breaking news
Anakapalle District News
-
ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..
నిరుద్యోగులకు మొండి చెయ్యి చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపింది. రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు గాలిలో కలిపేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ ఇచ్చిన హామీ చంద్రబాబు సర్కార్ కొలువుదీరి రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ప్రతి నిరుద్యోగికీ 20 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. బడ్జెట్లో కనీసం కేటాయింపులు చేయలేదు. సూపర్ సిక్స్ పథకాలు సమర్థంగా అమలు చేశామనడం యువతను వంచించడమే. ఉద్యోగం వచ్చే వరకూ ప్రభుత్వం నుంచి భృతి వస్తుందని ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. – అడిగర్ల రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, నర్సీపట్నంచంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రేమనే చూపింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605 కోట్లు చూపుతున్నారు. వాస్తవికంగా చూస్తే మెజార్టీ నిధులు రూ.400 కోట్లకు పైగా కేవలం పునరావసం, జీతభత్యాలకే వెచ్చించనుంది. అసలైన ప్రాజెక్టు పనులకు రూ.200 కోట్లను కూడా కేటాయించలేదని స్పష్టమవుతోంది. తాండవ ప్రాజెక్టు వద్ద రూ.470 కోట్లకుపైగా వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూ మంత్రంగా రూ.8.13 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకుంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
‘రెడ్ రోప్’ విద్యార్థులకు కేథరిన్ ఆశ్రయం
తగరపువలస: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెచ్ఐవీ, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు సైకిల్ యాత్ర చేస్తున్న రెడ్ రోప్ ఆర్గనైజేషన్ విద్యార్థులు 15 మందికి భీమిలి కేథరిన్ విద్యాసంస్థల యాజమాన్యం ఆదివారం ఆశ్రయం కల్పించింది. ఈ నెల 9న విజయవాడ నుంచి బయలు దేరిన బృందం 5 జిల్లాల్లో 600 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ఇందులో భాగంగా వీరికి కేథరిన్ విద్యార్థులు స్వాగతం పలికారు. బృంద సభ్యులు మాట్లాడు తూ ప్రేమాభిమానాలు పెంచుకుని, కోపం తగ్గించుకోవాలన్నారు. వ్యసనాలకు బానిసలైతే అమూ ల్యమైన జీవితం కోల్పోతామన్నారు. ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత ఆలీవర్ ఆర్ రాయి, డైరెక్టర్ ఇవాంజలిన్ రాయి, డీన్ హెప్సీబాలు సైకిల్ యాత్ర బృందాన్ని అభినందించారు. -
ఉత్తరవాహినిలో శివనామస్మరణ
నర్సీపట్నం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బలిఘట్టం ఉత్తరవాహిని నది ఒడ్డున త్రిశూల పర్వతంపై వేంచేసియున్న బ్రహ్మలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఉత్తర వాహిని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామికి లింగోద్భవ కాలమహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు దేవరజంగాలతో పితృదేవతలను పోగిడించుకున్నారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మనస్సులో కోరికను గురుదేవుల చెవిలో చెబితే నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. గురుదేవుల రథోత్సవాన్ని పట్టణంలో భక్తులు ఊరేగించారు. శ్రీసత్యనారాయణస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు సదుపాయాలు ఏర్పాటు చేశారు. నాయుడు జ్యూయలర్స్ వారు మజ్జిగ, రోటరీ, శ్రీసత్యసాయి సేవా సంఘం వారు ప్రసాదం పంపిణీ చేశారు. టౌన్ సీఐ గపూర్ ట్రాఫిక్ను నియంత్రించారు. స్నానాలు ఆచరించే ప్రాంతంలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించేలా మున్సిపల్ కమిషనర్ సురేంద్ర చర్యలు చేపట్టారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేసి 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేసి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణం అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని అధిష్టింపజేసి అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. -
హామీలకు, ఆచరణకు పొంతన లేదు
ఎన్నికల ముందు రైతుల కోసం చెప్పిన దానికి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేస్తున్న దానికి పొంతన లేదు. రైతులకు బడ్జెట్లో కేటాయింపు చూస్తే చాలా దారుణంగా ఉంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం అందించి రైతులకు భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో కొందరు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందించలేదు. వ్యవసాయ రైతులకు చేసిన దానికి కంటే ఈ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం అధికంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. – బొబ్బర ప్రకాశరావు, వీబీ అగ్రహారం (నాతవరం) -
సర్వం.. సుమనోహరం
● ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు ● మార్మోగిన పంచాక్షరి ● కిటకిటలాడిన ఆలయాలుదారమఠంలో పూజలు చేస్తున్న భక్తులుపంచాక్షరి జపం అఖండంగా కొనసాగింది... ఫాలభాగాన పరమ పవిత్రమైన విభూతి రేఖలను ధరించి ఫాలాక్షుని దర్శనం కోసం పరితపిస్తూ భక్తకోటి బారులు తీరింది..తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ,ఈశాన ముఖాయనమః అని పంచముఖేశ్వరుని స్మరిస్తూ... పరవశిస్తూ పరమ సంతోషంగా ఫలం,తోయం,పుష్పం,భస్మం సమర్పించింది.. ఆ సుమనోహర దివ్యరూపాన్ని కనులారా వీక్షించి అలౌకికానందంలో తేలియాడింది... జాగరణ చేసి జంగమయ్యను సేవించింది...హర హర మహాదేవ అంటూ పులకించిపోయింది. పుణ్యస్నానాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో అడుగడుగునా ఆధ్యాత్మిక వెల్లివిరిసింది..మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లాలో పంచదార్ల ఉమాధర్మలింగేశ్వరుడిని, ధారమఠంలో ధారమల్లేశ్వరుడిని, చోడవరంలో గౌరీశ్వరుడిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. కల్యాణపులోవ జలాశయం, బలిఘట్టం ఉత్తరవాహిని, పంచధారలోని ఆకాశధారలో భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించారు. శైవ క్షేత్రాలు ఇల కై లాసంగా విరాజిల్లాయి. – సాక్షి, నెట్వర్క్ -
అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అనకాపల్లి: జిల్లాలో అక్రమమైనింగ్్కు అధికారులు అడ్డుకట్టవేయడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన మైనింగ్ చెక్పోస్టులను ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క అనకాపల్లి మండలంలోనే రోజుకు 500 పైగా లారీలతో రాంబిల్లి మండలంలో పోర్టుకు (ఎన్వోబి), ఇతర ప్రాంతాలకు పిక్కతోపాటు ఇతర మెటీరియల్ సప్లై జరుగుతోందని చెప్పారు. దీనిపై మైనింగ్, విజిలెన్స్, రవాణాశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం పక్కతోవ పడుతోందని చెప్పారు. మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద ఎ.ఎం.ఆర్ సంస్థ అక్రమంగా చేక్ పోస్టు పెట్టడంతో ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు పోతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్థ ద్వారా స్థానిక ఎంపీ సీఎం రమేష్ అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మైనింగ్శాఖకు సంబంధించిన బోర్డులు పెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో దశలువారీగా జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజలు సహాకారంతో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గంటా శ్రీరామ్, అల్లు రాజు, కాళ్ళ తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల చలో విజయవాడ రేపు
యూటీఎఫ్ కార్యాలయంలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శి అంబేడ్కర్ ఆరిలోవ: పీఆర్సీ సాధన కోసం ఈ నెల 17న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అంబేడ్కర్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కమిషన్ను నియమించలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఫిట్మెంట్ ప్రకటన, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు తదితర డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, సహాధ్యక్షుడు ముత్యాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణపులోవ జాతరకు పోటెత్తిన భక్తులు
రావికమతం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణపులోవలో వెలసియున్న పోతురాజుబాబును ఆదివారం సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ , అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తదితరులు దర్శించుకున్నారు. వారికి దేవదాయ ధర్మదాయశాఖ ఈవో సత్యనారాయణ మూర్తి ఆహ్వానం పలికారు. మహాశివరాత్రి సందర్బంగా కళ్యాణపులోవ పోతురాజుబాబు, పెద్దింటమ్మ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా మెదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి పోతురాజుబాబును దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా , డీఎస్పీ శ్రావణి పర్వవేక్షణలో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టి నిరంతర సీసీ కెమెరాలలో నిఘా ఏర్పాటు చేశారు. చోడవరం ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ఆలయ వద్ద భక్తులకు అన్న సమారాధన జరిపారు. -
పశువుల అక్రమ రవాణా పై ప్రభుత్వం స్పందించాలి
నక్కపల్లి: కూటమి పెద్దల ప్రమేయంతోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పశువుల అక్రమ రవాణా జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాడి రైతులను, కూలీలను అడ్డం పెట్టుకుని కొంతమంది ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల నుంచి పశువులు కొనుగోలు చేసి హైదరాబాద్, కేరళ తదితర ప్రాంతాల్లో ఉన్న గోవధ శాలలకు తరలిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన శేఖర్, రాజమండ్రి కత్తిపూడి ప్రాంతానికి చెందిన శ్రీను తదితరులు నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు, కూలీల ఆధార్ కార్డులు సేకరించి పశువులు కొని వారి పేరుతో అక్రమంగా అనుమతులు పొంది కబేళాలకు తరలిస్తూ కోట్లు గడించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద నాయకులు, ప్రజా ప్రతినిధులు అండతోనే వీరు పశువులను తరలిస్తున్నారన్నారు. శేఖర్ అనే వ్యక్తి ప్రజా ప్రతినిధులు అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ దందాలు చేస్తున్నాడని తెలిపారు. పోలీసులు ఇతనికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ముఠా పై చర్యలు తీసుకోవాలనికోరారు. పశు అక్రమ రవాణా పై బీజేపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో పాడి రైతులు దండు బాలరామ రాజు, వేగేసిన చంటి రాజు, సకిరెడ్డి రమణ, సఖిరెడ్డి వెంకటరావు, రైతుకూలీలు రామ్ ప్రసాద్,దేవర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలు గ్రామాలకు చెందిన పాడి రైతులు, కూలీలు వీసం రామకృష్ణ ని కలిసి పశు మాఫియా వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించి, తమకు అండగా నిలవాలని కోరారు. -
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న దేవరాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని తరగతుల ప్రజలను మోసం చేసేదిగా ఉందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ఎటువంటి భరోసా, కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 3వేల నిరుద్యోగ భృతి, ప్రతీ ఆడ పడుచుకు ఏడాదికి నెలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసగించడమేని చెప్పారు. విశాఖ ఉక్కు అభివృద్ధి, కడప ఉక్కు నిర్మాణం మాటే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితులకు కేవలం రూ. 6105 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఈ నిధులు గేట్లు పెట్టేందుకు సైతం సరిపోవని ఎద్దేవా చేశారు. ఇలాంటి కేటాయింపులు చేస్తే మరో 20 ఏళ్లు అయిన పోలవరం పూర్తయ్యే పరిస్థితి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర కేటాయింపులతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, నగదు బదిలీ ప్రవేశ పెట్టేందుకు పూనుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. హక్కుగా రావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల సబ్ ప్లాన్ నిధుల ఊసెత్తకుండా అంకెల గారడి చేసి ప్రజలను మభ్య పెట్టారని వెంకన్న మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని, కార్పొరేట్ రంగాన్ని, టూరిజాన్ని మాత్రమే పెంచే దిశగా బడ్జెట్ ఉందని, ఈ బడ్జెట్తో 2047 కాదు, మరో 100 ఏళ్లు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, హరితాంధ్రగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. -
ఇంటి పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి
గుడివాడ ఆక్వా పరిశ్రమ యజమానులతో మాట్లాడుతున్న డీపీవో మూర్తి ఎస్.రాయవరం: ఇంటిపన్ను చెల్లించని మొండి బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీవో ఎస్.ఎస్.ఎన్. మూర్తి ఆదేశించారు.మండలంలో తిమ్మాపురం,కొరుప్రోలు,గుడివాడ, పెదగుమ్ములూరు, ఎస్.రాయవరం పంచాయతీల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఇంటిపన్ను వసూళ్లకు చివరి రోజు కావడంతో డీపీవో ఆయా గ్రామాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఇంటిపన్ను, పరిశ్రమల ట్యాక్స్ చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుడివాడలో రొయ్యల పరిశ్రమల యజమానులతో మాట్లాడి, బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట(విశాఖ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఐఎన్ఎస్ డేగాలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇంటెలిజెన్స్ డీఐజీ అరిఫ్ హఫీజ్లతో కలసి అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం వాయు మార్గం ద్వారా ఐఎన్ఎస్ డేగాకు చేరుకునే రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ చోళాకు చేరుకుని, విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. 18న ఉదయం ఐఎఫ్ఆర్లో పాల్గొంటారని, అదే రోజు సాయంత్రం వాయు మార్గం ద్వారా ఢిల్లీకి బయల్దేరతారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు 18న ఐఎఫ్ఆర్కు హాజరవుతారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఐఎన్ఎస్ చోళా, జట్టీ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కాన్వాయ్ సెక్యూరిటీ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డీసీపీ మేరీ ప్రశాంతి, నేవల్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నిరాశపరిచిన బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ కూడా అన్ని వర్గాలనూ నిరాశపరిచింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్ అన్నారు.ఎన్నికల ప్రచార సభల్లోనూ పదే పదే చెప్పారు.దీంతో చాలా మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఓట్లు వేశారు.కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు.నాడు,నేడు పనులతో పాటు వేతన సవరణ,నిరుద్యోగ భృతి,ఆడబిడ్డ నిధి వంటి హామీలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసమే అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులున్నాయి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి విస్మరించారు. – అర్రెపు గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్,యలమంచిలి -
నూకతాత పండగ చూతము రారండి
● నేటినుంచి మూడు రోజులపాటు జాతర ● రాజయ్యపేటలో ఘనంగా ఏర్పాట్లు ● ఒడిశా నుంచి తరలివస్తున్న మత్స్యకారులునక్కపల్లి: మత్స్యకారుల ఆరాధ్య దైవం, ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన రాజయ్యపేట నూకతాత సంబరాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రెండో రోజైన మంగళవారం నూకతాత జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఉత్సావానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని, విగ్రహాలను రంగులతో తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.నూకతాత పండగను మత్స్యకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మత్స్యకారులతోపాటు, ఇతర సామాజిక వర్గాలవారు, చుట్టుపక్కల గ్రామాలవారు వేల సంఖ్యలో తరలివస్తారు. పండగలో భాగంగా శివరాత్రి నాడు జాగరణ చేసి తెల్లవారు జామున నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకువెళతారు. స్నానం అనంతరం విగ్రహాలను పూజారులు ఆలయానికి తీసుకువస్తున్న సమయంలో రోడ్డు పై వందలాదిమంది మత్స్యకారులు పడుకుంటారు. వారిపై నుంచి పూజారులు దాటుకుంటూవెళతారు. ఈ పండగలో ఇదే విశేషం. కోరిన కోరికలు తీరిన తరువాత ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పండగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున బాణ సంచా కాల్చడం ఈ పండగలో మరో ప్రత్యేకత. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు గ్రామంలో తిరునాళ్ల సందడి ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.విద్యుత్ దీపాలంకరణలో నూకతాత ఆలయం -
ధారమఠం.. భక్తజన సందోహం
గొలుగొండ: ప్రముఖ శైవక్షేత్రం ధారమఠం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. వేలాదిగా భక్తులతో కిటకిటలాడింది. సత్యసాయి ట్రస్టు సభ్యులు భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందజేశారు. చోద్యం యూత్ సభ్యులు ప్రత్యేకంగా 500 లీటర్ల పెరుగుతో మజ్జిగ పంపిణీ చేశారు. కృష్ణదేవిపేట గ్రామంలో నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. చీడిగుమ్మల కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. భారమఠంలో సోమవారం రాత్రి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీల విజేత కేజే పురం
దేవరాపల్లి: మండలంలోని తారువలో శ్రీభక్తాంజనేయ స్వామి తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ప్రథమ స్థానంలోను, వల్లంపూడి సిద్ధివినాయక ఎడ్లు ద్వితీయ స్థానంలోను, కూండ్రం మరిడిమాంబ ఎడ్లు తృతీయ స్థానంలోను నిలిచాయి. దేవరాపల్లి వేతమ్స్ నాయుడు ఎడ్లు నాల్గవ, కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ఐదవ, దేవరాపల్లి వీరాంజనేయ ఎడ్లు ఆరవ స్థానంలోను నిలిచాయి. విజేతలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చేతుల మీదుగా వరుసగా రూ. 25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4వేల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామి వారికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితరులు దర్శించుకున్నారు. సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, రాత్రి పలు సాసంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. -
సంద్రంలోసైనిక శోభ
తీరంలో విన్యాసంసాక్షి, విశాఖపట్నం: సంద్రంలో సందడి మొదలైంది.. నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తూర్పు తీరం.. కళకళలాడుతోంది. ఒకేసారి అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన విశాఖ నగరంలో.. మినీ ఐఎఫ్ఆర్గా పిలుచుకునే మిలాన్–2026 లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం సాయంత్రం నౌకాదళ స్థావరంలోని విపత్తు నిర్వహణ రక్షణ వేదిక(హెచ్ఏడీఆర్ హార్డ్) వద్ద మిలాన్ విలేజ్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించారు. మరోవైపు.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఇప్పటికే 15 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, రక్షణ రంగ ప్రతినిధులు, అధికారులు విశాఖ చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 17న నగరానికి చేరుకొని.. 18వ తేదీన యాంకరేజ్ ఏరియాలో జరిగే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ని సమీక్షించనున్నారు. దాదాపు 70 దేశాలకు చెందిన 50 యుద్ధ నౌకలు, సబ్మైరెన్లుతో పాటు భారత్కు చెందిన వార్షిప్స్, సీకింగ్స్, హెలికాఫ్టర్లు ఐఎఫ్ఆర్, మిలాన్లో భాగస్వామ్యం కానున్నాయి. భారీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, సంప్రదాయ బద్ధంగా.. చరిత్రని గుర్తు చేసేలా తయారు చేసిన ఐఎన్ఎస్వీ కౌండిన్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మిలాన్ విలేజ్ విశేషాలు.! మిలాన్ విలేజ్ అనేది కేవలం ప్రదర్శన వేదిక మాత్రమే కాదు... ఇది వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, రుచుల సమ్మేళనం. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల హస్తకళలు, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ప్రదర్శనలు ఉంటాయి. సందర్శకులకు, విదేశీ నౌకాదళ ప్రతినిధులకు భారతీయ వంటకాలతో పాటు అంతర్జాతీయ రుచులను ఆస్వాదించే అవకాశం కల్పించేలా మిలాన్ విలేజ్ని ఏర్పాటు చేశారు. ఈ విలేజ్ ఈ నెల 21 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రెండు దశల్లో మిలాన్ విన్యాసాలు.. 2024లో జరిగిన మిలాన్లో 50 దేశాలు భాగస్వామ్యం కాగా.. ఈసారి రికార్డు స్థాయిలో 70 దేశాల వరకూ విన్యాసాల్లో జతకట్టనున్నాయి. ఈ మినీ ఐఎఫ్ఆర్ రెండు దశల్లో జరగనుంది. 15 నుంచి 20 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా.. మిలాన్ విలేజ్ ప్రారంభం, అంతర్జాతీయ సముద్ర సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ దేశాల నౌకాదళాల మధ్య చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా 18న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆధ్వర్యంలో ‘ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ’ లో అన్ని దేశాలు పాల్గొననున్నాయి. 21 నుంచి 25 వరకూ సీఫేజ్ విన్యాసాలు ప్రారంభమవుతాయి. బంగాళాఖాతంలో వివిధ దేశాల యుద్ధనౌకలు కలిసి సంక్లిష్టమైన యుద్ధ విన్యాసాలు, కమ్యునికేషన్ డ్రిల్స్, వీరోచిత ఆపరేషన్లు నిర్వహిస్తారు. -
సరుగుడు జలపాతం వద్ద భక్తుల సందడి
నాతవరం: మహాశివరాత్రి సందర్భంగా సరుగుడు జలపాతంలో స్నానాలు చేసేందుకు భక్తులతో పాటు సందర్శకులు పోటీపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈప్రాంతమంతా ఆదివారం సందడి నెలకొంది. సరుగుడు, సుందరకోట పంచాయతీల శివారు 16 గ్రామాల గిరిజనులు శివరాత్రి పండగను ఘనంగా జరుపుకొంటారు. వారంతా సరుగుడు జలపాతంలో స్నానమాచరించి సమీపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో నాతవరం, సరుగుడు మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సందర్శకులు సరుగుడు జలపాతాన్ని సందర్శించిన అనంతరం తాండవ రిజర్వాయర్ను చూసేందుకు రావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు తగిన చర్యలు తీసుకున్నారు. -
స్టాళ్ల రకాలు, ప్రత్యేకతలివీ..
మిలాన్ విలేజ్లో హస్తకళల స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన హస్తకళలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సంకల్ప ఆర్ట్ విలేజ్ (కళాగ్రామం) వంటి సంస్థలు భారతీయ కళాఖండాలు, చేనేత వస్త్రాలు, స్కార్ఫ్లు, గృహాలంకరణ వస్తువులను ప్రదర్శిస్తున్నాయి. అదేవిధంగా.. విశాఖ ప్రత్యేకతను చాటేలా చెక్కతో చేసిన లైట్ హౌస్ బొమ్మలు, సంప్రదాయ జ్ఞాపికలు స్టాళ్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. విదేశీ ప్రతినిధులకు భారతీయ రుచులను పరిచయం చేసేలా వివిధ ప్రాంతాల వంటకాలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో తయారుచేసిన లడ్డూలు, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్తో చేసిన ప్రోటీన్ బార్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మిలాన్–2026కు గుర్తుగా టీ–షర్టులు, క్యాప్లు, ఇతర మెమెంటోలు కొనుగోలు చేయడానికి ప్రత్యేక స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. నౌకాదళ సామర్థ్యాన్ని, స్వదేశీ పరిజ్ఞానాన్ని వివరించేలా కొన్ని విద్యాపరమైన ప్రదర్శన స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. -
లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
దేవరాపల్లి: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ శనివారం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి దేవరాపల్లి వైపు గంజాయి తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపురం చెక్ పోస్టు వద్ద స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. జీనబాడు వైపు నుంచి బైక్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని, బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో రెండు ప్యాకెట్లలో ఉన్న రెండు కిలోల లిక్వడ్ గంజాయి బయటపడింది. నిందితుల నుంచి లిక్విడ్ గంజాయితో పాటు బైక్, రూ. 3వేలు నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని, లిక్విడ్ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి విశాఖపట్నం మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు యత్నించినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన రంజాన్ జాకీర్ మన్సూరి, డుంబ్రిగుడ మండలానికి చెందిన గోల్లోరి దానేష్, పాంగి దేవదాస్ ఉన్నారు. వీరిని చోడవరం కోర్టుకు తరలించనున్నట్లు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి. సత్యనారాయణ వెల్లడించారు. -
సాగరం సాక్షిగా సాహస విన్యాసం
ఏయూ క్యాంపస్: సాగరం సాక్షిగా సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. కదన రంగాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించారు. భారత నావికాదళ సమన్వయం, సమర్ధతకు ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది. బీచ్ రోడ్డులోని రామకృష్ణ బీచ్ ప్రాంగణం వద్ద శనివారం సాయంత్రం భారత నావికా దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు నగరవాసులను, పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయి, ఆకాశంలో రివ్వున ఎగురుతూ యుద్ధానికి సిద్ధం అన్న విధంగా దూసుకు వెళుతున్న లోహ విహంగాలు, నేలపైన సమరానికి సయ్యంటూ పరుగులు తీసిన యుద్ధ ట్యాంకులు ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపే విధంగా నమూనా విన్యాసాలు సాగాయి. భారత నావికాదళ అమ్ముల పొదలో ఉన్న అనేక యుద్ధ విమానాలు హెలికాప్టర్లు చేసిన సింక్రనైజ్డ్ విన్యాసాలు దేనికదే సమయపాలన, సమన్వయాలకు ప్రతీకలుగా నిలిచాయి. విశాఖ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన నావికాదళ విన్యాసాలు పర్యాటకులను నగరవాసులను అమితంగా ఆకట్టుకున్నాయి భారతదేశ నావికాదళ బలాన్ని, దేశభద్రతలో చేస్తున్న సేవను ప్రతిబింబించే విధంగా ఈ సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. ఐఎఫ్ఆర్కు సమయం దగ్గరవుతున్న నేపధ్యంలో ప్రధాన వేదికతో సహా ఇతర ఏర్పాట్లు వేగం పుంచుకున్నాయి. సిటీ పెరేడ్ జరిగే సాగర తీరం అంతా పోలీసులు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిలో భాగంగా తీరాన్ని జల్లెడపడుతున్నారు. పోలీసు జాగిలాలలో అణువణువు తనిఖీ చేస్తున్నారు. -
రక్తపు మడుగుల్లో వృద్ధురాలి ఆర్తనాదం
డాబాగార్డెన్స్: జనంతో కిక్కిరిసిన పూర్ణామార్కెట్ ప్రాంతం కొనుగోళ్ల సందడి మధ్య ఒక్కసారిగా విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన 70 ఏళ్ల వృద్ధురాలు క్షణాల్లోనే రక్తపు మడుగులో పడిపోయింది. ఆరిలోవకు చెందిన ఆమె శనివారం సాయంత్రం మార్కెట్కు వచ్చింది. జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వైపు వెళ్తున్న 52డి నంబరు గల ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. కాలు నుజ్జునుజ్జయింది. రక్తస్రావంతో ఆమె రోడ్డుపై పడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. చివరకు కేజీహెచ్కు తరలించారు. -
17న చలో విజయవాడ
అనకాపల్లి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ), బకాయిపడ్డ కరువు భత్యం (డీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతి కిషోర్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పీఆర్సీ గడువు రెండేళ్ల 8 నెలలు పూర్తయిందని, ఈ జాప్యం ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతభత్యాలపై ఎంతో నష్టాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతల కరువు భత్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాలు కావస్తున్న ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఎన్నికల హామీ మేరకు మెరుగైన వేతన సవరణ చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, జిల్లా కార్యదర్శులు రమేష్ రావు, గుత్తుల సూర్యప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్.ఎస్. నాగమణి, ఎల్లయ్యబాబు, ఎం.వి అప్పారావు పాల్గొన్నారు. -
అప్పులబాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్ : అప్పులబాధ తాళలేక స్క్రాప్ షాపు యజమాని రాగల ఆదినారాయణ (45) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భీమవరానికి చెందిన ఆదినారాయణ అచ్యుతాపురం మండలం వెదురువాడ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉంటూ అక్కడే స్క్రాప్ షాపు నడుపుతున్నాడు. అప్పు తీసుకుని ఇనుప సామగ్రి కొనుగోలుకు వ్యాపారపరంగా గాజువాకకు చెందిన ఓ వ్యక్తికి రూ.4లక్షలు ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం వల్ల, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఆదినారాయణ ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు. -
అసెంబ్లీలో మా గళం వినిపించండి
రెండో రోజుకు చేరిన ఏయూ అతిథి అధ్యాపకుల ఆందోళన మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ప్రొఫెసర్ సూరప్పడు వారికి సంఘీభావం తెలిపారు. నెలవారీ వేతనాల కోసం అతిథి అధ్యాపకులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, వారి పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థులైన ఎమ్మెల్యేలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. ప్రస్తుతం ఏయూలో కేవలం 165 మంది మాత్రమే పర్మనెంట్ ఆచార్యులు, 91 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, కానీ సుమారు 300 మంది అతిథి అధ్యాపకులే భారాన్ని మోస్తున్నారని సురేష్ మీనన్ వివరించారు. ఏయూకు నాక్ ఏ–ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడంలో తమ కృషి ఎంతో ఉందన్నారు. ఇంత చేస్తున్నా తమకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, దీని వల్ల నాణ్యమైన విద్యను అందించడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఏయూ అధికారులు స్పందించి తమ కష్టాన్ని గుర్తించి, వెంటనే నెలవారీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపకులు శేషు, ఫణి, మురళి, పీతాని ప్రసాద్, దుర్గ ప్రసాద్, వీరేంద్ర, విక్రమ్, దేవానంద్, సునీల్, అంబేడ్కర్ సుమంత్, దివ్య, అమృత తదితరులు పాల్గొన్నారు. -
60 కిలోల గంజాయి స్వాధీనం
మాకవరపాలెం: ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యాన్లో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో అందించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన రహీమ్ షరీఫ్(29) తన మినీ వ్యాన్తో అరకు మీదుగా ఒడిశాలోని పాడువ గ్రామానికి వెళ్లాడు. అక్కడ శ్రీను అనే వ్యక్తి నుంచి కిలో రూ.6,000 చొప్పున 60 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దీనిని వ్యాన్పై తరలిస్తుండగా మండలంలోని రాచపల్లి జంక్షన్లో శనివారం పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ గంజాయిని బయట విక్రయిస్తే రూ. 30 లక్షలు వస్తుందని చెప్పారు. గంజాయితోపాటు వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రహీమ్ షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, ఈ కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి సయ్యద్ తన్వీర్, పాడువకు చెందిన శ్రీను పరారీలో ఉన్నారన్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్ఐ దామోదర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోడవరం సబ్ రిజిస్ట్రార్కు పతకాల పంట
● జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సత్తా పతకాలు అందుకుంటున్న గీతాలక్ష్మి చోడవరం: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చోడవరం సబ్ రిజిస్ట్రార్ బి.గీతాలక్ష్మి పతకాలు సాధించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో 45వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆమె డిస్క్ త్రో విభాగంలో బంగారు, ట్రిపుల్ జంప్లో వెండి, లాంగ్ జంప్, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాధించారు. గతంలోనూ గీతాలక్ష్మి అనేక పోటీల్లో పతకాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ పోటీల్లో సత్తా చాటడంతో అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. -
ఏపీ పీఆర్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నిక
మహారాణిపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి జి.రత్నకుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఓమ్మి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.నరేష్బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్గా బి.రవి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా టి.చంద్రశేఖర్, జి.చాందిని, ఎ.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.రాధాలక్ష్మి, వై.విజయకుమారి, ఎం.నాగభూషణం నాయుడు, డి.కవిత ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా డి.సింహాచలం, బి.ఈశ్వర్, వి.కిరణ్, ఎం.వి.ఎస్.కౌశిక్, కోశాధికారిగా కె.జె.ఎస్.చక్రి, కోఆప్టెడ్ సభ్యురాలిగా పి.నిర్మల ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎస్.రాజేష్ ప్రభుకుమార్ వ్యవహరించారు. విజయం సాధించిన నాయకులను ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్.త్రినాథ్, కె.గంగాధర్లు అభినందించారు. -
మైనింగ్ చెక్పోస్టు వల్లే ఆర్మీ ఉద్యోగి మృతి
అనకాపల్లి: మండలంలో మార్టూరు జంక్షన్లో అక్రమ మైనింగ్ చెక్పోస్టు వద్ద లారీలు నిలుపుదల చేయడంతో బవులవాడకు చెందిన ఆర్మీ ఉద్యోగి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం తెలిపారు. అక్రమ మైనింగ్ చెక్పోస్టులను తక్షణమే తొలగించాలని కోరుతూ మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గెలిచిన తర్వాత జిల్లాలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. యజమానులు రెండు నుంచి ఐదెకరాలకు పర్మిషన్ తీసుకుని పది, పదిహేను హెక్టార్ల వరకు అక్రమంగా మైనింగ్్ చేస్తున్నారన్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ దందా సాగుతుందన్నారు. కొండలను బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఇళ్లు, పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో రోజుకు రెండు వేల భారీ వాహనాల ద్వారా అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారన్నారు. వీటికి ప్రభుత్వ పే బిల్లులు ఉండటం లేదని, కోట్లాది రూపాయల గ్రామీణ సంపదను రాజకీయ నాయకులు దోచుకోవడం అన్యాయమన్నారు. మండలంలో 115 క్వారీల్లో చాలా వాటికి అనుమతులు లేవన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, కాళ్ల తలయ్యబాబు, అల్లు రాజు, కె. ఈశ్వరరావు, చలపతి, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
జేసీగా శౌర్యమాన్ పటేల్ బాధ్యతల స్వీకరణ
తుమ్మపాల/అనకాపల్లి: జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులైన శౌర్యమాన్ పటేల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతవరకు అమరావతి కేంద్రంగా ఉన్న ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కలెక్టర్ కార్యాలయ కోఆర్డినేషన్ విభాగం పర్యవేక్షకుడు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎస్.వి.ఎస్.నాయుడు (వాసు) ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. నూకాంబికను దర్శించుకున్న జేసీ ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని నూతన జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శనివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహా కమిషనర్ యళ్ల శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల సహకారంతో జిల్లా అభివృద్దికి కృషి చేస్తానన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేసింది
నిరుద్యోగ భృతి మాటేది? రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి రాయితీలు, మే లు చేసే అంశాలు ఉంటాయోనని నాలాంటి యువత ఎదు రు చూశారు. కానీ మా ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడ్జెట్లోదాని ఊసేలేదు. దీనికోసం నిధులు కేటాయి స్తారని అంతా అనుకున్నాం. ఈ ఏడాది భృతి లేన ట్టే. –వాండ్రాసి శివశంకర్, గ్రాడ్యుయేట్,విశాఖచంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా సక్రమంగా బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. పేదకుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. బడ్జెట్లో గ్యాస్ సబ్సిడీకి నిధులు కేటాయించలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రచారయావే తప్ప చిత్తశుద్ధి లేదు. గ్యాస్ సబ్సిడీ జమచేయకపోవడం వల్ల బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. – బొడ్డా శ్రీదేవి, డ్వాక్రా సభ్యురాలు మంగవరం, పాయకరావుపేట -
అన్ని వర్గాలకు మొండి చేయి
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా మూడోసారీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మసిపూసి మారేడుకాయ చేసినట్టు బడ్జెట్ ఉందని విమ ర్శించారు.హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. సూపర్ సిక్స్ అమల్లో ప్రభుత్వం అట్టర్ప్లాప్ అయిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు అంతులేని హామీలిచ్చి..ఇప్పుడు బడ్జెట్లో నిధుల కేటాయింపులో మొండిచేయి చూపారని మండిపడ్డారు.తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు బడ్జెట్లో కోతలు విధించి, సా మాన్యుల ఆశలపై నీళ్లు జల్లారని చెప్పారు. అభివృద్ధిని అంకెల రూపంలో చూపిస్తూ, ఆచరణ లో సాధ్యం కాని హామీలతో ఈ బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఎద్దేవా చేశా రు. అన్నదాత సుభీభవకు అరకొర నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో 54 లక్షల రైతు కుటుంబాలకు కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తామన్న హామీని చంద్రబాబు విస్మరించారని తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ పథకానికి పైసా కేటాయించకుండా మళ్లీ మోసం చేశారని విమర్శించారు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు మహిళలను దగా చేశారని తెలిపారు. ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయి లో చాలామందికి తల్లికి వందనం అందడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో మొండిచేయి చూపారని చెప్పారు పీఆర్సీ, ఐఆర్ ఊసేలేదన్నారు. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సీపీఎస్ రద్దుపైనా బడ్జెట్లో ప్రస్తావనలేదన్నారు. విద్యారంగాన్ని విస్మరించిందన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకంలో కోత విధించిందని చెప్పారు. బకాయిలపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇప్పటికే విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి రూ.8 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని తెలిపారు.పేదల గృహ నిర్మాణంపైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వం ఖాతాలో వేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. -
రూ.2కోట్లే!
రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రం ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ ● విశాఖ మెట్రోకు విజయవాడ లింక్.. పనులపై నీలినీడలు ● ఏయూ, సాగునీటి ప్రాజెక్టులపైనా చిన్నచూపు ● తాండవ ఎత్తిపోతలకు చెక్.. నిర్వహణకే పరిమితం ● విశాఖ–చైన్నె కారిడార్ భారం జీవీఎంసీపైనే ● అరకు కాఫీపై అదే పాత పాట అనకాపల్లి జిల్లాకు నిరాశే మిగిల్చింది 2026–27 వార్షిక బడ్జెట్ అనకాపల్లి జిల్లా ప్రజలను, నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్గా పేరుగాంచిన అనకాపల్లి జిల్లాకు ఈ బడ్జెట్లో మొండిచేయి చూపడం విచారకరం. ముఖ్యంగా ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం ఊసే లేదు. తాడి, మూలస్వయంభూవరం గ్రామాల తరలింపు కోసం నిధులు కేటాయిస్తారని కొండంత ఆశతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. పర్యావరణానికి నష్టం కలిగించే కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. – గనిశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారీ బడ్జెట్ లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ నగర అభివృద్ధికి విదిల్చిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ. 2 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో విశాఖ నగరానికి దక్కింది 0.000006 శాతం మాత్రమే. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా.. మరోవైపు విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్ పనుల భారాన్ని జీవీఎంసీపై మోపింది. ఇందుకోసం జీవీఎంసీ ఖజానా నుంచి రూ.22.28 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు.. ఇంకా ఆమోదం లభించని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులను కేటాయించింది. దీనిని బట్టి విజయవాడ మెట్రో పనులు మొదలయ్యేదాకా విశాఖలో పనులు మొదలుపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్లయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తాండవ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. కేవలం ప్రాజెక్టు నిర్వహణ కోసం మాత్రమే తూతూమంత్రంగా నిధులను కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 605 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా.. ఆచరణలో ఈ నిధుల్లో అత్యధిక భాగం కేవలం పునరావాసం, జీత భత్యాలకే సరిపోనున్నాయి. మరోవైపు ఏజెన్సీపై అదే వివక్షను కొనసాగించింది. గత ఏడాది చెప్పినట్టుగానే ఈ సారి కూడా 25 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.16 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో చూపారు. నగర అభివృద్ధిపై శ్రద్ధ ఏదీ? రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం పదే పదే వల్లె వేస్తోంది. కానీ, నిధుల కేటాయింపు విషయానికి వచ్చే సరికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడుతోంది. తాజాగా విజయవాడ, విశాఖ మెట్రోలకు కలిపి బడ్జెట్లో కేవలం రూ.15.50 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇంకా ఆమోదం కూడా లభించలేదు. కానీ, ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు ప్రత్యేక కేటాయింపులు జరపకుండా.. అనుమతులు లేని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులు విదిల్చడం విశాఖపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేదాకా విశాఖ మెట్రో పనుల్లో కదలిక ఉండదనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. సిటీస్ ప్రాజెక్టు కింద ఒక కోటి రూపాయలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మరో కోటి రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. నగర అభివృద్ధి కోసం ఇలా కేవలం రూ.2 కోట్లు విదిల్చిన ప్రభుత్వం.. మరో చేత్తో ఏకంగా రూ. 22 కోట్లకు పైగా నిధులను కాజేస్తోంది. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్లో పలు అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీ నిధులపై ప్రభుత్వం కన్నేసింది. ఈ పనుల కోసం ఏకంగా రూ. 22.28 కోట్లు జీవీఎంసీ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కంటే జీవీఎంసీపై పడుతున్న అదనపు భారమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ‘సూపర్ సిక్స్’జాడేది? ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించిన ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. యువతకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందించే పథకానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మరోవైపు గ్యాస్ రాయితీ కింద ఇవ్వాల్సిన మొత్తానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్లో చూపించడం గమనార్హం. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం ద్వారా, పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని అరకొర కేటాయింపులివే... ● విశాఖ, తిరుపతి జూ పార్కులకు కలిపి బడ్జెట్లో కేవలం రూ. 3.30కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన విశాఖ జూ పార్కు వాటా రూ.1.65 కోట్లకు పరిమితమైనట్లేనని స్పష్టమవుతోంది. ● విశాఖపట్నం, కడప జిల్లాలోని ఉన్న మానసిక ఆసుపత్రులకు రూ.13 కోట్లను కేటాయింపులు జరిగాయి. ఇందులో విశాఖ మానసిక ఆసుపత్రికి సగటున రూ. 6.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చే నిధులు కావడం గమనార్హం. ● తొట్లకొండ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రేహౌండ్స్ భవనాలకు రూ. 3 కోట్లు, విశాఖలోని గ్రేహౌండ్స్ రీజనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ. 3 కోట్లు కేటాయించారు. పీఎంపాలెంలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి రూ. 3.5 కోట్లు కేటాయించారు. ● విచిత్రమేమిటంటే... విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనంతో పాటు... ఆరిలోవ ఏసీపీ కార్యాలయం, మహారాణిపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1.5 కోట్లు విదిల్చారు. మొత్తంగా నగరాభివృద్ధితో పాటు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ అరకొర కేటాయింపులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖకు విదిల్చింది.. ఉపాధి కార్మికులకు నష్టమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జీరాంజీ పథకానికి రూ.8,365 కోట్లు మాత్రమే కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు రూ.12 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 66 లక్షల మందికి 125 రోజులు పనిక ల్పించాలంటే రూ.31,680 కోట్లు అవసరమవుతాయి. మిగిలిన రూ.11 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించలేకపోవడం వల్ల ఉపాధి కూలీల పనిదినాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంత వలసల నివారణకు తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఉత్తరాంధ్ర స్రవంతి ప్రాజెక్ట్ ప్రభుత్వాల నిర్లక్య్యాని గురవుతోంది. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. – రాజాన దొరబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి, అనకాపల్లి భృతి లేదు, భర్తీ లేదు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నిరుద్యోగ భృతి, ఉద్యోగల భర్తీ ఊసే ఎత్తడం లేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతిగా రూ.3వేలు అందిస్తామని, జాబ్ కాలెండర్ కూడా విడుదల చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. ఈ సారి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి పైసా కూడా కేటాయించకుండా నమ్మక ద్రోహం చేశారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతూ విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో కోచింగ్ ఫీజులు, పుస్తకాలు, ప్రయాణ ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. కుటుంబాలపై ఆధారపడుతూ జీవనం సాగించడం అవమానంగా అనిపిస్తోంది. ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం ఇచ్చే భృతి అయినా వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నామాకు నిరాశే ఎదురైంది. –నందవరపు సాయి, నిరుద్యోగి, రేబాక గ్రామంనిరాశాజనకంగా బడ్జెట్ చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని బడ్జెట్లో పేర్కొనడం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే. డయాఫ్రమ్ వాల్ సమస్యలు, నిర్వాసితుల పరిహారం తేలకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. విదేశాల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చి కడుతూ..దానికి స్వయం సమృద్ధి అని రంగు పూయడం మసిపూసి మారేడు కాయ చేయడమే. సూపర్ సిక్స్ హామీలు అమలుకు నిధులు కేటాయింపులో సర్కార్ విఫలమైంది. – కె.శివనారాయణరాజు, పన్ను చెల్లింపుదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి, నర్సీపట్నం చెరకు రైతులకు బడ్జెట్లో మొండి చెయ్యి గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంతోపాటు, చెరకు రైతులకు , కార్మికులకు రూ. 28కోట్లు బకాయిలు చెల్లింపునకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడా కేటాయింపులు చేయలేదు. కార్మికులు, చెరకు రైతులు కలిసి బకాయిల కోసం ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక దీక్షలు చేస్తే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యే వచ్చి బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం పెద్దలతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. చెరకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. –వి.వి. శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నెలకు రూ.1500 ఏవీ? చంద్రబాబు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఆ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు.బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఇకపై కూడా అమలు చేస్తారన్న నమ్మకం కూడా కలగడం లేదు. మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఆ హామీని అటకెక్కించారు. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. – ధూళి అమ్మాజీ,ఎంపీటీసీ,పంచదార్ల ఏయూపై అదే వివక్ష -
‘సుఖీభవ’ నిధులకు కోత
రాష్ట్రంలో అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. జిల్లాలో కౌలు రైతులకు ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.2024–25 ఆర్థిక సంవత్సరంలో నిధులు జమ చేయలేదు.ఎన్నికల ముందు రైతుల ఓట్లు రాబట్టుకోవడం కోసం అన్నదాత సుఖీభవ ఇస్తామని,జిల్లాలో మూత పడిన నాలుగు చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామని ఇచ్చిన హామీ కూడా గాలికొదిలేశారు.అదేవిధంగా అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపు జరగలేదు. – కర్రి అప్పారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు,అనకాపల్లి -
ఉపాధ్యాయుల ధర్నా
తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఐ.వి.రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్ రద్దు చేసి, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియామకం చేపట్టాలని, మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పరదేశి, రాష్ట్ర కౌన్సిలర్ పి.గంగాధర్, ఉపాధ్యక్షుడు ఉదయ భాస్కర్,మహిళా అధ్యక్షురాలు సునీత, అసోసియేట్ అఽధ్యక్షుడు భాస్కర్, ఎలమంచిలి బాధ్యులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రుడికి ప్రతి నెలా రూ.2 వేల సాయం
● విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ భరోసా మంచానికే పరిమితమైన రాముకు సాయం చేస్తున్న విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ నాతవరం: కష్టాల్లో ఉన్న పేదలను మావవతా దృక్పథంతో ఆదుకోవడమే తన ధ్యేయమని ఏకే వెల్ఫేర్ సేవా సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఎంఈవో తాడి అమృత్కుమార్ తెలిపారు. మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాము కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతడి భార్య(బాలింత), ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాము కుటుంబానికి విశ్రాంత ఎంఈవో శుక్రవారం రూ.2 వేలు అందజేశారు. రాము పూర్తిగా కోలుకుని ఏదైనా ఉపాధి చేసుకునే వరకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అందజేస్తానని భరోసా కల్పించారు. తన పెన్షన్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు అందజేస్తున్నట్టు తెలిపారు. -
యువకుడు ఆత్మహత్య
యలమంచిలి రూరల్: చిన్నతనం నుంచి తనను పెంచిన పెద్దమ్మ,మేనమామ మృతి చెందడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ, మేనమామ ఇద్దరూ లేకపోవడమే ఆత్మహత్యకు కారణంగా తన డైరీలో రాసుకున్నాడు.ఈ ఘటన యలమంచిలి పట్టణం ద్వారకానగర్ పాత ఎస్బీఐ కాలనీలో చోటుచేసుకుంది.పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపిన వివరాలు... పాత ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు శుక్రవారం ఉదయం తను నివాసముంటున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు.మృతుని తల్లిదండ్రులు తగరపువలసలో ఉంటున్నారు. అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు తండ్రి తగరపువలసలో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం ఉదయం తమ కుమారుడికి పలుమార్లు ఫోన్ చేసినపుడు కాల్స్కు సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా తమకు తెలిసిన ఒక యువకుడ్ని శివనాగేశ్వరరావు వద్దకు వెళ్లాలని కోరారు.ఈ మేరకు ఆ యువకుడు అక్కడకు వెళ్లగా తలుపు వేసి ఉండడం చూశాడు.కిటికీలోంచి చూడగా శివనాగేశ్వరరావు ఉరి వేసుకుని మృతి చెందినట్టు గుర్తించి, తల్లిదండ్రులకు తెలిపాడు.ఒంటరి అయ్యాననే భావన,తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ,మేనమామ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతోనే బలన్మరణానికి పాల్పడినట్టు తన డైరీలో రాసుకున్నాడు.ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ప్రైవేటుగా పనులు చేసుకుంటూ బతుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
లాక్కునేందుకు కుట్ర
దళితుల భూములను సాక్షి, అనకాపల్లి/రాంబిల్లి(అచ్యుతాపురం): దళితలంటే చంద్రబాబు ప్రభుత్వానికి చాలా చులకన అని.. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితలకు ఇచ్చిన భూములను దౌర్జన్యంగా కూటమి నేతలు లాక్కొంటున్నారంటూ మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మండిపడ్డారు. అన్ని హక్కులున్నా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సెజ్ నిర్వాసితుల ఇంటి స్థలాల పేరిట డీ– పట్టాభూములను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం కాకుండా.. సెజ్ నిర్వాసితుల కోసమే తీసుకోవాలనుకున్నప్పుడు బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, నష్ట పరిహారం ఇవ్వకుండా, చట్ట విరుద్ధంగా ఎలా లాక్కొంటారంటూ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో భూములకు అధిక రేట్లు పలుకుతున్నందున దళితుల నుంచి లాక్కోవాలనుకుంటే.. వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో తమ భూములను లాక్కొనేందుకు యత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, స్థానిక కూటమి నేతలకు వ్యతిరేకంగా 12 రోజులుగా దళితులు నిర్వహిస్తున్న నిరసన శిబిరాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త్త బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి, సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగలి రాము సందర్శించి, మద్దతు తెలిపారు. బాధిత దళితులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. వారితో పాటు ధర్నాలో కుర్చొని చంద్రబాబు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, కూటమి నేతలు, అధికారుల తీరుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే..ఈ సమస్యను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామంటూ హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదు ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. డిపట్టాలున్నా సెజ్ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కోసమంటూ వారి దళితుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలని స్థానిక ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అఽధికారం ఇచ్చింది దళితుల భూములను దోచుకోవడానికి, లాక్కోవడానికి కాదన్నారు. దళిత రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నష్ట పరిహారం అందజేయకుండా రాత్రికి రాత్రే లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తే..వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని, దళితులకు అండగా న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. దళితులంటే చిన్నచూపు.. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగుల మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వానికి దళితులంటే చాలా చిన్నచూపని తెలిపారు. రాంబిల్లి మండలంలో ప్రభుత్వం భూమి ఉండగా సెజ్ నిర్వాసితుల కోసం దళితుల భూమే కనిపించిందా..? అంటూ మండిపడ్డారు. పేద దళితుల కడుపుకొట్టి..ఽఅక్రమంగా లాక్కొనేందుకు స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలి వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ భూములు అవసరమనుకుంటే దళితులకు పరిహారం చెల్లించి సేకరించాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇదే మండలంలో రాజకోడురు గ్రామంలో డీపట్టా ఉన్న రైతుకు ఎకరాకు రూ.50లక్షల చెల్లించి భూమి తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. హోం మంత్రి స్పందించరా ? వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి మాట్లాడుతూ..చంటి బిడ్డలతో ఉన్న దళిత మహిళలపై స్థానిక ఎమ్మెల్యే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. సొంత జిల్లాలో దళితులపై దాడులకు పాల్పడి..దళితుల భూములు లాక్కొంటున్నా దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి అనిత స్పందించారా..? అంటూ ప్రశ్నించారు. దళితుల భూములు లాక్కొనేందుకే ఈ ప్రాంతంలో జనసేనను గెలిపించారా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు దూళి నాగరాజు, సేనాపతి సంథ్యా రాము, ఎంపీపీలు గొట్టిముక్కల శిరీష శ్రీనుబాబు, కోన సంధ్య బుజ్జి, రాంబిల్లి మండల అధ్యక్షుడు కిషోర్ రాజు, రాంబిల్లి మాజీ యూత్ ప్రెసిడెంట్ ఉప్పులూరు నాయుడు, రాంబిల్లి మాజీ ఎంపీపీ కన్నం తిరుపతిరావు, రాంబిల్లి యూత్ అధ్యక్షుడు ధూళి వెంకీ, నర్మాల కుమార్, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు,సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగలి రాము, రాంబిల్లి మండలం సీపీఎం కార్యదర్శి గోకివాడ దేముడు, అచ్యుతాపురం సీఐటీయూ కార్యదర్శి కుండ్రపు సోమునాయుడు, పంచదార్ల గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు చందక రాజు, భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం అందజేత నాటి నుంచి సాగులో ఉన్న రైతులకు తెలియకుండా కాజేసేందుకు యత్నం నోటీసులు ఇవ్వకుండా అధికారులతో బెదిరించి ఎలా తీసుకుంటారు దళితుల నిరసనకు వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు హాజరైన కరణం ధర్మశ్రీ, జోగులు, బొడ్డేడ ప్రసాద్, సీపీఎం నేతలు -
మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం: మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం నుంచి ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకు కల్యాణపులోవ, ధారమఠం శివక్షేత్రాలకు నర్సీపట్నం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్.ధీరజ్ తెలిపారు. నర్సీపట్నం నుంచి ధారమఠానికి 10 బస్సులు, కల్యాణపులోవకు నర్సీపట్నం, కొత్తకోట, దొండపూడి ఫారెస్ట్ గేట్, కొంతలం, రావికమతం, చోడవరం ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
3,480 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,480 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.బాబ్జి, జి.ఫణీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రింగ్రోడ్డు జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ విద్యార్థుల విద్యా హక్కులను దెబ్బతీస్తూ, ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్న జీవోలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల పీజీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు. పరిశోధన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని వాపోయారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లు, అక్రమ ప్రవేశాలు వంటి అంశాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని నిరోధించకపోతే సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణికంఠ, అజయ్, దేవీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
గత టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారంగా భూముల వివరాలు మార్చేయడంతో రైత్వారీ ఇనాం భూములు దేవదాయ భూముల జాబితాలో చేరిపోయాయి. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కాక, ప్రభుత్వ పథకాలు వర్తించక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో కర్షకులు కష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇదిగో అదిగో అంటూ తిప్పుతున్నారు తప్ప చిత్తశుద్ధితో పరిష్కరించే నాథుడే కరవయ్యాడు.పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు అనకాపల్లి: జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు అదనపు ఏఎస్పీ ఎల్.మోహన్రావు తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ–సంపర్గ్(ఫోన్ ఇన్ ఎస్పీ) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ పోలీసుస్టేషన్ల్లో విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బంది ఫోన్ ద్వారా వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది సమస్యలపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సిబ్బంది తెలిపిన సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, బీమాబాయి, ప్రేయర్ సన్, ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
రావికమతం: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు, పెద్దింటమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ్కృష్ణన్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఇక్కడ జరిగే ఉత్సవాల సందర్భంగా అధికారులతో ఆమె సమీక్షించారు. ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలెన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు స్నాన ఘాట్ల వద్ద ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 70 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దొండపూడి చెక్పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణపులోవ రిజర్వాయర్లో స్నానాల ఘాట్లను సిద్ధం చేశామని, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రిజర్వాయర్, ఆలయం వద్ద సీసీకెమెరాలుతో నిరంతర నిఘాతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చోడవరం ఎమ్యెల్యే రాజు సహాయ సహకారాలతో ఆలయం వద్ద మూడు రోజులపాటు 28 కౌంటర్ల ద్వారా ఉచిత అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆయుష్మాన్ కేంద్రాన్ని సందర్శించిన టాస్క్ఫోర్స్
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు అచ్యుతాపురం రూరల్: మండలంలోని చోడపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం సందర్శించారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికలకు వైద్య పరీక్షలు, తదితర వివరాలు పరిశీలించారు. జిల్లా ఎన్హెచ్ఎం అధికారి డాక్టర్ ప్రశాంతి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎ.రామచంద్రరావు, డీపీవో కె.జగదీష్, అధికారులు పాల్గొన్నారు. -
శివపూజకు వేళాయె..
