఏర్పాటు చేయనివ్వబోమని శపథం బల్క్డ్రగ్ పార్కుపై ప్రజాభిప్రాయ సేకరణ రణరంగాన్ని తలపించింది. చావనైనా చస్తాం, బల్క్డ్రగ్ ఏర్పాటు చేయనివ్వబోమని రైతులు, మత్స్యకారులు స్పష్టం చేశారు. వారి వ్యతిరేకతను ముందే గ్రహించిన ప్రభుత్వం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. నిర్వాసితులు ఎవరూ వేదిక వద్దకు రాకుండా శతవిధాలా ప్రయత్నించారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతోపాటు ఎక్కడికక్కడ అడ్డుకున్నా బల్క్డ్రగ్ పార్కు ప్రభావిత ప్రాంత ప్రజలు పోరాడి తమ హక్కును సాధించుకున్నారు. తమ వ్యతిరేక వాణిని వినిపించారు. బల్క్డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేస్తున్న మత్స్యకారులు, (ఇన్సెట్) బారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు వస్తున్న వైస్ ఎంపీపీ నానాజీనక్కపల్లి: రాత్రికి రాత్రి 500 మంది పోలీసులను దించారు. బుధవారం తెలతెలవారుతుండగానే వైఎస్సార్సీపీ, సీపీఎం, రైతు నాయకులు వీసం రామకృష్ణ, గంటా తిరుపతిరావు, గొర్ల గోవిందరావు, ఎం.అప్పలరాజు, ఎం.రాజేష్, తళ్ల భార్గవ్లను గృహ నిర్బంధం చేశారు. మత్స్యకార గ్రామాల నుంచి నిరసన తెలిపేందుకు ఎవరూ రాకుండా ముందు రోజు రాత్రే పోలీసులు కవాతు నిర్వహించి ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ రాజయ్యపేట, గుడివాడ, గుర్రాజుపేట, పెదతీనార్ల, చినతీనార్ల, జానకయ్యపేట గ్రామాల నుంచి వచ్చిన వారిని వందలాది మంది పోలీసులు జాతీయరహదారిపై బారికేడ్లు పెట్టి వేదిక వద్దకు రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ వారు వేదిక వద్దకు రావడానికి ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమ ఆవేదన, అభ్యంతరాలను తెలుపుకునేందుకు అవకాశమివ్వని అధికారుల అవకాశవాదంపై బాధితులు ఆగ్రహం చెందారు. తాము ఎమ్మెల్యేగా గెలిపించిన హోం మంత్రి అనిత ఫ్లెక్సీని చెప్పుతో కొట్టారు. వాణి వినిపించారు.. చావనైనా చస్తాం కానీ.. రాజయ్యపేట సమీపంలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఒప్పుకోబోమని మండలంలో పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులు, బాధిత గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. రాజయ్యపేట సమీపంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 1270 ఎకరాల్లో రూ.1257 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బల్క్డ్రగ్ పార్క్పై తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు తమ వాణి వినిపించారు. సభకు నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ అధ్యక్షత వహించారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని వేదిక ప్రాంగణానికి చేరుకున్న ఆందోళకారులంతా రెండు బృందాలుగా విడిపోయారు. కొంతమంది వేదిక గేటు ముందు, కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలపై ఆగ్రహంతో శాపనార్ధాలు పెట్టారు. 2014లో చంద్రబాబు ప్రజల భూముల జోలికి వచ్చిన అధికారులను చెట్లకు కట్టికొట్టాలని పిలుపు నిచ్చారని, అదే చంద్రబాబు ఇప్పుడు భూములు లాక్కొని ప్రజల ప్రాణాలు తీసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలిస్తామని చెప్తారు కానీ ఇవ్వరన్నారు. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకించిన పరిశ్రమలను నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులకే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని ఆక్షేపించారు. కంపెనీలకు అనుకూలంగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో ఆందోళనకారులు అరుపులు కేకలతో అడ్డు తగిలారు. తమకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలంటూ వైఎస్సార్సీపీ మండలశాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, నాయకులు గొర్ల బాబూరావు తదితరులు బారికేడ్లు తోసుకుంటూ వేదిక ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెనక్కినెట్టేశారు. దీంతో ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో అధికారులు గత్యంతరం లేక వారికి కూడా మాట్లాడే అవకాశం కల్పించారు. సభలో పాల్గొనేందుకు విశాఖ నుంచి వచ్చిన సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు లోకనాథంను అరెస్టు చేసి అనకాపల్లి తరలించారు. స్థానిక ఉద్యోగం.. పక్కా మోసం స్థానికులకు ఉద్యోగాలు అనే ది పక్కా మోసం. నేను,హెటెరోలో ఉద్యోగం కోసం వెళ్తే స్థానికుడనని ఇవ్వలేదు. శత్రు దేశాలతో యుద్ధం చేసినప్పడు భయపడలేదు. కానీ ఇక్కడ కంపెనీలు పెడుతున్నారంటే భయం వేస్తోంది. –బాలు, మాజీ సైనికోద్యోగి, ఉపమాక ఈ ప్రాంతీయులంటే అంత చులకనా? బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటయితే ఈ ప్రాంతంలో మరణ మృదంగం వినిపిస్తుంది. ప్రజలు సుఖంగా జీవించే పరిస్థితి ఉండదు. కాకినాడ జిల్లాలో వ్యతిరేకించిన కంపెనీని ఇక్కడ ఎలా పెడతారు. ఈ ప్రాంతీయుల ప్రాణాలంటే అంత