breaking news
Anakapalle District Latest News
-
అపోలో వైద్యుడు సతీష్రాజుకు జాతీయ స్థాయి పురస్కారం
మహారాణిపేట: విశాఖ అపోలో ఆసుపత్రి చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ సతీష్ రాజు ఇందుకూరిని ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం వరించింది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నిర్వహించిన 9వ టైమ్స్ నౌ డాక్టర్స్ డే కాన్క్లేవ్లో ఆయనకు ‘భారతదేశంలోని 20 మంది స్ఫూర్తిదాయకమైన ఆర్థోపెడిక్ సర్జన్లలో ఒకరు’ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేశారు. ఇండియన్ నేవీ డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్ లెఫ్టినెంట్ జనరల్ సీజీ మురళీధరన్ చేతుల మీదుగా డాక్టర్ సతీష్ రాజు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. సతీష్రాజు ప్రస్తుతం విశాఖ అపోలో హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ సర్జరీ బృందానికి నాయకత్వం వహిస్తూ, రోబోటిక్, రివిజన్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. -
క్యాట్వాక్తో కెవ్వుకేక
ఏయూక్యాంపస్: జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జేడీ వార్షిక డిజైన్ అవార్డులు–2026’ వేదికపై వినూత్న వస్త్రాలంకరణతో మోడల్స్ ర్యాంప్పై హొయలుపోయారు. బీచ్రోడ్డులోని ఒక హోటల్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్షోను రేస్ ఎంటర్టైన్మెంట్స్ సమన్వయంతో నర్విహించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. ఇలా పంచభూతాల ప్రేరణతో ‘వసుధైవ కుటుంబం’ అనే థీమ్తో విద్యార్థులు ఈ డిజైనర్ దుస్తులను మలిచారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కలర్ఫుల్ దుస్తులను ధరించి ముంబై, బెంగళూరు, పశ్చిమ బెంగాల్కు చెందిన మోడల్స్ ర్యాంప్పై నడుస్తుంటే వేదిక ధగధగలాడింది. సంస్థ చైర్మన్ రూపల్ దలాల్, డైరెక్టర్లు హర్ష్ దలాల్, కట్టమూరి ప్రదీప్, కట్టమూరి దివ్యలు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో ప్రతిభ కనబరిచిన యువ డిజైనర్లకు అవార్డులను అందజేశారు. -
అధికారులు చోద్యం చూస్తున్నారు
పోలవరం కాలువ మట్టి తరలించుకుపోతుంటే మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజూ వందలాది లారీల్లో పట్టుకుపోతున్నారు. టీడీపీ వాళ్లనయితే చూసీ చూడనట్లువదిలేస్తున్నారు.అదే పేదలు ఇళ్లల్లో పునాదుల కోసం మట్టి తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తున్నారు. మట్టిని లూటీ చేయడం వల్ల దిగువ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. – వియ్యపు శ్రీను, రైతు, ముందుకురాజుపేటగ్రామాలు మునిగిపోయే ప్రమాదం కూటమి నేతల అండదండలతో పోలవరం కాలువ మట్టిని తరలించుకుపోతూ అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తున్నారు. గట్టు బలహీన పడి పరిసర గ్రామాలు, పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ మట్టిదందా అధికారులకు తెలిసే జరుగుతోంది. పునాదుల కోసం పేదలు తట్టమట్టి పట్టుకెళ్తే కేసులు రాస్తున్న అధికారులు, పట్టపగలే లారీల్లో తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారు.అక్రమార్కులకు కూటమినేత అండదండలు ఉన్నాయి. – చొప్పా శ్రీను, రైతు, ముకుందరాజుపేట -
97.75 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు
అనకాపల్లి ఎన్టీఆర్ కాలనీలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న వైద్య సిబ్బంది అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఐదేళ్లలోపు వయసున్న 1,63,803 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు చిన్నారులు 1,67,576 మందికి ఉండగా 97.75శాతం మందికి చుక్కలు వేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ విజయ కృష్ణన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈనెల 29,30న వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్వో ఎం.హైమావతి తెలిపారు. స్థానిక చిన్నరాజుపేట అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆమె పోలియో చుక్కలను వేశారు. అంతకుముందు అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో చిన్నారులకు తుమ్మపాల సీహెచ్సీ వైద్యసిబ్బంది పోలియోచుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాబోయ్.. బండరాళ్ల లారీలు
● లైనుకొత్తూరు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన లారీ ● త్రుటిలో తప్పిన ప్రమాదం యలమంచిలి రూరల్: బండరాళ్ల లారీలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఈ లారీలు కూటమి పా ర్టీల ప్రజాప్రతినిధులవి కావడంతో స్థానిక పోలీసు,రవాణాశాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.ఆదివారం ఓవర్ లోడ్తో వెళ్తున్న ఓ బండరాళ్ల లారీ లైనుకొత్తూరు సమీపంలో బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఇతర వాహనాలు,జనం ఎవరూ లేకపోవడంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. నక్కపల్లి నుంచి రాంబిల్లి ఎన్ఏవోబీకి బండరాళ్లను తీసుకెళ్తున్న లారీ యలమంచిలి మండలం లైనుకొత్తూరు సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.లారీ వెనుక ఉన్న బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి.ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు.ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా బంగరాళ్లను లోడు చేసి రవాణా చేయడం,కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేల టన్నుల బరువు ఉన్న బండరాళ్లు జారి పడినప్పుడు గానీ,వాటిని రవాణా చేస్తున్న లారీలు ప్రమాదాలకు గురైనప్పుడు గానీ భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
షాడో
మాయాజాలం!అన్ని పనులకూ ఒకటే నిబంధన.. రూ.5 కోట్ల టర్నోవర్ మస్ట్ రూ.కోటి పనులకు ‘సింగిల్ వర్క్’ నిబంధనలు ఒక్కరికే పనులు కట్టబెట్టేలా టెండర్ నిబంధనల మార్పు కాంట్రాక్టులకు బహుమతిగా.. కమిషనర్ బంగ్లాలో రూ.50 లక్షలతో మినీ థియేటర్ మెట్రోపాలిటన్ ఖజానాకు ‘టెండర్’ పెడుతున్న షాడో చైర్మన్ వీఎంఆర్డీఏ టెండర్లలో అక్రమాలకు వత్తాసు పలుకుతున్న అధికారులు అంతా ‘అసిరితల్లి’ దయ అంటున్న షాడో చైర్మన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాధారణంగా ఎవరైనా అడ్డగోలు పనులను హడావిడిగా, గుట్టుచప్పుడు కాకుండా చేస్తారు. కానీ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) లోని ‘షాడో చైర్మన్’ మాత్రం చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఒక ‘మినీ థియేటర్’ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు, యుద్ధ విమానాన్ని క్లీన్ చేస్తున్నట్లు.. ఎంతో జాగ్రత్తగా, పద్ధతిగా అవినీతికి తెరలేపారు. మెట్రోపాలిటన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్కరికే అన్ని పనులు దక్కేలా ఆయన పక్కా స్కెచ్ వేశారు. వీఎంఆర్డీఏలో ఈ షాడో చైర్మన్ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తమకు కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. టెండర్లలో అసలు పోటీనే లేకుండా చేసి, తమకు కావలసిన కాంట్రాక్టర్కే పనులన్నీ అప్పగిస్తున్నారు. తాజాగా పిలిచిన టెండర్లన్నింటికీ ఒకటే తరహా నిబంధనలు పెట్టడం వీఎంఆర్డీఏ వర్గాల్లోనే తీవ్ర విస్మయం కలిగిస్తోంది. హౌస్కీపింగ్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులకు సంబంధించి సదరు సంస్థకు ఏకంగా రూ. 5 కోట్ల టర్నోవర్ ఉండాలంటూ కొత్త కొర్రీ పెట్టారు. అంతేకాకుండా కచ్చితంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల విలువైన ‘సింగిల్ వర్క్’ చేసిన అనుభవం ఉండాలని టెండర్ డాక్యుమెంట్లలో నిబంధనను చేర్చారు. దీనికి తోడు విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ అయిన సంస్థకు మాత్రమే అవకాశం ఉందంటూ.. ఎన్నడూ లేని విధంగా నిబంధన పెట్టడం షాడో చైర్మన్ అడ్డగోలుతనానికి నిదర్శనం. సాధారణంగా రూ. కోటి లోపు విలువైన హౌస్ కీపింగ్, మెయింటెనెన్స్ పనులకు ఇలాంటి ‘సింగిల్ వర్క్’ కండిషన్ ఎక్కడా ఉండదు. కానీ, మొత్తం పనులన్నీ ఒక్కరికే అప్పగించాలన్న దురుద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. అంతా ‘అసిరితల్లి’ దయ! టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లెవరూ పోటీ పడకుండా చేసేందుకు పన్నిన అసలైన పన్నాగం ‘లోకల్ రిజిస్ట్రేషన్’. విశాఖపట్నంలో మాత్రమే రిజిస్టర్ అయిన సంస్థలకే టెండర్లలో అవకాశం ఉంటుందని కఠిన నిబంధన విధించారు. రూ. 5 కోట్ల టర్నోవర్, సింగిల్ వర్క్ అనుభవం, విశాఖలోనే రిజిస్ట్రేషన్ ఉండాలనే ఈ అర్హతలు కేవలం ఒకట్రెండు సంస్థలకు మాత్రమే ఉన్నాయని ముందే నిర్ధారించుకుని మరీ ఈ వ్యవహారం నడిపారు. ముఖ్యంగా.. ‘మాతా అసిరితల్లి’ అనే సంస్థకే కాంట్రాక్టులన్నీ కట్టబెట్టేందుకు ఈ తంతు నడిపించినట్లు తెలుస్తోంది. అన్నీ తానై నడిపిస్తున్న షాడో చైర్మన్ ఎంతో ‘వినయ’ంగా సదరు సంస్థకే ఎండాడ, చీమలాపల్లి వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ల నిర్వహణ బాధ్యతల పనులను కూడా ఎలాంటి పోటీ లేకుండా అప్పగించేయడం గమనార్హం. -
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర నియోజకవర్గంలోని 49వ వార్డు బర్మా కాలనీ పరిధిలోని నెహ్రూనగర్ కప్పరాడలో గల రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని స్థానిక నిరుపేద బర్మా కాందిశీకులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబరు 13/ఏ/14లో ఉన్న ఈ 3 ఎకరాల భూమిని కాపాడాలంటూ ఆదివారం లాసన్స్బే కాలనీలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజులను బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు.వైఎస్సార్సీపీ మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు ఆధ్వర్యంలో నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్య వేదిక కమిటీ ప్రతినిధులు నరసింహులు, అప్పారావు, దీపక్, శీను, బాబు, దేవా, రాజేష్, నారాయణరావు, శివకుమార్, రమేష్లతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న ఇటువంటి అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా వైఎస్సార్సీపీ తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ భూకబ్జా వ్యవహారాన్ని రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు. పలుమార్లు కలెక్టర్కు విన్నవించుకున్నా చర్యల్లేవు అనంతరం మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు, ఐక్య వేదిక ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం బర్మా కాందిశీకులకు నివాసాల నిమిత్తం ఈ సర్వే నెంబరులో స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. నివాసాల నిర్మాణం పోను మిగిలిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం కొందరు అక్రమార్కులు గూండాలతో కలిసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అక్కడ అనధికారికంగా ప్రైవేట్ షెడ్లు నిర్మించడమే కాకుండా, వాటికి యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.పేదలకు ఇళ్లు ఇస్తున్నామనే నెపంతో అడ్డగోలుగా ఇప్పటివరకు 40కు పైగా అక్రమ షెడ్లను నిర్మించి, ఒక్కో షెడ్డును రూ.4 లక్షల చొప్పున అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ ధర గజం రూ.80 వేల వరకు పలుకుతోందని, ఈ లెక్కన వంద కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజంగా ఇళ్లు లేని కాందిశీకులు చాలా మంది ఉన్నారని, ప్రభుత్వం వారిని గుర్తించి అర్హులైన వారికి మాత్రమే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ భూమిని కాపాడాలని జీవీఎంసీ కౌన్సిల్లో కూడా పలుమార్లు మాట్లాడినట్లు అల్లు శంకర్ రావు గుర్తుచేశారు. ఈ భూకబ్జాపై కలెక్టర్కు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి, రెవెన్యూ అధికారులకు పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కబ్జాను ప్రశ్నిస్తే.. తమకు స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని, పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తామంటూ అక్రమార్కులు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. -
లాలంకోడూరు కళాశాల విద్యార్థినికి షైనింగ్స్టార్ అవార్డు
యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం లాలంకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన శానాపతి రామశిల్ప షైనింగ్స్టార్ అవార్డుకు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాయుడు తెలిపారు.గత మార్చిలో జరిగిన ఇంటర్మీడియెట్ వార్షిక పబ్లిక్ పరీక్షల్లో రామశిల్ప హెచ్ఈసీ గ్రూపులో 723 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది.మండలంలోని పెదకలవలాపల్లి గ్రామానికి చెందిన రామశిల్ప తల్లిదండ్రులు కన్నయ్యనాయుడు,నాగేశ్వరి సాధారణ రైతులు.కుమార్తెకు అవార్డు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.రామశిల్పను ప్రినిపాల్ స్వామినాయుడు,అధ్యాపకులు అభినందించారు. -
పోలవరం మట్టి లూటీ!
కూటమి నేతల కనుసన్నల్లో తవ్వకాలు● పట్టపగలే లారీల్లో యథేచ్ఛగా తరలింపు ● అధికారుల అండతోనే దందా ● బలహీనపడుతున్న కాలువ గట్లు ● ఆందోళనలో ప్రజలు నక్కపల్లి: మట్టిమాఫియా బరితెగించింది. నియోజకవర్గంలో పోలవరం కాలువను గుల్ల చేస్తోంది. అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా తవ్వేసి తరలించుకుపోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు 6,7 ప్యాకేజీల కింద చేపట్టారు. పాయకరావుపేట నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని కొత్తలి వరకు ఈ పనులు నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 50 శాతం పైగానే పూర్తయ్యాయి. కాలువ తవ్వకాల్లో వచ్చిన మట్టిని గట్లుగా వేశారు. కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి గట్లుగా పోయడంతో అక్రమార్కుల కళ్లు ఈ మట్టిపై పడ్డాయి. నెలకు రూ.కోటి కొల్లగొట్టి.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రేయింబవళ్లు పొక్లెయిన్లతో తవ్వేసి లారీల్లో తరలించుకుపోతున్నారు. ఇలా రోజుకు 50 నుంచి 70 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నట్టు సమాచారం. టిప్పర్ మట్టి ధర రూ.4 వేలపైనే పలుకుతోంది. రోజుకు రూ.2 లక్షలు, నెలకు సుమారు రూ.కోటి వరకు వెనకేసుకుంటున్నారని భోగట్టా. నక్కపల్లి మండలం ముకుందరాజుపేట, రమణయ్యపేట, గుల్లిపాడు,సీతం పాలెం, ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నం,పాయకరావుపేట మండలం పి.ఎల్.పురం, సీతారాంపురం తదితర గ్రామాల పరిధిలో ఉన్న కాలువ మట్టిని తరలిస్తున్నారు. సమీపంలో ఉన్న అనధికార లేఅవుట్లకు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పునాదులు, అపార్ట్మెంట్లకు, వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు, అధికార ప్రైవేటు భవనాలకు వినియోగిస్తున్నారు. పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న పలు కంపెనీలకు కూడా ఈ పోలవరం మట్టిని అమ్ముకుని లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ముకుందరాజుపేట, రమణయ్యపేట గ్రామాల పరిధిలో పోలవరం కాలువ మట్టిని సమీపంలో టీడీపీ నాయకులకు చెందిన భూముల్లో వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పోలవరం కాలువ గట్లపై ఉన్న మట్టిని తవ్వడం వల్ల కాలువను ఆనుకుని ఉన్న గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. భారీ వర్షాలు పడిన సమయంలో ఎగువ ప్రాంతాల్లో వర్షంనీరు ఈ కాలువలో భారీగా చేరుతుందని, మట్టి తవ్వడం వల్ల గట్లు బలహీన పడి కాలువకు గండి పడే ప్రమాదముందని ముకుందరాజుపేట, గుల్లిపాడు, రమణయ్యపేట, సీతంపాలెం, రామయ్యపట్నం, డొంకాడ, సీతానగరం, పి.ఎల్.పురం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కళ్లముందే లక్షలాది క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టి తరలిపోతుంటే ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మట్టిని తరలించేవారికి కూటమిపార్టీల్లో ప్రముఖ వ్యక్తులతో సత్సంబంధాలు ఉండడం వల్లే అధికారులు వారిపై చర్యలకు వెనుకాడుతున్నారని తెలిసింది. మట్టితవ్వకాల వల్ల బలహీన పడుతున్న గట్లకు రక్షణ కల్పించాలని, పట్టపగలే నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కె.జె.పురంలో తండ్రికి తలకొరివి పెడుతున్న లక్ష్మి మాడుగుల రూరల్: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని కేజే పురంలో ఆదివారం జరిగింది. కె.జె.పురానికి చెందిన వేగి రామస్వామినాయుడు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య నాగమణి, కుమారైలు లక్ష్మి, సుప్రియ ఉన్నారు. కుమారులు లేకపోవడంతో రామస్వామినాయుడు మృతదేహానికి ఆయన పెద్ద కుమారై లక్ష్మి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించి, తండ్రి రుణం తీర్చుకుంది. -
నయన మనోహరం
పోర్టు వెంకన్న నౌకా విహారం డాబాగార్డెన్స్: పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం సాయంత్రం సాగరతీరంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవ, హోమాలు నిర్వహించిన అనంతరం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను విద్యుద్ధీపాలతో అలంకరించిన నౌకపై సాగర విహారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో శ్రీనివాస్, ప్రధానార్చకులు శ్రీనివాస జగన్నాథాచార్యులు భక్తులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా, సోమవారం ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం దొంగల దోపు ఉత్సవం, ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. -
సీపీఎం నాయకుల గృహనిర్బంధం
నక్కపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన సందర్భంగా రాజయ్యపేటలో సీపీ ఎం, మత్స్యకార నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు మాట్లాడుతూ ఇటీవల లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయని, వ్యర్థరసాయనాలు కలిసి ఉప్పుటేరు నీరు కలుషిత మవుతోందని, ఈ ఘటనలను మంత్రి దృష్టికి తీసుకెళ్తారనే భయంతో నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం అమానుషమన్నారు. ఫిష్ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన రాజయ్యపేట వచ్చిన మంత్రి మెప్పు కోసం పోలీసులు అతిగా వ్యవరించారని ఆరోపించారు. మత్స్యకార నాయకులు ఎం.మహేష్, బైరాగి రాజు, సోమేష్ తదితరులను బయటకు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. పోలీసులు చట్టాలను తమచేతుల్లోకి తీసుకుంటున్నారని, మత్స్యకారుల సమస్యలు మంత్రికి చెప్పుకునే అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. -
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పీవీ
బీచ్రోడ్డు: గడ్డు కాలంలో ఉన్న భారతదేశాన్ని తన అద్భుత సంస్కరణలతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. పీవీ 105వ జయంతి సందర్భంగా ఆదివారం గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన పీవీ, ఆర్థిక సంస్కరణలకు పితామహుడని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.నారాయణ, పార్టీ నాయకులు శ్రీవాత్సవ్, పల్లా దుర్గారావు, దండూరి సుబ్రహ్మణ్యం, జె.సురేష్, రాపాక శ్రీనివాస రావు, కొయ్య చిన్ని యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చాణక్యంతో అభివృద్ధి: దూరదృష్టి, రాజకీయ చాణక్యంతో పీవీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని హిందీ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. పీవీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీ బహుభాషా కోవిదుడని, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను పెంచిన మహానేతగా చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు పాల్గొన్నారు. -
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
నక్కపల్లి: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, బి.సి.జనార్దనరెడ్డి తెలిపారు. మండలంలో దొండవాక, బోయపాడు తీరాల్లో ిఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయపాడు, దొండవాక, రాజయ్యపేట,చందనాడ తీరాల్లో రెండు ఫిష్ ల్యాండింగ్సెంటర్లను నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కో ఫిష్ల్యాండింగ్ సెంటరును రూ.24.77 కోట్లతో నిర్మించనున్నట్టు తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఆధునిక మౌలిక వసతులు, సురక్షిత బోటు ల్యాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.రాష్ట్రానికి మంజూరైన మూడుఫిష్ల్యాండింగ్సెంటర్లలో రెండింటిని పాయకరావుపేట నియోజకవర్గానికి మంజూరు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో రూ.60 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ హస్టల్ను మంజూరు చేశామని, ఉద్దండపురం నుంచి తిరుపతి పాలెం వరకు రూ.7 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించామన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్, ఫిషరీస్ జేడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.మంత్రులు అనిత, జనార్దన్రెడ్డి -
ఆటస్థలంలో మొక్కలు..విద్యార్థినులకు తిప్పలు
నాతవరం : కూటమి నేతలు అతి ఉత్సాహంతో గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థినులకు ఆట స్థలం లేకుండా చేసి వసతి సమస్య తెచ్చిపెట్టారు. మండలంలో తాండవలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారుగా 300 వరకు విద్యార్థినులు చదువుతున్నారు. అసలే విద్యార్థినులకు ఆటస్థలం లేక ఉన్న కొద్దిపాటి స్థలంలోనే దుస్తులతో పాటు ఇతర సామగ్రి ఎండలో ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఈనెల 27వ తేదీన అనంత ఆరణ్య మహోత్సవం సందర్భంగా ఇరుగ్గా ఉన్న ఆశ్రమ పాఠశాల ప్రాంగణం స్థలంలో కూటమి నేతలు తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజాన వీర సూర్య చంద్రతో పాటు టీడీపీ జనసేన నాయకులు, ఎంపీడీవో సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్భాటంగా మొక్కలు నాటారు. గతంలో ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన భవన నిర్మాణాలకు స్థలం చాలకపోవడంతో అప్పటి కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి ఆదేశాల మేరకు తాండవ ప్రాజెక్టుకు చెందిన ఇరిగేషన్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యార్థినులకు ఆటలు అడుకునేందుకు కొంత స్థలం మాత్రమే ఉండేది. ఆ స్థలంలో కూటమి నేతలు పూర్తిగా మొక్కలు నాటేయడంతో విద్యార్థినులు బయటకు రాకుండా గదిలోనే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వృక్షాలుగా పెరిగే మొక్కలు వేయడంతో అవి పెరిగాక భవనాలకు ప్రమాదం ఉంటుందని అంటున్నారు. పండ్ల మొక్కలు వేస్తే బాగుండేదని ఈ ప్రాంతీయులు అభిప్రాయపడుతున్నారు. -
● నీలి సాగరంలో.. నల్లటి విషం!
పచ్చని కొండలు.. నీలిరంగు సాగర జలాలు.. ప్రకృతి రమణీయత మధ్య సాగే పడవ ప్రయాణం ఎవరికై నా ఎంతో హాయినిస్తుంది. కానీ, ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం చూస్తే మాత్రం గుండె ఝల్లుమనక మానదు! ఒకవైపు సాగర పర్యావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఆకాశాన్ని కమ్మేసేలా దట్టమైన నల్లటి పొగను కక్కుతోంది ‘ఝాన్సీరాణి’ బోటు. అలాగే సామర్థ్యానికి మించి పర్యాటకులతో కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణం సాగుతోంది. పర్యావరణం, పర్యాటకుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోర్టు, మైరెన్ అధికారులపై ఉందని విశాఖ వాసులు గుర్తు చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
అనకాపల్లి/ఎస్.రాయవరం: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో మంత్రి అనిత, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈనెల 29,30న హెల్త్ సిబ్బంది ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్వో ఎం.హైమావతి, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి, డా. కె.చంద్ర శేఖర్ దేవ్, వైద్యులు జె.నరసింగ రావు, కృష్ణారావు, ఏ. రామచంద్ర రావు, గణాంకాల అధికారి ఈఈ లక్ష్మీ నారాయణ, ఎస్.రాయవరం వైద్యాధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఆరాచక పాలన
నర్సీపట్నం: చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలోని పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలసుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆ ప్రాంత వైఎస్సార్సీపీ సమన్వయకర్తలపై టీడీపీ గుండాలు దాడి చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రులు పేర్నినాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కాన్వాయ్పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతో పోలీసుల సమక్షంలో టీడీపీ గుండాలు ఆరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకుడు అప్పిరెడ్డి తప్పించుకోవడంతో టీడీపీ గుండాలు విసిరిన బండరాయి కానిస్టేబుల్కు తగలడంతో తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఆ ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిశారని, అవసరం అనుకుంటే న్యాయపోరాటం ద్వారా అండగా నిలుస్తానని జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షులు సమన్వయ కమిటీ వేశారన్నారు. రాజధాని పేరుతో అమరావతిలో కూటమి పాల్పడుతున్న ఆరాచకాలు బయట పడతాయనే దురుద్దేశంతో రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో దాడులు చేశారన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు, లోకేష్ ఆరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మాకవరపాలెం మండల అధ్యక్షుడు చిటికెల వెంకటరమణ, రాజుబాబు పాల్గొన్నారు. -
అనకాపల్లి
● జెట్టీ క్రెడిట్ జగనన్న ప్రభుత్వానిదే ● నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు.. ● నేడు ‘కూటమి’ శంకుస్థాపన ● రూ. 24 కోట్లు విడుదల చేస్తూ జీవో 7ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026నక్కపల్లి: గంగపుత్రులకష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్ లాండింగ్ సెంటర్(జెట్టీ)కి ఎట్టకేలకు మోక్షంకలిగింది.జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఫిష్ల్యాండింగ్ సెంటరు క్రెడిట్ కూటమిప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే చర్యల్లో భాగంగా అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత,రోడ్లు భవనాల శాఖా మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ జెట్టీ మంజూరు జగనన్న వల్లే సాధ్యమైందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. 2023లో రూ. 24.77 కోట్లు మంజూరు పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటలో జెట్టీ నిర్మాణానికి 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.24.77 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలపరిశీలన కూడా పూర్తయింది. ఢిల్లీనుంచి నేషనల్ ఓషనోగ్రఫీకి చెందిన ప్రత్యేక బృందం, శాస్త్రవేత్తల బృందాలు వచ్చి సర్వేచేసి జెట్టీ నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలమని నివేదికలు సమర్పించాయి. దొండవాక, రాజయ్యపేట సరిహద్దుల్లో ఈ జెట్టీనిర్మాణానికి దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు రావడంతో జెట్టీ నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఇదేదో తన ఘనతే అన్నట్లు ఈ ఏడాది జనవరిలో రాజయ్యపేటలో జెట్టీ మంజూరు చేస్తున్నట్లుప్రకటించి, రూ.24 కోట్లు విడుదల చేస్తూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంది. మత్స్యకారుల మెప్పుకోసం ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం అట్టాసంగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అనకాపల్లి వై– జంక్షన్ వద్ద మొక్కలు నాటుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ‘హరిత హారం‘ కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి వై– జంక్షన్ వద్ద సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ శౌర్యమాన్ పటేల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, భవిష్యత్తు తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దేశ సంపద, పరిశ్రమల భద్రతతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం కూడా సామాజిక బాధ్యత అని చెప్పారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సీఐఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు, ఎంటీపీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. జెట్టీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్న అప్పటి కలెక్టర్ రవిపటాన్ శెట్టి (ఫైల్) గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిధుల కేటాయింపు వివరాలురాజయ్యపేట జెట్టీకి మోక్షం -
గుడిలో బడి నిర్వహణ దారుణం
ఎస్.రాయవరం: మేజర్ గ్రామ పంచాయతీ తిమ్మాపురం శివారు కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను గుడిప్రాంగణంలో కూర్చోబెట్టి పాఠాలు బోధించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మండిపడ్డారు. శనివారం ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులు ఆ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకంలో ఈ పాఠశాలకు నిధులు విడుదలయ్యాయని, అవసరమైన సామగ్రి సమకూర్చినా ఉపాధ్యాయులు, కాంట్రాక్టరు ఎందుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏళ్లతరబడి రామాలయం వరండాలో తరగతులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హోం మంత్రి క్యాంపు కార్యాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలో ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రజాప్రతినిధులు ఎందుకుపట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా జిల్లాఉన్నతాధికారులు స్పందించి పాఠశాల భవననిర్మాణాలు పూర్తి చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.ఆదివారం నియోజకవర్గ పర్యటనకు వస్తున్న హోం మంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ నాయకుడు నానాజీ, విద్యార్థులు తల్లిదండ్రులు,ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
పోలియో రహిత సమాజమే ధ్యేయం
నాతవరం: పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, ఇందు కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రసంయుక్త సంచాలకుడు, పల్స్పోలియో జిల్లా అబ్జర్వర్ జె.నర్సింగరావు అన్నారు. ఆయన నాతవరం పీహెచ్సీని శనివారం తనిఖీ చేశారు. పీహెచ్సీలో గల ప్రధాన సమస్యలను వైద్యాఽధికారులు ప్రసన్నకుమార్, నాగభూషణరావులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో పోలియో వ్యాక్సిన్ నిల్వలు, పోలింగ్ బూత్ల ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్ రవాణా, మైక్రో ప్లానింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియోను నివారించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు చేశామన్నారు.సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 5ఏళ్ల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పలు చోరీ కేసుల్లో నిందితురాలి అరెస్టు
అనకాపల్లి: పలు చోరీ కేసుల్లో నిందితురాలిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ జి.ప్రమ్కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సబ్బవరం నుంచి అనకాపల్లి వస్తున్న ఆటోలోంచి గంటా మీనా అనే మహిళ దిగి వెళ్లిపోతుండగా అనుమానం వచ్చి విచారణ చేయగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామం 202 కాలనీకి చెందిన మీనా ఆటోల్లో ప్రయాణిస్తూ పలు చోరీలకు పాల్పడినట్టు చెప్పారు. ఈనెల 11న అనకాపల్లి పట్టణం భీమునిగుమ్మం ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరి సంచిని బ్లేడ్తో కోసి అందులోని రూ.20వేలు నగదు చోరీకి చేసినట్టు తెలిపారు. ఈనెల 17న విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఆటోఎక్కి ఒక మహిళ మెడలో సుమారు రెండున్నర తులాల బంగారు మంగళ సూత్రాలతో కూడిన పుస్తెల తాడును దొంగలించినట్లు చెప్పారు. నిందితురాలి నుంచి రెండు చోరీలకు సంబంధించి రెండున్నర తులాల బంగారం, రూ.14వేలు నగదు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. విలేకరుల సమావేశంలో క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో గాడి తప్పిన పాలన
అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని లాకప్డెత్లు చేస్తున్న తీరు కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. స్ధానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన గాడి తప్పాయని, యుద్ధాల వల్ల నిత్యావసర ధరలు పెరిగినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. అయోధ్య రామ మందిరం హుండీ కానుకల చోరీ కేసు సిట్కు కాకుండా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఆగస్ట్ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వాహించాలని, ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతుల సమస్యలపై నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సహాయ కార్యదర్శి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాకై ్సట్ తవ్వకాలపై రగడ
మహారాణిపేట (విశాఖ): గిరిజన చట్టాలను గౌరవించాలని, గిరిజన ప్రాంతాల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర కోరారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడు తూ, గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పోడియం వద్ద నిరసన సమావేశం ప్రారంభం కాగానే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరా జు ఆరోపించారు. అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగం, భారీ వాహనాల రాకపోకలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, దొండా రాంబాబు తదితరులు పోడియంను చుట్టుముట్టి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన చైర్పర్సన్ జె.సుభద్ర, గిరిజనుల హక్కులను కాలరాసే ఏ చర్యకై నా సహకరించవద్దని అధికారులను ఆదేశించారు. తవ్వకాలపై జీవోలు లేవు: జాయింట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడం లేదని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, సర్వేలు నిర్వహించేందుకు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని ఆమె వెల్లడించారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. అనంతరం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. గిరిజన రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందడం లేదని మాడుగుల ఎంపీపీ దాలపురెడ్డి వెంకట రాజారావు ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని సభ్యులు తెలిపారు. దీనిపై స్పందించిన గనుల శాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామ న్నారు. అనుమతులు పొందిన మేరకు మాత్రమే తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య,విద్య, వ్యవసాయ రంగాలను కూట మి సర్కార్ గాలికి వదిలి వేసిందని గొలుగొండ ఎంపీపీ మణి కుమారి ఆరోపించారు. పెదబయలు జెడ్పీటీసీ బొంజుబాబు మాట్లాడుతూ పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతోపాటు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా సమస్యలపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 108 వాహనాల పనితీరు బాగోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా డీఎంహెచ్వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం కాగా, ఆయనను సరెండర్ చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ సుభద్ర కోరారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, విద్య తదితర రంగా లకు ప్రాధాన్యత ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. ●అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గుర్తు చేశారు. అనంతగిరి మండలంలో ఐదు గ్రామాలను నాన్–షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, విశాఖపట్టం జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గతంలో బాకై ్సట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేసినట్టు చెప్పారు. -
యువతకు ఆదర్శం.. ఆయన సాహసం
అచ్యుతాపురం రూరల్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్న పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నీడి కృష్ణమోహన్కు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ 5 పదులు దాటిన వయస్సులో సుమారు 6500 కిలోమీటర్లు బైక్పై ప్రయాణం చేసి శిఖరం అధిరోహించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సాధించిన విజయం ఉపాధ్యాయ వర్గానికే కాకుండా విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయులు కృష్ణమోహన్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిని విజయాలు సాధించి దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు, గణేష్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ ?