గొలుగొండ/నర్సీపట్నం: మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది. హరిహరులిద్దరికీ ప్రీతికరమైనది. మహా శివరాత్రి పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు ఎంతో నిష్టతో పుణ్యస్నానాలు ఆచరించి మహా శివుడ్ని దర్శించుకోనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ధారమఠం, ఉత్తరవాహిని శివరాత్రి స్నానాలు ఆచరించే భక్తులతో సందడిగా మారనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ధారమఠం శివాలయానికి తరలి రానున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. ఆలయం ప్రాంగణమంతా ఇప్పటికే భారీగా ముస్తాబు చేశారు. 15న రాత్రి మహా రుద్రాభిషేకం, జాగారం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో జలజలపారే జలపాతాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకోవడం కోసం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సులు గొలుగొండ నుంచి ధారమఠం శివాలయానికి వెళ్లడానికి నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. గొలుగొండ వద్ద భారీ చెక్పోస్టు ద్వారా ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో గొలుగొండ, నర్సీపట్నం రూరల్, టౌన్, కృష్ణదేవిపేట, నాతవరం ఎస్ఐల ఆధ్వర్యంలో వంద మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా గురుదేవుల ఆశ్రమం.... బలిఘట్టం ఉత్తర వాహినిని ఆనుకున్న పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. నిత్యం భక్తుల రాకపోకలతో గురుదేవుల ఆశ్రమం సందడిగా ఉంటోంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినాల్లో బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గురుదేవుల ఆశ్రమాన్ని సందర్శించి గురుదేవుల ఆశీస్సులు పొందుతారు. ఉత్తరవాహిని ఒడ్డున శ్రీరామ సమేత సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. స్వామి వారికి నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఉత్తర వాహినికి శివరాత్రి శోభ సువిశాలమైన వాతావరణం... నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడిగా ఉండే ఉత్తర వాహిని మహా శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. బలిఘట్టం త్రిశూల పర్వతంపై ప్రసిద్ధి చెందిన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి, సమీపంలో నది ఉత్తర ముఖంగా ప్రవహించడంతో దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు స్తంభాలు, గోపురం సైతం రాతితోనే నిర్మించడం విశేషం. శివరాత్రి రోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
ఇనాంచుతున్నారు
కె.కోటపాడు : మండలంలో చౌడువాడ, పాచిలవానిపాలెం గ్రామాలకు చెందిన 400 మంది రైతులు 270 ఎకరాలను సుమారు మూడు తరాలకు పైబడి సాగు చేసుకుంటున్నా పాసుపుస్తకాలు లేక వారికి ఎటువంటి హక్కులు, ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. పాచిలవానిపాలెంలో 140 ఎకరాలు, చౌడువాడలో 130 ఎకరాలు భూమిని సాగు చేస్తూ అన్నదాతలు జీవనం సాగిస్తున్నారు. 1959లో అప్పటి తహసీల్దార్ పాచిలవానిపాలెంను రైత్వారీ జమీందార్ గ్రామంగాను, భూములను రైత్వారీ ఇనాం భూములుగా గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు. దీంతో పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములు రైత్వారీ ఇనాం భూములగా గుర్తించి పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేయాల్సిందిగా 1989లో అప్పటి విశాఖపట్నం ఆర్డీవో కోర్టును రైతులు ఆశ్రయించారు. ఆర్డీవో భూముల పూర్తి రికార్డులను పరిశీలించి పాచిలవానిపాలెం గ్రామంలో గల భూములు ఎటువంటి ట్రస్టీకి చెందినవి కావని, రైత్వారీ ఇనాంభూములని తీర్పు ఇచ్చారు. ఆర్డీవో తీర్పును సవాల్ చేస్తూ చింతలపాటి బుచ్చి సీతయ్యమ్మ ట్రస్ట్కు చెందిన వారు డీఆర్వోను ఆశ్రయించారు. దీంతో పునర్విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోకు డీఆర్వో సూచించారు. దీంతో పాచిలవానిపాలెం గ్రామాలకు చెందిన సాగు రైతులు మళ్లీ 1989లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 1994లో రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 1998లో పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన 50 మంది రైతులకు సుమారు 20 ఎకరాల భూమికి అప్పటి తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు. ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్న రైతులు తరతరాలుగా రైత్వారీ ఇనాం భూములను సాగు చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు, పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సమయాల్లో ఈ భూములను విక్రయించలేకపోతున్నామని వాపోయారు. పంటల సాగుకు పెట్టుబడి కాలంలో ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, పీఎం కిసాన్ నగదును కూడా పొందలేకపోతున్నారు. ప్రకృతి విపత్తులు తలెత్తే సమయాల్లో పంటకు జరిగిన నష్టాన్ని అధికారులు గుర్తిస్తున్నా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేపోవడంతో పరిహారాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సాగులో ఉన్న రైతుల వివరాలను గుర్తించడంతో పాటు గతంలో గల రెవెన్యూ రికార్డులను పరిశీలించి, తమ పేరును పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేయాలని రెండు గ్రామాలకు చెందిన సాగుదారులైన 400 మంది రైతులు కోరుతున్నారు. రీసర్వేలో రైతుల వివరాలను నమోదు చేయాలి ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే లో పాచిలవానిపాలెం, చౌడువాడ గ్రామాలకు చెందిన రైతుల సాగులో ఉన్న రైత్వారీ ఇనాం భూములను గుర్తించాలి. రైతుల పేర్లను నమోదు చేసి వారి పేరున ఎల్పీ నంబర్లను మంజూరు చేయాలి. ఏపీ ఇనాం రద్దు చట్టం సెక్షన్ 7(1) కింద రైతుల సాగులో ఉన్న భూములకు రైత్వారీ పట్టాలను ఇప్పించాలి. –రొంగలి సూర్యనారాయణ, రైతు, పాచిలవానిపాలెం. టీడీపీ హయాంలో మార్పుతో ప్రయాసలు పాచిలవానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో సాగు చేస్తున్న రైతుల భూ వివరాలు రికార్డుల్లో రైత్వారీ ఇనాం కింద నమోదై ఉండేవి. 2015లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మళ్లీ చింతలపాటి బుచ్చి సీతయ్యమ్మ ట్రస్ట్ పేరుతో సత్రం భూములుగా ఆన్లైన్లో మార్పు చేశారు. రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో పేరు మార్పు చేసే సమయంలో రైతులకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఎండోమెంట్ అధికారులు చెప్పినట్లుగా ఈ పక్రియను పూర్తి చేశారు. 1998లో పాచిలవానిపాలెంకు చెందిన సుమారు 50 మంది రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న భూములను కూడా సత్రం భూములుగా నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల రైతులు హైకోర్టు తీర్పు, సాగుదారులైన వారికి మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను చూపుతూ న్యాయం చేయాలని కోరుతున్నా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. -
హారం
యుద్ధ నౌకలనౌకాదళాల పండగకు భారీ ఏర్పాట్లునీలి సాగరం.. వియత్నాం బృందానికి స్వాగతం పలుకుతున్న తూర్పు నౌకాదళం రూ.37 కోట్లు ఖర్చు చేస్తున్న జిల్లా యంత్రాంగం వీవీఐపీల ఏర్పాట్లకే రూ.1.20 కోట్లు రహదారుల వెంబడి బారికేడ్ల కోసం రూ.1.05 కోట్లు పారిశుధ్యం, సివిల్ వర్క్స్, సుందరీకరణకు రూ.30.07 కోట్లు ఏర్పాట్ల కోసం ఒక్క రూపాయీ విదల్చని చంద్రబాబు సర్కార్ సాక్షి, విశాఖపట్నం : భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు విశాఖ తీరాన ‘అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ’, ‘మిలాన్–2026’ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 135 దేశాల ప్రతినిధులు, 40 యుద్ధనౌకలు, 50 యుద్ధ విమానాలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ ద్వారా భారత్ తన సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పనుంది. 18న రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ, 19న సిటీ పరేడ్ వంటి కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకలకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగమే వివిధ శాఖల ఖజానాల నుంచి రూ.37 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. నిధుల కొరత ఉన్నప్పటికీ, విశాఖ గౌరవం నిలబెట్టేలా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. భారత సైనిక సంపత్తిలో కీలక కేంద్రంగా ఎదిగిన విశాఖ తీరం, మరో అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనకు సిద్ధమైంది. గతంలో 2022, 2024లలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించిన విశాఖ, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్, మిలాన్–2026 మరియు ఐఓఎన్ఎస్లకు ఆతిథ్యమిస్తోంది. చంద్రగుప్తుని కాలం నాటి సముద్రయాన చరిత్ర నుండి నేటి అణు జలాంతర్గాముల తయారీ వరకు భారత్ సాధించిన ప్రగతిని ఈ వేడుకలు ప్రపంచానికి చాటిచెప్పనున్నాయి. ఈ నెల 15 నుంచి 25 వరకు జరిగే ఈ ప్రదర్శనతో విశాఖ నగరం మరోసారి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించనుంది. విశాఖలో జరగనున్న నౌకాదళ వేడుకలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పనున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 70 లక్షల వ్యయంతో 200 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కూచిపూడి, ధింసా, తప్పెటగుళ్లు, కోలాటం, కొమ్ముకోయ వంటి 10 రకాల జానపద కళారూపాలతో విదేశీ ప్రతినిధులకు మన సంప్రదాయాలను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, మౌలిక వసతులే కీలకం : రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖుల రాక నేపథ్యంలో హోం శాఖ భారీ భద్రతా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 2.85 కోట్లతో డ్రోన్ కెమెరాలు, 100 మంది స్విమ్మర్లు, గస్తీ బోట్లను సిద్ధం చేశారు. అతిథుల కోసం 218 వాహనాలను ఏర్పాటు చేయగా, ఇంధనం, అద్దె ఖర్చుల కోసం రూ.1.45 కోట్లు వెచ్చిస్తున్నారు. వేట నిలిపివేసిన మత్స్యకారులకు రూ. 1.12 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం కేటాయించింది. పైసా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ల నిర్వహణకూ ప్రభుత్వం రూపాయి విదిల్చలేదు. ఇప్పటికే 2025 పార్టనర్షిప్ సమ్మిట్, యోగాడే, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర కార్యక్ర మాలకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండటంతో జిల్లా యంత్రాంగంపై ఐఎఫ్ఆర్ కార్యక్రమాలతో మరింత భారం పడింది. పాత బకాయిలు చెల్లించకపోవడంతో హోటల్ యజమాను లు, సర్వీస్ ఏజెన్సీలు కొత్తగా సేవలందించేందుకు వెనుకాడుతున్నారు. ఇంతటి కీలక సమయంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి అదనపు నిధులు అందక పోవడం, జిల్లా ఖజానా ఖాళీ అవ్వడం అధికారులను కలవరపెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక బడ్జెట్ విడుదల కాకపోతే ఈ భారీ నిర్వహణను సమర్థవంగా పూర్తి చేయడం సవాలుగా మారే అవకాశం ఉంది. అన్ని విభాగాల్ని ఈ ఏర్పాట్లు నిర్వహణ పనుల్లో భాగస్వామ్యం చేస్తూ.. ఉన్న ఖజానాని ఊడ్చేసి నిర్వహించేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. గత బకాయిల క్లియరెన్స్ లేకపోవడంతో పాటు, ఇప్పుడు అవసరమైన రూ. 37 కోట్ల ఖర్చుకు ముందస్తుగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయడం.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. శాఖల వారీగా వ్యయ అంచనాలు మొత్తం నిధులు సుమారు రూ.37 కోట్లు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ రూ.30 కోట్లు పోలీస్ శాఖ రూ.2.9 కోట్లు రహదారులు, భవనాల శాఖ రూ.1.1 కోట్లు ప్రోటోకాల్ విభాగం రూ.1.3 కోట్లు మత్స్యశాఖ రూ.1.2 కోట్లు పర్యాటక శాఖ రూ.75 లక్షలు భారీ ఏర్పాట్లు అంతర్జాతీయ నౌకాదళ ఈవెంట్ల కోసం జిల్లా యంత్రాంగం రూ. 37 కోట్లతో యుద్ధప్రతిపదికన పనులు చేపడుతోంది. ఆర్కే బీచ్ రోడ్డులో 3.5 కి.మీ. మేర బారికేడ్లు, విద్యుత్ దీపాల అలంకరణ మరియు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజల కోసం 12 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, విదేశీ అతిథుల కోసం ‘మిలాన్ విలేజ్’ స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్అండ్బీ శాఖలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తొమ్మిది రోజుల పాటు నౌకాదళ వేడుకలు 17న రాష్ట్రపతి విందుతో అధికారికంగా ప్రారంభమై 25 వరకు తొమ్మిది రోజుల పాటు సాగనున్నాయి. ప్రధానంగా 18న రాష్ట్రపతి చేతుల మీదుగా ఫ్లీట్ రివ్యూ, 19న ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. 20న ఐఓఎన్ఎస్ కాంక్లేవ్, 21 నుండి 25 వరకు సముద్ర గర్భంలో ‘మిలాన్’ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. 25న ముగింపు వేడుకలతో ఈ అంతర్జాతీయ ఉత్సవం పూర్తికానుంది. -
డెడ్లైన్ దాటితే సస్పెన్షన్!
తుమ్మపాల: ఈ నెల 15 నాటికి శతశాతం ఇంటి పన్నుల వసూలు చేయాల్సిందేనంటూ అధికార యంత్రాంగం విధించిన డెడ్లైన్ తో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే రకరకాల సర్వేలు, శానిటేషన్ పనుల ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, నీటి పన్నులు, లైటింగ్ చార్జీలు, ఇతర గ్రామ పన్నుల వసూళ్లను ఈనెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలతో పాటు సస్పెన్షన్ నోటీసులు జారీ చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో సాధారణంగా ఇంటి పన్నులు చెల్లించే ప్రక్రియ సులభంగా సాగదు. ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ ఆదాయం తగ్గడం, ఉపాధి సమస్యలు వంటి కారణాలతో అనేక కుటుంబాలు పన్నులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన గడువు కార్యదర్శులకు మానసిక ఒత్తిడిని తీవ్రంగా పెంచుతోంది. నిత్యం ఒత్తిళ్లతో ఆస్పత్రి పాలు పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనన మరణ నమోదులు, పలు రకాల ధ్రువీకరణలు, పథకాల అమలు, గ్రామ సభలు, ఆన్లైన్ ఎంట్రీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి పనులతో పాటు కొన్ని ఆన్లైన్ సర్వేలు, ప్రతి రోజు తెల్లవారు 6 నుంచి పారిశుధ్య పనులతో మొదలు పెట్టి సాయంత్రం వరకు అనేక పనులు కార్యదర్శుల భుజాలపైనే ఉన్నాయి. మరోపక్క యూనిక్ ఫ్యామిలీ సర్వే టార్గెట్ కూడా కొనసాగుతుంది. వీటన్నింటికి తోడు ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాలు కూడా 15 నాటికి శతశాతం చేరుకోవాలనే ఒత్తిడి మరింత పెరగడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల మానసిక ఒత్తిడికి లోనై పలువురు కార్యదర్శులు ఆస్పత్రుల పాలవుతున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. సగానికి పైగా బకాయిలు... జిల్లాలో ఉన్న 24 మండలాల్లోను 646 గ్రామ పంచాయతీల్లో 3.90 లక్షల గృహాలు, షాపులు, ఇతర పన్నుల వనరుల ద్వారా మొత్తం రూ.44 కోట్ల పన్నులు ఉండగా ఈ నెల 15 నాటికి పూర్తిగా వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అయితే వీటిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12 కోట్లు కాగా పాత బకాయిలే రూ.32 కోట్ల వరకు ఉన్నాయి. అన్నింటిని కలిపి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు 40 శాతం మేర అంటే దాదాపు రూ.20 కోట్ల వరకు వసూళ్లు పూర్తి చేశారు. అయినప్పటికీ బకాయిగా ఉన్న మిగిలిన రూ.25 కోట్ల కూడా ఒక్క పైసా బకాయి లేకుండా 15 నాటికి పూర్తి చేయాలని కార్యదర్శులపై హుకుం జారీ చేశారు. ఆపదలోనూ పరామర్శించని జిల్లా అధికారులు ఒత్తిడి విధానం కాకుండా ప్రోత్సాహక విధానం అవలంభించి వసూళ్లు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. వ్యక్తిగత, విధి నిర్వహణలో వత్తిడికి లోనై ఆసుపత్రుల పాలైన పంచాయతీల అధికారులను సంబంధిత జిల్లా అధికారులు కనీసం పరామర్శించి ధైర్యం కూడా చెప్పలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో మార్చి నాటికి వసూళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరిలోనే పూర్తిచేయమంటున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత నిధులు కూడా చెల్లిస్తున్నారు. ఈ నెల 15 వరకు ఇచ్చిన గడువును పెంచి సాంకేతికతపై ప్రజలకు అవగాహన పెంచాలని కోరుతున్నారు. వాస్తవాలకు భిన్నంగా అంచనాలుప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వసూళ్ల లక్ష్యాలను నిర్ణయించే ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం వాస్తవ స్థితిగతులకు భిన్నంగా నివేదికలు తయారుచేస్తున్నారు. గత సంవత్సరపు వసూళ్ల శాతం, పెండింగ్ బకాయిలు, కొత్తగా నమోదైన ఇళ్ల సంఖ్య వంటి అంశాల ఆధారంగా ఈ లక్ష్యాలను నిర్ణయిస్తున్నప్పటికీ గడిచిన ఏడాదిలో కొరతగా ఉన్న సౌకర్యాలను మరుసటి ఏడాదిలో అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో ఇంటి యాజమానులు పన్ను చెల్లింపులకు సౌకర్యాల ఏర్పాటుపై మెలిక పెడుతున్నారు. చెత్త సేకరణ సక్రమంగా లేకపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు...ఇవన్నీ ప్రజలు ప్రస్తావిస్తుండడంతో ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేయడం కార్యదర్శులకు సవాలుగా మారింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడంపై జిల్లా అధికారులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమీక్షలు పెట్టి కార్యదర్శులను వివరణలు కోరడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వార్షిక గోప్య నివేదికల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో పంచాయతీ కార్యదర్శులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. -
నేడే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
విశాఖ లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతీ నాయుడు తెలిపారు. 2020 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో న్యాయవాదుల్లో ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయవాది పర్యవేక్షణలో జరగనున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలోని 2,000 మందికి పైగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 143 మంది పోటీ చేస్తుండగా, ఒక్క విశాఖ నగరం నుంచే 24 మంది బరిలో నిలవడం విశేషం. మిగిలిన జిల్లాల అభ్యర్థులు కూడా విశాఖ ఓటర్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల ద్వారా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర కీలక పదవులను ఎన్నుకోనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రతి న్యాయవాది కనీసం ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఓటును అంకెల రూపంలో కాకుండా, అక్షర రూపంలో రాయాలి. ఓటు వేయడానికి వచ్చే న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఐడీ కార్డు లేదా విశాఖ న్యాయవాద సంఘం ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాలి. అర్హులైన న్యాయవాదులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు కె. రామజోగేశ్వరరావు, ఎస్.కృష్ణమోహన్, ఇతర సభ్యులు కోరారు. బరిలో విశాఖ నుంచి 24 మంది న్యాయవాదులు -
సుందరపు భూబాగోతం
సాక్షి, అనకాపల్లి : దళితుల భూములను లాక్కొనేందుకు యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ భారీ స్కెచ్ వేశారు. దాదాపుగా రూ.200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమి కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. ఆ భూములే తమకు జీవనాధారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1978లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నెం.2లో 16 దళిత కుటుంబాలకు 42 ఎకరాలు ఇచ్చింది. ఒక్కొక్కరికీ 2 ఎకరాల 78 సెంట్లు చొప్పున ఇచ్చారు. తమ కిచ్చిన భూముల్ని దౌర్జన్యంగా లాక్కొనేందుకు జనసేన ఎమ్మెల్యే స్కెచ్ వేశారంటూ పంచదార్ల గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే చర్యలకు వ్యతిరేకంగా పంచదార్ల గ్రామ బాధిత దళిత కుటుంబాలు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారంతో 11వ రోజుకు చేరుకుంది. దళితులు, పేదల భూముల్ని కబ్జా చేసేందుకు వచ్చిన పొక్లెయిన్లను అడ్డుకుంటూ..ఈ నెల 2వ తేదీ నుంచి తమ భూముల్లో వంటా వార్పు కార్యక్రమానికి దిగారు. స్థానిక ఎమ్మార్వో, పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరుడు దిన్నిబాబు భూముల స్వాధీనానికి ప్రయత్నించగా పొక్లెయిన్ను బాధిత దళితులు అడ్డుకున్నారు. 1–బీ రికార్డులన్నీ తమ వద్దే ఉన్నాయని, ఆ భూములపై హక్కులన్నీ తమవేనని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వారం రోజుల క్రితం జీడి, మామిడి, అరటి, కొబ్బరి చెట్లను నరికేందుకు వచ్చిన వారిని బాధిత దళితులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే భూముల్ని ఖాళీ చేసేయాలంటూ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తమపై ఒత్తిడి చేస్తున్నారని, ఆ భూముల్లోకి వెళ్తే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 47 ఏళ్ల క్రితమే దళితులకు కేటాయింపు దళితులు, పేదలకు కేటాయించిన భూముల్ని ఇప్పుడు సెజ్ నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు పేరిట స్థానిక జనసేన ఎమ్మెల్యే లాక్కోవడానికి తన అనుయాయుల్ని రంగంలోకి దింపారు. సెజ్ కోసం ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు పేరిట విలువైన భూములను లాక్కొనేందుకు భారీ స్కెచ్ వేశారు. తాము స్థలాలు కోల్పోతే తమకు కూడా స్థలాలే కేటాయించాలంటూ కొన్నాళ్లుగా బాధితులు నిరసనకు దిగారు. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామ పరిధి లోని సర్వే నంబర్–2లో 1 నుంచి 24 వరకు ఉన్న సబ్ డివిజన్లలో దళితులకు చెందిన భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1978లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు ఈ భూముల్ని కేటాయించింది. అప్పటి నుంచీ ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న బక్క జీవులను ఇప్పుడు తన్ని తగిలేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నాది పంచదార్ల గ్రామం. 2 ఎకరాల 78 సెంట్లు భూమి ఉంది. ప్రభుత్వానికి మేము పన్ను కూడా చెల్లిస్తున్నాం. పట్టాలున్న మా భూమికి భూమి రేట్లు పెరిగాయని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఎంఆర్వోతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఐదు పొక్లెయిన్లతో అక్రమంగా మా భూముల్లో మట్టిని తవ్వి చదును చేస్తుంటే అడ్డుకున్నాం. మమ్మల్ని పొక్లెయిన్ డ్రైవర్ తొక్కించేస్తామంటూ భయపెట్టారు. అడ్డుకుంటే మీ పిల్లలపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. దళితులమని కూడా చూడకుండా దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాపై పోలీసులు కేసులు పెట్టి స్టేషన్కు కూడా తీసుకెళుతున్నారు. – కనకరత్నం, పంచదార్ల గ్రామం, రాంబిల్లి మండలం ఎమ్మెల్యే అండతోనే బెదిరిస్తున్నారు.. మాకు 2.78 సెంట్లు డి–పట్టా భూమి ఉంది. స్థానిక టీడీపీ నాయకుడు బిన్నిబాబు పోలీసులు, ఎంఆర్వోతో కలిసి మా భూములు లాక్కోవడమే కాకుండా మమ్మల్ని క్రేన్తో తొక్కించేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే అండతో దిన్బాబు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. – గూటాల జయలక్ష్మి, పంచదార్ల గ్రామం, న్యాయం జరిగేవరకూ పోరాడతాం.. మా భూమిలో మాకు తెలియకుండా పొక్లెయిన్లతో తవ్వుతున్నారు. అడ్డుకుంటే మహిళనని కూడా చూడకుండా చంపేస్తామని బెదిరించారు. ఎమ్మార్వో కేసులు పెడతామంటూ బెదిరించారు. పోలీసులు కూడా వచ్చారు. మీరు అడ్డుకుంటే మీ పిల్లలపై కేసులు పెడతామంటూ బెదిరించారు. మాకు న్యాయం జరగకుంటే ప్రాణాలు పోయినా తవ్వడానికి ఒప్పుకోము. –గారపాటి చిన్నమ్మలు, పంచదార్ల గ్రామం కేసులకు భయపడేది లేదు.. మా తాతల కాలం నాటి మా స్వాధీనంలో ఉన్న భూముల్ని లాక్కోడానికి ఎమ్మెల్యే సుందరపు, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు. ఆ భూములు ఇవ్వకుంటే కేసుల్లో ఇరికిస్తామని రెవెన్యూ, పోలీస్ అధికారుల ద్వారా బెదిరిస్తున్నారు. దళితుల్ని చిన్నచూపు చూస్తే సహించేది లేదు. మా భూముల్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలకై నా సిద్ధంగా ఉన్నాం. మా భూముల్లో వంటావార్పు చేస్తుండగా మా భూముల్లోకి పొక్లెయిన్లతో వచ్చి మమ్మల్ని బెదిరించారు. ఎమ్మార్వో, వీఆర్వో, పోలీసులు వచ్చి మీపై కేసులు పెడుతున్నామంటూ బెదిరించారు. –తెరపల్లి ప్రసన్న, పంచదార్ల ఎమ్మెల్యే కనుసన్నల్లోనే... దళితుడినైన నాకు 47 ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం డి.పట్టాతో 2.78 ఎకరాల భూమి ఇచ్చింది. మా భూమికి వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా ప్రతి ఏటా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ పడింది. పన్ను చెల్లిస్తున్నాం. స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ కనుసన్నల్లోనే టీడీపీ మండల నేత దిన్నిబాబు బెదిరించి మా భూమి లాక్కొంటున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవోకు, కలెక్టర్కు వినతి ఇచ్చాం. న్యాయం జరగలేదు. –గూడబండి రమేష్, పంచాదార్ల గ్రామం బాధితులకు అండగా ఉంటాం 47 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు భూములను ఇచ్చింది. వాటిని మింగేద్దామని కూటమి ప్రభుత్వం చూస్తుంది. పొజిషన్లో ఉన్నవారికి నోటీసులు లేకుండా దళితుల భూములు దోచుకుంటామంటే మంచి పద్ధతి కాదు. దళితులను మోసం చేసిన ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. దళితులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుంది. 13న ఉదయం 10 గంటలకు నిరసన తెలియజేస్తున్న దళితులను కలిసి వారికి మద్దతు పలుకుతాను. – కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి వైఎస్సార్సీపీ సమన్వయకర్తపొక్లెయిన్లను అడ్డుకుంటున్న బాధిత దళిత రైతులు దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను రూ.200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమి కబ్జాకు యత్నం సెజ్ నిర్వాసితులకు ఇంటి స్థలాలంటూ హడావుడి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు దిన్నిబాబుపై పేద దళితులు ఆగ్రహం పొక్లెయిన్లను అడ్డుకున్న దళితులను తొక్కించేస్తామంటూ బెదిరింపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 11వ రోజుకు చేరుకున్న దళితుల నిరసన కేసులు పెడతామంటూ ఎంఆర్వో, సీఐ బెదిరింపులు -
ఉపాధి హామీ పనుల తనిఖీ
దేవరాపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్రం నుంచి వచ్చిన అధికారితో కూడిన బృందం పరిశీలించింది. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ, చిననందిపల్లి, తారువ, బోయిలకింతాడ, కొత్తపెంట తదితర గ్రామాల్లో బుధవారం అధికార్లు పర్యటించారు. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోలను మండలాల వారీగా ఆన్లైన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించారు. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని అక్కడ నిబంధనల ప్రకారం పని జరిగిందా లేదా అని క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేశారు. జలసంచయ్–భాగీదారీ పథక కేంద్ర నోడల్ అధికారి, కేంద్ర జల కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సుగుణాకరరావు, డ్వామా నుంచి ఇంజినీరింగ్ కన్సల్టెంట్ బాలు తదితర అధికారులు చెరువులు, నీటి గుంతల పనులను పరిశీలించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఉపాధి హామీ పథకం ఏపీవో వై. రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, లక్ష్మణరావు, ఎర్రునాయుడు, సత్యనారాయణ ఉన్నారు. -
సీబీఐ ఉచ్చులో పచ్చనేత
సాక్షి, అనకాపల్లి : నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నిధులను దారి మళ్లించిన కేసులో నలంద విద్యాసంస్థల యాజమాని, టీడీపీ కౌన్సిలర్ భర్త నేరెళ్ల వెంకట రాజేష్ను సీబీఐ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాజేష్ నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నలంద విద్యాసంస్థల్ని నడుపుతున్నారు. కొన్నేళ్లుగా మద్యం సిండికేట్లో టీడీపీ నాయకుడు రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజేష్ భార్య చంద్రిక ప్రస్తుతం టీడీపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. రాజేష్ కుటుంబానికి చాలాకాలంగా టీడీపీతో రాజకీయ అనుబంధం ఉంది. రాజేష్ తండ్రి బాబ్జీ టీడీపీ ఎంపీటీసీగా పని చేశారు. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత టీడీపీ కౌన్సిలర్గా రాజేష్ తల్లి సుగుణ కూడా పనిచేశారు. ఇన్కం ట్యాక్స్ ఏడీ సహా నలుగురు అరెస్ట్ ఆదాయ పన్నుశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 5న రత్నమాల చార్టెర్డ్ అకౌంటెంట్ గ్రంధి శరత్కుమార్ను, ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్కుమార్ను సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏ–1గా విశాఖకు చెందిన ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ (ఇన్వెస్టిగేషన్), ఏ–2గా చార్టర్డ్ అకౌంటెంట్ శరత్కుమార్, ఏ–3గా రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్, ఏ–4గా ఇతర సిబ్బందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మురళి ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కె.మధుసూదన్ విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో నర్సీపట్నంలో నలందా స్కూల్ నిర్వహిస్తున్న రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ నిధుల్లో సుమారు రూ.2 కోట్లు దుర్వినియోగం చేసి ఆ మొత్తాన్ని ఆ సొసైటీ అధ్యక్షుడు నేరళ్ల వెంకట రాజేష్ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అమృత్కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలని, అవి లేకుండా చేయాలంటే తనకు లంచంగా రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.14 లక్షలు ఇస్తామని వారివురి మధ్య డీల్ కుదిరింది. అందులో భాగంగానే ఈ నెల 2న రత్నమాల ట్రస్టు ఆడిటర్ శరత్కుమార్, ట్రస్ట్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్కు లంచం డబ్బు సిద్ధం చేయాలని చెప్పారు. మరుసటి రోజున రాజేష్ తన స్నేహితుల నుంచి రూ.14 లక్షలు సిద్ధం చేశారు. ఈ నెల 5న గ్రంధి శరత్కుమార్ ఆ డబ్బు తీసుకుని విశాఖలో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉన్న అధికారికి ఇస్తుండగా సీబీఐ ఏసీబీ డీఎస్పీ ప్రమోద్కుమార్ అరెస్ట్ చేశారు. రత్నమాల ట్రస్ట్ నిధుల దారి మళ్లింపుపై కేసు నమోదు ఈ నెల 5న ట్రస్ట్ ఆడిటర్తో పాటు రాజేష్ను అరెస్ట్ చేసిన సీబీఐ పోలీసులు ఇదే కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అరెస్ట్ -
ఎల్కేజీ విద్యార్థులకు మోకాళ్ల శిక్ష!
