Anakapalle District News
-
రక్తదాత.. సుఖీభవ.!
అనకాపల్లి టౌన్: రక్తదానం...ప్రాణదానంతో సమానం. ఏమీ ఆశించకుండా చేసే ఈ చిన్న దానమే ఏటా లక్షల మందిని కాపాడుతుంది. వైద్య రంగంలో పరిశోధనల మూలంగా ఎన్నో అధునాతన మార్పులు వచ్చినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇంకా కనుగొనలేదు. రక్తం ఒక అరుదైన వనరు. ఇది కృతిమంగా తయారు చేయలేని పదార్థం. కాబట్టి ప్రాణాప్రాయ స్ధితిలో ఉన్న వారిని కాపాడడానికి ఉన్న ఏకై క మార్గం రక్తదానం ఒక్కటే. రక్తదానం ఎవరు చేయవచ్చు... కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. బరువు కనీసం 45 నుంచి 55 కిలోలు ఉండాలి. ఒక మనిషి ఒకసారి 350 మిల్లీలీటర్ల రక్తం ఇవ్వవచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు 450 మి.లీ రక్తం ఇవ్వవచ్చు. శరీర ఉష్ణోగ్రత 37 నుంచి 98 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. హృదయ స్పందన 60 నుంచి 100 ఉండాలి. రక్తపోటు 100 నుంచి 140, డయాస్టోల్ 60 నుంచి 90 ఉండాలి. తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ కనీసం 12.5 నుంచి 38 వరకు ఉండాలి. చర్మవాధులు లేని ప్రదేశంలో మాత్రమే రక్త తీయాలి. గుండె, ఊపిరితిత్తులు, పొత్తి కడుపు సర్వసాధారణంగా ఉండాలి. ఓ నెగిటివ్ గ్రూప్కు డిమాండ్ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బీ పాజిటివ్, బీ నెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఎనిమిది రక్త గ్రూపులు ఉన్నా.. ఓ నెగిటివ్ చాలా అరుదుగా లభిస్తుంది. సుమారుగా ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. రక్తం నిల్వ చేసే ఫ్రీజర్ రక్తదానం..ప్రాణదానంతో సమానం రక్తానికి ప్రత్యామ్నాయం లేదు.. దానమే మార్గం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం మనిషికి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్ను.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతోపాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే. ప్రమాదాల్లో గాయాల కారణంగా, రక్తహీనత ఏర్పడినప్పుడు, మహిళల్లో కాన్పు సమయాల్లో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటప్పుడే రక్తదాతల అవసరం ఏర్పడుతుంది. ఒకరి రక్తదానం నుంచి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం మహాదానంగా పరిగణిస్తున్నారు. రక్తదాతా సుఖీభవ అంటున్నారు. శనివారం(జూన్ 14) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
16న అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
అనకాపల్లి టౌన్: అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనంతో పాటు పలు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఈ నెల 16న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు, జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి కోరారు. స్థానికంగా ప్రైవేట్ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్వాడీలందరూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాలన్నారు. స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు కోత పెట్టడం దారుణమన్నారు. నెలకు రూ.12 వేలు ఆదానం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రూ.11.500 తీసుకుంటున్న అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
35 రోజుల పాటే రక్తం నిల్వ
రక్తదానంపై అపోహలకు పోవద్దు. రక్తదాతలకు ప్రాథమికంగా పరీక్షలు చేసిన తర్వాతే రక్తం తీసుకుంటాం. మగవారు ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆడవారు 4 నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చు. ఒక వ్యక్తి దానం చేసిన రక్తం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. అందువల్ల రక్తదానం నిరంతర ప్రక్రియగా సాగాలి. స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అందుకే విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. – ఎస్.కనకదుర్గ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఎన్టీఆర్ ఆస్పత్రి, అనకాపల్లి -
కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం
సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు ధ్వజం అనకాపల్లి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల రంగం, ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగం, మౌలిక సదుపాయాల కల్పనలో సాధించిన అభివృద్దిని నియోజకవర్గాల వారీగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. భారీ పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి కల్పనపై ప్రకటనలు తప్ప ఏడాది పాలనలో జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమలు కంటికి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఉన్న విశాఖ స్టీల్ప్లాంట్ను దెబ్బతీసి నక్కపల్లి ప్రాంతంలో ప్రైవేట్ మిట్టల్ స్టీల్ను ప్రోత్సహించాలన్న కుట్ర తప్ప ప్రజలకు ఎక్కడా మేలు కనిపించడం లేదన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న జీవో బుట్టదాఖలైందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ సహకార సుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఇచ్చిన మాట ఏడాది అవుతున్నా నిలబెట్టుకోలేదని విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో వచ్చే సీజన్ నాటికి క్రషింగ్ నిలిపివేసే కుట్రలో ప్రభుత్వం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులు ఎప్పటిలోగా పూర్తిచేసి అనకాపల్లి ప్రజలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తాండవ, పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల ఆయకట్టును స్థిరీకరించేందుకు నిధులు విడుదల చేయకుండా, రైవాడ జలాశయం ఎగువ భాగాన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అదానీకి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఆయకట్టును దెబ్బతీసే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. నక్కపల్లి సీహెచ్సీలో ట్రామా కేర్ సెంటర్, ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో సూపర్ స్పెషాల్టీ విభాగాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం సకాలంలో అందించేలా ఎన్టీఆర్ ఆస్పత్రిని తీర్చిదిద్దాలన్నారు. తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కాలుష్య పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేసే వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా విడిచిపెడుతున్న పరిశ్రమలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతిపాదిత పూడిమడక ఫిషింగ్ హార్బర్, నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం పనులను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ ఏడాది పాలనలో జిల్లా అభివృద్ధికి చేసిన కృషి ఏమీలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, గంటా శ్రీరామ్ పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు మండలాలలో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను సబ్బవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంకు చెందిన గరికిపాటి సాయికిరణ్,పట్నాల రాజేశ్వరరావు,మహారాణిపేటకు చెందిన నెల్ల సాయిప్రసాద్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ఇద్దరు కలిసి 2023 నవంబర్ నుంచి 2025 జూన్ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, చోడవరం, కశింకోట, యలమంచిలి, భీమిలి మండలాల్లోని ఏపీఈపీడీసీఎల్కు చెందిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. ఎనిమిది మండలాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేయగా, అత్యధికంగా సబ్బవరం మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లు అపహరించినట్టు డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ను తొలగించి, అమ్మేసేవారని తెలిపారు.ఈ విధంగా వారు విక్రయించిన 190 కిలోల కాపర్ వైర్ను రికవరీ చేసినట్టు చెప్పారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల విలువ రూ.54 లక్షల వరకూ ఉంటుందన్నారు.ఈ కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జి.రామచంద్రరావు,ఎస్ఐలు సింహాచలం, దివ్యలతో పాటు మిగిలిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 190 కిలోల కాపర్ వైర్ స్వాధీనం డీఎస్పీ విష్ణు స్వరూప్ -
మత్స్య వేటకు సై!
రెండు మాసాల మత్స్య వేట నిషేధ గడువు ముగింపునకు చేరుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట ప్రారంభం కానుంది. ఇప్పటికే బోట్లు, వలలకు మరమ్మతులు చేపట్టి, లంగరెత్తేందుకు గంగపుత్రులు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి నుంచే వేటకు వెళ్లనుండటంతో ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. తమకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకుంటూ మత్స్యకారులు హడావుడిగా ఉన్నారు. బాక్స్ల నిండుగా ఐస్ లోడ్ చేశారు. పక్షం నుంచి నెల రోజులకు సరిపడా వంట సామగ్రి బోటులో చేర్చారు. చిన్నచిన్న లోపాలు కూడా లేకుండా అంతా మరోసారి చెక్ చేసుకున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
స్ఫూర్తి ప్రదాత.. గణేష్
మునగపాక: మండలంలోని టి.సిరసపల్లికి చెందిన కొమ్మోజు గణేష్ రక్తదానాలతో ప్రాణదాతగా గుర్తింపు పొందారు. గణేష్ నిరంతర సేవా ఫౌండేషన్ స్థాపించి రక్తదాతలు, వలంటీర్ల సహకారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలుస్తున్నారు. అంతేకాకుండా 20 సార్లు రక్తదానం చేసి ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. సొంతంగా వైద్య శిబిరాలు కూడా తరచూ నిర్వహిస్తున్నారు. కోవిడ్ విలయ తాండవంలో సైతం కోవిడ్ విలయ తాండవంలో సైతం గణేష్ రోగుల అవసరాన్ని బట్టి స్నేహితుల సహకారంతో రక్తం, ప్లాస్మా దానం చేపట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 7 వేల మంది వలంటీర్ల సహకారంతో 40 వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ పరీక్ష శిబిరాలు సొంతంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలకు గాను ప్రాణదాత సేవా పురస్కారాన్ని తెలంగాణా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా గణేష్ అందుకున్నారు. అలాగే యంగ్ ఇండియన్ జాతీయ స్థాయి సేవా పురష్కారం కూడా దక్కించుకున్నారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
గాజువాక: షీలానగర్ జాతీయ రహదారిపై ఓ కారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు ఇంజిన్లో నుంచి పొగ వచ్చి ఒక్కసారిగా దట్టమైన మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అందించిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడకు చెందిన ఎల్.ఎన్.వి.ప్రభాకర్ శనివారం తిరుపతి దర్శనం కోసం బయల్దేరాల్సి ఉంది. ఎన్ఏడీ కొత్తరోడ్లోని తమ బంధువుల ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకొని వెళ్లడం కోసం వచ్చిన ఆయన కుమార్తెతో కలిసి కారులో ఉమ్మలాడకు బయల్దేరారు. షీలానగర్ జంక్షన్కు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి పొగ రావడం గమనించారు. అప్రమత్తమైన ఆయన తనతోపాటు కుమార్తెను కారులో నుంచి దించేశారు. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆటోనగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలను ఆర్పివేశారు. -
ఆన్!
ఆఫ్..ఇంజిన్ మీటర్● బండి షెడ్డులో ఉన్నా బిల్లు తీసేసుకుంటున్నారు ● మెకానికల్ విభాగంలో ఆయిల్ మాయ ● ప్రతీ నెలా రూ.లక్షన్నర మేర పక్కదారి ● అర్హత లేకపోయినా ఏఈ స్థాయిలో జీపు వినియోగం ● ఏడాది కాలంగా అడ్డగోలు వ్యవహారంసూత్రధారులు ఓ ఏఈ... మలేరియా అధికారి....! జీవీఎంసీలో జరుగుతున్న భారీ ఆయిల్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆయిల్ మాయాజాలంలో ప్రధానంగా ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) తో పాటు ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి, మలేరియా విభాగంలోని ఒక అధికారికి కీలక పాత్ర ఉందని విమర్శలున్నాయి. తిరగని వాహనాలకు సైతం ఆయిల్ బిల్లులు దోచేస్తున్న జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు, కార్డుల ద్వారా మాత్రమే ఆయిల్ జారీ చేయాలనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. అయితే హైడ్రాలిక్ ఆయిల్ కోసం మాత్రం 20 లీటర్ల కూపన్లను అదనంగా ఇస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం కాగితాలపై మాత్రమే జరుగుతున్న వ్యవహారం అని, నిజానికి ఆయిల్ దారి మళ్లుతోందని ఆరోపణలున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మెకానికల్ విభాగంలో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం రోడ్లపై తిరగని వాహనం పేరుతో కూడా ప్రతీ నెలా ఆయిల్ బిల్లు డ్రా అవుతోంది. ఏఈ స్థాయి అధికారి ఏకంగా రెండు జీపుల్లో తిరుగుతున్నట్టు లెక్కలు చూపి ప్రతీ నెలా రూ. లక్ష మేర ఆయిల్ బిల్లును నొక్కేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన గత ఏడాది కాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఇక జీవీఎంసీ నుంచి ఎస్ఈ స్థాయి అధికారి బదిలీపై వెళ్లి.. తిరిగి ఇక్కడకు వచ్చే వరకూ ఆయనే వాహనాన్ని నడుపుతున్నట్టు మరీ దోపిడికి తెగబడుతున్నారు. ఇక ఫాగింగ్ మిషన్ల ఆయిల్ బిల్లు ఏకంగా ప్రతీ నెలా రూ. 30 లక్షల మేర అదనంగా పెంచేశారు. మొత్తంగా జీవీఎంసీ మెకానికల్ విభాగంలో మాత్రం వాహనంలో ముల్లు కదలకపోయినా ఆయిల్ బిల్లు మాత్రం లక్షలకు చేరుతోంది. ఏడాది కాలంగా...! జీవీఎంసీ మెకానికల్ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తిరుగుతున్న వాహనాలకు మాత్రమే కాకుండా, షెడ్డులో మూలకు చేరిన వాహనాలు నడు స్తున్నట్లు లెక్కలు చూపిస్తూ ఆయిల్ బిల్లులు కాజేస్తున్నారు. ఉదాహరణకు, పెద్దగా వాడకంలో లేని రెండు జీపులతో పాటు, అసలు పనిచేయకుండా నిలిచిపోయిన ఒక టాటా సఫారీ వాహనం పేరుతో ప్రతినెలా రూ. 1.5 లక్షల ఆయిల్ బిల్లులు డ్రా అవుతున్నాయి. ఈ విధంగా గత ఏడాది కాలంగా ఆయిల్ దోపిడీ జరుగుతోందని సమాచారం. అంటే, వాహనం ఆన్లో లేకపోయినా, జీవీఎంసీ మెకానికల్ విభాగంలోని కొందరు అధికారులు డీజిల్ బిల్లు మీటర్ను మాత్రం ఆన్లోనే ఉంచుతున్నారన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం జీవీఎంసీలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) స్థాయి అధికారికి ఎటువంటి వాహనం కేటాయించరు. కేవలం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ) స్థాయి అధికారి నుంచే వాహనాలను కేటాయిస్తారు. అయినప్పటికీ ఏడాది కాలంగా మెకానికల్ విభాగంలోని ఒక ఏఈ ఏకంగా రెండు వాహనాలను ఉపయోగిస్తూ, ప్రతినెలా ఆయిల్ బిల్లుల రూపంలో లక్ష రూపాయల వరకూ కాజేస్తున్నారని విమర్శలున్నాయి. హైడ్రాలిక్ ఆయిల్, ఫాగింగ్ మిషన్ల పేరుతోనూ అక్రమాలు హైడ్రాలిక్ ఆయిల్ కూపన్ల విధానాన్ని రద్దు చేసినప్పటికీ, ఒక్కో వాహనానికి 20 లీటర్ల చొప్పున కూపన్లను రోజువారీగా అదనంగా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రాలిక్ ఆయిల్ లీటరు ధర రూ. 350 పైచిలుకు పలుకుతుంది. ఇక, ఫాగింగ్ మిషన్లు, స్ప్రింక్లర్లకు ఆయిల్ బిల్లులను అమాంతంగా రెట్టింపు చేయడంతో నెలకు రూ. 30 లక్షల మేర ప్రజాధనం పక్కదారి పడుతోంది. మొత్తంగా చూస్తే, జీవీఎంసీ మెకానికల్ విభాగంలో అవకాశం దొరికిన ప్రతిచోటా ఆయిల్ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలున్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫాగింగ్ మిషన్ల పేరుతో నెలకు రూ. 30 లక్షల అదనపు దోపిడీ ఇక ఫాగింగ్ మిషన్ల పేరుతో నెలకు అదనంగా రూ. 30 లక్షల మేర ప్రజాధనం కాజేస్తున్నట్లు విమర్శలున్నాయి. జీవీఎంసీలో 8 పెద్ద ఫాగింగ్ మిషన్లు, 80 మీడియం సైజు ఫాగింగ్ మిషన్లు, 25 స్ప్రింక్లర్లు ఉన్నాయి. వీటికి గతంలో ప్రతినెలా రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లులు చెల్లించేవారు. అయితే, డిప్యూటేషన్పై వచ్చిన ఇద్దరు అధికారులు మెకానికల్ విభాగంతో కుదుర్చుకున్న ‘మామూళ్ల ఒప్పందంలో’ భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ. 68 లక్షలకు పెంచేశారు. ఈ అక్రమ ఒప్పందానికి ప్రతిఫలంగా, ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారికి, మలేరియా విభాగానికి చెందిన మరో అధికారికి చెరో రూ. 2 లక్షల చొప్పున ప్రతి నెలా ముట్టచెప్పే విధంగా ఒప్పందం కుదిరిందని ఆరోపణలున్నాయి. ప్రతినెలా ఈ ‘మామూళ్ల పంపకంలో’ మలేరియా విభాగంలోని ఒక అధికారిదే కీలక పాత్ర అని తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ ఈ ఆరోపణలపై మెకానికల్ విభాగం ఈఈ రత్నాకర్ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా గత 10 రోజులుగా జీపులకు ఆయిల్ బిల్లులను నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ ఆయిల్ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం జీవీఎంసీ పరిపాలనలో పారదర్శకత లేకపోవడాన్ని, అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో స్పష్టం చేస్తోంది. బదిలీ అయిన తరువాత కూడా.. ఇంకో విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఒక ఎస్ఈ స్థాయి అధికారి జీవీఎంసీలో పనిచేసి కాకినాడకు బదిలీపై వెళ్లిన తర్వాత ఆరు నెలల పాటు తిరిగి జీవీఎంసీకి వచ్చే వరకు ఆయన పేరు మీద ఉన్న వాహనాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. అంటే, ఆరు నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తించని అధికారి పేరుతో వాహనాన్ని నడుపుతున్నారన్నమాట. మరో టాటా సఫారీ వాహనాన్ని కూడా ఇంకో అధికారి వినియోగిస్తున్నారని, గత రెండు నెలలుగా ఆయిల్ బిల్లులను భారీగా డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. -
భూగర్భ శివాలయ దర్శనం అద్భుతం
● సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి నాతవరం: భూగర్భ శివాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి అన్నారు. గుమ్మడిగొండ పంచాయతీ శివారు చిక్కుడుపాలెం గ్రామంలో వెలసిన శివశక్తి క్షేత్రాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆలయ ధర్మకర్త కె.ఎస్.ఎస్.శర్మ ఆయనకు వివరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భారవి విలేకరులతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో చూడచక్కని విధంగా శివశక్తి క్షేత్రంలో అనేక రకాల శివలింగాలు ప్రతిిష్టించడం చాలా ఆనందాయకమన్నారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాలు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయన్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి ప్రచార మాధ్యమాల్లో చూసి ఇక్కడకు వచ్చానన్నారు. దూరప్రాంతమైనా ఇక్కడకు వచ్చిన తర్వాత, శివశక్తి క్షేత్రంలో ప్రతిష్టించిన పలు రకాల శివలింగాలను దర్శించుకున్న అనంతరం ఎంతో చక్కని అనుభూతి కలిగిందన్నారు. దైవ సంకల్పంతో కూడిన ఏదో తెలియని మహా శక్తి ఉంటే తప్ప ఇక్కడ భూగర్భ శివాలయ నిర్మాణం జరగదన్నారు. -
భర్త కిరాతకం
దేవరాపల్లి: భార్యపై భర్త అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక రామాలయం వీధిలో శుక్రవారం వేకువజామున జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎస్ఐ టి.మల్లేశ్వరరావు కథనం ప్రకారం.. దేవరాపల్లికి చెందిన కోన రాము తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. వీరిద్దరి మధ్య గురువారం రాత్రి మళ్లీ ఘర్షణ జరిగింది. భార్య గదిలో నిద్రపోగా భర్త ఇంటి వరండాలో పడుకున్నాడు. భార్యపై కక్ష పెంచుకున్న రాము శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య దేవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఉలిక్కిపడి మేల్కొన్న దేవి తన భర్త దాడి నుంచి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఎడమ చేతి వేళ్లు కొన్ని తెగి పడిపోగా మెడ, కాళ్లు, పొట్ట తదితర శరీర భాగాలపై కత్తి గాట్లు ఉన్నాయి. భర్త కత్తితో దాడి చేసిన విషయాన్ని సోదరుడు కృష్ణకు ఫోన్ ద్వారా దేవి చెప్పడంతో వెంటనే వారి నివాసానికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న అక్క దేవిని 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం, కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం దేవి కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోన దేవి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లేశ్వరరావు తెలిపారు. భర్త రాము పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. భార్యపై కత్తితో హత్యాయత్నం తెగిపడిన చేతి వేళ్లు.. శరీరంపై తీవ్ర గాయాలు ప్రాణాపాయ స్థితిలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మహిళ పరారీలో భర్త రాము.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు -
రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం రేంజ్ పరిధిలో గల గొలుగొండ కరక క్వారీలో లభ్యమయ్యే రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు భారీ స్కెచ్ వేశారు. ఈ రంగురాళ్లకు దేశంలోనే అత్యంత గిరాకీ ఉంటుంది. కరక క్వారీలో అలెక్స్ (సిసలైన పచ్చ వైఢూర్యం) లభ్యమవుతుంది. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల ముఠా ఎదురుచూస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతంలోకి ఎవరైనా అక్రమార్కులు ప్రవేశించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అందుకే గార్డు స్థాయి నుంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి వరకూ ఇటీవల బదిలీలలో మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డీఎఫ్వోగా తమకు అనుకూలమైన వ్యక్తిని రప్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతని సిఫార్సుతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఫారెస్ట్ అధికారిని కూడా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. అవినీతి అధికారికి అందలం! ప్రస్తుతం అనకాపల్లి జిల్లా డీఎఫ్వోగా పనిచేస్తున్న శామ్యూల్ను మార్పు చేసి కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్స్ లేఖతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారిని తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతికి మారుపేరు అయిన ఒక అధికారిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సదరు అధికారి గతంలో విజయనగరంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో చిక్కారు. గతంలో శ్రీకాకుళంలో కూడా ఇతని మీద ఒక ఏసీబీ కేసు ఉంది. రంగురాళ్ల తవ్వకాలకు అడ్డు లేకుండా అలాంటి వ్యక్తిని నర్సీపట్నం తీసుకొస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన వీఎంఆర్డీ డీఎఫ్వోగా రావటానికి భారీ ముడుపులు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ.. ఏసీబీ కేసు ఉండటం వలన సంస్థ తీసుకోవటానికి ఇష్టపడలేదు. సదరు అధికారి ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. బదిలీ జీవో నేడో, రేపో రానున్నట్లు సమాచారం. అనుకూలస్తులనే తెచ్చుకున్నారు..! ఈ నెల 9వ తేదీన కరక క్వారీ ప్రాంత గార్డు అయిన నవీన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనరసింహలకు ఐదేళ్ల కాలపరిమితి ముగియకపోయినా బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు గార్డుగా వచ్చిన వ్యక్తి స్థానిక కూటమి నేతలకు బాగా పరిచయస్తుడు. ఇక్కడకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా ఈ ప్రాంత కూటమి నాయకులకు సుపరిచితుడు. ఏడాది క్రితం కేడీ పేటలో డీఆర్వోగా పనిచేసి ప్రమోషన్పై పాడేరు డివిజన్లో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. మళ్లీ నర్సీపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చేశారు. కూటమి పాలనలో అక్రమార్కుల ఆటలు తారస్థాయికి చేరాయి. ఏడాది కాలంలో ఇసుక, గ్రావెల్, లేటరైట్, మైనింగ్ వంటి ప్రభుత్వ సంపదను దోచుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా రంగురాళ్లపైనే కన్నేశారు. ఇందుకోసం అటవీ శాఖలో కింది నుంచి పై వరకు తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారు. నేడో రేపో డీఎఫ్వోగా అస్మదీయుడినే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గొలుగొండ కరక క్వారీ దోచుకునేందుకు పన్నాగం అడ్డుకుంటారన్న అనుమానంతో అటవీ అధికారుల మార్పు డీఎఫ్వోను మార్చేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖ ఏసీబీ ట్రాప్లో చిక్కిన అధికారిని తెచ్చుకునేందుకు యత్నాలు -
● దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్ ● అడవివరం–శొంఠ్యాం రోడ్డులో కాపుకాసి బలవంతంగా వసూళ్లు ● బాధితుడి ఫిర్యాదుతో చాకచక్యంగా పట్టుకున్న పెందుర్తి పోలీసులు ● నిందితుల్లో ఒకరు తొలగించిన పోలీస్ కానిస్టేబుల్
పెందుర్తి: అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ప్రేమ జంటలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను పెందుర్తి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కె.వి.సతీష్కుమార్ వెల్లడించారు. విజయనగరం జిల్లా ధర్మవరం మండలం మామిడిపాలేనికి చెందిన ఏతలపాక శివప్రసాద్, నగరంలోని రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న కదరాపు గోపీతో కలిసి దారి దోపిడిలు చేయడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంలు ధరించి అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ఈ నెల 3 నుంచి 6 వరకు మాటు వేశారు. రోజూ పొద్దుపోయాక అటుగా వెళ్తున్న ప్రేమ జంటలను గమనించేవారు. వారు ఎక్కడైనా బైక్లు నిలిపి మాట్లాడుకోవడం, లేదా అనుమానం కలిగేలా ప్రవర్తించడం చూసి వారి వద్దకు వెళ్లి, బెదిరింపులకు దిగేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోరాడ జయరాం అనే వ్యక్తి గాజువాక నుంచి బైక్పై తనకు కాబోయే భార్యతో కలిసి విజయనగరం వెళ్తున్నాడు. సరిగ్గా అడవివరం భైరవకోన దాటాక వారిని అడ్డగించిన శివప్రసాద్, గోపి తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగారు. నగదు ఇస్తే వదిలేస్తామని, లేదంటే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని భయపెట్టారు. అయితే నగదు లేదని, ఫోన్పే ద్వారా ఇస్తానని చెప్పడంతో నిందితుడు శివప్రసాద్ తన వద్ద ఉన్న ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా రూ.5 వేలు నగదు బదిలీ చేయించుకున్నాడు. వీరి తీరుపై అనుమానం వచ్చిన జయరాం అదే రోజు రాత్రి విశాఖ సీపీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పది జంటల నుంచి వసూళ్లు ఈ నెల 3 నుంచి 6 వరకు దాదాపు పది జంటల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2 వేలు నగదు, స్కూటీ, రెండు సెల్ఫోన్లతో పాటు రెండు పోలీస్ యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసేవాడని, అతడి అనుచిత ప్రవర్తన కారణంగా 2019లో ఉద్యోగం నుంచి తొలగించినట్లు సీఐ తెలిపారు. శివప్రసాద్పై దోపిడి, దొంగతనం కేసులు 15 ఉండగా, అందులో 9 దోపిడీ కేసులు పెందుర్తి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయన్నారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సతీష్కుమార్, ఎస్ఐ సీహెచ్ స్వామినాయుడు, హెచ్సీ గెదెల అప్పారావు, పీసీలు రొంగలి సంతోష్కుమార్, ప్రగడ గణేశ్వరరావు, గాదె శంకర్రావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
కొత్తగా కళ్లు తెరిచెనే.!
