breaking news
Anakapalle District News
-
కాలిన గాయాలతో వృద్ధురాలు మృతి
రావికమతం: మేడివాడ శివారు అప్పలమ్మపాలెంలో చలి మంట కాగుతూ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు పాచిల చిలుకమ్మ (72) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. చిలుకమ్మ ఆమె అక్క కొడుకు మిరియాల కొండబాబు సంరక్షణలో ఉంటోంది. సోమవారం రాత్రి ఇంటి దగ్గర చలి కోసం మంట కాగుతుండగా ప్రమాదవశాస్తూ చీరకు నిప్పు అంటుకొని శరీరం కాలిపోయింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను స్థానికులు సహాయంతో మనవడు రావికమతం ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజిహెచ్కు తరలించారు. వృద్ధురాలు చిలుకమ్మ విశాఖ పట్నం కేజిహెచ్లో చిక్సిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిలుకమ్మ మృతిపై మిరియాల కొండబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. -
ఆదర్శ రైతు అరుణకు పుడమి పుత్ర అవార్డు
కశింకోట: మండలంలోని సుందరయ్యపేట గ్రామానికి చెందిన మండల ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నిర్వాహకురాలు, ఆదర్శ రైతు కూండ్రపు అరుణకు పుడమి పుత్ర 2024 పురస్కారం లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞాన్ ప్రతిష్టన్ సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నకిరేకల్లో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేంద్రరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశంసా పత్రం, జ్ఞాపికను పురస్కారంగా అందించి సత్కరించారు. అరుణను ఆదర్శంగా తీసుకొని యువ రైతులు ప్రకృతి సేద్యాన్ని చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించి ఆరోగ్య సమాజంగా రూపుదిద్దుకోవడానికి దోహదపడాలని వారు ఆకాంక్షించారు. తనకు ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
పోస్టల్ నిధుల గోల్మాల్పై విచారణ
నర్సీపట్నం : నాతవరం మండలం, మన్యపురట్లలో తపాలాశాఖలో జరిగిన నిధుల స్వాహాపై మంగళవారం గ్రామంలో విచారణ జరిగింది. ఇక్కడ పోస్టుమాస్టర్గా పని చేసిన రావాడ సోమరాజు పలు ఖాతాల నుంచి దాదాపు రూ.7లక్షలు స్వాహా చేశారు. ఆలస్యంగా మేలుకున్న తపాలాశాఖ అధికారులు సోమరాజును ఇది వరకే సస్పెండ్ చేశారు. ఇక్కడ నిధులు గోల్మాల్కు సంబంధించి సాక్షి ఈ నెల 17వ తేదీన పోస్టల్ బ్రాంచ్లో రూ.7లక్షలు గోల్మాల్ శీర్షికన వార్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కదలిన తపాలా శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. తపాలాశాఖ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రమేష్లు బ్రాంచిని తనిఖీ చేశారు. నాలుగు గ్రామాలకు సంబంధించి 321 ఖాతాదారుల నుంచి నిధులు స్వాహా జరిగినట్టు తెలిసింది. అయితే విచారణ విషయం తెలియక పలువురు ఖాతాదారులు హాజరు కాలేకపోయారు. స్వాహా సొమ్ముపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సూపరిండెంటెంట్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. స్వాహా సొమ్ము రికవరీకి అన్ని చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులకు నష్టం జరగకుండా సూచించారు. -
ప్రతిభ గల దివ్యాంగులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు శిక్షణ
అనకాపల్లి : దివ్యాంగ బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో జోనల్ స్థాయి దివ్యాంగులకు పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్ష సహిత విద్యా ఆధ్వర్యంలో క్రీడాపోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగ బాలలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడా విభాగం ప్రతినిధి శంకరయ్య మాట్లాడుతూ, శారీరక దారుఢ్య పరీక్షల ద్వారా ఎంపికై న దివ్యాంగ బాలలకు వచ్చే ఏడాది జనవరి మాసంలో నెల రోజుల పాటు కడపజిల్లా గండికోటలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జోనల్ స్థాయిలో ప్రతిభ సాధించి క్రీడాకారులకు కడపలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కడపలో శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు మార్చి, ఏప్రిల్ మాసంలో లడఖ్లో మరింత కఠినమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు, అక్కడ శిక్షణ పూర్తి అయిన తరువాత బాలలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ క్రీడల్లో అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, విశాఖ జిల్లాల దివ్యాంగుల బాలబాలికలకు పోటీలు నిర్వహించడం జరిగిందని, జిల్లా సహిత విద్య సమన్వయకర్త డి.రామకృష్ణనాయుడు చెప్పారు. ఈ పోటీల్లో 182 మంది క్రీడాకారులు పాల్గొనగా జోన్ నుంచి 10 మంది దివ్యాంగ బాలబాలికలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు నీరజ, భాస్కర్, పి.గిరి ప్రసాద్ పాల్గొన్నారు.రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం -
ఇంటి పన్ను వసూళ్ల పక్కదారిపై విచారణ
యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో పక్కదారి పట్టిన ఇంటి పన్నుల వసూళ్ల నగదు వ్యవహారంపై నర్సీపట్నం డీఎల్పీవో ఎస్.సత్య సూర్యనారాయణ మూర్తి మంగళవారం విచారణ జరిపారు. ఏటికొప్పాక పంచాయతీలో సుమారు రూ.4.23 లక్షలకు పైగా ప్రజల నుంచి వసూలైన పన్నుల సొమ్మును బిల్ కలెక్టర్ రమణబాబు సొంత అవసరాలకు వాడుకున్నట్టు తెలిసిందే. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడం, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లడంతో డీఎల్పీవో మూర్తి మంగళవారం యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ కలెక్టర్ వి. రమణబాబును ప్రశ్నించారు. పంచాయతీ ఖతాలో జమ చేయాల్సిన సొమ్ము సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కాలంలో పన్నుల వసూళ్లకు సంబంధించిన బిల్లు, లెడ్జర్, రశీదు పుస్తకాలను ఆయన తనిఖీ చేశారు. ఏటికొప్పాక పంచాయతీలో నిధులు పక్కదారి పట్టినా పంచాయతీ కార్యదర్శి ఎందుకు నిర్లక్ష్యం చూపారని ఆరా తీశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బిల్ కలెక్టర్ రమణబాబు చోడవరం పంచాయతీ పరిధిలో పని చేసినపుడు కూడా నిధుల పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి పంపనున్నట్టు డీఎల్పీవో తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని, బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. లైనుకొత్తూరు, జంపపాలెం పంచాయతీ కార్యదర్శులు ఆయన వెంట ఉన్నారు. పన్నుల వసూళ్లు 24.33 శాతమే నర్సీపట్నం డివిజన్లో 364 గ్రామపంచాయతీలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16.98 కోట్లు పన్నుల రూపంలో వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 24.33 శాతం అంటే రూ.4.94 కోట్లు మాత్రమే వసూలైనట్టు డీఎల్పీవో మూర్తి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా రూ.12.4 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్లైన్లో ఇంటి పన్ను మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. దీనివల్ల పంచాయతీల్లో పన్ను వసూళ్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొత్తగా అమలులోకి వచ్చిన ఈ పద్ధతిని ప్రజలంతా సద్వినియోగపర్చుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.జాతీయస్థాయి ఖోఖో పోటీలకు అచ్యుతాపురం విద్యార్థి -
ఎన్టీపీసీ నుంచి రూ.1.21 కోట్ల సీఎస్సార్ నిధులు
● ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగం తుమ్మపాల: ప్రజల వైద్యసేవల కోసం మెరుగైన సౌకర్యాల ఏర్పాటుతోపాటు పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఎన్టీపీసీ సీఎస్సార్ నిధులను అందించిందని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె చాంబర్లో ఎన్టీపీసీ సింహాద్రి తన సీఎస్సార్–సీడీ కింద మంజూరు చేసిన రూ.కోటి 21 లక్షల 50 వేలు, రూ.50 లక్షల చెక్కులను వేర్వేరుగా కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్, 6 పీహెచ్సీలు, 3 యూపీహెచ్సీల అభివృద్ధికి, క్రిటికల్ కేర్ యూనిట్కు రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించినట్టు చెప్పారు. ఇప్పటికే రూ.72.50 లక్షల మొదటి విడత మొత్తాన్ని విడుదల చేశారని చెప్పారు. పోలీస్ శాఖకు మద్దతుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ రూ.50 లక్షలను మంజూరు చేసిందని, నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇప్పటికే మొదటి విడత రూ.25 లక్షలు విడుదల చేసిందన్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్కి పేట విద్యార్థిని
పాయకరావుపేట: శ్రీప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థిని తుంపాల శ్వేత జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విద్యార్థిని ఎన్సీసీ 3వ ఆంధ్రా బాలికల బెటాలియన్ నుంచి ఎంపికై ందని చెప్పారు. ఈనెల 29 నుంచి జనవరి 25 వరకు జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో శిక్షణ తీసుకుని, 26న ఢిల్లీలో జరిగే ఆర్డీ పరేడ్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. శ్వేతను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
● పేదోడి కడుపు మండింది.. మట్టి పన్నుపై గట్టి ప్రతిఘటన
● తిరగబడ్డ ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ● ఏటిగైరంపేటలో అనధికార వసూళ్లపై గ్రామస్తుల మండిపాటు గొలుగొండ: చంద్రబాబు పాలనలో అక్రమార్కు లు చెలరేగిపోతున్నారు. మట్టి కావాలన్నా పన్ను కట్టాలట. ట్రాక్టర్ మట్టి తరలించడానికి ఏకంగా రూ.410 పన్ను కట్టమని అనధికార సంస్థ బళ్లను ఆపడంతో ప్రజలు తిరగబడ్డారు. పాక, ఇంటి కప్పుడుకు సొంత పొలంలో మట్టి తరలించడానికి పన్ను కట్టమంటే వారికి చిర్రెత్తుకొచ్చింది. సొమ్ము చెల్లించకపోతే ట్రాక్టర్, లారీ, పొక్లెయిన్ సీజ్ చేస్తామని చెప్పడంతో అడ్డుకోవడానికి మీరెవరంటూ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఏటిగైరంపేట గ్రామ పరిధిలో ఒక రైతు పొలం వద్ద పాక వేశారు. దీనికి కప్పుడు మట్టి అవసరం కావడంతో వేరొక ప్రాంతంలో తన పొలంలోని మట్టిని ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇంతలో ఏఎంఆర్ అనే సంస్థ సిబ్బంది వచ్చి ట్రాక్టర్లను నిలిపివేశారు. యూనిట్ మట్టి తరలించాలన్నా రూ.410 పన్ను కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఏటిగైరంపేట, పాలకపాడు, పుత్తడిగైరంపేట గ్రామాలకు చెందిన ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండిపడ్డారు. గ్రామాల్లో మట్టి తరలిస్తే చంద్రబాబు పాలనలో రూ.410 పన్ను ఎందుకు కట్టాలని దుయ్యబట్టారు. మేం కట్టం.. ఏం చేసినా పర్వాలేదని తిరుగుబాటు చేశారు. వ్యవసాయ కుటుంబాల్లో దిబ్బ లుగా ఉన్న పొలాన్ని చదును చేయడం, లోతుగా ఉన్న పొలంలో మట్టివేయడం జరుగుతుంది. అ లాంటి సమయంలో పన్ను కట్టమనడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. అసలు ఈ ఏఎంఆర్ సంస్థకు ఏ అనుమతులు ఉన్నాయని నిలదీశారు. ట్రాక్లర్లను అడ్డుకుంటే తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇక్కడ ఉన్న సిబ్బంది మెల్లగా జారుకున్నారు. అయ్యన్ననే అడుగుదాం.. ఇలా పేద ప్రజలకు అన్యాయం చేయడంపై బుధవారం స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లి సమస్య వివరిస్తామని ట్రాక్టర్ యజమానులు తెలిపారు. పేదలకు అన్యాయం చేసే ఈ సంస్థ ఎక్కడ నుండి వచ్చిందో తెలపాలని, తమకు న్యాయం చేయాలని కోరతామన్నారు. పాక, ఇంటి అవసరాల కోసం సొంత పొలంలో మట్టి తరలిస్తే ట్రాక్టర్కు రూ.410 ఎలా పన్ను విధిస్తారు.. ఎందుకు ఇవ్వాలని అయ్యన్న ఇంటి వద్దకు వెళ్లి అడుగుతామన్నారు. ఇలా అయితే తామెలా బతకాలని ట్రాక్టర్ యజమాని సత్తిరాజు ఆవేదనగా ప్రశ్నించారు. -
క్రిస్మస్ కాంతులు
కశింకోట సెయింట్స్ జాన్స్ స్కూలులో క్రీస్తు జననం నాటిక ప్రదర్శనకశింకోట: జిల్లా అంతటా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. చర్చిలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన నక్షత్రాలు కాంతులు వెదజల్లుతున్నాయి. కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూలులో మంగళవారం మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు జననం నాటికను విద్యార్థులు ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడి ఆంధ్ర కల్వరీ సెంటినరీ బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు మిరుమిట్లుగొలుపుతున్నాయి. పాలెం మందిరం, గవరపేట, బయ్యవరం, తాళ్లపాలెం, ఉగ్గినపాలెం, జమాదులపాలెం, తేగాడ, పేరంటాలపాలెం, జోగారావుపేట, జి.భీమవరం, కన్నూరుపాలెం, సుందరయ్యపేట, తీడ, చెరకాం, అచ్చెర్ల, గొబ్బూరు, ఏఎస్పేట, నరసింగబిల్లి, చింతలపాలెం, నూతలగుంటపాలెం, సోమవరం, ఏనుగుతుని, విసన్నపేట, వెదురుపర్తి, తదితర గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక తుమ్మపాల: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ విజయ్ కృష్ణన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అన్నారు. జిల్లా మైనార్టీ శాఖ అధికారి సత్య పద్మ, ఏవో రాధాకృష్ణ, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవిందు సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, డీఎస్పీ ఎం.శ్రావణి, పాస్టర్లు జాన్పాల్, జపనీస్ శాస్త్రి, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బ్రహ్మాస్త్రం
● కన్నుకుట్టి కుతంత్రం.. కుంటిసాకుతో అడ్డంకులు చిరుద్యోగిపైవిశాఖ సిటీ : వీఎంఆర్డీఏ అధికారుల రాజకీయాలకు ఒక చిరుద్యోగిని బలి చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి నిబంధనల్లో డొంకలు వెతుకుతూ ఆర్ఐపై వేటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉండడం అధికార పార్టీకి కన్నుకుట్టింది. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న కుతంత్రంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ముందస్తుగా చేసుకున్న బుకింగ్ను కూడా రద్దు చేయించింది. దీనికి అధికారులతో చెప్పించిన కుంటి సాకు దుమారం రేపుతోంది. అంతటితో ఆగకుండా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించడం ఇప్పుడు సంస్థలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలకు కింది స్థాయి సిబ్బందిని బలి చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఏడాదిన్నరలోనే వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల్లో కోత.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. స్టీల్ప్లాంట్లో కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నా పట్టించుకోకపోవడం.. విశాఖలో విలువైన భూములను ఊరూపేరు లేని బోగస్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడం.. ఇలా చంద్రబాబు వరుస నిర్ణయాల పట్ల ప్రజలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ఆ పార్టీల నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దీంతో అధికార పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి నేతలు వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సుమారు 1400 మంది వైఎస్సార్సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆ పార్టీ ఈ చేరికలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన చేరికల కార్యక్రమం కోసం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాను ముందస్తుగా ఆ పార్టీ నేతలు బుకింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రుసుము కూడా చెల్లించారు. ముందస్తు బుకింగ్ ఉన్నప్పటికీ.. వైఎస్సార్సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోడానికి చంద్రబాబు సర్కార్ అధికార బలాన్ని ప్రదర్శించింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని వీఎంఆర్డీఏ అధికారులపై ఒత్తిడి చేసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక కుంటి సాకులతో చేరికల కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. ఉదయం 10.30 గంటలకు చిల్డ్రన్స్ ఎరీనా కార్యక్రమం ఉండడంతో ఈలోగానే సిబ్బందితో గేటుకు తాళం వేయించారు. చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వాటిని తొలగించారు. అంతేకాకుండా చిల్డ్రన్స్ ఎరీనా హాల్లో ఆకస్మాత్తుగా ఏసీ పనిచేయడం లేదని, మరమ్మతులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని రద్దు చేశారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. ఎటువంటి సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంతలో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక పథకం ప్రకారమే తమ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చిల్డ్రన్స్ ఎరీనా గేటు ముందే బైఠాయించి కొంత సేపు నిరసన తెలిపారు. అనంతరం అక్కడే సుమారు 1,400 మందిని పార్టీలో చేర్చుకున్నారు. వీఎంఆర్డీఏలో రాజకీయాలకు చిరుద్యోగి బలి వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమానికి ముందస్తు అనుమతులున్నా రద్దు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు చిల్డ్రన్స్ ఎరీనాలో చేరికల సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఆర్ఐపై వేటు వై.కిరణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు -
బలవంత భూసేకరణ రైతుల పాలిట శాపం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణమూర్తి అనకాపల్లి టౌన్: పరిశ్రమల పేరుతో బలవంత భూసేకరణ రైతులకు భూమి మీదే నరకం చూపిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. స్ధానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం ‘జిల్లాలో పరిశ్రమల పేరుతో బలవంత భూసేకరణ’ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిశ్రమల పేరుతో సేకరించిన భూములు పూర్తి వినియోగంలో లేవన్నారు. పోరాడి సాఽధించుకున్న విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు స్వంత గనులు కేటాయించమని కోరలేని మన రాష్ట్ర ఎంపీలు మిట్టల్ స్టీల్ప్లాంట్కు స్వంత గనులు కేటాయించమని కోరడం సిగ్గుచేటన్నారు. సీపీఐ 100 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలు నేడు పథకాలుగా మారాయన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రస్తుతం కోరలు తీసిన పాములాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శ్రీరామచంద్రయ్య మాట్లాడుతూ నక్కపల్లి మండలంలో నిర్మిస్తున్నవి అత్యంత ఎక్కువ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట భూములు, తర్వాత ఖనిజాలు, ఆ తర్వాత ప్రభుత్వ సంస్ధలను పీపీపీ పేరుతో కార్పొరేట్లకు ధారాదత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు. అమరావతికి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల్లో 71 శాతం మందికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. 29 గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పి భూములు సేకరించి అవేమీ ఇప్పటి వరకూ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.విమల, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ లీజు రద్దు చేయాలని వెంకటాపురంవాసుల ధర్నా
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వెంకటాపురం గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మంజూరు చేసిన గ్రావెల్ క్వారీ లీజులు రద్దు చేయాలంటూ స్థానికులు మంగళవారం ఆందోళన చేశారు. సర్వే నంబర్ 156/పీ లోని 12.5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీలక్ష్మీ నరసింహ మినరల్స్కు లీజు మంజూరు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని కాలుష్య సమస్య పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ధార ఈ ప్రాంతం గుండా వెళ్తుందని వారు తెలిపారు. అంతేకాకుండా యాదవ కులస్థులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలోని కొండల వద్ద పశువులను మేపుతామని, ఇప్పుడు గ్రావెల్ తవ్వకాలు జరిపితే తమ పశువులకు రక్షణ, మేత ఉండదని వారు వివరించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. -
గండం గడిచింది..