● డీఈవోకు ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదు ● విచారణకు ఆదేశం యలమంచిలి రూరల్ : మండలంలోని ఏటికొప్పాకలో ఓ ప్రైవేటు స్కూల్ ఆవరణలో బుధవారం ఎల్కేజీ విద్యార్థులను ఎండలో మోకాళ్లపై నిలబెట్టి శిక్షించిన ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా నేతలు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా చిన్న పిల్లలకు కఠినమైన శిక్షలు విధిస్తూ, హింసిస్తున్నారని తెలియజేసేలా కొన్ని ఫోటోలను డీఈవోకు పంపించినట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ తెలిపారు. విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా శిక్షించడంతో పాటు నిబంధనలు పాటించడం లేదన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా యలమంచిలి ఎంఈవో సూర్యప్రకాష్ను డీఈవో ఆదేశించారు. జిల్లాలో పలు ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, యాజమాన్యాలన్నీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఏటికొప్పాకలో చిన్నపిల్లలను శిక్షించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని బాలాజీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరపనున్నట్టు ఎంఈవో సూర్యప్రకాష్ తెలిపారు. -
భగవంతుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని అన్నారు. తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేల్చిన తర్వాత కూడా కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన శివభక్తులపై లాఠీ చార్జీ చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు. -
అభివృద్ధి పనులువేగవంతం చేయండి
● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆదేశాలు తుమ్మపాల : జిల్లాలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టరు విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఇంజినీరింగు అధికారులు, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, క్రీడాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పనులు ప్రస్తుత పరిస్థిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు దశల్లో ఉన్న నిర్మాణ పనులన్నింటిని వెంటనే పూర్తిచేయాలని, నిధులు మురిగిపోయినట్లచితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి 5 గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ఆ గ్రామాలలో సోక్ పిట్స్, మేజిక్ డ్రెయిన్స్ వంటి నిర్మాణాలన్నింటిని పూర్తిచేయాలన్నారు. పాఠశాలలో, వసతి గృహాలలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేయాలని తెలిపారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వెంటనే పూర్తి చేయాలన్నారు. మార్చి నాటికల్లా జిల్లాలో గల అన్ని వీధికుక్కలకు స్టెరిలైజేషను ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 65 శాతంగా గల అక్షరాస్యత శాతం పెంచుటకు అక్షర ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని, వయోజన విద్య సెంటర్లకు వస్తున్న 91 వేల మందిని వచ్చే నెలలో జరిగే పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులయ్యేటట్లు వారికి చదువు చెప్పాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ. కుటుంబాలకు అందిస్తున్న ఉచిత సోలారు విద్యుత్ పథకాన్ని, అలాగే పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగదారుడు వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలు, మనీ న్యూలింగ్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా టీవీ కమర్షియల్ యాడ్స్ పోస్టర్లను కలెక్టరేట్లో ఆమె ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు జరిగే వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కేవైసీ, సీకేవైసీ ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన, ప్రచారం కల్పించాలన్నారు. డీఆర్వో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
పంచదార్ల దళిత రైతుల నిరసన ఉధృతం
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లలో దళితులు కొద్ది రోజులుగా చేపడుతున్న నిరసనను మరింత ఉధృతం చేశారు. యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 17 మంది దళితులకు ఇచ్చిన డీ పట్టా భూముల్ని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తీసుకునేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ దళిత కుటుంబాలు నిరసన తెలుపుతూ దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం దళితులు వంటా వార్పు నిర్వహించారు. అదే సమయంలో సర్వే నంబర్ 3లో పొక్లెయిన్తో మట్టిని పెకిలిస్తూ సర్వే నంబర్ 2లోకి నెట్టివేయడాన్ని చూసిన నిరసనకారులు అభ్యంతరం చెప్పారు. తమ భూములకు పరిహారం లేదా ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇవ్వాలని తెలిపారు. ఆయా భూముల్లో దళితులు ప్రస్తుతం సాగులో లేరని, ఆ ప్రాంతంలో అక్ర మ మైనింగ్ చేపట్టారంటూ అధికారుల ద్వారా నోటీసులు ఇవ్వడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. డీ పట్టా భూములిచ్చి ఐదు దశాబ్దాలు కావడంతో లబ్ధిదారుల వారసులు సైతం ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని దళిత రైతులు చెబుతున్నారు. స్థానిక టీడీపీ నేత చెప్పినట్టే అధికారులు వ్యవహరించడం సమంజసం కాదని వాపోతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే 42 ఎకరాల దళితుల డీ పట్టా భూముల వ్యవహారం రోజుకి రోజుకి దుమారాన్ని రేపుతోంది. -
సి,డి గ్రేడుల విద్యార్థులపైప్రత్యేక శ్రద్ధ అవసరం
యలమంచిలి రూరల్ : మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక పునశ్చరణ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం తనిఖీ చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెం, పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రైల్వేస్టేషన్ రోడ్డు ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణ తీరు,విద్యార్థుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులకు రోజువారీగా నిర్వహిస్తున్న పరీక్షలు, వారు సాధించిన మార్కులను పరిశీలించారు. సి,డి గ్రేడుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. సి,డి గ్రేడుల విద్యార్థుల కోసం రూపొందించిన 30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలవుతున్న తీరును తనిఖీ చేశారు. అభ్యసనా సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలని సూచించారు. ఆయన వెంట యలమంచిలి ఉపవిద్యాశాఖాధికారి పి.అప్పారావు, ఎంఈవో సుసర్ల సూర్య ప్రకాష్, వెంకటేశ్వర్రావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
బంగారుమెట్టలో కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం
బుచ్చెయ్యపేట : బంగారుమెట్ట,లోపూడి గ్రామాల మధ్య మిరాశలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు తోటలు కాలిపోయాయి. విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోటలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో బంగారుమెట్టకు చెందిన జక్కా చిన్నారావు, వేచలపు చినతల్లికి చెందిన సరుగుడు తోటతో పాటు విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోట కాలిపోయాయి. సుమారు రూ.రెండు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది గంగరాజు, శివయ్యనాయుడు, రాజు, అర్జున మంటలను అదుపు చేశారు. -
మత విద్వేషాలు రగిల్చే రాజకీయాలు మానుకోవాలి
దేవరాపల్లి: ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని ముందుకు తెచ్చిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలపై సతమతమవుతుంటే అవేవీ పట్టించుకోకుండా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ వివాదాన్ని వాడుకోవడం దారుణమన్నారు. లడ్డూలో జరిగిన కల్తీపై సిట్ నివేదికను అధికారికంగా వెల్లడించకుండానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమకు తోచిన విధంగా దుష్ప్రచారం చేస్తూ వాస్తవాలను సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై కూటమి నాయకులు తలో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్రం నియమించిన సిట్ టీటీడీకి చెందిన ముగ్గురు అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే కూటమి ప్రభుత్వం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డారని సిట్ నివేదిక చెప్పినా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం మరో విచారణ కమిటీ వేయడం చూస్తే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
స్వచ్ఛ సర్వేక్షణ్లో టాప్–3 లక్ష్యం
డాబాగార్డెన్స్(విశాఖ): నగరంలో మురికివాడల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బుధవారం తన చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా వెలంపేట, ఇందిరానగర్ నగరంలోని మురికివాడల అభివృద్ధిలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద పాతనగరంలోని వెలంపేట, శ్రీకన్య థియేటర్ సమీపంలోని ఇందిరానగర్ను ఎంపిక చేసినట్లు కమిషనర్ తెలిపారు. వెలంపేటలో 59 సెంట్ల స్థలంలో పీపీపీ పద్ధతిలో రూ.23.17 కోట్లతో జీ+11 అంతస్తుల సముదాయాన్ని నిర్మించి, 177 మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష ఉంటుందని, జీవీఎంసీ తరఫున రూ.8.85 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇందిరానగర్లో జీ+6 పద్ధతిలో 110 మందికి గృహాలు నిర్మిస్తామన్నారు. మహిళా హాస్టళ్ల నిర్మాణం ఉద్యోగినుల కోసం(వర్కింగ్ వుమెన్స్) మధురవాడ జోన్–5లోని బుట్టవానిపాలెం లేవుట్లో రూ.26.12 కోట్లతో చేపట్టనున్న హాస్టల్ పనులకు ఇటీవలే భూమిపూజ చేశామన్నారు. అలాగే గాజువాక, ముడసర్లోవలో హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఇవి జీ+4 అంతస్తులతో, 96 గదులు, 248 మంది నివసించే సామర్థ్యంతో ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఐఎఫ్ఆర్ పనులు, ట్రాఫిక్ నియంత్రణ నగరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) దృష్ట్యా రూ.18.5 కోట్లతో 119 అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో 90 శాతం శాశ్వత పనులేనని స్పష్టం చేశారు. బీచ్రోడ్లోని సెంట్రల్ మీడియన్, పారిశుధ్యం, నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టు కనెక్టివిటీ కోసం రూ.14.29 కోట్లతో వేపగుంట–పినగాడి, రూ.11.5 కోట్లతో వేపగుంట–జుత్తాడ రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. ఆదాయం, జోన్ల పునర్విభజన జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం కోసం జోన్లను 8 నుంచి 10కి పెంచినట్లు తెలిపారు. పన్నుల వసూలులో ఈ ఏడాది రూ.1,200 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఫిబ్రవరి, మార్చిలో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరంలోని 21 ప్రాంతాల్లో వెండర్స్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రస్తుతం 3 ప్రాంతాలను తుది ఎంపిక చేశామన్నారు. వీటిని జీవీఎంసీ, మెప్మా, లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆపరేషన్ 3.0 కింద సెల్లార్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఆర్కే బీచ్, భీమిలి వై జంక్షన్, పోతినమల్లయ్యపాలెం వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. తొలి మూడు ర్యాంకుల్లో.. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో విశాఖ 9వ ర్యాంకు సాధించిందని, ఈసారి మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేలా కృషి చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. పారిశుధ్యం, వ్యర్థాల సేకరణ, తరలింపు ప్రక్రియలను నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. త్వరలో కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు 6 ప్రాంతాల్లో కొత్తగా సులభ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
● శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ దారుణం ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువజన విభాగమే గొంతుక కావాలి ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, గతంలో యువజన విభాగంలో పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఎవరైతే శ్రమిస్తారో వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తుంగలో తొక్కింది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఎండీయూ వాహన ఆపరేటర్లు, వలంటీర్లు సహా అనేక సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రోడ్డున పడేసింది. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసింది. వీటిపై యువత పోరాటం చేయాలి’అని రాజా పిలుపునిచ్చారు. దాడి చేసిన వారికి బెయిల్.. ప్రశ్నించిన అంబటికి జైలా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్ సీపీ లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి, ప్రజా సేవ చేయాలనుకునే వారికి యువజన విభాగం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ‘ఉత్తి ఆంధ్ర’కాదు ‘ఉద్యమాంధ్ర’అని చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఇమ్రాన్, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్, గబ్బిడి శేఖర్, అల్లు అవినాష్, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దొడ్డి కిరణ్, పాలిశెట్టి సురేష్, యువజన విభాగం కార్యదర్శులు చింతకాయల వరుణ్, మలసాల కుమార్ రాజా, కనకల ఈశ్వరరావు, చందక అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శులు జె.నరేష్, ధీరజ్ కుమార్, నియోజకవర్గం, మండల, వార్డు యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. -
మత్స్యగుండంలో పకడ్బందీగా శివరాత్రి ఉత్సవాలు
● పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు మాట్లాడుతున్న ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఇతర అధికారులు సాక్షి,పాడేరు: పవిత్ర పుణ్యక్షేత్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఈఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 14నుంచి 16వతేదీ వరకు మత్స్యగుండంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో మూడు రోజుల జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత తాగునీరు,విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మఠం సర్పంచ్ మఠం శాంతకుమారి, పాడేరు డీఎస్పీ అభిషేక్, డీఎల్పీవో కుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
దురుద్దేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం
దేవరాపల్లి: సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను తగ్గించేలా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలవ లేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విష ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని, ఇప్పుడేమో ఏకంగా బాత్రూమ్లు కడిగే హార్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని దు ష్ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమన్నా రు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై బురదజల్లాలన్న దుర్బుద్ధితోనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. వీరిద్దరితో పాటు కూటమి నేతలంతా శ్రీవారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా దేవుడితో రాజకీయాలు చేయడం మానుకుని పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేసే విష సంస్కృతిని విడనాడాలని హితవు పలికారు. -
రాజకీయ కక్షతోనే కంటైనర్ తొలగింపు
గొలుగొండ: ఏటిగైరంపేటలో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న కంటైనర్ను కూటమి నేతలు రాజకీయ కక్షతోనే తొలగించారని మండల వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ నేత పాము అప్పలనాయుడుపై కక్షతో ఇలా చేయడం సరికాదని వారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొరుప్రోలు పాణీశాంతారామ్, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాము అప్పలనాయుడును పరామర్శించి, కంటైనర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటైనర్ను తొలగించడం దారుణమన్నారు. కోర్టు అనుమతితో ఈ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారని, తొలగింపుపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని వారు చెప్పారు. అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, గాదంపాలెం, కొమిర సర్పంచ్లు నల్లబెల్లి శ్రీనివాసరావు, అల్లురాజుబాబు, ఏఎల్పురం ఎంపీటీసీ సభ్యులు బుల్లిప్రసాద్, సీనియర్ నాయకులు కిలపర్తి పెద్దిరాజు, కొల్లు సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మా దారి... అడ్డదారి!
పట్టుకున్నారు..వదిలేశారు? ఈ విషయమై రెండు లారీల డైవర్లను ప్రశ్నించగా పోలీసులు రాత్రి పట్టుకున్నారని, ఉదయం వదిలేశారని తెలిపారు. పెనాల్టీ ఎంత విధించారని అడగ్గా, లారీ ఓనర్ పోలీసులతో మాట్లాడుకున్నారని, డబ్బులు ఏమీ కట్టలేదని చెప్పడం గమనార్హం. జాతీయ రహదారి మీదుగా వెళ్లకుండా అడ్డదారిలో ఎందుకు తీసుకెళ్తున్నారని ఆరా తీయగా...ఓవర్ లోడ్ అని, టోల్ గేట్ మీదుగా వెళ్తే రూ.4వేలు పెనాల్టీ కట్టాలని అందుకు ఇలా దొడ్డిదారిన వెళ్తున్నామని చెప్పడం విశేషం.నక్కపల్లి : కంచే చేను మేస్తే కాపాడేదెవరు అన్నట్లు ఉంది కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వ్యవహారశైలి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలకు అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. రక్షకులే భక్షకులుగా మారి అడ్డగోలు వ్యాపారాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి సామర్ధ్యంతో దొడ్డిదారిన రాకపోకలు సాగించే భారీ వాహనాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. అధికారుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడడంతోపాటు, పట్టుమని పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్లు మూన్నాళ్లకే శిథిలమవుతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన నివసించేవారు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్నినెలలుగా సాక్షాత్తూ హోంమంత్రి ఇలాకా లో జరుగుతున్న ఈ బాగోతం అరికట్టేందుకు ఉన్నతాధికారులెవరూ దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు...షరా‘మామూలే’... కాకినాడ జిల్లా రౌతులపూడి నుంచి అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎన్ఈవోబీకి బండరాళ్లు భారీ టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. నిబంధన ప్రకారం ఒక్కో టిప్పర్లో 40 టన్నులకు మించి లోడ్ చేయడానికి వీల్లేదు. కానీ ఈ టిప్పర్లలో 70 నుంచి 80 టన్నులు మించి లోడింగ్ చేసి రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాల ముందు ఒక వ్యక్తి పైలట్గా వ్యవహరిస్తూ అడ్డగించిన వారికి మామూళ్లు ఇస్తూ నక్కపల్లి నుంచి తుని దాటేవరకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల సిబ్బందితో పాటు, ఒక ఎలక్ట్రానిక్ మీడియాపేరు చెప్పుకుంటున్న ఒక వ్యక్తి కూడా లారీల రాకపోకలకు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాహనం ముందు పైలట్గా వెళ్లి ఒక్కో లారీకి వెయ్యిరూపాయలు వసూలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు... తుని దాటిన తర్వాత వేంపాడు సమీపంలో ఉన్న టోల్ప్లాజా మీదుగా రాకపోకలు సాగిస్తే అక్కడ సామర్ధ్యాన్ని తనిఖీ చేసి 40 టన్నులకు మించితే రూ.4వేలు అదనంగా పెనాల్టీ విధిస్తున్నారు. అలాగే మైనింగ్, పోలీసు అధికారులు కూడా ఈ వాహనాలను తనిఖీ చేసి రూ.7వేల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. కానీ టోల్ఫీజు ఎగ్టొట్టేందుకు లారీ యజమానులు వేంపాడు నుంచి అమలాపురం, కాగిత మీదుగా నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డుకు చేరుకుని అక్కడనుంచి రాంబిల్లి వెళ్తున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో ఇవే లారీలు పరవాడ వద్ద ఉన్న హిందూజా పవర్ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ను లోడింగ్ చేసుకుని సామర్లకోటకు రవాణా చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా వీరు టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు కాగిత అమలాపురం, వేంపాడు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వాహనాలు రెండు వైపులా రాకపోకల సందర్భంగా 8 వేల రూపాయలు టోల్గేట్ వద్ద పెనాల్టీ ఎగ్గొట్టేస్తున్నారు. అలాగే ఈ వాహనాలను తనిఖీ చేస్తే ఒక్కో వాహనం నుంచి మరో 15 వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇలా ప్రతిరోజు సుమారు 50 నుంచి 80 లారీలు రౌతులపూడి రాంబిల్లి, సామర్లకోట వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై పోలీసు, మైనింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా మంగళవారం రాత్రి రెండు లారీలను పెట్రోలింగ్ చేసే సిబ్బంది పట్టుకున్నారు. వీటిని నక్కపల్లి తరలించారు. ఉదయం వరకు వీటిని నక్కపల్లి బస్టాండ్లో ఉంచి మధ్యాహ్నం విడిచిపెట్టారు. ఈ వాహనాలు యథావిధిగా టోల్ఫీజు ఎగ్టొట్టేందుకు కాగిత సమీపంలో నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డుమీదుగా రాకపోకలు సాగించాయి. రోడ్లు శిథిలం.. వేంపాడు, అమలాపురం మీదుగా ఈ భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల ఆయా గ్రామాల్లో రాకపోకల కోసం నిర్మించిన రోడ్లు శిథిలమవుతున్నాయి. దీనికితోడు ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో, లారీ అదుపు తప్పి బోల్తాపడితే ఏం జరుగుతుందోనని రోడ్డుపక్కన నివసించే వారు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై నక్కపల్లి సీఐ జె.మురళి వద్ద ప్రస్తావించగా నైట్ డ్యూటీ చేసే సిబ్బంది ఈ వాహనాలను పట్టుకున్నట్టు తెలిపారు. రికార్డులు పరిశీలించి సక్రమంగా ఉన్నందున విడుదల చేయడం జరిగిందన్నారు. నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డులో రాకపోకలు కాగా స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్పార్క్ కోసం కాగిత నుంచి చందనాడ వరకు రూ.24 కోట్లతో ఆర్అండ్బీ వారు 80 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు నిర్మిస్తున్నారు. రైతుల నుంచి 60 ఎకరాలను సేకరించి నిర్మాణపు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎర్త్ వర్క్ జరుగుతోంది. గ్రావెల్ వేసి రోడ్డు చదును చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ రోడ్డులో నుంచి ఈ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా చేయడం చట్టవిరుద్ధం అయినప్పటికీ రోడ్డుపనులు చేస్తున్న కాంట్రాక్టరు గాని, పర్యవేక్షిస్తున్న ఆర్అండ్బీ అధికారులు గాని పట్టించుకోవడం లేదు. వాహనదారుల నుంచి ప్రతిరోజు మామూళ్లు అందడం వల్లే ఈ వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేయడం లేదని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. ఓవర్ లోడ్ లారీలకు అధికారుల అండదండలు అక్రమ మార్గాలకు లైన్క్లియర్ ప్రభుత్వాదాయానికి గండి పట్టుకున్నా కేసుల్లేకుండా వదిలేస్తున్న వైనం టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిన రాకపోకలు నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డులో ప్రయాణం -
కళ్యాణపులోవలో జాతరకు ఏర్పాట్లు పూర్తి
● సదుపాయాలు పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా ● అధికారులకు సూచనలు రావికమతం : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలో కొత్తకోట పోలీసు స్టేషన్ పరిధిలో గల కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ జాతర మహోత్సవాలకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ జాతరకు సుమారు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా, ప్రత్యేక క్యూలైన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశారని, దొండపూడి చెక్పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుంటామని తెలిపారు. రోడ్డు విస్తరణ కారణంగా ఈ పర్యాయం 70 ఆర్టీసీ బస్సులు నేరుగా ఆలయం వరకు వెళ్లేటట్టు ప్రణాళిక రూపొందించామన్నారు. భక్తులు కళ్యాణలోవ రిజర్వాయర్లో పుణ్యస్నానాలు ఆచరించనున్న దృష్ట్యా స్నానాల కోసం 9 ఘాట్లు సిద్ధం చేశామని, ప్రమాదాల నివారణకు 10 మంది గజ ఈతగాళ్లు, 5 బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుదన్నారు. జాతర జరిగే ప్రాంగణమంతా సీసీ కెమెరాలు నిఘాలో ఉంటుదని, వీటిని ప్రత్యేక కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి, ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తామన్నారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు సహకారంతో 48 ఎకరాల స్థలాన్ని భక్తుల కోసం సిద్ధం చేశారు. 28 ఉచిత భోజనశాలలు, మహిళల కోసం ప్రత్యేక మొబైల్ టాయిలెట్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడం కోసం ప్రత్యేక రూమ్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ స్వామివారిని శాంతియుతంగా దర్శనం చేసుకోవాలని, ముఖ్యంగా స్నానఘట్టాలు వద్ద మహిళలు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు గట్టి నిఘా పెట్టామన్నారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో 100, లేదా 112 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన దేవదాయ, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులతో శివరాత్రి ఏర్పాట్లు గురించి సమీక్షించారు. ఎస్పీ వెంట స్పెషల్బ్రాంచి డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్. బాలసూర్యారావు, కొత్తకోట సీఐ జి.కోటీశ్వరావు, స్థానిక ఎస్ఐ ఎం.శ్రీనివాస్తో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు ఆయన వెంట ఉన్నారు. -
గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్టు
అనకాపల్లి: మండలంలోని శంకరం వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ జి. రవికుమార్ మంగళవారం తెలిపారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఉగ్గిన శేష మణికంట(29), జగ్గుపల్లి జగదీష్ (28), రాజపూడి ఆదిత్యసాయి వెంకటేష్ (29) ఉన్నారన్నారు. వీరు శంకరం గ్రామ పరిధిలోని ఎఫ్సీ గోదాముల వెనుక కొండ ప్రాంతంలో సోమవారం గంజాయి సేవిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్టు చెప్పారు. వారిని విచారించగా విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి దుర్గాప్రసాద్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. అరెస్టు అయిన నిందితుల్లో శేష మణికంఠపై గతంలో క్రిమినల్ కేసులున్నాయన్నారు. అతని నుంచి 20 గ్రాములు,మిగిలిన ఇద్దరి నుంచి 15 గ్రాముల చొప్పున గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మెడికల్, ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, దీనికి నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14న జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మెడికల్, ఫార్మా మాఫియా వ్యతిరేక పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులకు నాసిరకం మందులు పంపిణీ చేయడంతో పాటు వాటిని అధిక ధరలకు అమ్మకాలు చేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అద్దె సర్టిఫికెట్లతో ఫార్మేషన్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపుల పై తనిఖీలు నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఉన్నత అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వియ్యపురాజు, పరవాడ మండల కన్వీనర్ కె.త్రినాఽథ్, నాయకులు విత్తనాల పోతురాజు, మూతుర్తి సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘డెయిరీ కంటైనర్ తొలగింపు అన్యాయం’
గొలుగొండ: ఏటిగైరంపేటలో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్న కంటైనర్ను అన్యాయంగా తొలగించడంపై రైతులు ఆవేదన చెందారు. గత ఏడాది అక్టోబర్లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీసీ) గ్రామంలో పాల సంఘం ఆధ్వర్యంలో కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకం కోసం చర్యలు తీసుకుంది. గ్రామానికి చెందిన పాము లోకేష్కు వీటి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మకాలు ఇష్టం లేని కొంతమంది అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దానిని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు యత్నించారు. విశాఖ డెయిరీ సంఘంలో పాలు పోస్తున్న రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు కంటైనర్ ఏర్పాటు చేసి పాలు, పాల ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించారు. ఈ పాల ఉత్పత్తులు అమ్మకాలు చేసే కంటైనర్ ఆర్అండ్బీ స్థలంలో ఉందనే కారణంగా మంగళవారం రైతులకు తెలియకుండా దానిని తొలగించారు. ఏటిగైరంపేట పరిధిలో చాలా వరకు ఆర్అండ్బీ స్థలంలోనే షాపులు ఉండగా రైతుల ద్వారా నడిచే ఈ కంటైనర్ తొలగించడం చాలా దారుణంగా ఆవేదన చెందుతున్నారు. వీటిపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని విశాఖ డెయిరీ సంఘ కార్యదర్శి పాము అప్పలనాయుడు, రైతులు తెలిపారు. -
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..