మునగపాక: కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దోచుకోవడం,దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే 33 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే విజయకుమార్ చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రాంబిల్లి మండలం పంచదార్లలో విలువైన కొండలను తవ్వేస్తూ అక్రమార్జనకు పాల్పడిన సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలుసని చెప్పారు. పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెట్టీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా గంగాదేవిపేట నుంచి మునగపాక వరకు ఉన్న సాగునీటి కాలువలను కప్పేసి రైతులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా కాలువలను కప్పేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. యలమంచిలి నుంచి అచ్యుతాపురం మీదుగా పరవాడకు రహదారి విస్తరణ చేస్తామంటూ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయడంలో ఎమ్మెల్యే విజయకుమార్ విఫలమయ్యారని విమర్శించారు. కాపు యువకుడు సాయికృష్ణ మృతి వెనుక ఎంతోమంది పోలీసుల పాత్ర ఉందని, వారి వెనుక ఉన్న నేతల ప్రమేయంపై ప్రభుత్వం ఎందుకు నిగ్గు తేల్చడం లేదని ప్రశ్నించారు. కూటమి నేతలు కుల రాజకీయం చేయడం విచారకరమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటతీరు సరిగ్గా లేదని, సినిమాల్లో పవన్కల్యాణ్ యాక్టింగ్ చేసినట్లు రాజకీయంగా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. కూటమి నాయకుల అన్యాయాలు, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,వైస్ ఎంపీపీ మళ్ల కాశీ సురేష్, రాంబిల్లి మాజీ ఎంపీపీ తిరుపతిరావు,పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ,కాండ్రేగుల జగన్,శరగడం జగన్నాథరావు పాల్గొన్నారు. -
బంగారం, వెండి చోరీ
ఎన్సీసీ విభాగంలో లోకజ్ఞ ప్రతిభ అచ్యుతాపురం రూరల్ : ఎన్సీసీ విభాగంలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యా ర్థిని లోకజ్ఞకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమని వ్యవస్థాపకుడు కూండ్రపు మూర్తి శనివారం విద్యార్థిని లోకజ్ఞను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 25న విశాఖపట్నం ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డీడీజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుందన్నారు. ఎన్సీసీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం, చురుకై న భాగస్వామ్యాన్ని ప్రదర్శించిన క్యాడెట్లలో ఆరుగురు బాలికలను డీడీజీ ప్రశంసాపత్రానికి ఎంపిక చేయగా వారిలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యార్థిని లోకజ్ఞ చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్, వివిధ ఎన్సీసీ యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్.రాయవరం: ధర్మవరం అగ్రహారంలో ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తులం బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు ఆపహరణకు గురైనట్టు ఎస్ఐ రమేష్ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన కలిగట్ల నాగ సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి గోకులపాడులో బంధువుల పెళ్లికి వెళ్లారని, ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువా తలుపులు తెరచి బంగారు చెవి దిద్దులు, వెండి వస్తువులు చోరీ చేసినట్టు ఎస్ఐ చెప్పారు. అందిన ఫిర్యాదు మేరకు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ ఆధ్వర్యంలో కేసునమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
‘పది’ంతల ప్రతిభకు పురస్కారాలు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదివి ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 మంది విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. జెడ్పీ సమావేశం మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన సేనాపతి పునీత్ కుమార్(592), ఇమంది దేవిక (592), వంగపండు శివసాయి అతిథి(591), అనకాపల్లి జిల్లాకు చెందిన ఆడారి ప్రణతి(593), తనకాల ఉషా(592), కనిగిరి హరిణి(591), అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పరుంబుడి దేవి(593), పెరుశెట్టి ఊర్మిళ(515), కె.కీర్తన(505) పురస్కారాలు అందుకున్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ జేసీ విద్యాధరి, అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీ తిరుమణి శ్రీపూజ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యానారాయణమూర్తి, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్, డిప్యూటీ సీఈవో రాజ్కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
‘విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’
మాట్లాడుతున్న ప్రేమ చంద్రశేఖర్ అనకాపల్లి: విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు కరువు భత్యం బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి సంస్థలో విలీనం చేయాలని, తెలంగాణ తరహాలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.48వేలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాడేందుకు కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు చెప్పారు. దీనిలో భాగంగానే ఎస్ఈ, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నామని, వచ్చేనెల 15న ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన, ఆగస్టులో చలో విద్యుత్ సౌధా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులందరూ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేపాడ సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు వి.రమేష్, జిల్లా నాయకులు గోపి, శేషు, రాజేష్, ఎస్.ఎం.జానీ, రాజేశ్వరరావు, అశోక్ కుమార్, ఎల్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష మొక్కలు లక్ష్యం
కశింకోట: జిల్లాలో అనంత అరణ్య కార్యక్రమంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తాళ్లపాలెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అనంత అరణ్య కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 70 వేల మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో 1,650 మొక్కలు నాటినట్టు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విరివిగా మొక్కలు నాటారు. డ్వామా పీడీ నిర్మలదేవి, అడిషనల్ పీడీ మణికుమార్, ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖరరావు, ఏపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కూటమి ‘మట్టి’ దందా..!
సబ్బవరం: సబ్బవరం మండలంలో సాగునీటి చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపించే గనులుగా మారిపోయాయి. వ్యవసాయం ముసుగులో చెరువుల నుంచి మట్టిని తోడేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది డంపర్లతో మట్టిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. కళ్లెదుటే సహజ వనరులు లూటీ అవుతున్నా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. వ్యవసాయ అనుమతుల ముసుగులో.. మండలంలోని సాగునీటి చెరువులు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ అవసరాల కోసం భూములను మెరక చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే అనుమతులను కొందరు అధికార కూటమి నేతలు, వారి అనుచరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. స్థానిక ఆదిరెడ్డిపాలెం పరిధిలోని పోతురాజు చెరువు, పెదనాయుడుపాలెంలోని నాయనప్ప చెరువు, బాటజంగాలపాలెంలోని చిక్కాలవాని చెరువులతో పాటు గొల్లలపాలెం చెరువుల్లో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు ఒక చోట.. తరలింపు మరో చోట వ్యవసాయ భూములను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం రైతులకు పరిమిత స్థాయిలో మాత్రమే మట్టి తరలింపు అనుమతులు జారీ చేస్తోంది. అయితే సబ్బవరం మండలంలో ఆ అనుమతుల ఉద్దేశాన్నే పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అనుమతి పొందిన రైతు భూమికి కాకుండా, పూర్తిగా భిన్నమైన ప్రాంతాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, లేఅవుట్లకు, కమర్షియల్ ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. అనుమతుల్లో పేర్కొన్న పరిమాణానికి మించి, కేవలం కొద్ది ట్రిప్పుల పత్రాలతో వందలాది ట్రిప్పుల మట్టిని దోచేస్తున్నారు. భారీ యంత్రాలతో చెరువులపై దాడి చెరువుల్లో జేసీబీలు, పొక్లెయిన్లు, ఎక్స్కవేటర్ల వంటి భారీ యంత్రాలతో మట్టిని తోడేస్తున్నారు. చెరువుల అడుగు భాగాన్ని లోతుగా తవ్వుతూ సహజ స్వరూపాన్ని మార్చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ డంపర్లు, లారీలు, ట్రాక్టర్లలో మట్టిని నింపి నిరంతరాయంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ఈ యంత్రాలు, వాహనాలు జోరుగా పనిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నియంత్రణ లేని తవ్వకాల వల్ల చెరువుల లోతు, కట్టల భద్రత, నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిని భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు ఈ అక్రమ మట్టి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు చెరువుల్లో ప్రభుత్వం అనుమతించిన పరిమితుల్లోనే మట్టి తవ్వకాలు జరిగేలా పర్యవేక్షణ చేపడుతున్నాం. రైతులు వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఈ మట్టిని వినియోగించాలి. అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్లు, లేఅవుట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలిస్తే వెంటనే అనుమతులు రద్దు చేస్తాం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కార్తీక్, ఏఈ, ఇరిగేషన్ శాఖ, సబ్బవరం మండలం -
గుడ్డిప విద్యార్థికి మద్రాస్ ఐఐటీలో సీటు
రావికమతం: రైతు కుటుంబంలో పుట్టిన మాచపల్లి సంతోష్కుమార్ మద్రాస్ ఓషన్ స్ట్రక్చ ర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్లో సీటు సంపాందించాడు. రావికమతం మండలం గుడ్డిప గ్రామానికి చెందిన సంతోష్కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన గేట్ పరీక్షలో సత్తా చాటి ఆలిండియాలో 6వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా మద్రాస్ ఓషన్ స్ట్రక్చర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్లో సీటు ఖరారు చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, గంగాభవాని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి సంతోష్కుమార్ను గ్రామ పెద్దలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందించారు. -
షైనింగ్ స్టార్ అవార్డుకుకేజీబీవీ విద్యార్థిని ఎంపిక
అచ్యుతాపురం రూరల్ : రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ అవార్డుకు అచ్యుతాపురం కేజీబీవీ విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రిక ఎంపికై నట్టు మండల విధ్యాశాఖ అధికారి దేవరాయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అచ్యుతాపురం మండలానికి చెందిన విద్యార్థిని ఎంపికవడం గర్వకారణమన్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కేవలం ఒక్క విద్యార్ధిని ఎంపికవడం విశేషమన్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 29న మంగళగిరిలో రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రికతో పాటు తల్లిదండ్రులు తప్పనిసరిగా జూన్ 28 మద్యాహ్నం 2 గంటలలోపు మంగళగిరికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు విద్యార్థినికి అభినందనలు తెలిపారు. -
మాలలపై హోంమంత్రి వివక్ష
పాయకరావుపేట: మాలలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతూ అన్యాయం చేస్తోందని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనిత సైతం మాలల పట్ల వివక్ష చూపుతున్నారని మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆరోపించారు.మాలల ఐక్యత చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన పాయకరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రవ్యాప్తంగా మాలల హక్కులు కాపాడుకోవడం కోసం చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను మాలలపై దాడులు , అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి స్పందించడం లేదని, కనీసం పరామర్శించడం లేదని చెప్పారు. మంత్రిగా కొనసాగే అర్హత ఆమెకు లేదన్నారు. హోంమంత్రితో పాటు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా మాలలకు వ్యతిరేకరంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. 18 మంది మాలలపై అత్యాచారాలు, దాడులు జరిగితే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మాలల పట్ల వివక్ష చూపిస్తున్నారని, మంత్రులు, కమిషన్ చైర్మన్లు అదే దారిలో ప్రయాణం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రిపై ప్రజల్లో నమ్మకంపోయిందని, ముఖ్యంగా మాలల్లో వారు నమ్మకం కోల్పోయారని చెప్పారు. రాష్ట్రంలో అడవులు, ప్రభుత్వ భూము లు, చివరకు సముద్రజలాలను కూడా కూటమి నాయకులు కబ్జాచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న 65లక్షలపెన్షన్లలో 25లక్షలు అగ్రవర్ణాల వారికే ఇస్తున్నారని చెప్పారు. మాదిగల్లో చెప్పులు కుట్టేవారికి, డప్పు కళాకారులకు పింఛన్లు ఇస్తున్నారని, మాలలకు మాత్రం పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. గ్రామస్థాయి నుంచే ప్రతి నియోజకవర్గంలో 25 వేల మాలల ఓట్లు తొలగించే కుట్రజరుగుతోందని ఆరోపించారు. మాలలు, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను తొలగించేందుకు యత్నిస్తున్నారు. మాలల్లో 40 శాతం మంది కూటమిపార్టీలకు, పవన్కల్యాణ్కు ఓట్లేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మాలలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలల హక్కుల సాధనకు విజయవాడ నడిబొడ్డున 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, దీని కోసం మాలల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోట్ల గంగాధర్,మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, మాల మహానాడు స్థానిక నాయకులు పెదపాటి మేఘరంజన్, నెలపర్తి అర్జున్, ఇంజరపు సూరిబాబు, గారా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనితకు మంత్రిగా కొనసాగే అర్హతలేదు ప్రతి నియోజకవర్గంలో 25వేల మాలల ఓట్ల తొలగింపునకు కుట్ర 10లక్షల మందితో విజయవాడలో సభ మాల మహానాడు రాష్ట్రఅధ్యక్షుడు వెంకటరావు -
కూటమి నేతలు చెబితే విత్తనాలు
నాతవరం: మీకు నచ్చిన విత్తన రకం కావాలంటే కూటమి నేతలు చెబితే చాలు అధికారులు ఠంచనుగా ఇచ్చేస్తారు. అదే వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రైతులు వెళ్తే సవాలక్ష నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇది నాతవరం మండలంలో వరి విత్తనాల పంపిణీలో చూపిస్తున్న వివక్ష.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో జిల్లాలోనే నాతవరం మండలంలో అధిక విస్తీర్ణంలో వరి పంట రైతులు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మండలంలో 8 వేల నుంచి 10 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఖరీఫ్ సాగుకు 1,507 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు చేశారు. గత నెల 29వ తేదీన మండలానికి వచ్చిన నాలుగు రకాల విత్తనాలు 553 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు తరలించారు. ఈ నెల 12వ తేదీన చినగొలుగొండపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి ఆధ్వర్యంలో స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు రైతులకు విత్తనాలు పంపిణీని ప్రారంభించారు. స్పీకరుతో ఆర్భాటంగా పంపిణీ చేయడంతో రైతులందరికి కావలసిన విత్తనాలు సకాలంలో అందుతాయని ఆశించారు. కూటమి నేతలు చీటీలు రాసి ఇస్తే విత్తనాలు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది కొరత ఉండటంతో క్షేత్రస్థాయిలో కూటమి నేతలు ఇష్టానుసారంగా పెత్తనం చేస్తున్నా రు. కొన్ని గ్రామాల్లో వరి విత్తనాలు కూటమి నేతలు వద్దకు వెళ్లి చీటీలు రాసి తెచ్చుకుంటే కావలసిన రకం విత్తనాలు ఇస్తున్నారు. నేరుగా రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే విత్తనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. రేపుమాపు రావాలంటూ రైతులను తిప్పించుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. తాండవ రిజర్వాయరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామంటూ అధికారులు ప్రకటన చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులకు కావలసిన వరి విత్తనాలు పంపిణీ చేయడంలో వివక్ష చూపకుండా కూటమి నేతలు పెత్తనం లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు. రైతులకు వరి విత్తనాలు పంపిణీలో వివక్ష అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో పంపిణీ వైఎస్సార్సీపీ మద్దతు రైతులకు ఇబ్బందులు -
ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సెలింగ్
తుమ్మపాల: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (రేబాక)లో శుక్రవారం పాలిసెట్–2026 రెండవ రోజు కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. 80 మంది అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఐ.వి.ఎస్. ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి 20,001 నుంచి 42,000 వరకు ర్యాంక్లు సాధించిన విద్యా ర్థుల్లో 51 మంది బాలురు, 29 మంది బాలికలు హాజరయ్యారన్నారు. ఈ నెల 27 న 42,001 నుంచి 65,000 వరకు ర్యాంకు గల అభ్యర్థుల సర్టిఫికెట్లు ధ్రువీకరణ జరుగుతుందని తెలిపారు. -
ఇప్పటి వరకూ పంపిణీ చేసినవి 13,763 క్వింటాళ్లు
మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,70,569 ఎకరాలు ఖరీఫ్కు సిద్ధం చేసిన విత్తనాలు 22,062 క్వింటాళ్లు వీటిలో వరి విత్తనాలు 21,000 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నది 3,485 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ 2,722 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినవి 928 క్వింటాళ్లు గడ్డి విత్తనాలు 1062 క్వింటాళ్లు జిల్లాలో రైతు సేవా కేంద్రాలు 432 సాక్షి, అనకాపల్లి : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సాగుకు సిద్ధం చేస్తూ, వరి నారు వేసుకునేందుకు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నా రు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందస్తుగా రావడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం, భరోసా కరువవ్వడంతో వారిలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. విత్తనాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతులకు పంపిణీ చేసేందుకు 22,062 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటికి 14,691 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వరి విత్తనాలు 13,763 క్వింటాళ్లు రైతులకు అందజేశారు. యూరియా 2,722 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా, 3,485 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్టు అధికా రులు తెలిపారు. రెండేళ్లుగా పంట నష్టాలు.. గత రెండేళ్లగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అన్నదాతలు తీవ్ర పంట నష్టాలను చవి చూశారు. దీనికి తోడు పెట్టుబడి సాయం అందకపోవడంతో జిల్లాలోని మెజారిటీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా ప్రకృతి సహకరించి, ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, ఎరువులు సకాలంలో అందితే ఆశించిన మేర దిగుబడులు సాధించవచ్చని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులకు నకిలీల ముప్పు లేకుండా, ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ఈ ఏడాదైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా రైతాంగం కోరుతోంది. గత చేదు అనుభవాలు..వెంటాడుతున్న భయం గత ఏడాది రైతు సేవా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా పంపిణీ చేసిన వరి విత్తనాలు నాసిరకంగా ఉండడంతో రైతులు నిలువునా మునిగిపోయారు. పంపిణీ చేసిన విత్తనాల్లో మొలక శాతం పరీక్షించకుండానే నేరుగా రైతులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో పొల్లు, కేళీలు (కల్తీలు) ఎక్కువగా ఉండడం వల్ల వరి నారు సరిగ్గా మొలకెత్తలేదు. దీంతో పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై, నష్టాల బాట పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విత్తన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిర్వీర్యమైన అగ్రి ల్యాబ్స్..! ‘విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది.. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు’. రైతులు నకిలీ, నాసిరకం విత్తనాలతో మోసపోకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ’వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్’ను అందుబాటులోకి తెచ్చింది. ల్యాబ్స్లో విత్తనాలను క్షుణ్ణంగా పరీక్షించి, నాసిరకం, పొల్లు లేకుండా నిర్ధారించిన తర్వాతే రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అగ్రి ల్యాబ్స్ను పూర్తిగా నిర్వీర్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్స్ పనితీరు మందగించడం వల్లే మార్కెట్లోకి నాసిరకం విత్తనాలు వస్తున్నాయని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నాణ్యతపై రాజీలేదు... ఈ ఏడాది ఖరీఫ్కు నాణ్యమైన వరి, చెరకు, పత్తి, అపరాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం. జిల్లాలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. నాణ్యతలో ఎక్కడా రాజీపడేది లేదు. రైతు సేవా కేంద్రాల్లో, ప్రైవేట్ దుకాణాల్లో ఎక్కడా నకిలీ విత్తనాల పంపిణీకు ఆస్కారం లేదు. అలా మా దృష్టికి వస్తే వారిపై చర్యలుంటాయి. ఖరీఫ్ సాగుకు ముందు మండల అగ్రికల్చర్ అధికారులు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రి అసిస్టెంట్లతో ఖరీఫ్ పంటలపై, భూసారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైతు వరి నారు వేసే సమయంలో భూసారం, జింకు లోపం వంటివి సమతుల్యంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. – ఆశా దేవి, జిల్లా వ్యవసాయ అధికారి నాసిరకం విత్తనాలతో నష్టంగత ఏడాది ఖరీఫ్ సీజన్లో బుచ్చెయ్యపేట మండలంలో కేపీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి శ్రీను రైతు సేవా కేంద్రంలో ఆర్జేఎల్ 2537 రకం మూడు బస్తాల వరి విత్తనాలను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దమ్ము చేసి వరి నారు వేశారు. విత్తనాలు వేసి 18 రోజులైనా సరిగా మొలకెత్త లేదు. మూడు బస్తాలు విత్తనాలు వేస్తే.. ఒక బస్తాకి తగ్గ వరి విత్తనాల వేస్తే వచ్చే నారు వలే పలుచగా తయారైంది. ఇతర రైతులకు చూపించగా నాసిరకం విత్తనాలుగా గ్రహించారు. రైతు సేవాకేంద్రంలో అగ్రి అసిస్టెంట్ను ప్రశ్నించగా మాకు ఇలానే వచ్చాయి. అవే ఇచ్చామని చెప్పారు. ఆ రైతు ఏమి చేయలేక ప్రైవేట్ దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసి, వేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో నాతవరం మండ లం ఎస్బీ పట్నం గ్రామానికి చెందిన గాడి గణేష్ రైతు సేవా కేంద్రంలో 1,262 రకం నాలుగు బస్తాల వరి విత్తనాలు తీసుకున్నారు. వరి నారు వేయడానికి ఆ మూటలు విప్పగా అందులో కేళీ ధాన్యం ఎక్కువగా ఉన్నాయి. 30 శాతానికి పైగా కేళీ ఉండడంతో ఆ బస్తాల నుంచి పొల్లుగా ఉన్న విత్తనాలను సెపరేట్గా చేసి నారు వేశారు. దీంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే సరిచేస్తామని చెబుతున్నారు. విత్తు... ఆదమరిస్తే విపత్తు! -
కొండలను తవ్వేస్తున్న మాఫియా
చోడవరం: తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టు గా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. యంత్రాల తో కొండలను పిండిచేసి రాత్రికి రాత్రే లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తోంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మండలంలోని ముద్దుర్తి, అంబేరుపురం, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, ఎం.కొత్తపల్లి, నంబారువానిపాలెం, వెంకన్నపాలెం, నర్సాపురం, రాయపురాజుపేట, భోగాపురం గ్రామాల పరిధి కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నడుస్తున్నాయి. అక్రమార్కులు ఈ కొండలను కొల్లగొడుతున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో పొక్లెయిన్, జేసీబీల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నా రు. ముద్దుర్తి కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై ఇప్పటికే పీజీఆర్ఎస్లో అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. రాత్రిళ్లు ఎక్కువగా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. ముద్దుర్తి, గంధవరం, అడ్డూరు, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే కొండల నుంచి గ్రావెల్ మెటల్, మట్టిని తవ్వేసి రియల ఎస్టేట్ భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. కొందరు స్థానిక వీఆర్వోల సహకారంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపణ లు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మైన్స్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనధికారంగా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమా దం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఊబిలో చిక్కుకుని యువకుడి మృతి
● ధారమటం జలపాతం వద్ద ఘటన ● గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు గొలుగొండ: కన్నవారికి పుత్రశోకం మిగిలింది. ఎదిగొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. సరదాగా జలపాతాల వద్ద స్నానం చేద్దామని అనుకున్న యువకుడు కాలుజారి ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకొన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన చుక్కల సాంబశివ(21) ప్రమాదశాత్తూ ధారమఠం జలపాతంవద్ద శుక్రవారం మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు ఈ ప్రాంత ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే..బంధువులైన వాడపల్లి మణికంఠ, పలక భానుప్రసాద్తో కలిసి జి. మాడుగుల గ్రామానికి చెందిన చుక్కల సాంబశివ(21) శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ధారమఠం శివా లయానికి వచ్చాడు. శివాలయం వద్ద నుంచి కొండఅంచున చాలా దూరం వెళ్లి అక్కడ మూడు కొండల నడుము ఉన్న జలపాతం వద్ద సాంబశివ స్నానం చేసే సమయంలో కాలుజారి పక్కనే ఊబి లో కూరుకుపోయాడు. అక్కడే ఉన్న మణికంఠ, భానుప్రసాద్ హుటాహుటిన గుడి వద్దకు వచ్చి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న స్థానికులు గొలుగొండ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో గొలుగొండ ఎస్ఐ పి.రామారావు, కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు ప్రమాదం జరిగిన ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించారు. సాంబశివ పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్టు గుర్తించి తాళ్లు, కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. దారమఠం వద్ద ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారికావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాంబశివ విశాఖ ఏయూలో ఇంజినీరింగ్(ఈఈఈ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. -
అప్పన్నను దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వద్ద ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కప్పస్తంభాన్ని జస్టిస్ నవీన్ చావ్లా ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నా రు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకు లు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో తిరుమలేశ్వరరావు ఆయనకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. -
మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం
నర్సీపట్నం: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి అబిద్సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. అబిద్సెంటర్లో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా విద్య, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకొని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ గపూర్, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావు, దామోదర్నాయుడు, రామారావు, రాజారావు, తారకేశ్వరరావు, రుషికేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు -
పాముకాటుతో కూలీ మృతి