● రోడ్డు ప్రమాదంలో బైక్తో సహా లారీ కింద చిక్కుకున్న ఇద్దరు యువకులు ● సీఐ హుటాహుటిన లారీలో సరకు అన్లోడ్ చేయించడంతో దక్కిన ప్రాణాలునర్సీపట్నం: పట్టణ సీఐ గఫూర్ చొరవతో రోడ్డు ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. పట్టణంలో రాధామాధవి లాడ్జి సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన యువకులు చిలుకు వరప్రసాద్, మాకిరెడ్డి చందు గాయపడ్డారు. వరప్రసాద్ తీవ్రంగా గాయపడడంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. చంద్ర ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరూ క్రికెట్ పోటీలకు వజ్రగాడ గ్రామం వెళ్లి తిరిగి బైక్పై వస్తున్నారు. సివిల్ సప్లయి రైస్తో లారీ నర్సీపట్నం వైపు వస్తుంది. లారీని తప్పించబోయి వీరి బైక్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకుపోయింది. వారిద్దరూ లారీ కింద ఇరుక్కుపోయారు. డ్రైవర్ సమయస్పూర్తితో లారీని నిలిపివేశాడు. లారీ ముందుకు వెళ్తే చందు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వెనక్కు వెళ్తే వరప్రసాద్ ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. సమీపంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విధుల్లో ఉన్న సీఐ గఫూర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, వెంటనే పొక్లెయిన్ రప్పించి లారీలోని బియ్యం బస్తాలను అన్లోడ్ చేయించారు. దీంతో లారీ కింద ఇరుక్కున్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సీఐ, లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వరప్రసాద్ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ తరలించారు. -
మరింత చేరువగాఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు
నర్సీపట్నం: ఆర్టీసీ పార్శిల్ డోర్ డెలివరీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా ప్రజా రవాణాధికారి డి.ప్రవీణ సిబ్బందికి సూచించారు. డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె నర్సీపట్నం డిపోలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాన్ని సందర్శించారు. డోర్ డెలివరీ సేవలపై డీఎం ధీరజ్ను ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. డోర్ డెలివరీ సౌకర్యాన్ని ఆర్టీసీ 84 పట్టణల్లో అందిస్తుందన్నారు. ఒక కేజీ నుంచి 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. అతి తక్కువ చార్జీలతో అతి వేగంగా భద్రంగా డోర్ డెలివరీ చేయటం ఆర్టీసీ వల్ల సాధ్యమన్నారు. డోర్ డెలివరీ సేవలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ ఎ.గంగాధర్, అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
● ఉత్సాహంగా ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ క్రీడా పోటీలు ● గిరిజన ఉత్పత్తులు, ఆహార పదార్థాలతో 68 స్టాళ్లు ఏర్పాటు క్రీడా మస్కట్తో అతిధులు స్టాల్స్ను తిలకిస్తున్న పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కృష్ణ తేజస్టాల్స్ను సందర్శించి పరిశీలిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్,చిత్రంలో అవార్డు గ్రహిత జ్యోతి సురేఖ ఆర్చరీ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్మహారాణిపేట: పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఉత్సవ్ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన 68 స్టాళ్లు లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, బాంబూ చికెన్ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఉత్కంఠగా సాగిన క్రీడా పోటీలు ఖేలో ఇండియా కబడ్డీలో 10 రాష్ట్రాల నుంచి 18 టీమ్లు భాగస్వామ్యమయ్యాయి. అందులో పురుష జట్లు 10, మహిళా జట్లు 8 పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవగా, రన్నర్ జట్టుగా ఒడిశా, మూడో స్థానంలో తెలంగాణ, గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో జార్ఖండ్గా విజేతగా నిలవగా, రన్నర్గా మధ్యప్రదేశ్ జట్టు నిలిచింది. మూడో స్థానంలో మహారాష్ట్ర, ఒడిశా జట్లు ఉన్నాయి. ●ఆర్చరీ క్రీడా పోటీలో 8 రాష్ట్రాలకు చెందిన 20 మంది క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా గోల్డ్ మెడల్, రాజస్థాన్కు చెందిన బద్రీ లాల్ మీనా సిల్వర్ పతకం సాధించుకున్నారు. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించుకున్నారు. మహిళా వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా గోల్డ్ మెడల్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి సిల్వర్ పతకం సాధించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ●సాయంత్రం క్రికెట్ స్టేడియంలో నమూనా క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. అధికారులు, క్రీడాకారులు, గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లోనే సమర్పించాలి
● జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో అప్పారావునాయుడు అనకాపల్లి టౌన్: ´ëuý‡Ô>ÌSÌSMýS$ ^ðl…¨¯]l {糆 ¼Ë$ϯ]l$ ï³G-‹œ-G…-G‹Ü §éÓÆ> M>MýS$…yé yîlyîl-Ðø AMú…sŒæ §éÓÆ> ïÜG-‹œ-G…-G‹Ü {sñæ•fÈ ´ùÆý‡t-ÌŒæ-ÌZ¯ól çܼ-ÃsŒæ ^ólĶæ*ÌS° hÌêÏ Ñ§éÅ-Ô>Rê-«¨M>Ç Wyìlz A´ëµ-Æ>-Ð]l#-¯é-Ķæ¬yýl$ ™ðlÍ-´ëÆý‡$. ç³rt-׿…ÌZ° so¯ŒS VýSÆŠḥæÏÞ OòßæçÜ*-P-ÌŒæÌZ hÌêÏ ç³Ç-«¨ÌZ E¯]l² ÑÑ«§ýl ´ëuý‡Ô>-ÌSÌS {糫§é-¯ø´ë-«§éÅ-Ķæ¬-ÌS™ø ÝùÐ]l$ÐéÆý‡… Oòœ¯é¯ŒSÞ çÜ…º…-«¨™èl ÑçÙ-Ķæ*-ÌSOò³ Õ„ýS׿, AÐ]l-V>-çßæ¯]l çÜÐ]l*-ÐólÔèæ… fÇ-W…¨. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$™èl* {ç³çÜ$¢™èl… Ñyýl$-§ýl-OÌñæ¯]l {V>…sŒæ QÆý‡$a-ÌS¯]l$ ¯]l*™èl¯]l Ñ«§é¯]l… §éÓÆ>¯ól ¯]lÐðl*§ýl$ ^ólĶæ*-ÌS-¯é²Æý‡$. °«§ýl$-ÌS¯]l$ ѧéÅ-Æý‡$¦ÌS AÀ-Ð]l–-¨®MìS çÜ{MýS-Ð]l$…V> Ѱ-Äñæ*W…^é-ÌS-¯é²Æý‡$. ç³§ø ™èlÆý‡VýS† ç³È„ýS-ÌSOò³ Ķæ*„ýS¯ŒS ´ëϯŒS¯]l$ MýSr$t-¨-rt…V> AÐ]l$Ë$ ^ólĶæ*ÌS-¯é²Æý‡$. ÇÝùÆŠ‡Þ ç³Æý‡Þ¯ŒS ÔóæQÆŠæ, QVóS‹Ù ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
స్పెషల్ రైళ్లు పొడిగింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. ●విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ స్పెషల్ విశాఖలో ప్రతీ సోమవారం రాత్రి 7.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 23వ తేదీ వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–విశాఖపట్నం(08584) స్పెషల్ తిరుపతిలో ప్రతీ మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు పొడిగించబడింది. ●విశాఖపట్నం–తిరుపతి(08547) వీక్లీ స్పెషల్ విశాఖలో ప్రతీ బుధవారం రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 25వ తేదీ వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–విశాఖపట్నం(08548) స్పెషల్ తిరుపతిలో ప్రతీ గురువారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 26వ తేదీ వరకు పొడిగించబడింది. ●విశాఖపట్నం–చర్లపల్లి(08579) వీక్లీ స్పెషల్ ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలును ఫిబ్రవరి 27వ తేదీ వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి–విశాఖపట్నం(08580) వీక్లీ స్పెషల్ ప్రతీ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటిరోజు ఉద యం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలును ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించారు. పలు రైళ్లు రీ షెడ్యూల్ ఖరగ్పూర్ డివిజన్, నారాయణగడ్–భద్రక్ రైల్వేస్టేషన్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ సంబంధిత పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచ పలు రైళ్లు ఆయా తేదీల్లో ఆలస్యంగా బయల్దేరనున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. ●హౌరా–సికింద్రాబాద్(12703) ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఈ నెల 24, 26, 28వ తేదీల్లో 3 గంటలు ఆలస్యంగా, 23, 27వ తేదీల్లో గంట ఆలస్యంగా బయల్దేరుతుంది. ●సికింద్రాబాద్–హౌరా(12704) ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఈ నెల 23న 4 గంటలు, 26న 2 గంటలు, 27న 130 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●ఎస్ఎంవీ బెంగళూరు–అగర్తలా(12503) ఎక్స్ప్రెస్ ఈ నెల 23వ తేదీన 4గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●హౌరా–ఎస్ఎంవీ బెంగళూరు (12245) దురంతో ఎక్స్ప్రెస్ ఈ నెల 24వ తేదీన 2గంటలు, 26, 28వ తేదీలలో గంట ఆలస్యంగా బయల్దేరుతుంది. ●ఎస్ఎంవీ బెంగళూరు –హౌరా(12864) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23వ తేదీన 5గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●విల్లుపురం–ఖరగ్పూర్(22604) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23వ తేదీన 5 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. -
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం హర్షణీయం
సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు.కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా కేంద్రంలో 1925లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకలు సోమవారం ఘఽనంగా జరిగాయి.ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న నాణ్యమైన కాఫీ గింజలు, వాటి నాణ్యతను వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా మరింత నాణ్యమైన కాఫీ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా గిరిజన రైతులు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ బ్రాండింగ్లో అరకు కాఫీని మరింతగా ప్రమోట్ చేసి విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించనున్నట్టు ఆయన చెప్పారు. -
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
తుమ్మపాల : సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గూర్చి వాటి కారణాలు వివరంగా తెలియజేయాలన్నారు. అర్జీదారులు తమ అర్జీల సమాచారం కోసం 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 344 అర్జీలు నమోదు జరిగాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా సమన్వయ అధికారి ఎస్.సుబ్బలక్ష్మి, సిపిఓ జి.రామారావు, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, గృహనిర్మాణ పథకం సంచాలకులు కె.సరోజినీ, శచిదేవి, సూర్యలక్ష్మి, శ్రీనివాస్, డీఈవో జి.అప్పారావు నాయుడు, జిల్లా ఎక్సయిజ్ అధికారి వి.సుధీర్ పాల్గొన్నారు ప్రత్యేక పంచాయతీకి వినతి ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కశింకోట మండలం జి.భీమవరం గ్రామపరిధిలో గల సింగవరం గ్రామస్తులు కలెక్టర్లో జరిగిన పీజీఆర్ఎస్లో విన్నవించారు. తక్కువ జనాభా రిత్యా కొన్నేళ్ల క్రితం సింగవరం గ్రామాన్ని జి.భీమవరం గ్రామ పంచాయతీలో విలీనం చేయడంతో గ్రామాభివృద్ధి వెనకబడిందని తెలిపారు. ఇంటిపన్నులు, ఇతరాత్ర రూపాల్లో పంచాయతీకి వస్తున్న ఆదాయాన్ని జి.భీమవరం గ్రామానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారని వాపోయారు. తమ గ్రామంలో 650 మంది ఓటర్లు, 1,250 మంది జనాభా ఉన్నారని, ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు అన్ని విధాలుగా అర్హత కలిగి ఉందని తెలిపారు. ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందించి కలెక్టరేట్ గేటు వద్ద నిరసన తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కోసం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చేయాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ బొంతు రమణ అన్నారు. ఓబీసీ నాయకులు పొలమర శెట్టి ఆదిమూర్తి, బుద్ధ మహేష్ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కావాలి... యలమంచిలి కేంద్రంగా నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని యలమంచిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు, ఫెన్షనర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ ప్రజలకు దూరాభారంగా ఉంటుందని, అన్ని వసతులతో యలమంచిలి పట్టణం ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మలకొండ బాబు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడారిపూరి జగన్నాథం, యలమంచిలి బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నక్కా శివశంకర్, ఎల్లపు రాజు కలెక్టర్ను కోరారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు కలెక్టరేట్ ఎదుట మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించి విడుదల చేసిన జీవో 1491ను సవరించాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండలంలోని సర్పంచ్లతో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 తేదీన అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న యలమంచిలి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న నక్కపల్లి డివిజన్లో కలుపుతూ జీవో విడుదల చేసిందన్నారు. నక్కపల్లి డివిజన్ను తామంతా స్వాగతిస్తున్నామని అయితే సుదూర ప్రాంతంలో ఉండే నక్కపల్లి డివిజన్లో మాత్రం యలమంచిలి నియోజకవర్గాన్ని మినహాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను సవరించేలా చర్యలు తీసుకొని యథావిధిగా అనకాపల్లి డివిజన్లో ఉండేలా చూడాలన్నారు. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మాణం అమలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,సర్పంచ్లు సుందరపు తాతాజీ, చదరం నాయుడు,భీశెట్టి గంగప్పలనాయుడు,బొడ్డేడ శ్రీనివాసరావు,ఇందల నాయుడు,జాజుల వెంకటరమణ,పార్టీ నాయకులు కాండ్రేగుల జగన్, పిన్నమరాజు రవీంద్రరాజు, శ్రీపతి రామకృష్ణ పాల్గొన్నారు. -
బాక్సింగ్లో బంగారు పతకాలు
వెంకటేశ్వరరావు చేతుల మీదగా మెడల్ అందుకుంటున్న మౌనిక నర్సీపట్నం : రాష్ట్ర స్థాయి 9వ మహిళా బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నంకు చెందిన బాక్సర్లు ఐదు పతకాలు సాధించారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ఈ నెల 20,21 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న బొంతు మౌనిక 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 81 కిలోల విభాగంలో ఏడిద లక్ష్మి, 54 కిలోల విభాగంలో రాజ రాజేశ్వరి, 52 కిలోల విభాగంలో జి.సాయి, 70 కిలోల విభాగంలో వై.హాసిని కాంస్య పతకాలు సాధించారు. ద్రోణాచార్య అవార్డు, ఏపీ బాక్సింగ్ ప్రెసిడెంట్ ఐ.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 36 అర్జీలు
అర్జీదారుల సమస్యను విని సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడుతున్న ఎస్పీ అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 36 ఆర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని అక్కడ నుంచి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు – 25, మోసపూరిత వ్యవహారాలు – 1, ఇతర విభాగాలకు చెందినవి –10 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర వర్శిటీల్లో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మునగపాక : కేంద్ర విశ్వ విద్యాలయాల పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కర్నాటక కేంద్ర విశ్వ విద్యాలయం డీన్, ప్రొఫెసర్ దొడ్డి వెంకట రమణ కోరారు. సోమవారం ఆయన మునగపాక పీఏసీఎస్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి జనవరి 14లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష మార్చిలో ఉంటుందన్నారు. డిసెంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం తమ యూనివర్సిటీలో ఉన్న 30 పీజీ కోర్సులకు అదనంగా మరో 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ విశ్వ విద్యాలయంలో చదువుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే పలు ఉపకార వేతనాలను పొందగలరని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరింత సులభతరం
డాబాగార్డెన్స్ (విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, సేవల టికెట్ల జారీ ప్రక్రియను దేవదాయ శాఖ డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందే వీలు కల్పించారు. మన మిత్ర యాప్ నంబరు 9552300009, దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ aptemples.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఏపీ టెంపుల్స్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, లాగిన్ అయిన తర్వాత టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ను ప్రింట్ తీసుకోవడం, ఫోన్లో చూపించడం ద్వారా స్కాన్ చేయించుకుని భక్తులు వేగంగా దర్శనం పొందవచ్చు. ప్రసాదాల కొనుగోలుకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇప్పటికే 315 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శనం చేసుకోగా, 74 మంది భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రసాదాలను పొందినట్లు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు, సేవలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ విధానం ఎంతో దోహదపడుతుందన్నారు. -
కొత్త పింఛన్లు తక్షణం మంజూరు చేయండి
నక్కపల్లి: చంద్రాబాబు ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నా కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్సి వీసం రామకృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పింఛన్ల కోసం 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీ లందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని బూటకకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 50 ఏళ్లు కాదు కదా 70 ఏళ్లు వచ్చిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదని అన్నారు. పింఛన్ల కోసం పండుటాకులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారన్నారు. వృద్ధాప్య పింఛన్లే కాకుండా వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు సైతం మంజూరు చేయలేదని తెలిపారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు మాసాలకొకసారి వలంటీర్ల ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్లు మంజూరు చేశామని, నక్కపల్లి మండలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 6వేలకు పైగా కొత్తపింఛన్లు మంజూరు చేసామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు. -
సంపద పోయినా.. ప్రాణం దక్కలేదు
అచ్యుతాపురం రూరల్: అరుదైన బ్లూ వేల్ను (నీలి తిమింగలం) రక్షించాలన్న మత్స్యకారుల ప్రయత్నాలు వృథా అయ్యాయి. అందుకోసం వారు సుమారు రూ.3 లక్షల విలువైన వలను, రూ.లక్ష విలువైన మత్స్య సంపదను కోల్పోయారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ భారీ తిమింగలానికి మూడు రోజుల అనంతరం సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిపారు. పూడిమడక తీరంలో శనివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ నీలి తిమింగలం చిక్కిన విషయం తెలిసిందే. మత్స్యకారులు వెంటనే ఆ తిమింగలాన్ని తిరిగి సముద్రంలో విడిచి పెట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని మత్స్యకారులు అరుదైన నీలి తిమింగలాన్ని కాపాడే క్రమంలో విలువైన వలను, తిమింగలంతోపాటు వలకు చిక్కిన మత్స్య సంపదను సముద్రంలో విడిచిపెట్టి మానవత్వం చాటుకున్నారు. అయినప్పటికీ శనివారం రాత్రి తిమింగలం మృతి చెందడంతో తీవ్ర ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు పర్యటన హడావుడిలో ఉన్న సంబంధిత శాఖల అధికారులు ఆరోజు ఇటువైపు దృష్టి పెట్టలేదు. వారంతా సోమవారం రావడంతో మూడు రోజులపాటు తిమింగలం మృతదేహం వద్ద మత్స్యకారులు కాపలా కాశారు. సుమారు 10 సంవత్సరాల వయసు భారీ నీలి తిమింగలం జీవన ప్రమాణం సుమారు 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇక్కడ మృతి చెందిన నీలి తిమింగలం పొడవు, వెడల్పుతోపాటు వెన్నుపూస రింగులను బట్టి సుమారు 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం చేసినట్లు దోసూరు వెటర్నరీ వైద్యురాలులు ఉమా మహేశ్వరి, ఎంజేపురం వైద్యుడు జగదీశ్, మాడుగుల వైద్యుడు శివకుమార్ తెలిపారు. పోస్టుమార్టంలో నీలి తిమింగలం అవయవాలు సేకరించి విశాఖపట్నంలో ల్యాబ్కు తరలించాన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తరువాత తిమింగలం మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియజేస్తామన్నారు. తిమింగలాన్ని ఖననం చేసిన వారిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎం.రామకృష్ణ, ఇ.శివకుమార్, మైరెన్ ఎస్ఐ బిహెచ్.వి.ఎస్.ఎన్.రాజు, ఫిషరీస్ అధికారి రవితేజ, పూడిమడక వీఆర్వో అప్పలరాజు ఉన్నారు. పరిశ్రమల వ్యర్థాలే కారణం పరిశ్రమల వ్యర్ధ రసాయనాలను నేరుగా సముద్రంలో పైప్లైన్ల ద్వారా కలిపేయడం వలన విలువైన మత్స్య సంపద కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈమధ్యనే ఉప్పుటేరులో విలువైన మత్స్య జాతులు, సముద్రంలో ఆలివ్రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడ్డాయని, ఆ విధంగానే భారీ నీలి తిమింగలం స్పృహ కోల్పోయి మృతి చెందిందని మత్స్యకార నాయకుడు చేపల తాతయ్యలు పేర్కొన్నారు. ఇప్పటికై నా మత్స్య సంపదకు హాని కలగకుండా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ద్వారా పరిశ్రమల్లో వ్యర్ధాలను శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టాలని కోరుతున్నారు. రూ.3 లక్షల విలువైన వలను, లక్ష విలువ గల చేపలను కోల్పోయామని, ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. -
గోవాడ సుగర్స్లో వెంటనే క్రషింగ్ ప్రారంభించాలి
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ను వెంటనే ప్రారంభించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఆవరణంలో అఖిల పక్ష నాయకుల సమావేశం సోమవారం జరిగింది. రైతు సంఘం, సీపీఐ రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులు, చెరకు రైతు సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించడంలో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది సెప్టెంబరు 30వతేదీన నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ మహాజనసభను ఇప్పటి వరకూ నిర్వహించలేదని, గత సీజన్కు సంబంధించిన చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంటు ఇవ్వాలని, ఈ ఏడాది క్రషింగ్ చేయడానికి కావలసిన పనులన్నీ చేపట్టాలని, వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో ఏడువాక సత్యారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అప్పలరాజు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు తాతారావు, దొడ్డి అప్పారావు, శానాపతి సత్యారావు, సూరిబాబు, పప్పల జయదేవ్, మూడెడ్ల శంకర్రావు, జెర్రిపోతుల నానాజీ, శరగడం రామునాయుడు, గణపతినాయుడు, మోహన్రావు, పోతల ప్రకాష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వైద్య విద్య జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు
మహారాణిపేట (విశాఖ): మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి, శ్రీ , కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నివారణ చట్టం 2017 అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును, ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మందుల పంపిణీ, ఉద్యోగ అవకాశాలు, గృహ వసతి, బీమా వంటి సౌకర్యాలపై చర్చించారు. అసెంబ్లీలో ఆమోదించిన అంశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావాలని, నిబంధనల అమలులో జాప్యం జరిగితే వెంటనే సరిదిద్దాలని చైర్మన్ అధికారులకు సూచించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఎయిమ్స్ వంటి సంస్థలకు కేంద్రం నుంచి అందుతున్న సహకారం, పురోగతిపై కూడా చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య విద్యా విభాగం పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ సౌరబ్ గౌర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే.నీలకంఠరెడ్డి, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్డాక్టర్ పద్మావతి, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మునగపాక : అప్పుల భారం భరించలేక మండలంలోని చూచుకొండ గ్రామంలో గడ్డిమందు తాగిన వ్యక్తి సోమవారం మృతి చెందాడని ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట వెంకట స్వామినాయుడు(49) గతంలో బ్రాండిక్స్లో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఆర్థిక సమస్యలతో అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక ఆదివారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడు వెంకటస్వామి నాయుడుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన వెంకట స్వామి నాయుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా సోమవారం వెంకటస్వామి నాయుడు మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుమ్ములాటలు
టీడీపీలో సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో కుమ్ములాటలు తార స్థాయికి చేరాయి. పచ్చనేతల మధ్య విభేదాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు.. అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరిపై మరొకరు పార్టీ అధినేత దగ్గర ఫిర్యాదు చేసుకునే వరకూ వచ్చింది. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైన పీలా గోవిందు సత్యనారాయణకు అధిష్టానం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతోపాటు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా కొనసాగిస్తోంది. అంతేకాకుండా స్థానిక జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆయన సమీప బంధువు కావడంతో నియోజకవర్గంలో పీలా గోవిందు కాసింత స్పీడ్ పెంచారు. ఏ పని జరగాలన్నా అధికారులు సైతం పీలా గోవిందునే సంప్రదిస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి.. ఒక వర్గానికే పార్టీలో పదవులు దక్కుతున్నాయని, ఇన్చార్జి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకే కొమ్ముకాస్తున్నాడని, టీడీపీని పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తాళ్లపాలెం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఇద్దరూ ఒకరిపై ఒకరు వేర్వేరుగా ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు మాజీల వ్యవహార శైలిపై గడిచిన కొన్ని నెలల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో నిఘా ఉంచిన చంద్రబాబు ఇద్దరికీ వేర్వేరుగా క్లాస్ తీసుకున్నట్టు భోగట్టా. ఇద్దరు మాజీలపై సీఎం ఆగ్రహం ‘అన్నీ గమనిస్తున్నాను.. అంతా తెలుసుకున్నాను.. చేసింది చాలు ఇక ఆపండి.. తీరు మార్చుకోకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు’ అంటూ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీలో ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇద్దరిపై కోపంతో ఊగిపోయారని సమాచారం. అయితే గతంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన మాజీ మంత్రి.. ఇప్పుడు మళ్లీ తమపై పెత్తనం చెలాయించడమే కాకుండా టీడీపీలో విభేదాలు సృష్టించి గ్రూపు రాజకీయాలకు తెర లేపుతున్నాడని.. అంతేకాకుండా అనకాపల్లి పట్టణ నడిబొడ్డున దౌర్జన్యంగా విలువైన భూములను కబ్జా చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు ఇవ్వగా.. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీని గాలికి వదిలేశాడని, ఒకే కుటుంబానికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడని మాజీ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదులు విన్న చంద్రబాబు ఇద్దరిపై తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ‘మీ బాగోతాలన్నీ తెలుసు.. సమాచారం అంతా నా దగ్గర ఉంది.. అంతా చూస్తూనే ఉన్నా.. అర్జెంటుగా ప్రస్తుత వివాదాన్ని క్లియర్ చేయండి.. నేను జోక్యం చేసుకునేంతవరకు సాగదీయకండి.. తమాషాగా ఉందా’ అంటూ మాజీ మంత్రిని ఘాటుగా హెచ్చరించినట్లు అదే పార్టీలో సీనియర్ నాయకులు చెబుతున్నారు. ‘పద్ధతి మార్చుకో.. నువ్వు మార్చుకోకపోతే నేనే మార్చేస్తా.. అంతవరకు తెచ్చుకోకు.. జాగ్రత్త’ అంటూ మాజీ ఎమ్మెల్యేకు చురకలు అంటించినట్లు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ హెచ్చరికలతో ఇద్దరు మాజీలలో అధినేత చంద్రబాబుపై మరింత కోపం పెరిగింది. నిజాలు చెబుతుంటే వాటిని సరిదిద్దాలి గానీ మాపై అరుస్తున్నారెందుకు అంటూ ఇరువురు సమీప సీనియర్ నాయకుల వద్ద వాపోయినట్టు సమాచారం. సీఎం హెచ్చరికలతో ఇద్దరు మాజీల్లో మార్పు వస్తుందా..? లేదా తగ్గేదేలే అంటూ గ్రూపు రాజకీయాలు.. కబ్జాలు కొనసాగిస్తారో వేచి చూడాలంటూ టీడీపీ వర్గాలు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి. పచ్చనేతల్లో తారస్థాయికి విభేదాలు అనకాపల్లిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ పోరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద ఒకరిపై ఒకరు ఫిర్యాదులు విలువైన భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రిపై ఆరోపణ ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఇద్దరిపై చంద్రబాబు సీరియస్ ఇద్దరి బాగోతాలు తెలుసని, పద్ధతి మార్చుకోకపోతే తానే మారుస్తానని టీడీపీ అధ్యక్షుడి హెచ్చరిక దీంతో అధినేతపైనే గుర్రుగా ఉన్న ఇద్దరు నేతలు -
చలిమంట కాస్తుండగా నిప్పంటుకుని వృద్ధురాలికి గాయాలు
రావికమతం: అప్పలపాలెం గ్రామంలో చలిమంట కాస్తుండగా ప్రమాదవశాస్తూ చీరకు నిప్పంటుకొని వృద్ధురాలు గాయపడిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలివి. మండలంలో మేడివాడ పంచాయతీ శివారు అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన పాచిల చిలుకమ్మ(60) చలికి మంట కాస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సహాయంతో మనవడు రావికమతం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
తాళ్లపాలెం సంతకు పండగొచ్చింది...
