తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు
మాట్లాడుతున్న నవలా రచయిత యండమూరి
గొలుగొండ: విద్యార్థులు తెలివైన ఆలోచనలు చేసినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. మండలంలోని కృష్ణదేవిపేటలో నేను సైతం చారిటబుల్ ట్రస్టు, అనకాపల్లి పోలీసుల సౌజన్యంతో గురువారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ భవిష్కత్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేసుకుని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థుల ఆలోచన ప్రకారమే తల్లిదండ్రులు సహకారం ఉండాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాతవరం, కృష్ణదేవిపేట ఎస్ఐలు తారకేశ్వర్రావు, రుషికేశ్వర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రసాద్ పాల్గొన్నారు.