చులకనా? – వరలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జెట్టీ నిర్మించండి మాకు ఈ బల్క్డ్రగ్ వద్దు. మా ప్రాణాలు ముఖ్యం. గత ప్రభుత్వంలో 24 కోట్లతో మంజూరు చేసిన జెట్టీ నిర్మించండి చాలు. ఏదోలా బతుకుతాం. కొత్త కంపెనీలు పెట్టి మా ప్రాణాలు తీయొద్దు. మీకు దణ్ణం పెడతాం. –పిక్కి సత్తియ్య, ఎంపీటీసీ (టీడీపీ), రాజయ్యపేట మేము అనుకూలం బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మేము అనుకూలం. రైతులకు, మత్స్యకారులకు నష్టం లేకుండా చూస్తాం. అభివృద్ధి జరగాలంటే కంపెనీలు రావాల్సిందే. –కొప్పిశెట్టి వెంకటేష్, టీడీపీ ఇన్చార్జ్ అమరావతిలో పెట్టొచ్చు కదా ఇప్పటికే పలు కంపెనీలతో అనేక రోగాలు వచ్చి బాధ పడుతున్నాం. బల్క్డ్రగ్ పార్కు ఇక్కడే ఎందుకు.. అమరావతిలో పెట్టొచ్చు కదా? ఈ కంపెనీ పెడితే రైతులంతా ఉరేసుకుని చావాల్సిందే. ఏమీ మిగలదు. –డీవీఎస్ఎన్ రాజు, రైతు, పెదతీనార్ల భవిష్యత్ అంధకారమే మా కుటుంబానికి చెందిన 79 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. ఏపీఐఐసీ ప్రకటించిన అధ్యయన నివేదిక తప్పుల తడక. అత్యంత ప్రమాదకరమైన 30 కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ అంతా అంధకారమే. –మహాదేవ్ ఉపాధ్యాయుల, గుర్రాజుపేట, ఎస్.రాయవరం మండలం ప్రాణాంతకం మాకు 3 ఎకరాల భూమి ఉంది. మొత్తం తీసేసుకుంటున్నారు. అభిప్రాయం చెప్పడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటు చేస్తే 50 ఏళ్లకు చనిపోయేవారు 20 ఏళ్లకే చనిపోతారు. పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం. –దాట్ల ఉమాదేవి, మహిళా రైతు, గుర్రాజుపేట ప్రజారోగ్యానికి హాని ప్రజలు వ్యతిరేకించే పరిశ్రమను ఏర్పాటు చేయడం తగదు. నిర్వాసితులకు ఇంకా పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదు. ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమలు ఏర్పాటు చేయడం మంచిది కాదు. అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడం దారుణం. –కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే ●రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారు తమ గోడు చెప్పుకునేందుకు వచ్చే వారిని నిర్బంధించడం సరికాదు. వేదిక వద్దకు వెళ్లకుండానే ముందుగా అరెస్టు చేయ డం రాజ్యాంగ హక్కును కాలరాయడమే. ప్రశ్నించే వారిని బెదిరించి అనుకూలంగా మలచుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. –కె.లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడురెడ్బుక్ రాజ్యాంగం మత్స్యకారులకు అండగా నిలబడ్డామన్న అక్కసుతో ముందుగానే గృహ నిర్బంధం చేసి అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. –వీసం రామకృష్ణ, వైఎస్సార్సీపీ నేత అంగీకరించే ప్రసక్తి లేదు రైతులు భూములు ఇవ్వమని చెప్తే టీడీపీకి చెందిన కొంతమంది భూస్వాముల దగ్గర భూములు తీసుకుని మిగిలిన వారిని బెదిరించి లాక్కున్నారు. ఈ పార్క్ ఏర్పాటును అంగీకరించే ప్రసక్తి లేదు. ఎటువంటి కేసులకై నా సిద్ధం. గొర్ల బాబూరావు, రైతు నాయకుడు విష వాయువులు ముంచేస్తాయి మా ఊరికి సమీపంలో ఉన్న కంపెనీ నుంచి వచ్చే విష వాయువుల వల్ల మా సర్పంచ్ కొడుకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. మళ్లీ అటువంటి కంపెనీలు పెడితే సహించేది లేదు. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. –పిక్కి స్వామి, జనసేన నాయకుడు డిప్యూటీ సీఎంకు ఇది తగదు పవన్ కల్యాణ్కు మత్స్యకారుల గోడు పట్టడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. బల్క్డ్రగ్ పార్కు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తామంటే వద్దని తొండంగిలో ధర్నా చేశారని, నక్కపల్లిలో ఎందుకు చేయడం లేదంటూ నిలదీశారు. రాజయ్యపేటలో హోం మంత్రి అనితకు 2 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చామని, అందుకు తగిన బహుమతి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గ్రామంలో ఆమె ఎలా అడుగుపెడతారో చూస్తామని హెచ్చరించారు. రాజయ్యపేటకు చెందిన కొంతమంది కార్యకర్తలు కంపెనీలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయడంతో వారికి నిరసనకారులు దేహశుద్ధి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ప్ర,జాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులు తిరిగి వెళ్లకుండా వాహనాలకు అడ్డంగా బైఠాయించారు. సీఐలు కుమారస్వామి, రామకృష్ణలు నచ్చజెప్పి పంపించేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పులివెందులలో టీడీపీ గుండాల దాడులు దుర్మార్గం
● ఓటమి భయంతోనే టీడీపీ శ్రేణుల రౌడీయిజం ● మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు విమర్శ దేవరాపల్లి: కడప జిల్లా పులివెందుల మండలంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడులు చేయడం దుర్మార్గమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ నల్లగొండువారి పల్లె గ్రామంలో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకుడు వెల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇతర నాయకులపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేక ప్రజలను, వైఎస్సార్సీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పటడం సరికాదన్నారు. -