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం వారపు సంతలో సోమవారం గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా సాగాయి. పూర్వ విశాఖ జిల్లా, కాకినాడ జిల్లాల నుంచి పెంపకందారులు, వ్యాపారులు గొర్రెలు, మేకలు అమ్మకానికి తీసుకు వచ్చారు. సుమారు వెయ్యి వరకు వచ్చాయి. వీటిని విశాఖ, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, పెంపకందారులు, హోటల్ యజమానులు వచ్చి కొనుగోలు చేసి వ్యాన్లు, ఆటోల్లో తీసుకు వెళ్లారు. పరిమాణం అనుసరించి రూ. ఐదారు వేల నుంచి రూ.30 వేల వరకు ఒక్కొక్కటి అమ్మకాలు సాగాయి. అలాగే గొర్రెలు, మేకల మందలను కూడా అమ్మకానికి తీసుకు రాగా, వాటి సంఖ్యను అనుసరించి రూ.నాలుగైదు లక్షలకు విక్రయించారు. అయితే ప్రస్తుతం సీజన్ కావడంతో ఎక్కువగా పిల్ల మేక, గొర్రెలతో అమ్మకానికి వచ్చాయి. సంక్రాంతి సమీపిస్తుండడంతో పందెం కోడి పుంజుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కటి రూ.2 వేల నుంచి రూ.పది వేల వరకు విక్రయాలు సాగాయి. కూరగాయలు కిలో పాదు చిక్కుడు రూ.100, వంకాయ రూ.80, దొండకాయ, బీట్రూట్, క్యారెట్, బీరకాయ రూ.70, టమాటా రూ.60, ఉల్లిపాయ, బంగాళాదుంప రూ.30 ధరలో విక్రయాలు జరిగాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా అదనంగా రూ.70 పెరిగింది. గత వారం రూ.50 ఉండగా, ఈ వారం రూ.120కి పెరిగింది. -
9వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా సూర్యనారాయణ
సూర్యనారాయణను అభినందిస్తున్న ఎమ్మెల్యే రాజు, న్యాయవాదులు చోడవరం: స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాధి చీపురుపల్లి సూర్యనారాయణ నియమితులయ్యారు. ఆయనను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యనారాయణ చోడవరం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీనియర్ న్యాయవాదిగా పేరున్న ఆయన ఏపీపీగా నియమితులవ్వడంపై బార్ అసోసియేషన్తో పాటు అంతా అభినందనలు తెలిపారు. ఆయనను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ గూనూరు పెదబాబు, మాజీ జెడ్పీటీసీ కనిశెట్టి మచ్చిరాజు, గవర కార్పొరేషన్ డైరక్టర్ బొడ్డేడ గంగాధర్ అభినందించారు. -
యూటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
అనకాపల్లి: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షులుగా వత్సవాయి శ్రీలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొంది చినబ్బాయ్, గౌరవాధ్యక్షునిగా పంపనబోయిన వెంకట్రావు, సహాధ్యక్షులుగా రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, కోశాధికారిగా జోగా రాజేష్, కార్యదర్శులుగా పొలిమేర చంద్రరావు, గుత్తుల సూర్యప్రకాశరావు, వైరాల రమేష్రావు, ఉప్పాడ రాము, పట్టా శ్రీరామచంద్రమూర్తి, జాలాది శాంతకుమారి, మురహరి సంతోష్, గేదెల శాంతి దేవి, చైతన్య, ఆడిట్ కమిటీ కన్వీనర్గా బయలుపూడి దేముడునాయుడు, సభ్యులుగా షేక్ సలీం, కాట్రపల్లి సత్తిబాబు, రొట్టెల లక్ష్మణరాజు, అనిమిరెడ్డి సాంబమూర్తి ఎన్నికయ్యారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు పదవిలో ఉంటుందని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుర్ల మురళీమోహన్ చెప్పారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. -
గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం
దేవరాపల్లి: రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బి.బాలునాయక్ తెలిపారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో దేవరాపల్లి మండల రైవాడ అథితి గృహానికి చేరుకొని స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5,459 కోట్లు కేటాయించిందని, కొన్ని పనులు జరుగుతుండగా మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు కొంతమేర అడ్డంకిగా మారినప్పటికీ ఇప్పటికే 128 పనులకు అనుమతులు సాధించామన్నారు. అకాల వర్షాలతో రోడ్ల నిర్మాణ పనులలో కొంత మేర జాప్యం జరిగిన మాట వాస్తమేనని, ఇకపై వేగవంతం చేసేందుకు విశాఖలో ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో సమీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పీఆర్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, పాడేరు ఈఈ కొండయ్య పడాల్, అరకు డీఈఈ రామం, మాడుగుల పీఆర్ డీఈఈ ఎ.శ్రీనివాసరావు, దేవరాపల్లి పీఆర్ ఏఈ పి.సుమతి తదితర్లు ఉన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి
దేవరాపల్లి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేవరాపల్లిలో ఉపాధి కూలీలతో కలిసి సోమవారం ఆయన నిరసన తెలిపారు. 2025 ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. 2025 చట్టం ప్రకారం వ్యవసాయ పనుల్లేని రోజుల్లో ఏడాదిలో 100 రోజులు ఎప్పుడైనా పనులు పొందే అవకాశం ఉండేదని, నేడు ఆ హక్కు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి గతంలో 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రం నిధులు కేటాయించేదన్నారు. ప్రస్తుత మార్పులతో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా మార్పులు చేశారన్నారు. తద్వారా రాష్ట్రంపై రూ. 2800 కోట్లు భార పడుతుందన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో బి.నాగేశ్వరరావు, శంకరరావు, మామిడి దేముడు, గణేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు జి.రాజు అన్నారు. స్థానిక నర్సింగరావుపేటలోని సీపీఎస్ కార్యాలయం మేడమైన సీపీఎస్ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు 10 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమలు నిర్వహించడం జరిగిందన్నారు. పీఎఫ్ఆర్డీఏ చట్టం 2013 నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా 2013కు ముందు నియామకం పొందిన ఉద్యోగులందరిలోపాటు, 2003 డీఎస్సీతోను పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీపీఎస్ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇ.కిషోర్, బి.రామాంజనేయులు, వి.మురళి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జనం మదిలో జగనన్న
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సంబరాలు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో వాడవాడలా పండగ వాతావరణం నెలకొంది. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా విస్తృత సేవా కార్యక్రమాలతో అభిమానం చాటుకున్నారు. అనేక చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు పండ్లు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఊరూరా కేక్ కటింగ్లు, సంబరాలు మిన్నంటాయి. బాణసంచా కాల్చి వేడుక జరుపుకొన్నారు.సాక్షి, అనకాపల్లి: అభిమానం ఉప్పొంగింది. సేవాభావం వెల్లివిరిసింది. అధినాయకుడి పుట్టిన రోజును అభిమానులు పండగలా చేసుకున్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సువర్ణ పాలనను ప్రజలు తలచుకున్నారు. జననేతా.. వర్థిల్లు వందేళ్లు.. అని ఆశీర్వదించారు. ● చోడవరం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం, గోవాడ శివాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోడవరంలో అమర్నాథ్ కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర యూత్ విభాగం సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య పాల్గొన్నారు. ● నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్, ఆయన తనయుడు విజయ్ అవినాష్తోపాటు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పెట్ల అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, స్టేట్ యూత్ విభాగం జాయింట్ సెక్రటరీ చింతకాయల వరుణ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం వృద్ధాశ్రమం, ఆర్సీఎం ఆస్పత్రి, ప్రభుత్వ ఆస్పత్రులలో వృద్ధులకు, రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు అందజేశారు. చుక్కపల్లిలో జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పాల్గొని కేక్ కట్ చేశారు. ● యలమంచిలి, అచ్యుతాపురంలలో పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కొండకర్ల ఆవ సమీపంలో ఇచ్ఛా ఫౌండేషన్లో ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ధర్మశ్రీ పాల్గొని.. దివ్యాంగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. మునగపాకలో పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కరణం ధర్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ పాల్గొన్నారు. ● పాయకరావుపేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు నిర్వహించిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో సమన్వయకర్త కంబాల జోగులు పాల్గొని కేక్ కట్ చేశారు. నక్కపల్లి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ నిర్వహించిన వేడుకల్లో కూడా కంబాల జోగులు పాల్గొని కేక్ కట్ చేశారు. అభయాంజనేయస్వామి ఆలయంలో జగన్మోహన్రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటవురట్ల మండంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్ఎస్ సీతారామరాజు, జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి కేక్ కట్ చేశారు. ● ఆనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కేక్ కట్ చేశారు. సత్యనారాయణపురం, కొత్తూరు, తుమ్మపాల గ్రామంలో, పట్టణంలోని 80వ వార్డులో, కశింకోట మండలంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. గవరపాలెంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు.ఉప్పొంగిన అభిమానం.. వెల్లివిరిసిన సేవాభావం జిల్లావ్యాప్తంగా ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు -
చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థాయికి దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలంలోని బోయిలకింతాడ చెరకు కాటా వద్ద కాటా పరిధిలోని గ్రామాల చెరకు రైతులు ఆదివారం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెరకు బండ్లు, రైతులతో కళకళలాడాల్సిన కాటా వద్ద రైతులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్ల మేర నిధులు కేటాయించి, రైతులకు, కార్మికులకు ఎన్నడూ కష్టాలు రానీయలేదని గుర్తు చేశారు. గతంలో సంక్రాంతి సీజన్లో రైతుల చేతిలో డబ్బులు ఉండేవని.. నేడు రెండు సీజన్లు గడుస్తున్నా పైసా విదిల్చే నాథుడు లేక రైతులు, కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.– పూర్తి వివరాలు 8లో -
ఒత్తిడిని జయించేందుకు ధ్యానమే ఆయుధం
ధ్యానంలో విద్యార్థులు, పెద్దలు నర్సీపట్నం: ఒత్తిడిని జయించేందుకు ధాన్యమే దివ్య ఔషాదమని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీమినీ స్టేడియంలో ఆదివారం హార్ట్పుల్నెస్ సంస్థ వారు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ధ్యాన తరగతులు ఏర్పాటుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హార్ట్పుల్నెస్ అవుట్రీచ్ రీజినల్ ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ మాచాలి మాట్లాడుతూ రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మావతి, జెడ్పీటీసీ సకల రమణమ్మ పాల్గొన్నారు. -
సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
డీసీసీబీ చైర్మన్ తాతారావు చోడవరం : సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పేర్కొన్నారు. సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ మహాజన సభ ఆదివారం వెంకన్నపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబరు 36 అమలుతో పాటు సహకార ఉద్యోగులకు ఆరోగ్య బీమా మూడు లక్షల రూపాయల పెంపుదలతో పాటు 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల అమలు గురించి, తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి జి. రమణ, ఉపాధ్యక్షుడు అప్పారావు, లోవరాజు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థాయికి దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. మండలంలోని బోయిలకింతాడ చెరకు కాటా వద్ద కాటా పరిధిలోని గ్రామాల చెరకు రైతులు ఆదివారం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా బోయిలకింతాడ గ్రామ ప్రధాన కూడలి నుంచి చెరకు కాటా వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కాటా ఎదుట ప్లకార్డులతో చెరకు రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ కూటమి పాలకుల తీరుతో రైతులు కంట తడి పెట్టే దయనీయ పరిస్థితి నెలకొందని, రైతులు ఉసురు తప్పకుండా తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు బండ్లు, రైతులతో కళకళలాడాల్సిన కాటా వద్ద నేడు రైతులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రూ. 90 కోట్ల మేర నిధులు ఫ్యాక్టరీకి కేటాయించి, ఐదేళ్ల పాలనలో రైతులకు, కార్మికులకు ఎన్నడూ కష్టాలు రానీయలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని ఆదుకుంటామని ఊరు వాడా ఊదరగొట్టిన ఈ ప్రాంత ఎంపీ, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ సమస్యలపై దృష్టి సారించక పోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ ప్రాంతానికి కొత్తగా ఫ్యాక్టరీలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఉన్న పరిశ్రమను కాపాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో సంక్రాంతి సీజన్లో రైతుల చేతిలో డబ్బులు ఉండేవని, నేడు రెండు సీజన్లు గడుస్తున్నా పైసా విదిల్చే నాధుడు లేక రైతులు, కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని అద్భుతంగా నడిపిస్తామని నమ్మబలికిన కూటమి నేతలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందాక రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఎండీ ద్వారా చెరకు సరఫరా చేయాలని కరపత్రాలు పంపిణీ చేయించిన ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడానికి ముఖం చాటేయడం అత్యంత దారుణమన్నారు. కూటమి నేతలు కేవలం ఓట్ల కోసమే రైతులకు మోసపూరిత హామీలు గుప్పించారని, ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా వారి తీరు ఉందని ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారం అక్టోబర్లో నిర్వహించాల్సిన సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభను ఇప్పటికీ నిర్వహించక పోవడం అన్యాయమన్నారు. ఫ్యాక్టరీ చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్, ఎండీ సైతం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఫ్యాక్టరీని ఎందుకు నడిపించలేక పోతున్నారో, రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ధ్వజమెత్తారు. మహాజన సభను తక్షణమే నిర్వహించి రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. తక్షణమే ఫ్యాక్టరీని తెరిపించి సుమారు రూ. 35 కోట్ల మేర నిధులు విడుదల చేస్తే తప్ప ఫ్యాక్టరీ మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం, పాలకులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు చెరకు రైతులు, కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే రైతుల పక్షాన నిలబడి ఉద్యమం చేపడతామని ముత్యాలనాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలం నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సీడీసీ డైరక్టర్ అన్నం రాము, వైఎస్సార్సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు అన్నం రామునాయుడు, పార్టీ నియోజకవర్గ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డా. వరదపురెడ్డి సింహాచలం నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు కెవి.రమణ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు గొర్రుపోటు సుధారాణి, ఉర్రూకుల అప్పారావు, సర్పంచ్లు చింతల సత్య వెంకటరమణ, రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు, దాడి జగన్, గూడెపు రాము, గంధం రామకృష్ణ, రెడ్డి సూర్యనారాయణ, టోకురి రామకృష్ణ, ఎంపీటీసీలు రొంగలి నారాయణమ్మ, పోతల వెంకటరావు, సీనియర్ నాయుకులు అన్నం రామునాయుడు, చల్లా నాయుడు, బండారు దేముడునాయుడు, భుగత వెంకటరమణ, రుత్తల రాంబాబు, గొర్లె రామ కొండలరావు, కాటిపాం పెదనాయుడు, దాసరి గోపి, బండారు ప్రసాద్, మజ్జి రాజు, రుత్తల రాంబాబు, వంటాకు శ్రీను, చింతు రాము, కిల్లాన వెంకటరమణ పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతపడే స్థాయికి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ తెరవక అల్లాడుతున్న కార్మికులు, రైతులు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం బోయిలకింతాడలో చెరకు కాటా ఎదుట రైతుల భారీ నిరసన -
పల్స్పోలియోపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
నాతవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియా కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాయని డీపీఎం నేతల ప్రశాంతి అన్నారు. మండలంలో ఆదివారం పల్స్ పోలియా కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. తాండవ జంక్షన్లో పోలియా చుక్కలు వేసే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు. సరుగుడు పంచాయతీలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, చెర్లోపాలెంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టరు రాజాన వీర సూర్యచంద్ర, పెద గొలుగొండపేటలో సర్పంచ్ వైఎస్సార్సీపీ మండల శాఖ పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడు మిరపల వెంకటరమణ చిన్నారులకు పోలియా చుక్కలు వేశారు. నాతవరం,గునుపూడి పీహెచ్సీ వైద్యాధికారులు నాగభూషణరావు, ప్రసన్నకుమార్, చక్రవర్తి పాల్గొన్నారు.వైద్యాశాఖ డీపీఎం నేతల ప్రశాంతి -
జూలో నల్ల హంసను దత్తత తీసుకొన్న చిన్నారి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. నగరానికి చెందిన అల్వార్దాస్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న నలం జెస్వికా అనే చిన్నారి తన పుట్టినరోజును పురస్కరించుకుని జూలోని ఒక నల్ల హంసను ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి జూను సందర్శించిన జెస్వికా, వన్యప్రాణుల పట్ల తనకున్న మక్కువను చాటుకుంది. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి. మంగమ్మ చిన్నారి జెస్వికాను ప్రత్యేకంగా అభినందించి, దత్తత ధ్రువీకరణ పత్రంతో పాటు అడాప్షన్ కిట్ను అందజేశారు. ఇంత చిన్న వయసులో వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావడం అభినందనీయమని ఆమె కొనియాడారు. జూలోని మూగజీవాల పోషణ, సంరక్షణ కోసం మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. -
సంక్రాంతికి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలి
● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుర్ల మురళీమోహన్ సమావేశంలో మాట్లాడుతున్న సుర్ల మురళీమోహన్ అనకాపల్లి: వచ్చే ఏడాది సంక్రాతికై న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ జూన్ 2023తో ముగిసిందని నేటివరకూ పీఆర్సీపై ప్రభుత్వ ఎటువంటి ప్రకటన చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుర్ల మురళీమోహన్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషనర్ని నియమించాలని, పీఆర్సీని అమలు చేసేలోగా మధ్యంతర భృతి (ఐఆర్) సంక్రాంతికి ప్రకటించాలని కోరారు. నేటి వరకూ మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా తక్షణమే ప్రకటించాలని ఆయన కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ బోధనకు సంబంధం లేని కార్యక్రమాలు పాఠశాలల్లో అమలు చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి, గౌరవాఽధ్యక్షుడు పంపాన వెంకటరావు, సహధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, జిల్లా కోశాధికారి జోగా రాజేష్, జిల్లా కార్యదర్శులు ప్రకాష్, రమేష్, శేషుకుమార్, చైతన్య, రాష్ట్ర కౌన్సిలర్లు ఎల్లయ్య బాబు, గేదెల శాంతిదేవి, మారిశెట్టి వెంకటప్పరావు పాల్గొన్నారు. -
అలరించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు
చీడికాడ: మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా చుక్కపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు అలరించాయి. పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. జగన్మోహన్రెడ్డి దార్శనికుడని, అందువల్లనే ఆయన జన్మదినం అంటే పల్లెల్లో మందస్తు సంక్రాంతి పండగేనన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. విజయనగరం,ఉమ్మడి విశాఖ,తూ.గో జిల్లాలకు చెందిన 27 ఎడ్ల బళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో చీడికాడ, దేవరాపల్లి వైఎసా్స్ర్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, బూరే బాబురావు, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సుంకర లక్ష్మి, యూత్ అధ్యక్షుడు గొల్లవిల్లి స్వామినాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పోటీల్లో మాడుగుల మండలం కె.జె.పురానికి చెందిన కొయిలాడ మోహన్ బండి ప్రథమస్థానంలో నిలిచి బహుమతి గెలుచుకుంది. రెండవ స్థానంలో శ్రీ పరదేసిమాంబ వావిలపాడు బండి నిలిచింది. విజేతలకు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సభ్యులు సుంకర లక్ష్మీ, బాయిశెట్టి వెంకటరమణ, సకలా రమణ,పెంటకోట ఈశ్వరరావు బహుమతులు ప్రదానం చేశారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి టౌన్: స్ధానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో మాగ్నేసియా కంపెనీ సీఎస్సార్ నిధులతో పలు కార్యక్రమం నిర్వహించారు. రూ.1.80 లక్షలతో నిర్మించే డి–అడిక్షన్ సెంటర్, పేషెంట్స్ వెయిటింగ్ హాల్, నూతన మార్చురీ భవన పనులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శంకుస్థాపన చేశారు. ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎంపీ లాడ్స్ నిధులతో పట్టణంలోని కీలక ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 80 సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్కార్పియో వాహనం, నాగార్జున సిమెంట్స్ వారు అందజేసిన 55 స్టాపర్ బోర్డులను ప్రారంభించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అనకాపల్లి బాలికల ప్రతిభ
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానం, బాపట్ల జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. ముగింపు కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ విజయ్కుమార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి, ఒలింపిక్ సంఘం కార్య నిర్వహణ కార్యదర్శి సునీల్కుమార్, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, కప్పులను అందజేసి అభినందించారు. జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజపుత్ర సమాజ్ అభ్యున్నతికి కృషి చేయాలి
రాజపుత్ర సమాజ్లోని ప్రముఖుల్ని సత్కరిస్తున్న దృశ్యం అచ్యుతాపురం: రాజపుత్ర సమాజ్లో ఉన్న పలువురు పేద విద్యార్థులను చదివించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అచ్యుతాపురం మండలంలోని కొండకర్లలో నిర్వహిహించిన అనకాపల్లి జిల్లా రాజ్పుత్ర సమాజ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. క్షత్రియుల్లో ఉన్న పేదవారి అభ్యున్నతికి రాజ్పుత్ర సమాజ్లో బాగా స్థిరపడిన వారు సహకరించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఎంఎల్సీ ఇందుకూరి రఘురాజు పిలుపునిచ్చారు. మాజీ ఎంఎల్సీ చైతన్య రాజు మాట్లాడుతూ క్షత్రియుల్లో పేద విద్యార్థులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మాట్లాడుతూ తాను కూడా క్షత్రియుల్లోని పేద విద్యార్థులను చదివించానని అన్నారు. మాజీ ఎమ్మెల్సీలు డీవీ సూర్యనారాయణ రాజు, పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన సంఘ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా క్షత్రియ విద్యార్థులకు సహకరించాలని కోరారు.అనకాపల్లి రాజ్పుత్ర సమాజ్ అధ్యక్షుడు దిలీప్కుమార్ను పలువుర్ని సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ క్షత్రియ ఫెడరేషన్ ఛైర్మన్ జీఎస్ రాజు, వైస్ చైర్మన్ కేకే రాజు, సీఎస్ఎన్ రాజు, రాధా సుందర సుబ్బరాజు, మంతెన లీలావతి, నరేంద్ర రాజు పాల్గొన్నారు. -
ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు ప్రోత్సాహం
మహారాణిపేట (విశాఖ): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఎలక్ట్రాన్ వైబ్–హ్యాక్ ఏపీ హ్యాకథాన్’ ఫలితాలను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ప్రకటించారు. విశాఖలోని సీవోఈఈటీ భవనంలో జరిగిన ఈ పోటీల్లో పలు స్టార్టప్ సంస్థలు తమ ప్రతిభను చాటాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, ఏపీట్రాన్స్కో జేఎండీ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్తో కలిసి ఆయన విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. పృథ్వీతేజ్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యమన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను ముందస్తుగా గుర్తించడం, హైటెన్షన్ లైన్లలో ఇన్సులేటర్ లోపాలను కనిపెట్టడం వంటి అంశాలపై స్టార్టప్లు వినూత్న పరిష్కారాలను చూపాయన్నారు. ప్రతిభావంతులైన యువతకు పైలట్ ప్రాజెక్టులు కేటాయించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ -
పల్స్ పోలియో విజయవంతం
● జిల్లాలో 96.72 శాతం నమోదు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి/నర్సీపట్నం: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 96.72 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి తెలిపారు. ‘మన బిడ్డల భవిష్యత్తు–మన బాధ్యత’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశామని తెలిపారు. జిల్లాలో 1,446 కేంద్రాలలో 1,97,810 మంది చిన్నారులకు గాను 1,91,319మందికి డ్రాప్స్ వేశారు. జిల్లా రూరల్ ప్రాంతాల్లో 98.07 శాతం, అర్బన్ ఏరియాల్లూ 94.59 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం పోలియో డ్రాప్స్ వేసుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వచ్చి వైద్య ఆరోగ్య సిబ్బంది పోలియో డ్రాప్స్ వేస్తారని చెప్పారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరజ్యోతి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్ ఎన్.వి.సుధాశారద పాల్గొన్నారు. -
ఉద్యమ కమిటీలో చీలిక!
● రాజయ్యపేటలో టెంట్ల తొలగింపు ● ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ లేకుండా తొలగింపు తగదని ఒక వర్గం అసంతృప్తి గ్రామంలో సమావేశమైన మత్స్యకారులురాజయ్యపేటలో నిరాహార దీక్ష కోసం వేసిన టెంట్లు తొలగిస్తున్న దృశ్యంనక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ దాదాపు 70 రోజులపాటు మత్స్యకారులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం ముగింపు పలికింది. ఆదివారం రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి నూకతాత ఆలయం వద్ద మత్స్యకారులు ధర్నా కోసం వేసిన టెంట్లను మత్స్యకారులతో తొలగింపజేశారు. టెంట్ల తొలగింపుపై మత్స్యకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైన హామీ లేకుండా టెంట్లు తొలగించడాన్ని కొంతమంది తప్పు పడుతూ ఆదివారం రాత్రి పోలీసు సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తామని హోం మంత్రి అనిత ఇచ్చిన హామీతో మత్స్యకారులు నెల రోజుల క్రితం తాత్కాలికంగా దీక్షను విరమించిన విషయం తెలిసిందే. శనివారం తాళ్లపాలెం వచ్చిన సీఎం చంద్రబాబు వద్దకు మత్స్యకారులను తీసుకెళ్లారు. ఆయన కేవలం రెండు నిమిషాలు మాట్లాడి ‘మీ గ్రామ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని, ఇంకా ఏమైనా సమస్యలుంటే హోం మంత్రి, కలెక్టర్తో మాట్లాడండి’ అని ముగించేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మత్స్యకారులు చేసేదేమీ లేక మెత్తబడ్డారు. ఇదే అవకాశంగా భావించిన అధికారులు ఆదివారం గ్రామంలోకి వెళ్లి నూకతాత ఆలయం వద్ద నిరాహార దీక్ష కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. గ్రామస్తులతో పోలీసుల సమావేశం తొలుత డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని సీఎం తెలియజేసినందున టెంట్లు స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయమని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీన్పార్క్ మాత్రమే ఏర్పాటు చేయాలని రాతపూర్వకంగా రాసివ్వాలని కొందరు మత్స్యకారులు కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు వెళ్లి కోరాలని కొంతమంది మత్స్యకారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత టెంట్లు తొలగించాలని సమావేశానికి వచ్చిన కొంతమంది మత్స్యకారులు సూచించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుని టెంట్లు తొలగించాల్సిందేనని, మీరే స్వయంగా టెంట్లు తొలగిస్తే బాగుంటుందని, తాము గనుక తొలగిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. కమిటీగా ఏర్పడిన వారిలో కొంతమంది టెంట్లు తీసేందుకు సిద్ధపడగా కొంతమంది సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ లేకుండా టెంట్లు తీయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద ఉద్యమ కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదని, కేవలం ఉద్యమాన్ని నీరు గార్చడం కోసమే రాజయ్యపేటలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. -
గాయపడిన హెచ్ఎం ఝాన్సీ మృతి
పాయకరావుపేట: బస్సెక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కిందపడి గాయపడిన ఎస్.నర్సాపురం జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం ఎం.ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ జి.అప్పన్న, ఎంఈవో రమేష్బాబు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. హెచ్ఎం ఎం.ఝాన్సీ (62) 20 వ తేదీ శనివారం పాఠశాలలో విధులు ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు పాయకరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి అనకాపల్లి వెళ్లడానికి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. బస్ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో ఆమె పుట్పాత్ నుంచి కాలు ఇరుక్కుపోయి కిందపడిపోయారు. వెంటనే ఆమెను ఉపాధ్యాయులు తుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి అక్కడ నుంచి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం శనివారం రాత్రి 2.30 గంటలకు మృతి చెందారు.హెచ్ఎం ఎం.ఝాన్సీ (ఫైల్), ఝాన్సీమృతదేహం -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రామచంద్రపురం సమీపంలో పూర్వ విద్యార్దులు కలుసుకున్న దృశ్యం మాడుగుల రూరల్: ముఫ్ఫై తొమ్మిదేళ్ల క్రితం మాడుగుల జిల్లా పరిషత్ హైస్కూలులో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు మాడుగుల సమీపంలో గల రామచంద్రపురం వద్ద ఆదివారం కలుసుకున్నారు. 1985–86 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా ఒక చోట ఆత్మీయంగా కలుసుకొంటున్నారు. అప్పట్లో 85 మంది విద్యార్దినీ, విద్యార్దులు చదువుకోనగా, ఆదివారం 40 మంది ఒకే చోట కలుసుకోని తమ చిన్న నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. వీరి సమావేశానికి కృషి చేసిన వారిలో వడ్దాది శాంతేశ్వరావు, దంగేటి ప్రసాదు, కాళ్ల బాలకృష్ట, కోడూరు వెంకటరమణ, ద్వారపూడి కొండాజీ, బి.వి.జగన్నాథరావు ఉన్నారు. -
తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా వెంకటరావు
అనకాపల్లి జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం అనకాపల్లి: అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా గండేపల్లి వెంకటరావు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక రింగ్రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలిశెట్టి నూకేశ్వరరావు, కోశాధికారిగా రాజపూడి కోటేశ్వరావు, మరో 20 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గండేపల్లి వెంకటరావు చెప్పారు. అంతకుముందు సంఘం జిల్లా వనభోజన కార్యక్రమం జరిగింది. -
రాష్ట్ర స్థాయి సైన్సు ఫెయిర్కు ఎంపిక
మాడుగుల రూరల్: రాష్ట్ర స్థాయి సెన్సు ఫెయిర్కు మండలంలో జి.అగ్రహారం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం బి. ఉమాశంకర్ శనివారం తెలిపారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 19 వ తేదీ శుక్రవారం చోడవరం హైస్కూల్లో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు ప్రయోగాలు అబ్బురపరిచాయి. గైడ్ ఉపాధ్యాయుడు దేవవర్మ సారథ్యంలో పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఆర్లె గాయత్రి, నందారపు లక్ష్మీ ప్రసన్నలు, మ్యాథమెటికల్ మోడలింగ్లో టవర్ ఆఫ్ హోనోయ్ (బ్రహ్మస్తంభం, మరియు మీ పుట్టిన తేదీ చెపుతా అనే అంశాలపై తయారు చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఆయా విద్యార్థులను పాఠశాల వర్గాలు అభినందించారు. కె.కోటపాడు: చోడవరంలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో మండలంలో ఎ.కోడూరు హైస్కూల్కు చెందిన విద్యార్థులు సుస్ధిర వ్యవసాయం కేటగిరిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయా విద్యార్థినులు ఈర్లె నవ్య, భార్గవిలను నిర్వాహకులు అభినందించి షీల్డ్లతో పాటు సర్టిఫికెట్లను అందించారు. ఈ ప్రదర్శన రాష్ట్ర స్ధాయికి ఎంపిక కావడంతో ఈ నెల విజయవాడలో 23, 24 తేదీల్లో జరిగే పోటీల్లో విద్యార్థులు ప్రదర్శిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఎంఈవోలు సత్యనారాయణ, డీవీడీ ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. -
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కొత్తపెంట
దేవరాపల్లి: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కొత్తపెంట గ్రామం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారింది. పంచాయతీ భవనం లేక గతంలో పాత సామాజిక భవనంలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితి నుంచి...నేడు కార్పొరేట్ భవనాలను తలపించేలా ఒకే చోట గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మించడంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో సుమారు రూ. 4.50 కోట్లతో అభివృద్ధి పనులు, రూ. 14 కోట్ల మేర సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులకు అందించారు. వెరసి గ్రామంలో నలువైపులా తారురోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో గ్రామం సర్వాంగ సుందరంగ దర్శనమిస్తోంది. మండలానికి శివారున ఉన్న కొత్తపెంట గ్రామస్తులు ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రం దేవరాపల్లి వెళ్లి అష్టకష్టాలు పడేవారు. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామం నడిబొడ్డున రూ. 40 లక్షలతో అధునాతన హంగులతో గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించడంతో ప్రజల చెంతనే అన్ని సేవలు అందుతున్నాయి. గతంలో అనారోగ్యం వస్తే వైద్యం కోసం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రూ.20 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నిర్మించడంతో గ్రామంలోనే నిత్యం వైద్య సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లి వెళ్లి నానా అవస్థలు పడేవారు. ఊరిలోనే రూ.20 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించి తద్వారా ఎరువులు, విత్తనాలు అందజేసి రైతుల కష్టాలు తీర్చి రైతు పక్షపాతిగా జగన్మోహన్రెడ్డి ముద్ర వేసుకున్నారు. నాడు–నేడులో రూ.19.35 లక్షలతో స్థానిక ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఆధునికీకరించి మౌలిక సదుపాయల కల్పించి, మరో రూ. 11.25 లక్షలతో ప్రహారి నిర్మించారు. జల్జీవన్ మిషన్ స్కీమ్లో రూ. 1.07 కోట్లతో కొత్తపెంట, కొత్తూరులో రెండు మంచినీటి ట్యాంక్లు నిర్మించి, ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసి తాగు నీటి సమస్య నుంచి విముక్తి కల్పించారు. చేపట్టిన మరిన్ని అభివృద్ధి పనులు సుమారు రూ. 74 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 10 లక్షలతో సీసీ డ్రైనేజీలు, కొత్తపెంట నుంచి ఎన్.జి. నగరానికి రూ. 1.23 కోట్లతో తారు రోడ్డు, రూ. 36 లక్షల వ్యయంతో రెండు అంగన్వాడీ కేంద్రాలు, రూ. 20 లక్షలతో రెండు సామాజిక భవనాలు నిర్మించారు. రూ. 5 లక్షలతో మహిళా మండలి భవనం, రూ. 4 లక్షలతో శ్మశానంలో దహన వాటిక నిర్మించారు. కేవలం మూడు వేల జనాభా కలిగి, కుగ్రామాన్ని తలపించే కొత్తపెంట అప్పటి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సహాయ సహకారాలతో ఇప్పుడు పట్నాన్ని తలపిస్తుదంటే అతిశయోక్తి లేదు. అన్ని సౌకర్యాలు, సేవలు సమకూరాయి మా గ్రామం మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉండంతో గతంలో చిన్నపాటి ప్రభుత్వ సేవల కోసం దేవరాపల్లి వెళ్లి నానా అవస్థలు పడేవారం. మండల కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజంతా పనులు మానుకోవాల్సి వచ్చేది. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడంతో గ్రామంలోనే ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయి. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు దేవరాపల్లి వెళ్లి రోజంతా మండుటెండలో నరకయాతన పడేవారు. జగనన్న దయతో గ్రామ పొలిమేర దాటే పరిస్థితి లేకుండా ప్రస్తుతం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. ఆరోగ్యం బాగోకపోతే గతంలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందేవారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్లో నిత్యం 20 నుంచి 30 మందికి ఆస్పత్రి మాదిరిగా వైద్య సేవలు అందిస్తున్నారు. అప్పటి సీఎం జగన్, అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవ చూపించి సుమారు రూ.4.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. గ్రామస్తులకు రూ. 14 కోట్ల మేర సంక్షేమ పథకాల రూపంలో అందించారు. సర్పంచ్గా నా హయాంలో గ్రామం ప్రగతి బాట పట్టడం ఆనందంగా ఉంది. నాలుగైదు దశాబ్దాలలో జరగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేసి చూపించిన మాజీ సీఎం జగన్కు, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు తామంతా రుణపడి ఉంటాం. –రొంగలి వెంకటరావు, సర్పంచ్, కొత్తపెంట, దేవరాపల్లి మండలంఊరు మారింది.. జగనన్న పాలనలో మారిన కొత్తపెంట రూపురేఖలు ఒకే చోట సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు నలువైపులా తారురోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్న కొత్తపెంట గత ఐదేళ్లలో రూ.4.50 కోట్లతో అభివృద్ధి పనులు గ్రామస్తులకు రూ. 14 కోట్ల మేర సంక్షేమ లబ్ధి -
పేద కుటుంబానికి ఆసరా..