మాడుగుల రూరల్: మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను(40) పాముకాటుతో శుక్రవారం మృతి చెందాడు. కృష్ణాపురంలో నీరుకొండ ప్రసాదరావుకు చెందిన పామాయిల్ తోటలో ఉదయం కూలి పనికి వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా మధ్యాహ్నం అతడి కాలిపై పాము కాటేసింది. వెంటనే మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు భార్య లక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారైలు ఉన్నారు. రోజూ మాదిరిగానే పామాయిల్ తోటకు పనికి వెళ్లిన శ్రీను మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
చేపల మృతిపై నివేదిక బహిర్గతం చేయాలి
నక్కపల్లి: ఇటీవల బోయపాడు సముద్ర తీరంలో లక్షలాది చేపలు మృతి చెందిన ఘటనపై నివేదికను బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మత్స్యకారులతో కలసి నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 20వ తేదీన బోయపాడు, రాజయ్యపేట సముద్రతీరాల్లో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. సెంట్రల్ మైరెన్, ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫిషరీస్శాఖ అధికారులు వచ్చి పరిశీలించారన్నారు. చనిపోయిన చేపలు, సముద్రజలాల శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపించారని చెప్పారు. సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు నివేదికలు బహిర్గతం చేయలేదని తెలిపారు. గతంలో కూడా ఇలాగే వేల సంఖ్యలో చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వస్తే సముద్రంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందని, వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల చేపలు చనిపోయాయని సంబంధిత అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ఇప్పుడు కూడా వాస్తవాలు దాచిపెట్టి రసాయన కంపెనీలను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాకినాడ జిల్లాలో ప్రజ లు వ్యతిరేకించడంతో బల్క్డ్రగ్పార్క్ను ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ఈ పార్క్ కార్యకలాపాలు ప్రారంభమైతే చేపలే కాకుండా మనుషులు కూడా మరణించే ప్రమాదం ఉందని చెప్పారు. మత్స్యకారుల ఉపాధికి, ఉనికి ముప్పు వాటిల్లుతుందన్నారు. మత్స్యకారుల మనుగడకు నష్టం కలిగించే చర్యలకు ప్రభు త్వం పూనుకోవడం సమంజసం కాదన్నారు. తక్షణమే బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు ఎం.మహేష్, సోమేష్, బి.నూకరాజు, కె.దేముడు, వీరబాబు, అప్పలరాజు, కాశీరావు, రమణ,కాశీ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకుల డిమాండ్ -
ఆటోడ్రైవర్ నిజాయితీ
యలమంచిలి రూరల్: బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తన ఆటోలో మర్చిపోయిన ప్రయాణికురాలికి తిరిగి ఆ బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ను పోలీసులు,సహచర ఆటోడ్రైవర్లు ప్రశంసించారు.అతని నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు రూ.500 నగదు బహుమతి అందజేశారు.వివరాలివి..గుంటూరుకు చెందిన మహిళ బత్తుల రమణ యలమంచిలి మండలం ములకలాపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చి, తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు ములకలాపల్లి గ్రామంలో ఆటో ఎక్కింది.యలమంచిలి బస్టాండుకు చేసుకున్నాక తన బ్యాగును ఆటోలో మర్చిపోయి దిగిపోయింది.తర్వాత బ్యాగు మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి ఆటో కోసం వెతకసాగింది.సమీపంలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామారావుకు విషయం చెప్పింది.ఇద్దరూ కలిపి ప్రధాన రహదారిపై ఆటోకోసం వెతుకుతున్న సమయంలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిన ఆటోడ్రైవర్ అక్కడకు వచ్చి నా ఆటోలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిందని హెడ్ కానిస్టేబుల్ రామారావుకు చెప్పాడు. బ్యాగు తనదేనని చెప్పిన ప్రయాణికురాలు రమణకు పట్టణ పోలీసుల సమక్షంలో బ్యాగును అప్పగించారు.బ్యాగులో తులంపావు బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు.మర్చిపోయిన బ్యాగును నిజాయితీగా అప్పగించిన ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అందిబోయిన సత్యనారాయణను పట్టణ ఎస్ఐ సావిత్రి అభినందించారు. బంగారు ఆభరణాలతో మర్చిపోయిన బ్యాగు అప్పగింత -
వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు
అనకాపల్లి : పారిశ్రామిక ప్రాంతంలో పరవాడ సమీపంలో ఉన్న కల్పక– అచ్యుతాపురంలో ఉన్న బ్రాండిక్స్ సబ్స్టేషన్ల మధ్య 220 కేవీ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొలుగొండ, నాతవరం మండలాల పరిధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులకు రోజుకు రెండు విడతల్లో మొత్తం 9 గంటల పాటు త్రీ–ఫేజ్ విద్యుత్ సరఫరా చేయనున్నామని, మొదటి ఫేజ్గా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు (4 గంటలు), రెండో ఫేజ్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు (5 గంటలు) వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున రైతులు ఈ సమయాలను గమనించి, అధికారులకు సహకరించవలసిందిగా ఎస్ఈ ప్రసాద్ కోరారు. -
స్కూళ్లు, వసతి గృహాల్లో దోమల నివారణకు చర్యలు
కోనాం బాలుర వసతి గృహంలో వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా అధికారులు చీడికాడ: పాఠశాలల్లో,వసతి గృహాల్లో దోమల నివారణపై తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలదొర, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జి.మంగవేణి పాఠశాల, వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలోని కోనాంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను వారు గురువారం సందర్శించారు. ఇటీవల కోనాంలో బాలుర ఆశ్రమ పాఠశాలలో ఐదుగులు,బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు, అప్పలరాజుపురం ఎస్సీ వసతి గృహం ముగ్గురు విద్యార్థులకు వైద్యపరీక్షల్లో మలేరియా జ్వరాలు సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు,వసతి గృహాలను పరిశీలించారు. వెంటనే దోమల నివారణతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని పాఠశాల సిబ్బందిని, వైద్యసిబ్బందికి సూచనలు జారీ చేశారు. -
ఆర్.భీమవరంలో అధికారుల పర్యటన
బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరంలో అధికారులు పర్యటించారు. ఆర్. భీమవరంను వేధిస్తున్న కిడ్నీ సమస్యపై గురువారం ప్రచురితమైన సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఉమా మహేశ్వరరావు, చోడవరం ల్యాబ్ నీటి సాంద్రత సిబ్బంది, వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. కిడ్నీ సమస్యతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి వివరాలు, ఇంకా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారి వివరాలు అధికారులు సేకరించారు. పలువురు ఇళ్లకు వెళ్లినపుడు మంచినీరు వల్లే కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు పలువురి ఇళ్లకి వెళ్లి కుళాయిల నుంచి అలాగే గ్రామం అంతటికి నీటిని సరఫరా చేస్తున్న బోరు పంపు నుంచి వేరువేరుగా నీటి శాంపిల్స్ తీసి పరీక్షించారు. అలాగే చోడవరం, విశాఖ ల్యాబ్లకు శాంపిల్స్ తీసిన నీటిని తరలించారు. గ్రామంలో తాగునీరు కలుషితం అవుతున్నదీ లేనిది మంచినీటి పైపులను పరిశీలించారు. ల్యాబ్ల నుండి వచ్చిన మంచినీటి రిపోర్టులు ఆధారంగా కిడ్నీ సమస్య ఎందుకు వస్తున్నది తెలియజేస్తామని గ్రామ పెద్దలు బల్లిన అమ్మునాయుడు, గొల్లవిల్లి సత్యనారాయణ, నాయుడు తదితరులకు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ కె. ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎస్.రాయవరం : బైకుతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గుర్రాజుపేట గ్రామానికి చెందిన గొంప అప్పారావు(42) గ్రామం నుంచి తన బైకులో పెట్రోలు పోయించుకునేందుకు రేవు పోలరవం వైపు బయలుదేరాడు. ఈ సమయంలో బైకు స్టాండ్ తీయకపోవడంతో సైడ్ స్టాండ్ రోడ్డుకి తగిలి బైకు అదుపు తప్పింది. ఆర్వీనగర్ పేటగడ్డ మదుంవద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం అయ్యింది. స్థానికులు వెంటనే అప్పారావును నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
వరాహనదిలో బాలుడు గల్లంతు
ఎస్.రాయవరం : బంగారమ్మపాలెం సమీపంలో శారదా, వరాహనదుల కలయిక వద్ద వరాహనది ప్రాంగణంలో 9వ తరగతి విద్యార్థి ఈతకోసం వెళ్లి గల్లంతైనట్టు ఎస్ఐ రమేష్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కారే అశోక్(14) గురువారం సెలవు కావడంతో గ్రామంలో శివారులో వరాహనదిలో తెప్పలు నిలిపే చోటుకు వెళ్లి ఈత కోసం నదిలో దిగి గల్లంతయ్యాడని చెప్పారు. వెంటనే స్థానికులు వెతికినా కనిపించకపోవడంతో, సమీపంలో ఉన్న ఎన్ఏవోబి సిబ్బందిని, బాలుడిని వెతికేందుకు సహకరించాలని ఎస్ఐ కోరడంతో ఆ సిబ్బంది నదిలో సాయంత్రం వరకు గాలించారు. గల్లంతైన వెంటనే బాలుడు నది అడుగున ఉన్న ఊబిలో కూరుకు పోయి ఉండవచ్చని చెబుతున్నారు. చీకటి పడడంతో గాలింపు పనులు నిలిపివేసి, శుక్రవారం మరళా గాలింపు చేస్తామని చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
శ్రద్ధ చూపండి
పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీపై తుమ్మపాల : ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. పీజీఆర్ఎస్కు అందుతున్న ప్రజా వినతులను సంబంధిత మండలాలకు వెంటనే పంపించి, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు నెలలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ కొందరికి అందలేదని అర్జీలు వస్తున్నాయని తక్షణమే మిగిలిన వాటిని పంపిణీ చేయుటకు శ్రీకారం చుట్టాలని ఎమ్మార్వోలు, వీఆర్వోలను ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వేలో ఎంత భూమి సాగు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిపోయాయా లేదా చూసి ఈ– కే వైసీ ద్వారా ఆధార్ నెంబరు, డాక్యుమెంట్ నెంబర్ చెక్ చేసుకొని పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయలన్నారు. జేసీ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్ బుకింగ్, ఓడీఎఫ్ గ్రామాలు, డీఆర్డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్య ఘర్ యోజనలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ ఓడీఎఫ్ హోదాను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ వై.శ్రీనివాస్తో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
గ్రావెల్ అక్రమ రవాణా అడ్డగింత
మునగపాక : ఎటువంటి అనుమతులు గాని రికార్డులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న లారీలను వైఎస్సార్సీపీ నేతలు కాండ్రేగుల జగన్, సియాద్రి బుజ్జి తదితరులు అడ్డుకున్నారు. మండలంలోని తిమ్మరాజుపేట జంక్షన్ దరి ప్రైవేటు స్థలాన్ని కప్పేందుకు లారీలతో వస్తున్న లారీలను గురువారం సాయంత్రం అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు లేకుండా పోతున్నాయన్నారు. ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టేలా కూటమి నేతల ప్రోత్సాహంతో దందా జరుగుతుందన్నారు. అక్రమ వ్యాపారం చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలకు గ్రావెల్ గాని మట్టి గాని తరలించాలంటే తప్పనిసరిగా సంబంధిత ఽఅధికారుల అనుమతులు కావాల్సి ఉన్నా కొంతమంది కూటమి నేతలు అక్రమార్జన కోసం వ్యాపారం చేస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను స్టేషన్కు తీసుకువచ్చారు. సంబంధత వాహన దారులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయం
యలమంచిలి రూరల్ : మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల వినియోగం విద్యార్థులు, యువత భవిష్యత్తులను నాశనం చేస్తుందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభిప్రాయపడ్డారు. నషా ముక్త్ భారత్ సప్తాహ్లో భాగంగా గురువారం యలమంచిలి భాష్యం స్కూల్లో వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వలన కలిగే నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే స్నేహితులను దూరంగా ఉంచాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కష్టమవుతుందన్నారు. దేశాభివృద్ధికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. భావితరాల సంక్షేమం దృష్ట్యా మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ తమ వంతు కృషి చేయాలన్నారు. పరవాడ డీఎస్పీ బి. మోహన్రావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగించినా, అమ్మినా, రవాణా చేసినా కటకటాల పాలవుతారన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం డ్రగ్స్కు దూరంగా ఉంటామని,దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ శ్రీనివాసులు,యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎన్డీపీఎస్ విభాగం సీఐ పిల్లా రమేష్, ఎస్ఐలు కె.సావిత్రి, ఎం.ఉపేంద్ర, బి. రామకృష్ణ, ప్రసాదరావు, మహిళాశిశు సంక్షేమం సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
నీటి నిల్వలతో తాండవ కళకళ
నాతవరం : జిల్లాలో ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరులో నీటినిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో సాగుకు నీటి విడుదల సకాలంలోనే విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాండవ రిజర్వాయరు ప్రఽమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా డేడ్ స్టోరేజీ 345 అడుగులుగా అధికారులు పరిగణిస్తారు. తాండవలో నీటి మట్టం గురువారం సాయంత్రానికి 374.6 అడుగులు ఉంది. గత నెలలో నీటి మట్టం 373,6 అడుగులు ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరడంతో తాండవ ప్రాజెక్టులో ఓ మోస్తరు నీటి మట్టం పెరిగింది. తాండవ రిజర్వాయరు నీరు అధారంగా అనకాపల్లి జిల్లాలో నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం, పాయకరావుపేట మండలాలు ఉండగా కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని, రౌతులపూడి, శంఖవరం మండలాలు పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారుగా 52వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులు తాండవ ప్రాజెక్టు కమిటీ సభ్యులు ఆయకట్టుదారులు సాగు రైతులు అభీష్టం మేరకు నీటి మట్టాన్ని పరిశీలించి నీటిని ఆగస్టులో ప్రధాన గేట్లు నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో నీటి మట్టం సమృద్ధిగా ఉండడంతో రైతులు ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు ఆమోదం మేరకు ముందుగానే నీరు విడుదల చేసే అవకాశం కన్పిస్తుంది. రానున్న కాలంలో భారీ వర్షాలు కురిసి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో నీరు పెరిగితే తాండవ రిజర్వాయరు నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరితే వృథాగా నీటిని స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి విడుదల చేస్తుంటారు. అందుచేత ప్రస్తుతం తాండవ ప్రాజెక్టులో నీటి నిల్వలు బాగుండడంతో ఖరీఫ్లో సాగుకు సకాలంలో నీరు విడుదల చేసేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై తాండవ ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామని ఆయకట్టు పరిధిలో రైతులంతా వరినారు సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
అతిథి అథ్యాపకులకు దరఖాస్తులు
యలమంచిలి రూరల్: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ, డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసేవారు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీల్లో కనీసం 55 శాతానికి మించి మార్కులు పొంది ఉండాలన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్ స్లెట్,పీ హెచ్డీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆశక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాల ఐక్యూఏసీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. -
‘బొడ్డేడ’ రచనకు జాతీయ స్థాయి బహుమతి
కశింకోట: కశింకోటకు చెందిన కథా రచయిత బొడ్డేడ బలరామస్వామి రాసిన ‘మొక్కు’ కథ జాతీయ స్థాయి కథల పోటీలో వరుసగా మూడోసారి తృతీయ బహుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన 2026 కథల పోటీ ఫలితాలను బుధవారం ప్రకటించగా బహుమతి వచ్చినట్లు బలరామస్వామి తెలిపారు. ఈ మేరకు పది వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో వచ్చే నెల 19,న జరిగే కార్యక్రమంలో బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో 2024లో డేగ, 2025లో తోడపెద్దు కథలకు తృతీయ బహుమతులు వచ్చాయన్నారు. సాహితీవేత్తలు, స్థానిక పెద్దలు బహుమతి పొందిన బలరామస్వామిని అభినందించారు. -
విద్యుత్ బస్లను ప్రభుత్వమే నడపాలి
అనకాపల్లి : బడుగు, బలహీన ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్లను దశలు వారిగా ప్రభుత్వం నిర్వీర్యం చేసి, కొత్తగా విద్యుత్ బస్లను ప్రవేశపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని, విద్యుత్ బస్ను ఆర్టీసీలో కొనసాగించాలని ప్రజారవాణాశాఖ ఉద్యోగుల సంఘం(జేఏసీ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు అన్నారు. స్థానిక డిపో వద్ద బుదవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్లను ఆర్టీసీ వారే నిర్వహించాలని, మూసివేసిన డిపోలను తక్షణమే తెరిపించాలని, ఫినాజిల్ కంపెనీలో ఒప్పందాలు రద్దు చేయాలని, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటిని ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, బకాయిపడ్డ నాలుగు డీఏలు చెల్లించాలని, కొత్తగా నాలుగువేల బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నాయకులు కె.ఎన్.వి.రమేష్, వై.వి.ఎస్.కుమార్, టిఏ.రాజు, ఎల్యూఆర్.బాబు, జి.వి.రమణ, డి.ఎన్.మూర్తి, బి.ఎ.రావు, టి.టి.మూర్తి పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపు
చీడికాడ: మండలంలోని ఖండివరం గ్రామం మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న మోదమాంబ పాదల నుంచి ఖండవరం, ఎల్.బి.పట్నం గ్రామాలకు చెందిన సూమారు 50 కళ్లాలకు వెళ్లే మార్గంలో ఆక్రమణలను బుధవారం తొలగించి రెవెన్యూ అధికారులు సరిహాద్దులు వద్ద రాళ్లు పాతించారు. ఈ రహదారిని ఖండివరం గ్రామానికి చెందిన గండి సూర్యనారాయణ అనే నాయకుడు ఆక్రమించుకుని ఆ మార్గంలో వెళ్లే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు గత సోమవారం పీజీఆర్ఎస్లో బాధిత రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గత గురువారం సాయంత్రం తహసీల్దార్ కిషోర్ లింకన్ ఆక్రమణ గురైన వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వం స్థలమని నిర్ధారించారు.అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.ఈ మేరకు బుధవారం మండల సర్వేయర్ సురేష్, వీఆర్వో అర్జునరావు, రైతులు, గ్రామపెద్దలు సి.డి.సి చైర్మన్ సుంకర శ్రీనువాసరావు, కో–ఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు మోసూరి సన్నిబాబు, మండల కో–ఆప్సన్ మెంబర్ షేకు సూర్యనారాయణలు, వేచలపు కామేశ్, అమ్మతల్లినాయుడు సమక్షంలో సర్వే రాళ్లు పాతారు. -
శారదానదిలో బాలుడు గల్లంతు
కశింకోట: మండలంలోని అమీన్సాహెబ్పేట వద్ద శారదానదిలో మిత్రులతో పాటు కలసి సరదాగా స్నానానికి దిగిన యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... యలమంచిలి మండలం వెంకటాపురానికి చెందిన వీసం చందు (16), మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి వారితో పాటు ఎఎస్ పేట వద్ద శారదా నదిలో స్నానానికి దిగాడు. ఈత రాక నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ మేరకు అందిన సమాచారంపై సంఘటనా స్థలాన్ని సందర్శించి ముమ్మరంగా నవీన్చంద్ర ఆచూకి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. పోలీసుల గాలింపు చర్యలు (ఇన్సెట్) చందు (ఫైల్) -
మెరుగైన విద్య అందించాలి
మాట్లాడుతున్న డీఐఈవో వినోద్ బాబు మాడుగుల: కళాశాలలో మెరుగైన విద్య అందించాలని అనకాపల్లి జిల్లా డీఐఈవో మద్దిల వినోద్బాబు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాలను ఆయన బుధవారం అకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అడ్మిషన్లు పెంచాలన్నారు. 2026 మార్చిలో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలవగా మాడుగుల ప్రత్యేక స్థానం దక్కించుకుందున్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు సిబ్బందికి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆయన వెంట జిల్లా సూపరింటెండెంట్ సుధాకర్, యూడీసీ శ్రీనివాస్, కళాశాల సిబ్బంది తదితరులున్నారు. -
పాఠశాల తెరిచి రెండు వారాలైనా చేరని విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రాథేయపడుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో మొత్తం 300కి పైగా ఏకోపాధ్యాయ స్కూళ్లు వాటిలో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్కి పరిమితం 20 స్కూళ్లలో ఒక్కరూ చేరని పరిస్థి
సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకటి కాదు..జిల్లాలో 20కి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులు ఒక్కరూ కూడా లేరు. బడి తెరిచి రెండు వారాలవుతున్నా ఒక్క విద్యార్థి కూడా అడుగుపెట్టలేదు. మరో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పది లోపే (సింగిల్ డిజిట్) ఉంది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పాతాళానికి పడిపోయింది. మౌలిక వసతుల లేమి, పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు కరువవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య వ్యవస్థ క్షీణించడంతో ప్రైవేట్ బాట పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది పాఠశాలలు మూతపడే దిశగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బడిబాటపాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి‘సున్నా’ సారు.. డిప్యుటేషన్ జోరు! విద్యార్థులు ఒక్కరూ లేని పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించిన విడ్డూరమైన ఘటన మాకవరపాలెం మండలంలోని బూరుగుపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది. ఈ పాఠశాలలో గతేడాది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేవలం ఇద్దరే విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయురాలు వేసవి సెలవులకు ఆరు నెలల ముందే వ్యక్తిగత కారణాలతో ముందస్తు పదవీ విరమణ చేశారు. దీంతో అప్పటి నుంచి అకడమిక్ ఇన్స్ట్రక్టర్తోనే మమ అనిపించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న పాఠశాల తెరిచినా.. ఇప్పటి వరకు ఈ బడిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇదే గ్రామంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న హైస్కూల్ అందుబాటులో ఉండడంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఒక్క విద్యార్థి కూడా లేని ఈ ప్రాథమిక పాఠశాలకు అధికారులు రోజూ ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్్పై పంపుతుండడం విమర్శలకు తావిస్తోంది. రోజూ వచ్చే సారు ఖాళీ క్లాస్ రూమ్లో బెంచీలను, టేబుళ్లను చూస్తూ కూర్చోవడం తప్ప మరేం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు లేని బడికి డిప్యుటేషన్లు ఎందుకని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 20..! ఇది కేవలం బూరుగుపాలెం సమస్య మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి తాండవిస్తోంది. జిల్లాలో మొత్తం 1436 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో ప్రైమరీ 1037, అప్పర్ ప్రైమరీ 57, హైస్కూల్స్ 342 ఉన్నాయి. వీటిలో 300కి పైగా స్కూళ్లు కేవలం ఏకోపాధ్యాయుడి (సింగిల్ టీచర్)తో నడుస్తున్నాయి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 20 వరకూ ఉన్నాయి. దైన్య స్థితిలో ఉపాధ్యాయులు పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి, గ్రామసభలు పెట్టి తమ బడిలో పిల్లలను చేర్పించాలంటూ తల్లిదండ్రులను ప్రాధేయపడినా విద్యార్థులు చేరడం లేదు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, విద్యా కానుక కిట్లు ఇవ్వకపోడం, గతేడాదిలో తల్లికి వందనం అరకొరగానే ఇవ్వడం, నాడు–నేడు ద్వారా స్కూల్ మౌలిక వసతులు కల్పించకపోవడం వంటి మరెన్నో కారణాలు విద్యార్థులను చేరకుండా దూరం చేస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల నమోదు పెంచేలా చర్యలు తీసుకోవాలని, అలాగే హేతుబద్ధత లేని డిప్యుటేషన్లను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు జిల్లాలోని కె.కోటపాడు(31), పరవాడ(32), అచ్యుతాపురం(27), సబ్బవరం(26), కశింకోట(25), దేవరాపల్లి(25), చోడవరం(21), కోటవురట్ల(22)తో పాటు పలు మండలాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు లేదా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. గవరపేట, చినబొడ్డేపల్లి, చిప్పాడ, శ్రీరాంపురం, విశారపుదొడ్డి వంటి గ్రామాల్లో ఒకటి, రెండు సీట్లతోనే బడులు నడుస్తున్నాయి. వీటిలో.. నర్సీపట్నం మున్సిపాలిటీలో కొత్తవీధి, రూరల్లో పాత ఉప్పరగూడెం, అప్పనపాలెంలో ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులు ఉన్నారు. మాకవరపాలెంలో 20 లోపు విద్యార్థులు ఉన్న 30 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో వెంకయ్యపాలెంలో ప్రాథమిక పాఠశాలలో కూడా ముగ్గురు, నలుగురు విద్యార్థులు ఉన్నారు. గ్రామ సభలు పెట్టి విద్యార్థులు పాఠశాలల్లో చేరాలని సమావేశాలు పెడుతున్నా ఫలితం ఉండడం లేదు. గొలుగొండ మండలంలో విప్పలపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. నాతవరం మండలంలో ఐదు పాఠశాలలున్నాయి. పాయకరావుపేట మండలంలో 8 ఏకోపాధ్యాయ పాఠశాలున్నాయి. అక్కడ 20 లోపు విద్యార్థులున్నారు. అరట్లకోట, కొత్తూరు, కువాడ, సత్యవరం, పెద్దిపాలెం, ఎం.ఎస్ పేట, కండిపేట, రాజయ్యపేట గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులున్నారు. కోటవురట్ల మండలంలో 22 పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులున్నాయి. చినబొడ్డేపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, కోటవురట్ల శివారు గవరపేట స్కూల్లో ఒకరే విద్యార్థి ఉన్నారు. ఎస్.రాయవరం మండలంలో మూడు ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. కాపులవాతాడ, చిన ఉప్పల, బసవపాడు ప్రాథమిక పాఠశాల్లో 20 లోపు విద్యార్థులున్నారు. అనకాపల్లి మండలంలో 18 పాఠశాలలున్నాయి. కశింకోట మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. యలమంచిలి మండలంలో 8 పాఠశాలలున్నాయి.అచ్యుతాపురం రూరల్ మండలంలో 27 ఉన్నాయి. చిప్పాడ, వెంకటాచలం, భోగాపురం గ్రామాల్లో ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మాడుగుల మండలంలో 5 పాఠశాలలు ఉన్నాయి. ముకుందపురం, బిల్లలపాలెం, పోతనపూడి, వాడపాడు ప్రాథమిక పాఠశాలలో 20 లోపు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. కె.కోటపాడు మండలంలో 31 ఏకోపాధ్యాయ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో మూడు పాఠశాలల్లో విద్యార్థులు ఒక్కరూ లేరు. దేవరాపల్లి మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. శ్రీరాంపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, తెనుగుపూడి పంచాయితీలో విషారపుదొడ్డిలో ఇద్దరు విద్యార్థులు, ఎం.అలమండ గ్రామంలో ఇద్దరు విద్యార్థులున్నారు. చీడికాడ మండలంలో 11 పాఠశాలలున్నాయి. చోడవరం మండలంలో ఏకోపాధ్యాయ స్కూల్స్ 21 ఉన్నాయి. రోలుగుంట మండలంలో 15 ఏకోపాధ్యాయ స్కూల్స్ ఉన్నాయి. ఎన్.కొత్తూరు. తడాలపాలెం, మునిపల్లి, ఎం.కే పట్నం గ్రామాలో సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు. బుచ్చెయ్యపేట మండలంలో 8 పాఠశాలలున్నాయి. పరవాడలో 32 ఏకపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. సబ్బవరం మండలంలో 26 ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : విశాఖ–విజయవాడ స్థానిక అనకాపల్లి శారదనది బ్రిడ్జి రైల్వే ట్రాక్పై సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడు నల్లరంగు పుల్హ్యాండ్స్ చొక్కా, ఎర్ర రంగు బనియాన్, నలుపురంగు ఫ్యాట్ ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ 7382058996 ను సంప్రదించాలన్నారు. -
అండర్–16 విశాఖ జట్టు విజయం
విశాఖ స్పోర్ట్స్: ఏసీఏ అండర్–16 మల్టీడే అంతర జిల్లాల నార్త్జోన్ క్రికెట్ పోటీల్లో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు తొలి ఇన్నింగ్స్లో 61 పరుగులకే ఆలౌటైంది. విశాఖ బౌలర్లలో యతీష్ మూడు వికెట్లు పడగొట్టగా, రామ్చరణ్, లోహిత్, భాను తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన విశాఖ జట్టు 6 వికెట్ల నష్టానికి 749 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ చైతన్య 82 పరుగులు చేయగా, గణేష్కృష్ణ 210 పరుగులతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రామ్చరణ్ (119), రుత్విక్ (నాటౌట్ 100) సెంచరీలతో రాణించగా, చెరిష్వర్ధన్ 86 పరుగులు చేశాడు.భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 92 పరుగులకే ఆలౌటైంది. మణివర్ధన్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విశాఖ బౌలర్లలో లోహిత్ నాలుగు వికెట్లు, భాను మూడు వికెట్లు, యతీష్ రెండు వికెట్లు పడగొట్టారు.దీంతో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. -
హాస్టల్లోప్రవేశాలకునోఛాన్స్
నర్సీపట్నం : బీసీ హాస్టల్లో విద్యార్థులను చేర్పేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. దీంతో బాలబాలికలను సంబంధిత వసతి గృహాల్లో చేర్చుకునేందుకు సంక్షేమాధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. పేదవర్గాలు చిన్నారుల చదువులకు భరోసా ఇవ్వడంలో ఇవి పునాదిలా నిలుస్తున్నాయి. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందుతుండడంతో వీటిలో సీట్లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ముందుచూపుతో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో మరమ్మతులు చేపట్టి ఉంటే విద్యార్థులకు మేలు చేకూరేది. వెంటాడుతున్న సమస్యలు నర్సీపట్నం మండలం, వేములపూడి బీసీ బాలికల వసతి గృహంలో 15 గదులు ఉండగా వీటిలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతిని పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో వసతి గృహంలో ఇప్పటికే వసతి పొందుతున్న విద్యార్థులను మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. కొత్త విద్యార్థులు చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. వసతి సమస్యతో సతమతం నర్సీపట్నం సబ్ డివిజన్లో వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 11 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సుమారు 1600 మంది విద్యార్థిని, విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఒక్కో హాస్టల్లో 100 నుంచి 300 మందిని చేర్చుకునేందుకు అవకాశం కల్పించారు. వేములపూడి బాలికల వసతిగృహంలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన పది గదుల్లో ఉన్న విద్యార్థులకే వసతి సమస్య కారణంగా కొత్త విద్యార్థులను తీసుకోవడం లేదు. 70 మంది విద్యార్థినులు వసతి గృహంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. సీటు వస్తుందనే నమ్మకంతో సమీపంలోని హైస్కూళ్లలో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించారు. తీరా వసతి గృహానికి వెళ్తే కొత్త విద్యార్థులను చేర్పించుకోవడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టి విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవనం మరమ్మతుపనులకు ప్రతిపాదనలు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ స్థానిక సంక్షేమాధికారి, హైస్కూళ్ల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. వసతి చాలని కారణంగా కొత్త విద్యార్థులను చేర్చుకోవద్దని ఉన్నతాధికారులు సూచించినట్టు సంక్షేమాధికారి వెంకటలక్ష్మి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తొందరపడి విద్యార్థులను తిరిగి పంపించొద్దని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుందామని సూచించినట్టు తెలిసింది. దీనిపై ఏబీసీ డబ్ల్యూవో గోపీనాథరావును వివరణ కోరగా వసతి సమస్య వల్లనే పిల్లలను చేర్చుకోవడం లేదని తెలిపారు. భవన మరమ్మతులకు రూ.23 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదలైన వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. వసతి సమస్య తీరిన వెంటనే విద్యార్థులను చేర్చుకుంటామని తెలిపారు. -
ఆర్.భీమవరంను వేధిస్తున్న కిడ్నీ సమస్య
బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరం గ్రామస్తులను కిడ్నీ సమస్య వేధిస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడాదిన్నరలోనే గ్రామంలో కిడ్నీ సమస్యతో 12 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా 70 నుండి 90 ఏళ్లు వృద్ధాప్యం వచ్చినవారు కాదు 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు లోపువారే. బుధవారం గ్రామానికి చెందిన పతివాడ సన్యాసినాయుడు 45 ఏళ్లకే మృతి చెందాడు. ఇతనికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో వీరు రోడ్డున పడ్డారు. ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన పతివాడ సన్యాసినాయుడుతో పాటు రొంగలి చిన్నంనాయుడు, రెడ్డి అప్పారావు, మట్టా నూకరత్నం, బల్లిన అప్పలనాయుడు, రాపర్తి అప్పారావు, పాలిశెట్టి సరోజిని, మట్టా అప్పారావు, కొండ్రపు చెల్లయమ్మ, కోడూరు దేముడు (బట్టయ్య) కోడూరు క్రిష్ణయ్య, బొడ్డు సత్తిబాబు(పాత్రుడు)లు కిడ్నీ సమస్యతో చనిపోయారు. ఇంకా గ్రామంలో మట్టా అప్పారావు, కోడూరు దేముడు, రొంగలి చిన్నంనాయుడు, మట్టా కార్తీక్ తదితరులు కిడ్నీ సమస్యతో మంచాన పడి డయాలసిస్ చేయించుకుంటూ వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామంలో మరికొంత మంది కిడ్నీ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకుంటే తమకు కిడ్నీ సమస్య ఉందని తెలిస్తే వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుందని పలువురు ఎటువంటి వైద్య సేవలు చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాగునీటి కాలుష్యం వల్లేనా...? సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 వేల లీటర్లు సామర్థ్యం ఉన్న మంచినీటి ట్యాంకు ద్వారా గ్రామస్తులందరికి తాగునీరు అందిస్తున్నారు. ఈ ట్యాంకు నీరు తాగడం వల్లే కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంచినీళ్లు పట్టుకుంటే మీద ఆయిల్ తేలుతుందని పలువురు తెలియజేస్తున్నారు. పలుసార్లు తమ గ్రామంలో ఉన్న మంచినీటిని పరీక్షించి తాగడానికి మంచిదో కాదో నిగ్గు తేల్చాలని గ్రామస్తులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా నీటి పరీక్షలు మాత్రం బయటపెట్టడం లేదు. ఒకే గ్రామంలో ఇంత మంది కిడ్నీ సమస్యతో మృత్యువాత పడుతున్నా ఆరోగ్య ,గ్రామీణ నీటి సరఫరా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. కొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్య కారణంగా ప్రాణ భయంతో ఉన్న ఊరును కాదని గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. తక్షణం జిల్లా అధికారులు స్పందించి ఆర్.భీమవరంలో కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరికలు
ఎస్.రాయవరం: అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. భీమవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఇరువురు సీనియర్ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇతరులతో కలిపి పది మంది వైఎస్సార్సీపీలో చేఆరు. కంబాల జోగులు వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంబాల జోగుల మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే చతికిలబడిందని ఎద్దేవా చేశారు. కుట్ర రాజకీయాలతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మరింత సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మధువర్మ, స్థానిక గ్రామ కమిటీ అద్యక్షులు గరగా శ్రీనివాసరావు, పార్టీలోచేరిన పాలపర్తి శ్రీను, రామారావు కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యువతి జాతీయ స్థాయి ప్రతిభ
ముంచంగిపుట్టు : న్యూఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్(ఐఎన్ఐ–సెట్)–2026 జూన్ సెషన్ ఫలితాలలో ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామానికి చెందిన గిరిజన యువతీ డాక్టర్ చిట్టపులి శ్రావ్య దీప్తి ప్రియాపడాల్ ప్రతిభ కనబర్చింది.అఖిల భారత స్థాయిలో 6,436వ ర్యాంకు,కేటగిరీ ర్యాంకులో 38వ స్థానం సాధించారు.దీంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థలలో ఒకటైన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో ప్రసూతి, సీ్త్రరోగ విభాగంలో(ఎం.డి.గైనకాలజీ)లో సీటును మొదటి ప్రయత్నంలోనే కై వసం చేసుకుంది. కిలగాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు చిట్టపులి శ్రీనివాస్పడాల్,కృష్ణకుమారి దంపతుల ద్వితీయ కుమార్తె శ్రావ్య దీప్తి ప్రియా పడాల్.10వ తరగతి వరకు పాయకరావుపేటలోని శ్రీప్రకాశ్ విద్యానికేతన్,ఇంటర్మీడియెట్ అంత విశాఖలోని శ్రీచైతన్యలో,2019లో నీట్–యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ప్రవేశం పొంది, 2025లో వైద్య విద్యను పూర్తి చేశారు.గిరిజన ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి యువతీ శ్రావ్య దీప్తిప్రియాపడాల్ ఈ స్థాయికి చేరుకోవడం యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని,భవిష్యత్తులో వైద్య సేవా రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కిలగాడ గ్రామానికి చెందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు,నేతలు,ప్రజలు, మండల వాసులు అభినందనులు తెలియజేస్తూ,ఆకాంక్షించారు. -
తల్లిదండ్రులే మన ముందున్న దేవుళ్లు
మద్దిలపాలెం (విశాఖ): నిత్యం మన కళ్లెదుట కనిపించే తల్లిదండ్రులే ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దైవాలని ప్రఖ్యాత గజల్ గాయకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘గజల్ శ్రీనివాస్ భారతీయం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు), కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్ అతిథులుగా హాజరై మూడు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతలో బాధ్యత, విలువలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంచేలా గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో గజల్ శ్రీనివాస్ ఒకరని కొనియాడారు. సందేశాత్మకమైన గజల్స్ దాదాపు రెండు గంటల పాటు సాగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల పట్ల గౌరవం, దేశభక్తి, మానవ విలువలను ప్రతిబింబించే గజల్స్ను గజల్ శ్రీనివాస్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన గేయాల ద్వారా సందేశమిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జీతం కోసం వెళ్తే.. జీవచ్ఛవం కావాలా?
సాక్షి, అనకాపల్లి/విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్ ప్రాంతాల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. విధులకు వెళ్లిన కార్మికుడు సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరతాడన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎంఎన్సీ స్థాయి పరిశ్రమల్లోనూ వరుసగా అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు చోటుచేసుకుంటుండటం పారిశ్రామిక భద్రతలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. తాజాగా మంగళవారం పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో గత రెండేళ్లుగా పరవాడ–అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల పరంపర మరోసారి చర్చనీయాంశమైంది. గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాల రూపంలో ఇప్పటికే 20 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, యాజమాన్యాలు, పర్యవేక్షణ సంస్థల వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఎసైన్షియా తర్వాత ఏమైంది? ఎసెన్షియా ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ఆడిట్లు నిర్వహించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని ప్రకటించారు. పరిశ్రమలు, ఏపీపీసీబీ అధికారులను నిలదీశారు. కానీ రెండేళ్లు పూర్తవుతున్నా పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు. నాటి ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణ్ ఎనర్జీ ప్రమాదం తర్వాత మళ్లీ సేఫ్టీ ఆడిట్ల అంశం తెరపైకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాగితాలకే పరిమితమైన నివేదికలు ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు, పైప్లైన్లు, ట్యాంకర్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఐఎస్వో ప్రమాణాలు, ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నివేదికలు సిద్ధమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త అనుమతులు, విస్తరణలు, బ్యాంకు రుణాలు, లైసెన్స్ రెన్యూవల్స్ కోసమే ఆడిట్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రమాదాలపై కమిటీలు సమర్పించిన నివేదికలు కూడా ప్రజల ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు ఎక్కడ? పరిశ్రమల్లో లోపాలను గుర్తించి సరిచేయాల్సిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడిగా తనిఖీలు చేసి, ఆ తర్వాత మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాలపై చర్చించిన నెల రోజుల్లోనే మూడు ప్రమాదాలు చోటుచేసుకోవడం అధికార యంత్రాంగం పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రక్షణ లేని కార్మిక జీవితాలు ప్రమాదకరమైన రియాక్టర్ల వద్ద నైపుణ్యం కలిగిన సిబ్బందికి బదులుగా కాంట్రాక్ట్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియాక్టర్లలో ఒత్తిడి పెరగడం, రసాయనిక చర్యలు అదుపు తప్పడం వంటి పరిస్థితులను సకాలంలో గుర్తించే నిపుణులు లేకపోవడంతో ప్రమాదాలు తీవ్రమవుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అధిక లాభాల కోసం తక్కువ వేతనాలతో వలస కార్మికులను నియమించడం, వారికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. భద్రతా లోపాలపై ప్రశ్నించిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు ఎక్కడ? పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్లలో కలిపి 300కు పైగా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పరిశ్రమ వద్ద అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. చాలా కంపెనీల్లో అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్లు, సమర్థవంతమైన ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు లేకపోవడం బయటపడుతోంది. దీంతో తీవ్రంగాా గాయపడిన కార్మికులు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారాలు ప్రకటించడం, కమిటీలు వేయడం, విచారణలు జరపడం పరిపాటిగా మారింది. కానీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గత నివేదికలపై ఏ చర్యలు తీసుకున్నారు? సేఫ్టీ ఆడిట్ల ఫలితాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావడం లేదు. ఎసెన్షియా నుంచి దక్షిణ్ వరకు జరిగిన ప్రమాదాల పరంపర ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టలేరు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకుండా చూసే వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, యాజమాన్యాలపై ఉంది. లేకపోతే జీతం కోసం వెళ్లిన కార్మికుడు జీవచ్ఛవంగా తిరిగి రావాల్సిన దుస్థితి మరింత విషాదకరంగా మారుతుంది. కూటమి ప్రభుత్వంలో వరుస ప్రమాదాల పరంపర 2024 ఆగస్టు 21: అచ్యుతాపురం సెజ్లోని ’ఎసైన్షియా అడ్వాన్స్డ్ ఫార్మా’లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోర ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 2025 జూన్: ’సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్స్’లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. 2025 సెప్టెంబర్: ’డెక్కన్ రెమెడీస్’లో మెథనాల్ గ్యాస్ లీక్ అయి మరో కార్మికుడి ప్రాణాన్ని బలిగొంది. 2026 జనవరి: అచ్యుతాపురంలోని ’ఎస్వీఎస్ కెమికల్స్’లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ ఆస్తి నష్టం సంభవించింది. 2026 జూన్ 23: పరవాడ ఫార్మాసిటీలోని ’దక్షిణ్ ఎనర్జీ’ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవడం పారిశ్రామిక భద్రతపై మళ్లీ పెను ప్రశ్నలు లేవనెత్తింది. రెండేళ్లుగా వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పారిశ్రామిక భద్రతా విభాగాల వైఫల్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
ముగ్గురు ఆడపిల్లల తండ్రి వెంకటేష్
చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్కు భార్య కోమలి, ముగ్గురు చిన్నారి ఆడపిల్లలు ఉన్నారు. గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన వెంకటేష్, అది మూతపడటంతో ఐదు నెలల క్రితమే ఈ పరిశ్రమలో చేరాడు. తన ముగ్గురు కూతుళ్లను బాగా చదివించుకోవాలని ఆశపడ్డ ఆ తండ్రి, ఇలా మంటల్లో కలిసిపోవడంతో.. ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ ఆ భార్యాపిల్లలు చేస్తున్న రోదనలు అక్కడున్న వారి గుండెలను పిండేశాయి. రోదిస్తున్న వెంకటేష్ భార్య కోమలి -
కరిగిపోయిన కలలు
నిప్పుల గుండంలో దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు సజీవ దహనంప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే పరవాడ : ఆ తెల్లవారుజామున వారిద్దరూ ఎప్పటిలాగే తమ విధుల్లో మునిగిపోయారు. కుటుంబాలను సాకుతున్నామన్న తృప్తి, రేపటి జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పరిశ్రమే వారికి చితిగా మారింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్(ఏపీఐఐసీ జోన్–3)లో గల ’దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు యువ కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ హఠాత్పరిణామంతో అనకాపల్లి జిల్లాలోని రెండు గ్రామాలు ఒకేసారి కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి. క్షణాల్లో జరిగిన ఘోరం ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, ఇంధన నూనెలను తయారు చేసే ఈ పరిశ్రమను గతేడాది సెప్టెంబరులోనే ప్రారంభించారు. సోమవారం రాత్రి షిఫ్ట్ విధులకు హాజరైన ఆపరేటర్ వేపాడ వెంకటేష్(34), ఫిట్టర్ బోడపు త్రినాథ్(24)లు మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద ప్రాసెసింగ్ పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక రియాక్టర్ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది, గోడలు బీటలు వారాయి. క్షణాల వ్యవధిలో పరిశ్రమను దట్టమైన మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ వద్దే ఉన్న వెంకటేష్, త్రినాథ్లు తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గుండెలు పగిలేలా రోదనలు ఈ ప్రమాదం సృష్టించిన బీభత్సం ఒకవైపు అయితే, మృతుల కుటుంబాల గాథలు కంటతడి పెట్టించాయి. పరిశ్రమ గేటు వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది. అధికారుల సందర్శన ప్రమాద వార్త తెలియగానే పరవాడ డీఎస్పీ మోహన్రావు, సీఐ భాస్కరరావులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జేసీ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్రెడ్డి తదితరులు పరిశ్రమను సందర్శించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.33 లక్షలు నష్టపరిహారం రాంకీ కమర్షియల్ హబ్లో ఆర్డీవో ఆధ్వర్యంలో యాజమాన్యం, పోలీసు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.33 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం మహారాణిపేట: ‘దక్షిణ్ ఎనర్జీ’ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు వేపాడ వెంకటేష్, బొడ్డాపు త్రినాథ్ల మృతదేహాలకు మంగళవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోలీసులు పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇళ్ల పరిసరాల్లో పెంచే మొక్కలు సిద్ధం చేయాలి
కె.కోటపాడు : వన నర్సరీల్లో సోషల్ ఫారెస్ట్ ద్వారా పెంచుతున్న మొక్కలను రైతులకు ఉచితంగా అందించనున్నట్లు ఉత్తరాంధ్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఐ.విశ్వనాథరాజు తెలిపారు. సింగన్నదొరపాలెం, కొత్తూరు, ఎ.కోడూరు, పొడుగుపాలెం, రామచంద్రపురం, బత్తి వానిపాలెంల్లోని వననర్సరీల్లో పెంచుతున్న మొక్కల ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల పరిసరాల్లో వేసే పూలు, పండ్ల మొక్కలతో పాటు, తులసి, కరివేపాకు, బొప్పాయి, జామ తదితర మొక్కలను వచ్చే ఏడాది నర్సరీల్లో పెంచే చర్యలను తీసుకోవా లని సిబ్బందికి ఆయన సూచించారు. 10 రకాలైన కొత్త మొక్కలను పెంచాలన్నారు. సోషల్ ఫారెస్ట్ డీఎఫ్వో ఎం.సోమసుందరం, ఫారెస్ట్ రేంజ్ అధికారి యు.శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
చెల్లి పెళ్లి చేయాలనుకున్న త్రినాథ్
అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బోడపు త్రినాథ్ది అత్యంత నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు పారునాయుడు, రమణమ్మలతో పాటు చెల్లి మాధవిని తనే పోషిస్తున్నాడు. త్వరలోనే చెల్లికి పెళ్లి చేసి, ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళ్లల్లో ఆశలు ఇంకా మిగిలి ఉండగానే, 24 ఏళ్ల ప్రాయంలోనే త్రినాథ్ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోదిస్తున్న త్రినాథ్ బంధువులు -
ఖరీఫ్లో వరి సాగు లక్ష్యం 60 వేల హెక్టార్లు
నాతవరం: జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సీజన్లో 60వేల హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి తెలిపారు. మండలంలోని మర్రిపాలెం రైతు సేవా కేంద్రంలో మంగళవారం రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులకు ఖరీఫ్ సాగులో మెళకువలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు పంపిణీ చేసేందుకు 21 వేల క్వింటాళ్ల పది రకాల వరి విత్తనాలు సిద్ధం చేసినట్టు చెప్పారు. రైతు సేవా కేంద్రాలు, పీఏఎసీఎస్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇంతవరకు 12,560 క్వింటాళ్లు పంపి ణీ చేసినట్టు తెలిపారు. ఖరీఫ్లో వరి సాగుకు 19,600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమన్నారు. జూన్ నెలకు సంబంధించి అవసరమైన 3,789 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్లు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రైవేట్ డీలర్లు అధిక రేట్లకు విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావాలన్నారు. నాతవరం మండలంలో జిల్లాలోనే అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తుండడంతో అందుకు తగినట్టుగా వరి విత్తనాలు, ఎరువులు అధికంగా కేటాయించినట్టు తెలిపారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాక సిద్ధం చేశామని చెప్పారు. రైతన్న మీ కోసం కార్యక్రమం ఈనెల 22నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థిఽతులు ఏర్పడితే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. తక్కువ నీటితో పండే రాగులు, అపరాలు తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. యూరి యా, డీఏపీ తదితర ఎరువులు విడతల వారీగా రైతులకు అందిస్తామన్నారు. ఖరీఫ్ ీసీజన్లో అందరికీ ఒకేసారి ఎరువులు అవసరం కావడంతో రైతులు ముందుగానే కొనుగోలు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జి.సుగుణ, వెర్రిగెడ్డ నీటి సంఘం అధ్యక్షుడు అల్లు స్వామినాయుడు, మర్రిపాలెం పెద్ద చెరువు నీటి సంఘం అధ్యక్షుడు రంభా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రమాదాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలి
మహారాణిపేట: స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రమాదాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించి, బాధ్యులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. ధర్నాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి, కార్యదర్శి రోహిణిదేవి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బీచ్లను మద్యం కేంద్రాలుగా మార్చొద్దు
మహారాణిపేట: బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.362ను వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో బీచ్లలో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించడం సమాజానికి హానికరమన్నారు. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో సందర్శించే బీచ్ ప్రాంతాల్లో రెడీ టు డ్రింక్ కేంద్రాలు, బీచ్ షాక్స్, ఇతర వినోద కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల జీవో నెం.362ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో సీఎంఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.లలిత, జె.శ్యామల, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, కార్యదర్శి వై.సత్యవతి తదితర మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
25న చోడవరంలో మెగా జాబ్ మేళా
జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరిస్తున్న జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు సుమారు 15 బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని, 1,500 ఖాళీలు భర్తీ చేయనున్నారని చెప్పారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత గల, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువతీయువకులు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ వివరాలను naipunyam. ap. gov. in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, రిఫరెన్స్ నంబర్తో పాటు రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్స్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 94947 91935లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పి.రోహిణి, ఎంప్లాయిమెంట్ అధికారి మనోహరిణి తదితరులు పాల్గొన్నారు. -
గంభీరం రిజర్వాయర్లో మునిగి యువకుడి మృతి
ఆనందపురం: స్నేహితులతో కలిసి సరదాగా సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు రిజర్వాయర్లో మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టుముక్కల శ్రీధర చక్రవర్తి (28) సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తన స్నేహితులు ప్రశాంత్, శౌవిక్ చౌదరీతో కలిసి గంభీరం రిజర్వాయర్కు వెళ్లాడు. ముగ్గురూ కలిసి ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరగడంతో శ్రీధర చక్రవర్తి నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుడి తండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గొట్టుముక్కల మధు జగన్నాధ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సీఐ సీహెచ్.వాసు నాయుడు ఆదేశాలతో ఎస్ఐ ఎం.హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీమా కార్మికులకు ఆశ్రిత ప్రయోజన పింఛన్ల అందజేత
సీతంపేట: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆశ్రిత ప్రయోజనం (డిపెండెంట్ బెనిఫిట్) ఒక ముఖ్యమైన ప్రయోజనమని సంస్థ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ అన్నారు. ఉద్యోగ నిర్వహణ సమయంలో, ఉద్యోగ సంబంధిత ప్రమాదాల కారణంగా మరణించిన బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద నెలవారీ పింఛను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధిత ప్రమాదాల్లో మరణించిన గాజువాక ఈ.ఎస్.ఐ బ్రాంచ్ ఆఫీసు పరిధిలోని ముగ్గురు బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు నగరంలోని ఈఎస్ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఆశ్రిత ప్రయోజనం కింద మంజూరైన పింఛను చెక్కులు అందజేశారు. హిందుస్థాన్ షిప్యార్డ్లో పనిచేస్తూ వేగి వెంకట కృష్ణ గుండెపోటుతో మృతి చెందగా అతని భార్య, కుటుంబ సభ్యులకు నెలకు రూ.21,204లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరు చేశారు. నాగార్జున వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో హెల్పర్గా పనిచేస్తున్న ఎం.నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని భార్యకు పార్వతికి నెలకు రూ.10,479 పెన్షన్ మంజూరు చేశామన్నారు. తులసి ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థలో కాంట్రాక్ట్ ప్రతినిధిగా ఉక్కు కర్మాగారంలోని ఎంజీఎం యార్డ్లో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందిన కె.సూర్యారావు భార్యకు భవానికి నెలకు రూ.12,388 ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరైందన్నారు. ఈ సందర్భంగా జేడీ కేఆర్ రవి కుమా ర్ మాట్లాడుతూ ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల బీమా కార్మికుడు మరణించిన సందర్భంలో, అర్హులైన కుటుంబ సభ్యులకు కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా ఆశ్రిత ప్రయోజన పింఛను, బకాయి చెల్లింపులు, ఇతర చట్టబద్ధమైన సంక్షేమ ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉందని తెలిపారు. మృతి చెందిన బీమాదారుని భార్యకు రూల్ 25 (10) సోషల్ సెక్యూరిటీ సెంట్రల్ రూల్స్ 2026 ప్రకారం నామమాత్రపు రుసుముతో నెలకు రూ. 50 చొప్పున సంవత్సరానికి రూ. 600 ముందస్తు చెల్లింపుతో ఈ.ఎస్.ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్స్లో వైద్య సదుపాయం పొందవచ్చున్నారు. మృతి చెందిన బీమాదారుని పిల్లలకు ఈఎస్ఐసి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లలో నీట్ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ప్రకారం ప్రత్యేక కోటాకు అర్హత లభిస్తుందన్నారు. ఆయా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగు ఎలా ?