లెక్చరర్లు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజూ అదనంగా గంటపాటు చదివిస్తున్నారు. సబ్జెక్టులలో అనుమానాలను తీరుస్తున్నారు. మంచి మార్కులు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాం. –చరణ్, బైపీసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల ప్రోత్సాహం బాగుంది.. అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది. మా కళాశాలలో మంచి వాతావరణం ఉంది. స్టడీ అవర్స్ చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో అధ్యాపకుల పర్యవేక్షణలో పట్టుదలగా చదువుతున్నాం. – మేఘన, సీఈసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల -
చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి
యలమంచిలి రూరల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఫైనల్ చార్జ్ షీట్లో నిగ్గుతేల్చిందని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గసమన్వయకర్త కర ణం ధర్మశ్రీ తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని తెలుపుతూ ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా పదేపదే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని ఆయనడిమాండ్ చేశా రు.లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని,చేప నూనె కలి పారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కిలోనెయ్యి రూ.320కి కొంటే,చంద్రబాబు హయాంలో రూ.290కే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2019 మార్చి 6న ఆసంస్థకు 82వేల కిలోల నెయ్యి ని ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే ని తెలిపారు.సీబీఐ సిట్ ఎన్డీడీబీ,ఎన్డీఆర్ఐలు ఇచ్చిన నివేదికలు నిజం కాదట,చంద్రబాబు చెప్పి ందే నిజమట అని మండిపడ్డారు.చేసిన తప్పులకు చెంపలు వేసుకుని చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం
కోటవురట్ల: జీవితం మలుపుకు మొదటి అడుగు ఇంటర్లోనే..పదిని పదిలంగా దాటేసినా ఇంటర్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం..ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజినీరు అవ్వాలన్నా, సైంటిస్టుగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురి తప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్ధులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతో పాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు ప్రతీ రోజు పరిశీలన, వారానికి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలంటున్నారు. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను చేధించేందుకు గత పరీక్ష పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరం జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాలకోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
మెడకు చుట్టుకున్న మాంజా దారం
యలమంచిలి రూరల్: ఆటలాడుకుంటున్న రెండో తరగతి విద్యార్థి మెడకు మాంజా దారం చుట్టుకున్న ఘటనలో అదృష్టవశాత్తూ పెను ముప్పు తప్పింది. రెండు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఉక్కిరిబిక్కిరైన విద్యార్థి దారంతో పెనుగులాడడంతో తెగిపోయింది. రక్తస్రావంతో బాధపడుతున్న బాధిత విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడం, తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చూపడంతో విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులను నిలదీశారు. యలమంచిలి భాష్యం స్కూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలివి.. కోర్టుపేట వీధిలో భాష్యం స్కూల్లో రెండో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ఓ టీచర్ ఆటలాడించడానికి తీసుకెళ్లారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకుండా,హెచ్ఎంకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను ఆటలాడించడానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఆటలాడుతుండగా జారుడుబల్లపైకి ఎక్కిన నలుగురు విద్యార్థుల్లో పెదపల్లికి చెందిన బొద్దపు సాయి దీక్షిత్ మెడకు సమీపంలో చెట్టుకు వేలాడుతున్న పదునైన దారం చుట్టుకుంది. దీంతో మెడ భాగంలో రెండు లేయర్లు తెగిపోయాయి.మూడో రౌండు తిరిగే సమయంలో విద్యార్థి దారాన్ని తెంపుకొన్నాడు.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థికి వెంటనే చికిత్స చేయించకుండా అలాగే వదిలేశారు.విద్యార్థి తండ్రి అశోక్ ఫోన్ నంబరుకు కాల్ చేసిన టీచర్ అసలు విషయాన్ని చెప్పకుండా మీ అబ్బాయికి చిన్న గాయమైంది స్కూలుకు రావాలంటూ తెలపడంతో అనుమానం వచ్చిన తండ్రి హుటాహుటిన స్కూలు వద్దకు చేరుకున్నారు.మెడకు గాయమైనా తన కొడుక్కి చికిత్స చేయించకుండా తాత్సారం చేయడంతో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గాయపడిన విద్యార్థిని పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి,అక్కడ్నుంచి యలమంచిలి సీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఎంఎల్సీ కావడంతో పట్టణ ఎస్ఐ సావిత్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.మంగళవారం ఉదయం విద్యార్థిని అనకాపల్లి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు.ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్థారించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.మంగళవారం రాత్రి స్కూల్ నిర్వాహకులు,గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు,పెదపల్లి గ్రామపెద్దలతో యలమంచిలి సీఐ ధనుంజయరావు సమక్షంలో చర్చలు జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్కూలు నిర్వాహకులు తల్లిదండ్రులను ప్రాధేయపడ్డారు.దీనిపై ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు తెలిసింది.కాగా భాష్యం స్కూలు బిల్డింగుతో పాటు సమీపంలో ఉన్న బహుళ అంతస్థుల భవానాలకు పెద్దపెద్ద తేనెపట్లు ఉన్నాయి.వాటివల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంటుందని,వాటిని తొలగించాలని కోరినా స్కూలు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని,బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి పెద్ద సంఖ్యలో విద్యార్థులను కుక్కుతున్నారని..ఇలా పలువురు తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు. -
డీసీసీబీలో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు
అనంతగిరి మండలం వెలగలపాడు వాసిగా గుర్తింపు దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)లో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చోరీకి యత్నించిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు కె.కోటపాడు ఇన్చార్జి సీఐ పి.అప్పలరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైవాడ జలాశయం అతిథి గృహం సమీపంలోని బ్యాంకు వెనుక భాగంలో ప్రహరీ దాటి లోపలికి ప్రవేశించాడన్నారు. మేనేజర్ గది కిటికీ ఐరన్ గ్రిల్ను తన వద్ద ఉన్న ఇనుప రాడ్తో తొలగించి బ్యాంకులోకి చొరబడినట్టు చెప్పారు. సీసీ కెమెరాలో తన ముఖం రికార్డు అవుతుందని గమనించి తలపై స్వెటర్ కప్పుకుని లైట్లు ఆఫ్ చేసి చోరీకి యత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాష్ కౌంటర్లలో నగదు దొరకకపోవడంతో లాకర్ను తెరవడానికి యత్నించి విఫలమై అదే మార్గంలో పరారైనట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి డీఎస్పీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించినట్టు చెప్పారు. సీసీ ఫుటేజీలో ఫొటో ఆధారంగా నిందితుడు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు వెలగలపాడుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవరాపల్లి శారదానది వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వచ్చిన యువకుడు పంది ప్రభాస్ను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ కేసును కొద్ది రోజుల్లోనే ఛేదించిన సంబంధిత సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభినందించారు. మండలంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా నిందితుడి ప్రభాస్ను చోడవరం కోర్టుకు తరలించినున్నట్లు పోలీసులు తెలిపారు. -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. –ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నాం.. గత ఏడాది కంటే మంచి ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక ప్రణాళికతో విద్యార్ధులకు తర్ఫీదునిస్తున్నాం. అధ్యాపకులు వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించి ప్రతీ రోజు పురోగతిని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్ధులకు సహకారం అందించాలి. ఇంటి వద్ద విద్యార్ధులను పర్యవేక్షించి జాగ్రత్తగా చదివేలా చూడాలి. –డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, ప్రిన్సిపాల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటవురట్ల -
కోడి పందాలపై పోలీసుల దాడి
బుచ్చెయ్యపేట: రాజాం గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం గ్రామంలో పండగ సందర్భంగా నూకాలతల్లి గుడి వెనుక జరుగుతున్న కోడి పందాలపై ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను, రెండు కోడి పుంజులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న రూ, 1,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామదేవతల పండగల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయా గ్రామాల నాయకులు పోలీసులకు సహకరించాల ని అన్నారు. -
విశాఖ పోర్ట్ను సందర్శించిన ఐఏఎస్ శిక్షణార్థులు
విశాఖసిటీ: సివిల్స్ 2025 బ్యాచ్కు ఐఏఎస్ శిక్షణార్థుల బృందం సోమవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని (వీపీఏ) సందర్శించింది. వింటర్ స్టడీ టూర్లో భాగంగా వచ్చిన వీరికి పోర్టు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనుల గురించి అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా సోలార్ పవర్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ మొదలైన పర్యావరణహిత కార్యక్రమాలతోపాటు కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్ గురించి అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో వీపీఏ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా త్రినాఽథ్
బుచ్చెయ్యపేట: ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కందిపూడి ఉపాధ్యాయుడు తమరాన త్రినాఽథ్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర ఏపీటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో త్రినాఽథ్ను ఏకగ్రీవంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. పి. కందిపూడి పాఠశాలలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏపీటీఎఫ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని త్రినాథ్ తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
లోపూడిలో గ్రామ సభలను అడ్డుకున్న రైతులు
బుచ్చెయ్యపేట: మండలంలో లోపూడి, పొట్టిదొరపాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభలను రైతులు అడ్డుకున్నారు. లూలూరు, నిమ్మలోవ రెవెన్యూలో ఉన్న భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తు న్నట్టు అధికారులు రైతుల అమోదం కోసం రెండు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేశారు. లోపూడిలో సోమవారం ఉదయం 10 గంటలకు, పొట్టిదొరపాలెంలో 12 గంటలకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. రెండు గ్రామాల్లో టెంట్లు వేయడంతో గ్రామ సభలకు రైతులు వచ్చినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రామ సభలు నిర్వహించాల్సిన అధికారులు రాలేదు. పోలీసులు మాత్రం వచ్చి గ్రామ సభలు వద్ద మోహరించారు. ఒంటి గంట ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామమూర్తి వచ్చి గ్రామ సభలు పెట్టారు. అయితే పరిశ్రమలకు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పేశారు. పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. అసలు గ్రామ సభలను పోలీస్ బందోబస్తుతో పెట్టాల్సిన అవసరం ఏమిటో తేల్చి చెప్పాలని నిలదీశారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరిస్తుండగా కొన్ని గ్రామాల్లో సభల్లో గొడవలు జరగడంతో ముందస్తు చర్యగా పోలీసులను ఏర్పాటు చేశాం తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం కాదని మీ రెండు గ్రామాల్లో భూముల రికార్డులను సరి చేయడానికే వచ్చామని, సర్వే నెంబర్లు, పేర్లు, విస్తీర్ణాలు తప్పులు ఇతర భూ సమస్యలు ఉంటే మా రెవెన్యూ సిబ్బందితో సరి చేయించుకోవాలని డీటీ రైతులకు సూచించారు. రైతు సంఘ నాయకులు దొండా శ్రీను, చిట్టిబాబు, త్రినాఽథ్, నాయుడుబాబు, శేషు, మధు, బాబూరావు పాల్గొన్నారు. లోపూడిలో వెలవెలబోయిన గ్రామ సభసమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ తహసీల్దార్ -
ఫాగింగ్ ముసుగులో ఫుడ్ పాయిజన్?
కొమ్మాది(విశాఖ): స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ప్రస్తుతం పెను వివాదంగా మారింది. పాఠశాల యాజమాన్యం చెబుతున్న కారణాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న అనుమానాలు పాఠశాలలో ఫాగింగ్ చేయడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం బుకాయిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది ఫుడ్ పాయిజన్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటనలో వెలుగు చూసిన అంశాలు ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. ఫాగింగ్ వల్లే అనారోగ్యం కలిగితే, మరి నీటి నమూనాలను ల్యాబ్కు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని, మురుగు పేరుకుపోయిన డ్రైనేజీలు, అపరిశుభ్రమైన వాటర్ ట్యాంకులు దేనికి సంకేతమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాఠశాల వంటగదిని పరిశీలించినప్పుడు అక్కడ నిల్వ ఉంచిన మొలకెత్తిన బంగాళదుంపలు, వాడిపోయిన కూరగాయలు కనిపించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చాటి చెబుతోంది. వారం రోజుల క్రితం కూరగాయలను వాడడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్నాక్స్గా ప్యాకేజీ ఫుడ్ తీసుకోవడం వల్లే వాంతులు, విరేచనాలు అయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పైగా చికిత్స అందించిన వైద్యులు కూడా ఇది ఫుడ్ పాయిజన్ అని ధ్రువీకరించడం గమనార్హం. యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే నెపంతో ఫుడ్ పాయిజన్ను ఫాగింగ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక విద్యార్థికి మలేరియా సోకడం అక్కడ పారిశుధ్య లోపానికి నిదర్శనం. ఇంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం పత్రికా సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చర్యలకు డిమాండ్ పాఠశాల నిర్వహణ లోపం వల్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు విమర్శించారు. కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కక్ష సాధింపుతో కాపులపై అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు పాయకరావుపేట: కాపులపై కక్ష సాధింపుతో సీఎం చంద్రబాబు అన్యాయంగా కేసులు బనాయించడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కాపు నేతలను విమర్శించడంపై మండలంలోని మాసాహేబుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఈ నెల 7న ఉత్తరాంధ్ర కాపులందరూ పరామర్శించామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై కక్ష సాధిస్తున్నారని ఆ సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారన్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు దుర్భాషలాడటం తగదన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే స్థాయి టీడీపీ మండలాధ్యక్షుడు చించలపు పద్దు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబులకు లేదన్నారు. నాడు వంగవీటి రంగాను, నేడు ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులను కక్ష సాధింపుతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాపులను అణగదొక్కడం కోసమే కేసులు బనాయిస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అనడం అవగాహన రాహిత్యం అన్నారు. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ, సిట్ నిర్ధారించాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కాపు నాయకులు వైఎస్సార్సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే కాపులకు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ నాయకులు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్, గోపాలపట్నం, కేశవరం సర్పంచ్లు పన్నీరు బాబ్జి, మేడిశెట్టి రామగోవిందు, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, నాయకులు కోనే పుత్రరావు, పాలపర్తి సతీష్, అక్కిరెడ్డి నాగేశ్వరరావు, పెనుమత్య నాగేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, పర్వత సత్యనారాయణ పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీకి విశేష స్పందన
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈపీడీసీఎల్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి తొలిరోజున విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 48 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటులో ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అంచనాలు, విద్యుత్ లైన్ల మార్పు, బిల్లులు, విద్యుత్ లైన్లు స్తంభాల మార్పిడి, స్తంభాలపై వైర్లు వేలాడుతుండడం, సరఫరాలో అంతరాయాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎం వి.విజయలలిత, జీఎం ఎం.ఝాన్సీ పాల్గొన్నారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
అచ్యుతాపురం రూరల్: బొలేరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తాడు అనుకునేలోపే కుమారుడు అంతుచిక్కని లోకాలకు వెళ్లిపోయాడన్న చేదు నిజం ఒక తల్లి గుండెలను చిదిమేసింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో యర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ సాయి (22) బ్రాండిక్స్లో గల టీజే పరిశ్రమలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో సుప్రజా డెయిరీ ఎదురుగా అకస్మాత్తుగా రాంగ్ రూట్లో వచ్చిన బొలేరో వాహనంను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో వెనక కూర్చున్న రావాడ శ్రీను కూడా తీవ్రంగా గాయపడి ఆరిలోవలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యర్రవరంలో ఒక ఇంట్లో జరుగుతున్న జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదం బారినపడి ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన సాయి తండ్రి సంవత్సరం క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు తనకు అండగా ఉంటాడనుకున్న ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. కొడుకు మృతితో తల్లి గుండెలవిసేలా చేసిన రోదన గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన రావాడ శ్రీనుకు వివాహమై ఒక కుమార్తె ఉంది. విధుల నుంచి వస్తూ శ్రీను ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నారు. కాగా ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం సుప్రజ డెయిరీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి అలాగే ఆసుపత్రిలో ఉన్న యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం, సీఐటీయు, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా రహదారి పూర్తిగా స్తంభించడంతో కొన్ని గంటల వ్యవధి ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుకోకుండా బొలేరో వాహనం సుప్రజా డెయిరీలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా రహదారికి అడ్డంగా రావడంతో బైక్ పై ఉన్నవారు అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతున్నట్టు ఇన్స్పెక్టర్ చంధ్రశేఖర్రావు తెలిపారు. గాయపడిన రావాడ శ్రీనుసంఘటనా స్థలంలో సాయి మృతదేహం -
మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక
కొమ్మాది: 2026లో 2.1 మిలియన్ల పర్యాటకులు సందర్శించే లక్ష్యంతో మలేషియా టూరిజాన్ని విస్తరించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మలేషియా టూరిజం చైర్మన్ దాతూక్ మనోహరస్ పెరియసామి అన్నారు. సాగర్నగర్లో ఉన్న రాడిసన్ బ్లూ రిసార్టులో సోమవారం మలేషియా అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ భాగస్వామ్యంతో జరిగిన టూరిజం మలేషియా సేల్స్ మిషన్–2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వాములను పటిష్టం చేసి విభిన్న పర్యాటక శాఖలను ప్రోత్సహించడంపై మలేషియా దృష్టి సారించిందన్నారు. దక్షిణ భారతంలో టూరిజం మలేషియా ఉనికిని విస్తరించడం.. తద్వారా మార్కెట్లో మలేషియా భాగస్వామ్యం బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం అన్నారు. 2024లో 13,65,387 మంది పర్యాటకులు మలేషియాను సందర్శించగా 2025లో 15,65,194 మంది సందర్శించారన్నారు. 2026లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువ పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారత్, మలేషియా దేశాల మధ్య పర్యాటకుల డిమాండ్కు మద్దతుగా దేశంలోని 14 నగరాల నుంచి 47,399 సీట్ల కెపాసిటీతో 238 డైరెక్ట్ వీక్లీ విమానాలతో అనుసంధానం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టూరిజం మలేషియా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ విభాగం సీనీయర్ డైరెక్టర్ నువాల్ ఫాథిలా బింటీ, హిషాముద్దీస్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
మృత్యుఘంటికలు
హైవేపైజిల్లాలో 94 కి.మీ జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జనవరిలోనే 62 రోడ్డు ప్రమాదాలు.. 34 మంది మృత్యువాత ఉదయం 9 తర్వాత, సాయంత్రం 6 నుంచి 9 లోపు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ 9 హైవే మొబైల్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే మూడు బ్లాక్ స్పాట్స్ గుర్తింపు హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్ల వద్ద రోడ్లపై పార్కింగ్ చేస్తే చర్యలు సాక్షి, అనకాపల్లి: జాతీయ రహదారులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 94 కిలోమీటర్ల మేర హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మర్రిపాలెం, వేంపాడు, లంకెలపాలెం వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాటిని బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ను పోలీసులు, రవాణా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గతేడాది గణాంకాల ప్రకారం..రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడినవారిలో, ఎక్కువగా 18 నుంచి 60 ఏళ్ల లోపు పురుషులే అధికంగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఒక్క జనవరిలోనే మొత్తం 62 ప్రమాదాలు జరగగా వాటిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది కేవలం హెల్మెట్ ధరించకపోవడం కారణంగానే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అందుకే జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 హైవే మొబైల్ బృందాల సిబ్బందితో (సుమారు 40 మంది) ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేశారు. పనివేళల్లోనే ప్రమాదాలు అధికం గత ఐదేళ్లుగా రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే..వీటిలో ఎక్కువగా పనివేళల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు, తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల నడుమ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై పరవాడ పోలీస్స్టేషన్ పరిధిలో లంకెల పాలెం కూడలి, కశింకోట పీఎస్ పరిధిలో తాళ్లపాలెం జంక్షన్, నక్కపల్లి పీఎస్ పరిధిలో ఉద్దండపురం రోడ్డు జంక్షన్, బయ్యవరం జంక్షన్లో, నరిసింగిబిల్లి జంక్షన్, ఎస్.రాయవరం పీఎస్ పరిధిలో పెనుగొల్లు బస్స్టేషన్, కశింకోట జంక్షన్లో, ఆర్ఈసీఎస్ దగ్గర నూకాంబిక ఆలయం జంక్షన్, అనకాపల్లి ట్రాఫిక్ పరిధిలో సుంకరమెట్ట జంక్షన్, ఎస్.రాయవరం గోకుల్పాడు జంక్షన్, అనకాపల్లి రూరల్ పరిధిలో కేఎన్ఆర్ పేట గ్రామం వద్ద, కశింకోట హెరిటేజ్ జంక్షన్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కఠినంగా నిబంధనల అమలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ముందస్తుగా గుర్తించి జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే కూడళ్లను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాం. ఆయా చోట్ల ప్రత్యేక నిఘా ఉంచాం. హైవే మొబైల్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నాం. విజిబుల్ పోలీసింగ్ను, విస్తృత తనిఖీలను పెంచుతున్నాం. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సమయాన్ని డేంజర్ టైమింగ్స్గా పరిగణించాం. కఠినంగానే ట్రాఫిక్ నిబంధనలు అమలుచేస్తున్నాం. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ మాత్రం ఉపేక్షించేదిలేదు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చు. – ఎల్.మోహన్రావు, అదనపు ఎస్పీ -
పీఏసీఎస్ల ద్వారా యూరియా సరఫరాకు చర్యలు
కశింకోట: పీఏసీఎస్ల ద్వారా యూరియాను సరఫరా చేయడానికి మార్క్ఫెడ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించి చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. కశింకోట, నరసింగబిల్లి పీఏసీఎస్లను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సంఘ సభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. రుణాలను ఎకరాకు రూ.5 లక్షల నుంచి అవసరాన్ని బట్టి పెంచుతామని తెలిపారు. డీసీసీబీ బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలు రూ.3 లక్షల వరకు 7 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 9.50 శాతం వడ్డీతో ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రైతులు డీసీసీబీ రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో మరణించిన రైతుకు ఇచ్చే బీమా రూ.15,000 ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.50,000 కు పెంచామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన రైతుకు రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని, అలాగే పీఎంఎస్బీవై పథకం కింద ఎల్ఐసీ ద్వారా మరో రూ.2 లక్షల బీమా పరిహారం అందిస్తామని తెలిపారు. -
చందనోత్సవం విజయవంతానికి సమష్టి కృషి అవసరం
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని ఈవో జె. వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం దేవస్థానంలోని పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, విద్యుద్దీకరణ, భద్రత, రవాణా సదుపాయాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సింహగిరిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఈ నేపథ్యంలో నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణంపై చర్చించారు. భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్డీసీ గీతాంజలి, డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈ తాతాజీ, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, నరసింహరాజు, పిల్లా శ్రీనివాసరావు, పి. శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డగోలు అనుమతులు
దేవరాపల్లి: దేవరాపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు 75 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వడం అత్యంత దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని బిల్లలమెట్ట సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై గత ఏడాది డిసెంబర్ 1న ఫిర్యాదు చేస్తే సుమారు 75 రోజుల తర్వాత దర్యాప్తు జరిపి సోమవారం తనకు ఎండార్స్మెంట్ ఇచ్చారని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. దేవరాపల్లిలో మూడు సర్వే నెంబర్లలో కేవలం ఏడు రోజులు మాత్రమే మట్టి తవ్వి వ్యవసాయ భూమి చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలని సూచిస్తూ గత ఏడాది నవంబర్ 25న తహసీల్దార్ అనుమతులు ఇచ్చామని ఎండర్స్మెంట్లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. సదరు మట్టి తవ్వకాలు చేపట్టిన వ్యక్తి సుమారు నెల రోజులకు పైబడి నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ వాహనాలతో రాత్రి పగలు తేడా లేకుండా రెండు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టారని, కానీ రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్టుగా వ్యవహరించి, అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించారని విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వంపై నమ్మకం పోయి, తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకం, స్థానిక రెవెన్యూ అధికారుల అవినీతిపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మార్చి చివరికల్లా కేజీబీవీల్లో భవన నిర్మాణాలు పూర్తి
దేవరాపల్లి: దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ. 2.05 కోట్ల సమగ్ర శిక్ష నిధులతో నిర్మిస్తున్న టైప్–4 కేజీబీవీ భవన నిర్మాణాన్ని మార్చి నెలాఖరుకు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ వెల్లడించారు. మండల కేంద్రం దేవరాపల్లిలో టైప్–4 కేజీబీవీ భవన స్లాబ్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ రెండు అంతస్తుల భవన నిర్మాణం పూర్తయితే వంద మంది బాలికలకు సరిపడా తరగతి గదులు, డార్మిటరీ, భోజన శాల, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు సమకూరుతాయన్నారు. జిల్లాలో టైప్–4 కేజీబీవీలు గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోను, మరొకటి దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 కేజీబీవీల్లో రూ. 21.52 కోట్ల వ్యయంతో డార్మిటరీలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 2025–2026 విద్యా సంవత్సరానికి సమగ్ర శిక్ష ద్వారా రూ. 12 కోట్ల వ్యయంతో పాఠశాల్లో ల్యాబ్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల సదుపాయం, భవిత కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అలాగే పీఎంశ్రీ పథకం ఫేజ్–7 కింద ఆరు పాఠశాలల్లో రూ. 2.33 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట సమగ్ర శిక్ష ఏఈ సంతోష్ పాల్గొన్నారు. -
లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం
నక్కపల్లి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టం చేయడంతో చంద్రబాబు, లోకేష్ పవన్కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పలేక సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీతంపాలెంలో మాట్లాడుతూ గుజరాత్లోని ఎన్డీడీబీ, హర్యానాలో ఎన్డీఆర్ఐ ల్యాబ్లో పరీక్షించి నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలవలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం మానుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని 2024 జూలై 17న నివేదిక వచ్చిందని అప్పటి ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే, అదే ట్యాంకర్లలో నెయ్యి తిరిగి ఏఆర్ డెయిరీకి వెళ్లకుండా వైష్ణవి డైయిరీకి వెళ్లి పేరు మార్చి మళ్లీ తిరుమలకు ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఇదే నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వినియోగించారని సుప్రీం కోర్టులో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. అల్ఫా మిల్క్లో ప్రమాణాలు సరిగ్గా లేవని కేసులు నమోదు చేసిందన్నారు. అదే ఆల్ఫా మిల్క్ కంపెనీకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాలని ప్రస్తుత చైర్మన్ బీఆర్నాయడు రూ.245 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసి వాటిని అప్పటి ఈవో అనిల్కుమార్ సింఘాల్పై తోసేసి రాత్రికి రాత్రే అతనిని బదిలీ చేసిందన్నారు. అతనితోపాటు శ్యామలరావులను ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. సీబీఐ చార్జ్షీట్ ప్రజలు పూర్తిగా తెలుసుకునేలోపు వారిలో విష ప్రచారం ఎక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టడం, యూట్యూబ్ చానళ్ల ద్వారా గత ప్రభుత్వంపైన అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డిపైన తప్పుడు ప్రచారం చేసి తిరుమల ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. దీని కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల్లోకి రాలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసి అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై భౌతిక దాడులకు పాల్పడి అరెస్టు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీటీసీ గొర్ల గోవిందు, సర్పంచ్లు వెదుళ్ల వెంకటరమణ, నాగఅప్పలరాజు, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!