ఫార్మసిస్టు వైద్యుడి అవతారం
యలమంచిలి రూరల్ : పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న సుబ్బారావు యలమంచిలి పట్టణం శేషుగెడ్డ వద్ద నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫార్మసిస్టు సుబ్బారావు ఇక్కడ ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహించడంతో పాటు రోగులకు వైద్యం అందిస్తున్నట్టు, ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఔషధాలను కూడా ఈ ఆస్పత్రిలో వైద్యం కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించి విస్తుబోయారు. గత నెల 23న సాక్షిలో ‘అర్హత లేని వైద్యులు..గాల్లో ప్రాణాలు’ శీర్షికన జిల్లాలో అనుమతి లేని ఆస్పత్రులు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులుగా పనిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వైద్యుల అవతారం ఎత్తి, అర్హత లేని వైద్యం చేస్తున్న వైనంపై కథనం ప్రచురితమైంది. యలమంచిలి మండలం జంపపాలెంకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్టు చాకలి నూకరాజు పెనుగొల్లు ప్రభుత్వ ఫార్మసిస్టు సుబ్బారావు యలమంచిలిలో ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహిస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు ఇటీవల పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎం.హైమావతి ఇద్దరు అధికారులు, ఇద్దరు సిబ్బందితో విచారణ బృందాన్ని నియమించారు. ఆ బృందం బుధవారం రాత్రి యలమంచిలి వచ్చి ఫార్మసిస్టు సుబ్బారావు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు తనిఖీకి వెళ్లిన సమయంలో ఫార్మసిస్టు సుబ్బారావు ఇద్దరు రోగులకు సైలెన్ ఎక్కిస్తున్నారు. ఆస్పత్రిలో మరొక గదిలో ప్రభుత్వం సరఫరా చేసిన ఔషధాలు పట్టుబడ్డాయి. వాటిలో మాత్రలు, ఇంజెక్షన్లు వంటివి ఉన్నాయి. వాటిని సీజ్ చేసిన అధికారులు ఫార్మసిస్టు సుబ్బారావు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తాను వైద్యం చేస్తున్నట్టు సుబ్బారావు రాతపూర్వకంగా వాంగ్మూలంలో అంగీకరించారు. దీనిపై నివేదికను డీఎంహెచ్వోకు అందజేస్తామని తనిఖీకి వచ్చిన అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు యలమంచిలిలో సంచలనం కలిగించాయి. ప్రభుత్వం సరఫరా చేసిన మందులతో పెనుగొల్లు ఫార్మసిస్టు ప్రైవేటు ప్రాక్టీసు సాక్షి కథనంతో విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఆస్పత్రిలో ప్రభుత్వం సరఫరా చేసిన మందుల గుర్తింపు -
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
● వంతెన రక్షణ గోడను ఢీకొన్న కంటైనర్ ● 30 అడుగుల ఎత్తు నుంచి పడి డ్రైవర్ దుర్మరణం పెందుర్తి : ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి–16(బైపాస్) పెందుర్తి సమీపంలోని సరిపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. వివరాలివి.. జాతీయ రహదారిపై సబ్బవరం వైపు నుంచి ఆనందపురం వైపు వెళుతున్న కంటైనర్ సరిపల్లి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. ఈ క్రమంలో వంతెన రక్షణ గోడ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో కంటైనర్ డోర్ తెరుచుకోవడంతో డ్రైవర్ రాకేష్కుమార్(40) దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి విచారణ చేపట్టారు. రాకేష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతునిది ఉత్తరప్రదేశ్ రోషన్నగర్. అతని బంధువులకు సమాచారం అందించారు. సీఐ కె.వి సతీష్కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరణ
విద్యాశక్తి పథకాన్ని బహిష్కరిస్తున్నట్లు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనకాపల్లి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఈ మేరకు స్థానిక డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్ పార్వతికి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, డిప్యూటీ కార్యదర్శి గొంది చిన్నబాయ్లు మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన పాఠాలు బోధిస్తుండగా అవే పాఠ్యాంశాలను సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆన్లైన్లో ప్రసారం చేయడం వల్ల సమయం వృథా తప్ప ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఆన్లైన్ ప్రసారంలో క్వాలిటీ లేకపోవడం, బోధన అంతా తెలుగు మీడియంలో జరగడం, కొన్ని ప్రాంతాల్లో కరెంట్ పోవడం వంటి సంఘటనలతో ఈ విద్యాశక్తి కార్యక్రమం సక్రమంగా సాగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిరికి దుర్గాప్రసాద్, ఆచంట రవి, వత్ససాయి శ్రీలక్ష్మి, సీహెచ్ నాగేశ్వరావు, డి.ఎస్. మల్లేశ్వరావు, కరుణ జ్యోతి పాల్గొన్నారు. -
కూటమికి స్టాండింగ్ షాక్!
● వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాడి పద్మారెడ్డి విజయం ● మేయర్పై వ్యతిరేకత ● కూటమి పార్టీల్లో లుకలుకలు ● హైకోర్టు కేసు నేపథ్యంలో వేటు భయం ● భారీగా జరిగిన క్రాస్ ఓటింగ్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్ : కూటమి పార్టీల్లో రోజురోజుకీ పెరుగుతున్న లుకలుకలు.. మేయర్ వ్యవహారశైలి పట్ల సొంత పార్టీ కార్పొరేటర్లల్లో వ్యతిరేకత.. పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు... వెరసి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఏకంగా 50 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలో చేరిన కార్పొరేటర్లతో పాటు కూటమిలోని మరికొందరు కార్పొరేటర్లు కూడా క్రాస్ ఓటింగ్కు దిగడంతో కూటమికి షాక్ తగిలింది. గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించిన కూటమికి ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఓ స్థానంలో ఓటమి తప్పలేదు. వాస్తవానికి సాధారణ ఎన్నికల తర్వాత కూటమి పార్టీల్లోకి పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు జంప్ అయ్యారు. ఇక వైఎస్సార్ సీపీకి నికరంగా 32 మంది కార్పొరేటర్లు మిగిలారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్న 10 మంది అభ్యర్థులకు 32 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి కూటమి పాలన పట్ల కార్పొరేటర్లలో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. కనీస గౌరవమేదీ..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీపై కన్నేశారు. గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రిసార్టు రాజకీయాలు నడిపి.. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకం పెన్సిల్ ఇచ్చి మరీ ఓటింగ్ జరిపారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లకు పలు ఆశలు చూపి తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీ మారే వరకూ ఎంతో గౌరవంగా పలకరించి.. స్టాండింగ్ కమిటీతో పాటు మేయర్ ఎన్నికల అనంతరం కనీసం పట్టించుకోవడం మానేశారంటూ పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇక పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఎక్కడ తమపై వేటు పడుతుందోనన్న ఆందోళనతో పార్టీ మారిన కార్పొరేటర్లు కొందరు వైఎస్సార్ సీపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల్లో పెరిగిన అంతరం! స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఈ ఎన్నికల్లో జనసేనకు కనీసం 2 స్థానాలైనా ఇవ్వాలని కోరగా ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. పోటీలో నిలిచిన కార్పొరేటర్ సాధిక్ను చివరిలో తప్పించారు. ఈ నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏకంగా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. సీపీఎం కార్పొరేటర్ కూడా ఓటింగ్కు దూరంగా ఉంది. మరోవైపు టీడీపీ కూటమిలోని జనసేన, బీజేపీలను కలుపుకుని వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. కూటమిలోని లుకలుకలు కూడా ఈ ఫలితాలకు కారణమైనట్టు తెలుస్తోంది. అలాగే గత స్టాండింగ్ కమిటీ పేరుతో జరిపిన వసూళ్లలో జీవీఎంసీలో కీలక నేత పాత్రపైనా ఆరోపణలున్నాయి. స్టాండింగ్ కమిటీ పేరుతో నామినేషన్ పనుల్లో 10 శాతం వాటా అడిగి మరీ వసూలు చేయడంపై కాంట్రాక్టర్లల్లో వ్యతిరేకత ఉంది. వసూలు చేసిన మొత్తం కూడా కీలక నేతకు చేరిన తర్వాత పంపకాలు జరపడం... అదీ నామమాత్రంగా ఉండటం పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. మొత్తంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితం కూటమి పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
హోంగార్డు జనపాల అప్పలనాయుడు భార్య సత్యవతికి చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: నర్సీపట్నం రూరల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు జనపాల అప్పలనాయుడు కుటుంబానికి బుధవారం ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్థిక సాయం అందజేశారు. హోంగార్డుల ఒక రోజు వేతనం నుంచి రూ. 3,78,430 చెక్కును మృతుడు భార్య సత్యవతికి తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధుల నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం అభినందనీయమన్నారు. -
సింహగిరి నుంచి దాసుడు తిరుగు పయనం
సింహాచలం: ఒడిశాకి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ బుధవారం సింహగిరిపై నుంచి తిరుగుపయనమయ్యారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి విశేష సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ ఈ ఏడాది మే నెలలో సింహగిరికి వచ్చారు. సింహగిరిపై ఉన్న దాసుల ఆశ్రమంలో సుమారు మూడు నెలలపాటు ఉండి స్వామికి విశేష సేవలందించారు. నిత్యకల్యాణం, గరుడసేవ, ఊంజల్సేవ, కోలా సేవ, లక్ష తులసి పూజ తదితర సేవలను జరిపించారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం సింహగిరి నుంచి తిరుగు పయనమయ్యారు. ఈవో కార్యాలయం వద్ద దేవస్థానం అధికారులు ఆయన్ని సత్కరించారు. -
గంజాయితో ఇద్దరి అరెస్టు