సాక్షి, అనకాపల్లి: ఖరీఫ్ సీజన్లోనైనా పంటలు బాగా పండాలని, దిగుబడి బాగా రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నకు ప్రస్తుత పరిస్థితులు నిరాశే మిగులుస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో జిల్లాలో రోజూ ఏదో ఒక చోట ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అలా కురిసే నీరు రిజర్వాయర్లలోకి చేరి, సాగునీరు పుష్కలంగా అందినప్పుడే పంటలు పండుతాయి, దిగుబడి పెరుగుతుంది. కానీ జిల్లాలో జలాశయాల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది. రిజర్వాయర్ల ఆధునికీకరణ, మరమ్మతులతో పాటు సాగు నీటి కాలువల్లో పూడికతీత పనుల్లో ఎక్కడా కదలిక లేదు. పడకేసిన మరమ్మతులు.. వృథాగా పోతున్న జలాలు ఈ ఖరీఫ్ సీజన్లో రిజర్వాయర్ల పరిధిలో ఉన్న ఆయకట్టు శివారు భూములకు సైతం సాగునీరు అందాలంటే.. వేసవిలోనే రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, దెబ్బతిన్న చెక్ డ్యామ్ల పునరుద్ధరణ, సాగునీటి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ (పిచ్చిమొక్కల తొలగింపు) పనులు పూర్తి చేయాల్సి ఉంది. వేసవి ముగిసి వర్షాకాలం వచ్చేసినా.. పూడికతీత, మరమ్మతులు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రెండు ఖరీఫ్ సీజన్లు ముగిశాయి. అయినప్పటికీ జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల ఆధునికీకరణకు, సాగునీటి కాలువల పూడికతీత పనులకు మోక్షం లభించలేదు. గేట్లు, చెక్ డ్యామ్లు దెబ్బతినడంతో నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా లీకై బయటకు పోతోంది. సాగునీటి కాలువలు కూడా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. పూడికతీత పనులు చేపట్టకపోవడం తో నీటి విడుదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. లక్షల ఎకరాల ఆయకట్టు జిల్లాలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు(తాండవ), మూడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు(రైవాడ, పెద్దేరు, కోనాం), 2,880 చెరువులు,గ్రోయిన్లు, చిన్నపాటి చెక్ డ్యామ్లున్నాయి. వీటి పరిధిలో 3,05,993 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో తాండవ పరిధిలో 32,689 ఎకరాలు, మూడు మధ్య తరహా నీటి ప్రాజెక్టులు రైవాడ, పెద్దేరు, కోనాం పరిధిలో 42,725 ఎకరాలు, 2,880 చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద 2,30,579 ఎకరాలు సాగులో ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరై ప్రస్తుతం నిలిచిపోయిన పనులు ●మైనర్ ప్రాజెక్టులైన మాడుగల మండలం తాటిపర్తిగ్రామంలోని ఎన్టీఆర్ జలాశయానికి 2022లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.21.75 కోట్లతో ప్రతిపాదనలు పంపిచారు. ప్రభుత్వం మారడంతో అవి మూలనపడిపోయాయి. ఇప్పుడు మళ్లీ రూ.5.15 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. ●మాడుగుల మండలం శంకరం గ్రామం వద్ద ఉరకగెడ్డ జలాశయం బ్యాలెన్స్ పనులను గత ప్రభుత్వంలో 2023లో రూ.14.50 కోట్లకు ప్రతిపాదించారు. వాటిని కూటమి ప్రభుత్వ ఆమోదించలేదు. పెద్దేరునిధుల నిలిపివేత.. ప్రభుత్వ నిర్లక్ష్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేశారు. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమవగా, మరికొన్నింటికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో కొన్నింటిని రద్దు చేయడమే కాకుండా, మరికొన్నింటి టెండర్లను కూడా మార్చివేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 24 నెలలు పూర్తి కావస్తున్నా.. పాలకులు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు జలాశయాల పరిధిలో కాలువల పూడికతీత పనులకు, మరమ్మతులకు నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కొనసాగించకుండా ఈ ప్రభుత్వం రిజర్వాయర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది వర్షాకాలంతో పాటు, నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు ఈ జలాశయాల్లోకి భారీగా నీరు చేరినప్పటికీ, గేట్ల లీకేజీల వల్ల ఆ నీరంతా వృథాగా పోయింది. కనీసం ఈ ఖరీఫ్ సీజన్కు ముందైనా ప్రభుత్వం మరమ్మతులపై దష్టి పెడుతుందని ఆశించిన రైతాంగానికి నిరాశే మిగిలింది. ఇప్పటికై నా పాలకులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ఈ ఏడాది కూడా పంటలు పండక రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత
తుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమెతోపాటు జేసీ శౌర్యమాన్ పటేల్, ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాస్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. తద్వారా అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. అర్జీలు పునరావృతం అయ్యిందంటే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం పీజీఆర్ఎస్కు– 135 అర్జీలు, రెవెన్యూ క్లినిక్కు– 172 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు దివ్యాంగుల సహాయ పరికరాల నిల్వకు భవనం కేటాయించాలి నూతనంగా ఏర్పడిన జిల్లాలో నేటికి దివ్యాంగుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం విజయనగరం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించడం దారుణమని, దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, కృత్రిమ అవయవాలు, ఇతర సహాయక పరికరాల కోసం ఆ జిల్లా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు ఎక్కువ అవ్వడం, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి నూక అప్పారావు పీజీఆర్ఎస్లో వినతి అందించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ శాశ్వత కార్యాలయం ఏర్పాటయ్యే వరకు అనకాపల్లిలో దివ్యాంగుల పరికరాలు నిల్వ ఉంచుటకు తాత్కాలిక భవనాన్ని కేటాయించాలంటూ అధికారుల వద్ద మొర పెట్టుకున్నారు. దివ్యాంగులైన ఎస్.సిద్ధుకు ట్రై సైకిల్, జి.సాయికుమార్కు వీల్ చైర్ మంజూరు చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈ పార్క్కు వ్యతిరేకంగా రైతుల ధర్నా కె.కోటపాడు మండలం గొండుపాలెం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే నిలిపివేయాలని, ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్కు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి ఈర్లె నాయుడుబాబు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ఎటువంటి గ్రామసభ నిర్వహించకుండా తహసీల్దార్ కార్యాలయానికి కొంతమంది రైతులను రప్పించుకుని భయపెట్టి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తున్నారని, ఇది దుర్మార్గపు ఆలోచన అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రైతులను బెదిరిస్తున్నారని, దీన్ని ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిపారు. గొండుపాలెం సమీపంలో ఎంఎస్ఎంఈ పార్క్కు చేసిన శంకుస్థాపనను వెంటనే విరమించుకోవాలని, లేదంటే దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్. నాయుడు, ఆర్. రామకృష్ణ, ఆర్.మణి, ఈశ్వరరావు, దొగ్గ మహేష్, ఆర్. భారతి, బి.తారకేశ్వరకుమార్, రొంగలి మోహన్కుమార్, మహిళలు, రైతులు పాల్గొన్నారు. -
అప్పన్న షాపులకు బహిరంగ వేలం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన దుకాణాలకు ఈవో జె.వెంకటరావు సమక్షంలో బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. కొండపైన, దిగువన ఉన్న 25 దుకాణాలకు మూడేళ్ల కాలపరిమితికి నిర్వహించిన ఈ వేలంలో దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇందులో అత్యల్ప లీజు ధర రూ.1,600 కాగా, అత్యధికంగా కొండపై కేశఖండన శాల వద్ద ఉన్న దుకాణానికి రూ.33,951 లభించింది. అలాగే కొండపైన ప్రసాదాల విక్రయశాల వద్ద బయోడిగ్రేడబుల్ పేపర్ సంచులు విక్రయించుకునే హక్కును ఏడాది కాలపరిమితికి రూ.12 లక్షల భారీ మొత్తానికి దక్కించుకున్నారు. దేవస్థానంలో నిరుపయోగంగా ఉన్న ఐరన్ సామాగ్రి కేజీ రూ.27.50 చొప్పున, హుండీల్లో భక్తులు సమర్పించిన ఇత్తడి గంటలు, భజనతాళాలు, కుందులు కేజీ రూ.810 గరిష్ట ధరకు వేలం వెళ్లాయి. ఈ వేలం ప్రక్రియను దేవస్థానం ఏఈవోలు పిల్లా శ్రీనివాసరావు, రమణమూర్తి, సూపరింటెండెంట్లు రాజ్యలక్ష్మి, సత్యవాణి, సిబ్బంది చక్రవర్తి తదితరులు పర్యవేక్షించారు. -
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు
తుమ్మపాల: ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఈ నెల 28న విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని, ఈ మేరకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రచారం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన అధికారుల సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమం, స్టాప్ డయేరియా పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు పోలియో చుక్కలు వేయని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటి వద్ద తప్పనిసరిగా వేయాలని, శత శాతం లక్ష్యసాధన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 16 నుంచి జూలై 30వ తేదీ వరకు గ్రామాల్లో స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 6 ఏళ్లలోపు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులందరూ చిన్న పిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి నివారణ, ఓఆర్ఎస్ ద్రావణం తయారుచేసే విధానం, వ్యాధి గ్రస్తులైన పిల్లలకు జింక్ మాత్రలు పంపిణీ చేయడంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అఽధికారి డాక్టర్ హైమావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్, జిల్లా గణాంక అధికారి రామచంద్రరావు పాల్గొన్నారు. -
గండి బాబ్జీ దౌర్జన్యాలను అరికట్టాలి
మహారాణిపేట: పెందుర్తి మండలం రాణివారి కల్లాలు (సర్వే నెంబర్ 107/11) పరిధిలోని పేద ప్రజల నివాసాలపై టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను, భూ కబ్జాలను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి బాధితుడు కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాణివారి కల్లాల్లో దాదాపు 40 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నాయని, ఆ ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. గండి బాబ్జీ అనుచరులు జేసీబీలతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేస్తూ దౌర్జన్యానికి తెగబడుతున్నారని, దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి పేదలకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎస్. వెంకటలక్ష్మి, ఈసరాపు లక్ష్మి పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా సరిహద్దులో సారా బట్టీలపై దాడులు
మాడుగుల రూరల్: మండలంలోని శివారు గిరిజన గ్రామాల్లో సారా బట్టీలుపై దాడులు చేసి, పది లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, 800 లీటర్లు బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు మాడుగుల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఎల్. ఉపేంద్ర సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అల్లూరు జిల్లా సరిహద్దులో మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ బిళ్లలపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సారా బట్టీలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో సారా స్వాధీనం చేసుకుని, బెల్లం పులుపుతోపాటు వంటపాత్రలు ధ్వంసం చేశామన్నారు. బిళ్లలపాలెం గ్రామానికి చెందిన పళ్లేజు కొండమ్మ, పాడేరు మండలం అర్జాపురం, ఓబర్తి గ్రామాలకు చెందిన జోడి రాజు, జన్ని ఈశ్వరరావు, మడక జగ్గారావులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. విచారణలో నల్లబెల్లం తయారుదారుపై కేసు నమోదు చేశామని, త్వరలో అతడిని అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడుల్లో సీఐతోపాటు ఎస్ఐ కె. శ్రావణి, హెచ్సీలు కె. అప్పలనాయుడు, ఎం. గురునాయుడు, సిబ్బంది ఆనంద్, విజయ, కనకరాజు, పాల్గొన్నారు. -
ముద్దుర్తిలో అక్రమంగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు
చోడవరం: మండలంలోని ముద్దుర్తి గ్రామంలో అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని, చెరువు గర్భాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పికొండ లింగబాబు, పార్టీ మండల ప్రతినిధులు మోసూరి శ్రీనువాసరావు, మలపురెడ్డి అప్పలనాయుడు, బోడి అప్పలస్వామినాయుడు, సింగిరెడ్డి శ్రీను, గొర్లె తాతయ్య, మలపురెడ్డి శ్రీను, పట్టా కామేష్ ఫిర్యాదు చేశారు. ముద్దుర్తిలో నూకమ్మ చెరువును కొందరు ఆక్రమించుకున్నారని, దీనిపై వెంటనే స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరారు. చెరువులో మట్టిని, గ్రామానికి ఆనుకొని ఉన్న కొండ నుంచి గ్రావెల్ను, శారదానదిలో ఇసుకను అక్రమను తవ్వకాలు చేసి తరలిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని, స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు పత్రాన్ని తహసీల్దార్ రామారావుకు అందజేశారు. -
ఏయూ‘ లెక్క’ తప్పుతోందా?
విశాఖ విద్య : ఏ సంస్థకై నా ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి. ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆదాయ వ్యయాలకు సంబంధించి పూర్తిస్థాయి వార్షిక నివేదికను రూపొందించుకుని, ఆ తర్వాతే తదుపరి సంవత్సరానికి బడ్జెట్ ప్రణాళికను ఆమోదించుకోవడం సంప్రదాయం. అయితే ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు బడ్జెట్ ప్రణాళిక రూపొందించడం, దానిని ప్రవేశపెట్టడం, పాలకమండలి ఆమోదం పొందడం వంటి ప్రాథమిక ప్రక్రియలేవీ జరగకుండానే వర్సిటీలో యథేచ్ఛగా లెక్కలేనన్ని ఖర్చులు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెల ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా బడ్జెట్ ఊసే లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అకౌంట్స్ నిర్వహణపై అనుమానాలు వర్సిటీ అకౌంట్స్ నిర్వహణకు సంబంధించి పారదర్శకత కోసం ఫైనాన్స్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. పదేళ్లుగా ప్రభుత్వమే ఏయూ ఆదాయ వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తోంది. అయితే గత ఏడాది మే 31న అప్పటి ఫైనాన్స్ ఆఫీసర్ పదవీ విరమణ చేసిన తర్వాత, ఆ స్థానంలో సమర్థుడైన పూర్తిస్థాయి అధికారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ట్రెజరీ, కాగ్, ఆడిట్ లేదా ఇతర యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసి ఈ పోస్టును భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాత్కాలిక పద్ధతిలో బాధ్యతలు అప్పగించాలనుకుంటే వర్సిటీలో ప్రస్తుతం ఏడుగురు డిప్యూటీ రిజిస్ట్రార్లు ఉన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన వారిలో ఒకరికి అకౌంట్స్ విభాగం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, కావాలనే జూనియర్ అయిన ఒక అధికారికి ఈ బాధ్యతలు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టు ఖాళీ అయిన రెండు నెలల్లోనే భర్తీ చేయగా, ఇప్పుడు ఏడాది దాటినా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఆమోదం లేకుండానే ఎడాపెడా కేటాయింపులు జరిగిపోతుండటం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ 50 కోట్లకు లెక్కలు ఏవీ? పూర్తిస్థాయి ఫైనాన్స్ ఆఫీసర్ లేకపోవడం, బడ్జెట్ ఆమోదం కాకపోవడం వంటి పరిణామాల మధ్యే.. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏయూ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కోసం సుమారు రూ.50 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఈ ఖర్చులకు సరైన లెక్కలు ఉన్నాయా లేదా అనేదానిపై ఏయూ వర్గాల్లో రకరకాల ప్రచారం సాగుతోంది. ఏ విభాగానికి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఏయూ ఆర్థిక వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి పెత్తనం ఉన్నప్పటికీ, జరుగుతున్న అక్రమాలపై అధికార యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని విశ్వవిద్యాలయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ, ఖాతాల నిర్వహణను రహస్యంగా ఉంచుతోందని, ‘ఏయూ ఎలా పోతే మనకేంటి’ అనే ధోరణిలో వ్యవహరిస్తోందని మాజీ ఆచార్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చీవాట్లు? ఏయూలో అకౌంట్స్ నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోందనే అంశంపై గత మార్చి నెలలో విశాఖ పర్యటనకు వచ్చిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లెక్కల విషయంలో పారదర్శకత లోపించడంపై కమిటీ సభ్యులు అధికారులను గట్టిగా మందలించి నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి ఏయూ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దకపోతే, ఈ శతాబ్దాల చరిత్ర గల ప్రతిష్టాత్మక సంస్థ భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తుందోనని విద్యావేత్తలు, వర్సిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
వారం రోజుల్లో బాధితులకు న్యాయం
తుమ్మపాల: బాధితుల ముఖంలో నవ్వే పోలీసు వ్యవస్థకు అసలైన కొలమానమని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి బాధితుడికి న్యాయం చేయాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు జరగాలన్నారు. స్టేషన్లో కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపాలని, విచారణ ముగిసిన వెంటనే తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, మహిళలను, సామాన్యులను మోసగించే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతామన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని, ప్రజలకు అండగా నిలవడానికి పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ వారం మొత్తం 60 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి
కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి చెందింది. సీఐ అల్లు స్వామినాయుడు ఆదివారం అందించిన వివరాల ప్రకారం..మునగపాక మండలం కుమార పురం గ్రామానికి చెందిన అగ్గాల కుమారి (20) ఆటోలో అనకాపల్లికి శనివారం వెళుతుండగా మార్గ మధ్యంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆటో స్టీరింగ్ లాక్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కుమారి త్రీవంగా గాయపడింది. ఆమెను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ శనివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతురాలి చెల్లి గ్రేస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ చెప్పారు. మృతురాలు కుమారి స్టాఫ్ నర్స్గా శిక్షణ పొందుతోందని, ఆమె తల్లిదండ్రులు అగ్గాల లక్ష్మి,సూరిబాబు, సోదరి ఉన్నారని సీఐ తెలిపారు. -
ఏయూపై రాజకీయ రాహు–కేతువులు!
విశాఖ విద్య: వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రస్తుతం విద్యా, పరిశోధన అంశాల కంటే రాజకీయ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత విభేదాలే ప్రధాన చర్చగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ వైస్ చాన్సలర్, గత పాలకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తరచూ ఆరోపణలు చేయడం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనివల్ల ఏయూ ప్రతిష్ట దెబ్బతింటోందని ఉద్యోగులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరి బాధ ఏమిటి? ఏయూ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. పోస్టింగులు, పదోన్నతులు, పరిపాలనా నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం అధికమైందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ భవిష్యత్తు కంటే గత పాలకవర్గంపై విమర్శలకే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు స్పష్టంగా లేకపోయినా విచారణలు జరపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది. తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వానికే నష్టం చేస్తుందని కూటమి వర్గాల్లోనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోతికాడ గుంటనక్కలా... ఏయూ ప్రతిష్ట దెబ్బతింటే తమ విద్యాసంస్థలకు లాభం చేకూరుతుందనే ఆలోచనతో మరో ప్రజాప్రతినిధి, టీడీపీకి చెందిన కీలక నేత వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా యూనివర్సిటీ వర్గాల్లో సాగుతోంది. ఏయూకు సంబంధించిన ప్రతి వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ ర్యాంకింగ్స్, గుర్తింపుల విషయంలో ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న యూనివర్సిటీపై బయటకు ఆందోళన వ్యక్తం చేస్తూనే, లోలోపల దాని బలహీనతలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలోని కొందరు వర్గాలు కూడా అలాంటి ప్రయత్నాలకు సహకరిస్తున్నాయనే ప్రచారం కొనసాగుతోంది. కాపాడతారా... రాజకీయాలకు బలి చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ఆంధ్రా యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సంస్థపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు, ప్రయోజనాల రాజకీయాలు ప్రభావం చూపడం పట్ల మాజీ ఆచార్యులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని, తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదని హెచ్చరిస్తున్నారు. విద్యా సంస్థలను రాజకీయాలకు బలి చేయకుండా వాటి అభివృద్ధి, ప్రతిష్ట పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. తప్పులెంచువారు.. ఏయూ వ్యవహారాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత మేరకు సఫలమయ్యారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే విషయంలో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యేపై కూడా ప్రజల కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అసంతృప్తులతో ఏయూనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాసంస్థలను రాజకీయ పోరాటాలకు వేదికలుగా మార్చడం వల్ల నష్టపోయేది విద్యార్థుల భవిష్యత్తేనని వారు హెచ్చరిస్తున్నారు. -
రోలుగుంటలో అగ్నిప్రమాదం
ప్రమాద స్థలంలో కాలి బూడిదైన దుస్తులు, గృహ సామగ్రి రోలుగుంట: స్థానిక యాతవీధిలో బొందల సుబ్బలక్ష్మి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుస్తులు, గృహ సామగ్రి, ఖాతాదారులకు కుట్టాల్సిన కొత్త దుస్తులు కాలి బూడిదయ్యాయి. సుబ్బలక్ష్మి దర్జీ వృత్తి చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటోంది. శనివారం రాత్రి ఇంట్లో దీపం వెలిగించి పొరుగింటికి పని మీద వెళ్లింది. ఇంతలో ఇంట్లో నుంచి మంటలతోపాటు పొగ రావడంతో వెంటనే వచ్చి తలుపులు తీయగా, దుస్తులు, ఫర్నిచర్, తదితర గృహ సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వీఆర్వో ఎస్.కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ప్రభుత్వ పరిహారం కోసం నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని వీఆర్వో తెలిపారు. -
చేపల మృతిపై విచారణ జరపాలి
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట, బోయపాడు సముద్రతీరాల్లో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడుతున్న ఘటనపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ డిమాండ్ చేశారు. మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన చేపలను బోయపాడు తీరంలో ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థరసాయనాల వల్లే చేపలు మృత్యువాత పడుతున్నాయంటూ మత్స్యకారులనుంచి ఆరోపణలు వస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతాల్లో వేటాడిన చేపలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు. చేపల మృతిపై కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారు పూర్తిగా అధ్యయనం చేయాలని కోరారు. వ్యాధులుసోకి మరణించాయా, లేక సముద్రజలాలు కలుషితమయ్యాయా అనేది నిర్ధారించకపోతే దాని ప్రభావం మత్స్యకారుల ఉపాధిపై పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, పార్టీ కార్యదర్శి ఏరిపిల్లి నాగేశు, మత్స్యకార నాయకులు యజ్జల అప్పలరాజు, పిక్కి తాతీలు, పిక్కినూకరాజు, అప్పలరాజు,మైలపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అబ్దుల్ గఫార్ (17) అనే ఇంటర్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ ఎస్ఆర్ఎంటీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సత్తార్ కుమారుడు గఫార్ స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. సమీపంలోని పెట్రోల్ బంక్లో బైక్కు పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా.. ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయం వద్దకు రాగానే ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై గఫార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడి మృతి
మాడుగుల రూరల్: మండలంలోని ఘాట్రోడ్డు జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాగరం పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సురవరం గ్రామానికి చెందిన వసంత కుమారస్వామి(40) ఘాట్రోడ్డు సమీపంలో సాగరం వైపు నడిచి వస్తుండగా, చోడవరం నుంచి పాడేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని 108 వాహనంలో మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వీసీబీ డివిడెండ్ 10 శాతం
చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ● ఘనంగా వీసీబీ మహాజన సభ మాట్లాడుతున్న బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణబీచ్రోడ్డు: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది 10 శాతం డివిడెండ్ను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు బ్యాంక్ చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఆదివారం సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో వీసీబీ మహాజన సభ ఘనంగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలనా, ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు తెలిపారు. బ్యాంకు లాభాల్లో డివిడెండ్ మొత్తం రూ.39.24 కోట్లుగా ఉందని, మిగిలిన లాభాలను చట్టపరమైన నిష్పత్తుల్లో ఆయా ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు రూ.66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఈ ఏడాది చివరకు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖ నగరం, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభించి, బ్రాంచ్ల సంఖ్యను 68కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, సి.కృష్ణ మోహన్, ఉప్పలపాటి పార్వతీదేవి, చలసాని రాఘవేంద్ర రావు, ఎస్.నాగభూషణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు కుమార్తెల పుస్తకాల ఖర్చు రూ.17వేలు
నా ఇద్దరు కుమార్తెలు యలమంచిలి ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు.చిన్న కుమార్తె 2వ తరగతి పుస్తకాలకు రూ.8వేలు,పెద్ద కుమార్తె 5వ తరగతి పుస్తకాలకు రూ.9999 తీసుకున్నారు.ఇది కాకుండా యాప్ కోసం ఏడాదికి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున కడుతున్నాను.ఫీజు కూడా ఇద్దరికీ కలిపి రూ.50 వేలు అవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించవలసి వస్తోంది.ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.నిబంధనలు అమలు చేస్తే తల్లిదండ్రులందరికీ ప్రయోజనం ఉంటుంది. – చాకలి నూకరాజు,యలమంచిలి -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి చిన్నారి బలి!
మధురవాడ: అధికారుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మధురవాడ సమీపంలోని సాయిరాం కాలనీ జీసీసీ లేఅవుట్లో విద్యుత్ షాక్తో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి ఉపాధి కోసం విశాఖకు వచ్చిన కురిటి నారాయణరావు, చిన్నమ్మలు దంపతులు సాయిరాం కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొడుకు కురిటి అఖిల్(6) స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బంతి కోసం వెళ్లి... అనంత లోకాలకు! ఆదివారం ఉదయం అఖిల్ తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బంతి ప్రమాదవశాత్తు ‘శ్రీ రేణుక అపార్ట్మెంట్’ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ పైపుల వద్దకు వెళ్లింది. బంతిని తెచ్చేందుకు అఖిల్ అక్కడికి వెళ్లగా, తెగిపోయి బయటకు ఉన్న వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. యూజీడీ పనులే కారణం? సదరు ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ పనుల వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పనుల క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తెగిపోయి బయటకు వచ్చేసిందని, దానివల్లే విద్యుదాఘాతం సంభవించిందని ఆరోపిస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్ఈ శ్యామ్బాబు, ఈఈ సింహాచలం నాయుడు, డీఈ కిరణ్కుమార్ తదితరులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. యూజీడీ కేబుల్ పనుల వల్లే ఎర్త్ వైర్ కట్ అయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలి విద్యుత్ శాఖ, శ్రీ రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి కురిటి అఖిల్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి బాధితులతో కలిసి సాయిరాం కాలనీలోని రేణుక అపార్ట్మెంట్ వద్ద ధర్నా చేశారు. -
సింహగిరిపై...