మునగపాక: పాటిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆకతాయిలెవరో అపహరించేందుకు యత్నించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం ఆలయం పైకి వెళ్లిన స్థానికులకు అభయాంజనేయ స్వామి విగ్రహం స్థానచలనం అయినట్టు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు విగ్రహాన్ని ఎత్తుకుపోయేందుకు యత్నించినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఐఎఫ్ఆర్కు ఏర్పాట్లు వేగవంతం
ఏయూ క్యాంపస్: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు నగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే కొత్త రోడ్లు వేసిన అధికారులు, రంగులు వేయడం ద్వారా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చేస్తున్నారు. డివైడర్ మధ్యలో ప్రత్యేక ఇనుప స్తంభాలను ఏర్పాటు చేసి ఐఎఫ్ఆర్కు సంబంధించిన జెండాలను ఎగురవేశారు. బీచ్రోడ్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో గోడలకు సముద్రం, లైట్హౌస్, నౌకలు వంటి థీమ్లతో ఆకట్టుకునే చిత్రలేఖనాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు సందర్శకులు కూర్చుని వీక్షించేందుకు వీలుగా వేదికల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఫుట్పాత్లపై సందర్శకుల కోసం ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప తిన్నెలపై కూడా బారికేడ్లు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. సోమవారం రక్షణ రంగానికి చెందిన విమానాలు పలుమార్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ దర్శనమిచ్చాయి. -
భూ సమస్యలే అధికం
కాళ్లరిగేలా తిరిగినా గోడు వినలేదు... తుమ్మపాల: భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ల ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1 , 2 లో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆయనతో పాటు ఎన్ఎఓబీ, బిజయూఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రామమణి, మనోరమలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో 131, రెవిన్యూ క్లినిక్లో 197 అర్జీలు మొత్తం – 328 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మెప్మా, ఐసిడీి ఎస్ అధికారులు కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా పాల్గొన్నారు. పాఠశాల ఆటస్థలంలో నిర్మాణాలపై నిరసన పాఠశాల ఆటస్థలంలో నిర్మించే డ్రైనేజీ వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలంటూ యలమంచిలి మండలం తెరువుపల్లి గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలంతో పాటు గ్రామ అవసరాలకు కూడా వినియోగించుకుంటున్న గ్రౌండ్ను కనుమరుగు చేసేవిధంగా గ్రామస్తుల అంగీకారం లేకుండా యలమంచిలి మున్సిపాలిటీ అవసరాలకు వినియోగించడం దారుణమని, పాఠశాలకు చెందిన ఆటస్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ నినాదాలు చేసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనధికార భూసర్వే పనులపై ఆగ్రహం రైతులకు కనీస సమాచారం లేకుండా వ్యవసాయ భూముల్లో అధికారులు చేపట్టే అనధికారిక సర్వేను నిలిపివేసి గ్రామాన్ని కాపాడాలంటూ సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే తమ భూముల్లో మూడు రోజులుగా అధికారులు భూ సర్వే పనులు చేస్తున్నారని, అడిగితే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఏపీఐఐసీకి భూములు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామన్నారు. పరిశ్రమలకు గ్రామంలో రైతుల భూములను సేకరించే విధంగా సర్వే చేయడం అన్యాయమని, గ్రామసభ, గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేయకుండా చేపడుతున్న సర్వేను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయం అధారంగా ఉన్న గ్రామస్తుల పొట్ట కొట్టవద్దని, ఏపీఐఐసీకి భూ కేటాయింపులు మరో చోట చేపట్టి మా గ్రామాన్ని విడిచిపెట్టాలంటూ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. ఆ వీఆర్వోలపై చర్యలు తీసుకోండి... నిబంధనలకు విరుద్ధంగా సొంత మండలంలోనే విధుల్లో కొనసాగుతున్న ఇద్దరు వీఆర్వోలపై విజిలెన్స్ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్ బొంతు రమణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండల స్థిరనివాసులైన జి.సాంబశివరావు, ఎస్.సూర్యనారాయణ అనే ఇద్దరు వీఆర్వోలు మాకవరపాలెం, రాచపల్లి గ్రామాల్లోనే వీఆర్వోలుగా విధుల్లో కొనసాగుతున్నారని, ప్రభుత్వం చేపట్టే బదిలీలకు విరుద్ధంగా ఇతర చోట్లకు వెళ్లకుండా కొనసాగడం ప్రాథమిక ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. చిల్లంగి పేరిట వేధింపులపై ఫిర్యాదు చెడుపులు చిల్లంగులు చేస్తున్నామంటూ అదేపనిగా దూషించడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాక మండలం టి.సిరసపల్లి గ్రామానికి చెందిన బి.నరేష్, మరికొంతమంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో అద్దెకు వచ్చి నివాసముంటూ వికలాంగులుగా ఉన్న చిట్టిబోయిన విజయ, కరుణ, వగైరాలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని, అందరిపై పోలీసు కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్ చేసి తమకు కాపాడాలని కోరారు. రాయపుర అగ్రహారం గ్రామస్తుల నిరసన ఆటస్థలాన్ని కాపాడాలంటూ నిరసన తెలుపుతున్న తెరువుపల్లి గ్రామస్తులుఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుడుగా నమోదైన కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావడం లేదని, తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ కూడా రాకపోవడంపై కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అర్జీ చేసేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్ల అర్జీని నమోదు చేయకుండా కలెక్టరేట్ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేశారు. అనకాపల్లి మండలం మూలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇల్లా హిమవర్శిని డిగ్రీ, యామిని ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కూలీపనులు చేసుకుంటు కుటుంబాన్ని నేట్టుకొచ్చే తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న క్రమంలో ఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుగా నమోదైంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో అప్పును ఆగమేఘాల మీద తీర్చేసినప్పటికీ తప్పుగా నమోదైన ఇన్కంట్యాక్స్ వివరాలు మాత్రం ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగిపోలేదు. దీంతో అమ్మ ఒడి దగ్గర నుంచి ఫీజు రీయంబర్స్మెంట్ ఇతరత్రా ఏ ఒక్కపథకంలో వీరికి లబ్ధి చేకూరలేదు. దీనిపై అనేక వినతులు చేస్తున్నా పట్టించుకుని పరిష్కరించే అధికార యాంత్రంగమే లేకపోవడంతో చివరకు కళాశాలకు సెలవు పెట్టి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలెక్టరేట్కు వచ్చారు. కూలీపనులు చేసుకుంటూ తమను పోషిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న తమకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్కు తమ బాధ చెప్పుకుందామని వస్తే మీ అర్జీ తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉందంటూ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేయడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. – ఇల్లా హిమవర్శిని, యామిని పీజీఆర్ఎస్కు 131 అర్జీలు ఎస్పీ కార్యాలయానికి 55 అర్జీలు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 55 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏఎస్పీ తెలిపారు. భూ తగాదాలకు సంబంధించి 25, కుటుంబ కలహాలపై 2, మోసపూరిత వ్యవ హారాలపై 4, ఇతరత్రా 24 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ జి.విశ్వనాథం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉక్కుపై కక్ష..ఈపీడీసీఎల్కు శిక్ష!
స్టీల్ప్లాంట్ బకాయిలతో డిస్కమ్కు దెబ్బసాక్షి, విశాఖపట్నం : ఆంధ్రుల హకై ్కన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనసాగిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా దెబ్బతీస్తూ, మరోవైపు ఉద్యోగుల తగ్గింపుతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ నిలదొక్కుకునేలా సాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయాలకు తానా–తందానా అంటూ వ్యవహరించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా చేసే ఏపీఈపీడీసీఎల్పై భారం పడింది. ప్లాంట్ నుంచి వందల కోట్ల రూపాయల బకాయిలు మొండిబకాయిలుగా మారడంతో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్లో ఎప్పుడూ ‘ఏ’ గ్రేడ్లో ఉండే ఈపీడీసీఎల్ తొలిసారిగా ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. బకాయిల వసూలులో వెనుకబాటే కారణంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని కేంద్రం స్పష్టం చేయగా, ఇందులో ఈపీడీసీఎల్ తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం అనుభవించాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెల్లింపులు జరుగుతాయా.. లేదా..? బిల్లు బకాయిల కోసం పలుమార్లు స్టీల్ ప్లాంట్తో, ప్రభుత్వంతో ఈపీడీసీఎల్ చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. డిస్కమ్ పనితీరు అద్భుతంగా ఉన్నా.. ప్లాంట్కు కనీసం విద్యుత్ బిల్లులు కట్టే స్తోమత లేకుండా చేసి, ఆ నెపాన్ని డిస్కమ్పై నెట్టి మొత్తానికి విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పాలన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు చేయకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవడం ద్వారా ప్లాంట్ను ఎండగడుతున్న కేంద్ర తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక మర్మం ప్రజలకు అర్థమవుతోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. బకాయిల వల్ల ఏపీ ఈపీడీసీఎల్కు వార్షిక నష్టం రూ.7,155 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వం మొద్దునిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రంలోని పెద్దల మెప్పుకోసమే చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నుంచి చెల్లింపులు జరుగుతాయా లేదా అన్న మీమాంసలో ఈపీడీసీఎల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సమగ్ర కారణాలు వివరించి గ్రేడ్ మార్పు కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఈపీడీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి ఈపీడీసీఎల్ ప్రతిష్టను దెబ్బతీసిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్లాంట్ బకాయిలే ప్రధాన కారణం..! విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఈపీడీసీఎల్కు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటీకరణ కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వంతపాడుతూ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బకాయిలపై గతంలో స్టీల్ ప్లాంట్కు ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు వెనక్కి తీసుకోవాలని, బకాయిలపై దృష్టిసారిస్తామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈపీడీసీఎల్ అధికారులు మౌనం వహించారు. ఫలితంగా 2024 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలోనే సుమారు రూ.550.40 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలుగా మారి డిస్కమ్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి. సహకారమెక్కడ చంద్రబాబూ..? స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సహకారం అందించకపోవడంతో ఈ భారం ఈపీడీసీఎల్ మెడకు చుట్టుకుంది. డిస్కమ్ పరిధిలో యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఒక యూనిట్ సగటు వ్యయం, సగటు రాబడి మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్ శాఖ పరిభాషలో ఏసీఎస్–ఏఆర్ఆర్ గ్యాప్గా పేర్కొంటారు. ఇది 2023–24లో 0.36 శాతంతో అద్భుతంగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ బకాయిల కారణంగా ఈ వ్యత్యాసం ప్లస్ నుంచి మైనస్లోకి వెళ్లిపోయింది. 2024–25లో –0.09 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా ఈపీడీసీఎల్ గ్రేడ్ మార్కులను భారీగా కోల్పోయింది. ఏపీ ఈపీడీసీఎల్ కేంద్రం విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్ నివేదికలో ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. గతంలో 65.12 మార్కులు సాధించిన డిస్కమ్, తాజాగా 50.46 మార్కులకు పరిమితమైంది. స్టీల్ ప్లాంట్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈపీడీసీఎల్ 71.34 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్లోనే కొనసాగేది. ఏడాది కాలంలో రూ.550 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిల చెల్లింపులో ప్లాంట్కుసహకరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫలితంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం డిస్కమ్ పనితీరు సరిగా లేదంటూ తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో బలవుతున్న ఈపీడీసీఎల్ పలుమార్లు నివేదించినా పట్టించుకోని ప్రభుత్వం -
భక్తుల సౌకర్యమే తొలి లక్ష్యం
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్చార్జి ఈవోగా పనిచేసిన ఎన్.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు బాధ్యతల స్వీకరణ -
ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం జిల్లా అధ్యక్షునిగా కృష్ణమోహన్
అనకాపల్లి: ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా వి.కృష్ణమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గాంధీనగరం సంయుక్త కాలేజీలో ఆదివారం ఈ ఎన్నిక నిర్వహించారు. కమిటీ గౌరవాధ్యక్షునిగా జి.వి.సన్యాసిరావు, ఉపాధ్యక్షులుగా పి.కనకరాజు, ఎం.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కె.విజయలక్ష్మి, అదనపు కార్యదర్శిగా ఎం. నాయుడు, కార్యదర్శిగా ఎం.పట్టాభి, కోశాధికారిగా నిర్మలా రాణి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రాజేశ్వరరావు, సన్యాసిరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీపీఎస్హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. -
ఏకోపాధ్యాయలో ... బోధన ఏ దయ ?
నర్సీపట్నం: ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరే టీచర్ 1 నుంచి 5వ తరగతి వరకూ బోధించవలసి వస్తోంది. ఐదు తరగతులకు కలిపి దాదాపు 15 వరకూ సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులన్నీ ఒకే ఉపాధ్యాయుడు చెప్పడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఏదైనా కారణంతో ఉపాధ్యాయుడు రాకపోతే పాఠశాల మూతపడుతోంది. దీనికి తోడు తరచూ ఉపాధ్యాయులకు ఏదో ఒక పేరుతో శిక్షణలు ఇస్తుండడంతో నెలలో కనీసం మూడు,నాలుగు రోజులు వారు వాటికి హాజరుకావలసి వస్తోంది. ఆ సమయంలో కూడా పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. సీఆర్ఎమ్టీలతో బోధనేతర పనులు ఉపాధ్యాయుడు సెలవు పెట్టినప్పుడు ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలు మూతపడకుండా ఉండేందుకు, పేద విద్యార్థులకు నష్టం కలుగకూడదనే దూర దృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్లస్టర్ రిజ్వర్డ్ మొబైల్ టీచర్(సీఆర్ఎమ్టీ) వ్యవస్థను తీసుకొచ్చింది. సమగ్ర శిక్షలో బీఈడీ, టెట్ విద్యార్హతతో నియామకమైన సీఆర్ఎమ్టీలను బోధనకు ఉపయోగించేవారు. ఏకోపాధ్యాయుడు తన అవసరాల కోసం సెలవు పెట్టినా, మండల, జిల్లాస్థాయిలో శిక్షణ తరగతులకు హాజరైనప్పుడు మూతపడకుండా సీఆర్ఎమ్టీలతో పాఠశాలలు నిర్వహించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో వారిని ఎక్కువగా బోధనేతర పనులకు వినియోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సరఫరా, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను వారికి అప్పగించారు. జిల్లాలో ఉన్న 106 మంది సీఆర్ఎమ్టీలను కేవలం ఎంఈవో కార్యాలయానికి, పాఠశాలకు అనుసంధాన కర్తలుగా పరిమితి చేశారు. దీనికి తోడు సరైన పర్యవేక్షణ లేక ఎక్కడైనా ఏకోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ పాఠశాల మూతపడుతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన కుంటుపకుండా విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడును వివరణ కోరగా పాఠశాలలు మూతపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాను. కొన్ని మండలాల్లో స్కూళ్లు మూతపడినట్టు తనదృష్టికి వచ్చింది. ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని డీఈవో తెలిపారు. -
జేసీ సీటు ఖాళీ...సేవల్లో తీవ్ర జాప్యం
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్(జేసీ) సీటు ఖాళీగా ఉండడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానమైన రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ వ్యవహారాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందించే సేవల్లో తీవ్ర జాప్యం నెలకుంటోంది. ఇక్కడ జేసీగా పనిచేసిన జాహ్నవి వ్యక్తిగత కారణాలతో పలుమార్లు సెలవు పెట్టడడంతో ఆరు నెలలుగా పాలనాపరమైన పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇన్చార్జి బాధ్యతలను డీఆర్వో సత్యనారాయణకు అప్పగించినప్పటికీ పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. పాత జేసీ జాహ్నవి ప్రసూతి సెలవులో వెళ్లడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మల్లవరపు సూర్యతేజను గతనెల 12న ప్రభుత్వం ఇక్కడ జేసీగా నియమించింది. 26 రోజులుదాటినా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ఇక్కడకు వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని తెలిసింది. ఆయన రానప్పటికీ కొత్త అధికారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేసే వారు, వివిధ పనుల కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా జనవరి నెలలో ‘అనకాపల్లి ఉత్సవ్ ’నిర్వహించడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఈవెంట్లతో కలెక్టర్తో సహా అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రెవెన్యూ సమస్యలు, ఫైళ్లు పెండింగ్లో పడిపోయాయి. దీంతో జేసీని నియమించాలని జిల్లాలో ఉద్యమకర్తలు, ప్రజలు ‘ఎక్స్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు చతికిలపడిన కీలక విభాగాలు జిల్లా పాలనలో జాయింట్ కలెక్టర్(జేసీ)ది కీలక భూమిక. ప్రధానంగా సివిల్ సప్లయిస్, భూసేకర ణ, గనులు, ఖనిజాలు, వివిధ సంక్షేమ శాఖలు, ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ, విపత్తు నిర్వహణ వంటివి జేసీ పరిధిలోనే ఉంటాయి. ప్రధానంగా రెవెన్యూ విభాగంలో పెండింగ్లో ఉన్న కేసులు, అప్పీళ్లను పర్యవేక్షిస్తారు. జేసీ లేకపోవడంతో భూ వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, భూ రికార్డుల కంప్యూటరీకరణ అటకెక్కాయి. పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీ, భూముల రీసర్వే, ఏపీఐఐసీ భూసేకరణ, సబ్సిడీ బియ్యం పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియలో సమన్వయం లోపించింది. పింఛన్లు, గృహ నిర్మాణ పథకాల పురోగతిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువైంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి కొత్తగా నియమితులైన జేసీ బాధ్యతలు స్వీకరించి,పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలి. జీవో వచ్చి 26 రోజులైనా ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం వెనుక ఉన్న కారణం తెలియడం లేదు. జేసీ సేవలు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో ఆరు నెల లుగా పాలన కుంటుపడింది. తక్షణమే జేసీ నియమించాలని తాను ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరాను. జిల్లా లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి. –కాండ్రేగుల వెంకటరమణ, ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాల ప్రభావితుల ఉద్యమకర్త -
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయ కర్త ప్రసాద్ మునగపాక: తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. ఆదివారం మునగపాకలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ తయారీలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదంటూ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీఆర్ఐ,ఎన్డీడీబీ ల్యాబ్ల రిపోర్టులు చెబుతున్నా .. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. ఈసమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీటీసీ సూరిశెట్టి రాము,సర్పంచ్ భీశెట్టి గంగప్పలనాయుడు, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్, పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ, కేశవరావు,చిరంజీవి, పెదబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
మహారాణిపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షుడు సీహెచ్ మురళి ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎస్.సత్తిబాబు(సూపరింటెండెంట్, పీఐయూ డివిజన్), ప్రధాన కార్యదర్శిగా డి.వి.సీతారామరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.పూర్ణయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆర్వీ నాగరాజు, డి.వి.ఎస్ గౌరీపతిరావు, పి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా పి.రామకృష్ణ, ఎం.వి. హెచ్.ఆర్.స్వామి, వై.రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సుధారాణి, డి.వి.రమణారాజు, ఎస్.రవికుమార్, బి.వి.ఎస్.ఫణికుమార్, కోశాధికారిగా బి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి.గంగాధర్, ఎస్.త్రినాథ్, సీహెచ్ సింహాచలం, జి.ఎల్.నర్సింహారావులను ఎన్నుకున్నారు. సత్తిబాబు, సీతారామరాజు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులుగా బి.హెచ్.వి.రమణబాబు, యు.కూర్మారావు వ్యవహరించారు. -
దివ్యాంగ బాలలను ప్రోత్సహించాలి
అనకాపల్లి: దివ్యాంగ బాలలను ప్రోత్సహించి, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి ఆర్ట్, కల్చరల్ పోటీలను శనివారం నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి, సరైన దిశలో ప్రొత్సహించినట్టయితే వారిలో ప్రతిభను వెలికితీయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణం నాయుడు, మండల విద్యాశాఖాధికారి కోటేశ్వరరావు, వివిధ మండలాల దివ్యాంగ బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం
ఏయూక్యాంపస్: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఎస్ఎస్ఓ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లోని జోడుగుళ్లపాలెం, కై లాసగిరి రోప్వే వద్ద 5, 10 కిలోమీటర్ల స్వచ్ఛత రన్, 3 కిలోమీటర్ల స్వచ్ఛత వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో సైకత శిల్పాల తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తదితరులతో కలిసి ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ హిమాలయాల నుంచి సముద్రాల వరకు పరిశుభ్రతపై సులభ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయన్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నాలుగు దశలుగా నిర్వహిస్తామని, విశాఖలో మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైందన్నారు. కార్యక్రమం ముగింపులో స్వచ్ఛత రన్, వాక్, సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి
కశింకోట: స్థానిక కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణరావు అందించిన వివరాలు ప్రకారం.. మండలంలోని తేగాడ గ్రామానికి చెందిన నానుబిల్లి నరసింగరావు(65) మోపెడు వాహనంపై తమ గ్రామం నుంచి వస్తూ కసింకోట కూడలి వద్ద మలుపులో రోడ్డు దాటుతుండగా, అదే మార్గంలో లారీ వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన నరసింగరావును అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డీసీసీబీలో చోరీకి విఫల యత్నం
సీసీ పుటేజీ దృశ్యాలను పరిశీలిస్తున్న చోడవరం సిఐ పి. అప్పలరాజు తదితర్లుదుండగులు తొలగించిన కిటికీని పరిశీలిస్తున్న ఎస్ఐ వి. సత్యనారాయణ. దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న డీసీసీబీలో బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీని తొలగించి లోనికి చొరబడి చోరీకి యత్నించారు. వారికి నగదు, బంగారం లభించకపోవడంతో వెనుదిరిగారు. ప్రతీ రోజు మాదిరిగా శనివారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీ తొలగించి ఉండటాన్ని గుర్తించి తక్షణమే బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావు సమాచారం అందించారు. ఆయన తమ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణకు సమాచారం అందించారు. ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ బ్యాంకులో లాకర్, కిటికీ తొలగించిన ప్రదేశాల్లో దుండగుల వేలి ముద్రలు ఇతర ఆధారాలను సేకరించింది. బ్యాంక్లోని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగులు బ్యాంకులోకి చొరబడిన విధానాన్ని చోడవరం సీఐ పి. అప్పలరాజు, ఎస్ఐలు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితర్లు పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు వెనుక భాగంలోని ఇనుప కిటికీని తొలగించారని చెప్పారు. ఒక వ్యక్తి బ్యాంకులోకి చొరబడగా మరో వ్యక్తి వెనుక వైపు కాపలా ఉన్నట్టు తెలిపారు. లోపల దొంగతనం చేసేందుకు ప్రయత్నించినా ఎక్కడా అవకాశం లేక పోవడంతో వెనుదిరిగాడన్నారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ తుప్పు పట్టి ఉందని, వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని, బ్యాంక్లో ఆగిపోయిన అలారం మోగే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావుకు పోలీసులు సూచించారు. బ్యాంకులో నగదు, బంగారు అభరణాలు భద్రంగా ఉన్నాయని, పోలీసు, బ్యాంకు అధికారులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దుండగుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో పాటు ఎ. కోడూరు ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీసీ టీవీ ద్వారా సేకరించిన దుండగుల ఫొటోలు -
డిగ్రీ అధ్యాపకుడికి ప్రశంస
మాడుగుల: స్థానిక డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పులపర్తి పైడిరాజు మహాభారతంలోని భీష్మపర్వంపై ఉపన్యాసించి ప్రశంసలందుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన జాతీయ తెలుగు భాషా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఈ నెల 5, 6వ తేదీల్లో జాతీయ తెలుగు భాషా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భారతీయ జ్ఞాన పరంపర, తెలుగు సాహిత్యం అనే అంశంపై ఆయన ఉపన్యాసించారు. ఈ మేరకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, డైరెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పైడిరాజును అభినందించారు. -
వరి కుప్పలకు నిప్పు పెట్టిన దుండగులు
కోటవురట్ల: పి.కె.పల్లిలో వరి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన అల్లు శ్రీరామ్మూర్తి, తానారి నూకరాజులకు చెందిన రెండు వరి కుప్పలకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టారు. రైతులు శనివారం ఉదయం పొలానికి వెళ్లేసరికి కుప్పలు దగ్ధమవుతూ కనిపించాయి. సమీప రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ రెండు కుప్పలను నూరిస్తే సుమారు 75 బస్తాల ధాన్యం అవుతాయని, కక్షపూరితంగానే మంట పెట్టారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడో రేపో కుప్పలు నూర్చి ధాన్యాన్ని ఇంటికి పట్టుకెళ్లేందుకు చూస్తుండగా ఎవరో కావాలనే నిప్పు పెట్టారని వాపోయారు. చేతికి ఫలసాయం రాకుండా కక్ష కట్టారని ఆరోపించారు. బాధిత రైతులు పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణరాజు రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తకు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఇటువంటి చర్యలు పగలను పెంచుతాయని, పల్లెల్లో అంతా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా మెలగాలన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
మంత్రులపైనా పీడీయాక్టు ఎందుకు పెట్టలేదు
అనకాపల్లి: హోం మంత్రి అనితపైనా 32 కేసులు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్పైనా 37 కేసులున్నా పీడీ యాక్టు ఎందుకు ప్రయోగించడం లేదని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజుపై 19 కేసులున్నాయని పీడీ యాక్టు ప్రయోగించినా చివరికి ప్రజా పోరాటమే గెలిచిందని విమర్శించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్.రాయవరం మండలంలో బల్క్డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న మత్స్యకారులకు మద్దతు పలికినందుకు అప్పలరాజును అన్యాయంగా నిర్బంధించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. గత నెల 30న అడ్వైజరీ కమిటీ బోర్డు మీటింగులో పోలీసులు పెట్టిన తప్పుడు కేసులుపై సమీక్షించి పీడీ చట్టాన్ని రద్దు చేసి శుక్రవారం విడుదల చేశారన్నారు. ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా పీడీ యాక్టు కింద 43 రోజులు జైలులో నిర్బంధించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అప్పలరాజును జైలులో పెట్టినా ఉద్యమాలు ఆగలేదన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని భావించి విడుదల చేశారన్నారు. గతంలో రసాయన కంపెనీలు పెట్టకూడదని చెప్పిన అనిత అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవిధంగా మాట్లాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా
యలమంచిలి దిమిలిరోడ్డు కూడలి వద్ద దుకాణం నుంచి తెస్తున్న చికెన్ వ్యర్థాలు చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,వాటిని చే పలకు మేతగా ఉపయోగించడాన్ని సీరియస్గా పరిగణించిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మార్చి నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో కోళ్ల వ్యర్థాల వాహనాలపై నిఘా పెట్టాలని డీజీపీ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కనీస స్పందన కనిపించడంలేదు. తూతూ మంత్రంగా దాడులు జరుపుతున్నారు. నెలరోజుల క్రితం అనకాపల్లిలో పోలీసులు దాడులు జరిపి చికెన్ తరలిస్తున్న కొన్ని వాహనాలను పట్టుకున్నారు. విలేకరులు ఎవరైనా చికెన్ వ్యర్థాల వాహనాలను ఆపి ఫొటోలు తీయాలన్నా అక్రమార్కులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.మా వాహనాలను అక్రమంగా ఆపుతున్నారంటూ మీడియా ప్రతినిధులపైనే ఫిర్యాదు చేసి,పోలీసుల సహకారంతో అక్రమ కేసులు సైతం బనాయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
సీపీఎస్ రద్దు కోరుతూ వచ్చేనెల 1న నిరసన
అనకాపల్లి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మార్చి ఒకటో తేదీన విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఎస్ ఎంపాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక విజయరామరాజుపేట వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర ఘోష పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తామని మెరుగైన పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మళ్ల ఉమామహేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణ్ణమోహన్, సభ్యులు గణేష్, ఆనంద్, పల్లా బాబ్జి, రామచంద్రరావు, జి.అర్జున్ పాల్గొన్నారు. -
కాపులను అంతమొందించడమే చంద్రబాబు అంతిమ లక్ష్యం
నక్కపల్లి/ పాయకరావుపేట: కాపులను అంతమొందించడమే చంద్రబాబు అంతిమ లక్ష్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ మంత్రి కాపునేత అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు వెళ్తూ పాయకరావుపేట సమీపంలో పి.ఎల్.పురం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా కాపులను అణగదొక్కడం, తనకు ఎదురు తిరిగిన కాపునేతలను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కాపు నాయకుడు వంగవీటి మోహన్రంగా నుంచి ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులపై జరిగిన దాడులను బట్టి చంద్రబాబు వైఖరి అర్థమవుతోందని చెప్పారు. కాపులు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు, టీడీపీ,జనసేనల్లో చేరిన కాపునాయకులను సహితం చంద్రబాబు నాయుడు అండ్కో తీవ్ర ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కక్షసాధింపు చర్యలు, భౌతిక దాడులకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నాడు రంగాను ఎలా అడ్డుతొలగించుకున్నారో అలాగే ముద్రగడ పద్మనాభాన్ని కూడా అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నం చేశారన్నారు. తాజాగా మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై కూడా ఇదేరకమైన దాడులు చేశారని ఆరోపించారు. అంబటి ఇంటిని తగల బెట్టడంతోపాటు, ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. కాపులు ఏ పార్టీలో ఉన్నా తనకు ఎప్పటికై నా ప్రమాదమని గ్రహించిన చంద్రబాబు వారిని అంతమొందించే కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని సీబీఐ నిర్ధారిస్తూ సుప్రీంకోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమినాయకులుచేసింది తప్పుడు ప్రచారమని రుజువైందన్నారు.తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని చెప్పారు. విశాఖలో గీతం విద్యాసంస్థలకు రూ.వేలకోట్ల విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.ఈ రెండు విషయాలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అంబటి రాంబాబు, జోగిరమేష్ల ఇళ్లపై దాడులకు పాల్పడి, డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రశ్నించే వారిపై కక్ష కడుతున్నారన్నారు.అధికారం శాశ్వతం కాదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. రాజకీయ దాడులకు గురైన అంబటి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచేందుకే ఉమ్మడి విశాఖజిల్లా నుంచి కాపులంతా గుంటూరు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. పార్టీ రాష్ట్రకార్యదర్శి చిక్కాల రామారావు మాట్లాడుతూ అంబటి రాంబాబుపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ముద్రగడ, అంబటి రాంబాబు ఇలా కాపునాయకులందరినీ చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. రాష్ట్రంలో కాపులు బతికే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కాపులను రోడ్డుమీదకు రాకుండా చేయడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాలజోగులు,చింత లపూడి వెంకటరామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, అధికారప్రతినిధి దగ్డుపల్లిసాయిబాబా, స్థానిక నాయకులు ధనిశెట్టి బాబూరావు, ధనిశెట్టిబాబి, గెడ్డమూరి శ్రీనివాస్,జగతాశ్రీనివాస్,సూరాకాసుల గోవిందు తదితరులు పాల్గొన్నారు. గుంటూరుకు పలువురు నాయకులు నక్కపల్లి,పాయకరావుపేటల నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావుల ఆధ్వర్యంలో పలు వాహనాల్లో వైఎస్సార్సీపీ నాయకులు గుంటూరు బయలుదేరారు. వెళ్లిన వారిలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవింద్, పార్టీ అధికార ప్రతినిధి దగ్డుపల్లిసాయిబాబా, పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు, పట్టణశాఖ అధ్యక్షుడు దనిశెట్టి బా బీ, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. -
దుమ్మురేపిన రైడర్లు
ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్విశాఖ స్పోర్ట్స్: జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా శనివారం రాత్రి నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్షిప్ ఉత్కంఠగా సాగింది. ఎంఆర్ఎఫ్ మోగ్రిప్–ఎఫ్ఎంఎస్సీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ సీజన్ కై ్లమాక్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇలాంటి జాతీయ స్థాయి సాహస క్రీడలు నిర్వహించడం నగర ప్రతిష్టను పెంచుతుందని, యువతకు ఇదొక మంచి స్ఫూర్తి అని పేర్కొన్నారు. హోరాహోరీగా సాగిన రేస్ ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 120 మంది రేసర్లు పాల్గొని 9 విభిన్న విభాగాల్లో(క్లాస్ల్లో) పోటీపడ్డారు. సాధారణ మోటోక్రాస్ మాదిరిగా కాకుండా, స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన సూపర్క్రాస్ ట్రాక్పై ఈ రేస్ సాగింది. టైట్ టర్న్లు, రిథమ్ సెక్షన్స్, ఎత్తైన టెక్నికల్ జంప్లతో కూడిన ఈ ట్రాక్పై రైడర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో, దుమ్ము రేపుతూ బైకులు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. గ్రాండ్ ఫినాలే విజేతలు సీజన్ పొడవునా పాయింట్లు సాధించి ఫైనల్స్కు చేరిన రైడర్లు ఇక్కడ తమ సత్తా చాటారు: ఎస్ఎక్స్1 ప్రీమియర్ కేటగిరీలో శ్లోక్, ప్రజ్వల్, ఇక్షన్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎస్ఎక్స్2 విభాగంలో ర్యాన్, జాబీ, సుహైల్లు తమ బైకులతో మెరుపులు మెరిపించారు. ఇండియన్ ఎక్స్పర్ట్స్, జూనియర్ క్లాస్లో ఇమ్రాన్, జినేంద్ర, షిండే. చైతన్య వంటి రైడర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఎస్ఎక్స్1 ఫారిన్ ఓపెన్ క్లాస్ రేస్లోనూ తీవ్ర పోటీ జరిగింది. నిర్వాహకులు ఈ పోటీలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విశాఖ వాసులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఇంజిన్ల మోత, అభిమానుల కేరింతల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. గాల్లో బైకర్ స్టంట్ -
కంపెనీలకు భూములివ్వం
బుచ్చెయ్యపేట: కంపెనీల ఏర్పాటుకు మా భూములిచ్చేదిలేదంటూ మండలంలోని శివారు పంచాయతీలైన ఆర్.భీమవరం, మల్లాం, ఆర్.శివరాంపురం ప్రజలు ఖరాఖండీగా చెబుతూ, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పడంతో అప్పట్లో సర్వే ఆగిపోయింది. మళ్లీ పై గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూముల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీఐఐసీ కోసం భూములు సేకరించేందుకు శనివారం తహసీల్దార్ లక్ష్మి,ఎస్ఐ శ్రీనివాసరావులు పోలీసు బందోబస్తుతో గ్రామ సభలు ఏర్పాటు చేశారు.దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు గ్రామ సభలు జరగకుండా అడ్డుకున్నారు. మేం సంతకాలు చేయం,మా భూములివ్వబోమని తేల్చి చెప్పేశారు. అయితే తహసీల్దార్ లక్ష్మి మాత్రం పరిశ్రమల కోసం కాదు మీ భూ సమస్యలు తీర్చడానికి వచ్చాం, అందుకే గ్రామ సభలు పెట్టామని ఆర్.భీమవరం సభలో తెలిపారు. దీంతో అక్కడున్న నాయకులు బల్లిన అమ్మునాయుడు,గొల్లవిల్లి సత్యనారాయణ,సేనాపతి నాయుడు,బల్లిన రమణాజీ,ఈశ్వరరావు,మేడిశెట్టి పడమటయ్య తదితర్లు తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఐఐసీకీ భూములివ్వడానికి గ్రామ సభ పెడుతున్నట్టు తీర్మానం పుస్తకంలో నమోదు చేసి ఉండగా, రైతుల భూ సమస్యలు తీర్చడానికి గ్రామ సభ పెట్టామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. గ్రామస్తులు సభ నుంచి లేచి ఆందోళన చేయడంతో అధికార్లు వెనుదిరిగారు. మల్లాం,ఆర్.శివరాంపురం సర్పంచ్లు బర్ల శివ,నమ్మి నీరజ అప్పలరాజు, గ్రామస్తులు భూములివ్వబోమని ఆందోళన చేశారు. -
కోళ్ల వ్యర్థాలతో కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.కోళ్ల వ్యర్థాలను వ్యాన్ల ద్వారా తరలించి జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో చెరువుల్లో పెంచే చేపలకు మేతగా వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యర్థాలను తినే ఆ చే
– యలమంచిలి రూరల్: ● యథేచ్ఛగా అక్రమరవాణా ● చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు ● ఆ చేపలు తింటే అనారోగ్యమని హెచ్చరిస్తున్న వైద్యులు చికెన్ వ్యర్థాలతో కాసుల వేటసాధారణంగా చేపలు కిలోకి పైగా బరువు పెరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. రైతుల నుంచి కిలో బరువున్న చేపలను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.దీంతో చేపల పెంపకంలో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి.అదే మేతగా బ్రాండెడ్ ఫీడ్కు బదులుగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే నాలుగు నెలలకే కిలో బరువు పెరుగుతున్నాయి.కిలో కోళ్ల వ్యర్థాలు రూ.18 నుంచి రూ.25కే చేపల చెరువుల నిర్వాహకులకు లభిస్తున్నాయి. దీంతో జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో చేపల చెరువుల నిర్వాహకులు కోడిమాంసం వ్యర్థాలనే కొనుగోలు చేస్తుండడంతో ఈ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలో ఒక్క దేవరాపల్లి మండలంలో 111 అధికారిక చేపల చెరువులున్నాయి. అనధికారికంగా మరో 50 వరకు ఉన్నాయి. చెరువుల్లో పెంచే చేపలకు తవుడు,మత్స్యశాఖ అధికారులు సూచించిన ఫీడ్ మాత్రమే మేతగా వేయాలి. వీటికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోందని చెరువుల పెంపకందారులు కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్నారు. నెలనెలా భారీగా మామూళ్లు అక్రమ రవాణాపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా,నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు.ఈ వాహనాలను టోల్గేట్లు దాటే సమయంలో, జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు హైవే పెట్రోలింగ్ పోలీసులు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు కట్టడి చేసే అవకాశం ఉంది. అయినా పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఒక్కో వాహనానికి నెలవారీగా ఆయా శాఖల అధికారులకు భారీగా మామూళ్లను ముట్టజెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా కోళ్ల వ్యర్థాలను రవాణా చేసే వాహనాల సంఖ్య ఆధారంగా నెలకు లక్షల్లో అధికారులకు అక్రమ ఆదాయం అందుతోందని సమాచారం.అందుకే వీటిని ఆపేందుకు ఎవరూ ఇష్టపడడం లేదన్న ఆరోపణలున్నాయి. రూ.లక్షల్లో ఆదాయం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారుగా 2వేలకు పైగా కోడి మాంసం విక్రయ కేంద్రాలున్నాయి. నిత్యం 60 టన్నుల కోళ్లు, ఆదివారం ఒక్కరోజే 100 నుంచి 120 టన్నుల కోళ్లను చికెన్ షాపుల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి నెలా సుమారు రెండు వేల టన్నుల వరకు కోళ్లు దిగుమతి అవుతున్నాయి. చికెన్ షాపుల్లో మాంసం విక్రయించగా మిగతా చర్మం,పేగులు,కాళ్లు,ఇతర వ్యర్థాలను షాపుల నిర్వాహకుల దగ్గర్నుంచి కిలో రూ.3 నుంచి రూ.5 వరకు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద షాపుల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేస్తుండగా,చిన్న దుకాణాల నిర్వాహకులు ఉచితంగానే అందజేస్తున్నారు.ఇలా సేకరించిన చికెన్ వ్యర్థాలను అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోగల చేపల చెరువుల వ్యాపారులతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల వ్యాపారులకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు చేపల చెరువుల వ్యాపారులే నేరుగా డ్రైవర్లు,సహాయకులను నియమించుకుని చికెన్ వ్యర్థాలను తరలించుకుపోతున్నారు.ఒక కిలో కోడి మాంసం నుంచి సుమారు 250 నుంచి 300 గ్రాముల చికెన్ వ్యర్థాలు వస్తాయి. జిల్లాలో ప్రతి నెలా 2వేల టన్నుల లైవ్ కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు.వీటి ద్వారా 600 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వ్యాపారులు ఒకసారి వాహనంతో 9 డ్రమ్ముల వ్యర్థాలు తీసుకెళ్తున్నారు.ఒక్కో డ్రమ్ములో 150 నుంచి 200 కిలోల వరకు చికెన్ వ్యర్థాలు ఉంటున్నాయి.ఒకసారి వాహనంతో చికెన్ వ్యర్థాలు తీసుకెళ్తే ఆ వ్యాపారికి అన్ని ఖర్చులూ మినహాయించి రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వస్తోంది.ఈ లెక్కన నెలకు రవాణా అవుతున్న 2వేల టన్నుల చికెన్ వ్యర్థాలతో సుమారుగా రూ.60 లక్షల వరకు ఆదాయాన్ని కొందరు జేబుల్లో వేసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై నిఘా పెడతాం.వాటిని తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం.త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా చేసే వాహనాలను తనిఖీ చేస్తాం.చికెన్ వ్యర్థాల రవాణా,నిర్వహణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి.దీనికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు గానీ సమాచారం గానీ ఇవ్వవచ్చు. – కె.వరహాలు, తహసీల్దార్, యలమంచిలి ఆరోగ్యానికి చేటు చికెన్ వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలను తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ చేపల ద్వారా ఈకోలి బాక్టీరియా శరీరంలోకి చేరి జీర్ణకోశ వ్యాధులు,డయేరియా,కోళ్లకు ఉండే ఫ్లూ మనుషులకు సంక్రమించడం,టైఫాయిడ్ జ్వరం బారిన పడడం జరుగుతుంది.అలాంటి చేపల విషయంలో జాగ్రత్త వహించాలి.వీలైనంత వరకు వాటిని తినకపోవడమే మంచిది. – డాక్టర్ నిహారిక, వైద్యాధికారి, యలమంచిలి సీహెచ్సీ -
వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్కు ఘన స్వాగతం
కశింకోటలో వందేమాతరం సైకిల్ ర్యాలీకి స్వాగతం పలుకుతున్న పోలీసులు, యువత కశింకోట: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ – 2026’సైకిల్ యాత్రకు స్థానిక పోలీసులు శనివారం ఘనంగా స్వాగతం పలికారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ పోలీసులు సైకిల్ యాత్రను చేపట్టారు. అది ఇక్కడకు చేరడంతో సీఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు రహిత సమా జ నిర్మాణానికి దోహద పడాలన్నారు.ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్ కుమార్, సిబ్బంది, స్థానిక యువకులు ర్యాలీకి స్వాగతం పిలాకారు. -
విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ప్రేరణ తరగతులు
మాట్లాడుతున్న రామనాథం నర్సీపట్నం: పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే ప్రేరణ తరగతుల ము ఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రామనాథం తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పట్టణంలోని బాలికల వసతిగృహంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పదవ తరగతి విద్యా ర్థుల భవిష్యత్తుకు తొలిమెట్టని, దానిని అధిగమించి ఉన్నతవిద్యలో రాణించాలన్నారు. ఏమై నా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి బాబూరావు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రోలుగుంట: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డైవర్షన్ పాలిటిక్స్ను ప్రజల్లోకి తెసుకువెళ్లాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు. మండలం కేంద్రం రోలుగుంటలో నిర్వహిస్తున్న గౌరీపరమేశ్వర ఉత్సవాల్లో వారు శుక్రవారం పాల్గొని, ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రతినిధి పోతల లక్షీశ్రీనివాసరావు, పార్టీ నాయకులు పోతల రాజశేఖర్, ఎంపీటీసీ వడ్డాది సతీష్, మాజీ సర్పంచ్లు బంటుసూర్య సన్యాసి దేముళ్లు, పరవాడ చిన్ని, స్థానిక మాజీ ఉప సర్పంచ్ తాతబాబు, యువ కార్యకర్తలు మడ్డు శివ, పిల్లి శ్రీను, కాళ్ల నాయుడు మహిళా విభాగం యువ కార్యకర్త దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
వలస కూలీ ఇంట్లో చోరీ
● తురకపూడిలో ఘటనఇంటిని పరిశీలిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ బుచ్చెయ్యపేట: మండలంలో తురకపూడి గ్రామంలో వలస కూలీ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెఽందిన తోకల రాము పొట్టకూటి కోసం చైన్నె వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉంది. రాము ఇంటి లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో దాచుకున్న 2 తులాల బంగారు తాడు, 30 తులాల వెండి పట్టీలు చోరీ అయినట్లు గుర్తించాడు. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. -
యాత్రకు వెళ్తుండగా విషాదం
● అతివేగమే ప్రాణం తీసింది ● కారు నడిపిన వ్యక్తి దుర్మరణంనుజ్జయిన కారు ముందు భాగంఆరిలోవ : బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు శ్రీకాకుళం జిల్లాలోని రాజులమ్మ యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం నుంచి హనుమంతవాక మీదుగా ప్రయాణిస్తుండగా, బీఆర్టీఎస్ మధ్య లైన్లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారు ఎదురుగా వస్తున్న 68 నంబర్ సిటీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న బంగారు రాజేష్ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమవడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెల్త్ సిటీ ఆస్పత్రికి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేవలం బస్సులు, వీఐపీ వాహనాలకు కేటాయించిన మధ్య లైన్లోకి కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. -
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
నర్సీపట్నం: పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు సీఐ గఫుర్ తెలిపారు. గత నెల 31న స్థానిక వెలమ వీధికి చెందిన దేవాడ త్రివేణి చోడవరంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కింది. ఆమె వెంట సుమారు ఐదు తులాల బంగారు చైను, రెండు గాజులు, చెవిదిద్దులు బ్యాగ్లో తీసుకువెళ్లింది. ఏదో పనిపై వెళ్లిన ఆమె బస్సులోనే నర్సీపట్నం తిరిగి వచ్చింది. కాంప్లెక్స్ బయట ఆటో ఎక్కి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి సంచిలో చూసే సరికి బ్యాగ్లో ఆభరణాలు లేవు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు సిబ్బందితో ప్రత్యేక పోలీసు టీమ్ ఏర్పాటు చేశారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. శుక్రవారం షేర్ఆటోలో ఇద్దురు నిందితులు తునివైపు వెళ్తుండగా పాతబస్టాండ్ వద్ద పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. అనకాపల్లికి చెందిన గాడి సత్యవతి ఆలియాస్ శ్యామల, షేక్ చాన్ బాషాను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఇద్దరు నిందితులు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఆటోను అద్దెకు తీసుకుని ఈ ఇద్దరూ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. ఆటోను సీజ్ చేశామని తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. -
కల్యాణపులోవను సందర్శించిన డీఎస్పీ శ్రావణి
పోతురాజుబాబు ఆలయ పరిసరాలను సందర్శిస్తున్న డీఎస్పీ శ్రావణి రావికమతం: కల్యాణపులోవ పోతురాజుబాబు జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించడంతో పాటు భద్రతా పరమైన చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పోలీసులను ఆదేశించారు.ఆమె శుక్రవారం కల్యాణపులోవలో పోతురాజుబాబు అలయం,పెద్దింటమ్మ గుడి, జలాశయం వద్ద పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను, జాతర ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జాతరకు ఏ స్థాయిలో భక్తులు తరలివస్తారో ఆరా తీశారు. గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, రిజార్వయర్ నీటి సంఘం కమిటీ చైర్మన్ బంటు రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ
● సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ మహారాణిపేట: సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వందేమాతరం సైక్లోథాన్–2026’ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే శక్తివంతమైన ఉద్యమంగా మారిందని సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ అన్నారు. ఈ కార్యక్రమం సీఐఎస్ఎఫ్ కుటుంబంలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఈ నెల 28న ‘సురక్షిత తట–సమృద్ధ్ భారత్’ నినాదంతో సైక్లోథాన్ రెండో ఎడిషన్ ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని పెంపొందించే జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నారు. విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఇది కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కల్పించే యజ్ఞమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సైక్లిస్టులు 2,400 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ ప్రయాణంలో సుమారు 6 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, డిజిటల్ మాధ్యమాల ద్వారా మిలియన్ల మందితో సంభాషించామని చెప్పారు. ఈ పర్యటనలు భద్రత, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అస్తిత్వం పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేరుకున్న సైక్లిస్టులకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినితా ఠాకూర్, సీఐఎస్ఎఫ్ డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ఎన్.ప్రకాష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి రేఖా నంబియార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.పి.ఎ.అరుణ్ ప్రసాద్, సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ పాల్గొన్నారు. దేశ భద్రతకు ప్రజలే ప్రథమ రక్షకులు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఎదురు చూస్తోందని, ఇలాంటి సమయంలో మన దేశం ఎంత భద్రంగా ఉందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన వందేమాతరం తీర సైక్లోథాన్–2026ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని మరింత సురక్షిత దిశగా నడిపించే ఉద్యమమని అభివర్ణించారు. దేశ రక్షణలో సామాన్యులను భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఐఎస్ఎఫ్ అభినందనీయమని స్పష్టం చేశారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు. -
ముగిసిన ఎన్ఎస్జీ విన్యాసాలు
మహారాణిపేట: తూర్పు నావికదళం, ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరిగిన ‘వ్యాయాస్’ విన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పీఎం పాలెం సమీపంలోని కంబాలకొండ ఫారెస్ట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమ వివరాలను గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ డాక్టర్ సుమిత్ గరుడ్ వెల్లడించారు. నక్సల్స్ కార్యకలాపాలను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందులో ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో పాటు అటవీ, అగ్నిమాపక, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఎలా స్పందించాలో ఈ విన్యాసాలు చాటిచెప్పాయని కమాండర్ పేర్కొన్నారు. -
అక్రమ నిర్బంధాలపై ప్రజాపోరాటానిదే విజయం
డాబాగార్డెన్స్(విశాఖ): అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకున్నారన్న నెపంతో, సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ చెల్లదని తేలిపోయింది. అడ్వైజరీ కమిటీ సమీక్షలో ప్రభుత్వ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం కావడంతో 45 రోజుల జైలు శిక్ష అనంతరం శుక్రవారం ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలాంటి నేరం చేయకపోయినా అప్పలరాజును అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని చాటుకుందని మండిపడ్డారు. పాత కేసులను సాకుగా చూపి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం దారుణమని, ప్రజల ఆగ్రహానికి తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేసే పరిశ్రమల కోసం ప్రభుత్వం పాకులాడుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తూ, మిట్టల్ వంటి ప్రైవేటు సంస్థల కోసం కూటమి ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. తనపై మోపిన అక్రమ కేసుల రికార్డులను ప్రదర్శిస్తూ, న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా పీడీ యాక్ట్లో చేర్చి తనను వేధించారని జైలు నుంచి విడుదలైన అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ బాధితుల పక్షాన తమ పోరాటం ఆగదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా సీపీఎం నేతలు స్పష్టం చేశారు. -
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
భరత్నితీష్శశికాంత్విశాఖ స్పోర్ట్స్ : కల్యాణ్ వేదికగా బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో ఆంధ్ర జట్టు తొలి రోజే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినా, విశాఖ కుర్రాళ్లు పట్టుదలతో రాణించడంతో ఆంధ్ర గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ రికీ భుయ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 83 పరుగులతో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. లీగ్ దశలోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రికీ, ఈ కీలక మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అర్ధ సెంచరీకి చేరువగా వచ్చి 47 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రికీ భుయ్ ఐదో వికెట్కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన నితీష్ కుమార్, ముకేశ్ బౌలింగ్లో అవుట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం శశికాంత్ ఏడు పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. గత రికార్డులను పరిశీలిస్తే బెంగాల్పై ఆంధ్ర జట్టుకే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్లలో ఆంధ్ర రెండుసార్లు విజయం సాధించగా, మిగిలిన మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. బెంగాల్పై రికీ భుయ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు కాగా, బౌలింగ్లో శశికాంత్ 55 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ పేసర్ షమీ బౌలింగ్ను ఎదుర్కొంటూ మిగిలిన రోజుల్లో ఆంధ్ర బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రికీ,నితీష్ సెంచరీ భాగస్వామ్యం -
వెళ్లిపోండి
ఇష్టం లేకపోతే... సాక్షి, అనకాపల్లి: ‘ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోండి. మీ నిర్లక్ష్యం కారణంగా జిల్లా చివరి స్థానంలో ఉంది’ అంటూ సచివాలయాల ఉద్యోగులపై కలెక్టర్ విజయకృష్ణన్ తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరుషపదజాలం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, జిల్లా యంత్రాంగం వైఫల్యం, వ్యవస్థలోని లోపాల వల్ల ప్రజలు తీవ్ర అసంతృత్తితో ఉన్నారని, అందువల్లే ఐవీఆర్ఎస్లో ఎక్కువ మంది రెండో నంబర్ బటన్ నొక్కారని, వాటిని సరిచేయకుండా తమను టార్గెట్ చేయడం సరికాదని, కలెక్టర్ మాట్లాడిన తీరు సరిగా లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నోట్ విడుదల చేశారు. సచివాలయ ఉద్యోగుల నోట్, వైరల్ అయిన వీడియో మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పనితీరుపై సమాచారాన్ని సేకరించి జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తోంది. ఈ గ్రేడింగ్లో జిల్లాకు 26వ స్థానం చివరి స్థానం వచ్చింది. దీంతో ఈ నెల 5వ తేదీ గురువారం కలెక్టర్ ఉద్యోగులతో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో సచివాలయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివిధ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు బాలేదు..అందుకే ఐవీఆర్ఎస్ సర్వేలో ఉద్యోగుల పనితీరు గ్రేడింగ్లో 26వ స్థానంలో ఉన్నామంటూ ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఫోన్ కొనాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలన్న దురాశతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లాకు చెడ్డపేరు సంపాదించి పెట్టారని ఆగ్రహించారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉండడం లేదని, వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు ఐవీఆర్ఎస్ సర్వేలో తెలియజేశారని, ప్రజలిచ్చిన ఈ సరిఫికెట్ను నెత్తి మీద అంటించుకుని తిరగండని అంటూ కలెక్టర్ ఘాటుగా వ్యాఖ్యానించారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మనమిత్ర వాట్సప్ సేవల ను ప్రచారం చేయమని ఆదేశిస్తే పంచాయతీ సెక్రటరీలు నిర్లక్ష్యం వహించారని దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కన్నా వెనుకబడి పోయామని కలెక్టర్ ఆగ్రహించినట్టు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సర్వీసులను గిరిజనులు బాగా ఉపయోగించుకుంటున్నారని, మన జిల్లా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ రోజుకి 20 మందికి వాట్సాప్ సర్వీసుల గురించి వివరించి, ప్రజలు వాటిని బాగా ఉపయోగించేలా చూడాలని ఆదేశించారు. ఈసారి ర్యాంకింగ్లో డబుల్ డిజిట్ వస్తే సహించేది లేదని హెచ్చరించారని సమాచారం.కలెక్టర్ అలా అనడం బాధాకరం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బాధ్యతాయుతమైన పరిపాలనా అధికారి పరుషపదజాలంతో మాట్లాడడం చాలా బాధాకరమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా తమకు సంబంధం లేని సేవలను కూడా అందిస్తున్నామని, పెన్షన్ పంపిణీ వంటి కీలకమైన సేవలను, గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులు రోజూ నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పరిపాలన విధానాల్లో లోపాల బాధ్యతను పూర్తిగా క్షేత్రస్థాయి ఉద్యోగుల మీద వేయడం న్యాయం కాదన్నారు. సిస్టమ్ ఫెయిల్యూర్స్, ట్రైనింగ్ లోపాలు, విధానపరమైన గందరగోళం ఉంటే..అది ఉద్యోగుల వైఫల్యం కంటే పాలనాపరమైన లోపంగానే చూడాలని, ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయంటూ దానికి కారణాలపై సమీక్ష చేయాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉందన్నారు. ప్రతి సమస్యకీ సచివాలయం ఉద్యోగులే జవాబుదారులుగా చేయడం సరికాదన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్పై ప్రజలకు అవగాహన లేక..ఏవేవో బటన్లు నొక్కితే..ఆ తప్పుల బాధ్యతను కూడా తమపై వేయడం న్యాయసమ్మతం కాదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని, నిజాయితీగా సేవ చేస్తున్న ఉద్యోగులను బలిచేయవద్దని వారు కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల సమైక్య సంఘం నుంచి నోట్ కూడా విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యం
తుమ్మపాల: ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా సంచార ఐసీటీసీ వాహన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ) సంచార వాహనాన్ని శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వాహనం ఇంటింటికీ వెళ్లి హెచ్ఐవీ, ఎయిడ్స్పై కౌన్సెలింగ్, నిర్ధారణ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సులభమైన హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు ఈ వాహనం సేవలు దోహదపడతాయని తెలిపారు. ఈ కేంద్రంలో ఒక కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్, డ్రైవర్ విధులు నిర్వహిస్తారన్నారు. ఐసీటీసీ, పీపీటీసీ కౌన్సెలర్లు కూడా సేవలందిస్తారని తెలిపారు. దిశ క్లినికల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ సీహెచ్. స్పందన మాట్లాడుతూ వైద్య కేంద్రాలకు దూరంగా ఉండే ప్రాంతాలు, హైరిస్క్ జనాభా ఉన్న, పారిశ్రామిక కేంద్రాల్లో పనిచేసే వలస కూలీలు నివసించే ప్రాంతాలు, హెచ్ఐవీ పాజిటివ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి, డీటీఏటీవో డాక్టర్ కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
అచ్యుతాపురం రూరల్ : గుంటూరులో జరిగే మినీ సబ్ జూనియర్ బాల బాలికల రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. భోగాపురం క్రీడా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలో పలు పాఠశాలలు, వివిధ స్పోర్ట్స్ క్లబ్ల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో చౌడువాడ హైస్కూల్, అనకాపల్లి సిద్ధార్థ ఈ టెక్నో స్కూల్, ఎంజే పురం హైస్కూల్ విద్యార్థులు వరుసగా ప్రథమ, దిత్వీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో చౌడువాడ హై స్కూల్, ఎంజేపురం హైస్కూల్, అచ్యుతాపురం కై ట్స్ విద్యా విహార్ విద్యార్థినులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జట్టుకు 12 మంది చొప్పున ఎంపికై న 24 మంది క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొంటారని నేషనల్ కోచ్ వెంకట్ తెలిపారు. క్రీడాకారులను జిల్లా రగ్బీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కూండ్రపు వెంకునాయుడు, అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎన్.వి. జగదీష్, సెక్రటరీ డాక్టర్ వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గణేష్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అడిగర్ల సుధీర్, కోశాధికారి కూండ్రపు రమేష్ తదితరులు అభినందించారు. -
చక్కని ప్రణాళిక..
కోటవురట్ల: జీవితం మలుపునకు మొదటి అడుగు ఇంటర్లోనే.. పదో తరగతిని పదిలంగా దాటేసినా ఇంటర్మీడియట్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం.. ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజనీరు అవ్వాలన్నా, శాస్త్రవేత్తగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే.. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురితప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా, కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా, ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతోపాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు రోజూ పరిశీలన, వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను ఛేదించేందుకు గత పరీక్షా పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. చేతిరాతను విద్యార్థులు మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది. కోటవురట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలస్టడీ అవర్స్లో విద్యార్థులను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు ఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరంలో జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా, ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాల కోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి
● ఎస్పీ తుహిన్ సిన్హాఅనకాపల్లి: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది కోసం నిర్వహించే గ్రీవెన్స్సెల్ను ఈ వారం నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బంది వారి సమస్యలను తెలియజేయాలంటే అనకాపల్లిలో కార్యాలయానికి రావడం కష్టంగా ఉంటుందని, అందువల్లే ఆన్లైన్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు(సెల్ నంబర్. 9346912011) జరుగుతుందన్నారు. పోస్టింగ్లు, సెలవులు, బదిలీలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, పనిఒత్తిడి వంటి అంశాలపై 27 మంది సిబ్బంది ఆన్లైన్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఎస్ఐ ప్రసాద్, కార్యాలయం సూపరింటెండెంట్లు గిరి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ తల్లఢిల్లీ
మించిపోయిన వైజాగ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టుఏయూక్యాంపస్: పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న విశాఖలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన 195 ఏక్యూఐ కంటే ఎక్కువగా విశాఖలో 205 ఏక్యూఐ నమోదు కావడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం నాటికి హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలను సైతం వెనక్కి నెట్టి విశాఖ కాలుష్యంలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత జనవరి నెలలో మెజారిటీ రోజులు గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలోనే కొనసాగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి జరిపిన పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పోలీస్ బ్యారక్స్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 305కు చేరుకుని ‘వెరీ పూర్’ విభాగంలోకి వెళ్లగా, మాధవధార వంటి నివాస ప్రాంతాల్లో కూడా కాలుష్యం పరిమితికి లోబడే ఏమీ లేదు. మింది, ఆటోనగర్, మల్కాపురం, సీతమ్మధార వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. గాలిలో పీఎం 2.5, పీఎం 10 కణాలు పెరిగిపోవడంతో పాటు కార్బన్ మోనాౖక్సైడ్, సల్ఫర్ డయాకై ్సడ్ వంటి విషవాయువులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, పెరుగుతున్న వాహన రద్దీ విశాఖలో గాలి విషతుల్యం కావడానికి ప్రధానంగా పోర్ట్ కార్యకలాపాలు, భారీ పరిశ్రమలు కారణమవుతున్నాయి. పోర్ట్ ప్రాంతంలో బొగ్గు, ఇతర లోహాల ఎగుమతి దిగుమతుల సమయంలో వెలువడే ధూళి గాలిని కలుషితం చేస్తోంది. దీనికి తోడు హెచ్పీసీఎల్, స్టీల్ ప్లాంట్, ఫార్మా రంగానికి చెందిన ఉద్గారాలు తోడవుతున్నాయి. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య, డీజిల్ యంత్రాల వినియోగం మరియు నిర్మాణ రంగం నుంచి వెలువడే దుమ్ము ధూళి వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇవన్నీ కలిసి నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. నగర ప్రజలపై తీవ్ర ప్రభావం ప్రస్తుతం విశాఖలో గాలి నాణ్యత క్షీణత ఏ స్థాయిలో ఉందంటే, నగరంలో నివసించే ప్రతి వ్యక్తి రోజుకు సగటున మూడు సిగరెట్లు కాల్చినప్పుడు ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టానికి గురవుతున్నారు. అంటే నెలకు దాదాపు 81 సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీనివల్ల ఆస్తమా, సైనస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైర్లను వాడటం, రద్దీ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ప్రాణరక్షణకు అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఆయిల్పామ్ వెలవెల
మండలంలో సాగు చేస్తున్న ఆయిల్పామ్ తోటలుఆయిల్పామ్ గెలలు లారీలపై లోడు చేస్తున్న కూలీలునాతవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయిల్పామ్ గెలల రేటు గణనీయంగా పడిపోయింది. జిల్లాలో 28 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. అధికంగా నాతవరం దేవరాపల్లి, కె.కోటపాడు, కోటవురట్ల, రావికమతం, చోడవరం, రోలుగుంట ఎస్.రాయవరం, కశింకోట, బుచ్చెయ్యపేట, గొలుగొండ, నర్సీపట్నం, పాయకరావుపేట, చీడికాడ, మాడుగుల, మండలాల్లో రైతులు ఆయిల్పామ్ తోటలు సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టన్ను ధర రూ. 23,500 ఉండేది. ప్రస్తుతం టన్ను ధర కేవలం రూ.19వేలు మాత్రమే ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూలీ రేట్లు, ఎరువుల ధరలు, పెట్టుబడి వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో పాటు, ఆయిల్పామ్ గెలల రేటు తగ్గిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గెలలు కోయడానికి కూలీలు రేట్లు రెట్టింపు చేసేశారు. క్రిమిసంహారక మందులు ఎరువుల రేట్లు సైతం పెరిగాయి. రైతులు పండించిన ఆయిల్పామ్గెలలు సోయా రుచి ప్రైవేటు కంపెనీ యాజమాన్యం మాత్రమే కొనుగోలు చేస్తోంది. నాతవరం మండలంలో చమ్మచింత, నాతవరం, గుమ్మడిగొండ, చిక్కుడుపాలెం, గునుపూడి తదితర ప్రాంతాల్లో ఆయిల్పామ్ గెలలు కొనుగోలు చేసేందుకు తూనిక కేంద్రాలు ఏర్పాటు చేశారు.రైతులు పండించిన గెలలను అక్కడకు తీసుకెళ్లి విక్రయిస్తారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన గెలలను లారీలపై ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఎకరాకి 8 టన్నుల దిగుబడి ఎనిమిదేళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు గల ఆయిల్పామ్ తోట నుంచి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సంరక్షణ, వాతావరణం బాగుంటే దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కిందట ఎకరాకి రూ.35 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అయ్యేది. ప్రస్తుతం ఎకరానికి పెట్టుబడి రూ.40వేల నుంచి రూ. 50వేల మధ్య పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆయిల్పామ్ తోటలు సాగు చేసే రైతులకు ఉద్యావనశాఖ ద్వారా మొక్కలను రాయితీపై అందిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేసేందుకు బావి లేదా బోరుతో పాటు విద్యుత్ సదుపాయం ఉండాలి. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి తోట సంరక్షణను బట్టి పంట కాపు దశకు వస్తుంది. అంతవరకు ఈ తోటల్లో అంతర పంటగా కోకో, అరటి, కూరగాయల వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు.ఇతర పంటలు సాగుతో పోల్చుకుంటే పామాయిల్ తోటల ద్వారా గతంలో ఆదాయం ఎక్కువగా రావడంతో వీటిని వేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులు చూస్తే పెట్టుబడి రేట్లు దారుణంగా పెరిగాయి, రైతులు పండించిన పామాయిల్ గెలలు రేటు తగ్గడంతో రైతులు దిగాలు చెందితున్నారు. ఆయిల్పామ్ గెలల రేటు తగ్గిన విషయంపై ఉద్యానవశాఖ డివిజన్ అధికారి శిరీషను వివరణ కోరగా ఆయిల్పామ్ గెలలు మన ప్రాంతంలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రేటు తగ్గుదలపై కొందరు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేశామని చెప్పారు. టన్ను రూ 23,500 కొనుగోలు చేసేవారు మాగ్రామంలో పామాయిల్ కొనుగోలు కేంద్రం ఉంది. గత ప్రభుత్వం హయాంలో రైతుల నుంచి టన్ను రూ.23,500 కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం టన్ను రూ. 19వేలకు మాత్రమే కొంటున్నారు. ఎరువులు క్రిమిసంహారక మందులు, కూలీలు రేట్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఏటా రేటు పెరగాల్సిందిపోయి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు – సందీప్ చమ్మచింత గ్రామం జిల్లాలో ఆయిల్పామ్ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు.ఆయిల్పామ్ గెల ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు వేడుకుంటున్నారు. -
మహిళా రైతుకు పాము కాటు
108 వాహనంలో బాధిత మహిళను సీహెచ్సీకి తరలిస్తున్న వైద్య సిబ్బంది దేవరాపల్లి: మండలంలోని వాకపల్లిలో శుక్రవారం ఓ మహిళా రైతు పాము కాటుకు గురైంది. గ్రామానికి చెందిన రాణం సత్యవతి రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలోకి వెళ్లింది. అక్కడ చెరకు తోట పనులు చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే స్థానికులు వేచలం పీహెచ్సీకి తీసుకెళ్లగా, అక్కడ వైద్యుడు రమేష్బాబు ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారిని నిశితంగా గమనిస్తూ వెనుకబడిన సబ్జెక్టులలో తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. – ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ -
తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు
మాట్లాడుతున్న నవలా రచయిత యండమూరి గొలుగొండ: విద్యార్థులు తెలివైన ఆలోచనలు చేసినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. మండలంలోని కృష్ణదేవిపేటలో నేను సైతం చారిటబుల్ ట్రస్టు, అనకాపల్లి పోలీసుల సౌజన్యంతో గురువారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ భవిష్కత్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేసుకుని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థుల ఆలోచన ప్రకారమే తల్లిదండ్రులు సహకారం ఉండాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాతవరం, కృష్ణదేవిపేట ఎస్ఐలు తారకేశ్వర్రావు, రుషికేశ్వర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రసాద్ పాల్గొన్నారు. -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల/జూనియర్ కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. రత్నవల్లి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి గాను జిల్లాలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. వయో పరిమితి ఎస్సీ, ఎస్టీ అయితే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31 తేదీల మధ్య, బీసీ, ఓసీలు అయితే 2015 సెప్టెంబర్ ఒకటి నుంచి 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరాలంటే రెగ్యులర్ విధానంలో పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 40 సీట్లు వంతున ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.00 గంటల లోపు apbrafcet.apcfrr.inకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే తాళ్లపాలెం గురుకులం సిబ్బందిని సంప్రదించాలన్నారు. జీవో 36 అమలు చేయకపోతే సమ్మె బాట -
యూఎఫ్ఎస్ వేగవంతం కావాలి
మునగపాకలో ఇంటింటా సర్వే వివరాలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ విజయకృష్ణన్ మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యునైటెడ్ ఫ్యామిలీ సర్వే పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. మునగపాకలో జరుగుతున్న సర్వే పనులను గురువారం ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో సర్వే పనులు మందకొడిగా సాగుతున్నందున అధికారులు సమన్వయం చేసుకొని ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులతో పాటు ఆధార్, మొబైల్ నంబర్ల వివరాలు సేకరించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో ఎం.ఉషారాణి, తహసీల్దార్ పి.సత్యనారాయణ, డీఎల్డీవో మంజులావాణి, ఈవోఆర్డీ సోమరాజు పాల్గొన్నారు. -
వాహనాల విధ్వంసం కేసులో హైదరాబాద్ యువకుడి అరెస్ట్
యలమంచిలి రూరల్ : గతేడాది డిసెంబరు 9వ తేదీ రాత్రి పట్టణానికి సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయం ఆవరణలో నిలిపి ఉంచిన ఆటో, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించిన కేసులో నిందితుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గండిమైసమ్మ గుడి సమీపంలో ఉన్న బహదూర్పల్లికి చెందిన తొర్రి కార్తీక్ (23) సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన యలమంచిలికి చెందిన యువతి కోసం గత డిసెంబరు 9వ తేదీన యలమంచిలి వచ్చాడు. యువతి నివాసముంటున్న టిడ్కో కాలనీ వద్దకు వెళ్లిన యువకుడితో యువతి మాట్లాడేందుకు నిరాకరించించి. దీంతో ఉన్మాదిగా మారిన నిందితుడు కాలనీలో నివాస గృహాల వద్ద నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడ్నుంచి హైదరాబాదుకు పరారయ్యాడు. ఈ ఘటనపై కాలనీ వాసులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నిందితుడు కార్తీక్ను అరెస్ట్ చేయడానికి పట్టణ ఎస్ఐ ఒక ప్రత్యేక బృందాన్ని హైదరాబాదుకు పంపించారు. అక్కడ అదుపులోకి తీసుకున్న యువకుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసి యలమంచిలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్టు ఎస్ఐ తెలిపారు. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. -
ఆశ..నిరాశ !
‘పని ఒత్తిడి ఎక్కువ..చాలీచాలని జీతాలు..పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు.. ఒక వైపు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, డిమాండ్లను అమలు చేయలేదు. మరోవైపు ‘ఆశా’లకు ప్రస్తుతం వర్తించని జీవోలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇచ్చే జీతం గోరంత...వారితో చేయించుకునే పని మాత్రం మూరెడు. ఒక వైపు రోజువారీ విధులైన గర్భిణులకు చెకప్లు, వైద్య సంబంధమైన విధులు..మరోవైపు తమకు సంబంధం లేని పింఛన్ల పంపిణీ, స్మార్ట్ మొబైళ్లతో సర్వే వంటి విధులు..ఇలా తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తూ ‘ఆశ’..నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. బాబు పాలనలో ●వేతనాల పెంపుపై మాట తప్పిన ప్రభుత్వం ●పని భారం, వేతనాలు పెంచకపోవడం ●లేబర్ కోడ్తో కార్మికుల హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం ●సర్వేల పేరిట తీవ్ర ఒత్తిడి ●ఆందోళనకు సిద్ధమవుతున్న ఆశాలు, కార్మికులు●జిల్లాలో పనిచేస్తున్న 1,445 మంది ఆశాలుసాక్షి, అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇచ్చిన హామీలు, పెండింగ్లో ఉన్న హామీలను అమలు చేయకుండా మొండిచేయి చూపించింది. ఆశా వర్కర్స్ యూనియన్కు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో గత బడ్జెట్లో సరిపెట్టింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కమ్యునిటీ హెల్త్ వర్కర్స్ని ఆశా వర్కర్స్గా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రూ.పది లక్షల వరకూ బీమా సౌకర్యం తదితర అంశాలపై ఆశా వర్కర్స్ యూనియన్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి గతంలో విజ్ఞప్తి చేసింది. కానీ ఈ ప్రధాన డిమాండ్తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం బడ్జెట్లో కూడా ఆశ వర్కర్ల గురించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై గతంలో ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించినపుడు ప్రభుత్వం హామీలన్నింటినీ అమలు చేస్తామంటూ చర్చలకు అంగీకారం తెలిపింది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీనిపైనా మూడు నెలల క్రితం ఆశావర్కర్లు నిరసన తెలిపారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన ఒప్పంద మినిట్స్ కాపీలకు జీవోలు ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ రద్దుతో కార్మికుల హక్కులు కూడా హరించిపోతున్నాయి. లేబర్ కోడ్ రద్దుపై జిల్లాలో 1445 మంది ఆశాలతో ఉద్యమబాట పడుతున్నారు. ఆదుకున్నది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వై.ఎస్.జగన్ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సమయంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వై.ఎస్ జగన్ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. -
2 మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు
తుమ్మపాల : జిల్లాలో రెండు నోటిఫైడ్ బార్లకు 10 దరఖాస్తులు అందాయని, లాటరీ నిర్వహించి ఇద్దరు విజేతలను ఎంపిక చేసి, ప్రతి బార్కు ఆర్ 1, ఆర్ 2 రిజర్వ్ అభ్యర్థులను ఖరారు చేసామని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాలో ఎంపికై ెన అభ్యర్థులు రూ.13.75 లక్షల చెల్లించి తాత్కాలిక లైసెన్సును పొందారన్నారు. పూర్తి లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. రెండు, మూడో సంవత్సరాల్లో లైసెన్స్ ఫీజుపై ఏటా 10 శాతం పెంపు ఉంటుందన్నారు. లైసెన్స్దారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాలకు కట్టుబడి, నిర్ణీత ప్రాంగణాల్లోనే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విక్రయాలు, నిబంధనల అమలుపై నిశిత పర్యవేక్షణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగితే కఠినమైన శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్, ఎఈఎస్ అధికారులు, ఆశావహులు పాల్గొన్నారు. -
గ్యాస్ డెలివరీకి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
దేవరాపల్లి: గ్రామాల్లో గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కి.మీ పరిధి వరకు ఉచితంగా సరఫరా చేయాలని, ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీల్లేదని జిల్లా పౌర సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. దేవరాపల్లి రైవాడ అతిథి గృహ ఆవరణలో గురువారం జరిగిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ. 4500 విలువ చేసే గ్యాస్ కనెక్షన్ను అందజేస్తున్నామన్నారు. ఈ గ్యాస్ కనెక్షన్తో స్టౌ, సిలిండర్, రెగ్యులేటర్, ధృవపత్రం తదితర సామగ్రిని అందజేస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో నిర్ణీత ధర కంటే మండల కేంద్రంలోనే రశీదుపై ధర కంటే ఎక్కువగా సొమ్ము తీసుకుంటున్నారని డీఎస్వో వద్ద స్థానిక విలేకరులు ప్రస్తావించగా,. దీనిపై డీఎస్వో మూర్తి స్పందిస్తూ గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి 15 కిలోమీటర్ల పరిధి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేసి నిర్ధారణ అయితే నివేదికను సదరు ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సైతం పంపిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధి దారులు తక్షణమే ఆన్లైన్ రశీదు తీసుకుని, రశీదులో ఉన్న సొమ్ము మాత్రమే చెల్లించాలని సూచించారు. ఆయన వెంట సీఎస్డీటీ కె.రవి పాల్గొన్నారు. -
యాప్ల పేరిట పని ఒత్తిడి
మాకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం. యాప్ల పేరిట ఉదయం నుంచి రాత్రి వరకూ పని ఒత్తిడి పెరుగుతుంది. మా ఒప్పంద మినిట్స్ బుక్లో హామీలను అమలు చేసే జీవోలు లేవు. మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. పెరుగుతున్న నిత్యవసర ధరల కారణంగా వచ్చే జీతంతో కుటుంబాలు గడవడం లేదు. జిల్లాలో 60 ఆశా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దీంతో డబుల్ వర్కు అవుతుంది. అర్థరాత్రి కూడా ఎవరికై నా బాలేదు అంటే అంబులెన్స్లో అవసరం మేరకు వెళ్లాల్సి ఉంటుంది. మాది కాని పనులను మమ్మల్ని చేయమంటారు. స్మార్ట్ మొబైల్స్ పనిచేయడంలేదు. చివరికి పింఛన్లు కూడా మాతోనే ఇప్పిస్తున్నారు. లేబర్ కోడ్పై ఉద్యమిస్తాం. లేబర్ కోడ్ కారణంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. – వజ్రపు సత్యవతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆన్లైన్ పనులు అప్పగించవద్దు... స్మార్ట్ మొబైళ్లు సరిగ్గా పనిచేయవు. ఆన్లైన్లో సర్వే మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇక ఇదే పని ఒత్తిడి ఉంటే అందరూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. మా పరిధిలో గర్భిణులు, బాలింతల సమాచారంతో పాటు రోగులకు బాగోలేకపోతే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడం వంటి విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అందించే గ్యాస్ పథకం ఆశాలకు వర్తించడం లేదు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలి. కమ్యునిటీ హెల్త్ వర్కలను ఆశా వర్కర్లుగా చేయాలి. –రామలక్ష్మి, జిల్లా ఆశా కార్యకర్తల యూనియన్ కోశాధికారి -
నేడు దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు
అనకాపల్లి : దివ్యాంగ బాలబాలికల కోసం జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ పోటీలను ఈనెల 6న స్థానిక గాంధీనగరం ఎస్.ఆర్.శంకరన్ మీటింగ్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో తమ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని గురువారం ఆయన చెప్పారు. డ్రాయింగ్, డ్యాన్స్, క్రాఫ్ట్, సింగింగ్, డ్రామా తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి విభాగంలో వయోపరిమితి ఆధారంగా సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదమ్ములను చిదిమేసిన కంటైనర్ లారీ
కశింకోట: మృత్యు రూపంలో వచ్చిన కంటైనర్ లారీ అన్నదమ్ములను బలి తీసుకుంది. వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. మండలంలో తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ అల్లు స్వామి నాయుడు అందించిన వివరాల ప్రకారం... మండలంలోని తాళ్లపాలెంలో ఎస్బీఐ వద్ద యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కంటైనర్ లారీ ముందు వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో స్కూటీపై వెళ్తున్న రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ(51), సోదరుడు వెంకటేశ్వరరావు(47) కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వగ్రామం దిమిలి నుంచి అనకాపల్లికి పని మీద వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో వెంకటేశ్వర కూలి కాగా, తాతాజీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా అనకాపల్లిలో పని చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములైన తాతాజీ, వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరారైన కంటైనర్ లారీని అనకాపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దిమిలిలో విషాధ చాయలు రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం దిమిలిలో గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ, వెంకటేశ్వరరావు కశింకోట మండలం తాళ్లపాలెంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో దిమిలిలోని వారి స్వగృహాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాతాజీకి భార్య, ఇద్దరు పిల్లలు, వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడాన్ని వారి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు కుటుంబాల్లోని పిల్లలు చిన్న వాళ్లు కావడంతో కుటుంబ పోషణ భారం కానుంది. ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్టు
నర్సీపట్నం : గొలుగొండ మండలం, కృష్ణదేవిపేట సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు సిబ్బందితో కలిసి గురువారం పల్లావూరు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో 50 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలింపులో రాజవొమ్మంగికి చెందిన గంటిమల్ల రాజుకుమార్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అతనిపై 14 కేసులు ఉన్నాయన్నారు. చిత్రకొండ వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి తీసుకువెళ్తుండగా పల్లావూరు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడితో పాటు అభినేష్ మునియప్పన్, మెరిపో కిశోర్, గంటిమల్ల లోవరాజు, మెరిపో లావణ్య, చెన్నాడ ప్రవీణ్కుమార్, మెరిపో విజయ్కుమార్ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, 3 స్కూటీలు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. -
బలవంతపు భూ సేకరణపై రైతుల ఆందోళన
బుచ్చెయ్యపేట: బలవంతపు భూ సేకరణ పనులను అధికారులు నిలిపివేయాలని ఆర్. శివరాంపురం, అప్పంపాలెం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గురువారం రెండు గ్రామాల్లో రామాలయాల వద్ద రైతులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలు ఏర్పాటుకు తమ గ్రామాల్లో భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని, దీనికి తాము వ్యతిరేకమన్నారు. పరిశ్రమలకు తమ భూములను ఇచ్చేది లేదన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని, తమకు అన్నం పెడుతున్న భూములను లాక్కోవొద్దంటూ వేడుకున్నారు. ‘మాకు అన్నం పెట్టే భూములే మాకు ముద్దు, కంపెనీల కోసం చేపట్టే భూ సేకరణ మాకొద్దు, భూ సేకరణ కోసం చేపట్టే సర్వేలు మాకొద్దు’ అంటూ రైతులు నినాదాలు చేశారు. రైతుల భూ సమస్యలపై తప్ప పరిశ్రమల కోసం ఎటువంటి సర్వేలు తమ గ్రామాల్లో చేయొద్దని తహసీల్దార్ లక్ష్మికి రైతులు, రైతు సంఘ ప్రతినిధులు వినతి పత్రం అందించారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ వార్డు సభ్యుడు మృతి
మునగపాక : స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బీలా లక్ష్మణరావు అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. లక్ష్మణరావు గతంలో పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేసి తన వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అనకాపల్లిలో సొంత పని నిమిత్తం వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్న విషయం తెలియడంతో మునగపాక వాసులు ఆవేదనకు గురయ్యారు. అందరితో ఆత్మీయంగా ఉండే లక్ష్మణరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మణరావు భార్య స్రవంతి ఇటీవల శ్రీకాళహస్తి దేవాలయ ట్రస్ట్బోర్డు సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటన విషయం తెలిసి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణరావు మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మణరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
లూలూరులో సర్వే పనులను అడ్డుకున్న రైతులు
బుచ్చెయ్యపేట : లోపూడి శివారు లూలూరులో సైనిక శిక్షణ కేంద్రానికి అదనపు భూ సేకరణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు రావడతో సర్వే అధికారులను పలు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే చేస్తే ఆందోళనకు దిగుతామని కూడు పెడుతున్న భూములను మాకు దక్కకుండా చేస్తారా అంటూ సర్వే సిబ్బందిపై రైతులు మండి పడ్డారు. గతంలో భూ సేకరణ ద్వారా వందలాది ఎకరాలు తీసుకుని మా పొట్టలు కొట్టారు... మరలా రెండోసారి మా భూములను లాక్కోని మమ్మల్ని రోడ్డున పడేస్తారా..? అంటూ అధికారులపై మండి పడ్డారు. నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. లోపూడి శివారు లూలూరులో పదేళ్లు కిందట సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో లోపూడి, శింగవరం, బంగారుమెట్ట, ఎల్బీ పురం, వడ్డాది, పొట్టిదొరపాలెం తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతుల నుంచి సుమారు 1,300 ఎకరాలు సేకరించి సైనిక శిక్షణ కేంద్రం(డీఆర్డీఓ) ఏర్పాటు చేశారు. మరలా సైనిక శిక్షణ కేంద్రం విస్తరణకు రెండోసారి మరో 550 ఎకరాలు వరకు భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా రైతుల భూముల్లో సర్వే పనులు చేపడుతుండడంతో రైతులు మండిపడుతున్నారు. గురువారం సర్వే చేయడానికి వచ్చిన రెవిన్యూ అధికారులను వారంతా అడ్డుకున్నారు. గ్రామ సభ పెట్టకుండా, రైతులకు సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారని నిలదీశారు. రైతులు అడ్డుకోవడంపై తహసీల్దార్ లక్ష్మి దృష్టికి సర్వే సిబ్బంది తీసుకెళ్లారు. రైతు సంఘ నాయకులతో సమావేశమవుతామని గ్రామ సభ పెడతామని తహసీల్దార్ లక్ష్మి సర్వే సిబ్బందికి సూచించారు. -
బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్
అల్లిపురం: శ్రీకాకుళం వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు మహిళా దొంగలను ఫోర్త్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను క్రైం డీసీపీ కె. లతా మాధురి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన వోల్లా జ్యోతి .. తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో విశాఖ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ప్రయాణ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి బ్యాగులోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. మరుసటి రోజు నగలు కనిపించకపోవడంతో విషయాన్ని గమనించిన బాధితురాలు, తన భర్త ద్వారా ‘డయల్ 112’ కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆటోలో తమతో పాటు ప్రయాణించి సంగం శరత్ థియేటర్ వద్ద దిగిపోయిన ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తమైంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తూ తప్పించుకోబోతున్న ఇద్దరు మహిళలను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లా కె. కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మలుగా గుర్తించారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను (రెండు నెక్లెస్లు, ఆరు గాజులు) స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపునేతలు
సాక్షి, అనకాపల్లి : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన ఇంటిపై టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడులు చేయించారని కాపునేతలు మండిపడ్డారు. గుంటూరులోని సిద్ధార్థనగర్లో అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించినా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రే పోషించారే తప్ప నిలువరించలేదని విమర్శించారు. టీడీపీ రౌడీమూకల దాడిలో ఽకాపు నేత అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా కారు అద్దాలు పగలుగొట్టి, కారును కాల్చివేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కాపు నేతలు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. విశాఖ నుంచి వందకు పైగా కార్ల ర్యాలీగా గుంటూరుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అనకాపల్లి టౌన్లో రింగురోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించి ధైర్యం కల్పించేందుకు పార్టీలకతీతంగా కాపునేతలు సమాయత్తమవుతున్నారు. పథకం ప్రకారమే కాపునేతలపై దాడులు... కాపు నేత అంబటి రాంబాబుపై పథకం ప్రకారమే టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని కాపునేతలు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని, దీనిని టార్గెట్ పెట్టుకుని దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. దీనిపై శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నాడు కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని, అదే రీతిలో ఇపుడు వంగవీటి రంగా శిష్యుడుగా పేరున్న అంబటి రాంబాబును, ఆయన కుటుంబాన్ని హతమార్చాలని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి అంబటి కుటుంబానికి అండగా నిలబడి ధైర్యం కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, బాణాల శ్రీనివాసరావు, కాపు నేతలు వీసం రామకృష్ణ, మలసాల రమణారావు, జాజులు రమేష్, దొండా రాంబాబు, మలసాల కిశోర్, ఏడువాక సత్యారావు, కలగా గున్నయ్యనాయడు, ఎ.వి. రత్నకుమారితో పాటు పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
మృతురాలు సంతోషిమునగపాక : మండలంలోని నాగులాపల్లి జగనన్న కాలనీలో వివాహిత గురువారం ఆత్యహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. నాగులాపల్లి జగనన్న కాలనీలో ఉంటున్న ఆళ్ల ఆదినారాయణతో మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన సంతోషికుమారితో 2012లో వివాహం జరిగింది. వివాహ సమయంలో సంతోషి తల్లితండ్రులు అనుకున్న ప్రకారం కట్నకానుకలు అందించారు. ఇరువురు దంపతులు అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఆదినారాయణ తన కుమారుడు చదువుకుంటున్న నాగులాపల్లి హైస్కూల్కు బైక్పై తీసుకువెళ్లి కూరగాయలు కొనుక్కొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆదినారాయణ తలుపులు తీయాలని తన భార్య సంతోషిని పిలుస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి గునపాంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఫ్యాన్కు చీర ఉరివేసుకొని విగతజీవిగా కిందపడి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంతోషిని గమనించి ఆటోలో అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సంతోషి మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలు సంతోషికి పాప,బాబు ఉన్నారు. పాప పాటిపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుకుంటుంది. అలాగే బాబు నాగులాపల్లిలో అయిదో తరగతి చదువుకుంటున్నారు. కాగా సంతోషి మృతికి అదనపు కట్నంతో పాటు భర్త వేధింపులే కారణమని, ఈ విషయమై తగు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.