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో రెండు జంతువుల పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇటీవల గర్భం దాల్చిన రెడ్–నెక్డ్ వాలబీ, మౌస్ డీర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం తల్లీపిల్లలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. మౌస్ డీర్ పిల్ల తన తల్లితో కలిసి ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. మరోవైపు రెడ్–నెక్డ్ వాలబీ పిల్ల ఇంకా తన తల్లి పొట్టభాగంలోని సంచిలోనే సురక్షితంగా ఉంది. సాధారణంగా రెడ్–నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లోనే పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల సుమారు ఏడు నెలల పాటు తల్లి సంచిలోనే ఉండి పాలు తాగుతూ పెరుగుతుంది. దాదాపు 12 నెలల వయసు వచ్చాక పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని జూ క్యూరేటర్ మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జూలో జంతువుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కొన్ని నెలల కిందట కూడా పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయని ఆమె పేర్కొన్నారు. జూ సంరక్షకులు వాటికి నిరంతరం ప్రత్యేక సేవలు అందిస్తున్నారని వివరించారు. -
సన్నబియ్యంతో ‘మధ్యాహ్న భోజనం’
కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభమైందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సన్నబియ్యంతో మరింత నాణ్యంగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాముల నుండి పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,418 ప్రభుత్వ పాఠశాలలు, 136 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు కలిపి 16,898 నాణ్యమైన సన్నబియ్యం సంచులను (25 కేజీల) చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రతి బస్తాకు క్యూ ఆర్ కోడ్ ముద్రించడం జరిగిందని తెలిపారు. -
అనకాపల్లి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్గా గౌరీ
గోవాడ సుగర్స్ ఎండీగా వెంకటేశ్వరరావు చోడవరం: గోవాడ సహకార చక్కెర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్గా వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏటి కొప్పాక ఎండీగా పనిచేస్తున్న ఆయనను తాజాగా ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి బదిలీ చేసింది. ఇక్కడ ఎండీగా పని చేసిన వి.వి. సన్యాసిరావును భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి బదిలీ చేశారు. అనకాపల్లి: ప్రజా రవాణాశాఖ జిల్లా అధికారి కె.పద్మావతి సాధారణ బదిలీల్లో భాగంగా విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ పోస్టు ఖాళీగా ఉంది. ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అనకాపల్లి డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రవిచంద్ర విజయవాడ ప్రజా రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి (అపరేషన్ విభాగంలో) బదిలీపై వెళ్లారు. ఇక్కడకు విశాఖ వాల్తేరు డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న గౌరి ఈనెల 16న బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆమె చెప్పారు. -
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి
మహారాణిపేట: పరవాడలోని జేఎన్ ఫార్మాసిటీలో ఉన్న ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన పరిమి చంద్రశేఖర్(తెలంగాణ), శరగడం కుమార్(మునగపాక) కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎసెన్షియా ఫార్మా తదితర కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మరణించారని పేర్కొన్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని తెలిపా రు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏడాది కాలంలో ఇన్ని ప్రమాదాలు ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఎలా నష్ట పరిహారం ఇచ్చారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ -
ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి
తుమ్మపాల: తొలగించిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించి కార్మికుల సమస్యలను వివరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చర్చల్లో ఎట్టి పరిస్థితిలోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సమ్మె చేస్తే యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. కార్మికులను తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె.త్రినాథ్, కోరిబిల్లి శంకరరావు, సిహెచ్.రమణ, ఫణీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు. -
సీఆర్ఎంటీలకు కలవరం
● వీరిని బోధన నుంచి దూరం చేస్తున్న విద్యాశాఖ ● 2012 నుంచి సేవలందిస్తున్న రిజర్వ్ మొబైల్ టీచర్లు ● క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్స్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం: రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లకు (సీఆర్ఎంటీలు) శాపంగా మారాయి. బదిలీలు, ప్రమోషన్లు చేయగా మిగిలిన ఉపాధ్యాయులను క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్లుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడంతో సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సీఆర్ఎంటీల సేవలకు పెద్దపీట వేసింది. 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వీరి సేవలను బోధనకు ఉపయోగించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబరు 65 ద్వారా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం సీఆర్పీ విధానం రద్దయి సీఆర్ఎంటీ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 260మంది సీఆర్ఎంటీలు టీచర్లు సెలవు పెడితే విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. వీరు విద్యాశాఖలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సీఆర్ఎంటీలను ఇంటికి సాగనంపేందుకు పూనుకుందని, అందుకే బదిలీలు జరగగా మిగిలిన ఉపాధ్యాయులను తమ స్థానంలో నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. తమ సేవలను మరింత వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా సేవలను మరింత వినియోగించుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ తీసుకొచ్చిన క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పనిచేస్తున్న 3,300 మంది సీఆర్ఎంటీలకు తగు న్యాయం చేయాలి –పూడి వెంకట్రావు, ఏపీ సీఆర్ఎంటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఉలికిపాటు
● ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనతో కలకలం ● గత ప్రమాదాల నుంచి నేర్చుకోని యాజమాన్యం ● ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న ఆరోపణలుపరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఫార్మా ఉద్యోగులు, కార్మికులు ఉలికి పడుతున్నారు. తరచూ ఫార్మా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో పరిశ్రమలో సేఫ్టీ మేనేజర్గా పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన పరిమి చంద్రశేఖర్(32), షిప్ట్ సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్(25) మృత్యువాత పడ్డారు. హెల్పర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బైడు బైసాల్(37) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో భయాందోళన ● గతంలో సినర్జీన్ యాక్టివ్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు, విజయనగరానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ● రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో గత డిసెంబర్లో ప్రొడక్షన్ బ్లాక్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై న ఘటనలో కాంట్రాక్టు కార్మికులు దేవిబాగ్, ఉగ్రేసర్గౌడ్లు అస్వస్థతకు గురయ్యారు. ● గత ఏప్రిల్లో అపిటోరియా పరిశ్రమ యూనిట్–6లో నైట్రోజన్ గ్యాస్ పీల్చడంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆళ్ల గోవింద్ మృతి చెందాడు. ● ఆల్కలీ మెటల్ ఫార్మా పరిశ్రమలో ఏప్రిల్లో జరిగిన మరో ఘటనలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన సీహెచ్ రమణ(32) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ● అదే నెలలో ఠాగూర్ లేబొరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రం చేస్తున్న క్రమంలో రియాక్టర్ వాల్వ్ నుంచి విడుదలైన విషవాయువును పీల్చడం వల్ల కె.సింహచలం అనే కాంట్రాక్టు కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ● మెట్రెకమ్ పరిశ్రమలో ఖాళీ రసాయన డబ్బాలు, వ్యర్థాల వల్ల ప్రమాదం నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. -
మునగపాకలో తీరని విషాదం
మునగపాక: కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో మునగపాకలో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక మధ్య వీధిలో నివాసం ఉంటున్న శరగడం కుమార్(25)కు గత సంవత్సర క్రితం వివాహం జరిగింది. కుమార్ 8 నెలల క్రితం పరవాడలోని ఎస్ఎస్ ఫార్మాలో సేప్టీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ నెల 11న రాత్రి విధి నిర్వహణలో ఉండగా వెలువడిన విష వాయువులను పీల్చడంతో కుమార్ అస్వస్థతకు గురవడంతో వెంటనే అతనిని విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్ తండ్రి రామకృష్ణ గత 7 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి లక్ష్మి నాలుగు నెలల క్రితం చనిపోయింది. కుమార్ తమ్ముడు సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త కుమార్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో భార్య మాధురి కన్నీటిపర్యంతమైంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటూ ఆవేదన చెందుతున్నారు. అందరితో సఖ్యతగా ఉండే కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానికులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా మృతుడు కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, కర్రి సాయికృష్ణ, పెంటకోట విజయ్ తదితరులు చర్చలు జరిపారు. కుమార్ అంత్యక్రియలు శనివారం మునగపాకలో నిర్వహించనున్నారు. -
సమస్యల గంట
బడిలోతెరుచుకున్న పాఠశాలలు..అసౌకర్యాలతో స్వాగతం ● పాఠ్య పుస్తకాలతో సరి ● అరకొరగా స్టూడెంట్ కిట్ల పంపిణీ ● తొలి రోజు మూడొంతులు తగ్గిన విద్యార్థుల హాజరు శాతం ● విద్యార్థుల కోసం తల్లికి వందనం పేరిట హడావుడి అనకాపల్లి టౌన్ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో నిలిచిపోయిన వర్షపు నీరు అసంపూర్తిగా తరగతులు, టాయిలెట్ల నిర్మాణాలు కొన్ని స్కూళ్లలో తరగతి భవనాలు, టాయిలెట్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచి దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల స్కూళ్ల ఆవరణలో ఆటస్థలాల్లో తుప్పలు, చెత్త చెదారం పేరుకుపోయాయి. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఎస్జీటీ కౌన్సెలింగ్లో మూడు రోజులుగా బిజిబిజీగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రజా ప్రతినిధులు వరకూ యోగా వేడుకల్లో ఉండడంతో తొలిరోజు స్కూళ్లు మొక్కుబడిగా నడిచాయి. మాడుగుల మండలంలో ఎం.కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి కొత్తగా చేరారు. సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ గురువారం తెరుచుకొన్నాయి. ప్రారంభం రోజునే వి ద్యార్థులకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యా లు స్వాగతం పలికాయి. విద్యార్థుల నమోదు శాతం గణనీయంగా తగ్గింది. మూడొంతుల హాజరు శాతం తగ్గుముఖం పట్టింది. కొత్త విద్యార్థుల చేరిక అరకొరగానే జరిగింది. ‘తల్లికి వందనం’ ఇచ్చేస్తున్నామని కూటమి ప్రభుత్వం హడావుడి చేసి విద్యార్థులను పాఠశాలలకు రప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. పాఠశాలల ప్రారంభమైన తొలి రోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వి ద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోవడంతో వి ద్యార్థులు మళ్లీ ప్రైవేట్ స్కూళ్ల వైపు మరలుతున్న ఛా యలు కనిపిస్తున్నాయి. అసౌకర్యాలు నిండిన ప్రభు త్వ పాఠశాలల్లో రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్లు, పాఠశాల ఆవరణలో బురద, నిల్వ ఉన్న వర్షం నీరుతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. అరకొరగా స్టూడెంట్ కిట్లు... జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తొలి రోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. గాజువాకలో గల బుక్ డిపో నుంచి అనకాపల్లి జిల్లాలోగల వివిధ ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. జిల్లాలో మొత్తం 5,13,887 పుస్తకాలు అవసరం ఉంది. వంద శాతం 5,13,887 పాఠ్యపుస్తకాలు సరఫరా చేశారు. అయితే స్టూడెంట్ కిట్లో యూనిఫాం, బ్యాగ్లు సగం మాత్రమే వచ్చాయి. వచ్చిన సగం కూడా ఎవరికీ ఇవ్వలేదు. టై, బెల్టు, షూ రానేలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన రోజునే జగనన్న విద్యాకానుక (స్టూడెంట్ కిట్) ద్వారా విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ తదితర సామగ్రి అందజేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి గతేడాది అరకొరగానే కిట్లు పంపిణీ చేసినా..ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో ఇస్తారేమో అని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ నిరాశగానే మిగిలిపోయింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి అమ్మ ఒడి పధకం కింద రూ, 15 వేలు నగదు అందేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తల్లికి వందనం ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామన్నా గత ఏడాది ఒక్కరికీ ఇవ్వలేదు. తొలి రోజు 39 శాతం హాజరు.. పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో 7,584 మంది విద్యార్థులకు గానూ 1936 మంది హాజరయ్యారు. ఎస్.రాయవరం మండలంలో 7704 మంది విద్యార్థులకు 2767 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాయకరావుపేట మండలంలో 4562 మంది విద్యార్థులకు 1070 మంది హాజరయ్యారు. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో 3,714 మంది విద్యార్థులకు 1308 మంది, రోలుగుంట మండల పరిధిలో 2387 మంది విద్యార్థులకు 1910 మంది, అలాగే చోడవరం మండల పరిధిలో 4542 మంది విద్యార్థులు, రావికమతం మండల పరిధిలో 5230 మంది విద్యార్థులు హాజరయ్యారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండల పరిధిలో గల ప్రభుత్వ స్కూళ్లలో 5184 మంది విద్యార్థులకు 4092 మంది హాజరయ్యారు యలమంచిలి మండల పరిధిలో 3,916 మందికి 2,867 మంది, రాంబిల్లి మండల పరిఽధిలో సుమారుగా 2,300 మంది, అచ్యుతాపురం మండల పరిధిలో 4,000 మంది హాజరయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో 2904 మంది విద్యార్థులకు 2576 మంది, నర్సీపట్నం మండల రూరల్, టౌన్ పరిధిలో 19 వేల మందికి 1700 మంది, గొలుగొండ మండల పరిధిలో 4024 మందికి 1100 మంది విద్యార్థులు, నాతవరం 4,900 మంది విద్యార్థులకు 2,500 మంది వరకూ హాజరయ్యారు. అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండల రూరల్, టౌన్ పరిధిలో 9 వేల మంది విద్యార్థులకు 5 వేల మంది, కశింకోట మండల పరిధిలో 3800 మందికి 1400 మంది హాజరయ్యారు. మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండల పరిధిలో 5,212 మందికి 4,800 మంది, దేవరాపల్లి మండలం 4,308మందికి 3,366, కె.కోటపాడు మండల పరిధిలో 2343 మందికి 1205 మంది విద్యార్థులు హాజరవగా, చీడికాడ మండల పరిధిలో 1525 మంది విద్యార్థులు హాజరయ్యారు. సబ్బవరం మండలంలో 2,556 మందికి, 1989, పరవాడ మండలంలో 3,466 మందికి 1075 మంది హాజరయ్యారు. -
ఇది హృదయ విదారక ఘటన
విమాన ప్రమాద మృతులకు మాజీ మంత్రి అమర్నాథ్ సంతాపంసాక్షి, విశాఖపట్నం: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. ఇది తమను ఎంతో బాధించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకుల దుఃఖాన్ని ఊహించడం కష్టమని.. అందరికీ తట్టుకునే బలాన్ని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ముఖ్య నేతలు పేర్ల విజయచందర్, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజబాబు, పీతల గోవింద్ తదితరులు సంతాపం తెలిపారు. -
బాల కార్మికుల వ్యవస్థపై అవగాహన ర్యాలీ
అనకాపల్లి: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని అనకాపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, న్యాయ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ జరిపారు. ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.ధర్మారావు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాల కార్మికులు పాఠశాలలో చేరి చదువుకుని విద్యావంతులు కావాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి నరేంద్ర, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టండి
డీఈవో కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదుయలమంచిలి రూరల్/అనకాపల్లి: జిల్లాలో వివిధ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ డిమాండ్ చేశారు. గురువారం యలమంచిలి కోర్టుపేటలోని కార్పొరేట్ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్ ద్వారా చేపడుతున్న పుస్తకాల విక్రయాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు పరిశీలించి, నిర్వాహకులను ప్రశ్నించారు. అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తూ, విద్యా సంస్థ పేరును పుస్తకాలు, క్యారీ బ్యాగులపై ముద్రించారని, అన్ని నిబంధనలు అతిక్రమిస్తున్నా జిల్లా విద్య, వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అధిక ఫీజులను వసూలు చేయడంతోపాటు, పుస్తకాలు, యూనిఫాం, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మణికంఠ, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
వేటకు వేళాయె
● రేపు అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట ● బోట్లను సిద్ధం చేస్తున్న మత్స్యకారులు మహారాణిపేట: మత్స్యకారులు వేటకు సిద్ధమవుతున్నారు. హార్బర్ మళ్లీ కళకళలాడనుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన వేట నిషేధం గడువు శనివారంతో ముగియనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బోసిపోయిన విశాఖ ఫిషింగ్ హార్బర్ మళ్లీ సందడిగా మారనుంది. ఏప్రిల్ 15న వేట నిషేధం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరామ సమయంలో మత్స్యకారులు తమ పడవలకు, వలలకు మరమ్మతులు పూర్తి చేశారు. ఇంజిన్లు, గేర్ బాక్సులు, పంఖాలు వంటి కీలక భాగాలను బాగు చేయించుకుని బోట్లను వేటకు సిద్ధం చేశారు. గంగమ్మ తల్లికి పూజలు ప్రతి ఏటా వేట ప్రారంభానికి ముందు గంగమ్మ తల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా వేటలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా, గంగమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ నెల 10న హార్బర్లో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నట్లు రాష్ట్ర మరపడవల సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తెలిపారు. కాగా.. ఈ నెల 15 నుంచి మత్స్యకారులు తిరిగి వేట ప్రారంభించవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. అయితే వేటకు వెళ్లేటప్పుడు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, తగిన జాగ్రత్తలతో వేట సాగించాలని కోరారు. వేటపైనే జీవనాధారం జిల్లాలో 65 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న 32 మత్స్యకార గ్రామాల్లో సుమారు 1.15 లక్షల కుటుంబాలు మత్స్యకార వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,547 మర, మోటారు, సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క విశాఖ ఫిషింగ్ హార్బర్పైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ 61 రోజుల విరామం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు వేట తిరిగి ప్రారంభం కానుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
రైల్వే ఆస్పత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సౌకర్యార్థం అధునాతన పరికరాలను డీఆర్ఎం లలిత్ బోరా గురువారం ప్రారంభించారు. ఫిజియోథెరపీ యూనిట్లో ఇథైలిన్ ఆకై ్సడ్ స్టెరిలైజర్, అడ్వాన్స్డ్ లేజర్ మెషీన్లను ఆయనతోపాటు, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధునాతన పరికరాల సాయంతో రైల్వే ఉద్యోగులకు మరింత సుఖవంతమైన, శ్రేయస్కరమైన వైద్యసదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి.శరత్బాబు, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారాం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారులకు ఆటపాటలతో బోధన అవసరం
అనకాపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో బోధన అవసరమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్థానిక వేల్పులవీధి అంగన్వాడీ కేంద్రంలో గురువారం మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 52 మంది చిన్నారులకు సాముహిక అక్షరాభాస్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులే కాకుండా మంచి విద్యను అందించడానికి కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ బాల్య ఆరంభ దశలో పిల్లలను తీర్చి దిద్దడంలో అంగన్వాడీ కార్యకర్త పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ ప్రీస్కూల్ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ వరకూ జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రాథమిక విద్యను పూర్తి చేసిన 5 సంతవ్సరాల చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పి.ప్రభావతి, ప్రాజెక్టు సూపర్వైజర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో సుపరిపాలన అనకాపల్లి టౌన్: బీజేపీ 11 సంవత్సరాల సుపరిపాలనలో ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి ఎక్కడ..?
● విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎప్పుడు? ● కూటమి పాలనలో పెరిగిపోయిన నిరుద్యోగం ● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతల ధ్వజం అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచిందని, తల్లికి వందనం పథకం రెండో ఏడాది కూడా అమలు చేసే పరిస్థితి కనబడడం లేదని, నిరుద్యోగు భృతి ఎప్పుడు ఇస్తారో సీఎం చంద్రబాబుకే అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాది అవుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ ఇస్తామన్న హామీ బుట్టదాఖలైందన్నారు. యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్న యువతను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చాక జనసేన అధినేత పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం, నారా లోకేష్కు మంత్రి పదవులు వచ్చాయి తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు దక్కింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అనేక స్కీమ్లు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో స్కామ్ల పాలన సాగుతుందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలను తీసివేయడం జరిగిందని, దీంతో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోయిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు కూడా నేటికీ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ ఏడాది చంద్రబాబు పాలన కంటే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికే ఎక్కువగా జనం మద్దతు పలుకుతున్నారని, ఇటీవల పొదిలిలో జరిగిన సభలో ప్రజాస్పందన చూస్తే అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మండల యువజ విభాగం అధ్యక్షుడు బాదపు హరికృష్ణ, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు నీటిపల్లి దివాకర్, పార్టీ సీనియర్ నాయకులు మరిపల్లి శోభ, కోన ఉమా, శ్రీకాంత్, డానీ, దాడి నారాయణరావు, కొంకి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. -
ఏసీబీ ప్రక్షాళన
● ఆరోపణలున్న సిబ్బందిపై బదిలీ వేటు? ● ఐదేళ్లు పూర్తయిన మరికొందరికి స్థానచలనం ● సాక్షి కథనాలకు స్పందన విశాఖ సిటీ: అవినీతి నిరోధక శాఖలో ప్రక్షాళన షురూ అయింది. అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బందిపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. దీర్ఘకాలంగా ఏసీబీలో తిష్టవేసుకుని కూర్చున్న వారికి స్థానచలనం కలిగింది. ఏసీబీలో అవినీతి సిబ్బందిపై ‘సాక్షి’ వరుస కథనాలతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీరితో పాటు ఐదేళ్లు నిబంధన ప్రకారం పలువురికి బదిలీ చేస్తూ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఏసీబీలో పలువురి వ్యవహార శైలిపై మొదట్నుంచి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల పేరు చెప్పి పలు ప్రభుత్వ శాఖల్లో భారీగా వసూళ్లకు తెరలేపారన్న వార్తలు వినిపించాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా శాఖల నుంచి నెలసరి మామూళ్లకు అలవాటు పడ్డారన్న గుసగుసలు ఉన్నాయి. ఏసీబీలోనే దండిగా ఆదాయం వస్తుండడం కొంత మంది సిబ్బంది రాజకీయ నేతల ఆశీస్సులతో ఇక్కడి నుంచి వెళ్లకుండా తిష్టవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఎస్ఐ, ఒక హెచ్సీ ఏసీబీలో చక్రం తిప్పినట్లు ఆఫీస్లోనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల పేరుతో వీరు చేస్తున్న దందాపై ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టి అవినీతి ఆరోపణలు ఉన్న వారితో పటు ఐదేళ్ల నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టారు. వీరిలో ఎస్ఐలు బి.సురేష్, కె.శ్రీనివాసరావులను విశాఖ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే హెచ్సీలు టి.కొండలరావు, ఎం.సత్యనారాయణ, ఆర్.చంద్రశేఖర్నాయుడు, కానిస్టేబుల్ ఎస్.రమేష్లను విశాఖ సీపీకి కేటాయించారు. అదే విధంగా హెచ్సీ జి.రాంబాబు, కానిస్టేబుళ్లు కె.రామకిరణ్, టి.శ్రీనివాసరావులను అనకాపల్లి ఎస్పీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
క్రమం తప్పకుండా యోగా చేయాలి
● హోం మంత్రి అనిత పిలుపు ● ఏపీఐఐసీ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర అచ్యుతాపురం రూరల్: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. గురువారం అచ్యుతాపురం సెజ్ ముఖ ద్వారం వద్దనున్న ఏపీఐఐసీ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్కుమార్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన దేశ యోగులు, రుషులు కనుగొన్న గొప్ప వ్యాయామమే యోగా అని అన్నారు. భారతదేశం ప్రపంచానికి యోగా అనే మహోన్నత వ్యాయామం బహుమతిగా ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సెజ్లోని పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు, యోగా ప్రేమికులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. -
వేతనాల కోసం విమ్స్ వైద్యుల ధర్నా
ఆరిలోవ: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు గురువారం ధర్నా చేపట్టారు. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కాంట్రాక్ట్ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విమ్స్ ఆవరణలోని అవుట్ పేషెంట్ విభాగం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హారిక తదితర వైద్యులు మాట్లాడారు. తాము రూ. 92,000 జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిలో విమ్స్లో చేరి మూడేళ్లు పూర్తయిందని, కానీ ఇప్పటివరకు తమ వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం గతంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు స్పందించలేదని వైద్యులు ఆరోపించారు. తమ వేతనాలను రూ.1.60 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు ధర్నా చేసిన రెండు గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడ్డారు. -
‘సాక్షి’ విలేకరి హఠాన్మరణం
గాజువాక: ‘సాక్షి’అక్కిరెడ్డిపాలెం విలేకరి బి.రామకృష్ణ హఠాన్మరణం చెందారు. దీంతో ‘సాక్షి’సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం విధులను ముగించుకుని కంచరపాలెంలోని తన సోదరి ఇంటికి వెళ్లిన రామకృష్ణ గుండెపోటుకు గురయ్యారని సమీప బంధువులు తెలిపారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ‘సాక్షి’దినపత్రికలో అక్కిరెడ్డిపాలెం విలేకరిగా రామకృష్ణ పదేళ్లుగా పని చేస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే కథనాలను అందించారు. ఆయన మృతికి ‘సాక్షి’సిబ్బంది, సహచర విలేకరులు సంతాపం ప్రకటించారు. -
విధులకు వెళ్తుండగా విధి చిన్నచూపు
● స్కూటీని ఢీకొన్న కంటైనర్ ● చెల్లెలు మృతి, అన్నయ్యకు తీవ్రగాయాలుకూర్మన్నపాలెం : ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్లాం రైల్వే గేటుకు సమీపంలో కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో చెల్లెలు ఘటన స్థలంలో మృతి చెందగా అన్నయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ జగ్గరాజుపేటలో నివాసం ఉంటున్న గొంప శ్రీను, మణి దంపతులకు సతీష్(29), గీత(24) అనే పిల్లలు ఉన్నారు. తండ్రి శ్రీనివాస్ ఒక ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నాచెల్లెళ్లు కూడా ఆటోనగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్గాం రైల్వేగేటు సమీపంలో కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొంది. గీత లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కకు పడిపోయిన సతీష్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సతీష్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అందివచ్చిన కుమార్తె మృతి చెందడం, కుమారుడు తీవ్రగాయాలపాలవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పంగనామాలు
అందరికీకూటమి ఏడాది పాలన అంతా మోసం, దగా సూపర్ సిక్స్ హామీలకు మంగళం స్టీల్ప్లాంట్ కార్మికుల గోడుపట్టదా? ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం. -
అప్పుల పాలయ్యాం.. మధ్యాహ్న భోజనం పెట్టలేం
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ... ● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి...తండ్రికి సీరియస్ ● ఆర్.శివరాంపురంలో విషాదఛాయలు–8లో చోడవరం: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురా లు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం ముఖ్యనాయకుల సమావేశం చోడవరంలో బుధవారం జరిగింది. డిసెంబరు నెల నుంచి నేటి వరకూ మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మంజూరు కాలేదని, అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని చెప్పారు. వడ్డీ లు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామ న్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాలేదని, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు ఎలా భోజనం పెట్టగలమని ఆమె ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 15వ తేదీకి బిల్లులు వచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. ఇదే ఉపాధిగా జీవిస్తున్న తాము జీతాలు రాక, బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, అప్పులు తెచ్చి భోజనం పెట్టలేమని ఆమె చెప్పారు. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వరలక్ష్మి హెచ్చరించారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు ఎస్.అమ్మాజీ, బి.ఉమ, కె.నాగమణి, ఒ.దేముడమ్మ, ఆర్.బుచ్చిరాజమ్మ, ఎం.దేవి, వరలక్ష్మి, రాజులమ్మ, సత్యవతి పాల్గొన్నారు. బకాయి పడ్డ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల డిమాండ్ -
రోడ్డున పడ్డ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది. -
హామీలన్ని గాలికి..
సూపర్ సిక్స్ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు. -
మోగనుంది సమస్యల గంట
● నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● అసంపూర్తిగా తరగతి, టాయిలెట్స్ నిర్మాణాలు ● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్ కిట్లు ● అసంపూర్తిగా నాడు–నేడు పనులు ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు స్టూడెంట్స్ కిట్స్ కొరత జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 5,13,887 పుస్తకాల అవసరం ఉంది. ఇప్పటికే గాజువాకలో గల బుక్ డిపో నుంచి అనకాపల్లి జిల్లాలో గల వివిధ ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు బ్యాగ్, బూట్లు, సాక్సులు, యూనిఫాం, బెల్ట్ ఉండాలి. వాటిలో చాలాచోట్ల టై, బెల్ట్, బ్యాగ్ మాత్రమే వచ్చాయి. యూనిఫాంలు, బూట్లు, సాక్సులు రావాల్సి ఉంది. కొన్నిచోట్ల బ్యాగులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా చేరలేదు. సాక్షి, అనకాపల్లి: వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులను రా రమ్మని స్వాగతం పలుకుతుండగా.. సర్కారు బడులు సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. పలుపాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తనుంది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికే పంపిణి చేయాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో (స్టూడెంట్ కిట్స్) ఇంకా చాలా వస్తువులు రాలేదు. సాధారణంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యా శాఖ అధికారులు అన్ని సిద్ధంచేయాలి. కానీ ఈ వి ద్యా సంవత్సరం అసౌకర్యాలతోఆరంభం కానుంది. పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పాఠశాలలు పునఃప్రారంభానికే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయినా ఉపాధ్యాయులు బది లీ ప్రక్రియ సగభాగం కూడా పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజులు పడుతుందని ఉపాధ్యాయులే భావిస్తున్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. అత్యధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మాత్రం ఇంతవరకు ఓకొలిక్కి రాలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 300 మందికి మాత్రమే మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగింది. పాఠశాలలు తెరిచిన రోజైన గురువారం మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వారంతా పాఠశాలలకు వెళ్లకుండా కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిందే. దీంతో పాఠశాలలు మొదటి రోజు అరకొర ఉపాధ్యాయులతో ప్రారంభం కాబోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,782 మంది ఎస్జీటీలు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే వారందరికీ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు. పాఠశాలల కుదింపు.. ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదని ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కొన్నిచోట్ల కుదించారు. దేవరాపల్లి మండలంలో వాకపల్లి, నాగయ్యపేట, రైవాడలో ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కుదించారు. కె.కోటపాడు మండలంలో కె.కోటపాడు, చౌడువాడ, పిండ్రంగి, దాలివలస ఎంపీయూపీ స్కూల్స్ను ప్రైమరీ మోడ ల్స్ స్కూల్స్గా మార్చారు. కోటవురట్ల మండలంలో ఎండపల్లి, చౌడువాడ, పందూరులో ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కుదించారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా బదిలీపై వెళ్లిపోయారు. వీరి స్థానంలో వచ్చేందుకు ఇతర ప్రాంతాల ఉపాధ్యాయులు ఆసక్తి చూపిండచం లేదు. దీంతో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు, భాషా ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఎక్కడి పనులు అక్కడే.. వైఎస్సార్సీపీ హయాంలో ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన చేపట్టారు. మొదటి విడతలో రూ.156.44 కోట్లతో 598 పాఠశాలల్లో, రెండో విడతలో రూ.112.54 కోట్లతో 616 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం వరకు పూర్తి చేశారు. బెంచీలు, ఐఎఫ్బీ ప్యానెళ్లు, ఆధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు, తాగునీరు, వాడుకనీటి సదుపాయాలు కల్పించారు. కూటమి ప్రభుత్వం రావడం పాఠశాలల పాలిట శాపంగా మారింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో దేవవరం, చినదొడ్డిగల్లు, రాజయ్యపేట, రమణయ్యపేట, బోయపాడు, డీఎల్పురం, ముకుందరాజుపేట, అయ్యన్నపాలెం, నక్కపల్లి పాఠశాలల్లో భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. పెదబోదిగల్లం పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయి. అలాగే ఎస్.రాయవరం మండలం, కశింకోట మండలం, అనకాపల్లి మండలంలోని అనేక పాఠశాలల్లో భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లాలో పాఠశాలల వివరాలు ప్రాథమిక – 1,152 ప్రాథమికోన్నత – 341 ఉన్నత – 431 మొత్తం పాఠశాలలు – 1,924 విద్యార్థుల సంఖ్య – 2,21,788 మొత్తం ఉపాధ్యాయులు – 10,412 -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
జగదాంబ/బుచ్చెయ్యపేట: భార్య వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు బయలుదేరిన ఆ కుటుంబం.. గమ్యం చేరకముందే ప్రమాదం బారిన పడింది. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో.. భార్య అక్కడికక్కడే కన్నుమూయగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కన్నవారి కోసం ఆ పసిపిల్లల ఎదురుచూపులు, వా రి ఆలనా పాలనా చూడాల్సిన నాన్నమ్మ గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఈ ఘట నతో బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవర చిలుకనాయుడు దివ్యాంగుడు. కాళ్లు చచ్చుబడ్డా.. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేదు. ఎనిమిదేళ్ల కిందట దిబ్బిపాలేనికి చెందిన కృష్ణకుమారి (33)ని వివాహం చేసుకున్నాడు. గ్రామంలో చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిలుకనాయుడికి భార్యే చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ఇద్దరు కుమార్తెలు యువశ్రీ(4), హాత్విక(8 నెలలు) ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని ప్రతి నెలా కేజీహెచ్కు తీసుకొస్తున్నాడు చిలుకనాయుడు. బుధవారం ఉదయం కూడా తన మూడు చక్రాల స్కూటీపై భార్య, చిన్న కూతురు హాత్వికతో కలిసి శివరాంపురం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు సత్యనారా యణ స్వామి దర్శనానికి ఘాట్ రోడ్డులో వెళ్లి తిరిగి వస్తున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలో మొదటి మలుపు వద్ద స్కూటీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన వాహనం వేగంగా గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిలుకనాయుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్కూటీలో ముందు కూర్చున్న 8 నెలల హాత్విక పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది.ఆ పసిపాప ఏడుపు విని చలించిపోయిన ఓ మహిళా వ్యాపారి, చిన్నారిని దగ్గరకు తీసుకుని సపర్యలు చేసింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిలుకనాయుడు పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. గుండెలు పగిలేలా రోదన చిలుకునాయుడు తండ్రి చిన్నోడు గతంలోనే మరణించారు. కొడుకు చిలుకనాయుడే తల్లి రాజులమ్మకు ఆధారం. ఇప్పుడు కోడలు మరణించి, కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి గుండె పగిలింది. ‘నా కొడుకు బతకాలి.. ఈ పసిపిల్లల్ని ఎలా సాకాలి? రేపటి నుంచి మా బతుకులేంటి?’ అంటూ ఆమె నేలపై పడి రోదించిన తీరు అక్కడి వారందరినీ కదిలించింది. తల్లి చనిపోయిందని, తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని తెలియని ఆ ఇద్దరు పసిపిల్లలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తుండటం చూపరులను కలిచివేసింది. చితికిపోయిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్కూటీ బ్రేకులు ఫెయిల్.. తల్లి మృతి.. తండ్రికి సీరియస్ అనాథలైన పసిపాపలు పూర్ణామార్కెట్ సమీపంలోని ఘాట్ రోడ్డులో ఘటన -
జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
అనకాపల్లి టౌన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారదా యోగా శిక్షాలయ సారథ్యంలో ఆల్ ఇండియా యోగా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల 35వ నేషనల్ ట్రెడిషనల్ యోగాసన చాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 12 రాష్ట్రాల నుంచి 680 మంది తలపడ్డారు. తుమ్మపాల గ్రామం శ్రీకృష్ణ యోగా సెంటర్ గురువు బుదిరెడ్డి నరసింగరావు 55–65 సంవత్సరాల కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. 66–75 సంవత్సరాల కేటగిరీలో బుదిరెడ్డి నాగమణి ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటారు. -
ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష
రెండో రోజూ బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం ఆరిలోవ(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో రెండో రోజూ గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, అధికారుల జాప్యంతో బుధవారం కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయల బదిలీ కోసం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో అంతా గందరగోళంగా మారింది. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడంతో వారి సహనం నశించి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 1 నుంచి 300 వరకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్ ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ నత్తనడకన సాగడంతో మధ్యాహ్నం 2.40 గంటలకు కేవలం 20 మందికి, మధ్యాహ్నం 3.30 గంటలకు 50 మందికి, సాయంత్రం 7.45 గంటలకు 210 మందికి మాత్రమే పూర్తయింది. మిగిలిన 90 మంది కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో.. అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఉమ్మడి జిల్లాల డీఈవోల వద్దకు వెళ్లి, అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సాంకేతిక సమస్యనే కారణంగా చెప్పినా వారు శాంతించలేదు. చివరకు మిగిలిన వారికి కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలు దాటింది. పాఠశాలల తొలిరోజే టీచర్ల గైర్హాజరు! మరోవైపు గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నేడు మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో, వారంతా తొలిరోజు పాఠశాలలకు గైర్హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు సాంకేతిక లోపంతో కౌన్సెలింగ్ రద్దు కావడం, రెండో రోజు ఈ జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురువారం 301 నుంచి 800 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశాఖ డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. -
కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపు
మాడుగుల రూరల్ : మండలంలో కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. రహదారి కిరువైపులా గల ఆక్రమణలు తొలగించి, డ్రైనేజిలను నిర్మించాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు, స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాపేట రామకొండలరావు, స్థానికులు తాకాశి శ్రీను తదితరులు ఈ ఏడాది మార్చి 10 న అనకాపల్లి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మార్చి 19న ఆర్అండ్బీ, స్థానిక పంచాయతీ అధికారులు సర్వే చేసి ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. తర్వాత పొక్లెయిన్తో ఆక్రమణల తొలగించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ బుధవారం మాడుగుల ఆర్అండ్బీ జేఈ సాయి శ్రీనివాస్, వారి సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శి నవీన్దొర, సిబ్బంది, ఎస్ఐ నారాయణరావు, హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య, తదితర పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో రోడ్డు మధ్య భాగం నుంచి 11 మీటర్లు అటు, ఇటు వైపునా ఆక్రమణలు తొలగించారు. జంక్షన్లో నిర్మించిన 33 మీటర్ల వరకు ఉన్న ఈ ఆక్రమణలను తొలగించారు. దీనిలో భాగంగా సంతోషిమాత ఆలయం అన్నదాన సత్రం ముందు భాగంలో గల అరుగును, బాత్రూమ్, వంటశాల, సంతోషిమాత ముందు భాగంలో తొలగించారు. ఈ ఆక్రమణలు తొలగింపు విషయంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ జి. నారాయణరావు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వీఆర్వో నాగప్పారావు, సర్వేయరు రాజేష్ పాల్గొన్నారు. అన్నదాన సత్రం కూల్చివేతకు కుట్ర : ఆలయ కమిటీ చైర్మన్ ధ్వజం అన్నదాన సత్రం కూల్చివేయడానికి కొంత మంది వ్యక్తులు కుట్ర చేసి సత్రం ముందు భాగం కూల్చివేశారని, ఇది అన్యాయమని సంతోషిమాత ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లినాయుడు ఆరోపించారు. ఎంతో మందికి మధ్యాహ్నం సమయంలో అన్నదానం చేస్తున్న సత్రంను ఎంతో మంది దాతల సహకారంతో నిర్మించామని తెలిపారు. ఆలయం ముందు భాగంలో విగ్రహాలను కూడా తొలగించారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అమ్మతల్లినాయుడు పేర్కొన్నారు. -
‘మోదీ మెప్పు కోసమే యోగాంధ్ర ప్రచార ఆర్భాటం’
దేవరాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరిట ప్రచార ఆర్భాటం చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. యోగాతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార యంత్రాంగాన్ని యోగా కోసం వినియోగించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే మోదీ సభకు లక్షల మందిని విశాఖకు తరలించడం ప్రజాధనం వృథా తప్పా, రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. రైతులు, శ్రామికులు, ఉపాధి కూలీలలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మునగపాక: రబీ సీజన్లో సాగైన వరిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో వరి పంట సాగు చేసి గింజలను సేకరించే క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండలంలోని వాడ్రాపల్లిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్న సమాచారం మేరకు ఆయన బుధవారం ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సకాలంలో మెరుగైన ధరలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కల్లాల్లో ధాన్యం పాడైపోయి రైతులు అల్లాడిపోతున్నా పాలకులు, అధికారులకు పట్టకపోవడం విచారకరమన్నారు. రంగు మారిన ధాన్యానికి కూడా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సరైన ధర అందించారన్నారు. అన్ని విధాలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కాండ్రేగుల నూకరాజు, భీశెట్టి గంగప్పలనాయుడు, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్, రైతులు బొడ్డేడ సత్యనారాయణ, మళ్ల జోగినాయుడు, కాండ్రేగుల లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. రబీ వరికి గిట్టుబాటు ధర లేక ఆర్థిక ఇబ్బందులు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ -
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై పోరాడదాం..