ఈమెది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమాని మునగపాక మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన ముప్పిడి కొండబాబు,లక్ష్మి కుటుంబానికి పెద్ద ఎత్తున మేలు చేకూరింది. కొండబాబు స్థానికంగా పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి స్థాని కంగా ఆయాగా సేవలందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కుటుంబానికి పెద్దమొత్తంలో లబ్ధి చేకూరింది. కొండబాబుకు వచ్చే అరకొర వేతనంతో పాటు జగన్మోహన్రెడ్డి హయాంలో కుటుంబానికి వచ్చిన లబ్ధి ఆసరాగా నిలిచింది. అర్హులందరికీ పక్కా ఇళ్ల పథకంలో భాగంగా లక్ష్మికి పట్టా అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహకారం రూ.1.80 లక్షలకు మరికొంత సొమ్మును పోగుచేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ.45 వేల మేర రుణం మాఫీ అయింది . దీనికి తోడు వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.74వేల మేర లబ్ధిపొందారు. లక్ష్మి కుమారుడు కనకరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తుండడంతో వాహన మిత్ర పథకం ద్వారా రూ.ఏడాదికి రూ.10వేల చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ.40వేల మేర సాయం పొందాడు. రూ.10వేలతో చేదోడు పథకం కింద చిరు వ్యాపారం చేసింది. కనకరాజు కుమార్తెకు ఏటా అమ్మఒడి పథకం ద్వారా రూ.13వేల చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ.52వేల సాయం అందింది. జగన్మోహన్రెడ్డి సీఎం కాకముందు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారమని తరువాత పలు పథకాల రూపంలో లబ్ధి పొంది ఆనందంగా గడిపామని లక్ష్మి తెలిపారు.పేదల పక్షాన జగన్మోహన్రెడ్డి నిలుస్తూ ఎప్పుడు ఏ పథకం వస్తుందో ముందుగానే తెలిసేదని చెప్పారు.జగన్మోహన్రెడ్డి హయాంలో మా కుటుంబానికి మేలు చేకూరిందని ఆమె తెలిపారు.ముప్పిడి లక్ష్మి -
మా బాబుకి పునర్జన్మ ఇచ్చిన దేవుడు జగనన్న
మాది నర్సీపట్నం టౌన్లో శివపురం కాలనీ. మా బాబు పేరు కర్రి మోహిత్. వయస్సు ఐదు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. పుట్టిన ఏడు నెలలకే ట్రాకియోస్టమీ అనే శ్వాస కోశ వ్యాధితో బాధపడేవాడు. గొంతులో శ్వాసకు శ్లేష్మం అడ్డంకి ఉన్నప్పుడు.. వెంటిలేటర్ ద్వారా శ్వాసనాళం నుంచి దానిని తొలగించేవారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. మాట్లాడేవాడు కాదు..పాలు తాగేవాడు కాదు.చనిపోయే పరిస్థితికి వచ్చేశాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. తెలిసిన బంధువుల ద్వారా విశాఖ రెయిన్బో ఆస్పత్రిలో రెండేళ్ల పాటు వైద్యం చేయించాం. తరువాత అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి విజయవాడ బిజామ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అప్పటికే చాలా మంది వద్ద అప్పులు చేసి వైద్యం చేయించాం. ఎవరూ మాకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక మా బాబును ఇంటికి తీసుకొచ్చాం. అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ద్వారా సీఎం జగనన్నకు మా పరిస్థితిని చెప్పుకున్నాం. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5.8 లక్షలు అందజేశారు. విజయవాడలో బిజామ్స్ హాస్పిటల్లో గొంతులో శ్వాసనాళంలోకి (ట్రాకియా) నేరుగా గాలిని పంపించడానికి ఆపరేషన్ చేసి రంధ్రం ద్వారా ట్రాకియోస్టమీ ట్యూబ్ (గొట్టం) ఆపరేషన్ చేశారు. ఇప్పుడు వ్యాధి పూర్తిగా నయమైంది. స్కూల్లో కూడా జాయిన్ చేశాం. మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. మా కుమారుడికి పునర్జన్మను ఇచ్చిన దేవుడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. – కర్రి శంకరాచారి, సంయుక్త, నర్సీపట్నంఆపరేషన్ జరిగిన ప్రాంతాన్ని చూపుతున్న మోహిత్ తల్లిదండ్రులు సంయుక్త, శంకరాచారి -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద ఫ్లిప్కార్ట్ స్టోర్ ఆఫీసు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి శనివారం మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇత్తంశెట్టి సూర్యనారాయణ(46) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొంది, కోలుకోవడంతో వారం రోజుల క్రితం ఇంటికి పంపించారు.మళ్లీ అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సూర్యనారాయణ మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శనివారం సాయంత్రం మృతుని స్వగ్రామం పోతురెడ్డిపాలెంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.ఇదే ప్రమాదంలో గాయపడిన సూర్యనారాయణ భార్య సత్యవతి కోలుకున్నారు. -
దార్శనిక నేత సంక్షేమ ప్రదాత
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నవరత్నాలు చేరని కుటుంబం లేదు... సంక్షేమ పథకాల ఫలితం పొందని పేదవాళ్లూ లేరు... మ్యానిఫెస్టోలో నెరవేరని హామీ కూడా లేదు... పథకాల అమలులో మాట తప్పిందీ లేదు... ఎటువంటి కష్టకాలం వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా సంక్షేమ రథాన్ని దిగ్విజయంగా నడిపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జనం గుండెల నిండా ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనరంజక పాలనందించింది. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి బాటలు వేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన 1,341 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజాసేవలకు క్షేత్రస్థాయిలో వేదికగా మారాయి. 10,660 మంది ఉద్యోగులు, మరో 21 వేల మంది వలంటీర్లతో గడప వద్దకే పాలనను అందించారు. నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికీ నయాపైసా అవినీతికి ఆస్కారం లేకుండా చేర్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో జిల్లా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయింది. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించి, డిజిటల్ విద్యకు నాంది పలికారు. ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చారు. దేశానికే ఆదర్శంగా పాలన అందించారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాలనలో లబ్ధిపొందిన వారు తమ అభిమాన నాయకుడితో ఉన్న అనుబంధాన్ని, పొందిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. – సాక్షి, అనకాపల్లి ● జననేత జనరంజక పాలన దేశానికే ఆదర్శం ● విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ● నాడు–నేడు ద్వారా పాఠశాలలకు కొత్తరూపు ● సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు ● ఆరోగ్యశ్రీ ద్వారా పేదోడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం -
మూడు టన్నుల ధాన్యం చోరీ
దేవరాపల్లి: మండలంలో అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి అపహరించారు. ఎం.అలమండ, ఎన్.జి. నగరం గ్రామాలకు చెందిన రైతులు నూర్చి విక్రయించేందుకు తమ కల్లాల్లో సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను చోరీ చేశారు. సుమారు రూ. 3 లక్షల విలువైన 3 టన్నుల ధాన్యం చోరీకి గురైనట్టు బాధిత రైతుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. ఎం.అలమండ గ్రామానికి చెందిన పీలా బలరాం (16 బస్తాలు), పొలిపిరెడ్డి రమణ(10 బస్తాలు), గొల్లు నరసమ్మ(ఆరు బస్తాలు), రొంగలి సన్నిబాబు(నాలుగు బస్తాలు), ఎల్లపు ఈశ్వరరావు(మూడు బస్తాలు), ఎన్.జి. నగరానికి చెందిన రొంగలి వెంకటరావు(15 బస్తాలు), ఆదిరెడ్డి మౌళి (12 బస్తాలు), బర్ల త్రిమూర్తులు(3 బస్తాలు) ఽతదితర రైతులు తమ ధాన్యం బస్తాలు చోరీకి గురైనట్లు తెలిపారు. ప్రతీ ఏటా మాదిరిగా నూర్చిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి కల్లాల్లోనే టార్పాలిన్లతో కప్పి ఉంచామన్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న కల్లాల్లో ధాన్యం బస్తాలను అపహరించుకుపోయారని తెలిపారు. అర్ధరాత్రి వరకు తామంతా కల్లాల్లోనే ఉన్నామని, శనివారం తెల్లవారు జామున వచ్చి చూడగా కొన్ని బస్తాలు మాయమయ్యాని రైతులు వాపోయా రు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట దొంగల పాలైందని, గతంలో ఎన్న డూ ఇలాంటి దొంగతనాలు జరగలేదని అన్నదాతలు తెలిపారు. కల్లాల్లో ఉంచిన బస్తాలు అపహరణ -
జగనన్న హయాంలో రైతులకు ఎంతో మేలు
ఈ చిత్రంలో రైతు పేరు పయిల నూకన్న నాయుడు. నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట చెందిన ఈయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. జగనన్న రైతు భరోసా కింద ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందింది. ప్రతిఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. అంతకు ముందు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన నూకన్న నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో అప్పుచేయకుండా వ్యవసాయం చేశాడు. గతంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేసేవాడు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో స్వగ్రామంలో అందజేయడంతో పీఏసీఎస్లు, వ్యవసాయశాఖ కార్యాలయా ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోయింది. ధాన్యం కొనుగోలు కూడా ప్రభుత్వమే చేపట్టింది. అన్ని విధాల రైతులకు ప్రయోజనం కలిగింది. దీంతో ఐదేళ్లపాటు ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోగలి గాడు. ఇతర పథకాల వల్ల కూడా నూకన్న నాయు డు కుటుంబానికి లబ్ధి చేకూరింది. మనవడికి అమ్మఒడి పథకం, డ్వాక్రా రుణ మాఫీ, ఇంటి స్థలం, వైఎస్సార్ చేయూత వంటి పథకాల వల్ల సుమారు మూడు లక్షల మేర లబ్ధిపొందాడు. -
నాడు విద్యార్థినిగా... నేడు ఉపాధ్యాయినిగా..
మునగపాక : ఎక్కడయితే పదో తరగతి వరకు చదువుకున్నారో అదే స్కూల్లో జరిగిన శిక్షణకు ఉపాధ్యాయురాలిగా హాజరవడం అరుదైన విషయం. అలాంటి అరుదైన సంఘటన మునగపాకలో శనివారం చోటు చేసుకుంది. మునగపాకకు చెందిన బుద్ద జగదాంబ మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో 1986–87లో పదో తరగతి చదువుకున్నారు. ఆ తరువాత ఉన్నత చదువులు పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా పలు ప్రాంతాల్లో పనిచేస్తూ వచ్చారు. కొంత కాలంగా మునగపాక మండలం పాటిపల్లి మోడల్ స్కూల్లో తెలుగు టీచర్గా సేవలందిస్తున్నారు. శనివారం మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ శిక్షణకు జగదాంబ హాజరయ్యారు. నాడు పదో తరగతి వరకు చదువుకున్న పాఠశాలలోనే తాను ఉపాధ్యాయురాలిగా శిక్షణకు హాజరు కావడం సంతోషంగా ఉందని జగదాంబ తెలిపారు. -
మచ్చలేని నేత వాజ్పేయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తున్న కూటమి నాయకులు అనకాపల్లి టౌన్: నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన మచ్చలేని నేత మాజీ ప్రధాని వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. స్థానిక జలగల మదుం జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. మాధవ్ మాట్లాడుతూ విలువలకు అద్దం పట్టే రాజకీయాలు చేసిన నాయకుడు వాజ్పేయి అన్నారు. టీడీపీ జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు విజయ్కుమార్, బండారు , కొణతాల రామకృష్ణ, కేఏఎస్ఎన్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. ఏబీ వాజ్పేయి విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేరు లేకపోవడంతో జనసేన శ్రేణులు కినుక వహించారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజుకు ఢోకా లేదు..
ఈమె పుల్లేటికుర్తి అప్పలరత్నం. ఈమెది గొలుగొండ మండలం, గొలుగొండ గ్రామం. తండ్రి సత్తిబాబు టైలర్, తల్లి గృహిణి. తండ్రి సంపాదన మీదే కుటుంబ జీవనం సాగేది. 2019 నుంచి కాకినాడ కై ట్ కాలేజీలో మూడేళ్ల పాటు డిప్లమో చదింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.35 వేలు చొప్పున మూడేళ్లకు ప్రభుత్వం నుంచి రూ.1.05 లక్షలు ఫీజురీయింబర్మెంట్ కింద కాలేజీకి జమఅయింది. దీంతో మూడేళ్లు పైసా ఖర్చు లేకుండా డిప్లమో పూర్తి చేసింది. 2023లో రాజమండ్రి గైట్ కాలేజీ బీటెక్లో చేరింది. ఏడాదికి రూ.58 వేలు కాలేజీకి చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రెండు నెలల క్రితం కేవలం రూ.14 వేలు మాత్రమే ఇచ్చింది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్కు ఇబ్బంది పడలేదు. -
నాలుగు ఫ్లేవర్స్లో తాండ్ర తయారీ
● చెరకు రైతులకు తీయని వార్త..ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అంటారు చెరకు తాండ్రను రుచి చూసినవారు.. తాండ్ర అమ్మకాలు ఊపందుకుంటే సుగర్ ఫ్యాక్టరీలు మూతబడి డీలాపడ్డ చెరకు రైతులు తీపిని చవి చూస్తారు.. ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోగం అందరికీ మంచి విందును అందించనుంది. మామిడి తాండ్ర తరహాలో చెరకు తాండ్రను త్వరలో అందుబాటులోకి తెస్తామని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాక్షి, అనకాపల్లి: అధిక పెట్టుబడులతో ఆశించిన దిగుబడి లేక చెరకు రైతులు నష్టాల బాట పడుతున్నారు. వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితుల కారణంగా పంట నష్టపోయి లాభాలార్జించలేని పరిస్థితిలో ప్రస్తుతం వారున్నారు. జిల్లాలో మిగిలిన ఏకై క గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో కూడా క్రషింగ్ నిలిచిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో రైతులకు ఆపద్భాంధవుడిగా నిలిచే అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్లోని చెరకు పరిశోధన స్థానం తీపి కబురు చెప్పింది. ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం విద్యార్థుల బృందం చెరకు రసంతో తాండ్రను తయారు చేశారు. ఇది ఎంతో ఆరోగ్యకరమే కాక వినియోగదారులకు అతి తక్కువ ధరకే లభిస్తుంది. 250 గ్రాముల తాండ్ర తయారీకి రూ.150 నుంచి రూ.200 ఖర్చవుతోంది. ఇప్పటికే ఆర్గానిక్ బెల్లం ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఆర్ఏఆర్ఎస్.. అతి త్వరలో చెరకు తాండ్రను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఎల్లప్పుడూ లభించే చెరకుతో తాండ్ర.. తాండ్ర అనే సరికి అందరికీ టక్కున గుర్తొచ్చేది మామిడి తాండ్ర. దీనిని తయారు చేయడానికి కావాల్సిన మామిడి కాయలు వేసవి సమయంలోనే అందుబాటులో ఉంటాయి. అన్ సీజన్లో మామిడి తాండ్ర కొనాలంటే కొన్నిసార్లు అధిక మొత్తంలో ధర చెల్లించాల్సి ఉంటుంది. సహజసిద్ధమైన మామిడి తాండ్ర సామాన్యులకు అందుబాటులో ఒక కిలో రూ.400 వరకు వెవెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే చెరకు రసంతో.. తక్కువ ధరకే తాండ్రను పాలిటెక్నిక్ విద్యార్థులు తయారు చేశారు. దీంతో ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధర కల్పించినట్లుగా.. మరో వైపు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన, ఆరోగ్యకరమైన చెరకు తాండ్రను అందించారు. రసాయనాలు కలపకుండా.. నాలుగు ఫ్లేవర్స్లో చెరకు తాండ్రను తయారు చేస్తున్నారు. నిమ్మ, యాలకలు, అల్లం, పొడి చెరకు తాండ్రలు ఎంతో రుచికరంగా ఉంటాయని చెబుతున్నారు. లీటర్ చెరకు రసాన్ని తీసుకుని శుద్ధి చేసిన తరువాత 20–30 నిమిషాల వరకు మరిగించాలి. తరువాత సరిపడా మోతాదులో పెక్టిన్ను కలిపి.. 3 నుంచి 4 నిమిషాలపాటు మరిగించాలి. మరిగిన మిశ్రమాన్ని వెడల్పాటి నెయ్యి రాసిన పళ్లెంలో పోసి చల్లార్చాలి. ఐదున్నర నిమిషాల తరువాత ఆ మిశ్రమాన్ని సమాంతరంగా ఒకదాని మీద వేరొకటి వేసి పొరలుగా వేయాలి. చివరిగా ఈ పళ్లెంలో ఉన్న మిశ్రమాన్ని 2–3 గంటలపాటు చల్లారిన తరువాత కావాల్సిన పరిమాణంలో కత్తిరించుకుని ప్యాక్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు కలపకుండా తాండ్ర తయారు చేస్తారు. విద్యార్థులకు అభినందనలు గిట్టుబాటు ధర లేక సుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో దిగాలుగా ఉండే చెరకు రైతుకు మేలు చేకూరేలా.. వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చెరకు తాండ్రను తయారు చేసిన బృందానికి సర్వాత్రా ప్రశంసలు అందుతున్నాయి. డాక్టర్ బి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ టీచింగ్ అసోసియేట్లు ముజామ్మిల్ఖాన్, ఇ.వసంత సాయికుమార్ నేతృత్వంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఎస్.దీప్తి గౌతమ్, దేవి, ఆర్.భవ్యశ్రీ, ఎ.దుర్గాసిరి, కె.శ్రావణి, పి.ధనలక్ష్మి, జి.రమ్య బృందాన్ని అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త జగన్నాథరావు అభినందించారు. ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోగం సక్సెస్ కొత్త రుచులు కోరే వారికి ఉత్సాహం.. చెరకు రైతులకు ప్రోత్సాహం తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో.. -
ముగిసిన విజన్–2 శిక్షణ
సబ్బవరం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు తమ జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమం విజన్–2 శుక్రవారంతో ముగిసింది. స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయంలో నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా ప్రాజక్ట్ మేనేజర్ పి.వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయం సహయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల ద్వారా సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆర్థిక, ఆర్థికేతర, సహకార సంఘాల చట్టాలపై, నాయకత్వంపై చర్చించినట్లు తెలిపారు. శిక్షణ ఆనంతరం సబ్బవరం మండలంలోని అన్ని పంచాయతీల్లో రెండు రోజుల పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో జీవన ప్రమాణాల మెరుగుదలకు సీసీల ద్వారా ఇంటర్ ఫేస్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సబ్బవరం, యలమంచిలి, గొలుగొండ, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, చోడవరం మండలాల ఏపీఎంలు, సీసీలు, సబ్బవరం మండలంలోని గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
ఖరగ్పూర్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గౌరవ్దాస్ మహాపాత్ర రోలుగుంట: గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను వీఎంఆర్డీఏ రూపొందిస్తున్నట్టు ఖరగ్పూర్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌరవ్దాసు మహాపాత్రో తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో ఏవో లక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ్దాస్ మహాపాత్రో పంచాయతీల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకుని నివేదికలు రూపొందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నివేదికలపై ప్రజలతో చర్చించనున్నట్టు చెప్పారు. వాటిలో అత్యవసర సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూిపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
పార్సిళ్ల సేవల ద్వారా రూ.2.08 కోట్ల ఆదాయం
మాట్లాడుతున్న జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి ప్రవీణ అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) పార్సిల్ డోర్ డెలివరీ సేవల ద్వారా జిల్లాలో 2024–25 సంవత్సరానికి రూ.2.08 కోట్ల ఆదాయం లభించినట్టు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి వి.ప్రవీణ తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కార్యాలయం వద్ద 50 కిలోల డోర్డెలివరీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు పార్సిల్ బుకింగ్తో పాటు డోర్ డెలివరీ చార్జీలు చెల్లించినట్టయితే పార్సిల్ కౌంటర్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం పొందవచ్చన్నారు. పార్సిల్ సర్వీస్ ద్వారా 2022–23 ఏడాదిలో రూ.1.59 కోట్లు, 2023–24లో రూ.2.05 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు 63024 46142, 73829 18492, 99592 25595 అనే నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. -
పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు
బీచ్రోడ్డు: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, అలాగే ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ అదాలత్లను నిర్వహిస్తున్నామని, డీడీవోల సమక్షంలో పెన్షనర్ల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించామని, ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరిన పత్రాలను త్వరగా పరిశీలించి బెనిఫిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ పేజీని ప్రారంభించి, దీని ద్వారా పెన్షన్ దారులు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్. మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ ప్రయోజనాల మంజూరులో కొంత జాప్యం జరిగేదని, అయితే డిజిటలైజేషన్ వల్ల ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్ దారులు ఈ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
చెరకు రైతుకు మేలు
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఇప్పటి వరకు ఈ నూతన ప్రయోగాన్ని చేశాం. చెరకు రైతుకు మేలు చేకూర్చేలా మా అధ్యాపకుల సహకారంతో ఈ ప్రయోగాన్ని అతి తక్కువ ఖర్చుతోనే చేశాం. త్వరలో ఆర్ఏఆర్ఎస్లో చెరకు తాండ్రను అందుబాటులోకి తీసుకొచ్చి ఆన్లైన్ ఆర్డర్ల మేరకు ఎగుమతులు కూడా ప్రారంభమవుతాయి. – భవ్యశ్రీ, తృతీయ సంవత్సర విద్యార్థి, పాలిటెక్నికల్ ఇంజినీరింగ్ జీర్ణక్రియకు సహాయకారి ఎటువంటి రసాయనాలు వేయకుండా చెరకు రసంతో చేసిన తాండ్రతో జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడమే కాకుండా శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి రక్షిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి మంచిది. – రమ్య, తృతీయ సంవత్సర విద్యార్థి, పాలిటెక్నికల్ ఇంజినీరింగ్ -
లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు
● రైల్వే స్టేషన్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తింపు రైల్వేస్టేషన్లో తినుబండారాల షాపు నిర్వాహకుడిని విచారిస్తున్న లీగల్ మెట్రాలజీ అధికారి రామచంద్రయ్య అనకాపల్లి టౌన్: స్థానిక రైల్వేస్టేషన్లో తినుబండారాలు అమ్మే నాలుగు క్యాంటీన్లలో శుక్రవారం లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ బి.రామచంద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిస్కెట్ ప్యాకెట్లు, డ్రింక్స్ను ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయిస్తున్నారన్నారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న తినుబండారాల షాపులను తనిఖీ చేసి వినియోగదారుల హక్కులపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు బి.రామచంద్రరావు, వి.రామారావు, అనురాధ పాల్గొన్నారు. -
గుర్రాజుపేట విద్యార్థికి ఐఈఎస్లో 128 ర్యాంకు
గొంప నవీన్ ఎస్.రాయవరం: మండలంలో గుర్రాజుపేటకు చెందిన గొంప నవీన్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్–2025) ఫలితాల్లో 128 ర్యాంక్ సాధించాడు. గొంప బాబూరావు, మంగతాయారుల రెండవ కుమారుడైన నవీన్ అడ్డురోడ్డు విశ్వశాంతి ప్రైవేటు స్కూల్లో 10 వ తరగతి వరకు చదివి పదికి 10 పాయింట్లు సాధించాడు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏపీఆర్జేసీలో ఇంటర్మీడియెట్, కేరళ రాష్ట్రం కాలికట్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. గేట్లో ఆల్ఇండియా ర్యాంక్ 186 సాధించాడు. నవీన్ తండ్రి రైతు, తల్లి టైలర్, అన్న గొంప నాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నవీన్ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
అనకాపల్లి హైవేపై జలగలమదుం జంక్షన్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా తాళ్లపాలెం ఏపీ గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు పరిశీలించి, సూచనలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ కశింకోట: తాళ్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం శనివారం ఉదయం 11 గంటల నుంచి తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో పర్యటించనున్నారు. విశాఖ నుంచి హెలికాప్టర్లో ఉగ్గినపాలెం అమలోద్భవి హోటల్ వద్ద ఉన్న లేఅవుట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాళ్లపాలెం చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల సందర్శించి, సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం పంచాయతీ సమీపంలో వేదిక వద్ద బహిరంగ సభ జరగనుంది. దీన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఏర్పాట్లపై ఆయా ప్రాంతాలను సందర్శించి అధికారులతో సమీక్షించి పలు సూచనలిచ్చారు. ఎస్పీ తుహిన్ సిన్హా కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాళ్లపాలెం కూడలి నుంచి నర్సీపట్నం వైపు రోడ్డుపై ఉన్న గుంతలను ఆగమేఘాలపై పూడ్చారు. నేడు వాజ్పేయి విగ్రహావిష్కరణ అనకాపల్లి టౌన్/అనకాపల్లి: దేశ రాజకీయాలలో తనదైన శైలితో ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న స్ధానిక జాతీయ రహదారి జలగల మదుం జంక్షన్ వద్ద నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానల్ సభ్యుడు ఈర్లె శ్రీరామ్మూర్తి తెలిపారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. సీఎం పర్యటనలో 1500మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
సబ్బవరం హత్య కేసులో పోలీసుల ప్రతిభ
అనకాపల్లి: శాసీ్త్రయ ఆధారాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్లిష్టమైన హత్య కేసును తక్కువ సమయంలో ఛేదించినందుకు పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్కు శుక్రవారం అమరావతిలో డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్కుమార్ గుప్తా అవార్డు అందజేశారు. ఈ ఏడాది ఆగస్టు 14న సబ్బవరం మండలం, బాటాజంగాలపాలెం వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం సగం కాలిన స్థితిలో లభించింది. మృతురాలి వివరాలు గానీ, నిందితుల ఆనవాళ్లు గానీ లేని ఈ ‘బ్లైండ్ మర్డర్‘ కేసు త్వరితగతిన పూర్తి చేసినందుకు అవార్డు వచ్చిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో దాదాపు 14,000కు పైగా మొబైల్ నంబర్లను (టవర్ డంప్), 450కి పైగా సీసీ టీవీ ఫుటేజిలను, 1,000కి పైగా వాహనాల సమాచారాన్ని సేకరించి, పెట్రోల్ బంక్ వద్ద లభించిన దృశ్యాలు, నిందితుడు మురళీధర్రెడ్డి వాడిన స్విఫ్ట్ డిజైర్ కారు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల కారణంగా మృతురాలు బాంకిల సంతురెడ్డిని ఆమె బావ మురళీధర్రెడ్డి, మృతురాలి కుమార్తె అనూషతో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అవార్డులు అందుకున్న వారిలో పరవాడ పోలీస్ డివిజన్ పరిధిలో సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు, సబ్బవరం, మునగపాక ఎస్ఐలు పి.సింహాచలం, పి.ప్రసాదరావు, టాస్క్ఫోర్స్ సీఐ టి.రమేష్లను డీజీపీ సర్టిఫికెట్లతో అభినందించారు. డీజీపీ నుంచి అవార్డు అందుకున్న పరవాడ డీఎస్పీ -
విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు
నూతన ఆవిష్కరణలతో అబ్బురపరిచిన విద్యార్థులుచోడవరం: విద్యార్థులు తమ ఆధునిక పరిజ్ఞానంతో అందర్నీ ఆలోచింపజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో ఎలాంటి మార్పులు చేపడితే మంచి ఫలితాలు వస్తాయో నమూనాలు రూపొందించి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. పలు ప్రదర్శనలు అందర్నీ ఔరా.. అనిపించాయి. జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన చోడవరం జెడ్పీ బాలికల హైస్కూల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడు ప్రారంభించారు. జిల్లాలో 24 మండలాల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన సుమారు 86 ప్రదర్శనలు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. ఏడు విభాగాల్లో ఈ నమూనాలు రూపొందించారు. చోడవరం, అనకాపల్లి, నర్సీప ట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో అన్ని మండలాల నుంచి ఎంపికై న వైజ్ఞానిక నమూనాలు ఇక్కడ ప్రదర్శించారు. ఆధునిక వ్యవసాయం, సోలార్ విద్యుత్ వినియోగంతో లాభాలు, వర్షపు నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి వినియోగించడం, ప్లాస్టిక్ బదులుగా సముద్రంలో మొక్కల నుంచి ప్లాస్టిక్ మాదిరిగా వస్తువుల తయారీ, నేటి వాతావరణంలో మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం, చెత్త నుంచి సంపద తయారీ, విద్యుత్కి బ దులుగా కో జనరేషన్ తయారీ, కంప్యూటర్తో, డ్రో న్లతో ఆధునిక వ్యవసాయం ఎలా చేస్తే రైతుకు మేలు జరుగుతుందనే అంశాలతోపాటు అనేక నమూనాలు ఇక్కడ ప్రదర్శించారు. విద్యార్థుల మేధస్సుకు సైన్సు ఉపాధ్యాయుల ఆలోచన తోడు చేసి ఒకదానిని మించి మరొకటి ఉండేలా ఆలోచింపజేసే వైజ్ఞానిక న మూనాలు విద్యార్థులు తయారు చేశారు. తెలుగుతోపాటు ఇంగ్లిషు భాషలో విద్యార్థులు ఆయా ప్రాజెక్టు ల గురించి వివరించారు. విజేతలకు జిల్లా ఉప విద్యాశాఖాధికారి అప్పారావు బహుమతులు అందజేశారు. విజేతలు వీరే.. జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు ఉత్త మ నమూనాలుగా న్యాయనిర్ణేతలు ప్రకటించారు. కోడూరు జెడ్పీ హైస్కూల్ (సస్టైనబుల్ అగ్రికల్చర్), హరిపాలెం జెడ్పీ హైస్కూల్ (వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ ), సబ్బవరం గవర్నమెంటు హైస్కూల్ (గ్రీన్ ఎనర్జీ), రావికమతం జెడ్పీ హైస్కూల్ (ఎమర్జింగ్ టెక్నాలజీ), జి.అగ్రహారం జెడ్పీ హైస్కూల్ (రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ మోడలింగ్), చోడవరం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ (హెల్త్ అండ్ హైజనిక్ ), తిమ్మపాలెం జెడ్పీ హైస్కూల్ (వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్) ఉత్తమ నమూనాలుగా నిలిచాయి. అదేవిధంగా వ్యక్తిగత ప్రతిభ చూపిన వారిలో యు.హరీష్ (జె.నాయుడుపాలెం జెడ్పీ హైస్కూల్ రోలుగుంట), పి.హేమశ్రీ (మల్లునాయుడుపాలెం జెడ్పీ హై స్కూల్), బి.కె.వి.గోవిందరావు (తుమ్మపాల జెడ్పీ హైస్కూల్), ఎస్.సోమేష్ (తిరువూరు జెడ్పీ హైస్కూల్) నిలిచారు.బయో ప్లాస్టిక్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం కలుషితమై ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున బయో ప్లాస్టిక్ తయారీ అంశంపై ఈ ప్రాజెక్టును తయారుచేశాం. దేశంలో 7,500 పొడవైన సముద్ర తీరం ఉన్నందున సముద్రంలో లభ్యమయ్యే మొక్కలతో బయోప్లాస్టిక్ ఏవిధంగా తయారు చేయవచ్చు అన్నదే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ ప్రాజెక్టు ఉద్దేశం. – సాత్విక, కుషాల్, రేవంత్, జెడ్పీ హైస్కూల్, హరిపాలెం, అచ్యుతాపురం మండలంఏది మంచి ఆహారం.. మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. జంక్ ఫుడ్స్ కాకుండా నేచురల్ సీడ్ ఫుడ్స్ తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాము. ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి లాభభాలు ఉంటాయి అనే అంశంపై నమూనా తయారు చేశాం. – ఆర్.లేఖన, పి.వాత్సల్య, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్, చోడవరం -
● ఇప్పుడున్న నాయకుల్లో అత్యధికం ఆయన శిష్యులే ● ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సభలో వక్తలు
ద్రోణంరాజు ఓ రాజకీయ యూనివర్సటీబీచ్రోడ్డు: ఉత్తరాంధ్ర టైగర్గా పేరుగాంచిన ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటివారని, నేడు పదవుల్లో ఉన్న ఎంతోమంది ఆయన శిష్యులేనని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎసా్స్ర్ సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పేర్కొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో సిరిపురంలోని జంక్షన్లోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి వ్యక్తలు మాట్లాడారు. ద్రోణంరాజు కుమారుడు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా నిబద్ధత గల నాయకుడిగా ఎదిగారన్నారు. తండ్రి శ్రీనివాస్ అడుగుజాడల్లో శ్రీవత్సవ నడవడం అభినందనయీమన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన తాతగారు చేసిన కృషి, తన తండ్రి సంపాదించిన నిష్కళంకమైన పేరు తనకు స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాల సాధన కోసం తాను నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్యతో, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , తిప్పల దేవన్ రెడ్డి , పార్టీ నేతలు కోలా గురువులు , డాక్టర్ జహీర్ అహ్మద్, కొండా రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాస్, చెన్నా జానకీరామ్ , బిపిన్ కుమార్ జైన్, ముమ్మన దేముడుు, ఉరుకూటి టి చందు పాల్గొన్నారు. -
సీఎం అపాయింట్మెంట్ పది నిమిషాలే..