అనకాపల్లి టౌన్ : అక్రమంగా తరలిస్తున్న 107 కేజీల గంజాయి, 200 రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. ముంచింగ్పుట్టు గ్రామానికి చెందిన బాలు(16) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. కిలగాడ గ్రామంలో నివాసముంటున్న గతంలో గంజాయి రవాణా చేసే ఒక వ్యక్తితో పరిచయం చేసుకొని గంజాయి రవాణా ద్వారా డబ్బు సంపాదించాలని భావించాడు. ఇందుకు తన స్నేహితుడు కిముడు నవదీప్ (16)ను కూడా కలుపుకొన్నాడు. ముగ్గురూ కలిసి ఒడిశాలోని కోడిగండి గ్రామం నుంచి గంజాయితో పాడేరు మీదుగా అనకాపల్లి బయలుదేరారు. మార్గమధ్యంలో అనకాపల్లి మండలంలోని కుంచంగి గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా, గమనించిన కిలగాడకు చెందిన వ్యక్తి ఆటో దిగి పారిపోయాడు. పోలీసులు ఆటోలో ఉన్న గంజాయితో పాటు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. ఎస్ఐ రవికుమార్, సిబ్బందిని ఆమె అభినందించారు. -
మైరెన్ పోలీస్ స్టేషన్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలి
● కలెక్టర్ విజయ కృష్ణన్ తీర ప్రాంత రక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: తీర ప్రాంత రక్షణకు, మైరెన్ పోలీస్ స్టేషన్ల పటిష్టతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి తీర ప్రాంత రక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైరెన్ పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు ప్రహరీలు, మరుగుదొడ్లు, బెంచీలు నిర్మించడంతో పాటు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. బోట్లకు మరమ్మతులు చేయించడంతో పాటు, సీసీ కెమెరా ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే రోజుల్లో గజ ఈతగాళ్లను తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైరెన్ పోలీస్ స్టేషన్ల అధికారులు, మత్స్య,పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నాలుగు పీఏసీఎస్లకు ఉత్తమ అవార్డులు
నాతవరం/తుమ్మపాల/రావికమతం/కోటవురట్ల : ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం ఆరు, అనకాపల్లి జిల్లాలో నాలుగు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) రాష్ట్ర స్థాయిలో సేవలకు అవార్డు పొందాయి. రాష్ట్ర సహకార సంఘం స్థాపించి 62వ సంవత్సరం పురస్కరించుకుని ఉత్తమ సహకార సంఘాల పురస్కార కార్యక్రమం ఈ నెల 4న విజయవాడలో జరిగింది.. వ్యవసాయ రైతులకు సకాలంలో రుణాలు అందించడంతో పాటు వ్యాపారాభివృద్ది చేసి లాభాలు సాధించడంతో ఈ అవార్డులు పొందాయి. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి నాతవరం పీఏసీఎస్, తుమ్మపాల మండలం చింతనిప్పుల అగ్రహారం పీఏసీఎస్, 2023–2024వ సంవత్సరానికి రావికమతం మండలం కొత్తకోట సహకార సంఘం, కోటవురట్ల సహకారం సంఘం ఉత్తమ సేవా అవార్డులు పొందాయి. విజయవాడ ఎన్టీఆర్ సహకార భవనంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఆప్కాబ్ చైర్మన్ వీరనారాయణ చేతుల మీదుగా నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి అపిరెడ్డి మాణిక్యం, సీఈవో ఆదినారాయణ, చింతనిప్పుల అగ్రహారం పీఏసీఎస్ సీఈవో మధుసూధనరావు, కొత్తకోట సహకార సంఘం సీఈవో గుర్రాల రఘు, కోటవురట్ల పీఏసీఎస్ సంఘం పర్సన్ ఇన్చార్జ్ వేచలపు జనార్ధన్ రూ.20వేలు నగదుతో పాటు షీల్డు అందుకున్నారు. -
యువకుడిపై దాడి
గొలుగొండ: చీడిగుమ్మల గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన రామమూర్తినాయుడు, శ్రీను టెంట్ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో శ్రీనుకు మద్దతుగా అదే గ్రామానికి చెందిన గోవింద్, మరో యువకుడు రామమూర్తినాయుడిపై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలు పాలైన ఆయనను స్థానికులు వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన ముగ్గురిపై మంగళవారం రామమూర్తినాయుడు గొలుగొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
● వృద్ధుడిని నాటు తుపాకీతో కాల్చిచంపిన మేనకోడలి భర్త కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు (60)ను తన మేనకోడలి భర్త, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు అనే యువకుడు నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన మంగళవారం సాయంత్రం కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అప్పారావు చెల్లెలు అయిన చెల్లయ్యమ్మ కుమార్తె లక్ష్మిని పాతవలస గ్రామానికి చెందిన నిందితుడు అప్పారావుకి ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఏడాదిన్నర కిందట కుటుంబ కలహాలతో నిందితుడి భార్య లక్ష్మి పాతవలస గ్రామంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమెను నిందితుడే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడన్న ఆరోపణ ఉంది. అప్పటి నుంచి మృతుడు తన చెల్లెలు (లక్ష్మి తల్లి) కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. నిందితుడి కుమార్తె ఇటీవల రజస్వల అయింది. లక్ష్మికి చెందిన నగలు, డబ్బు ఇవ్వాలని మృతుడు అప్పారావును నిందితుడు అప్పారావు గత కొన్నిరోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ విషయమై రెండు రోజుల కిందట కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ పడ్డారు. నగలు, డబ్బులు ఇవ్వకపోతే తుపాకీతో కాల్చిచంపేస్తానని హెచ్చరించాడు. మంగళవారం సాయంత్రం మృతుడు పశువుల కళ్లంలో ఉండగా.. అక్కడకు వెళ్లి మరోసారి బంగారం, డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. గ్రామ పెద్దల సమక్షంలో ఇస్తానని చెప్పడంతో నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనవెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో అప్పారావును కాల్చేశాడు. చనిపోయినట్టు నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతుడికి భార్య అచ్చియ్యమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