సింహాచలం: సింహగిరిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ప్రారంభించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, సంస్కృతోన్నత పాఠశాల, వేద విద్యార్థులు, సేవా వలంటీర్లు, భక్తులు సుమారు వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వేదికపై దేవస్థానం వేదపాఠశాల విద్యార్థులు వేసిన ‘సూర్యరథం’ ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా గురువు జి.వెంకటరమణ, యోగా శిక్షకురాలు శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల సామూహిక షష్టిపూర్తి వేడుక
సామూహిక షష్టిపూర్తిలో పూర్వ విద్యార్థులు మాకవరపాలెం: పూర్వ విద్యార్థుల సామూహిక షష్టి వేడుక ఎంతో సందడిగా జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాలలో చదివిన 1980–81 టెన్త్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక శ్రీకన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా ఒకే వేదికపై కలుసుకుని 45 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులకు 60 ఏళ్లు పూర్తి కావడంతో సామూహిక షష్టి పూర్తి కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 60 మందికిపైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
పిడుగు పాటుకు పాడి ఆవు మృతి
మృతి చెందిన పాడి ఆవు మునగపాక:మండలంలోని మడకపాలెంలో శనివారం రాత్రి పిడుగుపడి ఓ పాడి ఆవు మృతి చెందింది. మడకపాలెంలో పశువులను మేపుకుంటూ రైతు రాయి కుమార్ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఎప్పటిలాగానే పశువులకు గడ్డి వేసి ఇంటికి చేరుకున్నాడు.రాత్రి కురిసిన వర్షంతో పాటు ఉరుములు,మెరువులతో కూడిన పిడుగులు పడ్డాయి. ఈ సంఘఽటనలో కుమార్కు చెందిన ఆవు మృతి చెందింది. ఆవు ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.తనకు న్యాయం జరిగేలా చూడాలని కుమార్ కోరాడు. -
యువకుడిపై కత్తితో దాడి
ఆరిలోవ: జీవీఎంసీ13వ వార్డు పరిధి గిరిజన గ్రామం శ్రీకృష్ణాపురంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన యువకుడు విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఆరిలోవ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇరువురు యువకులు టీడీపీకి చెందినవారు కావడంతో తూర్పు ఎమ్మెల్యే రంగంలోకి దిగి కేసు లేకుండా చూడాలని ఆరిలోవ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన యువకుడు మారిక శివకుమార్ తండ్రి జక్కన్న తెలిపిన వివరాలు ప్రకారం.. దగ్గర బంధువైన బత్తిన అప్పలరాజు ఆస్తి వ్యవహారంలో తన కుమారుడితో తరుచూ గొడవకు దిగుతున్నాడన్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే వ్యవహారంలో తన కుమారుడిపై దాడి చేయగా..స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కుమారుడు శివకుమార్పై అప్పలరాజు కత్తితో దాడి చేశాడని, అప్పలరాజు వల్ల నా కుమారుడు, మా కుటుంబానికి ప్రాణ హాని ఉందని జక్కన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్ని రాజకీయం చేకుండా పోలీసులు కేసు నమోదు చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబీకులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సూచనలతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు కేసు లేకుండా పోలీసులుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. -
ప్రశాంతంగా నీట్
విశాఖ విద్య: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ–ఎగ్జామ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లాలోని మొత్తం 18 పరీక్ష కేంద్రాల్లో అధికారుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షను నిర్వహించారు. జిల్లాలో వ్యాప్తంగా 8,015 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7,298 మంది పరీక్షకు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. హాజరైన అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. 5,679 మంది మహిళా అభ్యర్థులు, 1,619 మంది పురుష అభ్యర్థులు పరీక్ష రాశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు నీట్ రీ–ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అన్ని పరీక్ష కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష ప్రక్రియ సాగింది. అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీరు, వైద్య సిబ్బంది వంటి కనీస సదుపాయాలను సైతం పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే అభ్యర్థులను తల్లిదండ్రులు స్వయంగా పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చారు. తమ పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యం చెబుతూ, వెంట తోడుగా నిలిచారు. కొందరు తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు కేంద్రాల బయటే వేచి ఉన్నారు. అభ్యర్థుల్లో ఉద్వేగ వాతావరణం నీట్ రీ–ఎగ్జామ్ కావడంతో హాజరైన అభ్యర్థుల్లో ఒక విధమైన ఉద్వేగ వాతావరణం స్పష్టంగా కనిపించింది. చాలా మంది అభ్యర్థుల ముఖాల్లో ముభావత, ఆందోళన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరోసారి పరీక్ష రాయాల్సి రావడంతో మానసికంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జేసీ విద్యాధరితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయ–2 పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.పరీక్ష కేంద్రం వద్ద హాల్టికెట్ తనిఖీ -
తీరానికి కాలుష్య గండం
నీలి సముద్రపు అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో దక్షిణ తీర ప్రాంత పర్యావరణం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ దూరస్పందన కేంద్రం శాస్త్రవేత్తలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. –సాక్షి, విశాఖపట్నం ‘మురుగు’తోనే ముప్పు ఎక్కువ తీర ప్రాంత సముద్ర కాలుష్యానికి నగరంలోని మురుగునీటి కాలువలు, డ్రైన్లే ప్రధాన కారణంగా మారాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కాలుష్యంలో సుమారు 41.6 శాతం వాటా మురుగునీటి ప్రవాహాలదేనని పరిశోధకులు గుర్తించారు. జీవీఎంసీ పరిధిలోని అనేక కాలువలు, గెడ్డల ద్వారా ప్రతిరోజూ భారీగా మురుగునీరు సముద్రంలోకి చేరుతోంది. నిబంధనల ప్రకారం ఈ నీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. నగర పరిధి, పెదగంట్యాడ, గాజువాక ప్రాంతాలు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూపరితల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఏర్పడుతున్న ‘ఉష్ణ ద్వీప’ పరిస్థితులు పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన సముద్ర కాలుష్య సూచిక ప్రకారం గంగవరం పోర్టు, విశాఖ హార్బర్ నుంచి గాజువాక, పెదగంట్యాడ వరకు ఉన్న దక్షిణ తీర ప్రాంతం తీవ్ర కాలుష్య ప్రభావంతో ప్రమాదకర మండలంగా మారుతున్నట్లు తేలింది. మేఘాద్రిగెడ్డ డ్రెయిన్ అవుట్లెట్, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ పరిసరాల్లో కాలుష్యం అధికంగా నమోదైనట్లు పరిశోధన వెల్లడించింది. సముద్ర జలాల నాణ్యత క్షీణించడంతో పాటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సముద్రపు నీటిలో పెరిగిన క్లోరోఫిల్–ఏ కాలుష్య కాసారాలుగా మారిన ఈ ప్రాంతాల్లోని సముద్రపు నీటిలో క్లోరోఫిల్–ఏ సాంద్రత, లవణీయత, నీటి కాలుష్య సాంద్రత, ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లోరోఫిల్–ఏ సాంద్రత పెరిగిపోతే.. సముద్రంలో నాచు దట్టంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఆల్గల్ బ్లూమ్ అని పిలుస్తారు. దీనివల్ల నాచు కుళ్లిపోయి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ని పూర్తిగా లాగేసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి చేపలు, ఇతర సముద్ర జీవులు ఊపిరాడక మృత్యువాత పడతాయి. ఇలాంటి ప్రాంతాల్ని డెడ్జోన్లుగా పిలుస్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కష్టమే కాలుష్య ప్రాంతాలుగా మారుతున్న తీరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి. జీవీఎంసీ, ఏపీపీసీబీ అధికారులు హాట్స్పాట్లను గుర్తించి తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా కట్టడి చేయకపోతే.. భవిష్యత్తులో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని పరిశోధన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణాలు పెద్ద డ్రైన్లు, గెడ్డలు – 41.6 శాతం పరిశ్రమలు, పోర్టులు – 23.7 శాతం అంతర్గత కాలువలు – 33.2 శాతం ఇతర కారణాలు – 1.5 శాతం ఆందోళనకరంగా మారిన నీటి నాణ్యత సూచీలు మేఘాద్రిగెడ్డ సముద్రంలో కలిసే ప్రాంతంతో పాటు.. మల్కాపురం, గాజువాక సమీప తీర ప్రాంతాల్లో క్లోరోఫిల్–ఏ స్థాయి అత్యధికంగా 14.8 ఎంజీ/మీటర్ క్యూబ్గా నమోదైంది. అదేవిధంగా.. నీటి కాలుష్య సాంద్రత రేటు 0.017 నుంచి 25.3 ఎన్టీయూ వరకు ఉండగా, కాలుష్య హాట్స్పాట్స్లో ఇది 20 ఎన్టీఏ కంటే ఎక్కువగా రికార్డు కావడం ఆందోళన కలగించే అంశం. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ తీరాల్లో కాలుష్య తీవ్రత ‘మధ్యస్థంగా’ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. నగరానికి ఉత్తరాన ఉన్న భీమిలి తీరం మాత్రం చాలా తక్కువ కాలుష్యంతో ప్రశాంతంగా ఉంది. కానీ గోస్తనీ నది సముద్రంలో కలిసే చోట వ్యవసాయ వ్యర్థాలు, పూడిక కారణంగా కొంత మేర కాలుష్య ప్రభావం కనిపిస్తోందని పరిశోధనలు స్పష్టం చేశాయి. సముద్ర తీరం వెంబడి 15 కిమీ మేర శాటిలైట్ ద్వారా సేకరించిన వివరాలివీ.. -
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం
అచ్యుతాపురం ఏఈ శ్రీనివాసరావు అచ్యుతాపురం రూరల్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అచ్యుతాపురం ఏఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయమై ఆదివారం ఆయన అవగాహన కల్పించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడి రోడ్లపై, నీటిలో పడే ప్రమాదముందని, అలాంటి పరిస్థితుల్లో వెంటనే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు ఆనుకున్న చెట్లు, ఇతర వస్తువులను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో తడి చేతులతో విద్యుత్ స్విచ్లు, పరికరాలను ఉపయోగించకూడదు. పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. ఎటువంటి విద్యుత్ ప్రమాదం, లోపం గమనించినా వెంటనే టోల్ ఫ్రీ 1912 నంబరుకు సమాచారం ఇవ్వాలి. ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన’ను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి పైకప్పులపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. అర్హులైన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీ అందిస్తుంది. సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకున్నాక ఉత్పత్తి అయ్యే విద్యుత్ను స్వీయ అవసరాలకు వినియోగించుకోవాలి. అదనపు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశముంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిందని, ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందవచ్చునని ఏఈ తెలిపారు. -
ఘనంగా యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొని సామూహికంగా యోగాసనాలు వేశారు. యోగా అనేది ఆరోగ్య మంత్రం అని ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని నేతలు సూచించారు. యోగా.. జీవన శైలిలో భాగం కావాలి తుమ్మపాల: యోగాను ప్రతిఒక్కరూ తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం అనకాపల్లి మండలం శంకరంలో గల బొజ్జన్నకొండ వద్ద యోగాంధ్ర – 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని సంతోషకరమైన కుటుంబ జీవనం సాధ్యమవుతుందన్నారు. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. యోగా ద్వారా మానసిక సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. మన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచవచ్చన్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట సమయం యోగాకు కేటాయించాలని చెప్పారు. ముందుగా తల్లిదండ్రులు యోగా సాధన చేస్తేనే, వారిని చూసి పిల్లలు కూడా అలవర్చుకుంటారన్నారు. అందరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుని,ఒత్తిడి లేని, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థకు, సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలల్లో యోగా విధిగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో అనకాపల్లి జిల్లా బృందం ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర, జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు విశిష్ట సేవలు అందించిన యోగా గురువులకు అతిథుల చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేటు దోపిడీ
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు యథేచ్ఛగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని నమ్మించి నట్టేట ముంచుతున్నాయి. పాఠశాలలపై నిఘా ఉంచాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు 401 వరకు ఉండగా, 60వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.యలమంచిలి రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పంచాయతీల్లో 1 నుంచి 5 తరగతులకు 10 వేల వరకు, 6 నుంచి 10 తరగతులకు 12 వేల వరకు, మున్సిపాలిటీల్లో 1 నుంచి 5 తరగతులకు 11 వేలు, 6 నుంచి 10 తరగతులకు 15 వేలవరకూ వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికితోడు యూనిఫాం, పుస్తకాలు, షూ, టై పేరిట భారీగా దోపిడీ చేస్తున్నాయి. జీవో నంబర్లు 1, 53 ప్రకారం విధిగా విద్యాశాఖ నిర్ధేశించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. స్కూలు ప్రాంగణాల్లో యూనిఫాం,పుస్తకాలు,బ్యాగులు,ఇతర విద్యా సామగ్రి విక్రయించకూడదు. కానీ చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు జీవోలను తుంగలో తొక్కుతున్నాయి.విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ,నియంత్రణ కొరవడడంతో తాము చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో ఉన్న బడా ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ టీడీపీ,కూటమి పార్టీల నేతలవే కావడంతో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు నోరుమెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపార కేంద్రాలుగా.. ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. విద్యను అంగడి సరుకుగా మార్చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను బాగా చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆశతో ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్లవైపు అడుగులు వేస్తున్నారు.అదే అదునుగా భావించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.అడ్మిషన్ ఫీజు మొదలుకుని టై,షూ,బెల్టులతో పాటు పుస్తకాల వరకూ అన్నీ వారే సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు సామగ్రి,పుస్తకాలు,యూనిఫాం తదితరాలు విక్రయిస్తున్నారు. స్కూళ్ల పేరుతో కాకుండా వేరే పేర్లతో బిల్లులు తల్లిదండ్రులకు ఇస్తున్నారు.జీఎస్టీ భారీగా ఎగవేస్తూ లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రత్యేక బ్యాచ్ల పేరుతో మోసం కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో బ్రాంచ్లో ఒక్కో ధర ఉంటుంది.ఐఐటీ,ఈ టెక్నో,స్పార్క్ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నారు.పాఠశాలల్లో అడ్మిషన్ల సమయంలో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించకూడదనే నిబంధన ఉంది.అయితే పలు పాఠశాలల్లో ముందస్తుగా ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు.విద్యార్థుల నైపుణ్యాల్లో తారతమ్యాలు సృష్టించి మానసికంగా కుంగి పోయేలా చేస్తున్నారు.ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బ్యాచుల్లో ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు.2026–27 విద్యా సంవత్సరం ప్రారంభానికి మూడు నెలల ముందే ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లను చేపట్టినా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.నోరు మెదపని అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు,కార్పొరేట్ యాజమాన్యాల పాఠశాలలు నిర్వహిస్తున్న అడ్డగోలు ఫీజుల వసూళ్లు,పుస్తకాలు,ఇతర సామగ్రి విక్రయాల దోపిడీని జిల్లా విద్యాశాఖ అధికారులు అరికట్టాల్సి ఉంది.ఆయా పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీ పర్వం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదు.ఎంఈవోలు,డీవైఈవోలు తనిఖీలు చేయడం లేదు.ఆయా విద్యాసంస్థల నిర్వాహకులతో విద్యాశాఖ అధికారులు లాలూచి పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.ముందస్తు అడ్మిషన్లు,అడ్డగోలు ఫీజుల వసూళ్లు,పుస్తకాల విక్రయాలపై తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అడ్డుకట్టప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న అడ్డగోలు వసూళ్లు, అక్రమాలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా జీవో నంబరు 53 ను జారీ చేసింది.ఎక్కడైనా తల్లిదండ్రులు ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీపై ఫిర్యాదు చేస్తే నేరుగా ఆయా పాఠశాలల్లో కమిషన్ సభ్యులు,అధికారులు తనిఖీలు చేపట్టేవారు. రెట్టింపు ఫీజులు.. వేలల్లో పుస్తకాల ఖర్చులు జీవోలు కాగితాలకే పరిమితం మామూళ్ల మత్తులో అధికారులు కూటమి నేతల అండతో స్కూళ్ల ఇష్టారాజ్యం తల్లిదండ్రులు విలవిల అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు,యూనిఫాం,ఇతర సామగ్రి అమ్మకాలు చేయకూడదు. ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పుస్తకాల అమ్మకాల విషయంలో తల్లిదండ్రులు నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నాం.తల్లిదండ్రులు దానిని సద్వినియోగపర్చుకోవాలి.ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాల విక్రయాలపై ఎంఈవోలు తనిఖీలు చేయాలని ఆదేశించాం. – గిడ్డి అప్పారావు నాయుడు, డీఈవో,అనకాపల్లి -
ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చేస్తామంటున్నారు
నా కుమారుడు,కుమార్తె యలమంచిలి సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుతున్నారు.నా భర్త ఓ దినపత్రికలో జర్నలిస్టు.నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించినపుడు ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. స్కూలులోనే పుస్తకాలు అమ్ముతున్నారు.దీనిపై కలెక్టరుకు యాజమాన్యంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.ప్రభుత్వం నిబంధనలు పెట్టినప్పుడు వాటిని అమలు చేయకపోతే ఎవరూ ప్రశ్నించకూడదన్న స్వభావం స్కూలు యాజమాన్యంలో కనిపిస్తోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వలన,తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. – గొల్లవిల్లి జానకి,ధర్మవరం,యలమంచిలి -
రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
అనకాపల్లి: స్థానిక శారద బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి(70) మృతదేహం లభించినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి శనివారం తెలిపారు. నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పారు. మృతదేహం వద్ద గల బ్యాగ్మీద తమిళ అక్షరాలు ఉన్నాయని, బ్యాగ్లో పరిశీలించగా ఐదు కిలోల సన్నబియ్యం, ఎస్.ఎ.బాలమ్, అరంగనూర్, పాండిచ్చేరి అనే వివరాలు కనిపించాయని ఎస్ఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించాలన్నారు. -
విద్యుత్ సామగ్రి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
నిందితులతో ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం: విద్యుత్ వైర్ల కాయిల్స్ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు శనివారం తెలిపారు. నర్సీపట్నం, తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వచ్చిన వి.బి.ఆగ్రహారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా 30 కిలోల విద్యుత్ కాయిల్స్ పట్టుబడినట్టు చెప్పారు. వీటిని ఎక్కడో దొంగిలించి తునిలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టుగా విచారణలో తెలిందన్నారు. ఇలాంటి విద్యుత్ సామగ్రి కొనుగోలు, విక్రయాలు చట్టరీత్యా నేరమన్నారు. -
ఇద్దరు విద్యార్థినులకు సెంట్రల్ వర్సిటీల్లో సీట్లు
మాడుగుల రూరల్ : మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు వివిధ సెంట్రల్ యూనివర్శిటీల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధించారని, కళాశాల ప్రిన్సిపాల్ పి.జయ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల బీఎస్పీ విద్యార్థిని పి.మల్లేశ్వరి సెంట్రల్ యూనివర్సీటీ ఆఫ్ తమిళనాడులో ఎంఏ ఇంగ్లిష్లో సీటును సాధించగా, కళాశాలకు చెందిన మరో బీఏ విద్యార్థిని, సి.హెచ్. ఏసుకుమారి, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళలో ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్సు అండ్ పోలిటికల్ సైన్సు విభాగంలో సీటు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా అధ్యాపకుల నిరంతర శిక్షణ పర్యవేక్షణతో ఈ విజయాన్ని సాధించగలరన్నారు. ఈ విద్యార్థులను కళాశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
స్వయం సమృద్ధిపై అవగాహన కల్పించాలి
పాయకరావుపేట : స్ధానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకు శనివారం పతంజలి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, పతంజలి విశ్వ విద్యాలయ ఉపకులపతి డా.ఆచార్య బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో వ్యర్థాల నుంచి పర్యావరణ రక్షణ చేస్తూ పునర్వినియోగం చేసే విధానంపై విద్యా సంస్థల యాజమాన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సౌథంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం, ఆయుర్వేద చికిత్సాలయ జౌషధ వనం, నూతనంగా నిర్మించిన పరిపాలనా విభాగ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా శక్తిని, యోగా ద్వారా ఐక్యతను చాటి చెప్పాలని కోరుకుంటున్నామన్నారు. విద్యార్థి దశలోనే స్వయం సమృద్ధి, సంపాదన గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యమన్నారు. విదేశాల్లో ఎంత ధనవంతుడైనా వారి పిల్లలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత స్వయం సమృద్ధి సాధిస్తారని, కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదన్నారు. ఏ పిల్లలైతే ఎక్కువగా సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారో వారు ఎప్పటికీ ఒత్తిడికి గురి కారని తెలిపారు. మున్ముందు పతంజలి స్కూల్లో కూడా శ్రీ ప్రకాష్ విద్యా సంస్ధల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్ట్ మోడల్ను అమలు చేద్దామనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఆచార్య బాలకృష్ణను నరసింహరావు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్. అధ్యక్షులు కంటిపూడి నరేంద్రబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జిల్లాలో 107
కొత్త పోలింగ్ కేంద్రాలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడుతున్న ఇన్చార్జి డీఆర్ వో శ్రీనివాసరావు చిత్రంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసునాయుడుసాక్షి, అనకాపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశాల మేరకు జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ(రేషన్లైజేషన్) ప్రక్రియను చేపట్టారు. పోలింగ్ స్టేషన్ల హద్దులు, లొకేషన్లు, పేర్ల మార్పులపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనపు పోలింగ్ కేంద్రాలు అవసరమని తేల్చారు. కొత్తగా 107 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుర్తింపు పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,200 గా ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరినా లేదా కూల్చివేసినా.. వాటి స్థానంలో అదే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో కొత్త భవనాలను పోలింగ్ కేంద్రాలుగా(ఈఆర్వో/ ఏఈఆర్వో) అధికారులు ప్రతిపాదించారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో మార్పులు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఈఆర్వో ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వివరాలను నమోదు చేసుకుని, ప్రతిపాదిత మార్పులు, పేర్ల మార్పు, కొత్త కేంద్రాల జాబితాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసి, వారి నుంచి సలహాలు, అభ్యంతరాలను కోరారు. మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈఆర్వోల నుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం లొకేషన్ , పేర్ల మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల వివరాలు తెలియజేశారు. 1,636కి చేరిన పోలింగ్ కేంద్రాలు జిల్లాలో ప్రస్తుతం 1,529 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ సంఖ్య 1,636 కి చేరింది. అంటే జిల్లా వ్యాప్తంగా కొత్తగా 107 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వివిధ కారణాల రీత్యా మొత్తం 6 కేంద్రాల లొకేషన్లను మార్చగా, భవనాల మార్పుల కారణంగా 55 కేంద్రాల పేర్లను సవరించారు. అత్యధికంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 43 కేంద్రాల పేర్లను మార్చగా.. అత్యధికంగా చోడవరం నియోజకవర్గంలో 29 కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు ఇవే.. ●చోడవరం నియోజకవర్గంలో 243 పోలింగ్ స్టేషన్లకు అదనంగా మరో 29 ప్రతిపాదించి, మొత్తం 272 పోలింగ్ స్టేషన్లుగా ఆమోదించారు. ●మాడుగుల నియోజకవర్గంలో 235 పోలింగ్ స్టేషన్లకు అదనంగా మరో 3 ప్రతిపాదించి, మొత్తం 238 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు ●అనకాపల్లి నియోజకవర్గంలో 251 పోలింగ్ స్టేషన్లకు అదనంగా మరో 24 ప్రతిపాదించి, మొత్తం 275 పోలింగ్ స్టేషన్లుగా ఆమోదించారు. ●యలమంచిలి నియోజకవర్గంలో 246 పోలింగ్ స్టేషన్లకు అదనంగా మరో 20 ప్రతిపాదించి, మొత్తం 266 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ●పాయకరావుపేట నియోజకవర్గంలో 292 పోలింగ్స్టేషన్లకు అదనంగా మరో 20 ప్రతిపాదించి, మొత్తం 312 పోలింగ్ స్టేషన్లుగా ఆమోదించారు. ●నర్సీపట్నం నియోజకవర్గంలో 262 పోలింగ్ స్టేషన్లకు అదనంగా మరో 11 ప్రతిపాదించి, మొత్తం 273 పోలింగ్ స్టేషన్లుగా ఆమోదించారు. ఓటరుకు ఓటు హక్కును సులభతరం చేసేందుకే ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లు ప్రాతిపదికన తీసుకుంటే ఓటరు తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మరింత సులభతరంగా మారుతుందనే ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియతో పోలింగ్ కేంద్రాలు పెంపునకు ప్రతిపాదనలు చేశామని ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల అంగీకారంతోనే ఈ ప్రతిపాదనలు పంపించామన్నారు. ‘సర్’ ప్రక్రియలో ఎటువంటి అభ్యంతరాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. అనంతరం వారి నుంచి క్షేత్రస్థాయిలో ఓటరు సవరణ ప్రక్రియలో సమస్యలను, అసౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ నుంచి ఉత్తరాంధ్ర జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డెపల్లి హేమంత్కుమార్తో పాటు ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరి చొప్పున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసునాయకుడు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, వివిధ రాజకీయ పార్టీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
దళితుల హక్కుల పరిరక్షణకు కమిషన్ కట్టుబడి ఉంది
అచ్యుతాపురం రూరల్ : దళితుల హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఎస్సీ సెల్ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. శనివారం మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు తట్టా రాజు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయంలో దళితుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూ వివాదాలు, అసైన్డ్ భూములు, జిరాయితీ భూములకు సంబంధించిన సమస్యలను వివరించారు. ముఖ్యంగా దళిత రైతుల భూములు పెత్తందారుల ఆధీనంలో ఉన్నాయని ఫిర్యాదు చేయగా, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సీతారాం అన్నారు. ఈ అంశాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్ఈజెడ్ జోనల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన, ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులను వినియోగించి వీధులు, ఇతర సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. మార్టూరు గ్రామంలో పరిశ్రమల కారణంగా భూములు కోల్పోయిన దళిత రైతులు, నిరుద్యోగులకు ఏటీసీ టైర్స్ యోకోహమా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యానికి సూచిస్తామన్నారు. కార్యక్రమంలో అచ్యుతాపురం తహసీల్దార్ డి.శ్రీను, సీఐ చంద్రశేఖర్ రావు, దళిత నాయకులు తట్టా పెంటయ్యనాయుడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి అప్పారావు, మండల కార్యదర్శి మైలపల్లి రాహుల్, కోశాధికారి ఈరిగల సంతోష్ కుమార్, తట్టా ధనలక్ష్మి, ఊషా నాగరాజు, డీవీఎమ్సీ సభ్యుడు ఎండీ రాజు, సహదేవుడు, బోణి గణేష్ పాల్గొన్నారు. ఎంపీడీవో గైర్హాజరుపై మండల సభ్యుల ధ్వజం -
భూగర్భ జలాల పెంపునకు కృషి
● ఎస్పీతుహిన్ సిన్హాఎస్పీ కార్యాలయంలో నీరు–మీరు కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నీరు–మీరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం కేవలం శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక బాధ్యతను నిర్వహించడంలోనూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్, కార్యాలయం, గృహాల వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహనరావు, సీఐలు బాల సూర్యారావు, టి.లక్ష్మి, శ్రీనివాస రావు, సతీష్, పిల్లా రమేష్, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మా ఇంటి బంగారానికి విశేష ఆదరణ
● హీరో గవిరెడ్డి శ్రీనివాస్నర్సీపట్నం:‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందని నటుడు గవిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సినిమా విజయవంతం కావడంతో శుక్రవారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సమంత ప్రధాన పాత్రలో నటించగా తాను అల్లుడిగా నటించానని తెలిపారు. కుటుంబంలో కోడలి పాత్ర ఎలా ఉండాలనే కథా అంశం ఆధారంగా చిత్రాన్ని నిర్మించామన్నారు. శుభం సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పిందని, మా ఇంటి బంగారం మరింత క్రేజ్ తెచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తాను హీరోగా నటించిన ఎఫిక్, ఆత్రేయపురం బ్రదర్స్, చీన్ టపాస్ డుం డుం చిత్రాలు జూన్, జూలైలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ తాను సినిమారంగంలోకి అడుగుపెట్టేందుకు బాటలు వేసిందన్నారు.18 ఏళ్ల తన సినిమారంగం ప్రయాణంలో కథా రచయిత, దర్శకుడుగా పేరు తెచ్చుకున్నానన్నారు. హీరోయిన్ సమంత శుభం చిత్రం దగ్గర నుంచి మా ఇంటి బంగారం వరకు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారన్నారు. తాను పుట్టిన ప్రాంతమైన నర్సీపట్నంలో మా ఇంటి బంగారం సినిమా కుటుంబ సభ్యులు, తన స్నేహితుల మధ్య చూడటం ఆనందంగా ఉందన్నారు. హీరో గవిరెడ్డి శ్రీనివాస్ వెంట సినిమా యూనిట్ లోకల్ మేనేజర్ షేక్ రజాక్, చీన్ టపాస్ డుం డుం నిర్మాత నాగులపల్లి శ్రీను ఉన్నారు. -
అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా?
చోడవరం : కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే గొంతునొక్కి అక్రమ అరెస్టులు చేయడమే పనిగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్సార్సీపీ యువజన విభాగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ చోడవరం కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, తాజా మాజీ కార్పొరేటర్, యూత్ విభాగం ప్రతినిధి జాజుల రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక వారిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధంలేని తమ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానుమూరి సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యువజన విభాగం ఖండిస్తుందని, ఇటువంటి అక్రమ అరెస్టులకు తాము భయపడేదిలేదన్నారు. 2014–19మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, బెల్టుషాపులు విచ్ఛలవిడిగా నిర్వహించడం వల్ల అనేక నేరాలు జరిగాయన్నారు. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం అమ్మకాలపై అనే కఠిన నిబంధనలు విధించి షాపుల సంఖ్యలో 40 శాతానికి తగ్గించి, బెల్టు షాపులు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారన్నారు. దీనివల్ల గడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నేరాల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిందన్నారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు ఇచ్చి, ఎక్కడికక్కడ షాపులు పెట్టి, అక్రమంగా బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లు నిర్వహించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్ల ఎక్కడపడితే అక్కడ మద్యం బాబులు రోడ్లపై గొడవలు చేస్తుండడంతో మహిళలు, స్కూల్ పిల్లలు, పెద్దలు భయాందోళనకు గురికావలసి వస్తుందన్నారు. మద్యం బాటిళ్లపై కూడా ధరలు పెంచి అక్రమ వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నారన్నారు. వాటిని అరికట్టలేని చంద్రబాబు ప్రభుత్వం అలాంటి అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తుందన్నారు. విద్య, వైద్యం, సూపర్సిక్స్ పథకాలు సకాలంలో సక్రమంగా ప్రజలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, అంతేకాని ఇలా అక్రమ అరెస్టులు, కేసులు పెట్టి ప్రశ్నించే గొతులు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రతిఘటించి రోడ్లపైకి వచ్చి ప్రజల తరపున ఆందోళనలు చేయాల్సి వుంటుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గొంది సిద్దు, కార్యదర్శి బొండా చిన్నారావు, ఉపాధ్యక్షుడు రుద్రనాయుడు, సభ్యులు పెచ్చేటి మణిరాజు, నియోజవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, మండల యూత్ అధ్యక్షుడు పల్లా ధనాజీ, ఉపాధ్యక్షుడు సంతోష్, సకలా సూరిబాబు పాల్గొన్నారు. -
పకడ్బందీగా రీసర్వే
గొలుగొండ: పకడ్బందీగా రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మండలంలో కృష్ణదేవి పేట అల్లూరి పార్కులో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. కొత్తమల్లంపేట రెవెన్యూ పరిధి లింగంపేటలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను ఆమె పరిశీలించారు. రీసర్వే పనులు సక్రమంగా ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.అక్కడ నుంచి గొలుగొండ వస్తూ మార్గమధ్యంలో బూరుగుమాను చెరువులో ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశం నిర్వహించారు. పనులు సక్రమంగా నిర్వహిస్తే గిట్టుబాటు ధరలు వస్తాయని తెలిపారు. ముందుగా గొలుగొండలో నిర్వహించిన స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీ పాఠశాల వద్ద ఆమె స్వయంగా చెత్త సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మండలం కేంద్రం గొలుగొండకు చెందిన పారిశుధ్య కార్మికులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీసం వేతనం రూ.10వేలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పనికి తగిన కూలి రావడం లేదు ఉపాధి పనులకు వెళ్లినా తగిన కూలి రావడంలేదని కలెక్టర్ విజయ్కృష్ణన్, జాయింట్ కలెక్టర్కు స్థానిక ఉపాధి కూలీలు మొరపెట్టుకున్నారు. రోజుకు కనీసం రెండు వందలు కూడా రావడం లేదని వారు చెప్పారు. కూలి పెరిగే విధంగా పనులు చేయించాలని స్థానిక అధికారులకు కలెక్టర్ సూచించారు. నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ, తహసీల్దార్ వి. శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనువాసరావు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి అనకాపల్లి: రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తూరు ఆర్టీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టెన్త్, ఇంటర్మీడియెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన రెవెన్యూ ఉద్యోగుల పిల్లలకు స్కాలర్ షిప్పులు, సర్టిఫికెట్లు అందజేశారు. అంతకుముందు ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశనుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించేందకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉంటూ మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ చిన్నారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జేసీ శౌర్యమాన్ పటేల్, డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆరోగ్య జీవనానికి రాజ్ యోగం
యోగాసనాలు చేస్తున్న రాజు తుమ్మపాల : ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని చెబుతూ అనకాపల్లి ఉడ్పేటకు చెందిన ప్రముఖ యోగా గురువు బి.గోవిందరాజు యోగా చైతన్యాన్ని విస్తరిస్తున్నారు. గతంలో చైనాలో యోగా శిక్షకుడిగా సేవలందించిన ఆయన, విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ స్వస్థలంపై ఉన్న ప్రేమతో తిరిగి వచ్చి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉడ్పేటలో ‘రాజ్ యోగా’ కేంద్రాన్ని స్థాపించారు. యువత ఒత్తిడిని జయించేలా.. యువతలో మొబైల్ ఫోన్, కంప్యూటర్ వినియోగం కారణంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని గోవిందరాజు తెలిపారు. వృద్ధులకు శారీరక చురుకుదనం, మహిళలకు ఆరోగ్య పరిరక్షణ, విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్యకర జీవనంపై అవగాహన రాజ్ యోగా కేంద్రంలో యోగా ఆసనాలతో పాటు ప్రాణాయామం, ధ్యానం, ఒత్తిడి నియంత్రణ పద్ధతులు, ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన శిక్షణతో అనేక మంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక శిబిరానికి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మందికి యోగా ప్రయోజనాలు చేరవేయాలని గోవిందరాజు లక్ష్యంగా పెట్టుకున్నారు. గోవిందరాజు పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమందికి యోగాసనాలపై శిక్షణ ఇచ్చి గురువులను తయారు చేశారు. అనకాపల్లిలో పదేళ్ల క్రితం మొదలుపెట్టిన యోగా కేంద్రం కొనసాగిస్తూ చైనాలో యోగాగురువుగా అవకాశం రావడంతో మూడేళ్ల పాటు అక్కడ యువతకు వివిధ యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాతృభూమిపై అభిమానంతో దేశానికి తిరిగివచ్చి యోగాసనాల ద్వారా స్థానికులకు అవగాహన చేసి ఆరోగ్యవంతుల్ని చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే జాతీయ అంతరాతీయ పోటీలలో పాల్గొనేలా యువతకు శిక్షణ ఇస్తున్నారు. యోగాతో ఆరోగ్య బాట నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ దోహదం చేస్తుంది. ప్రతి ఇంటిలో యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం’’ అనే సందేశంతో ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. – బి.గోవిందరాజు, యోగా గురువు, వ్యవస్థాపకుడు–రాజ్ యోగా కేంద్రంఅనకాపల్లి (ఉడ్పేట) రాజ్ యోగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువత -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బ్రాండిక్స్ బస్సు
● 15 మందికి స్వల్ప గాయాలుప్రమాదానికి గురైన బస్సులు అచ్యుతాపురం రూరం: బ్రాండిక్స్కు ఉద్యోగులను తరలించే బస్సు రాంగ్రూట్లో ప్రయాణించి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో 15మంది స్వల్ప గాయాలైనట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం చీమలాపల్లి సమీపంలో బ్రాండిక్స్ పరిశ్రమకు చెందిన బస్సు గాజువాక వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 15 మంది స్వల్పగాయాలైనట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు. -
తీరంలో చనిపోయిన చేపలను పరిశీలించిన ఆర్డీవో
బోయపాడులో మాట్లాడుతున్న ఆర్డీవో రమణ నక్కపల్లి: మండలంలో బోయపాడు తీరంలో చనిపోయిన చేపలను అడ్డురోడ్డు ఆర్డీవో వి.వి. రమణ శనివారం పరిశీలించారు. టన్నుల కొద్దీ చేపలు చనిపోయి ఒడ్డుకు చేరిన విషయం తెలుసుకున్న ఆయన బోయపాడు తీరానికి వెళ్లి పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతోమాట్లాడారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మత్స్యకార నాయకులు మహేష్ తదితరులు మాట్లాడుతూ హెటెరో కంపెనీ వారు పైపులైన్ల ద్వారా వ్యర్థ రసాయనాలు సముద్రంలోకి విడుదల చేయడం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. గతంలోకూడా పలు మార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని, అధికారులు సరైన నివేదికలు ఇవ్వకుండా కంపెనీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. తక్షణమే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన కంపెనీల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రమణ హామీ ఇచ్చారు. -
మద్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రం
దేవరాపల్లి: గ్రామాల్లో వీధి వీధిన విచ్చలవిడిగా బెల్టుషాపులు తెరిచిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చిందని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంపద సృష్టిస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. విశాఖప ట్నం బీచ్ పరిసరాలను బీర్లు, వైన్ ఇతర మత్తు పానీయాల విక్రయాలకు ఆవాసాలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. బీచ్ పరిసరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తదితర అంతర్జాతీయ కార్యక్రమాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహి స్తారని, అలాంటి ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
మురళీనగర్(విశాఖ): పాలిసెట్ ఫలితాలు వెలువడిన 40 రోజుల తర్వాత ఎట్టకేలకు పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిషికేషన్ జారీ అయ్యింది. ఈనెల 24 నుంచి జూలై 4వ తేదీ వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈసారి ఇంజినీరింగు ప్రవేశాల మాదిరిగానే ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఆన్లైన్ పరిశీలనలో సమస్యలు ఎదురైన అభ్యర్థులు మాత్రమే ఈనెల 25 నుంచి జూలై 1 వరకు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 4న ఆప్షన్ల మార్పిడికి అవకాశం కల్పించారు. జూలై 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 7 నుంచి 10వ తేదీ లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆ కాపీని సంబంధిత కాలేజీల్లో సమర్పించాల్సి ఉంటుంది. జూలై 7వ తేదీ నుంచే పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభమవుతాయి. అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ సమయంలో పాలిసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్తోపాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ లేదా తత్సమానమైన అర్హతకు సంబంధించి మార్కుల మెమో, 4వ తరగతి నుంచి 10తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, రిజర్వేషన్ వర్తించే వారు కుల ధ్రవీకరణ పత్రం, మైనార్టీ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ టీసీ, 2023 జనవరి 1వతేదీన లేదా ఆ తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఓసీల్లో అర్హత కలిగిన వారు ఈడబ్ల్యుస్ సర్టిఫికెట్, ప్రయివేటు విద్యార్థులైతే రెసిడెన్స్ సర్టిఫికెట్, నాన్ లోకల్ అభ్యర్థులైతే పది సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పీడడబ్ల్యూడీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ విద్యార్థులు విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వారికి నిర్దేశించిన తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వివరాలకు https:// polycet.ap.gov.in వెబ్ సైట్లో చూడవచ్చు. -
మత్స్యఘోష
జిల్లాలో తీరప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. పరిశ్రమలు రసాయన వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో కాలుష్యకాసారంగా మారుతోంది. ఫార్మా, ఇతర రసాయన కంపెనీల వ్యర్థాలు జలచరాలను మింగేస్తున్నాయి. దీంతో తరచూ తీరం వెంబడి గుట్టలుగుట్టలుగా చేపలు చనిపోతున్నాయి. ఎటు చూసినా మృతి చెందిన మత్స్య సంపదే కనిపిస్తుండడం మత్స్యకారులను, పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతోంది. ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026తీరంలో సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతమైన పాయకరావుపేట నుంచి పరవాడ వరకు గల సుదీర్ఘ తీర ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం జలచరాల పాలిట శాపంగా మారింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న విషపూరిత రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జిల్లాలోని తీర ప్రాంతంలో వేటపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 12,844 మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి విఘాతం కలుగుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సైతం ఈ రసాయన కోరల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. నక్కపల్లి మండలంలోని బోయపాడు సముద్రతీరంలో శనివారం చనిపోయిన వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకురావడం తీవ్ర కలకలం రేపింది. రాజయ్యపేట నుంచి బోయపాడు తీరం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర క్వింటాళ్ల కొద్దీ చేపలు చనిపోయి కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. సమీపంలోని రసాయన పరిశ్రమల యాజమాన్యాలు రహస్యంగా సముద్రంలోకి పైప్లైన్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను వదలడమే ఇందుకు కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇలా మత్స్య సంపద నాశనమవుతుంటే ప్రతిరోజూ వేటకు వెళ్తేనే గాని ఇల్లు గడవని తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంటకోట నుంచి ఉప్పుటేరు వరకు వేలాది మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి బతుకుతున్నారు. గతంలో ఉప్పుటేరులో ... పరిశ్రమల నిర్లక్ష్యం ఈనాటిది కాదు. గత ఏడాది జూన్ 16న అచ్యుతాపురం పూడిమడక ఉప్పుటేరు (మొగ) వద్ద కూడా ఇదే తరహాలో చేపలు మరణించాయి. అచ్యుతాపురం సెజ్ పరిధిలోని 200కు పైగా ఫార్మా, ఇతర రసాయన కంపెనీల నుంచి వెలువడిన కలుషిత వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదలడంతో లక్షలాది చేపలు చనిపోయాయి. ఆ సమయంలో స్థానిక మత్స్యకారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ) అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి శాశ్వత చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు మళ్లీ బోయపాడులో ఈ పరిస్థితి పునరావృతమైందని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ప్రమాదకర ద్రవ వ్యర్థాలను ఈటీపీ పద్ధతిలోనూ, ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారాను వాటి స్వభావాన్ని బట్టి పూర్తిగా శుద్ధి చేయాలి. ఆ తర్వాతే సురక్షితంగా సముద్రంలోకి వదలాలి. కానీ, వ్యర్థాల నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రమాదకర రసాయనాలను నేరుగా సముద్రపు నీటిలో కలిపేస్తున్నాయి. జలచరాలను కబళిస్తున్న కాలుష్యం పెద్ద సంఖ్యలో చనిపోతున్న చేపలు తరచూ గుట్టలుగా దర్శనమిస్తున్న వైనం మీనాల మృతిపై మత్స్యకారుల ఆందోళన ఫార్మా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఏపీపీసీబీ, ఏపీఐఐసీకి విన్నవించుకున్నా ఫలితం శూన్యమంటున్న గంగపుత్రులు కనుమరుగవుతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు దేశంలోనే అరుదైన ఆలివ్ రిడ్లే ఆడ తాబేళ్లు ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఒడిశా, ఆంధ్ర తీర ప్రాంతాలకు గుడ్లు పెట్టడానికి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటాయి. గతంలో మార్చి నెలలో పూడిమడక తీరానికి వచ్చిన వందలాది తాబేళ్లు ఈ రసాయన వ్యర్థాల ధాటికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ జీవులు కాలుష్యానికి బలి అవుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హాకీ క్రీడాకారిణికి అభినందన
అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి నిమ్మి గీతశ్రీని అభినందిస్తున్న శాప్ బోర్డు మెంబర్ పి.బి.వి.ఎస్.వి రాజు, తదితరులు అనకాపల్లి టౌన్ : ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధిస్తానని, అలాగే మరింత మంది క్రీడాకారులను తయారు చేస్తానని అంతర్జాతీయ క్రీడా కారిణి నమ్మి గీతశ్రీ తెలిపారు. ఇటీవల జపాన్ దేశంలో జరిగిన మహిళల అండర్–18 ఆసియా హాకీ కప్ పోటీలలో నక్కపల్లికి చెందిన నమ్మి గీతశ్రీ కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను శాప్ బోర్డు మెంబర్ పి.బి.వి.ఎన్.ఎన్ రాజు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ అభినందించి, రూ.50వేల నగదు, జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాను నిలపడం గర్వకారణం అన్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి భారత జట్టుకు ప్రాతినిఽథ్యం వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెన్నికోయిట్ అసోసియేషన్ కార్యదర్శి రంజిత్, హాకీ కోచ్, కోచ్ రంజిత్ పాల్గొన్నారు. -
మన్మథలీలలు!
మహిళా వైద్యులతో విమ్స్ డైరెక్టర్పై ఆరోపణల కలకలం డాక్టర్ల గ్రూపులో వైరల్గా వాయిస్ మెసేజ్ మహిళా డాక్టర్లు, సిబ్బందితో అభ్యంతరకర భాష పీజీలను పాస్ చేసేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు మరోసారి వివాదాల్లోకి కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇదే విభాగానికి చెందిన డాక్టర్ జనార్దన్రావుపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. తాజాగా ఆ విభాగానికి గతంలో హెచ్వోడీగా పనిచేసి ప్రస్తుతం విమ్స్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక మహిళా వైద్యురాలి భర్త అయిన వైద్యుడు.. డాక్టర్ల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వాయిస్ మెసేజ్లో డాక్టర్ మన్మథరావు మహిళా వైద్యులు, సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పట్ల ఇతరుల వద్ద అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని వాపోయారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పీజీ వైద్య విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణులను చేయడానికి డబ్బులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. బోధన కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, విద్యార్థులకు తగిన శిక్షణ అందించలేదని వాయిస్ మెసేజ్లో విమర్శించారు. సాయంత్రం వేళల్లో విస్తృతంగా ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించారన్న ఆరోపించారు. పైసలిస్తేనే పాస్..? కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగానికి మొన్నటివరకు హెచ్వోడీగా ఉన్న డాక్టర్ మన్మథరావుపై తాజాగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఆయనకు విమ్స్ డైరెక్టర్ పదవి దక్కిందన్న చర్చ వైద్య వర్గాల్లో సాగుతోంది. జనరల్ సర్జరీ హెచ్వోడీగా ఉన్నప్పుడు విద్యార్థులకు బోధన చేయకుండా కాలం గడిపారన్న విమర్శలు ఉన్నాయి. పీజీ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేదన్న ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బోధన కంటే వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే విభాగంలోని ఇతర అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా, పరిపాలనాపరమైన పెత్తనానికే పరిమితమయ్యారన్న అంశం కూడా వైరల్ అవుతున్న వాయిస్ మెసేజ్లో ప్రస్తావనకు వచ్చింది. ఇక ప్రభుత్వ సేవలో ఉంటూనే సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పీజీ విద్యార్థులను పాస్ చేయడంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలే ఇప్పుడు వైద్య వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇదే విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మహాలక్ష్మి భర్త ఈ వాయిస్ మెసేజ్ను డాక్టర్ల గ్రూపులో పోస్టు చేశారు. తన భార్యను ఎలాంటి కారణం లేకుండానే యూనిట్–1 నుంచి యూనిట్–3కు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. తాను కూడా రాజాం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడినేనని ఆ సందేశంలో పేర్కొన్నారు. వివాదంలో జనరల్ సర్జరీ విభాగం కేజీహెచ్ గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. వైద్య పరికరాల మరమ్మతులకు నిధుల కొరత కారణంగా గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోయిన ఘటన నుంచి మందుల కొరత వరకు పలు అంశాలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. కృత్రిమ గర్భధారణ వ్యవహారంలోనూ కేజీహెచ్కు చెందిన వైద్యులపై ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జనరల్ సర్జరీ విభాగం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇదే విభాగానికి చెందిన డాక్టర్ జనార్దన్రావుపై పీజీ విద్యార్థులు లైంగిక, మానసిక, వృత్తిపర వేధింపుల ఆరోపణలతో ఏఎంసీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ఘటన చల్లారకముందే ఇప్పుడు ఇదే విభాగానికి గతంలో హెచ్వోడీగా పనిచేసిన డాక్టర్ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా వైద్యుల పట్ల వ్యవహరించిన తీరు, పీజీ విద్యార్థుల పరీక్షల విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న వాదనలు, బోధన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వైద్య వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే ప్రైవేటు ప్రాక్టీస్ ద్వారా భారీగా ఆదాయం ఆర్జించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మన్మథరావుపై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
అనకాపల్లి టౌన్ : పోలీస్ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు ఎస్పీ ఎల్. మోహన్రావు పేర్కొన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సంపర్క్ ఫోన్ ఇన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పోలీసు సిబ్బంది సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకొని సంబందిత అధికారులతో నేరుగా మాట్లాడారు. సిబ్బంది బదిలీలు, పోస్టింగ్లు, సెలవులు, సర్వీస్, కుటుంబ ఆరోగ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వచ్చిన ప్రతి సమస్యను అత్యంత గోప్యంగా ఉంచి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎప్పీ జి.ఆర్.ఆర్. మోహన్, సీఐ లక్ష్మి పాల్గొన్నారు. -
విద్యుత్షాక్కు గురై చూడి గేదె మృతి
అచ్యుతాపురం రూరల్ : విదు్య్త్షాక్కు గురై చూడి గేదె మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన అచ్యుతాపురం పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఫెన్సింగ్ వద్ద శుక్రవారం జరిగింది. అచ్యుతాపురం గ్రామ పాడి రైతు కిల్లాడి చంటికి చెందిన గేదె 9 నెలల చూలుతో ఉందని తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఫెన్సింగ్ తీగల ద్వారా షాక్ తగిలి పాడిగేదె అకారణంగా మృత్యువాత పడిందని రైతు వాపోయారు. రూ. లక్ష 30 వేల రూపాయలకు కొనుగోలు చేశానని పాడి రైతు ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. స్థానికులు ఎవరైనా అటువెళ్లినా ప్రమాదం బారిన పడేవారని ఆందోళన చెందారు. విద్యుత్శాఖ నిర్లక్ష్యం జనానికి ప్రాణ సంకటంగా మారిందని స్థానిక ప్రజలంటున్నారు. రానున్నది వర్షాకాలం కనుక విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తత వహించాలని కోరుతున్నారు. -
ఏకోపాధ్యాయ..విద్యార్థులు సున్నా!
మాకవరపాలెం : కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతుంటారు. అయినా ఉన్న వారితోనే పాఠశాలలను నిర్వహించేస్తారు. కానీ ఈ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా డిప్యుటేషన్పై ఉపాధ్యాయుడిని నియమించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకున్న నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మండలంలోని బూరుగుపాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి నెలకుంది. ఈ పాఠశాలలో గతేడాది ఒక నుంచి ఐదో తరగతి వరకు ఇద్దరే విద్యార్థులు ఉండేవారు. అయితే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయని వేసవి సెలవులకు ఆరు నెలల ముందే వ్యక్తిగత కారణాలతో ముందస్తు పదవీ విరమణ చేశారు. దీంతో ఈ పోస్టు ఖాళీ అయిన నేపథ్యంలో అప్పటి నుంచి అకడమిక్ ఇన్స్ట్రక్టర్తోనే పాఠశాల నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న పాఠశాల తెరుచుకున్నా ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇదే గ్రామంలో ఉన్న హైస్కూల్లో 1–10 వరకు ఉండడంతో విద్యార్థులు హైస్కూల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా రోజూ ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై ఉంచుతున్నారు. ఈ ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్న టేబుళ్లను చూసుకుంటూ కూర్చోవడం తప్పితే ఏమీ లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు లేని ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. -
జీవ ఎరువులతో పంటల దిగుబడి
నర్సీపట్నం: బయో ఫెర్టిలైజర్స్(జీవ ఎరువులు) వాడకం వల్ల నేల ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏవో విజయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలో ధర్మసాగరంలో ఆత్మ ఆధ్వర్యంలో జీవ ఎరువుల వినియోగం, ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడటం వల్ల రైతులు మంచి లాభాలు పొందుతారన్నారు. బయో ఫెర్టిలైజర్స్ వాడకం వల్ల ఆహార పంటల్లో పోషక విలువలు పెరుగుతాయన్నారు. భూసారం దెబ్బతినకుండా ఉండి రసాయన ఎరవుల ఖర్చు తగ్గుతుందన్నారు. మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల గురించి అవగాహన కల్పించారు. జిల్లా వనరుల కేంద్రం అనకాపల్లి ఏవో పి.విజేత నేల సారం గురించి అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల సారం తగ్గి భవిష్యత్తులో దిగుబడి తగ్గుతుందన్నారు. నేల పరీక్షల ఆధారంగా బయోఫెర్టిలైజర్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సుర్ల అప్పలనాయుడు, పెట్ల శ్రీనువాసు, వ్యవసాయ అసిస్టెంట్ కె.భవాని, రైతులు పాల్గొన్నారు. -
వ్యవసాయ మోటార్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి
మునగపాక : వ్యవసాయ మోటార్లకు ఇచ్చిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని వెంకటాపురంలో వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసిన మీటర్లతో పాటు విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. వ్యవసాయ మోటార్లకు సంబంధించి వేల నుంచి లక్షలాది రూపాయల మేర బిల్లులు చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి పెరగడం విచారకరమన్నారు. బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడం అన్యాయమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే టి.సిరసపల్లి, రాజుపేట, నాగవరం గ్రామాల్లో కూడా అధిక మొత్తంలో బిల్లులు రావడం చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. తక్షణమే విద్యుత్ బిల్లులను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గనిశెట్టి సత్యనారాయణ, ఎన్.నారాయణ, కె.కృష్ణ, గోవిందరావు, మహలక్ష్మీరావు, సన్యాసిరావు, ముత్యాలనాయుడు పాల్గొన్నారు. -
ఏయూలో కీలక నియామకాలు
నూతన డీన్కు ఉత్తర్వులు అందజేస్తున్న ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా పలువురు డీన్లు, అసోసియేట్ డీన్లను నియమిస్తూ యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ నియామక ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్గా ఆచార్య ఎం.అన్నపూర్ణ, పీజీ–ప్రొఫెషనల్ కోర్సుల డీన్గా ఆచార్య వై.అబ్బులు, యూజీ పరీక్షల డీన్గా ఆచార్య బి.మునిస్వామి, బ్రాండింగ్–మీడియా అసోసియేట్ డీన్గా ఆచార్య సి.ఎం.వినయ్కుమార్ నియమితులయ్యారు. ఆర్ అండ్ డీ అసోసియేట్ డీన్లుగా టి.ఆర్.జ్యోత్స్న, పి. ఏడుకొండలు, సీడీవోఈ అసోసియేట్ డైరెక్టర్గా ఆచార్య వి.లక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే పీజీ–ప్రొఫెషనల్ కోర్సుల అసోసియేట్ డీన్గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణ, కాన్ఫిడెన్షియల్ (పరీక్షలు) డీన్గా ఎల్.ఎస్.వి.ప్రసాద్, ఆలుమ్ని అఫైర్స్–కార్పొరేట్ రిలేషన్స్ అసోసియేట్ డీన్గా ఆచార్య ఎన్.సాల్మన్ బెన్నీ, విద్యార్థి సంక్షేమ అసోసియేట్ డీన్గా ఆచార్య వి.ధనరాజు నియమితులయ్యారు. ఎన్సీఏ కోఆర్డినేటర్గా ఆచార్య కె.సరస్వతి విద్యార్థి, హాస్పిటాలిటీ–ఫెసిలిటీ మేనేజ్మెంట్ అసోసియేట్ డీన్గా ఆచార్య సి.హెచ్.ఆశ ఇమ్మానియల్ రాజు, స్పాట్ వాల్యుయేషన్ అసోసియేట్ డీన్గా ఆచార్య కె.రమేష్బాబు, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ గౌరవ డైరెక్టర్గా ఆచార్య సి.వి.నాయుడును నియమించారు. గతంలో ఇతర బాధ్యతల్లో ఉన్న డీన్లు, అసోసియేట్ డీన్ల పదవీకాలాన్ని కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు బొడ్డేడ వితరణ
మునగపాక: ఉపాధి కూలీలకు తనవంతు సాయం అందించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముందుకొచ్చారు. వేసవిలో పనులు చేసే కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తన సొంత నిధులతో సమకూర్చిన హాట్ బాక్స్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం నాల్గో రోజుకు చేరుకుంది. ములబంద గోడీ ప్రాంత కూలీలు, పేటకట్టు మూల సంఘ పరిధిలో 114 మంది కూలీలకు ఆయన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున సాధ్యమైనంతలో ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకోవాలని సూచించారు. మాజీ సర్పంచ్ దిమ్మల అప్పారావు, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, పార్టీ నేతలు మళ్ల రామజోగినాయుడు, పెంటకోట సారధి, పెంటకోట సత్యనారాయణ, పెంటకోట వెంకట్, ఎంఎం నాయుడు, ఆడారి లక్ష్మణరావు, మళ్ల జగ్గప్పారావు, దాడి శ్రీరామమూర్తి, బొడ్డేడ సోమరాజు, పెంటకోట శ్రీనివాసరావు(నెట్), భీశెట్టి ఈశ్వరరావు, ఆడారి రమణబాబు, కోనపల్లి రామ్మోహనరావు, టెక్కలి కొండలరావు, బొడ్డేడ రామారావు, కరణం గణేష్, దాడి చంద్రరావు, వెలగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇదండీ జీవీఎంసీ వరస..!
డాబాగార్డెన్స్: నగరంలో మండే ఎండల నుంచి బాటసారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ‘హరితాశ్రయం’ పేరుతో పలు ప్రాంతాల్లో గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా గత మే నెలలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద గ్రీన్ షేడ్ నెట్ను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగే వాహనదారులు, పాదచారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా నీటి తుంపర్లు చల్లే విధానాన్ని కూడా ఇంజినీరింగ్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఏర్పాటు ఎక్కువకాలం నిలవలేదు. సుమారు 20 రోజుల క్రితం నగరంలో వీచిన ఈదురుగాలులకు గ్రీన్ షెల్టర్ నెట్ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మరమ్మతు చేయడం లేదా పునరుద్ధరించడం పక్కనపెడితే, ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జీవీఎంసీ మరో గ్రీన్ షెల్టర్ను సత్యం జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు రెండున్నర నెలల పాటు నగరవాసులు భానుడి ప్రతాపానికి అల్లాడిన సమయంలో కాకుండా, వర్షాలు కురుస్తున్న వేళ ఈ ఏర్పాట్లు చేపట్టడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్న సమయంలో కాకుండా ఆలస్యంగా చేపట్టిన చర్యలతో జీవీఎంసీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
రోడ్లు వేయండి... మోత తప్పించండి
చోడవరం : తమ గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి తమకు డోలీమోత రవాణా సమస్యను పరిష్కరించాలని కోరుతూ పీవీటీజీ కొందు గిరిజన గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగాయి. ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా చోడవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమ సమస్యలు తెలుపుకొనేందుకు రావికమతం, రోలుగుంట మండలాల పరిధిలో ఉన్న పీవీటీజీ కొందు గిరిజన గ్రామాల ప్రజలు చోడవరం తరలివచ్చారు. తమ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక డోలిమోతతో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో అధికారులకు, ప్రజలకు తెలిసే విధంగా డోలిమోతలతో వినూత్న నిరసన తెలిపారు. ఇక్కడి తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్తూరు జంక్షన్ మీదుగా రెవిన్యూ సదస్సు జరిగే ప్రదేశానికి ర్యాలీగా వచ్చారు. అక్కడ జిల్లా కలెక్టర్ను, ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. అర్ల నుంచి పిత్రిగెడ్డ రోడ్డును, వైబీపట్నం నుంచి నో సింగి, పెద్దగవురు రోడ్డును జెడ్ జోగుంపేట నుంచి నేరేడు బంధ రోడ్డును వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేశారు. రోడ్డులేక డోలీమోతతో ప్రయాణం చేయాల్సి వస్తుందని, అత్యవసర సమయాల్లో మరింత ఇబ్బందులు పడుతున్నామని వారు విన్నవించారు. అదేవిధంగా లోసింగి, కొమ్మరి గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ, పాఠశాల భవనాలు నిర్మించాలని కోరారు. మరో పక్క గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ సీఐయూటీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, గిరిజన సంఘాల నాయకులు కొండతాంబలి వెంకట్రావు, కొర్ర కొండబాబు, డిప్పల అప్పారావు, గెమ్మిల సత్తిబాబు, ఎస్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా ఆందోళన చూస్తూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వారిని జిల్లా కలెక్టర్ సదస్సులో ఉన్న ఎమ్మెల్యే రాజు బయటకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వినతిపత్రం తీసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
అన్నదాతలకు దుఃఖీభవ!
●రైతు సాయంలోనూ కూటమి సర్కార్ కోత ●జిల్లాలో 23,242 మంది రైతులకు మొండిచేయి ●గత వైఎస్సార్సీపీ హయాంలో 2,65,778 మందికి లబ్ధి ●ప్రస్తుతం 2,42,536 మందికే పరిమితం ●తొలి ఏడాదే హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్ ●నిబంధనల పేరిట 9 వేల మందికి పైగా కౌలు రైతులకు తీవ్ర అన్యాయం సాక్షి, అనకాపల్లి : రాష్ట్రంలో సాగుచేస్తున్న అన్నదాతల ఆశలపై కూటమి ప్రభుత్వం చల్లని నీళ్లు చల్లింది. ఎన్నికల ముందు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సహాయం అందిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గుప్పించిన హామీలు అధికారంలోకి వచ్చాక ఉత్తుత్తివేనని తేలిపోయింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కూటమి సర్కార్ దారుణంగా కత్తెర వేసింది. అర్హత గల రైతులను, కౌలు రైతులను వేలాది మంది రైతులకు మొండిచేయి చూపించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదే అన్నదాతలకు తీవ్ర నిరాశ కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం.. గతేడాది, ఈ ఏడాది కూడా అరకొరగానే ఆర్థిక సాయం అందిస్తూ చేతులు దులుపుకొంటున్నది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో జిల్లాలో కేవలం 2,42,536 మందిని మాత్రమే లబ్ధిదారులుగా చూపించారు. తొలి ఏడాదే ఎగవేత.. వేలాది మందిపై వేటు అనకాపల్లి జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2,65,778 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఎంతో పారదర్శకంగా లబ్ధి చేకూరింది. ఏడాదికి రూ.304.43 కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు ఏకంగా రూ.1301.12 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసి ఆర్థిక భరోసా కల్పించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ లబ్ధిదారుల జాబితా చూస్తే అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో జిల్లాలో కేవలం 2,42,536 మందిని మాత్రమే లబ్ధిదారులుగా చూపించారు. అంటే స్పష్టంగా 23,242 మంది రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇందులో 9 వేల మంది కౌలు రైతులతో పాటు, 14,242 మంది సొంత భూమి కలిగిన రైతులు పథకానికి దూరమయ్యారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 25,072 మంది రైతులకు భరోసా నిధులు అందగా.. ప్రస్తుత ప్రభుత్వం అందులోనూ కోత పెట్టి 6,499 మంది లబ్ధిదారులను పక్కన పెట్టేసింది. నేడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు పంపిణీ ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026–27 ఏళ్లగా సంబంధించిన తొలి విడత నగదు పంపిణీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద అందించే రూ.2,000 కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమ చేయబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాడుగుల నియోజకవర్గంలో చీడికాడ విద్యుత్ కార్యాలయం సమీప మైదానం, చోడవరం నియోజకవర్గంలో రావికమతం ఎంపీడీవో కార్యాలయం, యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం నారాయణపురం జంక్షన్ సమీపంలోని శ్రీలక్ష్మీ దేవుళ్ల కన్వెన్షన్ హాల్ పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్.రాయవరం మండలం సైతారు పేట గ్రామ పంచాయతీ కార్యాలయం, అనకాపల్లి నియోజకవర్గంలో కశింకోట ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని కళ్యాణ మండపం, నర్సీపట్నం నియోజకవర్గంలో గోలుగొండ ఎంపీడీవో కార్యాలయం, పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్.రాయవరం మండలం సైతారు పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరుకానున్నారు.నిబంధనల పేరిట కొర్రీలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులందరినీ ఒకేలా పరిగణించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను వర్తింపజేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు, కుటుంబంలో ఒక్కరికే లబ్ధి, పది సెంట్ల లోపు భూమి ఉన్న వారిని తొలగించడం వంటి కొర్?రలు పెడుతోంది. వీటికి తోడు ఆధార్ అనుసంధానం, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధానం కాలేదనే సాకులతో అధికారులు పెద్ద ఎత్తున రైతుల పేర్లను జాబితా నుండి తొలగించారు. ఈ సాకుల వల్లే జిల్లాలో 6,499 మంది రైతులు ఈ పథకానికి శాశ్వతంగా దూరమయ్యారు. -
సురభి నాటకాలు గిన్నిస్ రికార్డ్స్లో నమోదు కావాలి
మద్దిలపాలెం: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న సురభి నాటకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావాలని వక్తలు ఆకాంక్షించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో భానోదయ నాట్య మండలి నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు మీగడ రామలింగస్వామి, చలసాని కృష్ణప్రసాద్, కొరిటాల ప్రభాకర్, పైడా కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి వంకాయల మారుతి ప్రసాద్, కళాపోషకులు నమ్మి అప్పలరాజు, బిల్డర్ రామకృష్ణ, రిటైర్డ్ ఏసీపీ మహమ్మద్ ఖాన్, గాయని మణిపల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురభి నాటక కళను ఆదరించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకంలో ఒక్కో ఘట్టం సినిమాను తలపించేలా సాగింది. సురభి కళాకారుల అద్భుత నటన, మంత్రముగ్ధులను చేసే స్టేజ్ టెక్నాలజీతో కళాభారతి హాల్ కరతాళ ధ్వనులతో మారుమోగింది. నటి శివజ్యోతి, కోఆర్డినేటర్ భానుప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
ఉపాధ్యాయులకు చిట్టయ్య ఆదర్శం
కోటవురట్ల: ఆ గురువు ఆదర్శంగా నిలిచి పలువురి మన్ననలు పొందుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పడమే కాకుండా తన ఇద్దరు పిల్లలను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్చి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు పాములవాక జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఎం.చిట్టయ్యను సమగ్ర శిక్ష అభియాన్ ఏఎంవో కెజియా గురువారం ఘనంగా సత్కరించారు. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుడు చిట్టయ్య మాట్లాడుతూ డీఈవో అప్పారావునాయుడు స్ఫూర్తితో తన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని తెలిపారు. హెచ్ఎం కె.వి.ఎల్.నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
20,870 కేజీల గంజాయి ధ్వంసం
సాక్షి, అనకాపల్లి: విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20,870 కిలోల గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు పరవాడలోని కోస్టల్ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంట్లో గురువారం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఐదు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. భారీగా రికవరీలు విశాఖ రేంజ్ పరిధిలో పోలీసులు గంజాయి నెట్వర్క్లపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. 1,142 కేసులు నమోదు చేసి, 3,377 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 65,560 కిలోల గంజాయి, 83.19 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీ నం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన 832 వాహనాలను సీజ్ చేశారు. 19 కేసుల్లో 18 మంది నిందితులకు చెందిన రూ.11.02 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అంతర్జాతీయ, అంతరాష్ట్ర ముఠాల గుర్తింపు శ్రీలంక డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసులు ఛేదించి, రూ.1.07 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ముఠాను పట్టుకుని, రూ.1.04 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల సాయంతో 144 హాట్స్పాట్లను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 28 స్టాటిక్, 480 డైనమిక్ చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, విజయనగరం ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొన్నారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: సదరన్ రైల్వే, అరక్కోణం రైల్వేస్టేషన్ పరిధిలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన టాటానగర్–ఎర్నాకుళం(18189) ఎక్స్ప్రెస్, ఈ నెల 23వ తేదీన విల్లుపురం–ఖరగ్పూర్(22604) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ నెల 24వ తేదీన తిరునల్వేలి–పురూలియా(22606) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ నెల 21వ తేదీన రాధికాపుర్–ఎస్ఎంవీటి బెంగళూరు (16224) ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా గూడూరు, రేణిగుంట, తిరుత్తని, మెల్పక్కం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా తేదీల్లో ఈ రైళ్లకు తిరుత్తని స్టేషన్లో అదనపు హాల్ట్ను కల్పించారు. -
పశువైద్యాధికారులకు భద్రత కల్పించాలి
తుమ్మపాల: జిల్లాలో పశువైద్యాధికారులకు భద్రతకల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పశువైద్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పశువైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ విజయ్పై కొందరి వ్యక్తుల దాడి చేయడం దురదృష్టకరమన్నారు. అనంతరం జిల్లా పశుసంవర్ధక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించి, విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము బగాది , ప్రధాన కార్యదర్శి పి.సురేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు, జిల్లా వ్యాప్తంగా వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు. -
జలధారకు చిల్లు !
● వానాకాలం ముంచుకొస్తున్నా మందకొడిగానే పనులు ● 118 పనులకు గాను 18 మాత్రమే పూర్తి ● బిల్లులు అందక కాంట్రాక్టర్ల నిరాసక్తత ● కానరాని పనుల పురోగతి ● సాగునీటిపై అన్నదాతల ఆందోళన సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ, క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణపై పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిన సాగునీటి పనులనే, ఇప్పుడు కొద్దిగా రంగులు అద్ది తమ ఖాతాలో వేసుకునేందుకు పాలకులు తాపత్రయపడుతున్నారు. అయితే, ప్రచార ఆర్భాటం తప్ప పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు. జలవనరుల శాఖ నర్సీపట్నం డివిజన్ పరిధిలో సాగు నీటి కాలువల మరమ్మతులు, గొలుసుకట్టు చెరువుల ఆధునికీకరణ పనుల పురోగతి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వర్షాకాలం ముంచుకొస్తున్నా పనులు నత్తనడకన సాగుతుండడంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మార్పుపై శ్రద్ధ.. పనులపై నిర్లక్ష్యం గత ప్రభుత్వ హయాంలో చెరువుల ఆధునికీకరణ ద్వారా ప్రతీ చినుకునూ ఒడిసి పట్టేలా ప్రణాళికలు రూపొందించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానికి ‘జలధార– జలహారతి’ అంటూ కొత్త పేరు తగిలించి ప్రచారానికి తెరలేపింది. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టి పరిరక్షించుకోవాలి. వ్యవసాయానికి అనుకూలంగా..ఆత్మబంధువుగా మలుచుకోవాలి. శివారు పంటపొలాలు సైతం నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఉండకూడదన్నదే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ‘ఏపీ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం’ను తీసుకొచ్చింది. గ్రామాల్లో వ్యవ‘సాయం’గా ఉండే చెరువుల్లో వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేందుకు వాటిని ఆధునీకరించడం, చెరువుల అభివృద్ధి నిర్మాణ పనుల చేయడం ఈ పథకంలో భాగం. ఒక్కో చెరువును రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో 42కు పైగా చెరువులను ఆధునీకరించారు. బిల్లులు చెల్లించకపోవడమే ...? పనుల్లో ఇంతటి జాప్యానికి ప్రధాన కారణం గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమేనని తెలుస్తోంది. గత ఏడాది చేసిన సాగునీటి పనులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. ‘గత ఏడాది చేసిన పనులకే ఇంకా మోక్షం లభించలేదు.. ఇప్పుడు చేస్తున్న పనులకు బిల్లులు ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో?!‘ అని సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, కాంట్రాక్టర్లు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత బాకీలు తేల్చకుండా కొత్త పనులు ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తూ వారు తాత్సా రం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎన్ని ఆదేశాలిచ్చినా, క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగకపోవడానికి ఈ బిల్లుల చిక్కే ప్రధాన కారణం. జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 118 పనులకు గాను 18 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాలు కురవక ముందే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ముందుకు సాగడం లేదు. బిల్లులు చెల్లించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు నిరాసక్తత చూపుతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 18 చోట్లే పూర్తి నర్సీపట్నం డివిజన్ పరిధిలో సాగు నీటి కాలువల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం మే 2న చంద్రబాబు ప్రభుత్వం రూ.85.6 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో డివిజన్ వ్యాప్తంగా 118 చోట్ల పనులు ప్రారంభించారు. నిధులైతే కాగితాలపై కనిపిస్తున్నాయి కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పనుల పురోగతి శూన్యంగా మారింది. మంజూరైన 118 పనుల్లో ఇప్పటివరకు కేవలం 18 చోట్ల మాత్రమే పనులు పూర్తి కావడం గమనార్హం.తాండవ జలాశయం ప్రాజెక్టు పరిధిలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి రూ.30 లక్షలతో ఐదు పనులు, తుని నియోజవర్గానికి రూ.27 లక్షలతో నాలుగు పనులు మంజూరయ్యాయి. ఇక్కడ పనులైతే ప్రారంభించారు కానీ, నేటికీ ఒక్కటంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరుకు అన్ని పనులూ పూర్తి కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జూలై నెలాఖరుకై నా ఇవి పూర్తవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్ ఇచ్చిన గడువు ముగుస్తున్నా.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవక ముందే ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేస్తేనే ఆయకట్టుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాలు పడితే కాలువలు, చెరువుల్లో నీరు చేరి పనులు చేయడం అసాధ్యంగా మారుతుంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్.. జులై 7 నాటికి గొలుసుకట్టు చెరువుల పనులన్నీ పూర్తికావాలని స్పష్టమైన లక్ష్యాయన్ని నిర్దేశించారు. ఎప్పటికప్పుడు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే కలెక్టర్ విధించిన గడువు లోపు పనులు పూర్తి కావడం అసాధ్యమని స్పష్టమవుతోంది. నిలిచిన గొలుసుకట్టు పనులు ఒకదానిపై ఒకటి ఆధారపడే గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 49 చోట్ల పనులను చేపట్టింది. ఇందుకోసం రూ.2.81 కోట్లు కేటాయించారు. గొలుసుకట్టు చెరువుల కాలువలను బాగు చేయడం, పాడైన పొర్లుకట్టలను పునరుద్ధరించడం, అవసరమైన చోట్ల పాతవాటిని పటిష్టం చేయడం, రావణాపల్లి జలాశయ గట్టు తొలగించి కొత్తవి నిర్మించడం వంటి కీలకమైన పనులు ఈ నిధులతో జరగాల్సి ఉంది. అయితే అధికారుల ఉదాసీనత, పాలకుల పట్టింపులేమి కారణంగా నాలుగు చెరువులకు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో రెండోసారి పిలిచిన టెండర్లను ఇంకా తెరవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఈ పనులు పూర్తయ్యాయి. మిగతావన్నీ ఇంకా పురోగతిలోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు. -
సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ ఆస్తుల జప్తు
పాయకరావుపేట: రుణాలను చెల్లించకపోవడంతో పట్టణంలోని సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ సంస్థ ఆస్తులను కెనరా బ్యాంకు జప్తు చేసింది. సంస్థ రుణ ఖాతాలు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వాటిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకుని బ్యాంకుకు అప్పగించినట్లు ఏఆర్ఎం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి వేలం ప్రక్రియ ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వేణుగోపాలరెడ్డి, ఏఆర్ఎం సత్యనారాయణ, డివిజినల్ మేనేజర్ ధనుంజయరావు, పోలీసు సిబ్బంది, మండల రెవెన్యూ సిబ్బంది, తుని బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కుకు భూములివ్వం
గొండుపాలెం సచివాలయం వద్దరైతుల నిరసన కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూములను ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. సీపీఎం నాయకులతో కలిసి గ్రామ సచివాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాన్ని అందించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకన్న మాట్లాడుతూ గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కుకు మే 25న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నోయేళ్ల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులు భూములు కోల్పోవడం వల్ల రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రయత్నం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు మణి, ఈశ్వరరావు, దొగ్గ మహేష్, భారతి, తారకేశ్వరరావు పాల్గొన్నారు. -
నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి
కలెక్టర్ విజయకృష్ణన్ తుమ్మపాల: జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారంజిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీజీఆర్ఎస్కు అందుతున్న అర్జీలను సంబంధిత మండలాలకు వెంటనే పంపించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను అవసరమైతే సమీప సచివాలయాలు, పాఠశాలలు, ఇతర షెల్టర్లకు తరలించేలా ముందస్తు మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు.షెల్టర్లలో ఆశ్రయం పొందే ప్రజలకు ఆహారం, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు తదితర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్ బుకింగ్, ఓడీఎఫ్ గ్రామాలు, డీఆర్డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర తదతర ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్య ఘర్ యోజనలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఓడీఎఫ్ హోదాను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఇనన్చార్జి డీఆర్వో వై. శ్రీనివాస్తో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతంకలిగిస్తే ఉపేక్షించం
నర్సీపట్నం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని డీఎస్పీ పి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్న యువతి డ్యూటీలో ఉంటూ ఈ నెల 16వ తేదీ రాత్రి పనినిమిత్తం ఇంటికి వెళ్లి తిరిగి డ్యూటీకి వస్తుండగా అప్పన్నదొరపాలెం వద్ద ఆమెను అడ్డగించి ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు పెదబొడ్డేపల్లికి చెందిన కె.హరి(30), పి.కుమార్(42)ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు.ఇద్దరిలో ఒకరిపై రౌడీషీట్ కొనసాగుతోందన్నారు. ఇద్దరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. టౌన్ పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు దౌర్జన్యాలు, భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. రోడ్లపై మద్యం సేవించి హల్చల్ చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని, ప్రవర్తనలో మార్పు రాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ గఫూర్, ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచెరువు ఆక్రమణలపై ఫిర్యాదు
రోలుగుంట: మండలంలోని బుచ్చింపేట ఎర్రచెరువు ఆక్రమణలను తొలగించి తమ భూములకు సాగునీరు అందించి ఆదుకోవాని ఆయకట్టుదారులు కోరుతున్నారు. దీనిపై కలెక్టరేట్తోపాటు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినట్టు గురువారం వారు తెలిపారు. బుచ్చింపేటలో వడ్డిప వైపు పోయే రోడ్డును ఆనుకొని సచివాలయం పక్కనున్న ఎర్రచెరువు ఆక్రమణలకు గురవుతోంది. చెరువు కింద 30 మంది రైతులకు చెందిన 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. చెరువు సమీపంలోనే భక్తమండలి ఆరు మాసాల క్రితం కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణ పనులు చేపట్టింది. ఇటీవల ఎండలకు చెరువు ఎండిపోవడంతో ఆక్రమణదారుడు మట్టిని చెరువులోకి డంపింగు చేసి దిబ్బ చేసుకుంటున్నాడు. డంపింగు చేసిన మట్టి ఆలయం పక్కన, వేరొక చోట వేసి దిబ్బ చేశాడు. దీనిని ఆసరా చేసుకొని మరి కొందరు చెరువు గర్భంలోనే మరికొన్ని నిర్మాణాలు చేపట్టేందుకు ఆలోచనలు చేసుకుంటున్నారు. ఇలాగైతే చెరువు గర్భం తగ్గిపోయి తమ పంట భూములకు సాగునీరుకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేయించి, సరిహద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలను నియంత్రించాలని ఆయకట్టు రైతులు ఉలబాల వెంకటరమణ, సోమినాయుడు, చిటికెల సత్తిబాబు, అల్లు రాంబాబు తదితరులు కోరుతున్నారు. -
జూలో జీబ్రా, నక్షత్ర తాబేలు దత్తత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత స్వీకార కార్యక్రమానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర గురువారం జూలోని ఒక జీబ్రాను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. దత్తత నిమిత్తం రూ.60 వేల విరాళాన్ని జూ క్యూరేటర్ జి.మంగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సిరి సహస్రకు క్యూరేటర్ దత్తత స్వీకార పత్రాన్ని అందజేశారు. అలాగే బుక్కవరపు రమాదేవి అనే దాత ఒక నక్షత్ర తాబేలును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. దీనికోసం ఆమె రూ.10 వేల విరాళాన్ని క్యూరేటర్కు సమర్పించారు. వన్యప్రాణులపై ప్రేమతో దత్తతకు ముందుకు వచ్చిన దాతలిద్దరినీ జూ అధికారులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని క్యూరేటర్ మంగమ్మ కోరారు. రూ.60 వేల విరాళం అందించిన మజ్జి సిరి సహస్ర -
వేదశ్రీకి విట్లో ఉచిత బీటెక్ సీటు
రోలుగుంట: ఇంటర్లో జిల్లా టాపర్గా నిలిచిన మలసాల వేదశశ్రీ అమరావతిలోని విట్లో సీఆర్పీ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ) పథకం కింద ఉచిత బీటెక్ విద్యకు ఎంపికై ంది. ఈ మేరకు గురువారం స్థానిక జూనియర్ కళాశాలలో విద్యార్థినిని ప్రిన్సిపాల్ అప్పలరాజు, అధ్యాపకులు శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన వేదశ్రీ ఇంటర్ ఫలితాల్లో 981 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచి కళాశాలకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. విట్లో ఉచిత సీట్లకు ఎంపికై న ఏడుగురులో వేదశ్రీ ఒకరన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. -
స్పా దందా!
సెలూన్ పేరిటఇతర రాష్ట్రాల నుంచే.. విశాఖపట్నంలోని అనేక మసాజ్ కేంద్రాల్లో స్థానిక యువతుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొస్తున్నట్లు సమాచారం. వారికి వసతి సదుపాయాలను కూడా కొందరు నిర్వాహకులే కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సెలూన్లు, స్టూడియోల పేర్లతో అనుమతులు తీసుకుని స్పా కేంద్రాలను నిర్వహిస్తుండగా, మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో మసాజ్ కేంద్రాలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ కేంద్రాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి మామూళ్ల వ్యవహారమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి స్పాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మూసివేసిన గదులకు బదులుగా కర్టెన్లతో మాత్రమే విభజనలు ఉండాలని గతంలో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధనలను చాలా కేంద్రాలు పాటించకపోయినా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సంపత్ వినాయగర్ ఆలయానికి కూతవేటు దూరంలో సెలూన్ పేరిట నడుస్తున్న ఓ స్పా సెంటర్ విషయంలో పోలీసులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ కేంద్రం జోలికి పోలీసులు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. కరోనా సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని తెరిచి ఉంచడంతో పోలీసులు దాడి చేశారు. అప్పట్లో బాడీ మసాజ్ల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై నిర్వాహకులు పోలీసులకు అడ్డంగా దొరికినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సెలూన్ ముసుగులో స్పా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు స్పా కేంద్రాలపై తరచూ దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ కేంద్రం వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేంద్రంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం వెంటనే నిర్వాహకులకు చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే యువతులకు సెలూన్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, క్రమంగా స్పా కార్యకలాపాల్లోకి దింపుతున్నట్లు సమాచారం. వీఐపీ రోడ్డులో ఉన్న మరో సెలూన్ స్టూడియో విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్తో ఎంట్రీకి అడ్డుకట్ట! స్పా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమే. అయితే మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో మసాజ్ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం శిక్షణ పొందిన థెరపిస్టులు ఉండాలి. అయితే విశాఖపట్నంలోని కొన్ని కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మసాజ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల కోసం పోలీసులు లేదా ఇతరులు నేరుగా లోపలికి రాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్పా సిబ్బంది మినహా ఇతరులు లోపలికి వెళ్లాలంటే బయోమెట్రిక్ కార్డు తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం. ఈ విధమైన వ్యవస్థలు ఉండకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ, వాటి వినియోగం మాత్రం కొనసాగుతూనే ఉంది. మామూళ్ల వ్యవహారమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యభిచారం ఆరోపణలున్నా.. వాస్తవానికి నగరంలో స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి మసాజ్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. నగరంలో అడుగడుగునా కనిపిస్తున్న స్పా కేంద్రాల్లో చాలావరకు ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంపత్ వినాయక ఆలయానికి సమీపంలోని ఈ కేంద్రంతో పాటు వీఐపీ రోడ్డులోని మరో స్టూడియోపైనా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. బయటకు సెలూన్లుగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల వ్యభిచారం సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం నిర్వాహకులకు చేరుతుండటంతో వారు ఫిర్యాదు చేసిన వారిని సంప్రదించి వ్యవహారాన్ని ‘మేనేజ్’ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టిసారించాలిసాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో నూతన పరిజ్ఞానంపై అవగాహన, నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ)లో ఈనెల 15 నుంచి 19 వరకూ 5 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా.. గురువారం జరిగిన సెషన్కు సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐఎం విశాఖపట్నం ఆధ్వర్యంలో ఫైనాన్స్ అండ్ మేనేజిరియల్ అకౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఇంధన రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎనర్జీ ట్రాన్సిషన్ నేపథ్యంలో ఉద్యోగులు నిరంతర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి ద్వారా సంస్థల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు. విద్యుత్ రంగం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు సీఓఈఈటి ద్వారా ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐఐఎంవీ అధ్యాపకులు డా.వికాస్ సంగ్వాన్, డా.తమలి చక్రబర్తి ప్రోగ్రామ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ శిక్షణ అందిస్తున్నారు. -
ఉప్పుటేరులో చేపల మృత్యువాత
అచ్యుతాపురం రూరల్: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయనాల కారణంగా పూడిమడక ఉప్పుటేరులో విలువైన మత్స్య సంపద మరణిస్తున్నట్టు మత్స్యకార నాయకుడు చేపల తాతయ్యలు తెలిపారు. ఉప్పుటేరులో సుమారు టన్నున్నర చిన్న చేపలు గురువారం మృతి చెందినట్టు ఆయన చెప్పారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయకుండా ఉప్పుటేరు కాలువ ద్వారా నేరుగా సముద్రంలోకి విడుదల చేయడం వల్ల చేపలు మరణిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. పరిశ్రమల వ్యర్థాలను అనధికారికంగా కాలువల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తాండవలో పుష్కలంగా నీటి నిల్వలు
ప్రాజెక్టు డీఈ అనురాధనాతవరం: తాండవ రిజర్వాయర్లో ఈఏడాది నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. మండలంలో గునుపూడి పైలవాని ట్యాంకు వద్ద జరుగుతున్న తాండవ కాలువ స్లూయిజ్ పనులను గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఏడాది ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు వేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. తాండవ ప్రమాదస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 374.5 అడుగుల నీరు ఉందన్నారు. నీటిని ఆయకట్టుకు విడుదల చేసే సమయానికి ప్రధాన కాలువల అభివృద్ధి పూర్తిచేస్తామన్నారు. జలధార పథకంలో రూ.8 లక్షల వ్యయంతో గునుపూడి వద్ద స్లూయిజ్ పనులు చేస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో జేఈ శ్యామ్కుమార్, వర్కు ఇన్స్పెక్టరు నాగబాబు గునుపూడి నీటి సంఘం అధ్యక్షుడు సబ్బవరపు దేముడు పాల్గొన్నారు. పెద్దేరులో పెరుగుతున్న నీటిమట్టం మాడుగుల: మండలంలోని పెద్దేరు జలాశయం కేచ్మెంట్ ఏరియాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి 25 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. కేచ్మెంట్ ఏరియాలో గురువారం 28 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. జలాశయ గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 133.30 మీటర్లకు చేరుకుంది. దీంతో ఖరీఫ్లో వరి సాగుకు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలో 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయడానికి రైతులు నారు మడులు సిద్ధం చేసుకుంటున్నారు.