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● 60 మందితో మత్స్యకారుల కమిటీ.. కానీ చర్చలకు 30 మందికే అవకాశం ● ఆరుగురే మాట్లాడాలని సూచన ● ఏం చర్చించాలో ముందే కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్న రాజయ్యపేట మత్స్యకారులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చలు జరపనున్నారు. దాదాపు 70 రోజులపాటు గ్రామంలో రిలే నిరాహారదీక్ష చేపట్టిన మత్స్యకారులు.. సీఎం దగ్గరకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా దీక్ష విరమించిన విషయం తెలిసిందే. ఆమె సూచన మేరకు గ్రామస్తులంతా 60 మందితో కమిటీ ఏర్పాటు చేసుకుని జాబితా అధికారులకు అందజేశారు. నెల రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయలేదు. దీంతో మత్స్యకారులు ఈనెల 21వ తేదీలోగా తమను సీఎం వద్దకు తీసుకెళ్లకపోతే యథావిధిగా నిరాహార దీక్ష చేపడతామని అల్టిమేటం ఇచ్చారు. ఇదే విషయమై ‘వంచన వలలో విల విల’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 18న కథనం వెలువడింది. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. శనివారం తాళ్లపాలెంలో సీఎం పర్యటన ఉంది. ఈ పర్యటనలో రాజయ్యపేట మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు అఽధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఏం మాట్లాడాలో వారే చెప్పారు.. సీఎంతో చర్చల సందర్భంగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడానే విషయాలపై శుక్రవారం అధికారులు మత్స్యకారులకు అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఎంతో చర్చలకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. కేవలం పది నిమిషాల్లోనే మీ డిమాండ్లు చెప్పాలని సూచించారు. చర్చల్లో పాల్గొనేందుకు 30 మందిని అనుమతిస్తున్నప్పటికీ సీఎంతో మాట్లాడేందుకు మాత్రం కేవలం ఆరుగురికే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. టీడీపీ నుంచి ఇద్దరు, వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరికి మాత్రమే సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అధికారుల ఆంక్షలపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తాము ఎదుర్కొనే ఇబ్బందులు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే తెలియజేయాలని షరతు విధించడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గురువారంనాటి సంచికలో ‘సాక్షి’ ప్రచురించిన కథనం -
పంచాయతీ విభజనపై టీడీపీలో వర్గపోరు
గొలుగొండ గ్రామం గొలుగొండ : గొలుగొండ గ్రామ పంచాయతీ విభజన విషయంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఈ పంచాయతీ విభజనకు గొలుగొండలో మూడు రోజుల క్రితం గ్రామసభ నిర్వహించారు. ఈ పంచాయతీలో సుమారుగా 3250 ఓట్లతో పాటు గొలుగొండ, శ్రీరాంపురం, కొత్తజోగుంపేట, 80 ఎస్సీ కాలనీ, పేట మాలపల్లి గ్రామాలు ఉన్నాయి. ఇందులో గ్రామ సభ నిర్వహించిన సందర్భంలో 80 ఎస్సీ కాలనీ, పేటమాలపల్లి గ్రామాల్లో ఓటర్లు, ప్రజలు తామంతా గొలుగొండ నుంచి విడిపోయి పక్కనే ఉన్న జోగుంపేటలో విలీనం అవుతున్నట్టు చెప్పారు. శ్రీరాంపురం, కొత్త జోగుంపేట గ్రామాలు ప్రత్యేక పంచాయతీగా విడిపోవడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే గొలుగొండ పంచాయతీలో గెడ్డ అవతల, గెడ్డ ఇవతల అనే నినాదం ఉంది. గెడ్డ అవతల శ్రీరాంపురం, కొత్తజోగుంపేట, పేటమాలపల్లి, 80 ఎస్సీ కాలనీ గ్రామాలు ఉన్నాయి. గెడ్డ ఇవతల కేవలం గొలుగొండ గ్రామం ఉంది. గ్రామ సభ జరిగిన సందర్భంలో పేటమాలపల్లి, 80 ఎస్సీ కాలనీ జోగుంపేట వెళ్లడం కోసం ప్రయత్నాలు చేయగా జోగుంపేట పంచాయతీ నాయకులు కలవడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అప్పటికే గొలుగొండ పంచాయతీలో ఉన్న శ్రీరాంపురం, కొత్త జోగుంపేట వేరే పంచాయతీగా ఏర్పాటుకు తీర్మానాలు చేయడం జరిగింది. ఇక్కడే టీడీపీ నాయకుల నడుమ వర్గ విభేదాలు మొదలయ్యాయి. పేటమాలపల్లి, 80 ఎస్సీ కాలనీని శ్రీరాంపురం, కొత్తజోగుంపేటలో కలవడానికి అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గొలుగొండ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం స్వీకర్ అయ్యన్నపాత్రుడుని కలసి ఉంటే పంచాయతీ మొత్తం కలసి ఉంటాం.. లేదంటే గెడ్డ అవతల ఉన్న శ్రీరాంపురం, కొత్త జోగుంపేట, 80 ఎస్సీ కాలనీ, పేటమాలపల్లి వేరే పంచాయతీ చేయండి అంటూ పట్టుబట్టినట్టు తెలిసింది. -
ప్రజా ఉద్యమం
మెడికిల్ ఆపకపోతే ● ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు ● ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తూ ఊరుకోం ● చంద్రబాబు సర్కారుకు సీపీఐ, ఎస్ఎఫ్ఐ హెచ్చరిక అడ్డురోడ్డులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు నర్సీపట్నం/ఎస్.రాయవరం: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా నిరసన హోరెత్తుతోంది. కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు చంద్రబాబు సర్కారు విధానాలను విమర్శిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. నర్సీపట్నంలో సీపీఐ నాయకులు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్డురోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించారు. సీపీఐ నాయకులు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అబిద్సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఆర్డీవో కార్యాలయంలో మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు.. పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొన్నారు. పది మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే 590 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా మెడికల్ కళాశాల వస్తే దానికి ఆనుకొని 600 పడకల ప్రభుత్వ హాస్పటల్ వస్తుందన్నారు. ఇప్పటి వరకు ఏమైనా అవసరమైతే విశాఖపట్నం కేజీహెచ్కు వెళ్లాల్సి వచ్చేదని, మార్గమధ్యంలోనే మరణించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెత్త ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బి.వి.రమణ, జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డి అప్పలనాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జీ, కార్యవర్గ సభ్యులు రావుజగ్గారావు, పరమేశ్వరి, గురుబాబు, రాధాకృష్ణ, రైతు సంఘం నాయకులు భవాని, సీపీఐ నాయకులు అర్జున్, లక్ష్మి, దొర, దేవుడుబాబు, జగదీష్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఎస్ఐఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ అన్నారు. అడ్డురోడ్డు కూడలిలో గురువారం విద్యార్థులు నిరసన హోరెత్తించారు. గత ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 కళాశాలల నిర్మాణం చేపడితే.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతాననడం దారుణంగా ఉందన్నారు. గతంలో ఇటువంటి అవకాశాలు లేక గ్రామాల్లో ప్రతిభ కల విద్యార్థులు సైతం పెద్ద చదువులకు దూరంగా ఉండిపోయారన్నారు. విద్యార్థులకు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏడు వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలన్నారు. మానవహారం నిర్వహించి నినాదాలతో హోరెత్తించా రు. ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్న, తాతాజీ, మహేష్, లక్ష్మణ్, దివ్య, పుష్ప, భవాని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఈపీడీసీఎల్కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు
విశాఖ సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏపీఈపీడీసీఎల్కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్–ది పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే నినాదంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025ను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో ఏపీఈపీడీసీఎల్ ప్రతిష్టాత్మక ‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జాతీయ అవార్డు’ ను సాధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్, పర్యావరణ–అటవీశాఖ మంత్రి శుభోద్ ఉనియల్, పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. ఏపీఈపీడీసీఎల్ తరఫున పీఆర్వో జి.ఎస్.ఎస్.ఎస్.వాసు ఈ అవార్డును అందుకుని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖల సహకారంతో ఈపీడీసీఎల్లో పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ద్వారా విద్యుత్ను అందించినట్లు వెల్లడించారు. -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై 21న రాష్ట్రస్థాయి సెమినార్
చోడవరం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరశిస్తూ ఈనెల 21వ తేదీన చేపట్టిన రాష్ట్ర స్థాయి సెమినార్ను విజయవంతం చేయాలని పీడీఎస్ఓ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నందారపు భాస్కరరావు కోరారు. విజయవాడలో జరగనున్న సెమినార్ను విజయవంతం చేయాలని కోరుతూ చోడవరంలో ప్రచార వాల్పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేదుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిని విద్యార్థులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో ఈనెల 21వ తేదీన విజయవాడలో విద్యార్థులతో భారీ సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్ను జయప్రదం చేయడానికి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్ధులు, యువకులు తరలి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్ఓ నాయకులు ఎల్.వరహాలనాయుడు, బి.కుమార్, వై.యశ్వంత్, ఎన్.తరుణ్ పాల్గొన్నారు. -
మంచు కురిసే వేళలో..
చోడవరం: చలి చక్కిలిగిలి పెడుతోంది. మంచుతో నిండిన ప్రకృతి అందమైన దృశ్యాలతో అలరిస్తోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు గజగజా వణికిస్తున్నా యి. పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. జనవరి రెండో వారం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో చోడవరం నుంచి ఏజెన్సీ వాతావరణం కనిపిస్తుంది. మాడుగుల నుంచి ఏజెన్సీని తలపిస్తుంది. సాధారణంగా శీతాకాలంలో ఇక్కడ 8 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ఏడాది చలి మరీ ఎక్కువగా ఉంది. భారీగా కురుస్తున్న పొగమంచు గ్రామాలను కమ్ముకోవడంతో గ్రామాలన్నీ కనుమరుగైనట్టుగా మంచుతెరల్లో చిక్కుకొని కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటినా రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేనంత మంచు కురుస్తుండటంతో లైట్లు వేసుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. భారీగా కురుస్తున్న మంచుకు జనం ఇబ్బందులు ఇలా వుంటే ఆ మంచు సోయగాల్లో ఎన్నో అందమైన ప్రకృతి అందాల దృశ్యాలు ఆవిషృతమవుతున్నాయి. పొగమంచు మరో సమస్య రూరల్ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా పగటి వేళల్లో ఉదయం 9 గంటల వరకూ లైట్లు వేసుకొని ప్ర యాణం చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు చలి పెరుగుతోంది? భూతాపం పెరగడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు కూడా కారణమని చెబుతున్నారు. -
29 నుంచి రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ క్రీడలు
స్పోర్ట్స్ మీట్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రత్నకుమార్ మురళీనగర్ (విశాఖ): కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ తెలిపారు. గురువారం కళాశాలలో ఈ క్రీడల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. బాలబాలికలకు అథ్లెటిక్స్, వాలీబాల్, షటిల్ బాడ్మింటన్, చెస్ వంటి వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
●మర్యాదపూర్వక కలయిక
● వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలుమహారాణిపేట (విశాఖ)/దేవరాపల్లి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని కలిసి వారు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ కూడా పార్టీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. -
కలెక్టర్ బంగ్లా ఎదురుగా కలప దొంగలు
తుమ్మపాల: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల అక్రమాలకు హద్దులు లేకుండా పోతుంది. అందిన కాడికి దోచేయడమే పనిగా పావులు కదుపుతున్నారు. అధికారులు లేని సమయాల్లో అక్రమాలకు తెగబడుతున్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు కలెక్టర్ విజయ కృష్ణన్ వెళ్లడంతో ఆమె నివాసముండే బంగ్లా ఎదురుగా తోటలను సైతం టీడీపీ నాయకులు విక్రయించేశారు. మండలంలో కోడూరు సర్వే నెం.45 ప్రభుత్వ భూమిలో కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో దట్టమైన చిట్టడివిని తలపించేలా అత్యంత దట్టమైన యూకలిప్టస్ తోట ఉంది. దీని ఽప్రస్తుత మార్కెట్ ధర రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. గత కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు ఆ తోటను పరిరక్షిస్తున్నారు. కొంతకాలం క్రితం టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ కన్ను ఆ తోటపై పడింది. గతంలోనూ అతను ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అనేకసార్లు అడ్డుకున్నారు. కలెక్టర్ లేకపోవడం, ఈనెల 20న సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన కోసం మిగిలిన అధికారులు బిజీబిజీగా ఉండడంతో ఆ టీడీపీ నేత రంగంలోకి దిగిపోయారు. ఈ నెల 17న మందీమార్బలంతో తోట వెనుక నుంచి కోత మొదలెట్టారు. నిమిషాల్లో దుంగలను వ్యాన్లకు లోడ్ చేసి తరలించేశారు. పేరుకు యూకలిప్టస్ అయినప్పటికీ ఎర్ర చెందనాన్ని తలపించేలా ఉన్న దుంగలను టన్నుల లెక్కన వ్యాన్లపై తరలించేశారు. నిత్యం పర్యవేక్షించే రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేసిన తరువాత కూడా కలపను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రెవెన్యూ సిబ్బంది కళ్ల ముందే కలపను వ్యాన్లతో తరలించేశారు. ఇటీవలే పుట్టుకొచ్చిన దొంగ పట్టా కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉన్న యూకలిప్టస్ తోటకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేత పేరున దొంగ పట్టా పుట్టుకొచ్చింది. స్ధానికంగా తోటల క్రయవిక్రయాలే వృత్తిగా చేసుకున్న టీడీపీ నేత దొంగ పట్టాను చూపిస్తూ కోడూరు రెవెన్యూ పరిధిలో ఇప్పటికే పలు ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. కొన్నింటికి సాగుహక్కు చూపిస్తూ ప్రభుత్వం నుంచి ల్యాండ్ పూలింగ్లో కోట్ల రూపాయలు నొక్కేశారు. ఇది చాలక ఇప్పుడు నేరుగా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న తోటను కూడా కనుమరుగు చేసేస్తున్నారు. -
కేజీహెచ్లో చిన్నారికి సంక్లిష్ట వెన్నుముక శస్త్రచికిత్స విజయవంతం
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణిని కలిసిన తేజస్వని, ఇతర కుటుంబ సభ్యులు మహారాణిపేట: కేజీహెచ్ వైద్యులు తొమ్మిదేళ్ల బాలికకు అత్యంత క్లిష్టమైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన తేజస్వని..తీవ్రమైన మెడనొప్పి, తల నిలపలేకపోవడంతో గత నెల 11న ఆస్పత్రిలో చేరింది. బాలికకు టీబీ సోకడంతో పాటు వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమ్జీత్ రే ఆధ్వర్యంలో కార్డియో థొరాసిక్, ఆర్థోపెడిక్ , అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో ఈ నెల 5న ఈ ఆపరేషన్ నిర్వహించారు. సకాలంలో శస్త్రచికిత్స జరగడం వల్ల బాలిక కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం ఆమె క్షేమంగా నడుస్తోందని వైద్యులు వెల్లడించారు. సుమారు నాలుగు లక్షల రూపాయల ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించారు. శస్త్ర చికిత్స విజయవంతంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి హర్షం వ్యక్తం చేస్తూ వైద్య బృందాన్ని అభినందించగా.. బాలిక తల్లిదండ్రులు వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర నాలుగో గురువారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం వెండి కవచాల అలంకారంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల పర్యవేక్షణలో ఆలయ ఈవో కె. శోభారాణి, ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు. భక్తుల సౌకర్యార్థం జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా టౌన్ కొత్తరోడ్డు వద్ద సుమారు 20 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టౌన్కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ప్రారంభించగా, రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.20, రూ.100, రూ.200 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు రూ.500 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక దర్శన మార్గాలను కేటాయించారు. దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే దారిలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘోషాసుపత్రి, రీడింగ్ రూమ్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పించారు. ఆలయ సమీపంలోనే పోలీస్ అవుట్పోస్ట్, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. టౌన్కొత్తరోడ్డు, ఘోషాసుపత్రి ప్రాంతాల్లో చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయగా, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు.శుక్రవారంతో ఈ మార్గశిర ఉత్సవాలు ముగియనున్నాయి. సహస్ర ఘటాభిషేకానికి సిద్ధం చేసిన కళశాలు క్యూలైన్ లో భక్తులు -
కళాప్రియులను అలరించిన బహుభాషా నాటకోత్సవాలు
ధన్యోస్మి నాటకంలో సన్నివేశం మద్దిలపాలెం: కళాభారతి ప్రాంగణంలో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన 10వ బహుభాషా నాటకోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ‘ధన్యోస్మి’, ‘ముళ్లతీగలు’ నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖల సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో డాక్టర్ వేమలి త్రినాథరావు, హేమా వెంకటేశ్వరిల దర్శకత్వంలో రసజ్ఞ సభ్యులు, పీవీఆర్ మూర్తి దర్శకత్వంలో నవరస థియేటర్ ఆర్ట్స్ కళాకారులు తమ నటనతో మెప్పించారు. నాటక ప్రదర్శనకు ముందు రాజేశ్వరి బృందం నిర్వహించిన జానపద కోలాట నృత్యాలు అలరించాయి. ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. నరసింహరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. -
విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యుటీఎఫ్ ధర్నా
అనకాపల్లి : జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేట జాతీయ రహదారి డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ మాట్లాడుతూ 2011కి ముందు నియామకమైన టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ను అమలు చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలన్నారు. గతంలో ఐచ్చిక సెలవులను పాఠశాలలకు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో అవి వ్యక్తులకు మార్చడం సరికాదన్నారు. పదో తరగతి యాక్షన్ ప్లాన్ పేరుతో సెలవు దినాల్లో పనిచేయాలనే నిబంధనను రద్దు చేయాలని, జీవీఎంసీలో అర్హులైన ఎస్జీటీలకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. జూన్ 2025న బదిలీ అయిన హిందీ ఉపాధ్యాయులను ఇంతవరకు రిలీవ్ చేయకపోవడం అన్యాయమన్నారు. అనంతరం డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ రామలింగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీమతి వత్సవాయి శ్రీలక్ష్మి, గౌరవాధ్యక్షుడు పంపన బోయిన వెంకట్రావు, కార్యదర్శులు గుత్తుల సూర్య ప్రకాష్, శేషు, చైతన్య శీల, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
నేడు చోడవరంలో జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
చోడవరం: ఈనెల 19వ తేదీన జిల్లా స్థాయి వైద్య, విజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావునాయుడు చెప్పారు. చోడవరంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో నైపుణ్యం, విజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామన్నారు. మండలాలవారీగా అన్ని చోట్ల విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించామని, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో ఈనెల 19వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశామన్నారు. చోడవరం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో ఈ ప్రదర్శన జరుగుతుందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 24 మండలాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి వివిధ విభాగాల్లో రూపొందించిన 216 నమూనాలు ఈ ప్రదర్శనలో ఉంచడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యాకమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు అంతా సహకరించి, ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈవో అప్పారావునాయుడు కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈవో అప్పారావు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
స్క్రాప్లోడ్తో లారీ బోల్తా
మాకవరపాలెం సెంటర్లో బోల్తాపడిన లారీ నర్సీపట్నం: మండల కేంద్రమైన మాకవరపాలెం బస్టాండ్ వద్ద స్క్రాప్లోడుతో లారీ బోల్తాపడింది. స్క్రాప్ లోడుతో నర్సీపట్నం నుంచి అనకాపల్లి వైపు వెళ్తుంది. రోడ్డు మధ్యలో వేసిన చిన్నపాటి డివైడరు కనిపించకపోవడంతో డ్రైవర్ డివైడర్ ఎక్కించేశాడు. దీంతో లారీ బోల్తా కొట్టింది. సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. డివైడర్ వల్ల తరుచూ వాహనాలు బోల్తా కొడుతున్నాయి. అయినప్పటికీ అర్అండ్బీ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా డివైడర్లను తొలగించి ప్రమాదాలను ఆరికట్టాలని కోరుతున్నారు. -
పోర్టులో అమెరికా కాన్సులేట్ జనరల్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ గురువారం విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)ని గురువారం సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్కుమార్ దూబే, పోర్టు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో ఆధునిక మౌలికవసతులు, సముద్ర వాణిజ్యంలో విశాఖపట్నం పోర్టు పోషిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలను పోర్టు అధికారులు కాన్సులేట్ జనరల్కు వివరించారు. సరుకు నిర్వహణా సామర్థ్యం, పోర్టులో కొనసాగుతున్న ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులు, పోర్టు కార్యనిర్వహణా సామర్థ్యాలను మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే కవర్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ఆమె పరిశీలించారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు వంటి గ్రీన్ పోర్టు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏయూతో అనుబంధం మరింత బలోపేతం కావాలి మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో అమెరికన్ కాన్సులేట్ అనుబంధం మరింత బలోపేతం కావాలని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆమె ఏయూని సందర్శించి వీసీ ఆచార్య రాజశేఖర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ స్వయంగా కొన్ని కార్యక్రమాలను అమెరికన్ కార్నర్తో కలిసి నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్నారు. నోబెల్ గ్రహీతలను ఏయూకు ఆహ్వానిస్తామని, దీనికి సహకారం అందించాలన్నారు. ఫుల్ బ్రైట్ స్కాలర్స్ను కొంత కాలం ఏయూలో ఉండే విధంగా ఆహ్వానిస్తామన్నారు. వీరిని ఏయూతో అనుసంధానం చేయాలన్నారు. -
నిరుద్యోగులు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవాలి
అనకాపల్లి : నిరుద్యోగ యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకుని స్థిరపడేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి, ఈడీ సత్యపద్మ అన్నారు. స్థానిక ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) జిల్లా కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం పూర్తయిన డ్రైవర్లకు శుక్రవారం ఆమె సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు నిరుద్యోగ యువతకు హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 45 రోజులు శిక్షణ ఇస్తూ ఆర్టీవో వారితో డ్రైవింగ్ లైసెన్స్లు కూడా అందజేయడం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రజారవాణాశాఖ జిల్లా అధికారి వి.ప్రవీణ మాట్లాడుతూ నేటి వరకూ 173 మందికి అనకాపల్లి డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ ఇచ్చామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 35 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ హనుమశ్రీ, ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి భాస్కరరావు, ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ డీఈవో బాపునాయుడు పాల్గొన్నారు. -
పశు వైద్యసేవలను నిర్లక్ష్యం చేయవద్దు
మామిడిపల్లి పశువైద్యశాలలో రికార్డులు తనిఖీ చేస్తున్న పశు సంవర్ధకశాఖ జిల్లా డిప్యూటీ డైరక్టర్ డా. చంద్రశేఖర్ దేవరాపల్లి : పశు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని పశు సంవర్ధకశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డా.ఎం.చంద్రశేఖర్ పశు వైద్య సిబ్బందికి సూచించారు. మామిడిపల్లి పశువైద్యశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిధిలోని నిర్వహిస్తున్న పశు టీకా కార్యక్రమాలపై స్థానిక పశువైద్యాధికారి జి.ప్రియాంకను ఆరా తీశారు. హెమోరాజిక్ సెప్టిసీమియా (గేదెల్లో బ్యాక్టీరియాల వల్ల వ్యాప్తించే తీవ్రమైన అంటు వ్యాధి) పునరావృత టీకా కార్యక్రమం జరుగుతుందని, మండలంలో 600 డోస్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మండలంలో 3వేల మేకలకు గోట్ ఫాక్స్ నివారణ టీకా కార్యక్రమం పూర్తి చేశారన్నారు. ఆడ దూడలు జన్మించేందుకు సెక్స్ సార్టెడ్ సీమెన్ను ప్రభుత్వ సబ్సిడీపై అందిస్తుందన్నారు. మండలంలో 78 గోకులం షెడ్లు మంజూరయ్యాయన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
మునగపాక/అనకాపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, విష్ణుమూర్తి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని వేర్వేరుగా కలిశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. -
స్టీల్ప్లాంట్ టౌన్షిప్కు భూములివ్వం
నక్కపల్లి: మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలర్మిట్టల్ నిప్పల్ స్టీల్ప్లాంట్ టౌన్షిప్ కోసం అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు స్పష్టం చేశారు. నెల్లిపూడి, వేంపాడు, డీఎల్ పురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ ఇప్పటికే మిట్టల్స్టీల్ప్లాంట్ కోసం ప్రభుత్వం 2020 ఎకరాలు భూములు కేటాయించిందన్నారు. వేంపాడు వద్ద టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు 400 ఎకరాలు, స్టీల్ప్లాంట్ కోసం అదనంగా మరో 2800 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం జీవో నంబరు76 జారీ చేసిందన్నారు. నెల్లిపూడి, వేంపాడు, డీఎల్పురం తదితర గ్రామాల పరిధిలో భూములు సేకరించేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. పంటలు పండే వేలాది ఎకరాలను బలవంతంగా తీసుకుని కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయంజరగలేదన్నారు. నష్టపరిహారంతోపాటు, ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ చెల్లించేందుకు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా అదనంగా మరో 2,800 ఎకరాలు సేకరించడం అన్యాయమన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకుని, భూసేకరణ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం వారు తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు.ఈఆందోళనలో వైఎస్సార్సీపీ మండలశాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, రైతు నాయకులు అయినంపూడి మణిరాజు, లొడగల చంద్రరావు, మోహన్రావు, గింజాల వెంకటరమణ, సురేష్ రాజు, గొర్ల బాబూరావు, అవతారం రాజు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు
గోపాలపట్నం(విశాఖ): భారత్, శ్రీలంక మహిళా క్రికెట్ జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్ల్లో పాల్గొనేందుకు ఇరుజట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్లు పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు. -
లిక్విడ్ గంజాయితో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు బుధవారం నెల్లిమెట్ట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న ప్రైవేటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి బయటపడింది. గంజాయిని కేరళకు తరలిస్తున్న సహాయల్(28)ను అరెస్టు చేసినట్టు ఎస్ఐ రాజారావు తెలిపారు. సహాయల్ గంజాయి సేవించడంతో పాటు అక్కడ తాగే వారికి అమ్ముతున్నట్టు విచారణలో తేలిందని తెలిపారు. అతని వద్ద నుంచి కేజీ లిక్విడ్ గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
జగనన్న జన్మదినం రోజున మెగా రక్తదాన శిబిరం
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న నర్సీపట్నంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరానికి సంబంధించిన వాల్పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా 15 ఏళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు హాజరై రక్తదానం చేయాలని ఆయన కోరారు. మండలాల పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షులు ఏకా శివ, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, మణికుమారి, సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, రమణ, నాగేశ్వరరావు, ఫాణిశాంతరామ్, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 65 కేంద్రాలు
నాతవరం: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 65 కేంద్రాలు ఏర్పాటు చేశామని సివిల్ సప్లయి జిల్లా మేనేజరు జయంతి అన్నారు. ఆమె బుధవారం నాతవరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని, 5లక్షలు గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాలు వద్ద ధాన్యం తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 400 ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు 25 రైస్ మిల్లులకు అనుమతులు ఇచ్చామన్నారు. వాటిలో నాతవరం మండలంలోనే మూడు రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంతవరకు 4,500 టన్నులు కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా డబ్బులు రైతులు బ్యాంకు అకౌంట్లులో జమ చేస్తామన్నారు. -
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు 6 నమూనాలు
యలమంచిలి రూరల్ : స్థానిక కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండలస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆరు నమూనాలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు ఎంఈవో సూర్యప్రకాష్ తెలిపారు. 11 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు 41 నమూనాలను ప్రదర్శించారు. వారిలో కొక్కిరాపల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థినులు పి.లిఖిత, ఎం.గౌతమి ప్రదర్శించిన ఆరోగ్యం, పరిశుభ్రత, యలమంచిలి తులసీనగర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని జి.మేఘవర్షిణి ప్రదర్శించిన గణిత పార్కు, సోమలింగపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బి.గణేష్ ప్రదర్శించిన అభివృద్ధి చెందిన సాంకేతికతలు థీమ్, యలమంచిలి పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డు పాఠశాల విద్యార్థులు బి.రాజ్కిరణ్, సీహెచ్.మహేంద్ర రూపొందించిన మురుగునీటి సక్రమ నిర్వహణ నమూనా,పెదపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ.అపర్ణ హరితశక్తి నమూనా,ఇదే పాఠశాల విద్యార్థి ని పి.దీప్తి ప్రదర్శించిన నీటి సంరక్షణ,నిర్వహణ నమూనాలను న్యాయనిర్ణేతలు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను,వారికి గైడ్ టీచర్లుగా వ్యవహరించిన ఉపాధ్యాయులను ఎంఈవో సూర్యప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు వై.వి.రమణ అభినందించారు.అంతకుముందు ఉదయం సైన్స్ ఫెయిర్ను ఎంపీపీ రాజాన శేషు ప్రారంభించారు. పోటీలను సీఆర్పీలు కిషోర్కుమార్,రత్నం పర్యవేక్షించారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో వయా దువ్వాడ మీదుగా పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ తెలిపారు. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07288) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 9, 11వ తేదీల్లో రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07289) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 10, 12వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07290) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 10, 12, 16, 18వ తేదీల్లో రాత్రి 7గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07291) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 11, 13, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07292) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07293) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 18న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదే రోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● వికారాబాద్–శ్రీకాకుళం రోడ్(07294) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 13న సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07295) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 14న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
నెలరోజులైనా...
కమిటీ ఏర్పడి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మత్స్యకారులకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించలేదు. కమిటీ ఏర్పాటు, సీఎంతో చర్చలపేరుతో ఉద్యమాన్ని నీరుగార్చారన్న ప్రచారం జరుగుతోంది. సీఎం వద్ద తీసుకెళ్తానన్న హోంమంత్రి ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదని కొంత మంది మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగానే కమిటీలు, చర్చలంటూ మభ్యపెట్టారని ఆరోపిస్తున్నారు. డిసెంబరు నెలాఖరులోగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఉద్యమ బాటపడతామని, తాడోపేడో తేల్చుకుంటామని గంగపుత్రులు చెబుతున్నారు. -
కేసులు పెట్టినా ఆగే ప్రసక్తే లేదు
చంద్రబాబునాయుడు దగ్గరకు తీసుకెళ్తాం అంటేనే దీక్ష విరమణకు ఒప్పుకున్నాం. నెలరోజులు అవుతోంది. ఎవరూ ఏమీ మాట్లాడ లేదు. పోరాటం ఆపేస్తాం అనుకుంటున్నారేమో, కేసులు పెట్టినా, అరెస్టుచేసిన ఆగే సమస్యలేదు. ఇక్కడ బల్క్డ్రగ్పార్క్కట్టడానికి కుదరదంతే. చంద్రబాబుకు ఇదే విషయం చెప్తాం. మాప్రాణాలు తీసే కంపెనీలు మాకొ ద్దు. భూములు తీసుకునేటప్పుడు ఇలాంటి కంపెనీలు పెడతామని చెప్పలేదు. నక్కపల్లిలో మీటింగ్లో కూడా ఇదే చెప్పేం. పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు కాబట్టే ఆందోళన చేస్తున్నాం. ఈ నెలాఖరు లోగా చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లాలి. లేకపోతే మా ఊరోళ్లమంతా మీటింగ్పెట్టుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. –రాజేశ్వరి,మహిళ, రాజయ్యపేట -
విలవిల!
వంచెన వలలో ● హోం మంత్రి హామీ నమ్మి దీక్ష విరమించిన మత్స్యకారులు ● మళ్లీ ఉద్యమానికిసై అంటున్న గంగపుత్రులు వంచన వలలో చర్చల పేరుతో ఉద్యమానికి కళ్లెం నెలారోజులైనా దొరకని సీఎం అపాయింట్మెంట్ నక్కపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం చర్చలపేరుతో నీళ్లు జల్లింది. సీఎం వద్దకు తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామంటూ హోం మంత్రి హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, చందనాడ, బుచ్చిరాజుపేట తదితర గ్రామాల పరిధిలో 1800 ఎకరాల్లో ప్రభుత్వం బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఏర్పాటైన రసాయన పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యంతో సుమారు 30 మంది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేస్తే వందల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఈప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారి , తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజయ్యపేట మత్స్యకారులు నిరాహారదీక్ష చేపట్టారు. పోలీసులు ఆటంకాలు సృష్టించినా.. శాంతియుతంగా గ్రామంలో నిరాహారదీక్ష చేస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది. టెంట్లు, మైక్సెట్లు ఏర్పాటు చేయకుండా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ మత్స్యకారులు మండుటెండలో ఇసుక తిన్నెలపై నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు యథావిధిగా చేపట్టడంతో ఆగ్రహించిన గంగపుత్రులు...పార్క్ పనులు అడ్డుకుని రోడ్డుపై రాకపోకలు నిలిపి వేశారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో మంత్రి గ్రామంలోకి వచ్చి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గ్రామస్తులంతా మంత్రి కాన్వాయ్ను అడ్డగించి ఘోరావ్ చేశారు. తదుపరి నిరాహారదీక్షను నూకతాత ఆలయం వద్దకు మార్చి కొనసాగించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు. వందలాది మంది పోలీసులు గ్రామంలో మోహరించి, రాజయ్యపేట వెళ్లే దారులన్నింటి వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారిని గృహనిర్బంధం చేయడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించి గంగపుత్రులు జాతీ యరహదారిని ముట్టడించి ఐదు గంటల పాటు రాకపోకలు స్తంభింపజేశారు. ప్రభుత్వం దిగివచ్చి కలెక్టర్ను చర్చలకు పంపిస్తామని హామీ ఇచ్చి జాతీయరహదారి ముట్టడి కార్యక్రమం నుంచి ఆందోళన కారులను పంపించి వేసింది. తర్వాత 10 రోజులకు కలెక్టర్ విజయ్కృష్ణన్ గ్రామంలోకి వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. మత్స్యకారులంతా ముక్తకంఠంతో బల్క్డ్రగ్పార్క్ను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈవ్యవహారం తన పరిధిలో లేదని మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చేతులేత్తేశారు. మత్స్యకారులు యథావిధిగా ఆందోళన కొనసాగించారు. మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డిని మత్స్యకారులంతా కలసి బల్క్డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరుకు శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సుమారు 50 మంది సీనియర్ నేతలు మత్స్యకారులకు మద్దతుగా రాజయ్యపేట వచ్చి సంఘీభావం ప్రకటించారు. చర్చలపై ప్రకటన చేయాలి 61 మందితో కమిటీ మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం, జాతీయ రహదారిని ముట్టడించడం వంటి ఆందోళనలకు సంబంధించి పోలీసులు మత్స్యకారులపై పలుసెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశా రు. గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. మత్స్యకారులు వెనుకడుగు వేయలేదు. ఈలోగా కొంత మంది మత్స్యకారులు ప్రజాదర్బార్లో హోంమంత్రిని కలిసి రాజయ్యపేట బల్క్డ్రగ్ సమస్యపరిష్కరించాలని కోరారు. కమిటీగా ఏర్పడి వస్తే తాను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తానని, మీకు న్యాయం జరగకపోతే మీ ఆందోళన మీరు కొనసాగించుకోవచ్చని ఆమె ప్రకటించారు.ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీసీ నేతలు వీసం రామకృష్ణ తదితరులు సహితం సీఎంతో చర్చలు జరపడం మంచిదే, నాయ్యం జరగకపోతే ఆందోళన కొనసాగిద్దాం అని సూచించడంతో అప్పటికే రెండునెలలుగా వేటమానుకుని ఉపాధి లేకుండా పస్తులతో నిరాహార దీక్ష చేస్తున్న మత్స్యకారులంతా మంత్రి ప్రకటనపై గౌరవంతో 61 మందితో కమిటీగా ఏర్పాటై ఈ జాబితాను ఆర్డీవో ద్వారా హోంమంత్రికి, కలెక్ట్కు అందజేశారు. చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్తామంటేనే దీక్షను తాత్కాలికంగా విరమించాం. కమిటీ వేసి నెలరోజులు అవుతోంది. ఎవరూ ఏం మాట్లాడటంలేదు. గ్రామంలో మత్స్యకారులు ఒప్పు కోవడం లేదు. మళ్లీ ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేవిషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. విశాఖలో చంద్రబాబునాయుడిని కలిసే ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తాం. అధికారులు కూడా ఎటువంటి ప్రకటన చేయకపోవడం తగదు. ప్రభుత్వంతో చర్చల విషయంపై ఏదో ఒక ప్రకటన చేయాలి. –గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు,మత్య్సకార నాయకురాలు, రాజయ్యపేట -
మాడుగులలో సైకో వీరంగం
మాడుగుల: మాడుగుల పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బుధవారం సాయంత్రం ముగ్గురిపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సైకోను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులతో పాటు ఎస్ఐ నారాయణరావు అందించిన వివరాలు... స్థానిక రాజవీధికి చెందిన నారాయణమ్మ.. సున్నం పనికి వెళ్తుండగా వెనక నుంచి దాడి చేయడంతో కుడిచేయి విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కొండబాబు అనే వ్యక్తిని కర్రతో తలపై కోట్టడంతో తీవ్రంగా గాయపడి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అడ్డుకోడానికి వెళ్లిన గ్రామానికి చెందిన కోడా వెంకటేశ్వరులుపై సైకో దాడిచేయడంతో కాలుపై గాయమైంది. ఈ వ్యక్తిని విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
హమ్మయ్యా.. సక్సేనా గండం గడిచింది
సాక్షి, విశాఖపట్నం: గత రెండు నెలలుగా విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇన్చార్జి సీఎండీ ఎ.కె.సక్సేనా పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో సెయిల్ డైరెక్టర్ను నియమిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, సిబ్బంది తలపై పాలుపోసినంత పని చేసింది. సక్సేనా పాలన.. ఆవేదన గత ఏడాది సెప్టెంబర్లో స్టీల్ప్లాంట్ ఉత్పత్తి సంక్షోభంలో ఉన్న సమయంలో.. అప్పటి సీఎండీ అతుల్ భట్ను సెలవుపై పంపి.. మోయిల్ ఎండీగా ఉన్న ఎ.కె.సక్సేనాకు స్టీల్ప్లాంట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, సక్సేనా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పాలన ఉద్యోగులకు ఒక పీడకలలా మారిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగులను, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దేశంలో మరే పరిశ్రమలోనూ లేని విధంగా, కేవలం ఉత్పత్తి ఆధారంగానే జీతాలు చెల్లిస్తామంటూ సక్సేనా జారీ చేసిన చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘనత ఆయనకే దక్కుతుందని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు అందాల్సిన హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.1.50 నుంచి ఏకంగా రూ. 8కి పెంచేసి, వేతన సవరణ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల నడ్డి విరిచారు. జీతాలను నెలలో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కల్పించారు. ఇచ్చే అరకొర జీతాన్ని కూడా 50శాతం, 60శాతం, 75శాతం అంటూ విడతల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మరోవైపు ప్రభుత్వ విధానామా? లేక నిర్దేశమా? ఏదైనా పొదుపు, సంస్కరణల సాకుతో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1500 మందిని ఇంటికి పంపారు. భయంగుప్పిట్లో అధికారులు చిన్నపాటి మానవ, సాంకేతిక తప్పిదాలకు కూడా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం వంటి చర్యలతో ప్లాంట్లో భయానక వాతావరణం సృష్టించారు. ఇవన్నీ నిత్యకృత్యంగా మారడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు అధికారుల్లో నెలకొన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పలువురు ఉన్నతాధికారులు రాజీనామాలు చేశారు. మరోవైపు, కార్మిక సంఘాల హక్కులను హరిస్తూ, ఆందోళనలు, ధర్నాలపై ఆంక్షలు విధించి ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఆయన స్టీల్ప్లాంట్లో నియంతగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. స్టీల్ప్లాంట్లో సక్సేనా పాలనలో బాధపడని ఉద్యోగి లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు వెళ్లిపోతారా అని ఉద్యోగులు ఎదురుచూపులు చూడటం మొదలు పెట్టారు. సక్సేనాకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మద్దతు ఉందన్న ప్రచారంతో, ఆయనకే మళ్లీ ఎక్స్టెన్షన్ లభిస్తుందేమోనని రెండు నెలలుగా ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో సెయిల్ డైరెక్టర్ను కొత్త ఇన్చార్జి సీఎండీగా నియమించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాలన గాడిలో పడుతుందని, తమ కష్టాలు తీరుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
అచ్యుతాపురం రూరల్/కశింకోట: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అచ్యుతాపురం, కశింకోట మండలాలకు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. అచ్యుతాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికై నట్టు ఫిజికల్ డైరెక్టర్ దాడి శ్యాంప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. బాలుర విభాగంలో బొట్టా సాయి, పొలంరాశెట్టి తన్వేంద్ర, చొప్ప కిరణ్, వాసుపల్లి కిరణ్, జి.ఎల్.ఎన్. స్వామి, బాలికల విభాగంలో కొత్తపల్లి సంధ్య పాల్గోనున్నారు. ఎంపికై న విద్యార్థులను హెచ్ఎం పద్మావతి, చైర్మెన్ శెట్టి తాతారావు, వ్యాయామ ఉపాధ్యాయిని డి.పవిత్ర, సూర్యకళ తదితరులు అభినందించారు. ● కశింకోట సెయింట్ జాన్స్ స్కూలుకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికయ్యారు. జూనియర్ బాలుర విభాగంలో కె. సామ్యూల్ దయానంద్, బాలికల విభాగంలో టి. జైశ్రీ ఎంపికయ్యారని కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది తెలిపారు. ● మండలంలోని ఏఎస్ పేట హై స్కూల్ కి చెందిన అంబటి లాస్య రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు ఎంపికై ంది. ప్రధానోపాధ్యాయుడు లంక శ్రీనివాసరావు,వ్యాయామ ఉపాధ్యాయుడు జయ బాబు తదితరులు ఆమెను అభినందించారు. -
యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ పనులు పూర్తి చేయాలి
అనకాపల్లి: స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనకాపల్లి పర్యటన ఉందని, పర్యటనను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం అనకాపల్లి జోన్ పరిధిలో ఎన్టీఆర్ బెల్లం మార్కెట్, వై జంక్షన్, ఎన్టీఆర్ ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లాలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే అవకాశాలు ఉన్నందున జీవీఎంసీ తరపున చేపడుతున్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.వై జంక్షన్ వద్ద హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. డ్రైనేజీలో పూడికలు, భవన నిర్మాణ వ్యర్థాలు రహదారులపై లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎన్టీఆర్ ఆస్పత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, డీఎస్పీ ఎం.శ్రావణి, ఆర్డీవో షేక్అయిషా, సీఐలు ప్రేమ్ కుమార్, వెంకటనారాయణ, ఆశోక్కుమార్, డీసీ హెచ్ఎస్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి పాల్గొన్నారు. కశింకోట: మండలంలోని తాళ్లపాలెంకు ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ వద్ద ఉన్న సంపద కేంద్రాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పర్యటన అధికారికంగా ఖరారు కావలసి ఉంది. కమిషనర్ కేతన్గార్గ్ -
పీఎం సూర్యఘర్తో తగ్గనున్న విద్యుత్ భారం
రావికమతం: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గిస్తుందని ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ జి.ప్రసాద్ తెలిపారు. రావికమతం,టి.అర్జాపురం, కొత్తకోటల్లో బుధ వారం సీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో ఆయ న మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ పథకం వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పా రు. జిల్లాలో ఇప్పటి వరకు 3,500 మందికి ఈ పథకం అమలు చేసినట్టు తెలిపారు. రావికమ తం మండలానికి సంబంధించి ఇప్పటి వరకు 60 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్డీఎస్ఎస్ పథకంతో వ్యవసాయరంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులునిర్వహిస్తున్నట్టు చెప్పారు. డీఈ సురేష్కుమార్, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
హోం మంత్రి అనిత,అధికారులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షను తాత్కాలికంగా విరమించాం. 61 మందితో కమిటీ ఏర్పాటు చేసి జాబితా ఆర్డీవోకు అందజేసి నెలరోజులవుతున్నా పట్టించుకోలేదు. ఈనెల 21వ తేదీ వరకు వేచి చూస్తాం. అప్పటిలోగా సీఎం వద్దకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఉద్యమం మొదలుపెడతాం. ఇదే విషయాన్ని తహసీల్దార్కు, పోలీసులకు తెలియజేశాం. ఈ నెల 21వతేదీన రాతపూర్వకంగా తెలియజేసి దీక్ష మళ్లీ ప్రారంబింభిస్తాం –ఎరిపల్లి నాగేశు, మత్స్యకారనాయకుడు, రాజయ్యపేట21వ తేదీ వరకూ వేచి చూస్తాం -
పనిచేయని నాయకులకు అభివృద్ధి నిధులివ్వం
స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడునాతవరం: గ్రామాల్లో పని చేయని నాయకులకు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయనని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ సెల్ఫోన్లు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు, నాతవరం నుంచి తాండవ రిజర్వాయరుకు వెళ్లే రోడ్డుకు రూ.3.50 కోట్లు మంజూరు చేశానన్నారు. ఈ నిధులతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో లింకు రోడ్ల అభివృద్ధికి రూ.24 కోట్లు మంజూరు చేసానన్నారు. మండలంలో పలు గ్రామాల్లో వీధుల్లో సిమెంట్ రోడ్లకు రూ.5.50 కోట్లు మంజూరు చేశానన్నారు. గత ఏడాది మండలంలో అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తే వాటిలో 14 గ్రామాల్లో మా నాయకులు రూ.కోటి 60 లక్షలకు పైగా నిధులతో ఇంత వరకు పనులు చేయలేదన్నారు. ఆయా గ్రామాల్లో నాయకులకు అభివృద్ధి పనులకు ఈఏడాది నిధులు ఇచ్చేదిలేదన్నారు. -
అప్పన్న భూముల పందేరం
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. ఆ స్వామి పేరిట ఉన్న వేల ఎకరాల భూములు దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో ఉన్నాయి. పేదవాడి సొంతింటి కలకు, ఆలయ ఆస్తుల రక్షణకు మధ్య పోరాటం సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు విలువైన స్వామి భూములను కార్పొరేట్ సంస్థలకు, ఇతర అవసరాలకు ‘పందేరం’ చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముడసర్లోవ పార్కుకు సమీపంలో.. సెంట్రల్ జైలు పక్కన సర్వే నంబర్ 275లో ఉన్న సుమారు 150 ఎకరాల దేవస్థానం భూమిలను గూగుల్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గజం దేవస్థానం భూమి కూడా పరాయిపాలు చేయకూడదన్న నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘రాష్ట్ర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ దేవుడి భూములను ధారాదత్తం చేయడం చట్టవిరుద్ధం’ అని వీహెచ్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పంచగ్రామాల కథ.. అంతులేని వ్యధ భీమిలి నియోజకవర్గం పరిధిలోని అడవివరం, పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామాలను కలిపి పంచగ్రామాలుగా పిలుస్తారు. దశాబ్దాలుగా ఈ గ్రామాల్లో భూ సమస్య కొనసాగుతోంది. 1901 నాటి గిల్మెన్ రికార్డుల ప్రకారం సింహాచలం దేవస్థానానికి పై గ్రామాల్లో మొత్తం 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో అడవివరం పరిధిలోనే అత్యధిక భూములు ఉన్నాయి(గతంలో హైకోర్టు 275 సర్వే నంబర్లోని గ్రీన్బెల్ట్గా ప్రకటించిన 5 వేల ఎకరాలతో కలిపి). మిగిలిన సుమారు 1,800 ఎకరాల జిరాయితీ భూములే వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. 1996 వరకు ఈ భూములపై ఎటువంటి వివాదం లేదు. తర్వాత ఈ భూములపై రెవెన్యూ విభాగానికి, సింహాచలం దేవస్థానానికి మధ్య యాజమాన్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. పెందుర్తి, చినగదిలి ఎంఆర్వోలు ఈ భూములపై సర్వహక్కులను సింహాచలం దేవస్థానానికి అప్పగిస్తూ రైత్వారీ పట్టాలు జారీ చేశారు. అప్పటివరకు ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఆ భూములను తమ సొంత ఆస్తిగానే భావించారు. అయితే, దేవస్థానం పేరుతో పట్టా రావడంతో, అక్కడి నివాసితులను దేవస్థానం యంత్రాంగం ఆక్రమణదారులుగా పేర్కొనడం ప్రారంభించింది. దీంతో సమస్య జటిలమైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 12 వేల మందికి పైగా ఈ భూముల్లో నివసిస్తున్నారు. మొత్తం 419 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం ఈ వివాదంపై జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. జీవోను తక్షణం రద్దు చేయాలి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఆలయ భూములను పందేరం చేయడం సరికాదు. గూగుల్ సంస్థకు కేటాయించిన జీవోను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో హైందవ సమాజం తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – ఆచార్య కందర్ప విశ్వనాథ్, అధ్యక్షుడు, వీహెచ్పీ విశాఖ మహానగఇచ్చిన భూమి వెనక్కి.? దాదాపు 30 ఏళ్ల కిందట సెంట్రల్ జైలు నిర్మాణం కోసం అడవివరంలో 106 ఎకరాల దేవస్థానం భూమిని ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా మధురవాడ పరిధిలోని సర్వే నంబర్ 420, 424లో అంతే స్థలాన్ని దేవస్థానానికి కేటాయించింది. అయితే, తాజాగా ఆ ప్రత్యామ్నాయ భూమిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవాలయ ఆస్తులను కాపాడండి హిందూ దేవదాయ ధర్మదాయ చట్టం ప్రకారం దేవాలయ భూములను ఇతర అవసరాలకు వాడటం నిషిద్ధం. ఆలయ ఆస్తులు కేవలం ఆలయ అభివృద్ధికే వాడాలని వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరిస్తే, దానికి సమానమైన విలువ గల భూమిని ఇస్తామని, దేవాలయ ఆస్తులకు నష్టం కలగకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టులకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ తీర్పులను ప్రభుత్వం తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా అప్పన్న భూములను కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ భూములను/ఆస్తులను ప్రభుత్వంతో సహా ఇతరులెవ్వరూ, అన్యాక్రాతం చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావంలో కూడా తీర్మానం చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న పంచగ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. స్వామి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గర్భిణులకు సకాలంలోవైద్య సేవలు అందించాలి
జిల్లా పరిషత్ సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ అనురాధ కె.కోటపాడు: కె.కోటపాడు సీహెచ్సీలో గర్భిణులతో పాటు రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ తెలిపారు. ఆమె బుధవారం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోనే గర్భిణులకు ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కె.కోటపాడు, దేవరాపల్లి, వేపాడ, చీడికాడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కె.కోటపాడు సీహెచ్సీకి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి అందరి మన్ననలు సిబ్బందిని కోరారు. -
కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహం
● దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి ● రైతు కూలీ సంఘం నిరసన ర్యాలీ అనకాపల్లి : కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహమయ్యారని రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. స్థానిక విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి న్యూకాలనీ వరకూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూకాలనీ రోటరీ హాల్లో సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులను, పీడిత ప్రజలను దోపిడీ చేసే విధానాలను వేగవంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే పచ్చని పంట పొలాలను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిల్లాలో దశాబ్దల కాలం పాటు రైతులకు, కార్మికులకు ఉపాధి ని చూపించిన వ్యవసాయాధారిత సుగర్ ఫ్యాక్టరీలను మూసేశారని, గూగుల్ డేటా సెంటర్, బల్క్ డ్రగ్ పార్కులు, ఫార్మా సిటీలు, హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడినప్పుడే పాలకుల దోపిడీ విధానాలను అరికట్టవచ్చని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో రైతులకు, కార్మికులకు సామాన్య ప్రజలకు వ్యతి రేకమైన చట్టాలకు మద్దతు తెలుపుతున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టానికి పని దినాలను తగ్గిస్తున్నారని, రైతు వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలను తీసుకొస్తున్నారని, కార్మిక హక్కులను దెబ్బతీసే నాలు గు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని, ఈ విధానాలపై సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్లా హర శ్రీనివాసరావు, కార్మిక నగారా పత్రిక ఎడిటర్ ఆడారి అప్పారావు, ఏఐఎఫ్ టీయూ(న్యూ) జిల్లా నాయకుడు అప్పలనాయుడు, నవ యువ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్. భాస్కరరావు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైలి రమేష్, రైతులు పాల్గొన్నారు. -
వాహనదారులసహనానికి ‘పరీక్ష’
సాక్షి, అనకాపల్లి : మూడు జిల్లాల నుంచి వచ్చే సరకు రవాణా వాహనదారులు సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ సర్టిఫికెట్)కు కోసం బారులు తీరుతున్నారు. మూడు జిల్లాలకు అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలం దేవీపురంలో ఉన్న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లోనే సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు అంతటికీ ఒకే ఒక్క కేంద్రం ఉండడంతో వాహనాల ఫిట్నెస్ పరీక్షలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సబ్బవరం మండలం దేవీపురం వద్ద వున్న ఈ కేంద్రానికి సమీపంలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు బారులుతీరి కనిపిస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) కోసం యజమానులు/ డ్రైవర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. ఆటోలు, లారీలు, బస్సులు, వ్యాన్లు వంటి వాహనాలను కొనుగోలు చేసిన ఎనిమిది సంవత్సరాల లోపు అయితే రెండేళ్లకు ఒకసారి, ఎనిమిదేళ్లు దాటితే ఏటా ఒకసారి ఫిట్నెస్ టెస్టింగ్ చేయించుకోవాలి. సరకు రవాణా వాహనాలతో పాటు ప్రయాణికులను తీసుకెళ్లే వివిధ రకాల వాహనాలు, విద్యా సంస్థలకు చెందిన బస్సులు, వ్యాన్లకు నిర్ణీత కాలంలో సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ సర్టిఫికెట్) తప్పనిసరిగా నిర్వహించాలి. సర్వర్ మొరాయింపుతో నిరీక్షణ ఏడాదిన్నర క్రితం వరకు వాహనాల ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్)లు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ జారీ చేసేవారు. దీనివల్ల వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి ఫిట్నెస్ టెస్టింగ్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. జిల్లాకు ఒకటి చొప్పున ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లను ఏర్పాటు చేశారు. అనకాపల్లి– ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం శివారు దేవీ పురం టోల్ ప్లాజాకు సమీపంలో ఏటీఎస్ ఉంది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏటీఎస్లను ఏర్పాటు చేయకపోవడంతో ఈ రెండు జిల్లాల వాహనాలకు కూడా సబ్బవరం మండలంలోని ఏటీఎస్లో ఎఫ్సీ జారీ చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో ఉమ్మడి విశాఖపట్నంతోపాటు సరకు లోడింగ్/అన్లోడింగ్ నిమిత్తం విశాఖ నగరానికి వచ్చే ఇతర జిల్లాల వాహనాలు కూడా ఎఫ్సీల కోసం సబ్బవరం ఏటీఎస్లో స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఫిట్నెస్ పరీక్షలకు వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో వాహనాలను జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలుపుదల చేస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. కొన్నిసార్లు రెండు, మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు యజమానులు/ డ్రైవర్లు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మరోవైపు ఏటీఎస్లో సిబ్బంది కొరత, రవాణా శాఖ సర్వర్ తరచూ మొరాయిస్తుండడం వంటి కారణాలతో ఎఫ్సీల జారీ ఆలస్యం అవుతున్నది. ఆరు నెలలైనా..ఆచరణ లేదు.. సబ్బవరం మండలంలోని ఏటీఎస్పై ఒత్తిడి పెరగడంతో సర్సీపట్నంలో మరో ఏటీఎస్ను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులు ప్రతిపాదన చేశారు. ఆరు నెలల కిందట జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై మాట్లాడారు. ఏటీఎస్ సబ్బవరం మండలంలో ఉండడం వల్ల సర్సీపట్నం పరిసర ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల నర్సీపట్నంలో ఏటీఎస్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి రవీంద్ర స్పందిస్తూ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామనని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇది జరిగి ఆరు నెలలు దాటినా మరో ఏటీఎస్ మంజూరు కాలేదు. మళ్లీ ఈ నెల 15వ తేదీన సోమవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో కూడా ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఆరు నెలల కిందట జరిగిన డీఆర్సీ సమావేశంలో నిర్ణయించిందే ఆచరణలోకి రాలేదు. మరి నిన్న జరిగిన డీఆర్సీ సమావేశంలో నిర్ణయం మరి ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో వేచిచూడాల్సిందే. అప్పటి వరకూ వాహన యజమానులకు ఇబ్బందులు తప్పవు.దేవీపురంలోని ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ఫిట్నెస్ పరీక్ష కోసం వచ్చిన వాహనం వాహనాల ఫిట్నెస్ పరీక్ష కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి అనకాపల్లి–సబ్బవరం హైవే సర్వీసు రోడ్డుపై బారులు తీరుతున్న వాహనాలు ఫిట్నెస్ పరీక్షతో పాటు ఎఫ్సీ జారీలో తీవ్ర జాప్యం వాహనాల యజమానులు, డ్రైవర్ల పడిగాపులు నర్సీపట్నంలో మరో ఏటీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు డీఆర్సీలో ఆమోదించినా కార్యరూపం దాల్చని వైనం -
బయోగ్యాస్తో సుస్థిర భవిష్యత్తు సాధ్యం
పాయకరావుపేట : స్పేసెస్ డిగ్రీ కళాశాలలో బయోగ్యాస్పై అవగాహన సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గంగాగ్నిరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు బయోగ్యాస్ తయారీ విధానాలను వివరించారు. వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారు చేయడం పునరుత్పాదక శక్తి విధానాలలో ఉత్తమమైన మార్గం అని అన్నారు. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలిగించకుండా డెయిరీ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, ఫార్మా కంపెనీల వ్యర్థాఉ ముడి పదార్థాలుగా ఉపయోగించి బయెగ్యాస్తో పాటు సేంద్రియ ఎరువును, విద్యుత్తును, వాహనాలకు ఇంధనం పొందవచ్చునని దీని ద్వారా వ్యర్థాలను సంపదగా మలచ్చుకోవచ్చునని తెలిపారు. బయోగ్యాస్ యువతకు ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని దేశ అభివృద్ధికి, సుస్ధిర భవిష్యత్తుకు సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు, చైర్మన్ డాక్టర్ కంటిపూడి నరేంద్రబాబు, ప్రిన్సిపాల్ డా. ఎ.రామకృష్ణారెడ్డి, శాస్త్రవేత్త, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నగేష్ కుమార్, విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
300 లీటర్లసారా పులుపు ధ్వంసం
నాతవరం : నిబంధనలు ఉల్లఘించి నాటుసారా తయారీ చేసినా విక్రయించినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. మండలంలో గుమ్మడిగొండ గ్రామ సమీపంలో గల తాండవ నది ఓడ్డున గుట్టుగా నాటు సారా తయారు చేస్తున్న బట్టీలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల పులుపు ధ్వంసం చేశారు. సారా తయారు చేసేందుకు ఉపయోగించే సామాగ్రిని కొన్నింటిని ధ్వంసం చేసి మిగిలినవి పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే సారా తయారు చేసే నిర్వాహకులు పరారయ్యారు. సారాను అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసామని ఎస్ఐ తెలిపారు. -
‘పది’ పరీక్షలకువందరోజుల ప్రణాళిక
అనకాపల్లి టౌన్ : రానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్ధానిక ఉడ్పేట పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పదో తరగతి పరీక్షల 100 రోజులు ప్రణాళిక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఈ బుక్లో ఉన్న సిల్బస్ను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదో తరగతి పరీక్షల పరిశీలకుడు శ్రీధర్ రెడ్డి, ఎంఈవో ఎస్.కోటేశ్వరావు, సీసీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు. -
అమరజవాన్లకు నివాళులు
అనకాపల్లి : ఇండో–పాక్ యుద్ధంలో 1971 లో అమరులు జవాన్లకి ప్రతి ఏడాది డిసెంబర్ 16న నివాళులు అర్పించడం జరుగుతుందని అనకాపల్లి సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అగ్గాల హనుమంతరావు అన్నారు. స్థానిక మొయిన్రోడ్డు అసోసియేషన్ కార్యాయంలో అమర జవాన్ల చిత్రపటానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1971 యుద్ధంలో పాకిస్తాన్న్పై భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 16, 1971న, పాకిస్థాన్ దళాల అధిపతి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేయించారని 93,000 కంటే ఎక్కువ పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం, బంగ్లాదేశ్ ముక్తి బాహిని సంయుక్త దళాలకు లొంగిపోయారని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది అతిపెద్ద సైనిక లొంగుబాటుగా మిగిలిపోయిందన్నారు. ఈ యుద్ధం తరువాత 13 రోజుల వివాదం తూర్పు పాకిస్తాన్ విముక్తి, బంగ్లాదేశ్ను స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా సృష్టించడంలో ముగిసిందన్నారు. ఈ యుద్ధం 13 రోజులు కొనసాగిందని, దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యు లు గొన్న ఆదిరాజు, రావాడ సత్యనారాయణ, గుణ నాగభూషణం, వంటాకు పైడితల్లి, జాజుల గోవిందరావు, మద్దాల నూకరాజు, వేగి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’
కశింకోట : జిల్లాలో ఎక్కడైనా మాదిగ కులస్తులకు అన్యాయం జరిగితే సహించేది లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని బయ్యవరంలో జిల్లా మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యలక మల్లిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మట్లాడుతూ మాదిగలను విస్మరించిన ఏ పార్టీలు చరిత్రలో నిలవలేదన్నారు. మాదిగలు మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా ఏబీసీ వర్గీకరణతో రిజర్వేషన్ సాధించుకోవడంతో ఫలితాలు దక్కాయన్నారు. ఎ మ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి పోసపల్లి వెంకటరావు, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి తోత్తరమూడి శ్రీనివాస్, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లిపూడి సత్యనారాయణ, ఇండిగపల్లి దేముడుబాబు, జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు ఎలుసూరి ఘాటీలు, జిల్లా అధికార ప్రతినిధి కొల్లి చిన్న అప్పారావు, కోశాధికారి చెవ్వే టి అప్పారావు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ కనకేశ్వరరావు, ఎమ్మెస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టమూరి మంగరాజు పాల్గొన్నారు. 21 కేజీల గంజాయి స్వాధీనం గొలుగొండ: కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చెరకు కాటా వద్ద రెండు బైక్లపై నలుగురు వ్యక్తులు 21 గంజాయి తరలిస్తుండగా ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. రెండు బైక్లపై ఏజెన్నీ నుంచి అల్లూరి జిల్లాకు చెందిన వంతల సత్తిబాబు, పాంగి సత్తిబాబుతో పాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు తసెల్వరి, సెల్వర్లు గంజాయి తరలిస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడిందని, నిందితులను అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు రెండు బైకులు, మూడు సెల్ఫోన్లు, రూ.4520 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డులో మంచు వానసూర్యోదయం వేళ.. మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది. అడుగడుగునా దట్టమైన వృక్షాలు, భూమిని తాకేటట్టుగా వేలాడుతున్న పచ్చని తీగలు. వనమూలికల సువాసనతో స్వచ్ఛమైన గాలి ఔషధంగా మారిపోయింది. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. చెట్లపైనుంచి జారే మంచు బిందువుల ’చిటపట’ శబ్దాలు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. భానుడి స్వర్ణమయ కిరణాలు ఆకులపై పడి మరింత ప్రకాశవంతంగా మారాయి. మన్యం ప్రాంతమంతా స్వచ్ఛమైన ఆకుపచ్చ, గోధుమ, పసిడి రంగుల మేళవింపుతో సరికొత్త అందాన్ని సంతరించుకుంది. – రంపచోడవరం -
జిల్లాలో 3988 టన్నుల ధాన్యం సేకరణ
తుమ్మపాల : ఖరీఫ్ 2025–26 సీజన్కు జిల్లాలో ఈ నెల 16 నాటికి అత్యఽధికంగా 3,988.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగిందని, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,428 మంది రైతుల నుంచి రూ.9.46 కోట్ల విలువ గల ధాన్యం సేకరించినప్పటకి రూ.6.92 కోట్లను 1,179 మంది రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల లోపే 74 శాతం చెల్లించడం జరిగిందని, మిగిలిన రూ.2.54 కోట్ల తదుపరి బ్యాంకు బ్యాచి ప్రాసెస్ జమచేయడం జరుగుతుందన్నారు. రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు అందించడం జరిగిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులున్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెం.8008901584ను సంప్రదించాలన్నారు. జిల్లాలో 65 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని తెలిపారు. -
రెవెన్యూ డివిజన్పై డీఆర్సీలో తీర్మానం ప్రశంసనీయం
మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగేలా ప్రభుత్వ పెద్దలు తీర్మానం చేయడం సంతోషకరమని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. అనకాపల్లిలో మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం త్వరితగతిన అమలు జరిగేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 27న కొత్తగా నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి వచ్చేలా జీవో విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలుపుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో పాటు నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా రైతులు, ప్రజల సహకారంతో పలు రూపాల్లో నిరసన తెలిపామన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్కు కూడా వినతిపత్రం అందజేసినా సానుకూల నిర్ణయం రాకపోవడంతో మునగపాకలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఈ నెల 15న అనకాపల్లిలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా చూడాలని కోరుతూ ఇన్చార్జి మంత్రి రవీంద్ర దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. 1491 జీవోను సవరించి యథావిధిగా అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి ఉండేలా మరో జీవో వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచ్లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, సుందరపు తాతాజీ, భీశెట్టి గంగప్పలనాయుడు, కర్రి పెదబ్బాయి, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, బొడ్డేడ బుజ్జి, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, పార్టీ నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, శీరా రమణమ్మ, కాండ్రేగుల జగన్, రామజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. సభలో ప్రజల వాణి వినిపించిన ఎమ్మెల్సీ కల్యాణికి కృతజ్ఞతలు అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గాన్ని కొనసాగించాలి వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ -
జిల్లా వినియోగదారులసంఘం అధ్యక్షుడిగా రాంబాబు
అనకాపల్లి: జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా రొంగలి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి విక్రమ్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాపేటి శివసత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బి.త్రినాథరావు, సహాయ కార్యదర్శిగా పసుపులేటి భవనేశ్వరరావుతో పాటు మరో 11 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా మరుపిల్లి ఎల్లారావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రొంగలి రాంబాబు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. -
‘సమాధులకు గుర్తులు పెట్టుకోండి’
కశింకోట: కశింకోటలోని జామియా మసీదుకు చెందిన శ్మశానవాటికను ఎత్తు చేయాలని సంకల్పించామని, సమాధులు కనిపించకుండా పో యే అవకాశం ఉన్నందున మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు వచ్చి గుర్తులు పెట్టుకోవాలని మసీదు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. ఏ మాత్రం వర్షం పడినా పల్లంగా ఉన్న శ్మశానవాటిక ప్రాంతంలో నీరు చేరి బురదగా మారుతున్న కారణంగా మృతుల అంత్యక్రియలకు, పక్కన మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. శ్మశానవాటిక ప్రాంతాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేయాలని భావిస్తున్నామన్నారు. శ్మశానంలో శాశ్వత సిమెంట్ సమాధులు నిర్మించడం సంప్రదాయానికి విరుద్ధమన్నారు. -
ఈ కమీషన్తో బతకలేం..
● వడ్డాది రేషన్ డీలర్ రాజీనామా బుచ్చెయ్యపేట : మండలంలోని మేజర్ పంచాయతీ వడ్డాది రేషన్ డిపో నంబర్ 10 డీలర్ దొండా వెంకట రామ అన్నయ్యదొర రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బుచ్చెయ్యపేటలో తహసీల్దార్ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఆయన అందించారు. 32 ఏళ్లకు పైగా రేషన్ డీలర్గా చేసిన తాను ఇప్పుడున్న పరిస్థితిలో రేషన్ డీలర్గా కొనసాగలేనని రాజీనామా పత్రంలో అన్నయ్యదొర పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన నెలవారీ కమీషన్ కూడా ఇవ్వలేకపోతుందని, నెలంతా కష్టపడిన అరకొర కమీషన్తో జీవించలేక పోతున్నామని వాపోయారు. ప్రభుత్వం గత మూడు నెలలుగా కమీషన్ కూడా అందించకపోగా, ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం అందించమని అధికారుల వేధింపులకు విసుగు చెంది తన డీలర్ షిప్నకు రాజీనామా చేసినట్లు తెలిసింది. -
ప్రైవేటీకరణపై ఎస్ఎఫ్ఐ ధర్నా
నర్సీపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు గౌతమ్ డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి ఆలోచనతో మెడికల్ కాలేజీలను నిర్మిస్తే, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూడడం దారుణమన్నారు. పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. రూ.6,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. స్కాలర్షిప్లు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేయాలన్నారు. మెస్ఛార్జీలు రూ.3 వేలుకు పెంచాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మూర్తి, శ్రీను, వరుణ్, అవినాష్, చరణ్, ఆకాష్, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
కస్టమ్స్ కత్తెర!
ఎగుమతులకుసాక్షి, విశాఖపట్నం: నగరంలోని ప్రధాన ఫర్నిచర్ షోరూమ్లలో విక్రయించే ఫర్నిచర్ అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతుంటుంది. ఇక్కడ కంటైనర్ టెర్మినల్, పోర్టులు ఉన్నప్పటికీ వ్యాపారులు చైనా నుంచి సరుకును నేరుగా విశాఖకు రప్పించడం లేదు. కోల్కతా లేదా చైన్నె పోర్టులకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తీసుకురావాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే.. పదేళ్ల కిందట ఓ వ్యాపారి చైనా నుంచి నేరుగా ఇక్కడికి ఫర్నిచర్ తీసుకురాగా.. దాని ధ్రువీకరించి క్లియరెన్స్ ఇచ్చేందుకు కస్టమ్స్ వారికి ఏడాది సమయం పట్టింది. ఆ అనుభవంతో అప్పటి నుంచి ఏ వ్యాపారీ ఫర్నిచర్ను నేరుగా విశాఖకు తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాదు.. అనేక ఉత్పత్తుల విషయంలో విశాఖ కస్టమ్స్ నుంచే ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అన్నీ ఉన్నా.. అవే లేవు : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది విశాఖపట్నం కార్గో ఎగుమతి, దిగుమతుల పరిస్థితి. సామర్థ్యానికి తగ్గట్లుగా సరుకు నిర్వహణలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఇక్కడ వృద్ధి స్తంభించిపోయింది. విశాఖ పరిధిలో తయారవుతున్న ఉత్పత్తులు కూడా హైదరాబాద్ మీదుగా ముంబయి వెళ్తున్నాయి. సర్టిఫైడ్ ఏజెన్సీల కొరత ఓవైపు వేధిస్తుండగా, ఎగుమతులకు ‘కస్టమ్స్’ తీరు ప్రధాన అవరోధంగా మారింది. వచ్చే కార్గో నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన నిపుణుల బృందాలు విశాఖ కస్టమ్స్ వ్యవస్థలో లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 200 ఉత్పత్తులకే పరిమితం! : విశాఖ కస్టమ్స్ హౌస్లో నాణ్యత పరిశీలన నిపుణులు లేరనే వాదన బలంగా ఉంది. సరుకు రవాణా అభివృద్ధికి ఇదే ప్రధాన ఆటంకమని వాణిజ్య ప్రతినిధులు చెబుతున్నారు. ముంబయిలో 2000కి పైగా, చైన్నెలో 1500 వరకు కార్గో ఉత్పత్తులను కస్టమ్స్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వచ్చే ప్రతి సరుకు ఏ గ్రేడ్లో ఉంది? ఎంత నాణ్యమైనది? దానికి ఎంత పన్ను వేయాలి? అనే విషయాలను అక్కడి నిపుణులు క్షణాల్లో చెప్పగలరు. తక్కువ వ్యవధిలోనే ధ్రువీకరించి క్లియరెన్స్ ఇస్తారు. కానీ, విశాఖలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు పసుపు కొమ్ముల ఎగుమతి కోసం వ్యాపారులు విశాఖకు వస్తే, వాటి నాణ్యత పరిశీలనకే రోజుల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా సరుకు ఇక్కడే పాడైపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలావరకు ఉత్పత్తులను చైన్నె లేదా ముంబయికి తరలిస్తున్నారు. ఇక విశాఖలో తయారయ్యే మందుల నాణ్యతను ధ్రువీకరించి, క్లియరెన్స్ ఇచ్చే నిపుణులు ఇక్కడ లేరు. వీటి కోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నా, అవి విశాఖలో అందుబాటులో లేకపోవడంతో సరుకును హైదరాబాద్కు తరలించి, అక్కడ సర్టిఫికెట్లు తీసుకొని ముంబయి ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా విశాఖలో కార్గో హ్యాండ్లింగ్ కేవలం 200 ఉత్పత్తులకే పరిమితమైపోయింది. ముంబయితో పోలిస్తే 20 శాతం, చైన్నెతో పోలిస్తే 25 శాతం ఉత్పత్తులు మాత్రమే విశాఖ నుంచి ఎగుమతి, దిగుమతులవుతున్నాయి.కొత్త ఉత్పత్తులకు అవకాశం లేదా? కస్టమ్స్ మదింపు కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వైజాగ్ కస్టమ్స్ హౌస్కు వచ్చే అప్రైజర్లు కేవలం ఈ ప్రాంతంలో రవాణా అయ్యే పరిమిత సరుకులపైనే పట్టు సాధిస్తున్నారు. కొత్తగా ఏదైనా సరుకు వస్తే, దాని నాణ్యతను పరిశీలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఉత్పత్తులకు తగ్గట్టుగా కస్టమ్స్ హౌస్ తమ బృందాలను సిద్ధం చేయలేకపోతోంది. ఏవో కొర్రీలు వేసి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తాము సిద్ధంగా ఉన్నామని స్టేక్హోల్డర్స్ చెబుతున్నా, కస్టమ్స్ నుంచి స్పందన లేకపోవడంతో పరిమిత కార్గోను మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొన్ని ఉత్పత్తులను ఉత్తరాది నుంచి విశాఖ తీసుకొచ్చి, నేరుగా సింగపూర్, ఈశాన్య ఆఫ్రికా దేశాలకు పంపించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నా.. ఇక్కడ సరైన పరిశీలన బృందాలు లేక వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా.. కార్గో ఎగుమతులు ముందుకు కదలక.. కొత్త ఉత్పత్తుల హ్యాండ్లింగ్కు అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. కస్టమ్స్ విభాగంలో మార్పులు వస్తేనే విశాఖలో ఎగుమతులు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల బృందం లేక ఎగుమతిదారుల ఇక్కట్లు నాణ్యత ధ్రువీకరణకు పరికరాలు, నైపుణ్యం కొరత సౌకర్యాల లేమితో సరుకు రవాణాకు అంతరాయం -
టీడీపీ నాయకుల కుమ్ములాట
రావికమతం : మండలంలో తట్టబంద గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక పంచాయతీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభ రసాభాసగా మారింది. టీడీపీకి చెందిన ప్రస్తుత సర్పంచి గోకాడ రమణ విభజనకు అనుకూలంగా ఉండగా, అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శేఘబాబు,మాజీ ఉప సర్పంచ్ సింబోతు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పంచాయతీ విభజనపై అనుకూలం, వ్యతిరేకిస్తున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. పంచాయతీని విడదీయడానికి వీల్లేదని కొందరు, వీడదీయాల్సిందేనని మరికొందరు అధికారుల ముందే బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. అరుపులు కేకలతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీల విభజనపై వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తట్టబంద పంచాయతీలో ఎల్.ఎన్.పురం, బూరుగుపాలెం, కసిరెడ్డిపాలెం, సాయినగర్, పోర్లుపాలెం బలిజిపాలెం గ్రామాలు ఉన్నాయి. 3 వేల జనాభా, 2100 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్.ఎన్.పురం,బూరుగుపాలెం, కసిరెడ్డిపాలెం, పోర్లుపాలెం గ్రామాలను తట్టబంద పంచాయతీ నుంచి విడదీసి ఎల్.ఎన్.పురం కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని సర్పంచ్ గోకాడ రమణ అతడి వర్గీయులు మండల పరిషత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు పంచాయతీ కార్యదర్శి విజయ మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. పంచాయితీ విభజనను ఎంపీటీసీ సభ్యులు శేషుబాబు, మాజీ ఉప సర్పంచ్ సింబోతు నాయుడు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్పంచ్ రమణ ఎవరికీ చెప్పకుండా తీర్మాణం చేసి పంచాయతీని వీడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. తట్టబందను పంచాయతీగా అన్ని ఊర్లు కలిపి ఉండేలా 280 మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ఎల్.ఎన్.పురం కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలని పంచాయతీ తీర్మానం ఆమోదించాలని సర్పంచ్ వర్గీయులు పట్టుబట్టారు. దీంతో గొడవ ముదిరి ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామసభ రసాభాసగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామ సభను వాయిదా చేసినట్లు పంచాయితీ కార్యదర్శి విజయ విలేకరులకు తెలిపారు.పంచాయతీ విభజనపై గ్రామసభ రసాభాస -
పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల గోల్మాల్!
● ఖాతాదారుల సొమ్ము సొంతానికి వాడుకున్న పోస్టుమాస్టర్ ● లబోదిబోమంటున్న బాధితులు ● సస్పెన్షన్తో సరిపెట్టిన అధికారులు నర్సీపట్నం : ఖాతాదారులు డబ్బులు చెల్లించారు..తమ దగ్గర ఉన్న పాస్ బుక్ల్లో జమైంది, కానీ అధికారిక ఖాతాలో జమ కాలేదు..అధికారులు గోల్మాల్ సొమ్ముకు సంబంధం లేదంటున్నారు...మరి తమ సొమ్ముకు సమాధానం చెప్పేది ఎవరని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తన ఖాతా నుంచి రూ.15 వేలు డ్రా చేస్తే రూ.5 వేలు ఇచ్చి, మిగిలిన రూ.10 వేలు ఇవ్వలేదని మన్యపురట్ల గ్రామానికి చెందిన నర్సే లక్ష్మి తెలిపింది. రూ.10 వేలు డ్రా చేస్తే రూ.2500 ఇవ్వలేదని అదే గ్రామానికి చెందిన నర్సే నాగేశ్వరరావు తెలిపారు. రూ.10 వేలు విత్డ్రా చేస్తే రూ.7 వేలు ఇచ్చి, మిగిలిన రూ.3 వేలు ఇవ్వలేదని తోట శివ అనే ఖాతాదారు తెలిపారు. ఇలా పోస్టుమాస్టర్ చేతిలో మోసపోయి వెలుగులోకి రానివారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. నాతవరం మండలం, మన్యపురట్ల పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల వరకు నిధులు గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాతాదారులు చెల్లించిన నగదును పోస్టల్ అకౌంట్లో జమ చేయలేదు. ఈ విషయం అధికారుల విచారణలో రుజువు కావడంతో పోస్టుమాస్టర్ రావాడ సోమరాజును అక్టోబర్ 16న సస్పెండ్ చేశారు. బాధితులు రూ.7 లక్షలు అంటున్నారు.. కానీ అధికారులు సస్పెండ్ చేసిన నాటికి రూ.2 లక్షలు జమ కాలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి రూ.50 వేలు రికవరీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. బ్రాంచి పరిధిలో లింగంపేట, రాజుపేట అగ్రహారం, మన్యపురట్ల, గుర్రంపేట గ్రామాలు ఉన్నాయి. ఆర్డీ, ఎస్హెచ్ఏ, సేవింగ్ అకౌంట్స్, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి సుమారు 300 మంది ఖాతాదారులు ఉన్నారు. ఖాతాదారుల నుంచి కట్టిన నగదు ఏ రోజుకు ఆరోజు మెయిన్ బ్రాంచిలో జమ చేయాల్సి ఉంది. రోజుకు రూ.15 వేలకు మించి నగదు పోస్టుమాస్టర్ దగ్గర ఉండకూడదు. కానీ ఆయన రూ.లక్షలకు లక్షలు తన దగ్గర ఉంచుకుని సొంత అవసరాలకు వాడుకునేవారు. సస్పెన్షన్కు ముందు పోస్టల్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో నగదు సొంత అవసరాలకు వాడుకున్నట్టు రెండు పర్యాయాలు గుర్తించారు. అప్పట్లో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ తనిఖీలో నగదు వాడుకున్నట్టు మూడోసారి రుజువు కావడంతో సస్పెండ్ చేశారు. ఖాతాదారులను పిలిచి అధికారులు విచారించలేదు. పాస్బుక్, ఒరిజనల్ ఖాతాలో నగదుకు తేడా ఉండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా తమ ప్రాథమిక విచారణలో రూ.2 లక్షల వరకు వాడుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఖాతాదారులకు నష్టం జరగకుండా చూస్తామని, అన్ని కోణాల్లో ఇన్స్పెక్టర్ రమేష్ విచారణ చేస్తున్నారని తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తరువాత ఖాతాదారులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
ఏయూక్యాంపస్: 1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మంగళవారం నగరంలో ‘విజయ్ దివస్’వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీచ్రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని కొనియాడారు. ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
నెలగంట మోగింది
నక్కపల్లి : ధనుర్మాసోత్సవాలు ప్రముఖపుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 1.24 గంటలకు ధనుర్లగ్నం ప్రవేశం ప్రారంభ సూచకంగా కొండపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్కి దేవస్థానం ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తిరుమంజనం, ప్రత్యేక అభిషేకాలు, విశేష ప్రసాద నివేదనలు, నిత్యార్చనలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలంకరణ చేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. మధ్యాహ్నం ధనుర్లగ్నలో గరుడాద్రిపై మూలవిరాట్కు ఎదురుగా ఉన్న మండపంలో ఘంటానాదం(నెలగంట) చేయడంతో ధనుర్మాసోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి వద్ద తిరుప్పళి్ౖలయెళ్లిచ్చై, తిరుప్పావై సేవాకాలము నిర్వహించిన తర్వాత నీరాజన మంత్రపుష్పం తర్వాత గోదాదేవి అమ్మవారి వ్రతదీక్షలో భాగంగా తిరుప్పావైలోని మార్గలిత్తింగల్ మదినిరైయింద నమ్మాళాల్ మొదటి పాశురంతో ప్రత్యేక నీరాజనాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం తీర్ధగోష్టి ప్రసాద వినియోగం జరిగింది. కొండదిగువన గల క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి సన్నిధిలోను ఉపాలయాల్లోను ప్రత్యేక ప్రసాద నివేదనలు చేసి స్వామివారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో మొదటి పాశురం విన్నపంతో నీరాజనాలు సమర్పించారు. గరుడ వాహనంపై శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి వారిని, పెద్ద పల్లకిలో గోదాదేవి అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు తొలిదర్శన మిచ్చారు. ఘనంగా ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు ఉపమాక గరుడాద్రిపై ఘంటానాదం మోగించిన అర్చకులు గోదాదేవికి తిరుప్పావై మొదటి పాశురం విన్నపం గరుడవాహనంపై స్వామి దర్శనం -
మహిళా సంఘాలఅభివృద్ధిపై విజన్ ప్రణాళిక
సబ్బవరం: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదురవుతున్న అడ్డంకులను అధిరోహించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధికి ఐదేళ్ల విజన్ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో గ్రామ సంఘాలు మండల సమాఖ్యలలో చేపట్టబోయే జీవనోపాధి కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఉన్నత విద్యా శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సబ్బవరం మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులతో పాటు చోడవరం, అచ్యుతాపురం, పరవాడ, గొలుగొండ, యలమంచిలి, రాంబిల్లి మండలాల ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
కలెక్టర్ కారుకు ప్రమాదం
కలెక్టర్ కారును ఢీకొన్న ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన మరో కారు అనకాపల్లి టౌన్: జిల్లా కలెక్టర్ కారును మరో కారు ఢీ కొంది. డీజిల్ పోయించుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కారును సబ్బవరం వైపుగా తుమ్మపాల ఏలేరు కాలువ టర్నింగ్ పాయింట్కు తీసుకువెళుతుండగా, సబ్బవరం వైపు వెళుతున్న మరో కారు బలంగా ఢీకొంది. ఈ సమయంలో కారులో కలెక్టర్ లేరు. రెండో కారు ముందు భాగం కొంత నుజునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం అనంతరం ధనుర్లగ్న ప్రవేశాన్ని అనుసరించి మధ్యాహ్నం 12.57 గంటలకు విశేష ప్రసాద నివేదనలు అనంతరం ఘంటానాదం (నెలగంట) మోగిస్తారు. జనవరి 14వ తేదీ వరకు 30 రోజులపాటు శ్రీదేవీ, భూదేవీ సమేత కల్కి వేంకటేశ్వరస్వామివారికి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రతి రోజు రెండు వాహనాల్లో ఒకే సమయంలో గ్రామ తిరువీధి సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. స్వామివారి ఆలయంలో గోదాదేవి వ్రత దీక్షలో భాగంగా 30 రోజులపాటు తిరుప్పావై సేవాకాలం నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశిని (వైకుంఠ ఏకాదశి) పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు రంగనాథుని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భోగీ రోజున గోదారంగనాథుల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను రాజాధిరాజ వాహనంలో ఉంచి సాయంత్రం గరుడాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. -
30న అప్పన్న ఉత్తరద్వార దర్శనం
సింహాచలం: ఈనెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అన్నిశాఖల సమన్వయంతో ఏర్పా ట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 30న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయ, ఆరోజు 5.30 నుంచి 11 గంటల వరకు ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ ద్వార ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. 40 వేల మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. అన్ని దర్శన క్యూల్లో మంచినీరు అందిస్తామన్నారు. 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద భవనంలో పొంగలి, పులుసు ప్రసాదం అందిస్తామన్నారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు సింహగిరిపై రిసెప్షన్ కేంద్రం, కల్యాణం గ్రౌండ్ల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఈనెల 29 రాత్రి 7 గంటల తర్వాత సింహగిరిపై బస్సులు అనుమతించమని, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రమణ, ఏసీపీ పృథ్వీతేజ్, గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎకై ్సజ్, ఫైర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘మా ఊరి వెంకన్న’ చిత్ర నిర్మాత, దర్శకులకు అవార్డు ప్రదానం
చిత్ర నిర్మాత కోటేశ్వర శర్మను సత్కరిస్తున్న దృశ్యం మునగపాక: విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా మునగపాకకు చెందిన నిర్మాత వెలవలపల్లి కోటేశ్వర శర్మ నిర్మించిన మా ఊరి వెంకన్న చిత్రానికి అవార్డు అందజేశారు. యజ్ఞ శ్రీ బ్యానర్పై డాక్టర్ కోరుకొండ గోపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపిక చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 14వ తేదీన ఆహుతుల చేతుల మీదుగా నిర్మాత కోటేశ్వరశర్మ, దర్శకుడు గోపీకృష్ణలు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. -
నక్కపల్లి డివిజన్ నుంచి 3 మండలాల మినహాయింపునకు తీర్మానం
కొత్తగా ఏర్పాటు చేస్తున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో కలుపుతున్న కొన్ని మండలాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని, నక్కపల్లిలో కలపవద్దని వైఎస్సార్సీపీ నేతలు తనకు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆమె ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు అందజేశారు. ఈ సమస్య గురించి మరికొందరు ప్రజా ప్రతినిధులు ప్రస్తావించడంతో నక్కపల్లి డివిజన్ నుంచి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను మినహాయించి.. అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని డీఆర్సీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకై క సహకార చక్కెర కర్మాగారమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేసి.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వసతి గృహలలో విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గొలుగొండ మండలంలో కేజీబీవీ స్కూల్లో గర్భం దాల్చిన మైనర్ బాలిక విషయంలో టీచర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పెద్దేరు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎన్టీఆర్ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోందని చెప్పారు. కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించి గొలుగొండ కేజీబీవీ పాఠశాలల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లను సస్పెండ్ చేశామని, ఎన్టీఆర్ ఆసుపత్రిలో మందుల కొరత లేదని.. ఆసుపత్రి కోసం ఇటీవల నిధులు కూడా కేటాయించామని చెప్పారు. -
వచ్చే నెల 21న పల్స్ పోలియో
తుమ్మపాల: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జనవరి 21 ఆదివారం రోజున జిల్లావ్యాప్తంగా ‘పోలియో ఆదివారం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి బ్యానర్ ఆవిష్కరించారు. ఎలాంటి అపోహలకు లోను కాకుండా తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాల ని కోరారు. అనంతరం జాతీయ విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద కలెక్టర్ విజయ కృష్ణన్ విద్యుత్ శాఖ ఎస్ఈ గొప్పు ప్రసాద్తో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విద్యు త్ పొదుపు పౌరులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. -
జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు మాకవరపాలెం విద్యార్థి
ఎంపికై న విద్యార్థి తేజరామ్తో వ్యాయామ ఉపాధ్యాయులు రవి, చంద్రదేవి నర్సీపట్నం: మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి వి.తేజరామ్ జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడని హెచ్ఎం నారాయణరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వీరవాసంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో విద్యార్థి వి.తేజరామ్ మంచి ప్రతిభను కనబరిచాడు. ఉమ్మడి విశాఖ జిల్లా నుండి విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి తేజరామ్ను, వ్యాయామ ఉపాధ్యాయులు రవి, చంద్రదేవిలను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు
తుమ్మపాల: అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి, దేశ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. రేపు మెగా జాబ్ ఫెయిర్ నైపుణ్యాభివృద్ధి–శిక్షణ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పోస్టర్ను విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశమని, 50కి పైగా ప్రముఖ కంపెనీలు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. గవరపాలెంలోని ఆదినారాయణ మహిళా కళాశాల (పార్క్ సెంటర్ వద్ద) ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు ఆమె సెల్ఫోన్లు పంపిణీ చేశారు. డిజిటల్ కార్యక్రమాల అమలులో భాగంగా సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను అందిస్తున్నామన్నారు. -
నాగజ్యోతి, సాహితీలకు సత్కారం
ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహితీలకుసన్మానం రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి, జల యోగాసానాల్లో 32 ప్రపంచ రికార్డులను సాధించిన ఆమె కుమార్తె సాహితీలను ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఘనంగా సన్మానించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన తల్లీ, కుమార్తెలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ లిఫ్టింగ్లో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు సాధించిన ఇంగ్లిష్ టీచర్ నాగజ్యోతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొందడం ఎంతో గర్వకారణమని చెప్పారు. అలాగే ఆమె కుమార్తె తల్లికి తగ్గ తనయలా జలయోగాసనాల్లో ప్రపంచ రికార్డులను సాధించడమే కాక తొమ్మిదో తరగతిలోనే అమెరికాలో ‘నాసాను’ సందర్శించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్లో వీరు మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. -
రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు చీడికాడ విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మధు చీడికాడ: రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు చీడికాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు అక్షరశ్రీ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ బి.మధు తెలిపారు. ఈనెల 14న విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీలలో 40 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు యర్రా హానిస్ సార్ట్ జూనియర్ లెవెల్–1, యర్రా గ్రీష్మ జూనియర్ లెవెల్–1, గెంజి భరత్ స్టార్ జూనియర్ లెవెల్–3 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మధు తెలిపారు. -
త్వరలోనే సొంత భవనంలోకి ఎన్ఐవో
సాక్షి, విశాఖపట్నం: దశాబ్ద కాలం సుదీర్ఘ పోరాటం తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో సొంత భవనంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. తూర్పు తీరంలో సముద్ర పరిశోధనలకు ఊతమిచ్చే ఏకై క అధ్యయన సంస్థ అయిన ఎన్ఐవో కార్యాలయం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలోని అద్దె భవనంలో కొనసాగుతోంది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో బీచ్కు ఆనుకొని రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ భవనాన్ని జనవరి నెలలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు తీరం.. బంగాళాఖాతంలో సముద్ర పరిశోధన కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్న ఎన్ఐవో... తీరప్రాంత వాతావరణం, సముద్ర అడుగుభాగంలోని ఖనిజ వనరులు, సెడిమెంట్లు, సీబెడ్ మ్యాపింగ్, అలలు, ప్రవాహాలు, మాన్సూన్, వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఇది కృషి చేస్తుంది. జనవరిలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు.! అవరోధాలు తొలగిన తర్వాత ఎన్ఐవో సొంత భవన నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు, అనుసంధాన రహదారి పనులు జరుగుతున్నాయి. ఎన్ఐవో భవన సముదాయానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరుచేస్తూ.. నిర్మాణ పర్యవేక్షణ పనులు సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. కోల్కతాకు చెందిన కాంట్రాక్టర్ పనుల టెండర్ దక్కించుకున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని మూడు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. పరిపాలన భవనమంతా ఒక బ్లాక్లు, రీసెర్చ్ కోసం మరో బ్లాక్, ఇతర అవసరాలకు మూడో బ్లాక్ని వినియోగించనున్నారు. ఎదురుగా ఉన్న సముద్రం నుంచి నేరుగా లేబొరేటరీకి అవసరమైనంత నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సైంటిస్ట్ ఇన్చార్జ్ డా.వీవీఎస్ఎస్ శర్మ తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సముద్ర పరిశోధనల్లో మరింత పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తామని డా.శర్మ తెలిపారు. రుషికొండలో నిర్మితమవుతున్న ఎన్ఐవో శాశ్వతభవనం2015లో శంకుస్థాపన జరిగినా.. సొంత భవనం కోసం ఎన్ఐవో సుదీర్ఘ కృషి చేసింది. 2015లో శంకుస్థాపన జరిగినా.. భవనం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో ఉండటం వల్ల అనుమతులు పొందడానికి అవస్థలు ఎదురయ్యాయి. స్థానిక ఇబ్బందులను కూడా ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు కొత్త భవనం సముద్ర పరిశోధనలకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
యలమంచిలిని ‘అనకాపల్లి’లోనే కొనసాగించాలి
మునగపాక: అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగించేలా చూడాలని కోరుతూ ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి సోమవారం పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ వినతి అందజేశారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలపడం వలన ఇబ్బందులు తప్పవని ప్రసాద్ వివరించారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీటీసీలు మొల్లేటి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, ఇల్లా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, గణపర్తి సర్పంచ్ చదరం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
20 ఏళ్లుగా తిరుగుతున్నా.. ఎప్పటి నుంచో సాగులో ఉన్న భూమి మరొకరికి డీపట్టా ఇచ్చి సృష్టించిన భూ సమస్య పరిష్కరించకుండా కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయం వారు 20 ఏళ్లుగా తిప్పించుకుంటున్నారు. బోడపాలెం సర్వే నెం.439–2లో 70 సెంట్ల భూమిని నా భర్త గొర్లె అప్పన్న, వారి పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాము. నా భర్త మరణానంతరం సాగు భూమికి డీపట్టా ఉందంటూ పంచదార్ల చినరాజులమ్మ మనుషులు నా భూమిలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి 70 సెంట్ల బంజరు భూమి మా సాగులో ఉందని చెప్పిన అధికారులే ఇప్పుడు ఆ భూమి సబ్డివిజన్ మారిపోయిందని మాట మారుస్తున్నారు. 70 ఏళ్ల వయస్సులోనూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. –గొర్లె కాంతం, గొల్లల సన్యాసిరాజుపాలెం, కోటవురట్ల మండలం ఆక్రమణదారులతో రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కు నా అత్తమామల ద్వారా సంక్రమించిన భూమిని ఇతరులు ఆక్రమించి నాపై దాడి చేస్తున్నారు. ఆన్లైన్ చేయడానికి దరఖాస్తు చేస్తే తహసీల్దార్, సర్వేయర్, డీటీ, వీఆర్వో ఆక్రమణదారులతో కుమ్మకై ్క నాకు అన్యాయం చేస్తున్నారు. మూడేళ్లుగా కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గత వారం వస్తే అర్జీ పెండింగ్లో ఉందంటూ చాలాసేపు నమోదు కూడా చేయలేదు. మొత్తానికి నమోదు చేసుకున్నాక కలెక్టరమ్మ వద్ద మొర పెట్టుకుంటే కింది అధికారులకు అప్పగించారు. నా కొడుకు మరణించడంతో నేనే తిరగాల్సి వస్తోంది. నాకు దిక్కెవరు? –బుదిరెడ్ల ముత్యాలమ్మ, వాకపల్లి, దేవరాపల్లి మండలం తుమ్మపాల: వినతులు పేరుకు పోతున్నాయి.. సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.. పరిష్కారాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.. ఇదీ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) పరిస్థితి. ఈ వారం మొత్తం 325 అర్జీలు అందాయి. కలెక్టర్ విజయ కృష్ణన్తోపాటు డీఆర్వో సత్యనారాయణ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు క్షేత్రస్ధాయి పరిస్థితిని తెలుసుకొని తగిన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుల సంఖ్య పెరగకుండా త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలన్నారు. దివ్యాంగ పింఛన్ నిలిపేశారు దివ్యాంగురాలైన నాకు వికలాంగ పింఛన్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. నా సోదరుడికి ఉద్యోగం ఉందంటూ నా పింఛన్ నిలిపేశారు. నాకు వివాహమై నాలుగేళ్లంది. నా భర్తతో కలిసి వేరుగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ నా తల్లిదండ్రుల రేషన్ కార్డు ఆధారంగా పింఛన్ నిలిపివేయడంతో నాకు జీవనాధారం పోయింది. –మర్లి రాజేశ్వరి, తీడ, కశింకోట మండలం కలెక్టరమ్మ న్యాయం చేయాలి జగనన్న హౌసింగ్ పథకంలో నాకు కోడూరులో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు కానీ కొత్త ప్రభుత్వం పట్టించుకోలేదు. పింఛన్ రూ.4 వేలు ఇంటి అద్దెకే ఖర్చయిపోతున్నాయి. ప్రభుత్వం ఇంటిని పూర్తి చేసి ఇస్తేనే నా కష్టాలు తీరుతాయి. ఒంటరిగా జీవిస్తున్న నన్ను అధికారులు రకరకాల పత్రాలు కావాలంటూ తిప్పిస్తున్నారు. కలెక్టరమ్మ నాకు న్యాయం చేయాలి. – షాకే బేగం, గవరపాలెం, అనకాపల్లి మండలం సీఆర్ఎంటీల మొర ఆలకించండి స్కూల్ కాంప్లెక్స్లను ఏ, బీ క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవడంతోపాటు సీఆర్ఎంటీల అర్హతల ఆధారంగా వేతనాలు పెంచాలని, ఎంటీఎస్ అమలు, డీఎస్సీలో వెయిటేజీ వంటి సమస్యల పరిష్కరించాలని ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. సమగ్ర శిక్షలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. సీఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలంటూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందించారు. -
అమరజీవి ఆశయ సాధనకు కృషి
అనకాపల్లి: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయసాధనకు యువత కృషి చేయాలని అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, తన ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో అమరజీవిగా నిలిచిపోయారన్నారు. కార్యాలయం పరిపాలనాధికారి సి.హెచ్.తిలక్ బాబు, సీఐలు లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, ఎస్ఐ సురేష్బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న పాల వ్యాన్
బుచ్చెయ్యపేట: మండల కేంద్రంలో పాల వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆదివారం తెల్లవారు జామున రాజాం నుంచి బుచ్చెయ్యపేట వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపోగా, ట్రాన్స్ఫార్మర్ కింద పడి వైర్లు తెగి పడ్డాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో పాటు లారీ వేగానికి చెట్లు విరిగి పడ్డాయి. నిత్యం జనాల రద్దీతో ఉండే ఈ రోడ్డులో తెల్లవారు జామున ప్రమాదం జరగగా, జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని కాలు విరిగిపోగా స్థానికులు కిందకి దించి సపర్యలు చేశారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కశింకోట– బంగారుమెట్ట(కేబీ) ఆర్అండ్బీ రోడ్డును ఆనుకుని విద్యుత్ స్తంభాలు వేయడంతో తరుచూ పలు ప్రమాదాలు జరుగుతున్న విద్యుత్ శాఖ, ఆర్అండ్బీ, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
సంరంభానికి సిద్ధం
యుద్ధ నౌకల సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రాల మధ్య స్నేహపూర్వక బంధాల్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో నావికాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేందుకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. తూర్పు నౌకాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతిపెద్ద యుద్ధ నౌకల సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)తో పాటు మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లను ఏకకాలంలో ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం కోసం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఆరు నెలల క్రితం నుంచి ఐదుసార్లకు పైగా సమీక్షలు నిర్వహించగా.. తాజాగా శనివారం తుది ప్రణాళిక సమావేశం జరిగింది. ఈఎన్సీ హెడ్క్వార్టర్స్ ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆధ్వర్యంలో జరిగిన ఈ తుది సమావేశానికి 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు. స్నేహభావం, సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 145 దేశాలకు ఆహ్వానం.. 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐఎఫ్ఆర్, మిలాన్–2026 కోసం ఇప్పటివరకూ 137 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇప్పటి వరకూ 61 దేశాలు నమోదు చేసుకున్నాయి. 61 దేశాలకు సంబంధించి 23 యుద్ధ నౌకలు రాబోతున్నా యి. మిగిలిన దేశాలు త్వరలోనే సమ్మతిని వెల్లడించే అవకాశం ఉంది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లుస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొననున్నాయి. ఇందులో ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి వంటి వివిధ తరగతులకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు సహాయకారి నౌకలైన ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్ వంటివి తమ సత్తా చాటనున్నాయి. వీటితో పాటు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి సముద్ర సంస్థలకు చెందిన నౌకలు కూడా ఈ సమీక్షలో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ను, 2024 ఫిబ్రవరిలో మరోసారి మిలాన్ విన్యాసాలను విశాఖ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐఎఫ్ఆర్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనల కేంద్రంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ఎప్పుడు... ఎలా.. ఎవరెవరు.? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026, ఐఓఎన్ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్(సీవోసీ) కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ విశాఖ వేదికగా వరుసగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ప్రారంభం కానుంది. డాక్టేరియన్, జాయింట్ ఆపరేషన్లపై ఐఎఫ్ఆర్లో మిత్రదేశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15 నుంచి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు, నౌకాదళ ప్రతినిధులు విశాఖకు రానున్నారు. 18న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఫ్లీట్ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమీక్షించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలు, సదస్సు కార్యక్రమాల్లో 19వ తేదీ కీలకమైనది. ఫిబ్రవరి 19న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్ని బీచ్రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అదేవిధంగా మిలాన్–2026 కూడా 19న ప్రారంభం కానుంది. దీంతో పాటు రక్షణ దళం, నౌకాదళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చించేందుకు ఇండియన్ ఓషన్ నేషనల్కాంక్లేవ్(ఐఓఎన్ఎస్) సదస్సుని మహాసాగర్ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్లో 19 నుంచి 20 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి. 21 నుంచి 25 వరకూ సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ముగిసిన నౌకాదళ సన్నాహక సమావేశాలు విశాఖలో ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐఓఎన్ఎస్ నిర్వహణ ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ముగిసిన మూడు దఫాల సమీక్షలు సమీక్షలకు హాజరైన 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు