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై సభ్య రైతులతో కలిసి పోరాటం చేద్దామని వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావును స్వగ్రామమైన గోవాడలో బుధవారం అమర్నాథ్ పరామర్శించారు. సత్యారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని ముఖ్య నాయకులతో అమర్నాథ్ సమీక్షించారు. ఇటీవల అమెరికా పర్యటన తర్వాత మొదటి సారిగా నియోజకవర్గానికి రావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో మాట్లాడారు. గ్రామాల్లో, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులపై గ్రామస్థాయి నాయకులు వివరించారు. అలాగే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారవుతోందని, రైతులకు చెరకు బకాయిలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఫ్యాక్టరీ లేదని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అమర్నాథ్ స్పందిస్తూ ఈ విషయమై ఫ్యాక్టరీ, చెరకు రైతుల పరిస్థితిని ప్రభుత్వానికి తెలిసేలా పోరాటం చేయాలన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో మండల స్థాయి, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ముందుగా మండలాల వారీగా నాలుగు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చోడవరం మండల సమావేశం ఈ నెలలో నిర్వహించేందుకు నిర్ణయించామని, త్వరలో సమావేశం తేదీని తెలియజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, ఎంపీపీ గాడి కాసు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, శరగడం నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ పల్లా రమణ, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, ప్రధాన కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, జిల్లా కార్యదర్శి పోతల శ్రీనివాసరావు, డీఆర్యూసీ సభ్యుడు బొడ్డు శ్రీరామమూర్తి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మరింత బలోపేతం దిశగా విస్తృత సమావేశాలు పార్టీ చోడవరం సమన్వయకర్త, మాజీ మంత్రి అమర్నాథ్ -
అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ విజేత ఒడిశా
రన్నరప్గా ఆంధ్రప్రదేశ్ జట్టు ఉక్కునగరం: ఉక్కు స్టేడియంలో జరిగిన అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ చాంపియన్షిప్ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ (సీఏబీకే) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో ఢిల్లీ, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన ఫైనల్స్లో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 15 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమీశ్ శర్మ, హెచ్ఆర్ బి.బి.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా కంపెనీ బస్సుకు మంటలు
● ఇంజిన్ ఆయిల్ లీకేజీయే కారణం అనకాపల్లి టౌన్: పరవాడ లారస్ కంపెనీకి చెందిన బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చోడవరంలో నివాసముంటున్న కంపెనీ ఉద్యోగులను తీసుకురావడానికి లంకెలపాలెం నుంచి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బస్సు బయలుదేరింది. తుమ్మపాల దర్జీనగర్కు చేరుకొనే సమయంలో వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనదారులు బస్సు వెనక మంటలు వస్తున్నాయని చెప్పడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఈ సమయంలో బస్సులో మరెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం తెలపడంతో హుటాహుటిన సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం ఇంజిన్లో ఆయిల్ లీకేజీ వలన జరిగిందని రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. బస్సు ముందు భాగం, లోపల సీట్లు పూర్తిగా కాలిపోయాయి. -
ఏయూలో కొలువుదీరిన కొత్త నాయకత్వం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగాలకు నూతన నాయకత్వం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు చేతుల మీదుగా డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లకు బుధవారం నియామక ఉత్తర్వులను అందించారు. మొత్తం 43 మందికి వివిధ పదవీ బాధ్యతలను కేటాయించారు. అనంతరం వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించామని, త్వరలో నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రతి విభాగం పనిచేయాలన్నారు. విద్యార్థులతో, సిబ్బందితో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు. యువతకు ప్రాధాన్యత : నూతనంగా నియామకం చేసిన డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లలో అత్యధికంగా యువతకు అవకాశం కల్పించారు. ప్రతి విభాగంలో ఉన్న యువ ఆచార్యులను ఎంపిక చేసి ఈ బాధ్యతలు కేటాయించారు. భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వర్సిటీని ముందుకు నడిపించే దిశగా యువ ఆచార్యులను ప్రోత్సహించేందకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. -
దాత సాయం.. గోతుల రోడ్డుకు మోక్షం
బుచ్చెయ్యపేట : మండలంలో గల రాజాం, తట్టబంద (ఆర్టీ) రోడ్డులో గోతులకు మోక్షం కలిగింది. రాజాం నుండి తురకలపూడి వరకు పెద్దపెద్ద గోతులు పడి రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. గోతులను పూడ్చాలని పలువురు కోరినా అధికారులు, పాలకులు పట్టించికోలేదు. ఈ రహదారిలో రాకపోకలు సాగించే రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. రోడ్డు గోతుల వల్ల అనకాపల్లి ఆర్టీసీ అధికార్లు బస్సులు నడపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో పడి పలువురు వాహనదారులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. రావికమతం మండలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యజమాని ప్రభు ప్రయాణికులు కష్టాలను చూసి ముందుకొచ్చారు. సుమారు రూ.2 లక్షలతో ఐదు కిలోమీటర్లు పొడవున ఉన్న గోతులను కప్పించారు. గోతులను పొక్లెయిన్తో లెవిలింగ్ చేసి గ్రావెల్తో గోతులను పూడ్చారు. సజావుగా వాహనాలు రాకపోకలు సాగేలా చేశారు. -
కారును ఢీకొన్న టిప్పర్ లారీ
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం కూడలిలో మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రాణహాని నుంచి అదృష్టవశాత్తూ సురక్షితంగా బయట పడ్డారు. అయితే కారు మాత్రం దెబ్బతింది. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న కారును, అదే మార్గంలో వస్తున్న పెద్ద టిప్పర్ లారీ ఢీకొని సుమారు వంద మీటర్ల దూరం వరకు కారును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లిపోసాగింది. దాన్ని డ్రైవర్ గమనించలేదు. స్థానికులు గమనించి పరుగున వెళ్లి లారీ ఆపడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ కారు ఢీకొన్న తర్వాత బోల్తా పడకుండా సాధారణ స్థితిలో ముందుకు ఈడ్చుకు వెళ్లింది. దీంతోపాటు స్థానికులు గమనించి లారీ ఆపడంతో నిలిపారు. దీంతో ప్రమాదం తప్పింది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కాకినాడ వద్ద ఉప్పాడకు చెందిన ప్రైవేటు వైద్యుడు హరనాథరాజు, భార్య మేరీమణి, బంధువు అయిన డైవర్ యు. ప్రకాష్ ఉన్నారు. వీరు విశాఖ నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న కాకినాడకు సొంత కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో హమ్మయ్య..అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మేరీమణి మాత్రం కొంత సేపు షాక్కు గురై అనంతరం తేరుకున్నారు. ప్రమాదంలో కారు కుడి పక్క భాగం దెబ్బతింది. ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా తొలగించారు. ప్రమాద వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
లక్ష్మీపురంలో దాహం కేకలు..
చోడవరం : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామానికి మంచినీళ్లు లేకుండా చేసింది. మంచినీళ్ల కోసం లక్ష్మీపురం గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 10 రోజులుగా ఈ గ్రామంలో కుళాయిల నుంచి మంచినీళ్లు రాక బిందెడు నీళ్ల కోసం బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామంలో ప్రజలకు మంచినీళ్లు సమస్య ఉత్పన్నమైంది. చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో సుమారు 5వేల మంది జనాభా ఉన్నారు. కొద్ది నెలలుగా ఈ గ్రామంలో తీవ్ర లోఓల్టేజీ సమస్యతో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఒక్కొక్కటిగా కాలిపోతూ వచ్చాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి అనేకసార్లు చోడవరం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తాజాగా మరో ట్రాన్స్ఫార్మర్ కూడా లో ఓల్టేజీ సమస్యతో కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా లేక గ్రామంలో ఇంటింటి కుళాయిలకు మంచినీరు సరఫరా చేసే ట్యాంక్లకు బోర్ వెల్స్ నుంచి నీరు పంపింగ్ జరగలేదు. మంచినీటి ఓవర్ హెట్ ట్యాంక్లకు నీరు పంపింగ్ జరగకపోవడంతో గ్రామంలోకి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా నిలిచిపోయింది. బోల్వెల్స్ మోటార్లు కూడా కాలిపోవడంతో పంచాయతీ నుంచి వాటికి మరమ్మతులు చేయించారు. అయినా లోఓల్టేజీ కారణంగా పూర్తిగా ట్రాన్స్ఫార్మరే కాలిపోవడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాలంటూ జాప్యం చేసుకుంటూ వస్తున్నారే తప్ప ట్రాన్స్ఫార్మర్లు బాగుచేయించి లోఓల్టేజీ సమస్య నివారించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే చర్యలు మాత్రం విద్యుత్ శాఖ అధికారులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో సరఫరా లేక నీరు ఇవ్వలేదు. దీంతో మంచినీటి సమస్యతో లక్ష్మీపురం ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం చేతిబోర్లు, వ్యవసాయ పంపుసెట్ల వద్దకు వెళ్లి నానా అవస్థలు పడుతున్నారు. వేలాది మంది ప్రజలు మంచినీటి కోసం కష్టాలు పడుతున్నా అధికారులు మాత్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 5వేల మంది గ్రామస్తుల మంచినీటి సమస్యను పట్టించుకోని అధికారులు లో ఓల్టేజీ సమస్యతో కాలిపోయిన 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కరెంటు లేక వారం రోజులుగా నిలిచిన మంచినీటి సరఫరా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు మంచినీటి కోసం గగ్గోలు పెడుతున్న జనం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు లో ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని పదినెలులుగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మంచినీటి ట్యాంక్కు నీరు పంపింగ్ చేసే ప్రదేశంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోవడంతో కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయలేదు. ఎంపీడీవోకి, విద్యుత్శాఖ ఏడీఈకి ఫిర్యాదు చేశాను. అయినా వారు చర్యలు తీసుకోలేదు. పంచాయతీ నుంచి ఏమీ చేయలేని పరిస్థితి. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – శిరుచోళ్ల గంగాభవానీ గణపతినాయుడు, సర్పంచ్, లక్ష్మీపురం, చోడవరం మండలం -
ముంచేసిన అధిక వడ్డీ ఆశ
బుచ్చెయ్యపేట: అధిక వడ్డీ ఆశతో బుచ్చెయ్యపేట మండల యువకులు నిలువునా మోసపోయారు. తెలంగాణకు చెందిన కార్లను తెచ్చి తాకట్టు పెట్టి యువకుల వద్ద కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు. ఈ మోసంలో బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడికి చెందిన ఓ రాజకీయ కుటుంబం సుమారు రూ.80 లక్షక్షలు, నేతవానిపాలేనికి చెందిన ఒక యువకుడు రూ.20 లక్షలకు పైగా కోల్పోయినట్టు తెలుస్తోంది. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన వ్యక్తి తెలంగాణ నుంచి కార్లను తీసుకొచ్చి వీరి వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లేవాడు. ఒక్కో కారు కుదువ పెట్టి మూడు, నాలుగు లక్షలు తీసుకునేవాడు. ఈ సొమ్ముపై లక్షకు నెలకు రూ.15 వేల వడ్డీ ఇచ్చేవాడు. అధిక వడ్డీకి ఆశపడిన వీరిద్దరూ తమ డబ్బులతోపాటు తమకు తెలిసిన వారి వద్ద నాలుగైదు రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ కార్లు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవారు. అప్పు తిరిగి చెల్లించకపోయినా కార్లు తమ వద్దే ఉంటాయన్న ధీమాతో వారంతా కోటి రూపాయలకు పైగా ఇచ్చేశారు. నాలుగైదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి, కార్లు తాకట్టు పెట్టుకొని 15 రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చేవారు. నెలకు లక్ష వద్ద రూ.10 వేలు వడ్డీ మిగలడంతో వీరు లక్షలకు లక్షలు వెచ్చించారు. కొసమెరుపు : పది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు దిబ్బిడి వచ్చి యువకుల వద్ద తాకట్టు పెట్టిన కార్లను పట్టుకుపోయారు. వాటిని పార్వతీపురానికి చెందిన వ్యక్తి తమకు తాకట్టు పెట్టినట్టు వారు చెప్పినా పోలీసులు వినలేదు. తమ కార్లను లీజుకు తీసుకొని అప్పజెప్పలేదని తెలంగాణకు చెందిన కారు ఓనర్లు ఫిర్యాదు చేయడంతో, జీపీఎస్ ద్వారా ఇక్కడ కార్లు ఉన్నట్లు గుర్తించామని తెలంగాణ పోలీసులు వీరికి తెలిపారు. దొంగ కార్లను కొన్నందుకు మీపైనే కేసులు పెడతామని బెదిరించి 30 కార్లను పట్టుకుపోయారు. కార్లు తాకట్టు పెట్టిన పార్వతీపురానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని వారికి అర్థమయింది. వారిద్దరికీ అప్పులిచ్చిన యువకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల గ్రామంలో కార్ల తాకట్టు పేరిట మోసం జరిగింది. బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం, సీతయ్యపేట, చిట్టియ్యపాలెం తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.కోటికి పైగా కుచ్చు టోపీ కార్లు తాకట్టు పెట్టి రూ.15ల వడ్డీకి అప్పు తీసుకున్న మోసగాడు రూ.కోటికి పైగా వెచ్చించిన బుచ్చెయ్యపేట యువకులు తెలంగాణ పోలీసులు రావడంతో మోసం బట్టబయలు అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టుపెట్టినట్టు తెలుసుకొని లబోదిబో 30 కార్లను తీసుకుపోయిన తెలంగాణ పోలీసులు -
విద్వేషం.. విధ్వంసం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కూటమి నేతలు, కార్యకర్తలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణు లు, సానుభూతిపరులే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నా రు. రెడ్బుక్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జనకాండకు హద్దుల్లేకుండా పోయింది. భౌతికదాడులు, ఆస్తుల విధ్వంసం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన ఉమ్మడి విశాఖ జిల్లాలోని పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలు కేసులు, అరెస్టులు పెచ్చుమీరిపోయాయి. సాక్షి, అనకాపల్లి: హామీలు గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆస్తులు విధ్వంసమైనా, ప్రాణాల మీదకు వచ్చినా.. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు అంటే పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కూటమి పాలనలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిపై హత్యాయత్నం చేశారు. 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంటలు, ఇళ్లు ధ్వంసం చేశారు. స్పీకర్ ఇలాకాలో దాడులు, దౌర్జన్యాలు.. సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గమైన నర్సీపట్నంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు ఎక్కువగా జరిగాయి. ఇసుక దోపిడీని అ డ్డుకున్నందుకుగానూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్యకు యత్నించారు. ఆయన అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇళ్లను కూల్చేశారు. వైబీ పట్నానికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశా రు. చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చే యగా, 12 మంది వైఎస్సార్సీపీ యువతపై కేసులు నమోదు చేశారు. జూలై 9వ తేదీన మాకవరపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామాని కి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. 2019లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాకవరపాలెంలోని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఇటీవల ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టి వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, బండారు గాంధీ సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్య ప్పలపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు. హోంమంత్రి నియోజకవర్గంలో.. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల గ్రామం శివారు మర్రిచెట్టు ప్రాంతంలో మాడెం వరలక్ష్మి ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీకి చెందిన జవ్వాది ఈశ్వరరావు, జవ్వాది రమేష్, బత్తుల అప్పారావు, బత్తుల నరసింహమూర్తి, పబ్బు తుర్రయ్య దాడి చేశారు. మహిళల దుస్తులు చింపి అసభ్యకరంగా దూషించారు. దాడి చేయడమే కాకుండా బాధిత మహిళలపై టీడీపీ వారు కేసులు కూడా పెట్టారు. కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు, ఇద్దరిపై హత్యాయత్నం 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంట నాశనం.. ఇళ్లు ధ్వంసం ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్తోపాటు 44 మందిపై కేసులు నాతవరం మండలం డి.ఎర్రవరంలో ధ్వంసమైన పంట సోషల్మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోస రమణారెడ్డిపై వివిధ జిల్లాల్లోని పొదిలి, దర్శి, ఇచ్ఛాపురం, నీలకంఠాపురం, పార్వతీపురం పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ఒక స్టేషన్ తర్వాత మరో స్టేషన్కు తిప్పి తీవ్రంగా వేధించారు. ఆయన డిసెంబర్ నెలలో విడుదలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో నివాసముంటున్న బోడి వెంకటేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనన్ కల్యాణ్, మంత్రి లోకేష్లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మొత్తం 17 కేసులు నమోదు చేశారు. ఆయనను తొలుత 2024 నవంబర్ 3న అరెస్టు చేశారు. మొత్తం 115 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు స్టేషన్లో సీఐ సీహెచ్ శేషగిరిరావు 15 నిమిషాల్లో 4 వేల గుంజీలు తీయమని ఇబ్బంది పెట్టారు. రాజాం, చినమేరంగి (కురుపాం), విశాఖలో దువ్వాడ, టూటౌన్, పరవాడ, సబ్బవరం, మహారాణిపేట, రేపల్లె, పెదకూరపాడు, పాతగుంటూరు, కృష్ణపట్నం, చీరాల, మార్టూరు, గుంటూరు, బాపట్ల, లావేరు, కర్నూల్, కడప, విజయవాడ, మైలవరం, మంచిలీపట్నంలలో కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్పై విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు నమోదు చేశారు. కేసులు, విచారణ అంటూ రెండు నెలలు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మొదట 2024 ఆగస్టు 31న పోలీసులు అరెస్టు చేశారు. అతని కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో బెయిల్ లభించింది. మళ్లీ 2024 నవంబర్లో కొత్త కేసులు పెట్టి అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో బాపట్లలో కూడా మరో కేసు నమోదు చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా బాపట్లకు తీసుకువెళ్లి విచారించారు. ఇలా అతడిపై రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు చేశారు. -
సాక్షి పత్రిక కార్యాలయాల మీద దాడులు తగవు
మాడుగుల రూరల్ : రాష్టంలో వివిధ ప్రాంతాల్లో సాక్షి పత్రికా కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చెయ్యడం అన్యాయమని జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, చోడవరం సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపులు, రెడ్బుక్ పాలన, ఆక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో హామీల అమలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి దుష్ట సంప్రదాయానికి తెర దించిందన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మీద దాడులు చేయడం ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. అధికార పార్టీ ఆగడాలకు పరాకాష్ట సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అన్యాయం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు ఖండన -
నెట్ సెంటరే సచివాలయం?
ఎస్.రాయవరం : తల్లికి వందనం పథకానికి లబ్ధిదారులను నమోదు చేస్తామని రేవుపోలవరం గ్రామంలో ఓ ఇంటర్నెట్ దుకాణం వద్ద రూ.30 చొప్పున వసూలు చేసి వేలిముద్రలు వేయించుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మంగళవారం తెలిపారు. సచివాలయం లాగిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఓపెన్ చేసి గ్రామస్తులందరినీ పిలిపించి రూ.30 చొప్పున తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సచివాలయం సిబ్బంది, సచివాలయాల్లో చేయాల్సిన పనులు ఇంటర్నెట్ సెంటర్లో చేయడం, పైగా నగదు వసూళ్లు చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. స్థానిక కూటమి నేతలు ఈ రకమైన పనులను ప్రోత్సహించడం వల్ల సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకాకపోవడమే కాకుండా పనులు పక్కదారి పడుతున్నాయన్నారు. ఈ సమస్యను మండల అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. తల్లికి వందనం వేలిముద్రకు రూ.30 చొప్పున వసూళ్లు అక్రమాలను ప్రోత్సహిస్తున్న కూటమి నేతలు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ధ్వజం -
ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
నాతవరం : కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను యుద్ధ ప్రతిపాదికన అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఆందోళన చేపట్టారు. మొయిన్రోడ్డుపై ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా అందించాలన్నారు. తల్లికి వందనం, 50 ఏళ్లు దాటిన అందరికీ పింఛన్ల సదుపాయం కల్పించాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇతర సదుపాయాలు అమలు చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టడం అపాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంపై కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ ఎ,వేణుగోపాల్కు ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు గురుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాభవాని, మండల శాఖ అధ్యక్షుడు చిన్నంనాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయాలి నాతవరంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన -
మహిళల కన్నెర్ర
● హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ● అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతల వినతి పత్రం అనకాపల్లి టౌన్: అత్యాచారాలపై మహిళలు కన్నెర్ర చేశారు.. అరాచకాలు నశించాలని నినదించారు.. దిగజారిన శాంతిభద్రతలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లిలో నిరసన ప్రదర్శన జరిగింది. రింగ్రోడ్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్ జంక్షన్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. పార్టీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు శోభ హైమావతి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలపై అత్యారారాలు పెరిగిపోయాయని, మూడు సంవత్సరాల పిల్లల నుంచి, ముసలివాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నా రు. ప్రశాంతమైన రాష్ట్రం అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉన్నా అతివలపై దాడులను అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని అమలు చేస్తే.. దాని పేరు మార్చి మహిళలకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పంచారీ పద్మ, అనకాపల్లి మండల మహిళా అధ్యక్షురాలు కోట్నాల పద్మకుమారి, పెందుర్తి మహి ళా విభాగం అధ్యక్షురాలు ఎస్.నదియా, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బైండోవర్ కేసులు
దేవరాపల్లి: తిమిరాంలో భారీ గోతులు తీసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు సాక్షి పత్రికలో ఈ నెల 9న ‘ఇసుక తోడేళ్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శారదానదిలో నిబంధనలకు విరుద్ధంగా గోతులు తీసి ఇసుక తరలిస్తున్న ముగ్గురు ట్రాక్టర్ యజమానులు సబ్బవరపు రామకృష్ణ, సీముసిరి గంగునాయుడు, గుంపాన గంగునాయుడులపై స్థానిక తహసీల్దార్ బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఉచిత ఇసుక పేరిట నిబంధనలను అతిక్రమించి ఇసుక తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పి.లక్ష్మీదేవి హెచ్చరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల బదిలీ విశాఖ లీగల్ : నగరంలోని పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బి.రామకోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం మొబైల్ కోర్టు ఏపీపీ పి.శాంతి గౌతమి భీమిలి 16వ ప్రధాన శ్రేణి న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. పాడేరు మెజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ వీ. రమేష్, భీమిలి 14వ ప్రధమ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్ట్ ఏపీపీగా వస్తున్నారు. నగరంలోని ఒకటవ ప్రధాన మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ ఎం షణ్ముఖ ఎకై ్సజ్ కోర్టు ప్రత్యేక ఏపీపీగా నియమితులయ్యారు. ఎక్సైజ్ కోర్టు ఏపీపీ కె విమల్ రాథోడ్, ఫస్ట్ ఏసీ ఎం కోర్టు ఏపీపీగా వస్తున్నారు. -
కేజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ వాణి బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: కేజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రసూతి, సీ్త్ర వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ పోస్టు అదనపు డీఎంఈ కేడర్లో ఉండటంతో.. అదే కేడర్కు చెందిన డాక్టర్ వాణిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న డాక్టర్ పి.శివానంద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ జి.మెహర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ డి.రాధాకృష్ణన్, డాక్టర్ వి.రవి, డాక్టర్ ఎల్.లోకనాథ్ రావు, డాక్టర్ జి.వాసవి లత, అసిస్టెంట్ డైరెక్టర్ బి.ఎస్.సుమతితో పాటు ఇతర వైద్యులు, పరిపాలన సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ వాణి మాట్లాడుతూ రోగులకు మెరుగైన సంరక్షణ, ఉన్నతమైన చికిత్స ప్రమాణాలు అందించడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. కేజీహెచ్ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు, అవసరమైన సంస్కరణలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటానన్నారు. -
మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్కే..
తుమ్మపాల: పొంతన లేని సమాధానాలతో పీజీఆర్ఎస్ అర్జీదారులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ అర్జీదారులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యానికి గురై ఏర్పడిన సమస్యలపై కలెక్టరేట్లో మొరపెట్టుకుంటే జిల్లా అధికారులు సైతం అదే ధోరణి చూపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై క్రమేపి ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పీజీఆర్ఎస్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు అధికారులు ఎండార్స్మెంట్లు ఇస్తూ వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. దీంతో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు తప్ప ఇతర సంక్షేమ పథకాలు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించి వాటిపై విన్నవించేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 122 అర్జీలు రెవెన్యూ సంబంధిత అంశాలివే వచ్చాయి. పంచాయతీ రాజ్ – 32, సర్వే శాఖ –18, పోలీస్ –17, మరో 17 శాఖల్లో ఒకటి, రెండేసి అర్జీలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం 240 అర్జీలు రాగా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు పునరావృతమైనవే ఉన్నాయి. ● కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారుల వద్ద కలెక్టర్ విజయకృష్ణన్తోపాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, మనోరమ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాక.. వస్తున్న అర్జీదారులు మండల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆవేదన కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 240 అర్జీల నమోదుపాసుపుస్తకాలు మంజూరు చేయలేదు డీ–పట్టా భూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ పాయకరావుపేట మండలం కుమారపురం గ్రామానికి చెందిన గురుబిల్లి రాంబాబు అర్జీ చేసుకున్నాడు. తన అత్తగారైన కర్రి లక్ష్మి ద్వారా సంక్రమించిన డీపట్టా భూమి నేటికీ ఆన్లైన్ కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, సహాయం పొందలేక పోతున్నానని మొరపెట్టుకున్నాడు. వృద్ధాప్యంతో ఉన్న తనకు పాసుపుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరాడు. మెట్టింట్లో కూతురు ఉద్యోగం చేస్తే పింఛన్ రాదంట! వృద్ధాప్యంతో ఒంటరిగా జీవిస్తున్న తనకు ప్రభుత్వ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని గవరపాలెం అంబేడ్కర్ నగర్కు చెందిన జల్లూరి గొంతమ్మ పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంది. పట్టణంలో 23వ గ్రామ సచివాలయానికి పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పొయిందని వాపోయింది. పింఛన్ ఇస్తామంటూ ఇన్నాళ్లు తిప్పించుకుని, వివాహమైన కూతురు పేరు రేషన్ కార్డులో ఉందని, ఆమె ఉద్యోగం చేస్తున్నందున పింఛన్ రాదని ఇప్పుడు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒంటరిగా జీవిస్తున్న తనకు వివాహమై వెళ్లిపోయిన కూతురు వివరాలు జోడించి అన్యాయం చేయొద్దని, కలెక్టరమ్మ స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంది. -
ఢిల్లీ సందర్శించిన నలుగురు విద్యార్థులు
మాడుగుల రూరల్: సృజనవాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలో వీరవల్లి అగ్రహారం విద్యార్థులు ఢిల్లీ సందర్శించారు. అక్కడ సమీపంలో రిషిహుడ్ విశ్వవిద్యాలయంలో పర్సనాలిటీ డెవలప్మెంటుపై శిక్షణ తీసుకున్నారు. ఫ్లై ఇన్ ది స్కై సూపర్ 60 రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులు కె. కల్పన(చోడవరం), ఎం. రోహిత్కుమార్ (వీరనారాయణం), కె.మోహిత, ఎం. గౌతమి( కె.జె.పురం) ఎంపిక చేశారు. ఈ నెల ఒకటో తేదీన ఇక్కడ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లారు. ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపుదల వంటి అంశాల్లో శిక్షణ పొందారు. ఇందులో భాగంగా అక్షరధామ, లోటస్పాండ్, ఢిల్లీ గేట్, పార్లమెంటు భవనంతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా విమానంలో విశాఖకు సోమవారం తిరిగి వచ్చారు. వీరి వెంట సృజనవాణి స్వచ్ఛంద సంస్థ కార్యనిర్వాహక సభ్యుడు పి. మహేశ్ వెళ్లారని సంస్థ సమన్వయకర్త జానీ సోమవారం తెలిపారు. రిషిహుడ్ విశ్వవిద్యాలయంలో పర్సనాలిటీ డెవలప్మెంటుపై శిక్షణ -
సొంత గనులు కేటాయించాలి
స్టిల్ ప్లాంట్ 100 వ్యూహాత్మక ఆమ్మకానికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఆ ప్రక్రియలు మరింత వేగవంత చేస్తోంది. ఇది స్టీల్ ప్లాంట్కు నష్టం కనుక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించటం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి సరసమైన ధరలకు స్టీల్ ప్రజలకు అందుతుంది. ప్రధానంగా యాజమాన్యం వైఖరి మార్చుకొని కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి. –జె.అయోధ్యరామ్,స్టీల్సీఐటీయు గౌరవ అధ్యక్షులు -
ఉక్కు ఉద్యమంపై కుట్ర
● పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం వేధింపులు ● దీక్షా శిబిరాన్ని ఆక్రమించిన పోలీసులు ● నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు ● పోలీసుల తీరుపై ఉక్కు కార్మికుల ఆగ్రహం కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 1,579 రోజులుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతుండగా సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దీక్షా శిబిరంలోకి పోలీసులు చొరబడి కుర్చీలలో ఆసీనులవడంతో ఆగ్రహించిన కార్మికులు నేలపై కూర్చుని నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు దౌర్జన్యం ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మిక సంఘాల నేతల ధ్వజం అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తు న్నాయని దుయ్యబట్టారు. శాంతియుతంగా జరుగుతున్న దీక్షలను పోలీసుల ద్వారా అణచివేయాల ని చూడటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని కారణం చూపి తొలగించడాన్ని యాజమాన్యం అక్షేపించడాన్ని తప్పుబట్టారు. కర్మాగారం స్థాపించినప్పటి నుంచి అనేక పోరాటాలు చేశామని, ఇంత దారుణంగా ఎవరూ ఎప్పుడూ వ్యవహరించలేదని పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలు విడనాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. సిట్ గౌరవ అధ్యక్షులు జె. అయోధ్యరామ్ మాట్లాడుతూ, కార్మికులను అణచివేసి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది పాలకులకు క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 78వ వార్డు కార్పొరేటర్ బి. గంగారావు మాట్లాడుతూ, కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కుట్ర ప్రభుత్వ విధానాల్లో భాగమేనని, కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లో భాగంగానే కార్మికుల ఉద్యమాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని గంగారావు హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, కేఎం.శ్రీనివాస్, రామచంద్రరావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ ప్లాంట్ నిర్వహణలో కక్షసాధింపు
● వైఎస్సార్సీపీ నాయకుడు బుజ్జి తొలగింపు నర్సీపట్నం: ఎన్టీఆర్ సుజల స్రవంతి నిర్వహణ నుంచి వైఎస్సార్సీపీ నాయకుడు దాడి బుజ్జిని రాజకీయ కక్షసాధింపుతో తప్పించడం సరికాదని మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, మాకిరెడ్డి బుల్లిదొర, కోఆప్షన్ సభ్యుడు ఎండీ బాషా, పార్టీ నాయకులు చీటిల రాము, యాదగిరి శేషు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సురేంద్రకు సోమవారం వారు వినతిపత్రం అందజేశారు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపు వీధిలో ప్రారంభించిన ఈ ప్లాంట్ను నాటి నుంచి నేటి వరకు బుజ్జి తన సొంత నిధులతో నిర్వహిస్తూ ప్రజలకు సజావుగా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు లేకపోయినా టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించటం సమంజసం కాదన్నారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ఎక్యూప్మెంట్కు రూ.2 లక్షలకు పైగా వెచ్చించారన్నారు. కనీసం ఆ నిధులైన ఇవ్వాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. -
అయోమ‘యోగాంధ్ర’
యలమంచిలి రూరల్: యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులు, ఉద్యోగులను అయోమయానికి, తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం అమలవుతున్న తీరు సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్టుంది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేయాలని సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏ ఒక్కర్నీ వదలడం లేదు. కొద్ది రోజులుగా మిగతా విషయాలు పక్కన పెట్టి కేవలం యోగా మంత్రం జపిస్తున్నారు. దీంతో అధికారులు తీవ్రంగా నలిగిపోతున్నారు. యోగాంధ్ర యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి గ్రామ, మండల స్థాయి పోటీల నిర్వహణ వరకూ ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులకు టార్గెట్లు నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలమంటూ అధికారులు మధనపడిపోతున్నారు. గ్రామ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనీలు ఇలా అందరిపైనా తీవ్ర పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లు, యోగా ప్రొటోకాల్ ఆసనాల శిక్షణను అధికారులు నయానో, భయానో పూర్తి చేశారు. ఇవేం పోటీలు జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 ఏళ్లు పైబడి అంటూ మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో, యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు గ్రూపునకు చెందిన కొందరు 35 ఏళ్ల వయస్సున్న వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడిందని వారంతా పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నిరంతరం సాధన చేసే వారు, యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందే వారు మాత్రమే వేయగల ఆసనాలను మాత్రమే పోటీల జాబితాలో పొందుపర్చడంతో ఆ జాబితాను చూసిన వారందరూ విస్మయం చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో.. క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని, తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. కానీ పోటీలో ఎక్కువమంది పాల్గొన్నట్టు చూపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం వంటి ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణ మత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడాసనం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులతోపాటు యోగా మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు గ్రామాల్లోకి వెళ్లి పోటీల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ ప్రాధేయపడవలసి వస్తోంది. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అన్పించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి దివ్య ఔషధం... ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది... కానీ అధికారులు, ఉద్యోగులు మాత్రం గత పక్షం రోజులుగా ‘యోగాంధ్ర’ ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒక పక్క శిక్షణ కార్యక్రమాలు... మరో పక్క ఫొటోలను అప్లోడ్ చేయడం...ఇంకో పక్క అభ్యర్థులను ఒప్పించే, టార్గెట్లను పూర్తిచేసే పనులు, సర్వేలు, టెలీకాన్ఫరెన్స్లు ఇలా తలకు మించిన పనులతో సతమతమవుతున్నారు. కింది స్థాయి నుంచి ఒకటే హైరానా పడుతున్నారు.... సాధ్యం కాని ఆసనాలతో పోటీలకు ఎలా సిద్ధం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సాధ్యం కాని ఆసనాలతో పోటీలు ఎలా ? యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా చేస్తోంది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీల రిజిస్ట్రేషన్, యోగా ప్రొటోకాల్ ఆసనాలను పూర్తి చేసినప్పటికీ, జిల్లా స్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కాని, అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాల్లో పేర్కొనడంతో, కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తీవ్ర స్థాయిలో ఉద్యోగులపై పని ఒత్తిడి యోగాంధ్ర సర్వే, లక్ష్యాలు, టెలీకాన్ఫరెన్సులతో తిప్పలు సాధ్యం కాని ఆసనాలతో పోటీ ఎలా అంటున్న ప్రజలు వెబ్తోనే టైం సరి యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతి రోజూ కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబెక్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్దీ సమయం వృథా అవుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కిందిస్థాయి ఉద్యోగులను గ్రామాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇపుడు యోగాంధ్ర కార్యక్రమం కోసం నెల రోజులపాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో తలలు పట్టుకుంటున్నారు. యోగాసనాలు నేలపై వేయకూడదు. మ్యాట్లు, లేదా కార్పెట్లు వంటివి ఉండాలి. కానీ యోగాంధ్ర కోసం అధికారుల మాట కాదనలేక కటిక నేలపై కూడా ఆసనాలు చేస్తున్న ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. యోగాంధ్ర కార్యాచరణతో చాలా పని ఒత్తిడితో సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులంతా నరకం చూస్తున్నారు. చివరకు రోజూ కార్యాలయంలో రాత్రి 10 గంటల వరకూ కూడా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు తీవ్రంగా మధనపడుతున్నారు. -
సింహాచలం దేవస్థానం ఈవో బదిలీ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని దేవదాయశాఖ రాజమహేంద్ర వరం మల్టీ జోన్–1 రీజనల్ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి. వినయ్చంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యే వరకు త్రినాథరావే ఇన్చార్జి ఈవోగా కొనసాగాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్రినాథరావు 2024 సెప్టెంబర్ 22 నుంచి సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్న ఆయన, గత నెల 26వ తేదీనే తిరిగి విధుల్లో చేరారు. కాగా, తనను సింహాచలం దేవస్థానం నుంచి బదిలీ చేయాలని త్రినాథరావే దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నందువల్లే ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. -
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు ఆయా పోలీసు స్టేషన్లలో సోమవారం ఫిర్యాదులు చేశారు. అనకాపల్లిలో సీఐ విజయకుమార్కు, పాయకరావుపేట పోలీసు స్టేషన్లో ఎస్ఐ పురుషోత్తంకు స్థానిక పాత్రికేయులు సహా సాక్షి విలేకరులు ఫిర్యాదులు అందజేశారు. కోటవురట్ల పోలీసు స్టేషన్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు ఎం.రాజు, డి.అప్పారావు ఫిర్యాదు చేశారు. యలమంచిలి, దేవరాపల్లి, గొలుగొండ, కె.కోటపాడు, నక్కపల్లి, మునగపాక, రోలుగుంట, రావికమతం, అచ్యుతాపురం స్టేషన్లలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందజేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా
మాడుగుల రూరల్ : శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ బంజరు భూములను స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మాడుగుల గాంధీ పార్కు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు గురించి నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దారు రమాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామంలో గల సర్వే నెంబరు 188–3 లో గల భూమిని ఆదివాసీలకు కేటాయించాల ని, సివిల్ కేసులలో ఆదివాసీలను ప్రతిసారి పోలీసుస్టేషన్కు పిలిపించి పోలీసులు తమని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తహసీల్దా రుకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. త హసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఎస్ఐ, ఇతర సిబ్బందితో మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. అలాగే కృష్ణంపాలెం గ్రామానికి చెందిన 46 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేశారు. సీపీఐ ఎంఎల్ లిబిరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.గణేష్ పాల్గొన్నారు. గ్రామీణ మెరుపులు -
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట?
● ఉమ్మడి విశాఖలో బదిలీల దుమారం ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నో బదిలీ ● పెందుర్తిలో బాబ్జీకి భంగపాటు? మహారాణిపేట: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించకపోవడం, అదే సమయంలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెందుర్తి తహసీల్దార్ బదిలీ విషయంలో అక్కడి ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆనందపురం తహసీల్దార్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన కారణంగా గాజువాక తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కదపకపోవడం గమనార్హం. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో కలిపి రెవెన్యూ శాఖలో మొత్తం 62 మందిని బదిలీ చేశారు. పంచాయతీరాజ్లో 75 మందికి స్థానచలనం జిల్లా పరిషత్లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మొత్తం 75 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పరిపాలనాధికారులు, 4 సీనియర్ అసిస్టెంట్లు, 11 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఆరుగురు నైట్ వాచ్మెన్ ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.బదిలీ అయిన రెవెన్యూ అధికారులు వీరే.. మండలం/స్థానం తహసీల్దార్/ కేటాయించిన స్థానం సూపరింటెండెంట్ పేరు పెందుర్తి ఎం.ఆనందకుమార్ అనకాపల్లి జిల్లా ములగాడ ఎం.భుజంగరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) బి.నాగరాజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ిసీహెచ్ తిరుమలరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ఎం.భాస్కరఅప్పారావు అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లా టి.రామకృష్ణ పెందుర్తి మండలం అల్లూరి జిల్లా ఎంవీవీపసాద్ ల్యాండ్ ప్రొటెక్షన్(విశాఖ) కలెక్టరేట్(అనకాపల్లి) బీవీ రాణి మెజిస్టీరియల్ సెక్షన్(విశాఖ) అచ్యుతాపురం జి.జనార్ధన్ అల్లూరి జిల్లా ఆనందపురం పి.శ్యాంప్రసాద్ కోఆర్డినేషన్ సెక్షన్(విశాఖ) (ఆనందపురం హెచ్డీటీ ఎల్.చేతన్ కుమార్ ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) గాజువాక టి.శ్రీ వల్లి వీఎంఆర్డీఏ (గాజువాక హెచ్డీటీ బి.శ్రీనివాసరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) సీతమ్మధార ఎం.రమేష్ను ములగాడ (సీతమ్మధార హెచ్డీటీ ఎస్.ఎ.త్రినాథరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు
తుమ్మపాల: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వినియోగించడం ఎంతో ఆరోగ్యకరమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు
అనకాపల్లి టౌన్: విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్స హించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ఏడాది పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులకు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమ వారం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. 10వ తరగతిలో 153 మంది, ఇంటర్లో 32 మంది అవార్డులు అందుకున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కొక్కొరికి రూ.20 వేలు చెక్, ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఈ షైనింగ్ స్టార్స్ ఇక్కడితో ఆగకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర 185 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం -
సంఘాల నిర్మాణంతో పాటు ఉద్యమాన్ని విస్తరించాలి
డాబాగార్డెన్స్: డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల రెండు సంస్థల విలీన సభ సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగమైన రెండు సంఘాల విలీనం అవసరమన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావాలున్న వారు ఐక్యమవ్వాల్సిన అవసరం ఉందని, రాజకీయ కార్యాచరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ మనువాదం, సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నాయని, మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వారిని అణచివేస్తోందని ప్రొఫెసర్ కాశీం విమర్శించారు. ఇటువంటి తరుణంలో కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందని, ఆ దిశగా అరుణోదయ కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, మందసలో ఎయిర్పోర్టు రాకుండా రైతుల భూములను రక్షించాలని కోరారు. తెలంగాణ అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మోదీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. సభాధ్యక్షుడు నాగరాజు అమర కళావీరులను స్మరిస్తూ తీర్మానం చేశారు. ముందుగా సరస్వతి పార్క్ నుంచి సభావేదిక వరకు అరుణోదయ కళాకారుల కళా ప్రదర్శన ఆటపాటలతో సాగింది. కార్యక్రమంలో తెలంగాణ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, కె నిర్మల, ఎస్.జయలక్ష్మీ, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం.లక్ష్మీ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు వేంకటేశ్వర్లు, న్యాయవాది చలం అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. -
అంధ మహిళా క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ శరత్బాబు, తన వంతుగా విజేత జట్టుకు రూ. 75 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 25 వేలు బహుమతులుగా అందజేస్తానని ప్రకటించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. పోటీలలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు, కేరళ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో ఒడిశా జట్టు, ఢిల్లీ జట్టును 49 పరుగుల తేడాతో ఓడించి గెలుపొందింది. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. రవీంద్రబాబు, ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్ ప్రతినిధి అనీల్, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లుల తనిఖీ
చోడవరం: పీడీఎస్ బియ్యం కొనుగోలు,అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి హెచ్చరించారు. మండలంలో వెంకన్నపాలెం, ముద్దుర్తి గ్రామాల్లో రైస్ మిల్లులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు పరిశీలించి, ధాన్యం, బియ్యం నిల్వల శాంపిల్స్ను తీసి పరీక్షలకు పంపారు. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే బియ్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు, అమ్మకాలు చేయరాదని, అటువంటివి జరిగినట్టు తమ పరిశీలనలో తేలితే కేసులు పెడతామని డీఎస్వో హెచ్చరించారు. అనంతరం గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. బియ్యం ఎగుమతుల రికార్డులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకుల ఆకలి కేకలు
నాతవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు గౌరవ వేతనం అందక నానా అవస్థలు పడుతున్నారు. నిర్వాహకులతో పాటు ఆయాలు నైట్ వాచ్మెన్లలకు మార్చి నుంచి గౌరవ వేతనాలు మంజూరు కాలేదు. జిల్లాలో అన్ని పాఠశాలలను కలుపుకొని మొత్తం 2,641 మంది మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం మార్చి, ఏప్రిల్కు సంబంధించి ఆహార పదార్థాల సామగ్రి బిల్లులు ఇంత వరకు చెల్లించలేదు. అలాగే నిర్వాహకులకు రూ.3 వేలు చొప్పున రెండు నెలలకు సంబంధించి రూ.6 వేలు గౌరవ వేతనం కూడా అందలేదు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఆయాలు 1,551 మంది పని చేస్తున్నారు. వీరికి మార్చి నుంచి గౌరవ వేతనం కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. జిల్లాలోని హైస్కూళ్లలో 204 మంది నైట్ వాచ్మెన్లు పని చేస్తున్నారు. వీరికి రూ.6 వేలు చొప్పున మార్చి నుంచి మే నెల మూడు నెలలకు రూ.18 వేలు చెల్లించాలి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, నిర్వాహకులు, ఆయాలు, నైట్వాచ్మెన్లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ ఆకలి సమస్య తీర్చాలంటూ వేడుకుంటున్నారు. ఈ విషయంపై నాతవరం ఎంఈవో కామిరెడ్డి వరహాలబాబును వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో బిల్లులు ఆన్లైన్లో తయారు చేసి పంపించామన్నారు. ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే గౌరవ వేతనం వేస్తుందని, ఈ సమస్య ఉన్నతాధికారులు దృష్టిలో ఉందన్నారు. -
రాజకీయ పార్టీ కార్యక్రమంలా.. కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
దేవరాపల్లి: స్థానిక పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూటమి పార్టీలకు చెందిన రాజకీయ కార్యక్రమం మాదిరిగా నిర్వహించారు. ఈ కేంద్రా న్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారా యణమూర్తి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ కార్పొరేషన్ సహకారంతో మండల స్థాయిలో నిర్వహిస్తున్న ఈశిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి మండల స్థాయిలో ప్రజాప్రతినిధులైన ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలకు సమాచారం ఇవ్వలేదు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూటమి పార్టీలకు చెందిన నాయుకులకు ఎలా సమాచారం ఇచ్చారని అధికారులపై పలువు రు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభానికి మండల స్థాయి కాదుకదా కనీసం గ్రామ స్థాయి అధికారి కూడా హాజరు కాలేదు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తమకు ప్రయాణ చార్జీలను సమకూర్చాలని కుట్టు శిక్షణకు హాజరైన మహిళలు ఎమ్మెల్యేను కోరారు. స్థానిక సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, పోతల పాత్రునాయుడు, కిలపర్తి భాస్కరరావు, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు కనీస సమాచారం ఇవ్వని అధికారులు అధికారుల తీరుపై మండల ప్రజాప్రతినిధుల ఆగ్రహం -
నిండుకుండలా పెద్దేరు
మాడుగుల: మండలంలో కురుస్తున్న వర్షాలకు నీరు చేరి పెద్దేరు జలాశయం నిండుకుండలా కళకళలాడుతోంది. జలాశయంలోకి నీరు పుష్కలంగా చేరడంతో ఖరీఫ్కు కలసి వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దేరు ఖరీఫ్ ఆయకట్టు సుమారు 15 వేల ఎకరాలు. ఇప్పటికే రైతులు వరి నారుమడులు సిద్ధం చేశారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.50 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి 50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు అధికమైతే పెద్దేరు గేట్లు ఎత్తవలసి ఉంటుందని జలాశయం జేఈ సుధాకర రెడ్డి తెలిపారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట పెద్దేరులోకి దిగవద్దని జేఈ సూచించారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే న్యాయం
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే న్యాయం జరుగుతుంది. వెబ్ కౌన్సెలింగ్లో ఎదురయ్యే ఇబ్బందులను నివారించాలి. వెబ్ కౌన్సెలింగ్లో 1,000 నుంచి 2,000 ఆప్షన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెబ్ కౌన్సెలింగ్ సమయంలో వాటిని వెతుక్కోవడం కష్టమవుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్ప డతాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడం బాధాకరం. –ఇమంది పైడిరాజు, ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి -
వైద్యం.. మిథ్య
పడకేసిన పల్లె వైద్యం.. నర్సీపట్నం: పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య, సేవలు అందించేందుకు గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి పెద్దపీట వేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అభ్యర్థన మేరకు జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను కేటాయించడమే కాకుండా స్వయంగా కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సగం పనులు పూర్తయ్యాయి. జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో వైద్య విద్యతో పాటు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్న గ్రామీణ ప్రజల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది. మెడికల్ కళాశాలల నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులు, పేదలకు శాపంగా మారనుంది. ప్రజలకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కళాశాల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. భీమబోయిపాలెంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారు. ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) ఇంజినీర్ల పర్యవేక్షణలో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ పనులు చేపట్టింది. 12 నెలల్లో మెడికల్ కళాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాత్రింబవళ్లు నిర్మాణ పనులు చేశారు. 630 పడకలు ఏర్పాటు చేయడానికి, 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి వీలుగా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. మెడికల్ కళాశాల నిర్మాణంతో విశాఖ కేజీహెచ్కు వెళ్లే బాధ తప్పుతుందని గ్రామీణ ప్రజలు సంతోషించారు. ప్రభుత్వం మారడంతో మెడికల్ కళాశాలకు గ్రహణం పట్టింది. ప్రజల ఆశలు ఆడియాసలయ్యాయి. కళాశాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణంతో నాణ్యమైన వైద్యం అందుతుందని భావించాం. కళాశాల నిర్మాణాన్ని కూట మి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్య విద్య, కార్పొరేట్ స్థాయి సేవలను పేదలకు చేరువ చేయాలని జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటే, కూటమి నేతలు కార్పొరేట్కు ధారదత్తం చేయాలని భావించడం సరికాదు. – గీతా కృష్ణ, విద్యార్థి సంఘ నాయకుడు, నర్సీపట్నం వైద్యులు రావడం లేదు గత ప్రభుత్వంలో వైద్యులు ఇంటి వద్దకే వచ్చి బీపీ, సుగర్తో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి, మందులు ఇచ్చేవారు. డాక్టర్లు రెండుసార్లు ఇంటికి వచ్చి చూసేవారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వైద్యసిబ్బంది, డాక్టర్లు ఎవరూ రావడం లేదు. – షేక్ రోజా, పెదబొడ్డేపల్లివిలేజ్ క్లినిక్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. జిల్లాలో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో 424 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. పీహెచ్సీలకు ఇద్దరు వైద్యుల చొప్పున నియమించింది. వైద్యసిబ్బంది పోస్టులను సైతం భర్తీ చేసింది. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియామకంతో ఫ్యామిలీ డాక్టర్ వైద్యశిబిరాలు, జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా 46 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 9 అర్బన్ పీహెచ్సీలను అభివృద్ధి చేయడంతో పాటు వైద్యసిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ఫ్యామిలీ ఫిజీషియన్, జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాల ద్వారా గ్రామీణులకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించింది. అందుకునుగుణంగా ఆ ఐదేళ్లలో ప్రజారోగ్యం తమ బాధ్యతగా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఊరుకు, ప్రతి గడపకు వెళ్లి వైద్య సేవలు అందించారు.ఎంతో ముందుచూపుతో ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఇద్దరు వైద్యులను నియమించింది. వారిలో ఒకరు ఆస్పత్రిలో మరొకరు 104 వాహనంలో ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించేవారు. పల్లెల్లో అసాంక్రమిక వ్యాధులకు క్రమం తప్పకుండా నిర్ధారణ పరీక్షలు చేస్తూ మందులు ఇచ్చేవారు. చాపకిందనీరులా విస్తరిస్తున్న బీపీ, సుగర్, థైరాయిడ్ వ్యాధులను అరికట్టేందుకు గతంలో ఏఎన్ఎం, ఆశావర్కర్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె వైద్యం పడకేసింది. ఇప్పుడు వైద్యులు పల్లెలకు వచ్చే పరిస్థితి లేదు. గ్రామాలకు వైద్యులకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. గతంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పల్లెలో తిరిగే వారు. నేడు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నా పట్టించుకునే వారే లేరు. పల్లెల్లో ఎవరికి ఎలాంటి జబ్బు చేసినా పలకరించే దిక్కులేదు. జ్వరం వస్తే మంచానికే పరిమితం కావాలి. ప్రజారోగ్యం గాలిలో దీపం చందంగా మారింది. గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు కరువయ్యాయి. గతంలో 104 వాహనాలు నిర్ణీత కాల వ్యవధిలో గ్రామాలకు వెళ్లి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించి అవసరమైన మందులు ఇచ్చేవి. నేడు ఆ వాహనాలు పల్లెల్లో కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు ఏడాదిలో దిగజారిన వైద్యసేవలు ప్రభుత్వ వైద్య కళాశాలకు బ్రేక్ ప్రైవేటుపరం కానున్న వైద్య విద్య ఆగిన ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు పల్లెలకు వెళ్లని 104 వాహనాలు గ్రామీణులకు అందని వైద్య సేవలు -
చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ ఘటనతో మండలంలోని బిల్లాపుట్టు, గం
డుంబ్రిగుడ : మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్కు చెందిన కుమారులు గుంట సాయికిరణ్(14), గుంట భానుతేజ్ (14) వారం రోజుల క్రితం ఇదే మండలంలోని గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలోని మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లారు. వీళ్లు ఇదే గ్రామానికి చెందిన కొర్ర ధన్యారావు కుమారుడు కొర్ర సుశాంత్తో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు సమీప అటవీప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి మామిడిపళ్లు తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో జంగమయ్య గుడి పక్కనున్న చెరువులోకి స్నానానికి దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో 10 నుంచి 12 అడుగుల లోతున నీరు చేరడంతో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వారిని రక్షించేందుకు పరిసర ప్రాంతీయులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. ఈమేరకు ఎస్ఐ కె.పాపినాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ● గుంట కమందన్కు సాయికిరణ్తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుంట బలరామ్కు కుమారుడు భానుతేజ్తోపాటు కుమార్తె ఉంది. సాయికిరణ్, భానుతేజ్ మృతితో ఈ రెండు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మృతులు ముగ్గురు వేర్వేరు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సాయికిరణ్ అరకులోయలోని పాఠశాలలో చదువుతుండగా భానుతేజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాల, కొర్రా సుశాంత్ మండలంలోని గుంటసీమలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలోను చదువుతున్నారు. కూలికి వెళ్తేనే గడిచేది.. చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు చెందిన కుటుంబాలది దయనీయ పరిస్థితి. రోజు వారీగా కూలీకి వెళ్తేనే తప్ప.. పూట గడవని పరిస్థితి బాధిత తల్లిదండ్రులది. సుశాంత్ తండ్రి వ్యవసాయ కూలీకాగా సాయికిరణ్, భానుతేజ్ తండ్రులు ఓ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు చిన్నారులను చెరువు రూపంలో మృత్యువు దూరం చేసి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి చెరువులో స్నానానికి దిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఎంపీ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ఉన్న ఎంపీని బాధిత కుటుంబీకులతో సర్పంచ్ నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడించారు. అనంతరం ఆమె అరకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసిన చిన్నారుల మృతదేహాలను అంబులెన్సులో వారి స్వగ్రామాలకు తరలించాలని ఎంపీ ఆదేశించారు. ముగ్గురు చిన్నారుల మృతితో గంగవలస, బిల్లాపుట్టులో విషాదం స్నానానికి దిగడంతో ప్రమాదం మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముల సంతానం పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబాలు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి: అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ రవాణా
అచ్యుతాపురం రూరల్ : మండలంలో ఆదివారం అర్ధరాత్రి గ్రావెల్ దొంగలు రెచ్చిపోయారు. కొండకర్ల, చీమలాపల్లికి మధ్యలో ఉన్న కొండ ప్రాంతాన్ని అర్ధరాత్రి వేళ అక్రమార్కులు యథేచ్ఛగా దోచేస్తున్నారు. నిర్మాణాలకు, ఖాళీ స్థలాల్లో నింపేందుకు ఉపయోగకరమైన మట్టిని దర్జాగా కొండల్ని పిండిచేసి తరలించుకుపోతున్నారు. స్థానికంగా ఉన్నవారు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. సుమారు 10 ట్రాక్టర్లతో మట్టిని ఇక్కడి కొండ ప్రాంతాన్ని తవ్వి తరలించుకుపోయారు. ఈ దందా కూటమి నాయకుల కనుసన్నల్లో జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రావెల్ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో చౌడువాడ విద్యార్థిని ప్రతిభ
కె.కోటపాడు : ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో మండలంలో చౌడువాడ గ్రామానికి చెందిన రాజి మనీషా సాయి కుమారి ప్రతిభను కనబర్చింది. అగ్రికల్చర్ ఫార్మసీలో రాష్ట్ర స్థాయిలో 144వ ర్యాంక్ను సాధించింది. ఇంటర్లో బైపీపీ చదివి, 986 మార్కులు సాధించినట్టు ఆమె తండ్రి సత్యనారాయణ తెలిపారు. కుమార్తె అగ్రికల్చరల్ పార్మసీలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ను సాధించడం ఆనందంగా ఉందని తండ్రి సత్యనారాయణ, తల్లి సోనియా పేర్కొన్నారు. అగ్రికల్చర్ ఫార్మసీలో రాష్ట్ర స్థాయిలో 144వ ర్యాంక్ -
11న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్
అనకాపల్లి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా 1–2019 సర్క్యులర్ అమలు చేయని కారణంగా ఆర్టీసీ విజయనగరం జోనల్ స్థాయి పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లకు ఈ నెల 11న సమ్మె నోటీసు అందజేయనున్నట్టు ఎన్ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు తెలిపారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్ పరిధిలో ఆరు జిల్లాల రీజనల్ కమిటీలు ఆయా కలెక్టర్లకు సమ్మె నోటీసులు అందజేయనున్నట్టు తెలిపారు. ఇక్కడి డిపో ఎదుట వంద రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. సమ్మె నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి. సుధాకర్, విజయనగరం రీజనల్ కార్యదర్శి పి.జి. రాఫిల్, యూనియన్ నాయకులు ఎం.వి.ఆర్.మూర్తి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్1100 -
మాట మార్చిన విద్యాశాఖ అధికారులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్లో మాన్యువల్ విధానం అవలంబిస్తామని విద్యా శాఖాధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుకుంటున్నారు. ఇంతమంది కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ విధానాన్ని పక్కనబెట్టి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ను అమలు చేయడం సరికాదు. –డి.గోపీనాథ్, పీఆర్టీయూ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు -
హెచ్ఎంలు, ఎంఈవోలకు పదోన్నతులు కల్పించాలి
అనకాపల్లి: విద్యా శాఖలో హెచ్ఎంలు, ఎంఈవోలకు పదోన్నతులు కల్పించాలని ఏపీ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరమణ డిమాండ్ చేశారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్లో ఆదివారం సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రమాణాల మెరుగుతో పాటు పర్యవేక్షణ పెంచడం కోసం తక్షణమే ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను ఎంఈవోలుగా, ఎంఈవోలను డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పటు చేసిన క్లస్టర్ హైస్కూల్స్ హెడ్ మాస్టర్ పోస్ట్లను గ్రేడ్–ఐహెచ్ఎం పోస్ట్గా అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ తయారు చేసి పదోన్నతి కల్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు పనిభారం తగ్గించాలని, అధికారులు ర్యాంకుల కోసం పరుగులు పెడుతూ, సొంత అజెండాలతో విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర శాఖలలో రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిన వారు డీఈవోలు, ఆర్జేడీలుగా రిటైర్ అవుతున్నారని, 16 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన హెచ్ఎంలు, ఎంఈవోలుగా ప్రమోషన్ లేకుండా పదవీ విరమణ చేయడం దారుణమన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల కోసం వెంటనే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) కమిటీ నియమించి ఇంటీరియర్ రిలీఫ్(ఐఆర్)ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి సి.వి.వి.సత్యనారాయణ, సభ్యులు కె.సత్యనారాయణ, సిహెచ్.రవి, వి.నూకరాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఎ.వి.హెచ్.శాస్త్రి, కార్యదర్శి ఎం.జె.రవీంద్రబాబు, జిల్లా నాయకులు కోడి శ్రీనివాసరావు, వరాహమూర్తి, శేషగిరిరావు, శ్రీరామమూర్తి, రామస్వామినాయుడు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
మాడుగుల రూరల్/మాడుగుల: మండలంలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గరికిబంద చెక్పోస్టు వద్ద భారీ వృక్షాలు నేల కొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి చెట్లను తొలగించకపోవడంతో ప్రయాణికులు సుమారు మూడు గంటలు పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాడుగుల నుంచి ఎం.కోడూరు వెళ్లే రహదారిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద మినీట్రాన్స్ఫార్మర్ నేలకొరిగింది. తాటిపర్తి పంచాయతీ శివారు చిన కూర్మానాథపురం, శంకరం, జేడీ పేట పంచాయతీ శివారు కొండలపాడు, ఎం.కోడూరులలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, ఎం.కోడూరు, సాగరం తదితర చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలు పూర్తిగా రాలిపోయి రైతులు నష్టపోయారు. ఎం.కోడూరు, మాడుగులలో సమారు 13 స్తంభాలు విరిగిపోయాయని, తమ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారని విద్యుత్ శాఖ ఏఈ ఎం. రాంబాబు తెలిపారు. పలు చోట్ల నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు -
‘గిరి’గీసి మరీ వసూళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కంచే చేను మేసిన చందంగా మారిపోయిందనే విమర్శలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వ్యవహారంలో వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధానికి కృషి చేయాల్సిన సొంత శాఖకు చెందిన కొందరు అధికారులే నెలవారీ మామూళ్లకు అలవాటుపడి సమాచారాన్ని లీకు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే గతంలో ఓ సీఐ స్థాయి అధికారిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా రిజిస్ట్రేషన్లతో పాటు రవాణాశాఖ నుంచి ప్రతీ నెలా కొద్ది మంది నెలవారీ మామూళ్లు అందుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. సొంత శాఖకు చెందిన ఓ ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్లశాఖ నుంచి మామూళ్లు ముట్టచెప్పడంలో ఓ డాక్యుమెంట్ రైటర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ నెలా ‘గిరి’గీసి మరీ ఠంచనుగా కొద్ది మంది కీలకమైన అధికారుల నుంచి వసూలు చేసి ముట్టచెబుతున్నట్టు సమాచారం. అయితే ఈ మామూళ్ల వ్యవహారంలో ఎవరెవరికి ఎంత అందుతుందనే విషయంలో మొదలైన చర్చ రచ్చ కావడంతో ఈ వ్యవహారం పైదాకా వెళ్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్టు ఆ శాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తంగా అవినీతిని కట్టడి చేయాల్సిన అధికారులే అవినీతి రొంపిలో కూరుకుపోతుండటం మాత్రం విస్తుగొలుపుతోంది. ముందుగానే సమాచారం లీకు...! వాస్తవానికి ఏసీబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిమంది సమర్థులైన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక ఉన్నతాధికారిపై ఎలాంటి ఆరోప ణలు లేకపోయినప్పటికీ, కిందిస్థాయిలో పేరుకుపోయిన కొందరు అవినీతి సిబ్బందిపై ఆయన సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఏసీబీలో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఒక ఎస్ఐతో పాటు ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సంస్థ పరువును నెలవారీ మామూళ్ల కోసం బజారున పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రవాణా, జీవీఎంసీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి వీరు నెలవారీ మామూళ్లకు అలవాటు పడినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న సదరు నలుగురు సిబ్బంది డిపార్ట్మెంట్ల వారీగా వసూళ్లకు తెగబడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత శాఖకు ముందుగానే సమాచారాన్ని లీక్ చేస్తున్నారని విమర్శలున్నాయి. ఒకవేళ ఎవరైనా తమ నెలవారీ మామూళ్లకు అంగీకరించకపోతే, వీరే వేరే పేర్లతో ఫిర్యాదు చేసి సదరు అధికారిపై దాడులు చేస్తారనే అపప్రద కూడా ఉంది. ఈ వ్యవహారంలోనే ఒక జీవీఎంసీ అధికారిని కూడా గతంలో ఇదే తరహాలో ఇబ్బంది పెట్టినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అయితే తాము చెప్పినట్లు వింటే వారిపై ఏ ఫిర్యాదు వచ్చినా కాపాడతారనే ధైర్యాన్ని కూడా ఈ సిబ్బంది కల్పిస్తున్నారని తెలుస్తోంది. కీలకంగా డాక్యుమెంట్ రైటర్...! ఏసీబీలో నెలవారీ మామూళ్ల వ్యవహారం మరింత ముదురుతోంది. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల నుంచి వసూలు చేసిన మామూళ్లకు సంబంధించి ఒక సీఐను ఇందులో ఇరికించారని తెలుస్తోంది. మొదట్లో తన విధులను మాత్రమే చూసుకునే సదరు సీఐని, నెలవారీ మామూళ్ల రొంపిలోకి లాగి, చివరికి సొంత శాఖ సిబ్బందే ఆయన్ను అడ్డంగా బుక్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో శాఖ పరువు బజారున పడకుండా, ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా గుట్టుగా బదిలీతో సరిపెట్టినట్టు సమాచారం. ఈ మామూళ్ల వ్యవహారంలో ఒక డాక్యుమెంట్ రైటర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులతో సన్నిహి తంగా మెలుగుతూ నెలవారీ మామూళ్లను అందజేస్తున్నట్లు సమాచారం. సదరు డాక్యుమెంట్ రైటర్ ఓ ఉన్నతాధికారికి (గతంలో పనిచేసిన) అత్యంత సన్నిహితుడని ప్రచారం ఉంది. అందుకే ఎన్నో ఆరోపణలున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖలోని నలుగురైదుగురు అధికారులపై ఎటువంటి చర్యలూ ఉండవనే విమర్శలున్నాయి. తాజాగా, ఇదే శాఖకు చెందిన ఒక అధికారి అవినీతికి సంబంధించి పక్కాగా కొన్ని వీడియోలు, ఫొటోలతో సహా అందిన ఫిర్యాదును కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ వాణిజ్య భవంతిని నిర్మించి, అద్దెకు పెట్టి అడ్డంగా దొరికినప్పటికీ, ఆ అధికారిని కాపాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ఏసీబీ పరువును బజారున పడకుండా ఉండేందుకు రహస్యంగా ఉన్నతస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ నుంచి భారీగా మామూళ్లు? చక్రం తిప్పుతున్న ఓ డాక్యుమెంట్ రైటర్ -
విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర
ఆరిలోవ: విద్యాశాఖలో బదిలీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గురువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నిబంధన, గంటకో సవరణ, తొలుత ఇచ్చిన హామీని విస్మరించడపై నిరసన గళం వినిపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వందల మంది టీచర్లు ఉదయం 9 గంటలకే డీఈవో కార్యాలయానికి చేరుకొని కదం తొక్కారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. మాన్యువల్ కౌన్సెలింగే ముద్దు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపడతామని చెప్పి, ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాన్యువల్ కౌన్సెలింగ్ అని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా వందల ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. మాన్యువల్ ద్వారా అయితే అవసరమైన వాటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్జేడీ కె.విజయభాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్లకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు డి.గోపీనాఽథ్, ఇమంది పైడిరాజు, టి.చిన్నబ్బాయి, టి.రామకృష్ణారావు, అరుణ్కుమార్, వీరభద్రరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెబ్ కౌన్సెలింగ్కు వ్యతిరేకంగా డీఈవో కార్యాలయ ముట్టడి విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాట మార్చారంటూ ఆక్షేపణ -
బాలికా సాధికారతకు పెద్దపీట
పరవాడ: బాలికా సాధికారతకు సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సా ర్ విభాగం తీసుకున్న చొరవ అభినందనీయమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో గత నెల 9న ప్రారంభమైన బాలికా సాధికారత మిషన్–2025 వర్క్షాపు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య నేర్పించడం ఎంత అవసరమో వివరించారు. బాలికల వ్యక్తిత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్టీపీసీ కార్పొరేట్ ప్లానింగ్ ఈడీ సంగీత కౌశిక్ మాట్లాడుతూ బాలికల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ చొరవను కొనియాడారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ ద్వారా బాల బాలికలకు యోగా, కరాటే, కంప్యూటర్, నృత్యం, స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం తదితర అంశాల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. వర్క్షాప్లో పాల్గొన్న 120 మంది బాలికలకు అవసరమైన సదుపాయాలను కల్పించడం కోసం సంస్థ రూ.50 లక్షలను వెచ్చిందన్నారు. ఈ మిషన్లో బాలికలకు మార్గదర్శకాలను అందించిన ఉద్యోగులను ఈడీ అభినందించారు. కార్యక్రమంలో బాలికల నృత్యాలు, ఆపరేషన్ సిందూర్, యోగా, కరాటే వంటి ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. 120 మంది బాలికలకు వివిధ రంగాల్లో శిక్షణ ఎన్టీపీసీ కృషి అభినందనీయం: కలెక్టర్ విజయ కృష్ణన్ -
పరీక్ష నేల చూపులు
హిమ సొగసుమన్యంలోని పాడేరు ఘాట్, హుకుంపేట, జి.మాడుగుల ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేసవిలోను కమ్ముకున్న మంచు తెరలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పగటి పూట ఎండ, రాత్రి చలిగాలులు ఉండటం వల్ల ఉదయం వేళల్లో మంచుతో కూడిన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, పాడేరుఅవగాహన లేక నష్టపోతున్నాం భూసార పరీక్షలపై చాలామంది రైతులకు అవగాహన లేదు. మట్టిలో పోషకాల గురించి తెలియక అధిక మోతాదులో ఎరువులు వాడి నష్టపోతున్నాం. వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో గ్రామ సభలు పెట్టి రైతులను భూసార పరీక్షలపై చైతన్యవంతం చేయాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, మందులు వాడాలన్న అవగాహన రైతులకు కల్పించాలి. –పోలిరెడ్డి రమణ, రైతు, పురుషోత్తపురం నా పొలంలో మట్టి నమూనా తీయలేదు ఇప్పటివరకు నా పొలంలో మట్టి నమూనా తీయలేదు. ఖరీఫ్ సాగు సమయం ఆసన్నమైనా మట్టి నమూనా సేకరించకపోతే ఇంకెప్పుడు భూసార ఫలితాలు రైతులకు తెలుస్తాయో వ్యవసాయాధికారులే చెప్పాలి. భూసార పరీక్షల ఫలితాలు సకాలంలో రైతులకు అందజేస్తే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. –యల్లపు శ్రీనివాసరావు, రైతు, సోమలింగపాలెం, యలమంచిలి యలమంచిలి రూరల్: పంటల సాగులో నేల స్వభావం కీలక పాత్ర పోషిస్తుంది. మట్టిలో తగిన పోషకాలుంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తూ సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. నేల సారవంతానికి తగ్గట్టుగా ఎరువులు వాడితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇందుకు నేలలో సరైన పోషకాలు ఉన్నాయా? లేకుంటే ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. వంటి వివరాలు తప్పనిసరిగా రైతులు తెలుసుకోవాలి. కానీ జిల్లాలో భూసార పరీక్షలకు అవసరమైన మట్టి నమూనాల సేకరణ లక్ష్యానికి దూరంగా సా..గుతోంది. మట్టి నమూనాల సేకరణకు ఖరీఫ్ సీజన్ అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్కు ముందే వ్యవసాయ శాఖ అధికారులు మట్టి నమూనాల కోసం మండలాలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రెండుసార్లు గడువు పొడిగించినా.. జిల్లాలో 24 మండలాల్లో 450 రైతు సేవా కేంద్రాల్లో ఈ ఏడాది 25,052 మట్టి నమూనాల సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఆశించిన స్థాయిలో సేకరణ జరగలేదు. దీంతో ఇప్పటివరకు రెండుసార్లు గడువు పొడిగించినా ఇప్పటివరకు 84.62 శాతం (21,441) మాత్రమే మట్టి నమూనాలను తీశారు. నర్సీపట్నం, రోలుగుంట, సబ్బవరం మండలాల్లో మాత్రమే మట్టి నమూనాల లక్ష్యం పూర్తి చేశారు. పరవాడ, కశింకోట, బుచ్చెయ్యపేట, రాంబిల్లి, చోడవరం, మునగపాక, చీడికాడ మండలాల్లో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన మండలాల్లో మట్టి నమూనాల సేకరణపై సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. పాయకరావుపేట, నాతవరం, మాకవరపాలెం మండలాలు మట్టి నమూనాల సేకరణ గణాంకాల్లో అట్టడుగున ఉన్నాయి. మట్టి నమూనాల సేకరణే ఇంకా పూర్తి చేయకపోవడంతో వాటి విశ్లేషణ పూర్తి చేసి రైతులకు నివేదికల కార్డులను సకాలంలో అందజేయడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో కొన్నిచోట్ల వానాకాలం సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. మట్టి నమూనాల సేకరణకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలో సేకరిస్తున్న మట్టి నమూనాల ఫలితాలు సకాలంలో అందుతాయో? లేదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 25,052 సేకరించిన నమూనాలు 21,441 ఖరీఫ్ సమీపిస్తున్నా కొలిక్కిరానిభూసార ఫలితాలు రెండుసార్లు గడువు పొడిగించినా సా..గుతున్న మట్టి నమూనాల సేకరణ ఫలితాలు వస్తేనే రైతులకు ప్రయోజనం ఇప్పటివరకు 84.62 శాతం మట్టి నమూనాల సేకరణ మట్టి సేకరణ ఇలా.. ఎంచుకున్న 2.5 ఎకరాల పొలంలో ఒక మూల నుంచి మూడు అడుగుల దూరాన్ని వదిలిపెట్టి ‘వి’ ఆకారంలో ఆరు అంగుళాల గుంత తీసి అడుగు నుంచి మూలల వైపు మట్టిని సేకరించాలి. ఇదే విధానంలో 10 నుంచి 20 చోట్ల జిగ్జాగ్గా మట్టిని గోనెసంచిపై వేసి బాగా కలపాలి. ఆ మట్టిని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఎదురెదురుగా ఉన్న భాగాలు తీసుకుని. మిగిలిన భాగాన్ని వదిలేస్తారు. ఇలా అర కిలో మట్టి నమూనాను తీసుకుని అనకాపల్లిలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. మట్టి పరీక్షల అనంతరం సేంద్రీయ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. రెండేళ్లకోసారి నిర్వహించే భూసార పరీక్షల ద్వారా నేలలో పోషకాలను బట్టి అధికారుల సూచనల మేరకు ఎరువులు, మందులు ఏ మోతాదులో వేయాలో తెలుస్తుంది. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగాన్ని, అదనపు ఖర్చును తగ్గించవచ్చు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది సేకరిస్తున్న మట్టి నమూనాలకు భూసార పరీక్ష కేంద్రంలో 12 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఎస్హెచ్సి పోర్టల్లో పొందుపరుస్తున్నారు. ఫలితాలను రైతు మొబైల్ఫోన్కు తెలుగులో సంక్షిప్త సందేశం పంపేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఫలితాల విశ్లేషణ పత్రాలను కూడా రైతులకు కార్డుల రూపంలో అందజేస్తారు. పొలంలో ఉన్న పోషక స్థాయిలకు అనుగుణంగా ఎరువులను సూచిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే పూర్తయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాగుకు ముందుగానే భూసార ఫలితాలు వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
యంత్రాలతో పనులు.. సిమెంట్ కాలువలకు ముప్పు.!
వైఎస్సార్ హయాంలో కాలువలకు సిమెంట్ లైనింగ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాండవ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. మొదట విడతలో రూ.55 కోట్లు మంజూరు చేయగా.. చాలకపోవడంతో మళ్లీ రూ.10 కోట్లు ఇచ్చారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయడంతో శివారు ఆయకట్టుకు సైతం నీరు పుష్కలంగా ప్రవహించేది.నాతవరం: తాండవ కాలువలో పూడికతీత పనులు పొక్లెయిన్తో చేపట్టడం వల్ల సిమెంట్ లైనింగ్ దెబ్బతింటోంది. ఉపాధి హామీ పథకం పనులు కూలీలతోనే చేపట్టాలన్న నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు. అనకాపల్లి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కాకినాడ జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిధిలో మేజరు, మైనరు కాలువ కలుపుకొని సుమారుగా 120 కిలోమీటర్ల పొడవున సాగునీరు ఆయకట్టుకు ప్రవహిస్తుంది. ఈ ఏడాది తాండవ కాలువలో పూడికతీత పనులను రూ.60 లక్షల ఇరిగేషన్ నిధులతో, రూ.1.50 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో అయితే కూలీలతోనే పనులు చేయించాలి. ఇరిగేషన్ నిధులతో అయితే అధిక శాతం యంత్రాలతో చేస్తున్నారు. పొక్లెయిన్ను తాండవ కాలువలోకి దించి పూడికతీత పనులు చేపట్టడం వల్ల సిమెంట్ లైనింగ్ పెచ్చులూడి పోతుంది. పొక్లెయిన్ ఐరన్ పళ్లతో పూడిక తొలగించడంతో పూడిక తొలగింపు మాట ఎలా ఉన్నా అధిక శాతం సిమెంట్ లైనింగ్ ధ్వంసం అవుతుందని ఆయకట్టుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పూడిక తీసిన మట్టిని గట్టు దరిదాటని విధంగా వేస్తుండడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మళ్లీ కాలువలోకే జారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కూలీలతో పనులు చేయించితే సిమెంట్ లైనింగ్కు ఎలాంటి దెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే కూలీలతో పూడిక పసులు చేపడితే ఖర్చు ఎక్కువ.. పని కాస్తా ఆలస్యంగా జరుగుతుంది. దీన్ని గమనించిన కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో యంత్రాలతో పనులు కానిచ్చేస్తున్నారు. పూడికతీత పనులు అధికంగా కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికలు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, డీసీ మెంబర్లతో పాటు కమిటీ సభ్యులు నీటి సంఘాల అధ్యక్షులు అంతా కూటమి నేతలే ఉన్నారు. దీంతో ఆయా కూటమి పెద్దలను మచ్చిక చేసుకుని పూడిక తీత పనులు ఎలా చేసినా ఏం ఫర్వాలేదన్న విధంగా చేస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలకు భయపడి అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో ఇంత వరకు పూడిక తీసిన కాలువలో పనులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు నిబంధనల ప్రకారం బాధ్యతగా చేయించాలని రైతులు కోరుతున్నారు. స్పీకర్ అయ్యన్న ఆదేశాలు బేఖాతరు ఇటీవల మండలంలో పర్యటనకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాండవ కాలువ పూడికతీత పనులు ప్రధాన గేట్లు మరమ్మతు విషయంలో నిబంధనలు పాటించి నాణ్యతగా వేగవంతంగా చేయాలన్నారు. ఎవరైనా నాణ్యత పాటించకుండా పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినా అధికారులు పొక్లెయిన్తో పనులు చేస్తున్నారు. ఈ విషయంపై తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధను సంప్రదించగా.. పొక్లెయిన్తో కాకుండా మనుషులతో పూడికతీత పనులు చేస్తామన్నారు. తాను స్వయంగా ఆయా పనులు పర్యవేక్షించి ఎలాంటి సమస్య లేకుండా చేస్తానన్నారు. కొన్ని చోట్ల మద్యం సీసాలు ధ్వంసం చేశారని, అవి గుచ్చుకుంటాయ,ని అలాంటి చోట మాత్రమే యంత్రాలతో పనులు చేపడుతున్నామన్నారు. తాండవ కాలువ పనుల్లో అవకతవకలు దెబ్బతింటున్న కాలువ సిమెంట్ లైనింగ్ గట్టు దరిదాటని విధంగా వేస్తున్న పూడికతీత మట్టి వర్షాలకు మళ్లీ కాలువలోకే జారిపోతున్న వైనం కూటమి నేతల కనుసన్నల్లో పనులు -
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే యోగ
అనకాపల్లి టౌన్: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు యోగాను నేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా విద్యాశాఖ, జిల్లా ఆయుష్ శాఖ సహకారంతో యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో అప్పారావు నాయుడు మాట్లాడుతూ రోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. యోగా ప్రాధాన్యతను ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ప్రతిరోజూ ప్రార్థన, డ్రిల్ కార్యక్రమంలో యోగా ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఆయుష్మాన్ అధికారిణి డాక్టర్ కె. లావణ్య మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అనంతరం యోగ గురువులు దొరమ్మనాయుడు, బి.అప్పారావుల ఆధ్వర్యంలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో డీఎస్డీవో రమణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మోటూరి నాగేశ్వరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి మహలక్ష్మినాయుడు, మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
9న నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ల ప్రారంభం
తుమ్మపాల: ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న విజన్ యాక్షన్ యూనిట్లను ఈ నెల 9న ప్రారంభించనున్నామని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అధికారులు ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఆమె నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్లకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్గా వ్యవహరిస్తారని, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, కేటాయించిన ఐదుగురు సిబ్బంది యూనిట్లో ఉంటారన్నారు. యూనిట్లకు కేటాయించిన సిబ్బంది వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న విజన్ యాక్షన్ యూనిట్లు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. యూనిట్ ఏర్పాటుకు కావలసిన వసతి, ఫర్నిచర్, కంప్యూటర్లు సమకూర్చవలసిందిగా మండల అభివృద్ధి అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లా ప్రణాళిక అధికారి జి.రామారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్ : మండలంలోని తండాలదిబ్బ కూడలికి సమీపంలో జంపపాలెం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన నీరు లేని పంటకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఇటీవల ఈ ప్రాంతంలో చొక్కా లేకుండా జీన్స్ ప్యాంటుతో తిరుగుతూ, మతిస్థిమితం లేనట్టు కనిపించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. కొందరు స్థానికులు అతని ఫొటోను కూడా తీశారు. ఈ ఫొటో పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎండల తీవ్రతకు ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో పిల్లి గంగబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440796104, 9440796079 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు. -
వీధి కుక్కల దాడిలో ఐదు మేకల మృతి
బుచ్చెయ్యపేట : మండలంలోని వడ్డాది గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఐదు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 35 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు కురందాసు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కురందాసు నాయుడు శుక్రవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న పాకలో మేకలను ఉంచి వచ్చాడు. శనివారం ఉదయం వెళ్లి చూడగా, పాకలో ఐదు మేకలు తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాయి. మేకల ఒంటిపై ఉన్న గాయాలను బట్టి వీధి కుక్కలు దాడి చేసినట్లు గుర్తించాడు. ఇటీవలి కాలంలో వడ్డాది పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. మేకలు, గొర్రెలు, ఆవు, గేదె దూడలతో పాటు నాటు కోళ్లపై కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరుస్తూ, ప్రాణాలు తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదను నివారించి, తమ పశుసంపదను కాపాడాలని పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
38 తోడపెద్దులకు అచ్చులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం చిన్నరామస్వామి దేవాలయంలో సూరిశెట్టి తోడపెద్దు అచ్చు సేవా కార్యక్రమాన్ని పీలా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆలయ దేవాలయ చైర్మన్ వి.పైడారావు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడారావు మాట్లాడుతూ జిల్లాలో 38 తోడపెద్దులకు అచ్చులు వేశామన్నారు. ఈనెల 6వ తేదీన దేవాలయం వద్ద రాత్రి భజనలు, నేలవేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. శనివారం దేవాలయం నుంచి పురవీధులు గుండా 38 తోడపెద్దులను శారదానది ఒడ్డు వరకూ ఊరేగించి, అక్కడ వాటికి స్నానం చేయించి, జిల్లాలో వివిధ ప్రాంతాలకు పంపించామన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీలోగా జన్మించిన ఎద్దులను సైజు, పుట్టుమచ్చలు చూసి ఎంచుకుని దేవాలయం వద్ద అచ్చు వేయడం జరిగిందన్నారు. తోడపెద్దులను దేవునికి అంకితం చేశామన్నారు. పూర్వం ఏ ఇంట్లో శుభకార్యమైనా ముందుగా తోడపెద్దుతో అడుగు పెట్టించి, వివాహాలు చేసేవారన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల తోడపెద్దు భక్తులు పాల్గొన్నారు. శారదా నది వరకు ఘనంగా ఊరేగింపు -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
అనకాపల్లి టౌన్: ముస్లిం సోదరులు శనివారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగను నిర్వహించారు. మసీదు వీధిలో ఉన్న జామియా మసీదు, శారదానది ఒడ్డున ఉన్న దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా జామియా మసీదు అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ఈ పండగ దయ, దాతృత్వం ప్రాముఖ్యత తెలియజేస్తుందన్నారు. సమాజంలో ఐక్యత, సోదర భావం మరిమళించేలా ఈ పర్వదినాన్ని జరుపుకొంటామన్నారు. కశింకోటలోని జామియా, నూరి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూరి మసీదు కమిటీ నూతన అధ్యక్షుడు షేక్ కరీముల్లా రెహమాన్ (బాబర్) మాట్లాడుతూ నిస్వార్థమైన ఆత్మీయత, అనుబంధాలను వ్యాపింపజేయడమే బక్రీద్ పండగ ఉద్దేశమన్నారు. -
చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం
● బాపు ఒక చరిత్ర కాదు.. జీవన పాఠం ● ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘గాంధియానా’ ● మహాత్ముని జీవిత విశేషాల పుస్తకాల ప్రత్యేక విభాగం సీతంపేట(విశాఖ): జాతిపిత మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి. సత్యం, అహింస అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా మలిచి, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి మార్గాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా’పేరిట ప్రత్యేక పుస్తక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ చరిత్ర, జీవితం అపురూపం. ఆయన పోరాటం, సిద్ధాంతాలు, ఆశయాలపై వేలాదిగా పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో సుమారు వెయ్యి వరకు పుస్తకాలు దాతల నుంచి సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచారు. గాంధీజీ గురించి ఎందుకు చదవాలి? గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదివితే నైతిక ప్రవర్తన అలవడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పేదవారికి సహాయం చేయాలనే గుణం, దేశభక్తి వంటి సుగుణాలు పెంపొందుతాయి. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగుతారు. వివేకంతో కూడిన విద్యను అభ్యసించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శరీరశ్రమ, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ, అస్పృశ్యతా నివారణ అనేవి గాంధీజీ పాటించిన ఏకాదశ వ్రతాలు. మత సామరస్యం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, మౌలిక విద్య, పారిశుధ్యం ఆరోగ్య నియమాలు, ప్రాంతీయ భాషాభివృద్ధి, వయోజన విద్య, సీ్త్ర సాధికారత, జాతీయ భాష, ఆర్థిక సమానత్వం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ తదితరవి మహాత్ముడు అవలంబించారు. వీటన్నింటి గురించి తెలుసుకునేందుకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి.స్వామి వివేకానంద చెప్పినట్లు ‘క్యారెక్టర్, కరికులమ్, కల్చర్’అనే మూడింటిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. వేల పుస్తకాలు.. కోట్ల ప్రతులు ముంబయిలోని సర్వోదయ మండల్, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్లు గాంధీజీపై వచ్చిన సుమారు 7 వేల పుస్తకాలను సేకరించి భద్రపరిచాయి. గాంధీజీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్ ఆయన ఆత్మకథ ‘సత్యశోధన’ను 17 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రచురించింది. కోటికి పైగా గాంధీజీ ఆత్మకథ పుస్తకాలు అమ్ముడయ్యాయంటే అతిశయోక్తి కాదు. గాంధేయవాదం ఆదర్శం గాంధేయవాదం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు వర్తించే మహత్తర భావన. యువత వ్యక్తిత్వ వికాసానికి గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి. ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా రిఫరెన్స్’పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్ వ్యవస్థాపకుడు కె.ఎస్.శాస్త్రి బహూకరించిన వందలాది అమూల్యమైన పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేయగలవు. ఇవి కేవలం అలనాటి జాతీయోద్యమ చరిత్రనే కాక, సామాజిక రుగ్మతలపై గాంధీజీ సాగించిన పోరాటాన్ని, ఆయన సంస్కరణ దృక్పథాన్ని ఈ తరం వారికి స్పష్టం చేస్తాయి. గాంధీ గురించి ఏ సమాచారం అయినా ఈ పుస్తకాల్లో లభిస్తుంది. – డి.వి.సూర్యారావు, రచయిత నైతిక విలువలు పెరుగుతాయి గాంధీజీ గురించి చదవడం వల్ల నైతిక ప్రవర్తన అలవడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదవాలి. కనీసం ఆయన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’పుస్తకాన్ని అయినా చదవాలి. కళాశాలలో చేరేటప్పుడు ప్రతి విద్యార్థికి యాజమాన్యం గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేయాలి. ఏడాది చివరలో నాన్ క్రెడిట్ (మార్కులతో నిమిత్తం లేకుండా) పద్ధతిలో పరీక్ష నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. దీని వల్ల ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఇలా చేస్తే మెరుగైన సమాజం ఏర్పడటానికి దోహదపడిన వారవుతారు. అలాగే సచివాలయ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వారం, పది రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ద్వారా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలపై అవగాహన కల్పించవచ్చు. దీని వల్ల వారిలో అంకితభావం పెరుగుతుంది. – ఆచార్య వి.బాలమోహన్దాస్, గాంధీ సెంటర్ అధ్యక్షుడు తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్(సత్యశోధన), గాంధీ: ది ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్(రామచంద్ర గుహ), గాంధీ బిఫోర్ ఇండియా(రామచంద్ర గుహ), ఇండియా ఆఫ్టర్ గాంధీ(రామచంద్ర గుహ), మై డియర్ బాపు(సి.రాజగోపాలాచారి గాంధీజీకి రాసిన లేఖలు), ది గుడ్ బోట్మ్యాన్(రాజమోహన్ గాంధీ), గాంధీ: ప్రిజనర్ ఆఫ్ హోప్(జుడిత్ ఎం. బ్రౌన్), ది డెత్ అండ్ ఆఫ్టర్లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ(మకరంద్ పరాంజపే), హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్రూల్(గాంధీ–1909), ఐయామ్ గాంధీ(బ్రాడ్ మెల్ట్జర్), మై డేస్ విత్ గాంధీ(నిర్మల్ కుమార్ బోస్), ది లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ(లూయీ ఫిషర్), ఎ వీక్ విత్ గాంధీ(లూయీ ఫిషర్), మహాత్మా గాంధీ: హిజ్ లైఫ్ అండ్ ఐడియాస్(చార్లెస్ ఎఫ్. ఆండ్రూస్, అరుణ్ గాంధీ), ది మ్యాన్ బిఫోర్ ది మహాత్మా(చార్లెస్ డిసాల్వో), ది లివింగ్ గాంధీ: లెసన్స్ ఫర్ అవర్ టైమ్స్(తారా సేఠియా), గాంధీ అండ్ మావో ఇన్ క్వెస్ట్ ఆఫ్ అనాలజీ(రతన్ దాస్), గాంధీ సీఈవో(అలాన్ ఆక్సెల్రాడ్) -
అయ్యో పాపం!
● నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్ ● నల్ల పిక్కలో కూరుకుపోయి దుర్మరణం ● మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడటంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండటంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం సేవించాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళతానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్లోడ్ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి... కేజీహెచ్కు వెళతానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్తో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్ ఆపరేటర్ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం చోటుచేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. -
యోగాతో సమస్యలు తీరవు
ఎస్.రాయవరం: యోగాసనాలతో ప్రజల సమస్యలు తీరిపోవు..కేవలం ప్రజల దృష్టి మరల్చిందుకు ప్రధాని నరేంద్రమోదీ యోగా జపం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ అన్నారు. వెంకటాపురం గ్రామంలో ఉపాఽధి కూలీలతో శనివారం సత్యనారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 21 నెలరోజులు పాటు యోగా కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చిందన్నారు. ఎద్దు ఈనిందంటే దూడను కళ్లెంతో కట్టేయమన్నట్లుగా కేంద్రం ఇలా పిలపునిచ్చిందో లేదో వెంటనే యోగాంధ్ర అంటూ రాష్ట్రం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమం ముగింపురోజున విశాఖకు నరేంద్రమోదీ వస్తున్నారన్నారని, ఆ రోజున రెండు లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. లోటు బడ్జెట్తో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే.. విశాఖలో యోగా ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుగా పిలిచే విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ఆదుకునే సమయం లేదు, కాని యోగాసనాలకు సమయం ఎలా వచ్చిందని విమర్శించారు. ఇకనై మోదీ ఆంధ్రాను ఎలా ఆదుకుంటారో ప్రకటన చేయాలన్నారు. -
ట్రెజరీలో అడ్డగోలు బదిలీలు
విశాఖ సిటీ: జిల్లా ఖజానా శాఖలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా బదిలీల ప్రక్రియను ముగించారంటూ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, సబార్డినేట్లకు సంబంధించిన బదిలీలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు? సాధారణంగా ఒకే చోట ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలి. అంతేకాకుండా, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. అయితే జిల్లా ఖజానా శాఖలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా, స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కనుసన్నల్లో 34 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా అక్కడే కొనసాగింపు ఈ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 12 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించలేదని సమాచారం. దీనికి తోడు, ఖజానా శాఖలో ఐదేళ్లుగా జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బదిలీ చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సదరు జూనియర్ అకౌంటెంట్పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలువురు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. అయినప్పటికీ, ఆరోపణలను, ఐదేళ్ల నిబంధనను పట్టించుకోకుండా అతడిని బదిలీ చేయకపోవడం పట్ల ఆ శాఖ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీటీవో సంతకం చేసి సెలవుపై..? ఈ బదిలీల ఫైల్పై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ (డీటీవో) నాగభూషణం సంతకం చేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినట్లు సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా 34 మందికి స్థానచలనం ఐదేళ్ల నిబంధనను పట్టించుకోని అధికారులు -
ఏపీ పీజీ ఈసెట్ ప్రారంభం
మద్దిలపాలెం(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీ ఈసెట్ 2025 శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. పరీక్షల తొలిరోజు ఉదయం సెషన్లో 92 శాతం, మధ్యాహ్నం సెషన్లో 82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెట్ కోడ్ను వీసీ విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, సెట్ కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు శని, ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
యలమంచిలి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యలమంచిలి టిడ్కో గృహ సముదాయం నివాసి కుండల లోకనాథం(57) శుక్రవారం మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో లోకనాథం స్థానిక టిడ్కో గృహ సముదాయానికి సమీపంలో ఉన్న డీఎస్సార్ పెట్రోల్ బంక్లో తన స్కూటీలో పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా ఎదురుగా తుని వైపు వెళ్తున్న తుని ఎంఆర్ పేటకు చెందిన వాన అప్పలనాయుడు(25) బైక్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకనాథాన్ని ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం లోకనాథం మృతి చెందినట్టు యలమంచిలి ట్రాఫిక్ బి.రామకృష్ణ తెలిపారు. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
అచ్యుతాపురం రూరల్ : మండలంలో గొర్లి ధర్మవరం గ్రామానికి చెందిన అప్పికొండ అప్పారావు(60) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఐవోసీఎల్ కంపెనీలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లిం కుటుంబంపై కక్షసాధింపు
నాతవరం: ముస్లిం కుటుంబంపై కూటమి నేతలు కక్షసాధింపు చర్యలకు దిగారు. కుమారుడి పెళ్లి వేడుకలో ఉండగా పొక్లెయిన్తో వారి ఇల్లు కూల్చివేశారు. దీనికి సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు.. జిల్లేడుపూడి పంచాయతీ శివారు వై.వెంకయ్యపాలెం గ్రామానికి ఇరవై ఏళ్ల క్రితం షేక్ సుభాన్ కుటుంబం వలస వచ్చింది. దివంగత పారిశ్రామికవేత్త, నూకాంబిక అలయ నిర్మాణకర్త ఎం.ప్రభాకర్ చౌదరి సుభాన్కు ఆశ్రయం కల్పించారు. సుభాన్ ఓ రైతు నుంచి స్థలం కొని తాటాకు ఇల్లు కట్టుకొని చికెన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభాకర్ చౌదరి దివంగతులయ్యాక సుభాన్కు సమస్య మొదలైంది. సుభాన్ ఇంటికి సమీపంలో ఉన్న జీడిపిక్కల పరిశ్రమను కేరళకు చెందిన వ్యక్తి నడిపేవారు. ఆయన వేరొకరికి పరిశ్రమను విక్రయించారు. జీడి పిక్కల ఫ్యాక్టరీకి ఈశాన్య భాగంలో సుభాన్ ఇల్లు ఉందని, దాంతో వ్యాపారం సరిగా జరగలేదంటూ ఇల్లు ఖాళీ చేయమని కొత్త యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ వివాదం రెండేళ్ల నుంచీ నలుగుతోంది. జీడి పిక్కల ఫ్యాక్టరీ యజమాని టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్కు సన్నిహితుడు కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సుభాన్కు సమస్య మొదలైంది. ఏప్రిల్ నెలలో పంచాయతీ డ్రైనేజీ పనుల నెపంతో పొక్లెయిన్తో వీరి ఇంటి ముందు భాగంలో కాలువ పనులు చేశారు. టీడీపీ నేతలు, అధికారుల అండతో తన ఇంటికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన సుభాన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే రెండు రోజుల క్రితం ఆయన ఇంటిని నేలమట్టం చేశారు. కుమారుడి వివాహం రోజునే ఇల్లు కూల్చివేత తన చిన్న కుమారుడి వివాహం నిమిత్తం ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సమీపంలో జగ్గంపేట వెళ్లామని సుభాన్ చెప్పారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పొక్లెయిన్తో తమ ఇంటిని కూల్చేశారని, శబ్దం రావడంతో ఇంటి పక్కనే నివాసం ఉంటున్న చిటికిల కృష్ణవేణి గమనించి ‘ఏమిటీ అన్యాయం’ అని ప్రశ్నించగా.. ముఖానికి ముసుగులు వేసుకున్న వ్యక్తులు నీకు సంబంధమేమిటని బెదిరించి వెళ్లిపోయారని వివరించారు. సమాచారం అందుకొని వెంటనే 100 నంబరుకు ఫిర్యాదు చేశామన్నారు. నాతవరం పోలీసులు వెంటనే తమ నుంచి వివరాలు తీసుకున్నారని, కానీ నేటి వరకు రాలేదన్నారు. దుండగులు తాము బక్రీద్ పండగ కోసమని పెంచుతున్న మేకపోతును కూడా తీసుకుపోయారన్నారు. ఈనెల 5న ఇంటికి చేరుకొని, ఫ్రిజ్ తదితర విలువైన సామగ్రితో సహా తమ ఇల్లు ధ్వంసమైన దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. 6వ తేదీన బంధుమిత్రులకు పెళ్లి భోజనాలకు పిలిచామని, కానీ తామే రోడ్డున పడ్డామని వారు ఆవేదనగా చెప్పారు. వివాహ వేడుకలో ఉండగా ఇల్లు కూల్చివేత టీడీపీ నేత అండతోజీడిపిక్కల వ్యాపారి దారుణం -
సామాజిక సందేశంతో ఆకట్టుకున్న నాటికలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలవారీ నాటక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం రెండు సందేశాత్మక నాటికలను ప్రదర్శించారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, నాంచారయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ప్రదర్శనగా స్నిగ్ధ కలం నుంచి జాలువారిన ‘దోషేచ వహ్ని’నాటిక ప్రదర్శించారు. మధ్యతరగతి కుటుంబాల్లో కుమార్తెను అత్తవారింటికి పంపిన తర్వాత, ఆ తల్లిదండ్రులు సర్వం కుమార్తెకు ధారపోస్తూ, కోడలి వేదనను పట్టించుకోని ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయినేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి’ అనే ఆరు సూత్రాలను పాటిస్తూ జీవించే సీ్త్ర పాత్రను ఈ నాటిక స్పృశించింది. అయితే భర్త తప్పు చేసినప్పుడు.. సప్తమ సూత్రంగా ‘దోషేచ వహ్ని’ అని సీ్త్ర చైతన్యవంతురాలై తనకు తానుగా లిఖించుకోవాలి అన్న సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథాంశానికి తగ్గట్టుగా నటీనటుల చక్కని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రెండవ నాటికగా కెరటాలు ప్రదర్శించారు. భాగవతుల రమాదేవి రచించిన ‘కెరటాలు’కథకు మునిపల్లె విద్యాధర్ నాటకీకరణ చేశారు. ఆధునిక భావాలతో నేటి యువత, ముఖ్యంగా మహిళలు తమ తల్లిదండ్రులను, ఆ తర్వాత భర్తను కూడా ఎదిరించడమే అభ్యుదయంగా భావించి తమ జీవితాలను, భవిష్యత్ను భగ్నం చేసుకుంటున్నారు. అలాంటివారు కెరటాల్లో కొట్టుకు పోకుండా.. గతంలో కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఒడ్డుకు చేరాలనే సందేశమిస్తూ ఈ నాటిక సాగింది. ఈ రెండు నాటికలను రాజాం కళాక్రియేషన్స్ సంస్థ ప్రదర్శించింది. -
ఏయూలో సమూల మార్పులు
విభాగాలకు నూతన డీన్, డైరెక్టర్ల నియామకం మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్, శుక్రవారం పరిపాలనకు సంబంధించి పలువురు డీన్లు, డైరెక్టర్లను పూర్తిస్థాయిలో మార్పు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కీలక నియామకాలు డీన్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్, డీన్ అవుట్రీచ్, డీన్ అలమ్నీ రిలేషన్స్, డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, చీఫ్ కో–ఆర్డినేటర్లు వంటి నూతన పదవులను ఏర్పాటు చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విభాగానికి చీఫ్ కో–ఆర్డినేటర్ను నియమించారు. బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్ను నియమించారు. డీన్ అలమ్నీ రిలేషన్స్ పదవిని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఓపెన్ లెర్నింగ్లను అనుసంధానించి, ఒకే డైరెక్టర్ పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కళల విభాగాలను అనుసంధానిం చనున్నారు. నూతన డీన్ల వివరాలు డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్: కె. రాంబాబు, డీన్ అకడమిక్స్ అఫైర్ కె. శ్రీనివాసరావు, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ వల్లికుమారి (కంప్యూటర్ సైన్స్), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అప్పలనాయుడు (కెమికల్ ఇంజనీరింగ్), డీన్, పీజీ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఆచార్య మునిస్వామి (స్టాటిస్టిక్స్), డీన్ అలమ్నీ రిలేషన్స్ ప్రొఫెసర్ శ్యామల (కెమిస్ట్రీ), డీన్ అవుట్రీచ్ ప్రొఫెసర్ కె. రమాసుధ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎస్. హరినాథ్ (సోషల్ వర్క్), డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కె.ఎస్. రావు (సివిల్ ఇంజనీరింగ్), చీఫ్ కో–ఆర్డినేటర్ స్పాట్ వాల్యుయేషన్ కేటీ బలరాం పడాల్ను నియమించారు. -
చెట్టు పైనుంచి పడిన యువకుడు మృతి
బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామానికి చెందిన నడిపల్లి తరుణ్(19) ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. గత నెల 15వ తేదీన గ్రామంలో తాడిచెట్టు ఎక్కి తాటికాయలు నరికి చెట్టు దిగుతుండగా తరుణ్ కాలు జారి పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన ఆయన్ను అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత 20 రోజులుగా వైద్య సేవలు పొందుతూ తరుణ్ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన తల్లి పద్మ.. తరుణ్ చిన్నతనంలోనే మృతి చెందగా.. తండ్రి అప్పలనాయుడు బాగోగులు చూసుకుంటున్నాడు. ఐటీఐ చదువుతున్న తరుణ్ అకాల మృతితో తండ్రి అప్పలనాయుడు భోరున విలపిస్తున్నాడు. -
పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ విడుదల
అనకాపల్లి టౌన్: దివ్యాంగులకు పారా స్పోర్ట్స్తో మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.అసయ్య తెలిపారు. స్థానికంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ క్రీడాకారులతో సమానంగా పారా క్రీడాకారులకు గౌరవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గనిరెడ్డి రాము, తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండిక్స్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
అచ్యుతాపురం రూరల్ : బ్రాండిక్స్ బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్ చేశారు. శుక్రవారం యలమంచిలి మండలం కృష్ణాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందుకుంటున్న మహిళా కార్మికులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రంగా గాయాలైన మహిళా కార్మికులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారన్నారు. మహిళా కార్మికులు గత సంవత్సర కాలం నుంచి బస్సుల ఫిట్నెస్ సరిగ్గా లేదని చెబుతున్నప్పటికీ మూర్ఖంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. స్టీరింగ్ లోపం కారణంగా బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో సుమారు 30 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వేతనంతో కూడిమ సెలవులు మంజూరు చేయాలన్నారు. -
పీతపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభం
అనకాపల్లి: కోడూరు పంచాయతీ పరిధి పీతపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కును శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనకాపల్లి కేంద్రంలో తొలి ఎంఎస్ఎంఈ పార్కును కోడూరులో ఏర్పాటు చేశామని, పారిశ్రామిక పార్కులో స్థలాలు పొందిన వారు వెంటనే యూనిట్ల స్థాపన మొదలు పెట్టాలని కోరారు. పార్కులో యూనిట్ల స్థాపనకు 171 మందికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. పార్కును రూ. 59.47 కోట్లతో అభివృద్ధి చేశామని, 250 ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కోడూరు గ్రామం నుంచి పీతపాలెం వరకు రెండు కిలోమీటర్ల రహదారిని రూ.79.42 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించామన్నారు. ఆర్డీవో షేక్ ఆయిషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు ఎస్.నరసింహారావు, డిప్యూటీ జోనల్ మేనేజరు సూర్యనారాయణ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు జి.నాగరాజారావు, తహశీల్దారు బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష తప్పింది విద్యార్థులు కాదు.. కూటమి ప్రభుత్వం
అనకాపల్లి: రాష్ట్ర విద్యాశాఖ వైఫల్యంతో ఎంతోమంది టెన్త్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమైందని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ రమాజ్యోతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి మూల్యాంకనంలో లోపాలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయన్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారు, పరీక్ష తప్పిన వారు రీ వాల్యుయేషన్ చేయిస్తే.. అనేకమందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందన్నారు. కచ్చితమైన ఫలితాలు వెల్లడించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో రాత్రీ పగలూ కష్టపడి చదివి పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంతులేని మానసిక క్షోభకు గురయ్యారన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలోనే కూటమి ప్రభుత్వం చేతగానితనం బయటపడిందన్నారు. ప్రశ్నాపత్రాలు వాట్సాప్ వేదికగా లీక్ అయినా తప్పులను సరిదిద్దుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్కరణలు తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటికి దశల వారీగా మంగళం పాడేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి విద్యార్థి విభాగం అధ్యక్షుడు చరణరాజ్, పెందుర్తి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉగ్గిన నాగార్జున, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బోడి వెంకటేష్ యాదవ్, విద్యార్థులు బోలెం హరి హేమంత్, సంతోష్, కిరణ్, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు. టెన్త్ ఫలితాల్లో తీవ్రమైన అవకతవకలు మొదట ఫెయిలైన వారికి రీ కౌంటింగ్లో అధిక మార్కులు విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం డిమాండ్ -
చేతకాక.. కమిషనర్ లేక!
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ అసమర్థతపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడగా.. కూటమి కార్పొరేటర్ల అసంబద్ధ వాదనలతో సభ రసాభాసగా మారింది. అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో చూపిన చొరవ, జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించడంలో చూపకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్లకార్డులతో మేయర్ పోడియంను చుట్టుముట్టి, తక్షణమే జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ సమావేశ మందిరం మార్మోగింది. డాబాగార్డెన్స్ (విశాఖ): నూతన మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాద, ప్రతిపాదనలతో హోరెత్తింది. ప్రధాన అజెండాలోని 27 అంశాలతో పాటు, టేబుల్ అజెండాలోని 6 అంశాలు సభ్యుల చర్చకు వచ్చాయి. వీటిలో 3 ప్రధాన అజెండా(1, 10, 14) అంశాలు, 2 టేబుల్(1, 6) అజెండా అంశాలు తప్ప, మిగిలినవన్నీ ఆమోదం పొందాయి. రెగ్యులర్ కమిషనర్ నియామకం ఎప్పుడు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకున్నారు. ప్లకార్డులతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, జీవీఎంసీకి తక్షణమే రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నినాదాలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి నినాదాలతో సభ దద్దరిల్లింది. మేయర్ పీలా శ్రీనివాసరావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొదట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేయాలని సూచించడంతో, వైఎస్సార్సీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం, ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఇన్చార్జ్ కమిషనర్ రాకపోవడంతో బ్రేక్ ఇన్చార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నందున సమావేశాానికి హాజరుకాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కమిషనర్ లేకుండా సభను నిర్వహించడాన్ని తప్పుబట్టారు. వారి నిరసనతో మేయర్ పీలా శ్రీనివాసరావు 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. దాదాపు అరగంట తర్వాత కమిషనర్ హాజరు కావడంతో సభ తిరిగి ప్రారంభమైంది. జీరో అవర్ కోసం పట్టు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పీలా అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యల పరిష్కారం కోసం జీరో అవర్ కావాలని పట్టుబట్టారు. మేయర్ దీనికి అంగీకరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జీవీఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు రోజుల్లో కమిషనర్ను నియమించేలా చూడాలని సూచించారు. ఎవడ్రా నువ్వు..! జీరో అవర్లో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్ కంపా హనోక్ మాట్లాడుతుండగా.. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హనోక్, ‘ఎవడ్రా నువ్వు’అంటూ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో సభలో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కల్పించుకుని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హనోక్కు చురకంటించారు. హనోక్ వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. జీవీఎంసీలో ఘోస్ట్ ఉద్యోగులు జీవీఎంసీలో ‘ఘోస్ట్ ఉద్యోగులు’ఉన్నారని, పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అలాంటి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి రైతులను ఇబ్బంది పెడుతున్నందున, డ్రైన్లు నిర్మించాలని పల్లా సూచించారు. ఎఫ్ఆర్యూ ఒప్పందం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు శ్రీహరిపురంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్ నిర్వహణ కోసం రూ.1.20 కోట్లు కేటాయించడం, విజయ (బెహరా) వెల్ఫేర్ సొసైటీకి చెల్లింపుల ఆమోదంపై జీవీఎంసీ కౌన్సిల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీవీ సురేష్ సహా ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ సొసైటీ ఉచిత సేవలకు బదులు డబ్బులు వసూలు చేస్తోందని, 30 ఏళ్ల లీజుపై కూడా అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సొసైటీ సరిగా పనిచేయకపోతే విచారణ జరిపి ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేస్తామని మేయర్ పీలా శ్రీనివాసరావు ద్వారా హామీ ఇచ్చారు. ఆమోదించిన అంశాల్లో ప్రధానమైనవి ● జీవీఎంసీలోని ఈఈ–1 పరిధిలో సివిల్ పనుల పర్యవేక్షణకు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను ఏడాది పాటు కొనసాగింపు. ● రూ.55.40 లక్షల అంచనా వ్యయంతో 19వ వార్డు పెదవాల్తేరులో చేపల మార్కెట్ పునరుద్ధరణ . ● ఇంజినీరింగ్ విభాగం ఈఈ–5 పరిధిలో 18 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు.ఖాళీగా కమిషనర్ కుర్చీమాట్లాడుతున్న మేయర్ పీలా శ్రీనివాస్ రెగ్యులర్ కమిషనర్ ఎక్కడ అంటూవైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం జీవీఎంసీపై కూటమి నిర్లక్ష్యం 27 అజెండా అంశాలు.. 6 టేబుల్ అజెండా అంశాలు సుదీర్ఘంగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంపీలా గోవిందు హాజరుపై అభ్యంతరం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు హాజరుపై డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అభ్యంతరం తెలిపారు. ఏ హోదాలో ఆయన వచ్చారని ప్రశ్నించగా, పీలా గోవింద్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చినట్లు అధికారులు వివరించారు. -
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
తొలిరోజు 88.39 శాతం హాజరు ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాలో విద్యాశాఖ మొత్తం 12 పరీక్షా కేంద్రాలను కేటాయించింది. మొదటి రోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 11 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. తొలి రోజు 2,447 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపించగా, వారిలో 88.39 శాతం (2,163 మంది) హాజరయ్యారు. 284 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం సెషన్లో 7 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,435 మందికి 1,278 మంది (89.06శాతం) హాజరయ్యారు.మధ్యాహ్నం 4 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,012 మందికి 885 మంది (87.45శాతం) హాజరయ్యారు. డీఈవో ఒక కేంద్రాన్ని, పరీక్షల స్క్వాడ్ మూడు కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షలు జరిగిన కేంద్రాలలో బుచ్చిరాజుపాలెంలోని ఏడీజెడ్ ఆరోవనా డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో అత్యధికంగా 450 మంది అభ్యర్థులను కేటాయించగా, నగరంలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో అత్యల్పంగా 85 మంది అభ్యర్థులను కేటాయించారు. -
తూట్లు...
● అటకెక్కిన ‘అన్నదాతా.. సుఖీభవ’ ● మొక్కుబడిగా ఆర్బీకేల పనితీరు ● ఎరువులు, విత్తనాలు అందని పరిస్థితి ● మూలకు చేరిన కియోస్క్ మిషన్లు ● పాత పద్ధతిలోనే గ్రామానికి విత్తనాలు సరఫరా చేసేలా ప్రతిపాదన ఆశయానికిరైతులకు అగచాట్లు రైతన్నకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. ‘అన్నదాతా.. సుఖీభవ’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లు మొండి చేయి చూపింది. వ్యవసాయ సేవలను అత్యంత చేరువలో గ్రామంలోనే అందించే ఆర్బీకేలు ఇప్పుడు మొక్కుబడిగా సాగుతున్నాయి. సేవలు పూర్తిగా అందివ్వకపోగా వాటిని కుదించి, మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే వ్యవసాయం, పశు సంవర్థక, ఫిషరీస్ సేవలు రైతులకు మరింత దూరమయ్యే అవకాశం ఉంది. కియోస్క్ మిషన్ ఎక్కడ? మాది లక్ష్మీపురం గ్రామం. నాకు రెండెకరాల పొలం వుంది. ఖరీఫ్ సీజన్లో వరి వేస్తాను. మాది ముంపు ప్రాంతం కావడంతో ఎక్కు వగా వరిలో ఆర్జీఎల్ రకం విత్తనం వేస్తాము. గతేడాది వరకు మాకు నచ్చిన విత్తనం, ఎరువులు మిషన్లో నమోదు చేసుకునేవాడిని. ఎరువులు కూడా కియోస్క్ మిషన్లో నమోదు చేసుకునేవాడిని. నా పేరున నాకు ఏమి కావాలో అది నమోదయ్యేది. ఈసారి అలా చేయలేదు. విత్తనాలు వచ్చాక ఏవి ఉంటే అవి తీసుకోవాలట. –బలిరెడ్డి కాసు, రైతు, లక్ష్మీపురం సూచనలు అందడం లేదు మా ఊరి రైతు భరోసా కేంద్రంలో ఇంతకు ముందులా రోజూ టీవీ వేసి ఉండకపోవడంతో వ్యవసాయ సూచనలు తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను వరి, చెరకు పండిస్తాను. ఇంతకు ముందు మాకు విత్తనాలు కావాలంటే మిషన్లో నమోదు చేసుకునేవాళ్లం. ఇప్పుడు అలా లేదట. మిషన్ను పక్కన పెట్టేశారు. వరి, చెరకు పంటల్లో తెగుళ్లు, ఇంకా ఏమైనా వ్యవసాయ సూచనలు కావాలంటే టీవీలో చూసి తెలుసుకునేవాడిని. ఇప్పుడు చెప్పేవారు లేరు. – కరక తలుపులయ్య, రైతు, చాకిపల్లి, రామజోగిపాలెం చోడవరం: వ్యవసాయ సేవలు, విత్తనాలు, ఎరు వుల కోసం మండల కేంద్రాలకు వెళ్లి రోజుల తరబ డి వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు పడిన నాటి చీకటి రోజులు రైతులకు గుర్తొస్తున్నాయి. వారికి ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించి, గ్రామంలోనే వ్యవసాయ సేవలన్నీ అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లను తెచ్చింది. ఆ వ్యవస్థలో ఏకంగా సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఆర్బీకేలకు సొంత భవనాలు నిర్మించడంతోపాటు కుర్చీ లు, కంప్యూటర్, టేబుళ్లు, పుస్తకాల రేక్లు సమకూర్చారు. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనలు అందుకొని, విజ్ఞానాన్ని పొందేందుకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్ మిషన్లు కూడా నెలకొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్బీకేల్లో సేవలు అరకొరగానే రైతులకు అందుతున్నాయి. ఏడాది నుంచి కరెంటు బిల్లులు చెల్లించలేదు. ఏ రోజు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తారో తెలీని పరిస్థితి.. ఇంటర్నెట్ సామర్ధ్యం తగ్గించడంతో ఆన్లైన్ సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ‘భరోసా’ దక్కలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరిట అందించిన పెట్టుబడి సాయం స్థానంలో కూటమి ప్రభుత్వం ‘అన్నదాతా.. సుఖీభవ’ను ప్రవేశపెడతా మని చెప్పింది. గతంలో రూ.13.500 ఇస్తే.. ఇప్పు డు రూ.20 వేలు అందిస్తామని డంబాలు పలికింది. కానీ గత ఏడాది, ఈ ఏడాది రెండేళ్లు ఆర్థిక సాయం అందించలేదు సరికదా ఇంతవరకు కనీసం విధివిధానాలను రూపొందించలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందని వారు గుర్తుచేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేశారని, కౌలు రైతులతో సహా ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశారని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో ఎన్నో సేవలుజిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఇవి కాక అపరాలు, చెరకు, ఇతర వాణిజ్య పంటలు కూడా వేలా ది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 23 వేల 300 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు కావాలని ప్రతిపాదన పెట్టారు. 33 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా కావాలని ప్రతిపాదన పంపించారు. అయితే ప్రతిపాదనలు ఆర్బీకేల ద్వా రా జరగలేదు. వ్యవసాయాధికారుల అంచనాల మేరకు ప్రతిపాదన పెట్టారు. గతేడాది వరకు రైతు లకు ఏ రకం వరి విత్తనం అవసరం, ఏ సమయంలో ఏ ఎరువు అవసరమో నేరుగా రైతే పాసుపుస్త కం పట్టుకొని ఆర్బీకేలకు వెళ్లి అక్కడ కియోస్క్ మిషన్లో స్వయానా నమోదు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆర్బీకేల్లో ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కియోస్క్ మిషన్లను నిరుపయోగంగా పక్కన పెట్టేసింది. పాత పద్ధతిలో రైతులకు కావలసినవి ఆర్బీకేలో ఉన్న సిబ్బందికి చెబితే వారు నమోదు చేసుకొని మొత్తం ఇండెంట్ను ప్రతిపాదనకు పంపుతున్నారు. దీనివల్ల పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాకపోతే రైతులందరికీ అవి అందే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏ రకం విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తే వాటినే రైతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక రైతుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీల వినియోగం కూడా పూర్తిగా లేదు. ఏదో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే వ్యవసాయ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రమే టీవీలు ఆన్ చేస్తున్నారు. మిగతా సమయాల్లో రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు తెలుసుకునే పరిస్థితి లేదు. అదే గతంలో ఉదయం నుంచీ సాయంత్రం వరకు టీవీలు ఆన్ చేసి వివిధ చానల్స్, ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ కార్యక్రమాలన్నీ నిరంతరం చూసేందుకు వీలుండేది. రైతులకు సమయం దొరికినప్పుడు ఆర్బీకేలకు వచ్చి ఆ వ్యవసాయ సూచనలు తెలుసుకొని విజ్ఞానంతో వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు వ్యవసాయ సిబ్బంది సూచనలు చెబితే తప్ప వ్యవసాయంలో నష్టాలను టీవీలో చూసి నివారించుకునే అవకాశం లేకుండా పోయింది. -
300 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
నక్కపల్లి: రేషన్ డిపోల ద్వారా తెల్లకార్డుదారులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. మండలంలోని జానకయ్యపేటలో తెల్లకార్డుదారుల నుంచి కారు చౌకగా కొనుగోలు చేసి రైసు మిల్లులకు ఆటోలో తరలిస్తున్న 300 కిలోల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జానకయ్యపేటలో ఆటోలో బియ్యం తరలిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, చినతీనార్ల తదితర చుట్టుపక్కల గ్రామాల్లో కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. కిలో రూ.18ల చొప్పున కొని అధిక ధరకు రైసు మిల్లర్లకు విక్రయిస్తుంటామని డ్రైవర్ చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడ్డ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.75 వేలు ఉంటుంది. -
అంగరంగ వైభవంగా రామలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట
మాడుగుల : మండలంలో సత్యవరం గ్రామంలో గురువారం అంగరంగ వైభవంగా రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా రామలింగేశ్వర, నందీశ్వరుడు, వినాయక, పార్వతీదేవిల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ట జరిపారు. భక్తులంతా బూరెలు, పండ్లు, పుష్ఫాలు, నవధాన్యాలు తీసుకొచ్చి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనతంరం స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నసమారాధన జరిపారు. ఉత్సవాల సందర్భంగా మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాగశాలలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో గృహస్తు దంపతులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, మాజీ ఎంపీపీ రామధర్మజ పాల్గొన్నారు. -
రైతులను మోసగించిన ఎంపీ రమేష్
దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సహా కూటమి నాయకులు ఘోరంగా మోసం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాగా ఒకప్పుడు సహకార రంగంలో రోల్మోడల్గా నిలిచి, నేడు శిథిలావస్థకు చేరుకున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోక పోవడం అత్యంత దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార రంగంలో నడుస్తున్న ఫ్యాక్టరీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం రైతులను మోసగించడమేనన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో అత్యధికంగా వరి, చెరకు పండిస్తుండగా కూటమి నాయకులు మాత్రం డిస్టలరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో రూ.89 కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 2023–2024 సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు ఇంకా చెల్లించాల్సిన రూ.150 అందరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 2024–25 సీజన్లో లక్షా 7వేల టన్నుల చెరకు క్రషింగ్ జరపగా, దీనిలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు మాత్రమే తొలి దఫా పేమెంట్గా టన్నుకు రూ.3వేలు చొప్పున చెల్లించారన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 10 వరకు క్రషింగ్ జరిగినా రైతులకు ఇంకా పేమెంట్ల ఇవ్వలేదన్నారు. ఫ్యాక్టరీ భవిష్యత్ అంధకారంగా ఉందని, నెలల తరబడి కార్మికులకు జీతాలు, రైతులకు పేమెంట్లు ఇవ్వకపోవడంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ చెరకు రైతులను దారుణంగా మోసం చేసిన ఎంపీ రమేష్, కూటమి నాయకులు నిస్సిగ్గుగా ప్రజల్లో తిరుగుతున్నారని ఘాటుగా విమర్శించారు. రైతులను మోసగించిన నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. కూటమి పాలనలో దయనీయంగా చెరకు రైతులు, కార్మికుల పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో రూ.89 కోట్ల నిధులు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ధ్వజం -
కారుకు నిప్పు అంటించిన దుండగులు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి శారదనగర్లో నివాసం ఉంటున్న జర్నలిస్టు ఈశ్వరరావు కారుకు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి దుండగులు ఈ సంఘటనకు పాల్పడ్డారు. తను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డుపై పార్కింగ్ చేశాడు. పెట్రోల్ పోసి కారుకు నిప్పు అంటించారు. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడడంతో ఈఽశ్వరరావు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి వెనుతిరిగారు. అందరూ వెళ్లిపోగా మరలా దుండగులు కారుకు నిప్పు అంటించారు. దీంతో కారు మొత్తం దగ్ధమైంది. బాధితుడు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఏపీఐఐసీ భూముల పరిశీలన
నక్కపల్లి: మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో జరుగుతున్న పనులను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం పరిశీలించారు. వేంపాడు, చందనాడ, డీఎల్పురం, అమలాపురం, రాజయ్యపేటలలో 2000 ఎకరాలు బల్క్ డ్రగ్ పార్క్కు, 2500 ఎకరాలు ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు కేటాయించిన విషయం తెలిసిందే. రూ.1100 కోట్ల వ్యయంతో ఈ భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి యువరాజ్ ఈ ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించారు. జిరాయితీ ఎంత, డీ ఫారం ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనే వివరాలు అధికారులు వివరించారు. గతంలో ఆయన ఉమ్మడి విశాఖ కలెక్టర్గా ఉన్న సమయంలోనే భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు వంటి ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ పునరావాస కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి లేఅవుట్ సిద్ధం చేసి నిర్వాసితులకు అప్పగించాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీవో రమణ, ఎస్డీసీ అనిత, తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. అంత గోప్యత ఎందుకో? పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ పర్యటనపై రైతులు, నిర్వాసితులకు కనీస సమాచారం లేదు. పూర్తిగా అధికారిక పర్యటన అయినప్పటికీ స్థానిక అధికారులు గోప్యంగా ఉంచారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని రైతులు, నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధిత రైతులు ఎక్కడ ఆయన కాన్వాయ్ను అడ్డుకుని తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే పర్యటనను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకు వచ్చేవారమని, ఎవరికీ కనీస సమాచారం లేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తెలిపారు. వివరాలు తెలుసుకున్న పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ ఉన్నతాధికారి పర్యటన గోప్యంగా ఉంచడంపై నిర్వాసితుల్లో అసంతృప్తి -
దిక్కులేని జీవీఎంసీ
● కమిషనర్ లేని పాలన.. విశాఖకు తీరని వేదన ● ఫైళ్లు పేరుకుపోతున్నాయి.. పనులు సాగడం లేదు ● కూటమి నిర్లక్ష్యంపై నగర ప్రజల ఆగ్రహం డాబాగార్డెన్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఐదు నెలలుగా రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో నగర పాలన పూర్తిగా గాడితప్పింది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు నెలల తరబడి కీలక అధికారిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారులలో జవాబుదారీతనం కొరవడింది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్తంభించిన పాలన శాశ్వత కమిషనర్ లేకపోవడంతో జీవీఎంసీలో పర్యవేక్షణ కొరవడింది. పాలన స్తంభించిపోయింది. సుమారు 20 లక్షల జనాభా, 98 వార్డులున్న జీవీఎంసీ బాధ్యతలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు కలెక్టరేట్ వ్యవహారాలు.. మరోవైపు జీవీఎంసీ బాధ్యతలతో ఆయన సతమతమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడి, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు సైతం తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండడంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. నూతన మేయర్ సైతం సమీక్షలకే పరిమితమయ్యారని, అధికారులను జవాబుదారీ చేసే స్థాయిలో చర్యలు కొరవడ్డాయని విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అటకెక్కిన అభివృద్ధి, పారిశుధ్యం కమిషనర్ లేని లోటు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కమిషనర్ హయాంలో మురికివాడల అభివృద్ధి, రూ.500 కోట్లతో తాగునీటి పైపులైన్ల మంజూరు, గుర్తించిన 1,150 ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చేపట్టాల్సిన పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడటంతో పారిశుధ్య నిర్వహణ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో ప్రసాద్గార్డెన్స్, వెలంపేట, పండావీధి, అల్లిపురం, కొబ్బరితోట, పద్మానగర్, చిలకపేట, జాలారిపేట, రంగిరీజువీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, పెయిందొరపేట, కోటవీధి, ఫెర్రీరోడ్డు, తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవ, డెయిరీఫాం ఏరియా, రామ్నగర్తో పాటు పలు మురికివాడ ప్రాంతాలు, ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు కొండవాలు ప్రాంతాలు, మురికివాడ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. జీవీఎంసీని గాడిలో పెట్టేదెవరు? జీవీఎంసీకి శాశ్వత కమిషనర్ లేకపోవడం నగర పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫైళ్లు కదలడం లేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు కమిషనర్ను నియమించకుండా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమేంటో? నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కమిషనర్ను నియమించడం అత్యవసరం. – బానాల శ్రీనివాసరావు, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ప్లాస్టిక్ నియంత్రణ ఎక్కడ? నగరంలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతోంది. గత మేయర్, కమిషనర్ హయాంలో చేపట్టిన ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, డోర్–టు–డోర్ ప్రచారాలు, నియంత్రణ కమిటీలు అన్నీ అటకెక్కాయి. దీంతో నగరంలో మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ఆందోళన జీవీఎంసీకి కమిషనర్ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్నే నియమించలేని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం జీవీఎంసీ చరిత్రలోనే ఇది మొదటిసారని, ఇది కూటమి ప్రభుత్వ ఘనకార్యమని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. తక్షణమే సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించి, నగర పాలనను గాడిలో పెట్టాలని సీపీఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. సమర్థంగా పనిచేస్తున్న కమిషనర్ను అర్ధాంతరంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం విశాఖను దిక్కులేని నగరంగా మార్చివేశారని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని మండిపడ్డారు. -
బౌద్ధమతం శాంతిని బోధిస్తుంది
బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో విశాఖ విద్య: శ్రీలంకలోని థెరవాడ సంప్రదాయానికి చెందిన బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో ఏయూలోని విద్యా విభాగంలో ‘బౌద్ధమతం–శాంతి విద్య’పై గురువారం ప్రసంగించారు. ఆధునిక కాలపు సంఘర్షణలను పరిష్కరించడం, అంతర్గత సామరస్యాన్ని పెంపొందించడంలో నాలుగు గొప్ప సత్యాలు, అష్టాంగ మార్గం ఔచిత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు బౌద్ధ బోధనల ద్వారా శాంతి యొక్క ఆధ్యాత్మిక, తాత్విక కోణాలతో నిమగ్నమయ్యే అరుదైన అవకాశాన్ని అందించింది. విభాగాధిపతి ప్రొఫెసర్ టి.షారోన్ రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ, యువత అభివృద్ధిలో శాంతి విద్య యొక్క పరివర్తనాత్మక పాత్రను వివరించారు. -
జిల్లాలో 82 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్వో లక్ష్మణ్ నక్కపల్లి: జిల్లాలో జూన్, జూలై నెలల్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 82 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖాధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల్లో అటవీ భూముల శాతాన్ని పెంచాలన్నదే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 నర్సరీలు ఏర్పాటు చేసి పంపిణీకి మొక్కలు సిద్ధంగా ఉంచామన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పేపర్ మిల్స్, ఉద్యానవన శాఖ, డ్వామా, అటవీ శాఖల సమన్వయంతో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సరుగుడికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. 70 లక్షల సరుగుడు, మిగిలిన 12 లక్షలు పలు రకాల జాతులుంటాయన్నారు. పొలాల్లో సరుగుడు పెంపకానికి ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తామన్నారు. నర్సీపట్నం, అనకాపల్లి యలమంచిలి, చోడవరం రేంజ్ కార్యాలయాల పరిధిలో మొక్కల పెంపకంపై పర్యవేక్షణ చేస్తామన్నారు. -
పెరటిలోనే ఔషధ మొక్కలు
అనకాపల్లి: రాణపాల, తులసి, అలివెరా, నేల ఉసిరి వంటి ఔషధ మొక్కలను ప్రతి ఇంటి పెరడులో పెంచుకోవచ్చని ఆయుష్మాన్ భారత్ వైద్యురాలు డాక్ట ర్ కె.లావణ్య చెప్పారు. వి.వి.రమణ రైతు భారతి హాల్లో గురువారం జిల్లా గ్రామీణ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆ మె మాట్లాడారు. ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని చెప్పారు. పరి శుభ్రమైన గాలిని పీల్చాలంటే మొక్కల ద్వారానే సా ధ్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇళ్ల వద్ద మొక్కలను పెంచడం లేదని, వాతావరణంలో అనేక మార్పులు సంభవించి, వివిధ వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొత్తగా గృహాలు నిర్మించే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ డాక్టర్ ఎస్.నూకరాజు మాట్లాడా రు. సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రేగుల అప్పారావు, సభ్యులు కాండ్రేగుల విశ్వేశ్వరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. చక్కని ఆరోగ్యానికి ఎంతో మేలు: డాక్టర్ లావణ్య -
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ పరిధిలో జరిగింది. పట్టణ ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయరామరాజుపేట శ్రీరామ్నగర్ కాలనీలో నివాసముంటున్న గుండే అభిషేక్ కుమార్ (17)బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫ్రెండ్స్తో వెళతానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి రావడంతో అతని తల్లి ఎస్.కె షకీనా ఎందుకు ఆలస్యంగా వచ్చావని మందలించింది. దీంతో మనస్థాపం చెంది గదిలో గడియపెట్టుకొని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని చనిపోయాడు. కొద్దిసేపటి తరువాత గమనించిన తల్లి చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపులు బద్దలు కొట్టి అభిషేక్ను కిందికి దించి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అభిషేక్ ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాశాడు. ఘటనపై మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
20 ఏళ్లకు పైబడి ఒకేచోట..
నాతవరం: వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001–02 సంవత్సరంలో ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలను నియమించారు. ఆనాటి నుంచి 2024 వరకు వీరు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులర్ చేశారు. వీరు రెగ్యులరైజ్ అయి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ప్రస్తుతం తలపెట్టిన సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు కావడంతో గతంలో బదిలీలకు చాన్స్ దక్కలేదు. ఇప్పుడు రెగ్యులర్ అయి ఏడాది మాత్రమే అయిందంటూ అన్యాయం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పీహెచ్సీలలో ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు 65మంది వరకు 20 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. వీరు బదిలీల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నాతవరం పీహెచ్సీలో ఫార్మసిస్టు వెంకటరావు 23 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదే మండలం గునుపూడి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎం 22 ఏళ్లుగా, పాయకరావుపేట మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఫార్మసిస్టు 24 ఏళ్లుగా, రాంబిల్లి మండలంలోని పీహెచ్సీలలో లేబ్ టెక్నీషియన్లు 22 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ రెగ్యులర్ కాలేదని బదిలీకి చాన్స్ ఇవ్వలేదని, కనీసం ఇప్పుడైనా ప్రత్యేకంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఉద్యోగంలో చేరిన స్ధానంలోనే పదవీ విరమణ చేయాల్సి వస్తుందన్నారు. ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల కష్టాలు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఇన్నాళ్లూ బదిలీకి అవకాశం లేదు ఏడాది క్రితం రెగ్యులరైజ్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈసారైనా బదిలీకి చాన్స్ ఇవ్వాలని కోరుతున్న వైద్య సిబ్బంది క్రమబద్ధీకరించి సంవత్సరమే అయిందని నిరాకరిస్తున్న ప్రస్తుత సర్కారు -
యోగాతో ఆరోగ్యం, దీర్ఘ కాలిక వ్యాధుల నివారణ
అనకాపల్లి: నిత్య జీవితంలో యోగా చేయడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని, వివిధ రకాలైన వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చని, సంపూర్ణంగా, ప్రశాంతంగా జీవిస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.బాలాజీ అన్నారు. యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా ఆయుష్ మాన్ భారత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం యోగాసనాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలగాలంటే ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో రోజుకు రెండు గంటలు యోగా చేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు మాట్లాడుతూ కరోనా వంటి విపత్తుల తరువాత మానవ జీవితంలో యోగా ప్రాముఖ్యత కలిగిందని, ప్రాచీన కాలం నుంచి యోగాకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నప్పటికీ కరోనా తరువాత దీనిపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. చిన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకూ వయస్సును బట్టి యోగాసనాలు వారివారి స్వగృహాల్లోనే చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు యోగా గురువుల బి.అప్పారావు, దొర్రం నాయుడు, మంగియ్య పర్యవేక్షణలో యోగాసనలు చేశారు. వైద్య సిబ్బంది ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఎం. శ్రీనివాసరావు, జిల్లా ఆయుష్శాఖ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రావ్య శ్రీ, జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ -
పాయిజన్ కంటే పాలిథిన్ ప్రమాదం
నక్కపల్లి: పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం ఎంపిక చేసిన పునరావాస కాలనీలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలిథిన్ అనేది పాయిజన్ కంటే ప్రమాదమన్నారు. అందుకే దీని వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయన్నారు. మార్కెట్లకు వెళ్లినపుడు చేతి సంచి లేదా నూలుతో తయారు చేసిన సంచిలను తీసుకెళ్లాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం విరివిగా మొక్కలు పెంచాలన్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజ్, డీఎఫ్వో లక్ష్మణ్, ఆర్డీవో వి.వి.రమణ, ఎస్డీఎఫ్వో సునీల్కుమార్, రేంజ్ ఆఫీసర్ అనిల్కుమార్, ఎఫ్డీవో పైడిరాజు, తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, సర్పంచ్ మున్నీసా పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరగాలి ఎస్.రాయవరం: ఆయిల్పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని, రైతులు వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆయిల్పామ్ డ్రైవ్లో భాగంగా వమ్మవరం గ్రామంలో గురువారం కలెక్టర్ పామాయిల్ మొక్కలు నాటారు. పెనుగొల్లు గ్రామంలో వరహానది గట్టుపై కొబ్బరి మొక్కలు, అందులో అంతరపంటగా సాగు చేసేందుకు కోకో మొక్కలు నాటారు. గ్రామంలో ఓ సీనియర్ రైతును సత్కరించి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన సేంద్రియ ఎరువు కిట్లను రైతులకు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రభాకర్, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ అధికారి పట్టాభిరామిరెడ్డి, జిల్లా అధికారి టి.చంద్రశేఖర్, మండల వ్యవసాయాధికారి సౌజన్య, తహసీల్దార్ జె.రమేష్బాబు, ఎంపీడీవో సత్యనారాయణ, పెనుగొల్లు సర్పంచ్ ఉద్దండం నాగశ్రీదేవి, వైఎస్సార్ సీపి నాయకలు ఉద్దండం సూర్యనారాయణ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి కలెక్టర్ విజయ కృష్ణన్ -
జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ
కలెక్టర్ హరేందిర ప్రసాద్ విశాఖ సిటీ: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఉదయం నుంచి దర్శనాలు ప్రధాన అర్చకుడు వైదిక కార్యక్రమాల షెడ్యూల్ను వివరించారు. జూలై 9వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టడం ద్వారా 32 కి.మీ మేర గిరి ప్రదక్షిణ మొదలవుతుందని పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామికి నాలుగో విడత చందనోత్సవం జరుగుతుందని తెలిపారు. -
ఏవోబీలోనూ సుధాకర్ కీలకపాత్ర
● మావోయిస్టు ఉద్యమ బలోపేతంలో తనదైన ముద్ర ● ఏజెన్సీలో ఘటనలకు ఆయనే వ్యూహంరూపొందించే వారని ప్రచారంసాక్షి,పాడేరు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ లక్ష్మీనరసింహచలం ఏవోబీలో ఉద్యమ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందారు. ఈ ప్రాంత ఉద్యమంతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. నల్లమల అడవుల నుంచి ఏవోబీలోకి ప్రవేశించిన ఆయన ఏవోబీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చేపట్టిన శాంతి చర్చల్లోను ఆయన పాల్గొన్నారు. ఒడిశాలోని సుంకి–సాలూరు ఏరియా కమిటీలో సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపారు. 2006లో అప్పటి విజయనగరం జిల్లా మక్కువ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రసమంతవలస అడవుల్లో సుధాకర్ పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అడవిలో సురక్షిత ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో అప్పటి పోలీసు పార్టీలు ఆయనను సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటినుంచి ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారారు. ఏవోబీ పరిధి రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగే మావోయిస్టు ఉద్యమ కార్యక్రమాలకు ఈయనే వ్యూహం రూపొందించేవారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనను కోల్పోవడం దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగానే చెప్పవచ్చు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చోడవరం: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి పి.రాజారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం చోడవరం కోర్టుల ఆవరణలో మొక్కలు నాటారు. అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి పి.రాజారావు , ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వర్ణ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలరాజు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు చీపురుపల్లి సూర్యనారాయణ, ఎస్.భవానీశంరరావు, వి.వెంకట్రావు, పైడిరాజు, వారాది రాజు, చందు, పీవీ రమణమూర్తి పాల్గొన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటారు. ఎండీ సన్యాసినాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఆవరణతోపాటు చెరకు కాటాల వద్ద, పలు పాఠశాలల్లోనూ, గోవాడ, అంబేరుపురం గ్రామాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీసీ ప్రసాద్, సీఏఓ ఎస్ఎల్ సత్యనారాయణ, సీఈ పి.ప్రసాదరావు, సీడీఓ రామం, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, పీఏ రవి, యూనియన్ నాయకులు భాస్కరరావు, రామునాయుడు పాల్గొన్నారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ కె. మన్మథరావు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. పాస్టిక్ వస్తువులు పూర్తిగా వాడకం మానేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించాలని జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, ఎమ్మెల్యే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల సబ్ రిజిస్ట్రార్ పురుషోత్తమ్, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఈఓపీఆర్డి మహేష్, పంచాయతీ ఈఓ నారాయణరావు, పాల్గొన్నారు. మానవ మనుగడకు చెట్లు కీలకం అనకాపల్లి టౌన్ : మానవ మనుగడలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. గవరపాలెం జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులు, ఉపాధాయులు పుట్టిన రోజుల సందర్భంగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ పాల్గొని మొక్కలను నాటారు. పలుచోట్ల మొక్కలు నాటిన అధికారులు -
యోగాంధ్ర కు నాడే బీజం
ఈనెల 21న విశాఖ సాగర తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగా దినోత్సవం భారీ ఎత్తున జరగనుంది. ఆ నేపథ్యంలో జిల్లా అంతటా నెల రోజులపాటు ‘యోగాంధ్ర’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, పార్కులు, సాగర తీరాలు, పాఠశాలలు, చివరకు ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాలు.. ఇలా అన్ని చోట్ల యోగాసనాలు వేయిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులతో అభ్యాసం చేయించి, ప్రధాని సమక్షంలో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనేది లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో యోగ శిక్షకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నియమించింది. ‘ఆయుష్’ ద్వారా సంప్రదాయ వైద్యాన్ని విస్తృత పరచి, అందరినీ యోగా వైపు నడిపించాలన్న ప్రయత్నం ఆనాడే ప్రారంభమైంది. నక్కపల్లి: కోవిడ్ కాటు వేయడంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్న రోజులవి.. అల్లోపతి వైద్య విధానంలో సరైన చికిత్స లేక అందరి చూపు ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్యం వైపు మళ్లింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో ఆయుష్ వైద్యశాలలను బలోపేతం చేసి, వాటికి అనుబంధంగా యోగ విద్యను ప్రచారంలోకి తేవడానికి యోగ శిక్షకులను నియమించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, వేంపాడు ఆయుర్వేద ఆస్పత్రుల పరిధిలో నాటి నుంచి వీరు విశేష సేవలు అందిస్తున్నారు. ఈ శిక్షకుల ద్వారా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు గంటపాటు యోగాసనాలు నేర్పించే కార్యక్రమం చేపట్టారు. తదుపరి గ్రామాల్లో ఆసక్తి చూపిన పెద్దలు, పిల్లలు, మహిళలు, యువతీయువకులకు కూడా యోగాపై అవగాహన కల్పించడంతోపాటు, యోగాసనాలు నేర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఆయుర్వేద ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే యోగా శిక్షకులకు గంటకు రూ.250ల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పురుషులయితే నెలకు 32 గంటలు, మహిళలయితే నెలకు 20 గంటలపాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 2021 నుంచి 2024 వరకు నాలుగేళ్లపాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ప్రతి గ్రామంలోను విద్యార్థులతో కలిపి 150 నుంచి 200 మందికి పైగా యోగా నేర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత యోగా శిక్షకులకు వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. యోగాంధ్రలో కీలక పాత్ర యోగాంధ్ర కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ యోగా సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. మే 21 నుంచి ప్రపంచ యోగా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూన్ 21న విశాఖలో ఐదు లక్షల మందితో 45 నిమిషాల సమయంతో కూడిన ప్రొటోకాల్ యోగాను నిర్ణయించారు. సులభశైలిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం గ్రామాల్లో యోగా శిక్షకుల ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీరంతా యోగా కొనసాగింపులో భాగంగా వారి పరిధిలో ఉన్న గ్రామాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజున విశాఖ బీచ్రోడ్డులో యోగాసనాలు వేయాల్సి ఉంటుంది. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నత స్థాయి అధికారులంతా భాగస్వాములవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో మే 27 నుంచి జూన్ 15 వరకు యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు, శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో నాలుగు టూరిజం ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మే 27న పరవాడ ముత్యాలమ్మపాలెం, జూన్ 2న కేడీపేటలో అల్లూరి సీతారామరాజు పార్క్, 9న రాంబిల్లి తీరప్రాంతం, 15న రేవుపోలవరం సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంతటి బాధ్యతలను మోస్తున్న యోగా శిక్షకులు.. తమ వేతనాలు పెంచాలని, సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితమే యోగ శిక్షకులను నియమించిన వైఎస్ జగన్ సర్కారు ఆయుష్ వైద్యశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న శిక్షకులు నేటి యోగాంధ్ర కార్యక్రమాల్లో విస్తృత సేవలు -
కొత్తకోటలో నిలిచిన సచివాలయ సేవలు
రావికమతం : కొత్తకోటలోని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల్లేక ప్రభుత్వ పరమైన సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 15 వేలు పై బడి జనాభా ఉన్న కొత్తకోటలో మూడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయం–1 లో డిజిటల్ అసిస్టెంట్ , వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులు లేరు. వేసవి సెలవులు అనంతరం ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో చేరే విద్యార్థులకు కుల,ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం. అలాగే రేషన్కార్దుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులు లేకపోవడంతో ఆ సచివాలయం పరిధిలో పని జరగట్లేదు. రెండో, మూడు సచివాలయాల్లోనూ సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఒకటో సచివాలయం పరిధిలోని విద్యార్థులు, స్థానికులు స్ధానికులు వివిధ ధ్రువపత్రాలు, రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి రెండు, మూడు సచివాలయాలకు వెళ్లినా అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రకాష్రావు, వెంకటేశ్వర్లు, రమణబాబు తదితరులు చెబుతున్నారు.ఒకటో సచివాలయం పరిధిలోని వారంతా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో సచివాలయంలో సేవలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకన్నబాబు తెలిపారు. -
జీడితోటలో 80 కేజీల గంజాయి స్వాధీనం
అనకాపల్లి : రోలుగుంట మండలం కొవ్వూరు నుంచి కంతలం గ్రామాల మధ్యలో జీడితోటలో 80 కేజీల గంజాయి నిల్వ చేసినట్టు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి అన్నారు. కొత్తూరు పంచాయతీ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీడితోటల్లో తనిఖీలు నిర్వహించగా 60 కేజీల గంజాయి నిల్వ చేసినట్టు గుర్తించారని, మరో 20 కేజీల గంజాయిని తీసుకుని అక్కడ దాచేందుకు వచ్చిన నర్సీపట్నం పట్టణానికి చెందిన కుంచా యేసుక్రాంతి, రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఎర్ర పవన్ కుమార్లు పోలీసులను చూసి వెనుదిరిగి వెళుతూ పట్టుబడ్డారని తెలిపారు. వారిని విచారించగా అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం శిరిపురం గ్రామానికి చెందిన బూరిటీ శ్రీను నుంచి గంజాయిని కొనుగోలు చేసి కొవ్వూరు–కంతలం గ్రామాల మధ్య జీడితోటలో భద్రపరిచినట్టు తెలిపారన్నారు. నిందితుల వద్ద మూడు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని నగదు ప్రోత్సాహంతో అభినందించారు. ముగ్గురు అరెస్టు, రిమాండ్ -
వేట సాగదు...పూట గడవదు..
గొలుగొండ : వందలాది మంది జాలర్లకు అన్నం పెట్టే తాండవ జలాశయం ఈ వేసవిలో జాలర్లకు నిరాశే మిగిల్చింది. ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే జాలర్లకు కాసుల పంట పండేది. కానీ ఏ ఏడాది దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా వేసవిలో రొయ్యల వేట చాలా మందకొడిగా సాగుతోందని జాలర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో రొయ్యల వేట జలాశయంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తే ఈ ఏడాది మే నెలలో భారీ వర్షాలు కురిసి రొయ్యల వేటకు ఇబ్బందులు కలిగించాయి. 500 మందికి జీవనోపాధి... తాండవ జలాశయంలో 500 మంది వరకు జాలర్లు ప్రతి ఏటా రొయ్యల వేట సాగింస్తుంటారు. మత్య్సకారుల సంఘం ఆధీనంలో ఈ రొయ్యల వేట నిర్వహించి జీవనోపాధి పొందుతారు. ప్రతి ఏటా ఏప్రిల్లో సంఘం ఆధ్వర్యంలో రొయ్యల వేట నిర్వహించి జూన్ రెండవ వారంలో వేటను నిలుపుదల చేస్తారు. సుమారుగా 50 రోజుల పాటు రొయ్యల వేట నిర్వహించే సమయంలో ప్రతి జాలరికి ప్రతిరోజు రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అలాగే రాత్రి సమయంలోనూ వేట నిర్వహించి జీవనోపాధి పొందుతారు. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి లేకుండా పోయింది. ఎండల సమయంలో వర్షాలు తాండవ జలాశయం సుమారుగా 4వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. తాండవ జలాశయం చుట్టూ వెంకటాపురం, పొగచెట్లపాలెం, గొలుగొండ, జోగుంపేట, సాలికమల్లవరం, అమ్మపేట, గాదంపాలెం, జలార్లుపేట, జాలర్లుపేట, కొత్తమల్లంపేట తదితర గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో లైసెన్సులు ఉన్న వారు సుమారుగా 200 మంది జాలర్లు కాగా మరో 300 వందల మంది వరకు అనుభవం ఉన్న జాలర్లు రొయ్యల వేట నిర్వహిస్తారు. ప్రతి ఏటా మత్స్యకారల సంఘం ప్రతినిధులు, మత్య్సశాఖ ఆద్వర్యంలో ఏఫ్రిల్ నెలలో రొయ్యల వేట సాగించి జూన్ రెండవ వారంలో నిలుపుదల చేస్తారు. వేడి తీవ్రత ఆధికంగా ఉండడం వల్ల రొయ్యలు జలాశయం నుంచి బయటకు వచ్చే సమయంలో వేట సులువుగా జరుగుతుంది. కానీ ఏ ఏడాది మే నెల అంతా భారీ వర్షాలు, తుఫాన్ల ప్రభావం వల్ల రొయ్య జలార్లకు చిక్కలేదు. రొయ్యల కోసం బిందులు, వల లు వేసుకొని జలాశయంలోకి వెళ్లి ప్రయ త్నాలు చేసినా అనుకున్నంత ఫలితం దక్కలేదు. మరో 10 రోజుల్లో రొయ్యల వేట నిలుపుదల చేయడం జరుగుతుందని, కానీ ఇప్పటి వరకూ సరిగా వేట సాగ లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది నిరాశే... గడిచిన 15 సంవత్సరాల చరిత్రలో ఈ ఏడాది మే నెలలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో రొయ్యల వేట జరగడం చాలా కష్టతరంగా మారింది. మే నెలలో రొయ్యల వేటకు వెళ్లిన సందర్భంగా గాలులు, వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాం. చేపల వేట కన్నా రొయ్యల వేట 50 రోజుల్లో మంచి ఆదాయం అందిస్తుంది. కానీ ఈ ఏడాది నిరాశే మిగిలింది. మరో 10 రోజుల్లో రొయ్యల వేట నిలిచిపోతుంది. – రాజు, మత్స్యకారుడు, వెంకటాపురం తాండవ జలాశయంలో రొయ్యల వేటకు ఇబ్బందులు అధిక వర్షాలే కారణం -
బెదిరించి..రూ.25వేలు యూపీఐకి బదిలీ
యలమంచిలి రూరల్ : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువకుడిని బెదిరించి అతని మొబైల్ ఫోన్ యూపీఐ ద్వారా రూ.25 వేల నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై యలమంచిలి మండలం కొత్తలి గ్రామానికి చెందిన బాధితుడు ఇత్తంశెట్టి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పలు సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టగా 92 రోజుల తర్వాత ఇద్దరు నిందితులు యలమంచిలి మండలం పులపర్తి గ్రామానికి చెందిన తప్పెట్ల భగవాన్(25), ఎస్ రాయవరం మండలం వేమగిరికి చెందిన కొప్పన రవి(29)లను పట్టుకోగలిగామని ఆయన శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలివి. ఈ ఏడాది మార్చి 12న అచ్యుతాపురం టీజే పరిశ్రమలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న బాధితుడు విధులు ముగించుకుని తన స్వగ్రామం యలమంచిలి మండలం కొత్తలికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పురుషోత్తపురం గ్రామానికి సమీపంలో హైవేపై ఇద్దరు గుర్తు తెలియని యువకులు తనిఖీ సిబ్బందిలా వ్యవహరించి ద్విచక్రవాహనాన్ని ఆపి బాధితుడి వద్ద డబ్బు ఉంటే ఇచ్చేయమని బెదిరించారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో అతని మొబైల్ ఫోన్ లాక్కుని, యూపీఐ పిన్ చెప్పాలని అడగ్గా బాధితుడు చెప్పడానికి నిరాకరించాడు.అతడిపై చేయి చేసుకోవడం, చంపుతానని బెదిరించడంతో భయపడిన బాధితుడు ప్రసాద్ తన ఫోన్ పే యూపీఐ పిన్ నెంబరు నిందితులకు చెప్పాడు. దీనినుపయోగించి బాధితుడి బ్యాంకు అకౌంట్ నుంచి నిందితుల్లో ఒకరు తన మొబైల్లో ఉన్న బెట్టింగ్ యాప్ అకౌంటుకు రూ.15 వేలు, మరొకరు రెండు విడతల్లో మరో రూ.10 వేలు నగదు బదిలీ చేసుకున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్లకు కాకుండా బెట్టింగ్ యాప్కు నగదు బదిలీ చేసుకోవడంతో నిందితులను గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని సీఐ చెప్పారు. దారి దోపిడీకి పాల్పడడానికి ముందు రోజు రాత్రి నిందితులిద్దరూ మూడు చోట్ల మద్యం సేవించారని మార్చి 12వ తేదీ తెల్లవారుజామున మరొకసారి మద్యం సేవించడానికి డబ్బు లేకపోవడంతో నేరానికి పాల్పడినట్టు దర్యాప్తులో తెలిందన్నారు. నిందితులిద్దరూ అవివాహితులేనని మద్యం, బెట్టింగ్లకు అలవాటుపడి దారి దోపిడీకి తెగించారన్నారు. ఇలాంటి నేరాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. కఠిన శిక్షలు ఉంటాయన్నారు. నిందితులిద్దర్నీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి, రిమాండ్కు తరలించినట్టు సీఐ చెప్పారు. సమావేశంలో యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర, ఆచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దారి దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్ -
బీకాం టాపర్కు సీపీఎం నేతల సన్మానం
గొలుగొండ: ఆదీవాసీ గిరిజన యువకుడు దుర్గాప్రసాద్ బీకాంలో యూనివర్శిటీ ప్రథమ స్థానం సాధించడంతో సీపీఎం నేతలు బుధవారం గ్రామంలో సత్కరించారు. పాతమల్లంపేట పంచాయతీ శివారు గిరిజన గ్రామం అయిన ఎన్. గదబపాలెం గ్రామానికి చెందిన చీమల దుర్గాప్రసాద్ నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో బీకాం చదివాడు. ఇటీవల ఫలితాల్లో ఆంధ్రయూనివర్సిటీ బీకాంలో ప్రథమ స్థానం సాధించడంతో అతనికి సీపీఎం నేతలు అభినందనలు తెలిపారు. దుర్గాప్రసాద్ గిరిజన యువకులకు ఆదర్శంగా నిలుస్తాడన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నారాయణమూర్తి, అడిగర్ల రాజు, గొర్రి శివ, చీమల రాము, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
రోలుగుంట : మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి మేలు జరుగుతుందని అటవీశాఖ చోడవరం రేంజర్ జగదీష్ అన్నారు. రావికమతం మండలం మరుపాక నర్సరీ నుంచి పలు జాతుల మామిడి, నేరేడు, వేప,రావి తదితర 150 మొక్కలను బుధవారం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల సిబ్బందికి అందజేశారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మొక్కలు పెంపకం చేపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ మొక్కలు నాటాలి, పొలాల్లో, చెరువు గట్లపై రైతులు ఏఏ మొక్కలు నాటాలో తెలియజేశారు. పచ్చదనం, వన వృక్షాల అభివృద్ధితోనే ఆశించిన వర్షాలు పడతాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవింద, నాయకులు బంటు రాజు, ఈ కాంప్లెక్సు సీఆర్పీ సతీ్ష్, వివిధ గ్రామాల జెడ్పీ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, రైతులు పాల్గొన్నారు. చోడవరం అటవీశాఖ రేంజర్ జగదీష్ -
బావిలో పడి వ్యక్తి మృతి
పెందుర్తి: తోటి కూలీలతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పెందుర్తి మండలం ముదపాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాంకి చెందిన పక్కి ప్రసాద్(25) ముదపాకలోని జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి పనులు చేసిన తరువాత సమీపంలోని బావిలోకి తోటి ముగ్గురు నిర్మాణ కూలీలతో కలిసి ఈతకు వెళ్లాడు. మిగిలిన వారు వెళ్లిపోదాం అంటే ‘నేను కాసేపు ఉండి వస్తాను’ అని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రసాద్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తోటి కూలీలు బావి వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండడంతో ప్రసాద్ నీటిలో మునిగిపోయి ఉండవచ్చని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
ఆరిలోవ: జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయాణిస్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మధురవాడ నుంచి నగరానికి వెళ్తున్న ఒక కారు జూ పార్కు సమీపంలోకి రాగానే పొగలు రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. కారు ఆపిన వెంటనే మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ ఘటనతో వెనుక వస్తున్న ఇతర వాహనదారులు భయపడి సుమారు అర కిలోమీటరు దూరంగా తమ వాహనాలను నిలిపివేశారు. కారులో ఉన్నవారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు, కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆరిలోవ పోలీసులు ప్రమాదవశాత్తు కారు దగ్ధమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిజిటల్ భాగ్యం కలిగేనా?
ఆధునిక ప్రమాణాలతో.. అయితే డిజిటల్ చెల్లింపుల అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు, దుర్వినియోగం జరిగే అవకాశం వంటి అంశాలపై దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి సహేతుకమైనవే అయినప్పటికీ.. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఆధునిక సాఫ్ట్వేర్ను వినియోగించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. భక్తుల సౌలభ్యాన్ని, దేవస్థానం ఆర్థిక ప్రయోజనాలను, లావాదేవీల్లో పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని.. సింహాచలం దేవస్థానంలో కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సింహాచలంలో దర్శనం టికెట్లు, వివిధ ఆర్జిత సేవల టికెట్లు, ప్రసాదాల కొనుగోలు, కేశఖండన వంటి అన్ని సేవలకు నగదు చెల్లింపు తప్పనిసరి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సింహగిరికి భక్తులు తరలివస్తుంటారు. అయితే సరిపడా నగదు వెంట తెచ్చుకోలేనివారి భక్తుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అధికంగా వినియోగించే యువత.. సరిపడా నగదు వెంట తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతాలో నగదు ఉన్నప్పటికీ.. ఆలయ కౌంటర్ల వద్ద ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిరీక్షించి.. చివరకు నిరాశకు గురవుతున్నారు. కొండ దిగువన బస్సు టికెట్టు నుంచి కొండపైన ప్రతి అవసరానికీ నగదు కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వస్తే.. ఈ సమస్యలన్నీ తీరుతాయని భక్తులు అంటున్నారు. దేవస్థానానికి ఆదాయ మార్గం డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేకపోవడంతో దేవస్థానం కొంత ఆదాయం నష్టపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదాన పథకానికి విరాళాలు అందించాలనుకునే భక్తులు అనేకమంది ఉంటారు. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం నగదు, చెక్కు, డీడీ రూపంలో విరాళాలు స్వీకరిస్తున్నారు. స్వామికి విరాళం ఇవ్వాలని వారు ముందుగా నిర్ణయించుకుని సింహగిరికి వస్తారు. పై మూడు పద్ధతుల్లో ఏదొకదాన్ని అనుసరించి విరాళం అందజేస్తుంటారు. కాగా.. ఆలయానికి వచ్చిన తర్వాత, స్వామి వారి దర్శనానంతరం లేదా అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత తక్షణమే తమకు తోచినంత విరాళం ఇవ్వాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అయితే చేతిలో తగినంత నగదు లేకపోవడం, డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో వీరు విరాళం ఇవ్వలేక వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం అన్నప్రసాద విభాగం కౌంటర్ వద్ద రోజూ పదుల సంఖ్యలో భక్తులు డిజిటల్ చెల్లింపుల గురించి ఆరా తీస్తున్నారు. డిజిటల్ చెల్లింపులతో చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు విరాళాలు సులభంగా స్వీకరించే వీలుంటుంది, తద్వారా అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అంతేకాకుండా దర్శనం టికెట్లు, ఇతర సేవల ద్వారా కూడా దేవస్థానానికి పారదర్శకంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అప్పన్న సన్నిధిలో అన్నీ నగదు లావాదేవీలే.. డిజిటల్ పేమెంట్లు లేక భక్తుల అవస్థలు విరాళాల సమర్పణలోనగదు రహిత చెల్లింపులతో మేలు తద్వారా భక్తులకు సౌలభ్యం, దేవస్థానానికి ఆదాయం -
నేడు వెన్నుపోటు దినం
యలమంచిలి రూరల్: వెన్నుపోటు అంటే గుర్తుకువచ్చేది చంద్రబాబే అని, నాడు ఎన్టీఆర్కు.. నేడు సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. మంగళవారం యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి సమన్వయకర్త కన్నబాబురాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు నయవంచనకు నిరసనగా ఈ నెల 4వ తేదీ బుధవారం వెన్నుపోటు దినం పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అడ్దగోలుగా విమర్శలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కడపలో నిర్వహించిన మహానాడు ద్వారా మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. 2024లో ప్రజలను మోసం చేయడం ఇష్టం లేకనే ఆయన ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల హామీలు తుంగలో.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ విమర్శించారు. మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, లేదంటే రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తానని బాబు చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి. సేనాపతి రాము, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు గుప్తా, అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు పాల్గొన్నారు. కూటమి వంచనను నిలదీద్దాం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
బొగ్గు లారీ బీభత్సం
నలుగురికి గాయాలు పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఉదయం ఓ బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అచ్చుతాపురం ఎస్ఈజెడ్కు వెళ్తున్న బొగ్గు లారీ ఉద యం 6.45 గంటల సమయంలో అతి వేగంగా వచ్చి ముందున్న కారును, ఆటో ను ఢీకొట్టింది. అనంతరం సిగ్న ల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. ప్ర మాదంలో కారు వెనుక భాగం దె బ్బతినగా, ఆటో ముందు భాగం నుజ్జయింది. ఆటోలో ఉన్న సీతారాములు, నాగలక్ష్మి, ఆదిలక్ష్మి, దేముడమ్మ గాయపడ్డారు. క్షతగాత్రులను అగనంపూడి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఆదిలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంలో సిగ్నల్ విద్యుత్ స్తంభం, హైమాక్స్ లైట్, రెయిలింగ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉదయం సమయంలో రోడ్డుపై పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొగ్గు లారీని క్రేన్ సహాయంతో బయటకు తీసి.. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నీ
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఏరీనా వేదికగా జరుగుతున్న హండ్రెడ్ ఎస్3 ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది క్రీడాకారులు అండర్ 11, 13, 15, 17 ఏళ్ల కేటగిరీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ చైతన్య, శ్రీనివాస్, కార్పొరేటర్ ఉషశ్రీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వి.వి.సోమరాజును సత్కరించారు. స్పోర్ట్స్ ఏరీనా నిర్వాహకుడు సహాని తదితరులు పాల్గొన్నారు. -
కాపులకు చంద్రబాబు వెన్నుపోటు
నక్కపల్లి: కాపుల ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయం మర్చిపోయి తిరిగి కాపులకే వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబునాయుడు సిద్ధపడుతున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ తునిలో జరిగిన రైలు దగ్ధం కేసును తిరిగి తెరిపించి కాపు ఉద్యమకారులను జైలుకి పంపించాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తుని ఘటనకు సంబంధించిన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసిందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎత్తివేసిందన్నారు. ఈ కేసులను తిరిగి విచారణ చేపట్టే విధంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. కాపు జాతిని, కాపు నాయకులను పూర్తిగా అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే చంద్రబాబు, లోకేష్లు ఈ చర్యలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. దీనిలో భాగంగా ఉద్యమ సమయంలో కేసులను తిరగదోడి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, వారి సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని గతంలో జరిగిన ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారన్నారు. వీరందరిపై కక్ష కట్టి వేధిస్తే భవిష్యత్లో తమకు ఎదురు తిరగరన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కేసులు రీ ఓపెన్ చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. జనసేన పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు ఏదో రోజు పవన్ కల్యాణ్పై కేసులు పెట్టించి జైలుకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కాపులపై పెట్టిన కేసులు తిరగదోడాలని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పవన్ కల్యాణ్ స్పందించాలన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని నమ్మి కాపులంతా గంపగుత్తుగా కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. చంద్రబాబు లోకేష్లు చేస్తున్న కుట్రలపై జనసేన పార్టీతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ వీసం నానాజీ, ఉపసర్పంచ్ వీసం రాజు, పార్టీ నాయకులు ముద్దా శ్రీను, అల్లాడ కొండ, దేవవరపు వెంకటసత్యనారాయణ, పోతంశెట్టి బాబ్జీ, అల్లాడ కొండ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా అణగదొక్కే కుట్ర తుని రైలు కేసు రీ ఓపెన్ చేసేందుకు కంకణం పవన్ కల్యాణ్ను కూడా ఏదో రోజు జైలుకి పంపిస్తాడు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం -
న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక
కె.కోటపాడు: విశాఖపట్నంలో న్యాయ విద్యాపరిషత్ లా కళాశాలలో 1993లో చదువులు సాగించిన పూర్వ విద్యార్థులు చౌడువాడలో అపూర్వ కలయిక పేరుతో కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తరువాత కలిసిన నాటి స్నేహితులంతా ఒక్కచోట చేరి గత స్మృతులను నెమరువేసుకున్నారు. అల్లరి చేష్టలను తలచుకొని రోజంతా సంతోషంగా గడిపారు. వారి కుటుంబాల యోగక్షేమాలను ఒకరికి ఒకరు తెలుపుకున్నారు. ఈ అపూర్వ కలయికకు చోడవరం న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ సారథ్యం వహించారు. వివిధ ప్రాంతాల్లో న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్న వారు, న్యాయశాఖలో వివిధ హోదాల్లో స్థిరపడిన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. మూడు దశాబ్దాల తరువాత మళ్లీ చౌడువాడలో కలుసుకున్న పాత మిత్రులు -
జేఈఈ అడ్వాన్స్డ్లో దొండపూడి విద్యార్థి ప్రతిభ
రావికమతం : మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన అడ్డూరి లీలా గణేష్ జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరిలో 2839 ర్యాంక్ సాధించాడు. లీలా గణేష్ విశాఖపట్నం శ్రీ విశ్వ కాలేజ్లో ఇంటర్ చదివాడు. ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు అడ్డూరి శ్రీను, సరోజిని సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. లీలా గణేష్ పదో తరగతి వరకు దొండపూడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 578 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వంలో జగనన్న అణిముత్యాలు అవార్డును మాజీ ప్రభుత్వ విప్ ధర్మశ్రీ చేతుల మీదుగా అందుకున్నాడు. గణేష్ జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించడంతో ఆ విద్యార్థిని కాలేజి అధ్యాపకులు, గ్రామ పెద్దలు అభినందించారు. -
వంచన.. వేదన
అక్రమ కేసులు.. దాడులు పెట్టుబడి సాయం ఏదీ.. నాకు నాతవరం మండలం గునిపూడి గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. గతేడాది నాలుగు ఎకరాల్లోనూ వరి పంట వేశాను. ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ప్రభుత్వం అందిస్తామన్న పెట్టుబడి సాయం అందించకపోవడం, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో నష్టం వచ్చింది. ధాన్యం కొనుగోలు దళారుల చేతుల్లో పెట్టడం వల్ల ధర పెంచలేదు. దీంతో బ్యాంక్ నుంచి తెచ్చిన వ్యవసాయ రుణం తీర్చలేకపోయాను. అసలుకు వడ్డీ కలిసి భారంగా మారింది. బ్యాంక్ నుంచి గతంలో తీసుకున్న రుణం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోతే నాకున్న నాలుగు ఎకరాల్లో సగం మాత్రమే వరి పంట వేస్తాను. – వి.సూరిబాబు, గునిపూడి, నాతవరం భర్త చనిపోయినాపింఛన్ రాలేదు.. ఎస్.రాయవరం మండలంలో హోం మంత్రి క్యాంపు కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరుప్రోలు గ్రామం మాది. నా భర్త చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా పింఛన్ మంజూరు కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది కాలంలో భర్తలు చనిపోయిన చాలా మందికి పింఛన్ మంజూరు చేశారు. నా భర్త ముందే చనిపోవడం నేను చేసుకున్న పాపమా? 50 సంవత్సరాల వయసులో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నా ను. గత ప్రభుత్వం అందించిన కాపు నేస్తం, డ్వాక్రా నగదు ఎంతో కొంత ఆసరాగా ఉండేది. ఎన్నికల ముందు ఇచ్చిన దరఖాస్తు పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. అవి అయ్యాక ఏడాది కాలంగా నాయకుల చుట్టూ తిరిగినా పింఛన్ మంజూరు కాలేదు. – దమ్ము సత్యవతి, కొరుప్రోలు గ్రామం, ఎస్.రాయవరం మండలంక్రిమినల్ కేసులు బనాయించి తొలగించారు.. నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడకపోయినా.. తప్పులు చేయకపోయినా.. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నన్ను అన్యాయంగా తొలగించారు. హోం మంత్రి వంగలపూడి అనిత అప్పటి డ్వామా పీడీపై ఒత్తిడి తెచ్చి మరీ నన్ను తీసేయించారు. డ్వామా పీడీ సందీప్తో మాకు ఫోన్ చేయించి రాజీనామా చేయాలని చెప్పించారు. నేను చేయనని చెప్పాను. నాపై క్రిమినల్ కేసులు పెట్టి మరీ తొలగించారు. 16 ఏళ్లు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాను. మా యాక్ట్ ప్రకా రం తప్పు చేస్తే థర్డ్ పార్టీ విచారణ గానీ, క్వాలిటీ కంట్రోల్ విచారణ గానీ చేసి తొలగించాలి. కానీ దానికి విరుద్ధంగా నన్ను విధుల నుంచి తీసేశారు. నాపై ఎందుకింత కక్ష? – మేకా సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఈదటం, పాయకరావుపేట నియోజకవర్గం సాక్షి, అనకాపల్లి: వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య.. నమ్మిన వారిని నట్టేట ముంచడంలో ఘనాపాటీలు.. సూపర్ సిక్స్ మోసం ఫిక్స్ అని జనం గగ్గోలు.. తల్లికి వందనం అంటూ పంగనామాలు పెట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండో ఏట అడుగుపెడుతున్నా ఇంకా ఆ హామీ విద్యార్థుల తల్లిదండ్రులను ఊరిస్తూనే ఉంది. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, నెలకు రూ.1500ల ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. కూటమి ప్రభుత్వ నేతల అరాచకాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అణిచివేతకు గురిచేయడం.. లేదంటే వారిపై దాడులు, అడ్డు తొలగించేందుకు హత్యాయత్నాలతో అరాచకం.. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కూటమి నేతలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలతో బరి తెగించారు. లేటరైట్, ఇసుక, మద్యం, అక్రమ మైనింగ్, గ్రావెల్ మాఫియా చెలరేగిపోతున్నారు. వీధివీధినా బెల్టు షాపులతో విచ్చలవిడి మద్యంతో మహిళలపై దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పార్టీల అధినేతలే కాదు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. అడుగడుగునా దగా దగా అంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు. అర్హత ఉన్నాపింఛన్ కట్ చేశారు.. నాకు ఒక కన్ను పుట్టుక నుంచి పూర్తిగా కనిపించదు. రెండో కన్ను కూడా మసక మసకగా ఉంటుంది. కూలీ నాలీ చేసు కోలేని పరిస్థితిలో ఉన్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ వచ్చేది. ఆ సొమ్ముతో ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పింఛన్ తీసేశారు. నేను కూలికి కూడా వెళ్లలేకపోతున్నాను. నాకు ఏ కారణంగా పింఛన్ తీసేశారని కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇచ్చాను. కానీ ఇప్పటివరకూ పింఛను ఇవ్వలేదు. – వరలక్ష్మి, దివ్యాంగురాలు, పాకలపాడు, గొలుగొండ మండలంలబ్దిదారుల ఎదురుచూపులు.. ● జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’ కోసం సుమారు 2,65,778 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.1,063 కోట్ల పెట్టుబడి సాయం వారికి అందాల్సి ఉంది. ● ఏడాదికి 2,13,190 మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు వంతున రూ.319 కోట్లు అందాలి. రెండేళ్లకు కలిపి రూ.638 కోట్ల బాకీ ● ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున జిల్లాలో 18 ఏళ్లు దాటిన 5,47,888 మంది మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ ఏడాదికి రూ.986.19 కోట్లు అందించాలి. రెండేళ్లకు రూ.1972.38 కోట్ల బాకీ. ● అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 2.30 లక్షల మంది నిరుద్యోగులు. వారికి రూ.3 వేల వంతున నెలకు రూ.69 కోట్లు, ఏడాదికి రూ.828 కోట్లు ఇవ్వాలి. ● ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం జిల్లాలో 18 ఏళ్లు దాటిన మహిళలు 6,53,505 మంది, 5 నుంచి 18 ఏళ్ల బాలికలు 84,814 మంది ఎదురుచూస్తున్నారు. హామీలకు తూట్లు.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు చెప్పిన సూపర్ సిక్స్తోపాటు జిల్లాకు సంబంధించి మరో 143 హామీలు ఇచ్చారు. షరా మామూలుగా విస్మరించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూటమి నేతలు స్థానిక అంశాలపై అనేక వాగ్దానాలు చేశారు. వాటికీ అతీగతీ లేదు. పాయకరావుపేట బహిరంగ సభలో.. ఎన్నికలకు ముందు పాయకరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత అనేక హామీలు ఇచ్చారు. నక్కపల్లి డిగ్రీ కళాశాలకు నూతన భవనాల నిర్మాణం.. చిన దొడిగల్లులో అసంపూర్తిగా ఉన్న పీహెచ్సీ నిర్మాణం పూర్తి.. ఉద్దండపురంలో అసంపూర్తిగా ఉన్న వాటర్ గ్రిడ్కు నిధుల మంజూరు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు.. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్.. అడ్డురోడ్డు–నర్సీపట్నం రోడ్డు నిర్మాణం.. కోటవురట్ల మండలంలో రామచంద్రపురం జంక్షన్ నుంచి అడ్డురోడ్డు వరకు రహదారి నిర్మాణం... పాయకరావుపేట టౌన్లో మెయిన్ రోడ్డు విస్తరణ అందులో కొన్ని. వీటిలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. అనకాపల్లి సభలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి సభలో సీఎం రమేష్, కొణతాల రామకృష్ణతో కలిపి పలు హామీలు ఇచ్చారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా నూతన భవన సముదాయం నిర్మాణం.. కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు.. అనకాపల్లి టౌన్లో నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్ట్ తరలింపు.. ఆర్ఈసీఎస్ను ఏపీఈపీడీసీఎల్ నుంచి విడదీసి మళ్లీ స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ.. వడ్డాది దగ్గర పెద్దేరు నదిపై, విజయరామరాజు పేట వద్ద తాచేరు నదిపై వంతెనల నిర్మాణం, రోలుగుంట–వడ్డాది రోడ్డు నిర్మాణం పూర్తి, రావికమతంలో జూనియర్ కళాశాల నిర్మాణం.. అందులో కొన్ని. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏడాది కూటమి పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై 91 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు కూడా పాల్పడ్డారు. ● నర్సీపట్నం నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ● రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్య చేయించేందుకు కుట్రలు పన్నారు. ● కక్ష సాధింపుతో వైబీ పట్నా నికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇంటిని కూల్చేశారు. ● నర్సీపట్నం నియోజకవర్గం చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చేసి కొట్టి..12 మంది వైఎస్సార్సీపీ యువ నాయకులపై కేసులు నమోదు చేశారు. ● గత ఏడాది జూలై 9న మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. అడ్డుకున్న కొల్లి అప్పలనాయుడు తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావుపై కూడా కర్రలతో దాడి చేశారు. ● మాకవరపాలెంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టగా వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, పార్టీ నేత బండారు గాంధీపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు.చంద్రబాబు బృందానికి వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎన్నికల హామీలను నమ్మి ఓట్లేసిన వారికి వంచన.. సంక్షేమ పథకాలు అందక బతుకు భారమై సామాన్యుల వేదన.. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని ఏమాత్రం అనిపించినా వారిపై కక్షసాధింపు.. అక్రమ కేసులు.. శాంతిభద్రతలు అదుపు తప్పినా.. నేరాల సంఖ్య పెరుగుతున్నా.. సాక్షాత్తూ హోం మంత్రి సొంత జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.. గ్రావెల్ దోపిడీ, ఇసుక అక్రమ తవ్వకాలు,పైరవీలు, పథకాల పంపిణీలో అధికార పార్టీ నేతల పెత్తనం.. అంతా రాజకీయం.. ఇదీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సామాన్యుడు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్.. -
జిల్లాలో 32 శాతం రేషన్ పంపిణీ పూర్తి
అనకాపల్లి : చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమంలో నేటి వరకూ 32 శాతం పంపిణీ పూర్తి చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక 84వ వార్డు కోట్ని వీధి 15 వ నెంబర్ రేషన్ షాపు పరిధిలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి, భీమునిగుమ్మం వీధిలో వృద్ధురాలు ఇంటికి రేషన్ను ఆమె స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, వృద్ధులకు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ఆమె కోరారు. డిజిటల్ పేమెంట్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో 1069 రేషన్షాపులు ఉన్నాయని, వాటి ద్వారా ఐదు లక్షల ముప్ఫై వేల కార్డుదార్లకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగులు, కదలలేని స్థితిలోను, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు సుమారు 66 వేలు మంది ఉన్నారని, వారందరికీ రేషన్ డీలర్లు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. రెండు రోజుల లోపల శత శాతం పంపిణీ పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోపల మధ్యాహ్నం 12 నుండి 4 గంటల సమయంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు, వృద్ధులు జాబితా అందరి రేషన్ డీలర్ల వద్ద ఉందని వారికి ఇంటి దగ్గరే సరుకులు పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, జిల్లా సరఫరా అధికారి కె.ఎల్.ఎన్ మూర్తి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.