చదువుల తల్లికి సత్కారం
● ఐఏఎస్కు ఎంపికై న డాక్టర్ మానస ● మునగపాక అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు రాక ● ఘనంగా సన్మానించిన గ్రామస్తులుమునగపాక: కృషి, పట్టుదల ఉంటే రాణించగలమని నిరూపించారు. వైద్యురాలిగా సేవలందిస్తూనే ఐఏఎస్ కావాలన్న తన లక్ష్యాన్ని సాధించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘనత సాధించిన రావాడ సాయి మానస మంగళవారం మునగపాక వచ్చారు. తన ఇష్ట దైవమైన ఇక్కడి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన రావాడ సాయి మానస విశాఖలో ఉంటున్నారు. ఆమె ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి విశాఖలోని చినవాల్తేరులో వైద్యాధికారిగా సేవలందిస్తున్నారు. ఐఏఎస్ కావాలన్నది ఆమె కోరిక. మూడేళ్లపాటు శ్రమించి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి, ఐఏఎస్కు ఎంపికయ్యారు. మానస శిక్షణ కోసం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. అంతకు ముందు మునగపాకలోని అయ్యప్పస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి మంగళవారం ఆలయానికి వచ్చారు. వేదపండితులు సోమశేఖరశర్మ ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయ కమిటీ పెద్దలు మానసను ఘనంగా సత్కరించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్తోపాటు తల్లిదండ్రులు ప్రకాష్, ఉషారాణిల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సేవలందించాలన్నది తన కోరిక అని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మొల్లేటి సరళ, కమిటీ సభ్యులు మొల్లేటి సత్యనారాయణ, పెంటకోట ఉమేష్, ఆడారి కాశీబాబు, జల్లేపల్లి కిష్టప్ప, వెలగా రామకృష్ణ, కాండ్రేగుల జగ్గారావు, పొన్నా కిరణ్, పూసర్ల వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో యువకుడి అరెస్ట్
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అచ్యుతాపురం రూరల్ : మార్టూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన సెల్ఫోన్ దొంగతనం కేసులో చందక గోపి అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. గోపీ అర్ధరాత్రి సమయంలో గడియ విరగ్గొట్టి ఇంటిలో చొరబడి బెడ్ రూమ్లో పడుకున్న వ్యక్తుల నుంచి ఆరు సెల్ఫోన్లు, రూ.5 వేలు నగదు దొంగిలించారు. ఈ మేరకు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఘన వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టి
మార్టూరు సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ఘన వ్యర్థాల నిర్వహణతో పర్యావరణ పరిరక్షణతో పాటు, పునర్వినియోగం ద్వారా సంపద సృష్టించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మండలంలో మార్టూరు గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంట్లోని చెత్తను తడి, పొడిగా విడదీసి అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఘన వ్యర్థాలను పునర్వినియోగానికి వినియోగించే విధంగా వేరు చేసి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో నాగలక్ష్మి, సీపీవో రామారావు, సర్పంచ్ కరణం రెవెన్యూనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
క్వారీ బాధితుల వినూత్న నిరసన
గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతులతో నిరసన తెలుపుతున్న క్వారీ బాధితులు నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీ బాధితులు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరాహార దీక్ష శిబి రం నుంచి ర్యాలీగా మున్సిపల్ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని క్వారీ అనుమతులు రద్దు చేయాల ని నినాదాలు చేశారు. బీఎస్పీ నాయకుడు బొట్టా నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు బొంతు రమణ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెక్పోస్టులు పెట్టించడం కాదు, ముందు క్వారీ వాహనాలను ఆపితే చెక్పోస్టులు అవసరం లేదన్నారు. బాధిత రైతులకు స్పీకర్ న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు ఈరెల్లి చిరంజీవి, వైఎస్సార్ సీపీ నాయకుడు మట్ల చంటిబాబు, బాధితులు పాల్గొన్నారు. -
ఈత కొలనులో మునిగి యువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్/కశింకోట: కశింకోట: స్థానిక గవరపేటలో ఆశా కార్యకర్త ఇంట విషాదం నెలకొంది. ఆశా కార్యకర్త సవరాల పార్వతి ఏకై క కుమారుడు భాస్కరరావు(25) గాజువాకలోని సెలూన్ షాపులో ఇటీవల చేరాడు. మంగళవారం దుకాణాలకు సెలవు కావడంతో స్నేహితులతో కొండకర్ల వద్ద ఓ రిసార్టుకు వెళ్లాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అచ్యుతాపురం సీఐ నమ్మి గణేష్ తెలిపారు. భాస్కరరావు మృతితో కశింకోటలో విషాదం అలుముకుంది. తనకు అండగా ఉండి జీవితాంతం ఆదుకుంటాడనుకున్న ఏకై క కుమారుడు మృతితో తల్లి పార్వతి కన్నీరు మున్నీరుగా విలపించింది. -
నాడు వ్యతిరేకించి.. స్మార్ట్మీటర్లను ఎలా బిగిస్తారు?
● వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకుల ధర్నా అనకాపల్లి: వైఎస్సార్సీపీ పాలనలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలుగొట్టాలన్న మంత్రి నారా లోకేష్ ఇప్పుడు వాటిని ఇళ్లకు బిగించడం ముమ్మాటికీ మోసం చేయడమేనని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు గంటా శ్రీరామ్, వై.ఎన్.భద్రం, ఎం.రాములు విమర్శించారు. స్థానిక గవరపాలెంలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వామ పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో దోపిడీకి ఆస్కారం కలిగించే విధంగా అదానీ విద్యుత్ స్మార్ట్మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీ సంస్థకు స్మార్ట్మీటర్ల టెండర్లను కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుందన్నారు. విద్యుత్ భారాలను తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజలపై రూ.15,485 కోట్ల సర్దుబాటు చార్జీలను పెంచడం అన్యాయమన్నారు. మీటర్లకు అయ్యే ఖర్చు రూ.10 నుంచి రూ.17 వేల వరకు దశలవారీగా వినియోగదారులపై మోపడం మరింత దారుణమన్నారు. అధిక విద్యుత్ వినియోగించే సమయాల్లో అధిక రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్నారన్నారు. ప్రీపెయిడ్ మీటర్ల వల్ల అందరిపై అధిక భారం పడుతుందన్నారు. అదానీ స్మార్ట్మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసే వరకూ పోరాటాలు చేస్తామని, పాత రీడింగ్ పద్ధతినే కొనసాగించాలన్నారు. వామ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు పెంటకోట శ్రీనివాసరావు, బొప్పే ఉమామహేశ్వరరావు, కాళ్ల తేలయ్యబాబు, జి. సుభాషిణి, కోరుబిల్లి శంకరరావు, కొణతాల హరనాథ్బాబు, భీశెట్టి అప్పారావు, కాపుశెట్టి అప్పారావు, టి.సురేష్ పాల్గొన్నారు. -
కల్యాణపులోవ రిజర్వాయర్ నీరు విడుదల
రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రాజు, తదితరులు రావికమతం: మంటలంలో చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవ రిజర్వాయర్ నుంచి సాగునీటిని చోడవరం ఎమ్మెల్యే రాజు మంగళవారం విడుదల చేశారు. రోజూ 50 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు ద్వారా విడుదల చేస్తామని, ప్రస్తుతం ఈ నీటిని నారుమడులకు మాత్రమే రైతులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పెద్దేరు కాలువలో పూడిక తీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బాల సూర్యం, ఏఈ సూర్య, ఆయకట్టు చైర్మన్ బంటు రామునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కోమటి శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వినతి
ఆర్డీవో కార్యాలయంలో ఏవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు అనకాపల్లి: ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని ప్రెస్క్లబ్ల పరిధిలోని జర్నలిస్టులు డిమాండ్స్ డే నిర్వహించారు. అందులో భాగంగా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఏవో శ్రీనివాసరావుకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు, అనకాపల్లి ప్రెస్క్లబ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంగళవారం తమ సమస్యలు పరిష్కరించమని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్క్లబ్ కార్యదర్శి భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చాగంటి సర్వారావు (అవ్వ) తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చాలని, జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ల విషయంలో న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియనన్కు ప్రాతినిథ్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా ఇవ్వాలని, ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని తక్షణమే అమలు చేయాలని, విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని కోరారు. -
అంధకారం.. తాండవం.!
● తాండవ ప్రాజెక్టుపై కానరాని విద్యుత్ వెలుగులు ● కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేయని లైట్లు నాతవరం: జిల్లాలో ఏకై క మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ దీపాలు పాడైనా మరమ్మతులు చేపట్టే నాథుడు కరువయ్యారు. ఈ నెల 10న ఖరీఫ్ పంట సాగు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించారు. నీటి విడుదలకు స్పీకరు అయ్యన్నపాత్రుడు రానుండడంతో తాత్కాలికంగా ప్రాజెక్టుపై రెండు లైట్లు ఇటీవల ఏర్పాటు చేశారు. తాండవ ప్రాజెక్టు ఒక వైపు రైతులకు సాగునీరు సరఫరా చేస్తుంది.. మరో వైపు నిత్యం సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. తాండవ రిజర్వాయరు నీరు ఆధారంగా ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో 52 వేల ఎకరాలు సాగవుతున్నాయి. రెండు కొండల నడుమ సుందరంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు అందాలు తిలకించేందుకు రెండు జిల్లాలు నలుమూలలు నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో తాండవ ప్రాజెక్టు పరిసరాలు మరింత సందడిగా కనిపిస్తాయి. అంత ప్రాధాన్యం ఉన్న తాండవ ప్రాజెక్టుపై విద్యుత్ వెలుగులు కానరాక అంధకారం అలముకుంటోంది. తాండవ ప్రాజెక్టుపై గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు పాడైపోయాయి. వాటికి మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. గతంలో తాండవ ప్రాజెక్టుపై స్పీల్వే గేట్ల వద్ద మొత్తం 40 నుంచి 50 లైట్లు వరకు ఉండేవి. ఈ దీపాల వెలుగుల్లో రాత్రి వేళ తాండవ రిజర్వాయరు ప్రాంగణమంతా చూడముచ్చటగా కన్పించేది. ప్రస్తుతం లైట్లు పూర్తిగా పాడైపోవడంతో సాయంత్రం అయ్యేసరికి చిమ్మ చీకటిలో తాండవ ప్రాజెక్టు కనిపిస్తోంది. చుట్టూ కొండలు కావడంతో విద్యుత్ వెలుగులు లేక చీకటి పడేసరికి భయానక వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సందర్శకులు పొద్దుపోక ముందే తిరుగు ముఖం పడుతున్నారు. రాత్రి వేళ సెల్ఫోన్ల వెలుగులో నీటి మట్టం పరిశీలన తుఫాన్లు, వర్షాల సమయంలో తాండవ ప్రాజెక్టులో ప్రమాదస్థాయి నీటి మట్టం పెరిగినప్పుడు నీటి నిల్వలు రాత్రి వేళల్లో చూసేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. సెల్ఫోన్ లైట్ల వెలుతురులో నీటి మట్టం పరిశీలించే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల నుంచి స్పిల్వే గేట్ల మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుంది. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయి నీటి మట్టాన్ని నివారించాలంటే స్పీల్వే గేట్లు ఎత్తి నీటిని నదిలోకి విడుదల చేయాలి. స్పీల్వే గేట్ల వద్ద విద్యుత్ లైట్లు పూర్తిగా వెలగడం లేదు. ఇక్కడ పరిస్థితి రాత్రి సమయంలో చాలా దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తాండవ ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాధ్యాన్యత ఇచ్చింది తప్ప శిథిలమైన లైట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రాజెక్టు పరిసరాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు చేశాం.. తాండవ ప్రాజెక్టుపై విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు నిధులకు ప్రతిపాదనలు చేశాం. అంధకారాన్ని నివారించేందుకు ఇటీవల రెండు లైట్లు వేశాం. మిగతా లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. సిబ్బంది కొరత కారణంగా తాండవ ప్రాజెక్టుపై పర్యవేక్షణ లేదు. నీటి మట్టం పరిశీలించే వద్ద స్పిల్వే గేటు వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తాం. ఇటీవల విడుదలైన నిధులతో తాండవ కాలువలో పూడిక తీత పనులు చేస్తున్నాం. – అనురాధ, డీఈ, తాండవ ప్రాజెక్టు -
మునగపాక పీఎస్ను సందర్శించిన ఎస్పీ సిన్హా
మునగపాక: మునగపాక పోలీసు స్టేషన్ను మంగళవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో కొంతసేపు తమకు కేటాయించిన విధుల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్ నేరాలను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు ప్రజలకు, యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూడిమడక రోడ్డులో అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు అతి వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి మెయిన్రోడ్డుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇసుక డ్రమ్లు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించామన్నారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల జోలికి పోకుండా ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎస్ఐ పి.ప్రసాదరావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
108 వాహనంలో ప్రసవం
108 వాహనంలో జన్మించిన బిడ్డతో సిబ్బంది దేవరాపల్లి: వాలాబు పంచాయతీ రామన్నపాలేనికి చెందిన గర్భిణి గిమ్మెల లక్ష్మి 108 వాహనంలో ప్రసవించింది. ఆమెకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో దేవరాపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లగా అక్కడ తనిఖీ చేసిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవల కోసం కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి పంపించారు. 108లో తీసుకువెళుతుండగా ఎ.కోడూరు సమీపంలోకి రాగానే ఒక్కసారి నొప్పులు అధికమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన 108 సిబ్బంది వైద్య సేవలందించగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు.