breaking news
Anakapalle District News
-
సర్
మా గడపకు రాలేదు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) అస్తవ్యస్తంగా సాగుతోంది. ఓవైపు ఎన్య్యుమరేషన్ ఫారాల అందక ఓటర్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరిగిపోయిందని కమిషన్కు నివేదించారు. యంత్రాంగం అధికారిక లెక్కలు ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించాల్సి ఉండగా చాలా గ్రామాల్లో ఓటర్లనే సచివాలయాలకు పిలిపించి, ఫారాలు నింపిస్తున్నారు. సాక్షి, అనకాపల్లి : ‘జిల్లాలో 98.49 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది.. ఇప్పటికే 37.21 శాతం ఫారాలు డిజిటలైజ్ చేశాం.’ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఉన్నతాధికారి సమర్పించిన లెక్కలివి.కానీ..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 50 శాతానికి పైగా బూత్ల పరిధిలో ఓటర్లు మా ఇంటికి ఎవరూ రాలేదు సర్ అని చెబుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది.‘సాక్షి’ పరిశీలించిన పలు ప్రాంతాల్లో ఒకే తరహా ఫిర్యాదులు వినిపించాయి. బీఎల్వోలతో పెన్షన్ల పంపిణీ ‘సర్’ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సిన బీఎల్వోలతో నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో పెన్షన్ పంపిణీ చేయించారని సమాచారం. ఈ నెల ఒకటి తేదీ నుంచి మూడు రోజుల పాటు వారు ఇదే పనిలో ఉండడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగలేదు. అధికారిక లెక్కల ‘మ్యాజిక్’ ‘సర్’లో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ఫారాల ఇవ్వాలన్నది నిబంధన. జిల్లాలో 13,02,389 మంది ఓటర్లు ఉంటే, అందులో ఏకంగా 12,82,714 మందికి ఫారాలు పంపిణీ చేసేశామని చెబుతున్నారు. కె.కోటపాడు, రోలుగుంట మండలాల్లో 100 శాతం, దేవరాపల్లి 99.99 శాతం,ఎస్.రాయవరం మండలంలో 99.95 శాతం పూర్తయిపోయిందని పేర్కొంటున్నారు. కానీ, ఆ మండలాల్లో మాత్రం 40 శాతానికి పైగా ప్రజలు ‘మా ఇంటికి ఏ అధికారీ రాలేదు.., మాకే ఫారాలు అందించలేదు’ అని చెబుతున్నారు డిజిటలైజేషన్ విడ్డూరాలు క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీపైనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ.. ఈ డిజిటలైజేషన్ ఏ ఆధారంగా జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సరిచూశారా? లేక పాత నమోదుల ఆధారంగానే ప్రక్రియ పూర్తవుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రశ్నలెన్నో.. సమాధానాలు కావాలి ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేయాల్సిన ప్రక్రియలో ఎందుకు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి?. 98.49 శాతం పంపిణీ పూర్తయిందంటే.. ఇంకా ఫారాలు అందలేదని చెబుతున్న కుటుంబాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలకు అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హడావుడి వెనుక ‘రాజకీయ కుట్ర’? ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ రాజకీయ వ్యూహం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండానే పంపిణీ పూర్తయిందని చెప్పడం ద్వారా, తమకు అనుకూలం కాని ఓట్లను సైలెంట్గా జాబితా నుంచి తొలగించేందుకు అధికార టీడీపీ కుట్ర పన్నుతోందన్న విమర్శలొస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ కాస్తా.. పక్కా ప్రణాళికతో జరుగుతున్న ‘ఓట్ల తొలగింపు‘ కార్యక్రమంగా మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
మందకొడిగా..
ఎన్యుమరేషన్ ఫారం ఇంకా ఇవ్వలేదు దేవరాపల్లి పంచాయతీలోని బూత్ నంబర్ 130లో నాకు ఓటు ఉంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కా ర్యక్రమంలో భాగంగా నాకు ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా అధికార్లు పట్టించుకోవడం లేదు. నాలాగే చాలా మందికి ఇంకా ఫారాలు ఇవ్వలేదు. అధికార్లు స్పందించి అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. –కొట్టాన వెంకట రమణ, ఓటరు దేవరాపల్లి కశింకోట/మునగపాక/దేవరాపల్లి/అనకాపల్లి టౌన్: జిల్లాలో ‘సర్’ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికి కేవలం 37 శాతం మేర మాత్రమే కార్యక్రమం పూర్తి అయింది. మిగిలిన 11 రోజుల గడువు ఉన్నా 63 శాతం మేర పూర్తి కావలసి ఉంది. దీంతో ఇది గడువులోగా పూర్తి అయ్యేనా? అర్హులందరికీ ఓట్లు లభించేనా? అని ఆందోళన వ్యక్తం అవుతోంది. కశింకోట మండలంలో సుమారు 57 వేల మంది ఓటర్లుండగా, 71 పోలింగ్ బూత్లున్నాయి. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించి, వివరాలను సేకరించి, నమోదు చేసి వారికి రసీదు ఫారం ఇవ్వాల్సి ఉంది. 2002 ఓటర్ల జాబితాతో ఓటర్ల వివరాలు బేరీజు వేయాల్సి ఉంది. ఇందుకు సచివాలయ, పంచాయతీ సిబ్బంది, బీఎల్ఎలను నియమించారు. వారు ఇళ్లకు వెళ్లి ఓటర్ల తనిఖీ నిర్వహిస్తున్నారు.ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటుండటం, సరైన వివరాలు లేక ఓటర్ల ఇళ్లు కనుక్కోవడం కష్టంగా మారింది. కొందరు వలసలు వెళ్లిపోవడంతో తనిఖీలో జాప్యం జరుగుతోంది. కొన్ని గ్రామాలు, కొన్ని బూత్లకు సంబంధించి కుటుంబాల్లో ఇద్దరు ఒక బూత్లోనూ, మరొకరు వేరొక బూత్లో ఉండడంతో ఓటర్లను గుర్తించేందుకు అవస్థలు తప్పడం లేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్ల్లో ఉండడంతో ఎన్యుమరేషన్ చేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు, సిబ్బంది అంటున్నారు. అయితే తమ వద్దకు అధికారులు ఇంకా రాలేదని, తమ ఓటు ఉంటుందా?ఊడుతుందా? అని ఓటర్లు మదన పడుతున్నారు. ●మేజర్ పంచాయతీ మునగపాకలో పలువురు బీఎల్వోలు సచివాలయానికి ఓటర్లను రప్పించి అక్కడే ఫారాలు నింపడంతో పాటు ఆన్లైన్ చేయడంతో గంటల కొద్దీ ఓటర్లు వేచి ఉండాల్సి వస్తోంది. బీఎల్ఏల సహకారం కూడా ఆశించిన మేర లేకపోవడంతో ఎన్యుమరేషన్ చేసేందుకు ఇబ్బందికరంగా ఉందంటూ పలువురు బీఎల్వోలు వాపోతున్నారు. మునగపాక మండల వ్యాప్తంగా 45,210మంది ఓటర్లు ఉన్నారు. 57 మంది బీఎల్వోలు ఉన్నారు. ఇంతవరకు 38శాతం మేర ఎన్యూమరేషన్ జరిగినట్లు డీటీ మురళీధర్ తెలిపారు. ●దేవరాపల్లి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, డిజిటైజేషన్ లోపాభూయిష్టంగా ఉంది. ప్రధానంగా మండల కేంద్రం దేవరాపల్లిలో పలువురికి ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు. పంపిణీ చేసిన ఫారాలను ప్రజల వద్దకు వెళ్లి బీఎల్వోలు సేకరించాల్సి ఉండగా ప్రజలను ఆఫీసులకు రప్పించుకుంటున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ● అనకాపల్లి నియోజకర్గంలోసర్ నత్త నడకన సాగుతోంది. అనకాపల్లి పట్టణంలో 32.52 శాతం, అనకాపల్లి మండలంలో 33.91, కశింకోటలో సుమారు 38 శాతం మాత్రమే డిజిటలైజేషన్ జరిగినట్టు అధికారులు తెలిపారు. అధికారులు ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చినా, ఓటర్లు వారి వివరాలు నింపి బీఎల్వోలకు అందజేయడంలేదు. ఎన్నికల కమిషన్ పదే పదే హెచ్చరిస్తున్నా చాలా మంది ఎన్యుమరేషన్ ప్రక్రియపై సరైన స్పష్టత లేక నిర్లక్ష్య వహిస్తున్నారు. దీంతో ఓటు కోల్పోయే ప్రమాదముంది. -
పెళ్లింట విషాదం
విద్యుత్షాక్తో వ్యక్తి మృతినక్కపల్లి: సీహెచ్బీ అగ్రహారంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.తన సోద రుడి కుమారుడు వివాహానికి సంబంధించి జరుగు తున్న ఏర్పాట్లలో వి ద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తిమరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కల్లూరి అప్పలరాజు(52)హెటెరో కంపెనీలో కా ర్మికుడిగా పనిచేస్తున్నాడు. తన సోదరుడి కుమారుడికి రెండు రోజుల్లో వివాహం జరగనుంది. ఇంటి వద్ద విద్యుత్లైటింగ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. శుక్రవారం లైటింగ్కు వైరు లాగుతు న్న సమయంలో స్పల్పంగా వర్షంపడింది. వైరుపై అప్పలరాజు కాలు వేయడంతో విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నక్కపల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం సహించేది లేదు
మాడుగుల: అర్హత ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరిగితే సహించేది లేదని కలెక్టరు విజయ కృష్ణన్ హెచ్చరించారు. ఒక నెల ఒక నియోజకర్గంలో నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా స్థానిక పీఆర్ వసతి భవనంలో శుక్రవారం ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఉపయోగపడాలని, తప్పులు దొర్లకుండా జాగ్రతలు తీసుకోవాలని, నాలుగు మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జమ్మాదేవి పేట ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకటరాజరామ్ కలెక్టర్కు ఽఅర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రజల నుంచి కలెక్టర్,ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, జేసీ శౌర్యమాన్ పటేల్,ఆర్డీవోలు వి.వి.రమణ, ఎస్.కె.ఆయిషా, డీఆర్వో శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శచీదేవి, నాలుగు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పాలిథిన్ సంచుల వినియోగం తగ్గించాలి మాడుగుల రూరల్: పాలిథిన్ సంచుల వినియోగం తగ్గించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మాడుగులలో స్వచ్ఛరథం సిబ్బంది పాత సామగ్రికి కొత్త వస్తువులు ఇస్తున్న తీరును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి, పొడిచెత్తను వేరు చేసి, రిక్షాలో వేయాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమలో స్థానిక ఎమ్మెల్యే బంగారు బండారు సత్యనారాయణమూర్తి, ఎండీపీవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యా బోధన
● ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి వినోద్బాబు మాట్లాడుతున్న వినోద్బాబు కె.కోటపాడు : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి మద్దిలి వినోద్బాబు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వడంతో పాటు పౌష్టిక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అంది స్తున్నట్టు చెప్పారు. అధ్యాపకులు తప్పనిసరిగా టీచింగ్ నోట్స్, డైరీని నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పైనా ప్రత్యేకశ్రద్ధ చూపి, వారి నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టాలని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగమణి పాల్గొన్నారు. -
ఆవాసం మారితే అవస్థలే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: 2024 ఎన్నికల్లో ఓటు వేశారు.. ఇప్పుడు అదే ఓటు జాబితాలో కనిపించడం లేదు. 2002లో ఓటే లేదు.. ఇప్పుడు పేరు ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు. చిరునామా మారితే ఒక సమస్య.. తండ్రి పేరులో చిన్న తేడా ఉంటే మరో సమస్య.. పెళ్లి తర్వాత ఇంటి పేరు మారిన మహిళలకు ఇంకో సమస్య.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)లో 2002 ఓటర్ల జాబితాతో జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియలో అనేక మంది ఓటర్లు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి పేరులో తేడా.. మ్యాపింగ్కు బ్రేక్ రవికుమార్ గతంలో ఈస్ట్పాయింట్ కాలనీలో నివసించేవారు. అప్పట్లో అదే చిరునామాతో ఓటరు జాబితాలో పేరు నమోదైంది. ప్రస్తుతం ఎంవీపీ కాలనీలోని వైశాఖి అపార్ట్మెంట్లో నివసిస్తూ, 2024 ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించారు. అయితే, ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఆయన పేరు మ్యాపింగ్ కాలేదు. ఆరా తీస్తే 2002 ఓటరు జాబితాలో ఆయన తండ్రి పేరు ‘గుడిమెట్ల సత్తిరెడ్డి’కు బదులుగా ‘రెడ్డి జీఎస్’గా నమోదైనట్లు గుర్తించారు. ఈ పేర్ల వ్యత్యాసం కారణంగానే మ్యాపింగ్ నిలిచిపోయింది. చివరకు పాత ఓటరు జాబితాను పరిశీలించి, సంబంధిత వివరాలను సేకరించి బీఎల్వోకు సమర్పించిన తర్వాతే సమస్య పరిష్కారమైంది. తండ్రి పేరులో నమోదైన చిన్న పొరపాటు వల్ల తన ఓటే గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2002లో ఓటు లేకపోతే.. కొత్త తిప్పలు కె.కృష్ణకాంత్కు 2002లో ఓటు హక్కు లేదు. ప్రస్తుతం అరిలోవలో నివసిస్తూ, 2024 ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించారు. అయితే సర్ ప్రక్రియలో ఆయన పేరు ఓటరు జాబితాలో కనిపించడం లేదు. 2002లో ఆయన తండ్రి సింహాచలం పేరుతో చీపురుపల్లిలో ఓటు నమోదై ఉండగా, ఇప్పుడు ఆ వివరాలు కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తన ఓటు హక్కు పునరుద్ధరణ కోసం ఏం చేయాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నానని కృష్ణకాంత్ వాపోతున్నారు. పైళ్లెన మహిళలకు మరో సమస్య 2002 తర్వాత పెళ్లి చేసుకుని మరో ప్రాంతానికి వెళ్లిన మహిళల పేర్లు గుర్తించడం కూడా కష్టంగా మారిందని పలువురు చెబుతున్నారు. ఇంటి పేరు, చిరునామా మారడంతో మ్యాపింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటింటికీ పంపిణీ ఎక్కడ..? జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా తమకు ఫారాలే అందలేదని పలువురు ఓటర్లు చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఐదుగురు ఓటర్లు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి, మిగిలిన వారికి అందజేయలేదని వాపోతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్నామని ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నా, అనేక ప్రాంతాల్లో మాత్రం సచివాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు ఓటర్లను పిలిపించి అక్కడికక్కడే ఫారాలు నింపించి తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారాలు స్వీకరించినట్లు బీఎల్వోలు రసీదులు ఇవ్వడం లేదని కూడా పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఫారాలు అందలేదని స్థానికులు చెబుతున్నారు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లకు ఫారాల పంపిణీ జరగలేదన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంటింటికీ ఫారాల పంపిణీ జరిగిందా? లేక కాగితాలకే పరిమితమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఉక్కు ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ జరపాలి
మహారాణిపేట(విశాఖ): స్టీల్ ప్లాంట్లోని ఎస్ఎంఎస్ విభాగంలో జూన్ 8న జరిగిన ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేసి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో రాణికి వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీజే అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన సభలో ప్రమాదంలో మృతి చెందిన 10 మంది కార్మికులకు నివాళులర్పిస్తూ నిమిషం పాటు మౌనం పాటించారు. జిల్లా జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, ఉక్కు పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, ఎన్.రామారావు, వైఎస్సార్టీయూ రీజనల్ అధ్యక్షుడు పి.వి.సురేష్, సీఎఫ్టీయూఐ జాతీయ అధ్యక్షుడు కనకారావు మాట్లాడుతూ ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం రూ.25 లక్షలు మాత్రమే ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో స్టీల్ ప్లాంట్ బాధితులకు కూడా పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఐఎఫ్టీయూ, ఏపీ ఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్టీయూ, ఐఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పెళ్లి మండపం వద్ద చోరీ
నర్సీపట్నం: నాతవరం పోలీసు స్టేషన్ పరిధి శృంగవరంలో ఓ పెళ్లి మండపం వద్ద నగదు బ్యాగ్ను చోరీ చేసిన వ్యక్తిని గంట వ్యవధిలో పోలీసులు అరెస్టు చేసి, రూ.5లక్షల నగదు, పావుతులం బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు అందించిన వివరాలు..నగదు కాజేసిన వ్యక్తి విద్యావంతుడు. ఇతను డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్నాడు. శృంగవరంలో ఈ నెల 2వ తేదీ రాత్రి పైల వారి వివాహ వేడుక జరిగింది. వధువు రమణమ్మ సోదరి రజని వివాహ ఖర్చుల నిమిత్తం రూ.5లక్షల నగదు, పావుతులం బంగారు కాసు, ఒక సెల్ఫోన్, చీర బ్యాగ్లో పెట్టుకుని పెళ్లి మండపం వద్ద కూర్చుంది. తెల్లవారుజాము 3.40 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పైల చిట్టిబాబు మండపంలోకి పరుగు పరుగున వచ్చి రజని వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసి వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె వెంటనే 112కి కాల్ చేసింది. నాతవరం స్టేషన్ బీట్ సిబ్బంది కానిస్టేబుల్ మహేష్, హోంగార్డు సంజీవ్ అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ సిగ్నిల్ సాయంతో గ్రామ శివారులో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్డి వాములో దాచిన నగదు బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. -
ఏయూ దూరవిద్యలో సర్టిఫికెట్లు సుదూరం!
విశాఖ విద్య: ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాల్సిన ఏయూ దూరవిద్యా కేంద్రం విద్యార్థుల పాలిట ఇబ్బందుల కేంద్రంగా మారుతోంది. మార్కుల జాబితాలు, ఒరిజినల్ డిగ్రీ(ఓడీ) సర్టిఫికెట్లు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలు(సీఎంఎం), బదిలీ ధ్రువపత్రాలు(టీసీలు) సకాలంలో అందించట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లరిగేలా ప్రదక్షిణలు దూరవిద్యా కేంద్రంలో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మార్కుల జాబితాలను సకాలంలో పోస్టు ద్వారా పంపించడం అధికారుల బాధ్యత. ఓడీలు, సీఎంఎంల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో పత్రాలు అందాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. నెలలు గడిచినా సర్టిఫికెట్లు అందకపోవడంతో దూరవిద్యా కేంద్రానికి పలుమార్లు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్యాలయానికి వెళ్లినా రేపు రండి, వారం తర్వాత రండి.. అనే సమాధానాలే వినిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. టీసీల జారీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమన్వయ లోపమే శాపం? దూరవిద్యా కేంద్రంలో ఏర్పడుతున్న సమస్యలకు సిబ్బంది మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు నిర్లిప్తత రాజ్యమేలుతోంది. పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పనులు పేరుకుపోతూ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెలలు గడిచినా సర్టిఫికెట్లు అందని పరిస్థితి గత ఏడాది మార్చి, నవంబర్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలు ఇప్పటికీ అందలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల దరఖాస్తుల కోసం ఈ సర్టిఫికెట్లు కొందరికి అత్యవసరం. అయినప్పటికీ వాటి జారీపై దూరవిద్యా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం. సమన్వయ లోపం ఉండదు. పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం. – ఆచార్య డి.అప్పలనాయుడు, డైరెక్టర్, ఏయూ దూరవిద్యా కేంద్రం -
స్టీల్ప్లాంట్ మృతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
పరవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎస్ఎంఎస్–1లో జూన్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.కోటి ప్రకటించి జ్యూడిషియల్ విచారణ జరిపించాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు వర్క్ర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్గేట్ వద్ద స్టీల్ప్లాంట్ ప్రమాద మృతులకు శుక్రవారం ఘన నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు పూర్తి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రవేటీకరణ విధానాలే కారణమన్నారు. నాశిరకం ముడి సరుకును వాడడం, యంత్రాల మరమ్మతులు చేయకపోవడం, అనుభవం ఉన్న కార్మికులను తొలగించడం, కార్మికులపై విపరీతమైన పనిభారం మోపడం వంటి కారణాలే ఈ ప్రమాదానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లిస్తూ క్షతగాత్రులకు రూ.50 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు గోవిందరాజు, నాగేశ్వరరావు, నాయుడు, శ్రీను, సత్తిబాబు, అప్పారావు, రమణ తదితరులు పాల్గొన్నారు. -
నర్సీపట్నం మదిలో అల్లూరి స్మృతులు
నర్సీపట్నం: అల్లూరి సీతారామరాజు పోరాట స్మ ృతులు నేటికీ నర్సీపట్నంలో సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గిరిపుత్రల పక్షాన..తెల్లదొరల దాస్య శృంఖాలల నుంచి విముక్తి కలిగించేందుకు అల్లూరి సీతారామరాజు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. గత చరిత్రకు సాక్షాలెన్నో నర్సీపట్నంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. దేశ స్వాతంత్య్ర ఉద్యమం స్మ ృతిచిహ్నాలతో అలనాటి బ్రిటిష్ పాలకుల పాలనను గుర్తుకు తెస్తుంది. ఈ పట్టణంలో అల్లూరి చేతులో హతమైన బ్రిటిష్ సైనికాధికారులైన హైవర్టు, కవర్టు సమాధులు, బ్రిటిష్ వారు నిర్మించిన ఏనుగుశాలలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న పలు బ్రిటిష్ కాలం నాటి భవనాలు గత చరిత్రను కళ్ల ముందు ఉంచుతాయి. ఆ భవనాలు రాతి కట్టడంతో రాజసం ఉట్టిపడే విధంగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ భవనాల్లో ప్రస్తుతం సబ్కలెక్టర్, తహసీల్దార్, సబ్ట్రెజరీ కార్యాలయాలు, సబ్జైలు నిర్వహిస్తున్నారు. సబ్ట్రెజరీ కార్యాలయం లోపల గల మెట్ల మార్గం గుండా భవనంపైకి వెళ్లవచ్చు. ఈ పైభాగంలో ప్రత్యేకంగా ఉన్న ఒక గదిలో అప్పట్లో జవాను ఒకరు కాపలా ఉండేవాడు. అప్పట్లో ఈ కార్యాలయంలో సమయాన్ని తెలియజేస్తూ గంటలు కూడా మోగించేవారు. మన్యం ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ వారి శ్రమను దోపిడీ చేసేవాడని పేర్కొంటున్న తెల్లదొర బాష్టియన్ అప్పుడు ఇదే భవనాన్ని కార్యాలయంగా చేసుకుని తహసీల్దార్గా పనిచేశారు.సబ్ కలెక్టర్ కార్యాలయం భవనం కూడా బ్రిటిష్ పాలకులు నిర్మించిందే. -
కుప్పకూలిన కల్వర్ట్
● 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలుకూలిపోయిన కల్వర్టు నక్కపల్లి: మండలంలో గొడిచర్ల, కొత్తూరు గ్రామాల మధ్య గల కల్వర్టు శుక్రవారం కుప్పకూలిపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే గొడిచర్ల, కొత్తురు మధ్య ఆర్అండ్ బీరోడ్డులో గల కల్వర్టు భారీ వాహనాల రాకపోకల వల్ల కూలిపోయింది. దీంతో జాతీయరహదారి మీదుగా గొడిచర్ల, కొత్తూరు, డొంకాడ, ముకుందరాజుపేట, జగన్నాథపురం, చీడిక, దోసలపాడు, రేబాక, రమణయ్యపేట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు తమ గ్రామాలకు చేరుకోవాలంటే అదనంగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉద్డండపు రం మీదుగా వెళ్లాల్సి వస్తోందని ఆయా గ్రామా ల ప్రజలు వాపోతున్నారు. -
11 మంది ఎస్ఐల బదిలీ
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్ఐలకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె.ఖాదర్ బాషాను వన్టౌన్ లా అండ్ ఆర్డర్ నుంచి ఎంవీపీ లా అండ్ ఆర్డర్కు, ఎం.శిరీష్కుమార్ను కంచరపాలెం క్రైమ్ నుంచి వన్టౌన్ లా అండ్ ఆర్డర్కు, జి.వెంకటరావును పద్మనాభం క్రైమ్ నుంచి అరిలోవ క్రైమ్కు, ఎస్.శ్రీకాంత్ను సీఎస్బీ నుంచి పీసీఆర్, ఎయిర్పోర్టు ట్రాఫిక్కు అటాచ్మెంట్పై, కొమర శ్రీనివాసరావును ఎయిర్పోర్టు ట్రాఫిక్ నుంచి సీఎస్బీకి బదిలీ చేశారు. పదోన్నతిపై విశాఖ రేంజ్ నుంచి సిటీ కమిషనరేట్కు వచ్చిన టి.కె.మూర్తికి పోలీస్ కంట్రోల్ రూమ్, పి.జనార్దనరావుకు సిటీ వీఆర్ (ఐటీ సెజ్–మధురవాడ అటాచ్మెంట్), టి.శ్రీనివాసరావుకు పద్మనాభం క్రైమ్, ఎన్.ధనుంజయ ఆచార్యులకు సీసీఎస్, ఎ.రహమాన్కు సీసీఎస్ (సీటీఆర్బీ అటాచ్మెంట్)లో పోస్టింగ్లు ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం త్రీటౌన్ క్రైమ్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కు అటాచ్గా పనిచేస్తున్న ఎం.రాజారావును ఆయన అభ్యర్థన మేరకు మహిళా పోలీస్ స్టేషన్కు రెగ్యులర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావుకు బదిలీ మహారాణిపేట: మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావుకు బదిలీ అయింది. నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.బి.ఎస్.వర్దన్ను విశాఖ జిల్లా మత్స్యశాఖ జేడీ(ఇన్చార్జి)గా నియమించారు. శనివారం వర్దన్ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. నేడు పాండ్రంగిలో అల్లూరి జయంతి మహారాణిపేట : పద్మనాభం మండలం పాండ్రంగిలో శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు జరుగుతాయని కలెక్టరు ఎం.అభిషిక్త్ కిషోర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఆ గ్రామంలో అల్లూరి సీతారామరాజు ఇంటి నుంచి భరతమాత గుడి వరకు విద్యార్థులు, కళాకారులతో ర్యాలీ, అనంతరం బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
ప్రశాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీ.. నలుగురు అరెస్టు
తాటిచెట్లపాలెం(విశాఖ): భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ప్ర యాణికులను లక్ష్యంగా చేసు కుని దోపిడీలకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), విశాఖపట్నం డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ప్రశాంతి ఎక్స్ప్రెస్లోని వివిధ బోగీల్లో నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), విశాఖపట్నం సిటీ పోలీసులు, విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో కొద్ది గంటల్లోనే గోకుల్ థియేటర్ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.43,800 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తుని జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. హత్యాయత్నం కేసులో రౌడీషీటర్లకు నాలుగేళ్ల జైలు గాజువాక : గాజువాకలో 2017లో జరిగిన ఒక హత్యాయత్నం కేసులో ఇద్దరు రౌడీషీటర్లకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మెహర్నగర్కు చెందిన పీతల బాల భవాని భర్త అదే ప్రాంతానికి చెందిన పి.మహలక్ష్మినాయుడుకు రూ.5వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు మొత్తం తిరిగి ఇవ్వాలని అడిగిన భవాని భర్తతో నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు. దీంతో 2017 జనవరి 2వ తేదీ రాత్రి నిందితులు పి.మహలక్ష్మినాయుడు, పి.గౌరీసాయి అలియాస్ గుర్రాల సాయి బాధితుడి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. స్టీల్ ఫోర్క్తో బాధితుడి కంఠ భాగంలో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాల భవాని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివరాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితులకు జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. -
ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షా కేంద్రాల తనిఖీ
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ పరీక్షా కేంద్రాలను ఏయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్.వి.ఎస్.చిట్టిబాబు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన మౌలిక సౌకర్యాలు, నిబంధనల అమలు తీరును ఆయన పరిశీలించారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఏయూ పీజీ, ప్రొఫెషనల్ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ వై.అబ్బులు సైతం స్పెషల్ డ్రైవ్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
మన్యం వీరుడి స్మారకాలు వెలవెల
మన్యం వీరుడు అల్లూరి జయంతి, వర్ధంతి వేడుకలంటే కేవలం పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, ఫొటోలకు ఫోజులిచ్చే కార్యక్రమాలు మాత్రమేనా? మన్యం ప్రాంతంలో ఆయన పోరాట స్ఫూర్తిని సజీవంగా ఉంచాల్సిన స్మారక చిహ్నాలు నేడు నిధుల లేమితో, నిర్లక్ష్యంతో పర్యాటకుల ముందు వెక్కిరిస్తున్నాయి. శనివారం జయంతి సందర్భంగా అల్లూరి నడయాడిన మంప, రాజేంద్రపాలెం పార్కులదయనీయ స్థితిపై ప్రత్యేక కథనం. ● హామీల కేరాఫ్ అడ్రస్గా అల్లూరి గుర్తులు! ● నేడు అల్లూరి జయంతి కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. స్వాతంత్య్ర సంగ్రామంలో సింహస్వప్నం. కానీ, నేడు ఆ మహనీయుడి స్మారకాలు మాత్రం అనాదరణతో కుమిలిపోతున్నాయి. ఏడాదికి రెండుసార్లు జయంతి, వర్ధంతి పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించడం.. అంతే! ఆ తర్వాత మళ్లీ మౌనమే. ఆచరణకు నోచుకోని హామీల మధ్య అల్లూరి నడయాడిన మంప, రాజేంద్రపాలెం ప్రాంతాలు నేడు పర్యాటకుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. అందని నిధులు.. ఆగిపోయిన పనులు అల్లూరి పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ ప్రాంతాలను పర్యాటక కారిడార్గా మారుస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గతంలో రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు నిధులతో రాజేంద్రపాలెంలో ప్రహరీ వంటి పనులు కొంతవరకు జరిగాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరితో పాటు గంటం దొర, మల్లు దొర, బోనంగి పండు పడాల్ వంటి యోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మంపలో అస్తవ్యస్తం అల్లూరి పట్టుబడిన మంప ప్రాంతంలో పార్కు ఆవరణను కొంతవరకు అభివృద్ధి చేసినా, అక్కడ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అల్లూరి స్నానం చేసే కొలనును సుందరీకరించినప్పటికీ, ప్రస్తుతం అది పిచ్చి మొక్కలతో నిండిపోయి కనుమరుగవుతోంది. కొలను మధ్యలో ధ్యానముద్రలో ఉన్న అల్లూరి విగ్రహం మాత్రమే సందర్శకులను ఆకట్టుకుంటోంది. అయితే, స్మారక స్తూపాలపై కనీసం అల్లూరి జనన, మరణ వివరాలు కూడా లేకపోవడం గమనార్హం. పోరాట చరిత్రను కళ్లకు కట్టేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు ఖాళీగానే దర్శనమిస్తూ, చారిత్రక సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయనే భావనను కలిగిస్తున్నాయి. మళ్లీ కొత్త ఆశలు.. మరి ఫలితం దక్కేనా? ఈ ఏడాది మే 7న అల్లూరి వర్ధంతి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ మంప, రాజేంద్రపాలెం పార్కులను సందర్శించారు. ఒక్కో పార్కుకు రూ. కోటి చొప్పున మొత్తం రూ. రెండు కోట్లు కావాలని కేంద్ర మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా నిధుల కోసం హామీ ఇచ్చారని మాధవ్ తెలిపారు. రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ఈ తాజా హామీలైనా అమలుకు నోచుకుంటాయా? లేక పాత హామీల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోతాయా? అన్నది స్థానికుల ప్రశ్న. పర్యాటకులు వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఇక్కడి దుస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారంటే, మనం చరిత్రను ఎంతలా విస్మరిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, మన్యం వీరుడి స్మృతి చిహ్నాలకు పూర్వవైభవం కల్పిస్తారని ఆశిద్దాం. జీతం ఇస్తున్నారు గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట పార్కుల్లో ఉన్న వాచ్మెన్లకు జీతాలు ఇస్తుంది. దీంతో పార్క్లను కొంత వరకు శుభ్రంగా ఉంచుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి నెల నెల జీతాలు ఇస్తున్నారు. – రాజుబాబు, వాచ్మెన్, అల్లూరి పార్కు, మంప -
టెన్త్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి
● డిప్యూటీ డీఈవో అప్పారావు విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో అప్పారావు మాడుగుల: టెన్త్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డిప్యూటీ డీఈవో అప్పారావు ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల పరిషత్ బాలురు, బాలికల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి, బోధన ఎలా ఉంది, పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా ? లేదా ? మధ్యాహ్న భోజనం ఎలా ? ఉంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2025–26లో టెన్త్లో శత శాతం ఫలితాలు సాధించడంతో హెచ్ఎంలు, హిమబిందు, ముత్యాల నాయుడులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు ఈశ్వరరావు, దేముడమ్మ, ఎంఆర్సీ సిబ్బంది నాగేంద్ర, రాజు, సీఆర్పీలు పాల్గొన్నారు. -
సచివాలయాలు నిర్వీర్యం
అన్ని వర్గాల ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలందించేవారు.సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండేవారు. పలు రకాల సేవలను సకాలంలో అందించేవారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఇంటి వద్దకే సేవలందించేవారు. నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. సిబ్బంది సంఖ్యను తగ్గించేయడంతో ప్రజలకు సేవలు సకాలంలో అందడం లేదు.పేర్లు మార్పుపై ఉన్న శ్రద్ధ ప్రజలపై చూపించడం లేదు.సేవలు తగ్గడంతో సచివాలయాలు నేడు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. –రాజాన బుజ్జి, సామాజిక సేవా కార్యకర్త, మునగపాక -
రైతుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం
కూటమి హయాంలో రైతులకు భరోసా లేకుండా పోయింది. సీజన్లో యూరియా, విత్తనాల పంపిణీ సకాలంలో జరగడం లేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు అందడం లేదు.గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమయ్యే పలు రకాల సేవలు సకాలంలో అందేవి. నేడు అటువంటి పరిస్థితులు లేవు. దీనికి తోడు రైతుల సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో రైతుకు భరోసా ఉండేది. నేడు కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పని చేస్తుంది. –బొడ్డేడ చెల్లయ్యనాయుడు, రైతు, మూలపేట -
‘వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్’పై కేంద్ర బృందం పరిశీలన
ఆనందపురం: ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీవోపీ) కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు హరీత్ సింగ్, సృష్టి గుప్తా గురువారం విశాఖ జిల్లాలో పర్యటించారు. జిల్లాకు గుర్తించిన ‘సీ ఫుడ్ క్లస్టర్’ పరిశీలనలో భాగంగా మండలంలోని వెల్లంకి గ్రామంలోని ఓ ప్రైవేట్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించి, రొయ్యలు, చేపల ప్రాసెసింగ్, ఎగుమతి విధానాలను పరిశీలించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారిణి వి. పద్మ, అభివృద్ధి అధికారులు బి. లీలాకుమార్, కె. ముఖర్జీ క్లస్టర్ పనితీరును కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం విశాఖ ఫిషింగ్ హార్బర్ను సందర్శించిన బృందం సముద్ర ఆహార ఉత్పత్తుల లభ్యతపై ఆరా తీసింది. రామానాయుడు స్టూడియో సమీపంలోని ప్రతిపాదిత ‘యూనిటీ మాల్’ స్థలాన్ని కూడా పరిశీలించింది. పర్యటన ముగింపులో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. -
లయ తప్పినసచివాలయాలు
మెలిపాకలోని రైతు భరోసా కేంద్రం(ఫైల్)మునగపాక: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మార్క్ పాలనకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. 2019 నుంచి 2024 వరకు ప్రజలకు ప్రజా రంజక పాలన అందింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పలు సంక్షేమ పధకాలతో పాటు పలు సంస్కరణలు అమలు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది. కాగా జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన పలు పధకాలకు పేర్లు మార్చడంతో పాటు.. సంక్షేమ పథకాలు ఎపుడు అందుతాయో తెలియక అయోమయానికి గురవుతున్న సందర్భాలు నేటి కూటమి హయాంలో ప్రజలకు ఎదురవుతున్న అనుభవం. ప్రజలకు చేరువగా పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో సచివాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిస్తే...ఆ రెండింటినీ నిర్వీర్యం చేసి, నాటి సంక్షేమ పథకాలకు పాతర వేస్తున్న ఘనత నేటి కూటమి పాలకులకు దక్కుతుంది. నాడు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా... గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందుకోసం లక్షలాది మందిని ఉద్యోగులను నియమించింది. వార్డు సచివాలయాల్లో 12 మంది అలాగే గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున సిబ్బందిని నియమించారు. ప్రజలకు అవసరమయ్యే పలు సేవలను స్థానికంగా ఉండే సచివాలయాల్లో సకాలంలో అందేవి.మరో అడుగు ముందుకేసి ప్రజలు సచివాలయాలకు కూడా రాకుండా ఉండేలా వలంటీర్ల సహకారంతో గత ప్రభుత్వం ఇంటి ముంగిటకే సేవలందించింది. సచివాలయాలు అటు సిబ్బందితోనూ అలాగే ప్రజలతోనూ కళకళలాడేవి, సౌలభ్యమైన పౌరసేవలతో అయిదేళ్ల పాటు ఒక స్వర్ణయుగంగా పాలన సాగిందనే చెప్పాలి. ఒక్కో సచివాలయ భవన నిర్మాణానికి రూ.45 నుంచి రూ.48 లక్షల వరకు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దారు. ఉద్యోగుల కుదింపుతో అందని సేవలు రైతులు తమకు కావాల్సిన అడంగల్,1 బీ రికార్జులు అలాగే విద్యార్దులు తమకు కావాల్సిన పలు రకాల సర్టిఫికెట్ల కోసం సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే సిబ్బంది పూర్తిస్థాయిలో లేక ప్రజలు తమకు అవసరమయ్యే సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సచివాలయాలకు పేర్లు మార్చడం కూడా విమర్శలకు తావిస్తుంది. గత వైఎస్సార్సీపీ హయాంలో సేవలు పొందేందుకు వీలుగా పలువురు ఉద్యోగులు అండుబాటులో ఉండేవారని నేడు కూటమి హయాంలో ఉద్యోగుల కుదింపుతో కష్టాలు తప్పడం లేదంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉన్న కాస్తో కూస్తో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ జనం వాపోతున్నారు. రైతులకు భరోసాగా నాడు ఆర్బీకేలు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నదాత కోసం రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమయ్యే సేవలను అందించేందుకు విలేజ్ అగ్రికల్చర్ అధికారులను నియమించారు. అలాగే రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు రైతు భరోసా కేంద్రాల్లో గ్రంథాలయాల నిర్వహణతో పాటు పలు పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. సీజన్లో రైతులకు అవసరమయ్యే ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉండేవి. జిల్లా వ్యాప్తంగా 24 మండలాల పరిధిలో 486 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో కేంద్రానికి రూ.22 లక్షల వంతున నిధులు కేటాయింపులు జరిపి భవనాలను నిర్మించారు. కూటమి అఽధికారంలోకి వచ్చాక హేతుబద్దీకరణలో భాగంగా 294 సేవాకేంద్రాలకు పరిమితం చేశారు. నిర్లక్ష్యం బారిన రైతు సేవా కేంద్రాలు జననేత పథకాలకు కూటమి తూట్లు గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు పాలనలో బీటలు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పేరు మార్చి..సేవలు తగ్గించి... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల పేరును మార్చి వేశారు. రైతు సేవా కేంద్రాలుగా మార్పులు చేశారు.గతంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంటే నేడు రేషనలైజేషన్ పేరిట రెండు,మూడు గ్రామాలకు ఈ రైతు సేవా కేంద్రాలను తగ్గించి వేశారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగా ఉండే రైతులు సేవలు పొందేవారు. నేడు కూటమి పాలనలో రైతు సేవా కేంద్రాలు వచ్చాక ఇబ్బందులు పడుతున్నారు. రెండు,మూడు గ్రామాలకు రైతు సేవా కేంద్రం ద్వారా విత్తనాలు,ఎరువులు అందిస్తున్నారు. దీంతో రైతులు అవస్థలు పదుతున్నారు. గంటల కొద్దీ ఎరువులు,విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కుంటున్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన పథకానికి పేర్లు మార్చి కొత్తగా రైతు సేవా కేంద్రంగా నామకరణాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదంటూ రైతులు వాపోతున్నారు. వలంటీర్లపై కక్ష కట్టి.. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 1188 వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. వాటిలో వార్డు పరిధిలో 435 సచివాలయాలు కాగా గ్రామ పరిధిలో 753 సచివాలయాలు అందుబాటులో ఉండేవి.దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిబ్బంది సంఖ్యను కుదించేలా చర్యలు చేపట్టింది. సచివాలయాలకు ప్రాధాన్యం తగ్గించేలా తొలుత వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. తరువాత క్రమేణా పలువురు ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు కేటాయింపులు చేయడంతో నేడు సచివాలయాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.సచివాలయాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.ఏ పని కావాలన్నా పదేపదే సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను ప్రజలు ఎదుర్కుంటున్నారు. కొంతమంది సచివాలయ ఉద్యోగులకు రెండు, మూడు సచివాలయ బాధ్యతలను అప్పగించడంతో ఏ అధికారి ఎపుడు అందుబాటులో ఉంటారో తెలియక అవస్థలు పడాల్సి వస్తుంది. -
వీబీజీరామ్జీ పథకం పల్లె సీమల ప్రగతికి వరం
గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్ తుమ్మపాల: వికసిత భారత్ – 2047 కలను సాకారం చేసేందుకు మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో గురువారం వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అమలు కార్యక్రమాన్ని ఆమె భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికసిత భారత్ –2047 కలను సాకారం చేసేందుకు మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలుపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) పథకం పల్లెసీమలు ప్రగతికి గొప్పవరం అని, ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) అనేది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి, సంక్షేమ కార్యక్రమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్ట బద్ధమైన హామీని ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబానికి 125 రోజులు పాటు ఉపాధి కల్పిస్తారని, వ్యవసాయ పనుల సమయంలో ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రకటన ద్వారా 60 రోజులు పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు. మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు ఉపాధి హామీ అందుబాటులో ఉంటుందన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఈ కార్యక్రమంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలు, కర పత్రాలు ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నిర్మలా దేవి, అదనపు పీడీ మణికుమార్, ప్రత్యేక అధికారి శ్రీ రామమూర్తి, మహిళా రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. -
జగన్ పాలనే సువర్ణ యుగం
వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సువర్ణయుగం. అయిదేళ్ల పాటు ప్రజలకు మెరుగైన సేవలందించారు.సంక్షేమ పథకాలు అందిస్తూ గ్రామాలు సస్యశ్యామలంగా తయారుకావడంపై జగన్మోహన్రెడ్డి దృష్టి సారించేవారు. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలందేవి. దీనికి తోడు సచివాలయ వ్యవస్థ అలాగే రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజారంజక పాలన అందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమనే చెప్పాలి. నేటి కూటమి ప్రభుత్వం హయాంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు.నాటి పథకాలకు పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదు. –కరణం ధర్మశ్రీ, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త -
నూకాంబిక సన్నిధిలో వీఎంఆర్డీఏ చైర్మన్
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని గురువారం వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని కుటుంబ సమేతంగా నూతన ఆలయంలో దర్శించుకోవడం అభినందనీయమన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో పలు అభివృద్ధి కార్యాక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీనులు ప్రణవ్గోపాల్ను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.కనకమహాలక్ష్మికిపంచామృతాభిషేకం డాబాగార్డెన్స్: బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి దేవస్థానంలో గురువారం త్రికాల పంచామృతాభిషేకం జరిపారు. ఈ సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తులు రూ.1,000 పూజా రుసుం చెల్లించి పూజలో పాల్గొనవచ్చు. ఈ ప్రత్యేక పూజను పరోక్ష పద్ధతిలో చేసుకునే ఆసక్తి గల భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్, అకౌంట్ నంబర్ 060810011006691, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0806081లో చెల్లించవచ్చు. -
ఉపాధి హామీ.. ఇక రాం‘రాంజీ’
మహారాణిపేట: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ఇకపై ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్(వీబీజీ రామ్జీ)’పేరుతో అమలుకానుంది. జూలై నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుపతిలో గురువారం అధికారికంగా ప్రారంభించారు. పేరు మార్పుతో సహా, నూతన చట్టంలోని నిబంధనలపై కార్మిక వర్గాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత నెలకొంది. 20 ఏళ్ల తర్వాత పేరు మార్పు గ్రామీణ పేదలకు స్వగ్రామంలోనే ఉపాధి కల్పించి వలసలను నిరోధించాలనే లక్ష్యంతో 2006లో ప్రారంభమైన ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏడాదికి 100 రోజులుగా ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచింది. రోజువారీ కూలీని రూ.311గా కొనసాగిస్తూ, గ్రామపంచాయతీల్లో కూలీల అవసరాల ఆధారంగా బడ్జెట్ కేటాయించనుంది. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే 15 రోజుల్లో నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధన తీసుకొచ్చింది. సాంకేతిక పర్యవేక్షణకు ప్రాధాన్యం పథకంలో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) యాప్, ఫేషియల్ అటెండెన్స్, బయోమెట్రిక్, జియో ట్యాగింగ్, రియల్టైమ్ డ్యాష్బోర్డ్ వంటి సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టారు. పని ప్రారంభం, ముగింపు సమయంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. దీంతో దొంగ మస్తర్లకు అడ్డుకట్ట పడనుండగా, సర్వర్ సమస్యలు, మొబైల్ సిగ్నల్ లేకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో.. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల పరిధిలో 645 గ్రామపంచాయతీల్లో 2,71,728 మంది జాబ్కార్డుదారులు ఉన్నారు. వీరిలో 2,43,472 మందికి ఉపాధి కల్పించారు. విశాఖ జిల్లాలోని నాలుగు మండలాల్లో 79 గ్రామపంచాయతీల పరిధిలో 56,324 మంది జాబ్కార్డుదారులు ఉండగా, 32,029 మందికి ఉపాధి లభించింది. రెండు జిల్లాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ప్రహరీ గోడలు, కేటిల్ షెడ్లు, జలధార, జలహారతి, పల్లె పండుగ, పండ్ల తోటల అభివృద్ధి, నీటి సంరక్షణ, పశువుల తొట్టెల నిర్మాణం తదితర పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చేపట్టిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –నిర్మలదేవి, డ్వామా పీడీ, విశాఖ, అనకాపల్లి జిల్లాలు -
’ఏయూ–సేతు’ అలుమ్ని మెంటార్షిప్ ప్రారంభం
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల అనుభవాన్ని ప్రస్తుత విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో ’ఏయూ–సేతు’ పేరుతో అలుమ్ని మెంటార్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్య, పరిశ్రమ, పరిశోధన, పారిశ్రామికవేత్తలు, ప్రజాసేవ తదితర రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను ప్రస్తుతం చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులతో అనుసంధానించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించిన బ్రోచర్ను వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ విడుదల చేశారు. డీన్ ఆచార్య పి.శ్యామల మాట్లాడుతూ ఏయూ–సేతు తరతరాల విద్యార్థులను అనుసంధానించే వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించినట్టు తెలిపారు. -
రిజిస్ట్రేషన్లకూ...పీపీపీ!
నక్కపల్లి: ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ప్రైవేటు పరం కానున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను ఇకనుంచి పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 396 నుంచి విడుదల చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధానాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేస్తే అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు, వివిధ వర్గాల వారు దస్తావేజు లేఖర్లు సంఘం వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భూముల వివిధ రకాల ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలైన రిజిస్ట్రేషన్లు, స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు, దస్తావేజుల తయారీ, రికార్డుల నిర్వాహణ తదితర సేవలను ఇక నుంచి పీపీపీ విధానంలో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ను శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు.. పాస్పోర్టు సేవాకేంద్రాల మాదిరిగా పౌరులు నిర్ణీత సమయంలో నమోదు పత్రాలు పొందడం, సమగ్ర సౌకర్య సేవలను పొందడం కోసం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటిని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (ఆర్ఎస్కేలు)గా పరిగణించాలని నిర్ణయించారు. సింగిల్ విండో కేంద్రాలుగా పరిగణిస్తున్న ఈ కార్యాలయాల్లో ఏనీవేర్ రిజిస్ట్రేషన్, ఆడ్వాన్స్ స్లాబ్ బుకింగ్ ఇంటి గ్రేటెడ్ పేమెంట్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. దస్తావేజుల తయారీ ప్రైవేటు సంస్థలే చేపడతాయి. రిజిస్ట్రేషన్ ఆమోదానికి ముందు జరిగే ప్రక్రియ అంతా కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేటు సంస్థలే చేపడతాయి. రిజిస్ట్రేషన్ ఆమోదం మాత్రం సబ్ రిజిస్ట్రార్లే చూడాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి చట్టబద్ధమైన నియంత్రణ అంతా ప్రభుత్వం వద్దే పటిష్టంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది. రిజిస్ట్రేషన్కు సంబంధించిన దస్తావేజులకు రూ.2వేలు రుసుము చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. లేఖర్ల ఉపాధికి దెబ్బ.. పోలవరం, అల్లూరి జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనే పీపీపీ విధానంలో ఆర్ఎస్కేలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ దస్తావేజుల తయారీ, ఆడ్వాన్స్ స్లాట్ బుకింక్, స్టాంప్ డ్యూటీ వసూలు, డేటా అంతా ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ అంతా దస్తావేజు లేఖర్లు చేసేవారు. ఇక నుంచి దస్తావేజు లేఖర్లకు బదులు పీపీపీ విధానంలో ఎంపికై న సంస్థలు ఈ ప్రక్రియను చేపడతాయి. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్లతో పాటు, వారికి సహాయకులుగా ఉండేవారు ఉపాధి కోల్పోతారంటూ లేఖర్లు ఆందోళన చేపట్టారు. -
వానాకాలం...జీవాలు పదిలం...
మాడుగుల: వర్షాకాలం ప్రారంభం కావడంతో మూగ జీవులకు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. జోరీగలు, దోమలు వల్ల గొంతువ్యాపు, గాలికుంటు, తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముందస్తు జాగ్రతలు వల్ల ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చునని పశువైద్యాధికారులు చెబుతున్నారు. చిటికి వ్యాధి వర్షాకాలం ప్రారంభం కావడంతో పచ్చిక చిగురులు రావడంతో మేకలు, గొర్రెలు, వీటితో పాటు సూక్ష్మజీవులను తినడం వల్ల కడుపులోకి వెళ్లి విష పదార్థాలు విసర్జించడం వల్ల జీవాలు చెంగున ఎగిరి మృత్యువాత పడతాయి. కొన్నిసార్లు కాళ్లు బిగించి ఊపిరాడక మృతి చెందుతాయి. వర్షాకాలం ముందు ఈ చిటికి వ్యాధి ప్రబలకుండా నాలుగు నెలలు పైబడి గొర్రె పిల్లలకు నివారణ టీకాలు వేసుకోవాలి. గొంతువ్యాపు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో గొంతువ్యాపు (గురకవ్యాధి) ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకిన జీవాలకు ఉష్ణోగ్రత పెరిగి గొంతువాపు వచ్చి శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఈ వ్యాధులు ప్రబ లకుండా వర్షాకాలం ముందు టీకాలు వేయించాలి. ముందస్తు వ్యాక్సిన్ వేయించాలి వర్షాల్లో పశువులను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మేతకు తీసుకువెళ్లినపుడు తుప్పలు ఉన్న చోట పాము కాటుకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. తగిన మోతాదులు మేత వేయాలి. ఉరుములు, మెరుపులు వచ్చినపుడు పశువులను పాకల్లో ఉంచాలి. సీజనల్గా ముందస్తుగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయించాలి. –వి. చిట్టినాయుడు, ఏడీ మాడుగులసీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షాకాలంలో జీవాలను పాకల్లో ఉంచాలి చిత్తడి, బురద నేలలో జీవాలను తోలరాదు ముందుజాగ్రత్తగా యాంటీ బయోటిక్ వేక్సిన్లు వేసుకోవాలి ఎటువంటి వ్యాధి లక్షణాలున్నా సరే పశువైద్యులను వెంటనే సంప్రదించాలి -
బ్రిడ్జిలో ఇరుక్కుని ఒకరి మృతి
పూసపాటిరేగ: భోగాపురం మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భోగాపురంలోని హనుమాన్ జంక్షన్ నుంచి ముక్కాం వైపు వెళ్తున్న డీజే సౌండ్ సిస్టం వ్యాన్పై టాప్లో కూర్చున్న ఇద్దరు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి టాప్, వ్యాన్ మధ్య ఇరుక్కుపోవడంతో విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జంగులూరు గ్రామానికి చెందిన దుల్లా లోకనాథంఅక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన లాలం పార్థసారథి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట గ్రామానికి తరలించారు. ఈ మేరకు భోగాపురం ఎస్ఐ వి.పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి గాయాలు -
ఇద్దరు యువతులను రక్షించిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్లో అలల ఉధృతికి కొట్టుకుపోతున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్గార్డ్స్ రక్షించారు. వివరాలు.. కొమ్మాదికి చెందిన సీహెచ్ దీప్తి, యామిని అనే ఇద్దరు యువతులు గురువారం మధ్యాహ్నం సరదాగా గడిపేందుకు బీచ్కు వచ్చారు. కాసేపటి తర్వాత స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అలల ఉధృతికి కొట్టుకుపోతున్న వీరిని అక్కడే విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్ గమనించారు. వెంటనే స్పందించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని ఇంటికి పంపించారు. లైఫ్గార్డ్స్ను మైరెన్ సీఐ శ్రీనివాస్రావు అభినందించారు. -
ఇంటికి 5 నిమిషాల దూరంలో... గాల్లో కలిసిన స్నేహితురాళ్ల ప్రాణాలు
అగనంపూడి: వివాహ వేడుకకు ఆనందంగా వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు... ఇంటికి చేరుకోవడానికి మరో ఐదు నిమిషాల ప్రయాణమే మిగిలుండగా అనంతలోకాలకు చేరారు. కారు అదుపు తప్పి వంతెనను ఢీకొని కాలువలో పడిన ఘనటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. గాజువాక కణితి రోడ్డులోని శివాజీనగర్(అజీమాబాద్)కు చెందిన లఖనాపురం మంగ (48), ఆమె స్నేహితురాలు బన్నా కుసుమ తమ కుటుంబ సభ్యులు, మరో 15 మందితో ఐదు కార్లలో అనకాపల్లిలో బుధవారం జరిగిన వివాహానికి హాజరయ్యారు. వేడుక అనంతరం గురువారం తెల్లవారుజామున తిరుగుముఖం పట్టారు. ఉదయం సుమారు 5.30 గంటలకు టోల్గేట్ సమీపంలోని ఉప్పర కాలనీ వంతెన వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెనను బలంగా ఢీకొని కాలువలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మంగ(48) అక్కడికక్కడే మృతిచెందగా, కుసుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాదంలో కారు డ్రైవర్, కుసుమ కుమారుడు బాలమురళీకృష్ణ, సొల్లేటి విజయలక్ష్మి, బాలమురళీకృష్ణ మేనకోడలు తాన్వి పట్నాయక్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ఏప్లస్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఒక్క రోజు వ్యవధిలోనే.. బుధవారం ఉదయం వడ్లపూడి వంతెన వద్ద ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు సోదరులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరుసటి రోజు అదే సమయంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఎమ్మెల్సీకి ఎస్జీటీల వినతి
నర్సీపట్నం: అల్లూరి జిల్లాలో శాశ్వత స్థానికతతో పని చేయాలనే నిబంధనను సడలించేలా చూడాలని ఎస్జీటీలు గురువారం నర్సీపట్నం విచ్చేసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును కలిసి వినతిపత్రం అందజేసారు. మొదటి ప్రత్యామ్నాయంగా జోన్–1లో సెలెక్ట్ అయిన 2018–2025 ఉపాధ్యాయులను విభజనల్లో జోన్–2లో గల అల్లూరి జిల్లాకు బలవంతంగా పంపించడం జరిగిందని, విశాఖ, అనకాపల్లిలో జిల్లాలోనే ఉండేలా సర్దుబాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్సీ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ ఉన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి ఎన్ఐటీ డాక్టరేట్
యలమంచిలి రూరల్: యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న కె. వెంకన్న తాడేపల్లిగూడెం ఎన్ఐటీ నుంచి డాక్టరేట్ పొందారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. క్లిష్టమైన, అత్యంత ఉపయుక్తమైన భార లోహాలైన నియోబియం, హాఫ్నియం,జెర్కోనియంలతో పాటు అల్యూమినియం, టిన్ లోహాల మిశ్రమాలపై నిర్మాణాత్మక, అయస్కాంత, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్, ధర్మో ఎలక్ట్రిక్, మాగ్నెటోకాలోరిక్ లక్షణాల ప్రథమ సూత్రాలపై పరిశోధన చేయడం అభినందించదగ్గ విషయంగా పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. నిట్ అధ్యాపకుడు డాక్టర్ జె.కృష్ణమూర్తి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టా పొందడం గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు. పరిశోధన పూర్తి చేసిన అధ్యాపకుడు వెంకన్న మాట్లాడుతూ భవిష్యత్తులో తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ సామర్థ్యం కలిగిన మెమొరీ పరికరాలు, అయస్కాంత సెన్సార్లు, కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి తన పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ భౌతికశాస్త్రం విభాగాధిపతి జగ్గారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. అభినందించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు -
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
కశింకోట: మండలంలోని బయ్యవరం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కోటా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అనకాపల్లి పౌర సరఫరాల అధికారి లీలా గురువారం రాత్రి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా ఒక పాడుబడిన ఇంట్లో 9 బస్తాల బియ్యం పట్టుబడ్డాయన్నారు. వాటిని తూకం వేయగా 480 కిలోలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ఉగ్గినపాలెం ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించామన్నారు. పేదలకు చెందాల్సిన ఉచిత బియ్యాన్ని కొనుగోలు చేయడం, అమ్మకాలు జరపడం, అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
9న కేజీహెచ్లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం
మహారాణిపేట: కేజీహెచ్లో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ యూనిట్ను మంజూరు చేసింది. మొత్తం రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. మొత్తం వ్యయంలో రూ.11 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టగా, రూ.9 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. -
దళిత కాలనీ చుట్టూ స్టీల్ప్లాంట్ ఫెన్సింగ్
నిరసన తెలిపిన దళితులునక్కపల్లి: మండలంలో చందనాడ దళిత కాలనీ చుట్టూ ఆర్సిలర్మిట్టల్ స్టీల్ప్లాంట్ వారు ఫెన్సింగ్ వేయడం సమంజసం కాదంటూ గురువారం పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఫెన్సింగ్ వేసే చోట నిరసన తెలిపారు. దళిత కాలనీ చుట్టూ ఉన్న భూములను స్టీల్ప్లాంట్కు కేటాయించడంతో యాజమాన్యం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. ఇలా చేయడం వల్ల దళితకాలనీలో నివసించేవారు రాకపోకలు సాగించే వీలుండదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు అన్నారు. దళిత కాలనీని ఖాళీ చేయించి అక్కడ నివసించేవారిలో 18 ఏళ్లు నిండినవారికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవేమీ చేయకుండా కాలనీ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేయడంతో పాటు, ఫెన్సింగ్ పనులు అడ్డుకుంటామన్నారు. -
హైవేలో అదుపు తప్పి కారు బోల్తా
ఎస్.రాయవరం: గోకులపాడు జంక్షన్లో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయిన కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టిన ఘటనలో అయిదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. అడ్డురోడ్డు ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి. విశాఖపట్నానికి చెందిన నవ దంపతులు చంద్రమౌళి, అభిలలతో కలిసి మరో ముగ్గురు అన్నవరం దేవస్థానంలో వ్రతం చేసుకుని విశాఖపట్నం వెళుతుండగా గురువారం గోకులపాడు జంక్షన్లో కారు బోల్తాపడింది. అయితే కారు మూడు పల్టీలు కొట్టినా కారులో ఉన్న అయిదుగురికి చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు. రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు వద్దకు అడ్డురోడ్డు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన చేరుకుని కారులో ఉన్నవారిని స్థానికులు సహాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనపై ఎస్.రాయవరం పోలీసులకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. -
ముద్రగడకు ధర్మశ్రీ పరామర్శ
యలమంచిలి రూరల్: అస్వస్థతకు గురై హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్త కరణం ధర్మశ్రీ గురువారం పరామర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వెళ్లిన ఆయన ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి, సింధు ఆస్పత్రి చైర్మన్ పార్థసారధిరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం కోలుకుని స్వగ్రామం కిర్లంపూడి వస్తారని ధర్మశ్రీ అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి
అనకాపల్లి: ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం, నూతన కమిటీ ఎన్నిక ద్వారకా తిరుమలలో గత నెల 30వ తేదీన జరిగింది. అనకాపల్లి పట్టణం చవితిని వీధికి చెందిన విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతిని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక జార్జీక్లబ్ ఆవరణలో గురువారం గౌరీపతిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గౌరీపతి మాట్లాడుతూ విద్యాశాఖలో విశాఖ ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహించి, పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఏపీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ల్లో మండల, జిల్లా అధ్యక్షులుగా విధులు నిర్వహించి, ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్.వి.వి.స్వామి, బి.కాశీవిశ్వేశ్వరరావు, ఎ.ఎన్.వి.అప్పారావు, మళ్ల చంద్రశేఖర్, జి.భీమేశ్వరరావు పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరీపతి -
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో వేగం పెంచాలి
తుమ్మపాల: జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్దేశిత గడువులో లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న వినతులను సంబంధిత శాఖలకు వెంటనే పంపించి, పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు నెలల క్రితం పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంకా కొందరికి అందలేదని అర్జీలు వస్తున్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ–కేవైసీ ద్వారా ఆధార్, డాక్యుమెంట్ నంబర్లను ఽధ్రువీకరించి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ, ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్ బుకింగ్, ఓడీఎఫ్ గ్రామాలు, డీఆర్డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర తదితర ప్రభుత్వ కార్య క్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. ‘సర్’ ఫారాల సేకరణ, ఇంటింటి సర్వే పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. గృహ నిర్మాణా లు, పీఎం సూర్యఘర్ యోజన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వాలి ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆప్షన్లు నమోదు చేయాలని, ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులను ఖాళీలు ఉన్న జిల్లాలకు కేటాయించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాల కేటాయింపు ముసాయిదా మార్గదర్శకాలు, పలు అంశాలపై వివిధ విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉమ్మడి జిల్లా నుంచి ఏర్పడిన అన్ని కొత్త జిల్లాలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్థానిక జిల్లా ఆధారంగా కాకుండా కేడర్ సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరుగుతాయని చెప్పారు. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా అధ్యయనం చేసి, తమ సీనియారిటీ, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలను దృష్టిలోఉంచుకుని ఆప్షన్లునమోదుచేసుకోవాలన్నారు. పారదర్శకంగా అంగన్వాడీ పోస్టుల భర్తీ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఐసీడీఎస్ సీడీపీవోలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 30 అంగన్వాడీ వర్కర్ల పోస్టులు, 206 హెల్పర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలను ఈ నెల 21న అనకాపల్లి డివిజన్లోను, 23న నర్సీపట్నం, అడ్డురోడ్డు డివిజన్లలో నిర్వహించాలని ఎంపిక కమిటీ సభ్యులను ఆదేశించారు. సమర్థంగా జల్ జీవన్ మిషన్ జిల్లాలో జల్ జీవన్ మిషన్–2.0 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. జిల్లా జల,పారిశుధ్య కమిటీ సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ కార్యనిర్వాహక ఇంజినీరు అనిల్ కుమార్, జిల్లా పంచా యతీ అధికారి సందీప్, డీడబ్ల్యూఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల దేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ఈఏపీసెట్లో ర్యాంకుల పంట
దేవరాపల్లి/కె.కోటపాడు/అనకాపల్లి టౌన్/పాయకరావుపేట : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన విద్యార్థిని బంటు ధాత్రిక 5వర్యాంక్ సాధించింది. తండ్రి పెంటారావు మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి మాధవి గృహిణి. దేవరాపల్లికి చెందిన కొల్లి ప్రియాంక 79వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ప్రియాంక తండ్రి కొల్లి సింహాద్రి మాజీ సైనికుడు కాగా తల్లి రత్నం గృహిణి. ప్రియాంక పదవ తరగతి వరకు విశాఖలోని కేంద్రీయ విద్యాలయం–2లో, ఇంటర్మీడియెట్ రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. నీట్ ప్రవేశ పరీక్ష రాశానని, మంచి ర్యాంక్ వస్తుందన్న నమ్మకం ఉందని ప్రియాంక తెలిపింది. ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు సాధించి వైద్యురాలిగా స్థిరపడటమే తన ధ్యేయమని చెప్పింది. ప్రియాంక ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ●కె.కోటపాడు మండలం వారాడ గ్రామానికి చెందిన లెక్కల లావణ్య 164వ ర్యాంక్ సాధించింది. లావణ్య తల్లిదండ్రులు నారాయణమూర్తి, లక్ష్మిలు విశాఖపట్నంలో పనిచేసుకుంటూ తమకు గల ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తున్నారు. తండ్రి నారాయణమూర్తి పూర్ణామార్కెట్లో కళాసీ కాగా, తల్లి వరలక్ష్మి గృహిణి. పదవ తరగతి వరకూ తానాం రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్మీడియెట్ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఇంటర్మీడియెట్లో 957 మార్కులను సాధించింది. ఇటీవల నీట్ పరీక్షకు కూడా లావణ్య హాజరైంది. మంచి ర్యాంక్ వస్తుందనే ఆశాభావంతో కుమార్తె లావణ్య ఉన్నట్లు తండ్రి నారాయణమూర్తి తెలిపారు. ●అనకాపల్లి పట్టణానికి చెందిన సర్వసిద్ధి వెంకట్ తరుణ్ సాయి 258 ర్యాంకు సాధించాడు. ఇతని తండ్రి సర్వసిద్ధి వరహాలు అనకాపల్లి పట్టణంలోని భీమునిగుమ్మం హైస్కూల్లో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ●శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల ఎంపీసీ విద్యార్థి జె.మోనిష్ కుమార్ 55వ ర్యాంకు, ఫార్మసీ విభాగంలో బైపీసీ విద్యార్థిని ఎ.నవ్య 710 వ ర్యాంకు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్. భానుమూర్తి తెలిపారు. క్లాస్ రూమ్ ప్రోగ్రాంతో పాటుగా వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా తమ విద్యార్థులు ఈ విజయాలను సాధిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహరావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్. విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు. రోజుకు 12 గంటలు శ్రమించా యలమంచిలి రూరల్: జేఈఈ అడ్వాన్స్డ్ –2026 ఫలితాల్లో ఆలిండియా 151 వ ర్యాంకు సాధించిన మర్రపు సుధీర్ కుమార్ బుధవారం విడుదలైన ఏపీఈఏపీసెట్ 2026 ఫలితాల్లో 64వ ర్యాంకు కై వసం చేసుకుని సత్తా చాటాడు.యలమంచిలి కోర్టు పేటలో నివాసం ఉంటున్న మర్రపు సుధీర్ కుమార్ తండ్రి చంద్రశేఖర్ నక్కపల్లి హెట్రోడ్రగ్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తుండగా తల్లి అనూరాధ గృహిణి.విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వీరి కుటుంబం 16 సంవత్సరాల క్రితం యలమంచిలి వచ్చి, స్థిరపడింది. రోజుకు 10 నుంచి 12 గంటలు శ్రమించి చదివి ఐఐటీ అడ్వాన్స్డ్తో పాటు ఈఏపీసెట్లో ర్యాంకులు సాధించినట్టు సుధీర్ ‘సాక్షి’కి తెలిపాడు.ఇప్పటికే ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో సీటు సాధించినట్టు తెలిపాడు. ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఏదైనా స్టార్టప్ నెలకొల్పాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు.తమ కుమారుడు ప్రవేశ పరీక్షల్లో చూపిన ప్రతిభ పట్ల తల్లిదండ్రులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. -
నిధి
దక్కేనా? ప్రత్యేక రైళ్లు మరికొంతకాలం పొడిగింపు సకాలంలో పింఛన్ల పంపిణీ పూర్తి గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026ఆడబిడ్డకునగదు అందజేస్తున్నకలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: సామాజిక పింఛన్ల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి మండలం శంకరం ఎస్సీకాలనీలో బుధవారం ఆమె లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. అనంతరం పింఛన్ల పంపిణీపై ఆరా తీశారు. సక్రమంగా అందుతున్నదీ లేనిదీ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు రూ.106.85 కోట్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మున్సిపాలిటీ పరిధి, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభించామన్నారు. శతశాతం పెన్షన్లు పంపిణీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.ఆశాజ్యోతి, ఏపీడీ జి.డైసీ, పంచాయతీ సెక్రెటరీ సంతోషిని, స్థానిక అధికారులు పాల్గొన్నారు. సాక్షి, అనకాపల్లి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇచ్చిన మూడు పథకాలు (తల్లికి వందనం, ఉచిత గ్యాస్ బండ, అన్నదాత సుఖీభవ) కూడా అరకొరగానే అమలు చేశారు. ముఖ్యంగా 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఇస్తామన్న ‘ఆడబిడ్డ నిధి’ హామీని ఇవ్వకుండా, దాన్ని ‘పీ4’ (ప్రజా భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన) కార్యక్రమానికి అనుసంధానం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాటు కాలయాపన చేస్తూ మహిళలను ఘోరంగా మోసం చేసింది. ఇప్పుడే కాదు..గత 2014–19 చంద్రబాబు పాలనలోనూ రైతులకు రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి, సున్నావడ్డీ, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంట్ వంటి పథకాలను ఎగ్గొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా ‘సూపర్ సిక్స్’ హామీలన్నీ అమలు చేసేశామంటూ అబద్ధాలు చెబుతూ నాలుక మడతేస్తున్నారని, ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తర్వాత కాలయాపనతో మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు, బాధిత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెబ్సైట్లలో కాకి లెక్కలు మాత్రమే.. అధికారిక గణాంకాల ప్రకారం అనకాపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని 522 సచివాలయాల పరిధిలో మొత్తం 80,163 బంగారు కుటుంబాలను గుర్తించారు. ఇందులో 2,06,526 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు చూపిస్తున్నారు. వీరిని అడాప్ట్ చేసుకునేందుకు జిల్లాలో 6,420 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని, ఇప్పటికే 47,597 కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారని, ఇంకా 32,571 కుటుంబాలను దత్తత చేసుకోవాల్సి ఉందని వెబ్సైట్లో కాకిలెక్కలు చూపిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఎవరు ఏ కుటుంబాన్ని దత్తత చేసుకున్నారనే వివరాలు సచివాలయాల వారీగా ఎక్కడా లేవు. దీనిపై సచివాలయ ఉద్యోగులను అడిగితే వెబ్సైట్లో చూసుకోవాలని తప్పించుకుంటున్నారు తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వం బాకీ.. పీ4 సర్వే ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పేద మహిళలు జిల్లా వ్యాప్తంగా 2,06,526 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు (రెండేళ్లు) పూర్తయింది. ఈ లెక్కన ఒక్కో మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇవ్వాలి. అంటే జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ కలిపి ఏడాదికి రూ.371.74 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ‘ఆడబిడ్డ నిధి’ పేరిట చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకు గానూ జిల్లా మహిళలకు మొత్తం రూ.743.49 కోట్ల రూపాయలు బాకీ పడింది. తాటిచెట్లపాలెం(విశాఖ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖప ట్నం–షాలిమర్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించినట్లు సౌత్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వై.బాలాజీ కిరణ్ తెలిపారు. విశాఖపట్నం–షాలిమర్ (08508) ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం ఉదయం 11.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుస టి రోజు తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ రైలును జూలై 28 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో షాలిమర్–విశాఖపట్నం (08507) ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు షాలిమర్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సేవను జూలై 29 వరకు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం అనకాపల్లి టౌన్: జాతీయ ఉపాధ్యాయ అవార్డులు–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్య జోన్ ప్రాంతీయ సంచాలకుడు బి.విజయ భాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు నెల 10తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ‘పీ4’ పేరిట కాలయాపన పేదరిక నిర్మూలన పేరిట తీసుకొచ్చిన ఈ పీ4 ప్రక్రియలో భాగంగా అధికారులు ఆరు నెలల పాటు సర్వే చేసి జిల్లాలో ’బంగారు కుటుంబాల’ను గుర్తిస్తూ ఏడాదిన్నర పాలనను గడిపేశారు. అయితే ఈ కుటుంబాలను గుర్తించారు కానీ, వారిని దత్తత (అడాప్ట్) చేసుకునేందుకు దాతలు ఎక్కడా ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలోని మొత్తం 24 ప్రభుత్వ శాఖల అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దాతలను వెతికి పట్టుకునే బాధ్యత అధికారులదే అనడంతో, వారు తమ విధులను పక్కనబెట్టి దాతల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపులు నడిపేవారిని, చిన్నా చితకా వ్యాపారస్తులను బలవంతంగా దత్తత తీసుకోమంటూ ఒత్తిడి తెచ్చినా ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆరు నెలల పాటు హడావుడి చేసిన పీ4 కార్యక్రమాన్ని ఇప్పుడు పూర్తిగా అటకెక్కించేశారు. -
గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు
మహారాణిపేట(విశాఖ): సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ ఈ నెల 28, 29 తేదీల్లో జరగనుంది. లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ బుధవారం కలెక్టరేట్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితర అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గిరి ప్రదక్షిణ 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమవుతుంది. మొత్తం 32 కిలోమీటర్ల మార్గంలో తాగునీరు, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రా లు, వైద్యశిబిరాలు, అంబులెన్సులు, మొబైల్ మెడికల్ యూనిట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం, మొత్తం 50 నీటి ట్యాంకు లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూలైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే అదనపు కౌంటర్లు సిద్ధం చేయా లని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, హనుమంతువాక ప్రాంతంలో జాతీయ రహదారిని భక్తులు దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అంబులెన్సుల కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, మార్గమంతా వైద్య బృందాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, అగ్నిమాపక సేవలు, రహదారుల మరమ్మతులు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించా రు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గిరి ప్రదక్షిణ మార్గమంతా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి, అన్ని కెమెరాలు సమర్థంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ జూలై 29న భక్తులకు అన్ని దర్శనాలు ఉచితంగా కల్పించనున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, లతామాధురి, ఆర్డీవో సంగీత్ మాధుర్, దేవదాయ, జీవీఎంసీ, ఆర్టీసీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మాజీ విప్ ధర్మశ్రీపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖలు తగవు
మునగపాక: వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ విప్ ధర్మశ్రీపై ఎమ్మెల్యే విజయకుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూడిమడక రోడ్డు విస్తరణకు బీజం పడిందని చెప్పారు. అయితే రోడ్డు విస్తరణ పనులను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ చెప్పడం విచారకరమన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీపై ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు.పంచదార్ల కొండ వద్ద గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయంటూ ధర్మశ్రీ విలేకరుల సమావేశంలో చెప్పడం తప్పుకాదని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాపకం కోసం పార్టీకి చెందిన సీనియర్లు పేర్నినాని,అంబటి రాంబాబు,గుడివాడ అమర్నాఽథ్,ధర్మశ్రీలు ప్రయత్నిస్తున్నారంటూ విజయకుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి దగ్గర ఈ నాయకులకు గుర్తింపు ఉంది కాబట్టే వారికి మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ వంటి పదువులు ఇచ్చారన్నారు. పూడిమడక రోడ్డు విస్తరణకు తొలి నుంచి వైఎస్సార్సీపీ సానుకూలంగా ఉందని, అయితే రైతులు,బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నేరుగా అకౌంట్లో జమ అయ్యేలా చూడాల్సింది పోయి,వైఎస్సార్సీపీ నేతలపై అభాండాలు మోపడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు ఆడారి అచ్చియ్యనాయుడు,దేశంశెట్టి శంకరరావు,అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాము, కో–ఆప్షన్ జెడ్పీటీసీ నర్మాల కుమార్,ఎంపీపీ కోన సంద్య బుజ్జి, మాజీ జెడ్పీటీసీ భీముని వేంకటేశ్వరరావు,పార్టీ నాయకులు మారిశెట్టి సూర్యనారాయణ,పిన్నమరాజు రవీంద్రరాజు,ఉమ్మిడి జగన్, ఈత బాబూరావు,నాగేశ్వరరావు,బొద్దపు శ్రీరామమూర్తి,దొడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
పలుగు, పారలు చేతపట్టి కూలీల పాదయాత్ర
● ‘వీబీజీ రామ్ జీ’ రద్దు చేయాలని డిమాండ్ పాదయాత్ర చేస్తున్న ఉపాధి కూలీలు, గిరిజన సంఘాల నాయకులు రావికమతం: దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని యఽథావిధిగా కొనసాగించాలని కోరుతూ పీవీటీజీ సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ఉపాధి కూలీలు, మహిళలు బుధవారం పాదయాత్ర చే శారు. వీబీ జీ రామ్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుగు, పారలు, గంపలు పట్టుకుని గర్నికం నుంచి రావికమతం వరకు పాదయాత్ర జరిపారు. మండల రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ప్లకార్డులతో ఆందోళన చేశారు. కల్యాణపులోవ, అజేయపురం, జెడ్.జోగుంపేట, తాడిపర్తి, టి.అర్జాపురం, కోట్నాబిల్లి, జెడ్.బెన్నవరం తదితర గ్రామాల్లో తక్షణమే ఉపాధి పనులు చేపట్టి ఆగస్టు వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత బడ్జెట్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత, కొత్త కోట్నాబిల్లి, కె.గదపపాలెం, రామన్నదొరపాలెం గిరిజన గ్రామాల్లో సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఫేస్ యాప్లో నమోదు కావట్లలేదని వాపోయారు. చాలా ఇబ్బందులు పడుతూ సిగ్నల్ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, లేకపోతే మస్తర్లు నమోదు కావడం లేదని ఆరోపించారు. వెంటనే సెల్ టవర్ వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. -
ఓవర్లోడ్ లారీలకు రూ.1.60 లక్షల పెనాల్టీ
నక్కపల్లి: వేంపాడు టోల్ఫీజును ఎగ్గొట్టడంతోపాటు, సామర్థ్యానికి మంచి లోడుతో అడ్డదారిలో వెళ్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఆర్టీవోకు అప్పగించడంతో రెండు లారీలకు రూ.1.60 లక్షల పెనాల్టీ విధించారు. సీఐ జే మురళి తెలిపిన వివరాల ప్రకారం.. సామర్థ్యానికి మించిన లోడు టోల్ ప్లాజా ఫీజును ఎగ్గొట్టేందుకు రెండు లారీలు వేంపాడు, కాగిత మీదుగా అడ్డదారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆర్టీవోకు చర్యలు నిమిత్తం సిఫార్సు చేయగా, ఒక లారీకి రూ.74 వేలు, మరో లారీకి రూ.86 వేలు పెనాల్టీ విధించారన్నారు. -
పరిశోధకురాలినవుతా
మా అమ్మ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వార్డెన్గా ఉన్నారు. నాన్న అడ్వకేట్. 2020–25 బ్యాచ్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను. మొట్టమొదట వర్సిటీ చూస్తే.. కాస్త ఆందోళనగా అనిపించినా.. క్రమంగా రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఫ్యాకల్టీ ఎంతో బాగా సహకరించి.. మమ్మల్ని ఇంతటి వాళ్లని చేశారు. ప్రస్తుతం కెమిస్ట్రీలో పీహెచ్డీ చేస్తున్నాను. భవిష్యత్తులో పరిశోధకురాలినవ్వాలన్నది నా ఆకాంక్ష. – ఉమ్మిడి ఇషిత, గోల్డ్మెడల్ విద్యార్థిని, విశాఖపట్నం -
● అట్టహాసంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం ● 13 మందికి బంగారు పతకాలు.. అందులో 11 మంది అమ్మాయిలే ● రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిభావంతులకు పట్టాలు ● 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలందించిన విశ్వవిద్యాలయం
బీచ్రోడ్డులోని ఓ హోటల్లో అట్టహాసంగా సాగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, లోకేష్, సంధ్యారాణి హాజరయ్యారు. ఎంతో కష్టపడి చదివి పట్టాలు అందుకుంటున్న సమయంలో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, ఏకంగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. విజయనగరం కేంద్రంగా 2019లో అప్పటి ౖవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కాగా, వందలాది మంది గిరిజన, తదితర విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించే దిశగా వర్సిటీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2020 నుంచి 2025–26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశారు. వేడుకలా పట్టాల అందజేత.. ఈ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషనల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో ఎనిమిది పీజీ, ఐదు డిగ్రీ కోర్సుల్లో విద్యనభ్యసించిన వారికి పట్టాలు అందించారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగం నుంచి అత్యధికంగా 200 మంది విద్యార్థులు పట్టాలందుకోగా.. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషనల్ సైన్సెస్ నుంచి 82 మంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి 91 మంది విద్యార్థులు తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసి పట్టాలు స్వీకరించారు. ఈ స్నాతకోత్సవంలో విద్యార్థినులు తమ సత్తా చాటారు. వర్సిటీలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ 13 మందిలో ఏకంగా 11 మంది విద్యార్థినులే కావడం విశేషం. -
భూ వసూళ్లు
అనకాపల్లికూటమి నేతలఅంబేరుపురం వీఆర్వో సస్పెన్షన్ కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చినా.. ఎమ్మెల్యేల అడ్డుపుల్ల ఎమ్మెల్యేల నుంచీ ఎన్వోసీ తీసుకోవాల్సిందే సిట్లో ఉన్న భూములనూ క్లియర్ చేయించుకున్న లాబీయిస్ట్ తహసీల్దార్ నుంచి మాత్రం లభించని గ్రీన్సిగ్నల్ ఎకరాకు ఇంత అని ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిందే.. 7బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై న జిల్లా జట్టు సభ్యులు అనకాపల్లి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 11, 12 తేదీలలో జరిగే రాష్ట్ర స్ధాయి సీనియర్ సీ్త్ర, పురుషుల పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక ఎస్.కె.పి జిమ్ విద్యార్థులు పాల్గొంటున్నట్టు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడ్రపు నీలా ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరిలలో జిమ్ సభ్యులు తొమ్మిది మంది క్రీడాకారులతో జిల్లా జట్టు ఎంపిక జరిగిందని, వీరందరూ ఈ పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా...! సాధారణంగా ఏదైనా ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా... గతంలో మిలిటరీలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి భూమి కేటాయించినా... ఇటువంటి భూమిని 22–ఏ జాబితాలో చేరుస్తారు. అంటే ఇది ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో పేర్కొంటారు. దీనిని ఈ జాబితా నుంచి తొలగించే అధికారం కలెక్టర్కు ఉంటుంది. 22–ఏ జాబితా నుంచి తొలగిస్తూ కలెక్టర్ నిరంభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్–ఎన్వోసీ) ఆదేశాలు జారీచేసిన తర్వాత... ఆటోమేటిక్గా ఈ భూమి ప్రైవేటు భూమిగా మారిపోతుంది. సదరు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు మారిపోతుంటాయి. అంతేకాకుండా తాము ఎవరికి విక్రయించాలని భావిస్తే.. వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు సదరు హక్కులు పొందిన ప్రైవేటు వ్యక్తులకు ఉంటుంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం కలెక్టర్ ఆదేశాలిచ్చినప్పటికీ సదరు భూములపై మాత్రం తిరిగి స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా అటు అనకాపల్లి జిల్లాలో ఏకంగా సిట్ జాబితాలో ఉన్నాయని విమర్శలు ఎదుర్కొన్న 12 ఎకరాల భూమిని 22–ఏ జాబితా నుంచి ఒక లాబీయిస్ట్ ప్రైవేటు వ్యక్తుల పేరుతో మార్పించేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా అమరావతి నుంచే కథ నడిపించినట్టు తెలుస్తోంది. అయితే, స్థానికంగా మాత్రం తహశీల్దార్లు సదరు ప్రైవేటు వ్యక్తి పేరుతో మార్పులు చేసేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ప్రజా ప్రతినిధులు బరితెగించి మరీ వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఏకంగా అమరావతి నుంచి కథ నడిపించి, వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తీసివేయించుకుని, ప్రైవేటు భూములుగా మార్చుకుని... కలెక్టర్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నారు. తమ నుంచి ఎన్వోసీ తీసుకుంటేనే భూ విక్రయాలు సాఫీగా సాగుతాయని బెదిరింపులకు దిగుతున్నారు. ఒకవేళ తమ మాట కాదంటే... సదరు భూమి వ్యవహారం తేల్చాలంటూ లేఖలు విడుదల చేస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఏకంగా చినబాబు నుంచి వ్యవహారం నడిపించి రెవెన్యూ రికార్డుల్లో తప్పులున్నా, సిట్ జాబితాలో భూములున్నా అన్నీ చక్కబెట్టుకుని వందల కోట్ల విలువైన భూమి వ్యవహారాలు చేసిన వారికి స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం చుక్కలు చూపెడుతున్నారు. ఒకవేళ కలెక్టర్ నుంచి ఎన్వోసీ జారీ అయినప్పటికీ... తమను కలిసేదాకా రికార్డుల్లో మార్పులు చేయవద్దంటూ తమ ఆశీస్సులతో వచ్చిన తహశీల్దార్లకు స్థానిక కూటమి ప్రజా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఒక్కసారి స్థానిక ప్రజా ప్రతినిధిని కలిసిన తర్వాతే తమ వద్దకు రావాలంటూ తహశీల్దార్లు తెగేసి చెబుతున్నారు. ఫలితంగా సదరు లాబీయిస్టులు కాస్తా ప్రజా ప్రతినిధులను కలిస్తే... ఎకరాకు ఇంత మొత్తం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విశాఖలోని 5 ఎకరాల భూమి విషయంలో అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, అనకాపల్లి జిల్లాలోని 12 ఎకరాల విషయంలో విక్రయించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ వ్యవహారం ముందుకు సాగకపోవడంతో, స్థానిక ప్రజా ప్రతినిధికి ఎకరాకు ఇంత మొత్తం అప్పగించేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. మొత్తంగా స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఎన్వోసీ లేకపోతే ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ వ్యవహారాలు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో సదరు భూ వ్యవహారంలో విచారణ జరిపించాలంటూ వెంటనే లేఖలు విడుదల అవుతున్నాయనే విమర్శలున్నాయి. వేగవంతంగా ఇంటింటి ‘సర్’వే అధినేతతో వైఎస్సార్సీపీ నేతల భేటీచోడవరం : ఉన్నతాధికారులపై దురుసుగా ప్రవర్తించిన అంబేరుపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఓటర్ల జాబితా ఎస్ఐఆర్పై సమీక్ష సమావేశంలో వీఆర్వో గూనూరు కనకలక్ష్మి అక్కడ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, చోడవరం తహాసీల్దార్ రామారావు, ఎంపీడీఓ రాజుతో పాటు బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన అధికారులు, వీఆర్ఓలు ఉన్నారు. ఆ సమయంలో అంబేరుపురం వీఆర్ఓ కనకలక్ష్మిని డిప్యూటీ కలెక్టర్ వివరాలు అడుగుతుండగా ఆమె సహనం కోల్పోయి చేతిలో ఉన్న ఫైల్ను అధికారులపైకి విసిరేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. విధుల్లో ఉంటూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దురుసుగా ప్రవర్తించిన కనకలక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం ఆమైపె చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తహసీల్దార్ రామారావు చెప్పారు. ఆమె స్థానంలో వెంకన్నపాలెం వీఆర్వోను ఇన్చార్జిగా నియమించినట్టు తెలిపారు. పీజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఆరిలోవ : ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమకుమార్ తెలిపారు.పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు వర్క్ అడ్జస్ట్మెంట్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 1 మధ్యాహ్నం ఒంటి గంటలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అంగీకార పత్రాలు సమర్పించాలని, గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగు–1, ఇంగ్లిష్–2, గణితం–3, భౌతికశాస్త్రం–1, వృక్షశాస్త్రం–2, జంతుశాస్త్రం–4 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. లాబీయిస్ట్కే చుక్కలు...! వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు విశాఖ, అటు అనకాపల్లి జిల్లాలోనూ ఈ విధంగా 22–ఏ జాబితాలో ఉన్న భూములను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇటు విశాఖలోని కీలకమైన ప్రాంతంలోని 5 ఎకరాలతో పాటు అటు అనకాపల్లిలోని ఒక పారిశ్రామిక ప్రాంతంలోని 12 ఎకరాల భూములను ఇద్దరు లాబీయిస్టులు 22–ఏ జాబితా నుంచి తొలగించేలా చక్రం తిప్పారు. విశాఖలోని భూమి విషయంలో రెవెన్యూ రికార్డుల్లో తేడాలు ఉన్నాయి. ఇక అనకాపల్లిలోని భూముల విషయంలో సిట్ జాబితాలో ఉన్నట్టు విమర్శలున్నాయి. ఈ రెండు భూములను బీచ్ రోడ్డులో ఒకే అపార్టుమెంటులో ఉండే ఇద్దరు వ్యక్తులు క్లియర్ చేయించుకున్నారు. కలెక్టర్ల నుంచి ఎన్వోసీ వచ్చిన తర్వాత కూడా స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి మాత్రం ఎన్వోసీ రావడం లేదని తెలుస్తోంది. ఇక విశాఖలోని భూమి విషయంలో ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధికి అనుకున్న స్థాయిలో రొక్కం ముట్టడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అనకాపల్లిలోని భూమి విషయంలో మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధిని కలిసిన తర్వాతే తన వద్దకు రావాలంటూ తహసీల్దార్ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా అధికారులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఈ భూములను విక్రయించేందుకు కూడా ఇప్పటికే డీల్స్ సిద్ధం చేసుకున్న సదరు లాబీయిస్టుకు ప్రజా ప్రతినిధి నుంచి ‘తన వాటా పరిస్థితి ఏమిటి?’ అంటూ ప్రశ్నలు రావడంతో బిక్కచిక్కిపోయాడు. ఏకంగా చినబాబు స్థాయి నుంచి వ్యవహారం నడిపినప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకోకపోతే పనులు కావని గ్రహించిన సదరు లాబీయిస్టు ఎకరాకు ఇంత మొత్తం అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
భవనం నిర్మించాలని విద్యార్థుల నిరసన
ఎస్.రాయవరం: మండలంలోని రేవుపోలవరం ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి నాడు – నేడు నిధుల నుంచి రూ.3 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. అప్పట్లో ప్రారంభించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆపేశారన్నారు. దాంతో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నిధులు విడుదలయ్యాక పనులు పూర్తి చేయకపోవడం దారుణమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులతోపాటు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అర్జిలి ఎర్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పదవీ విరమణ అధికారులకు ఘన వీడ్కోలు
తుమ్మపాల: పోలీసు శాఖలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలందించి, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణతో ఆదర్శంగా నిలిచిన ఏడుగురు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ ఎల్.మోహనరావు పదవీ విరమణ పొందిన అధికారులను, వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నదన్నారు. అటువంటి బాధ్యతాయుతమైన రంగంలో 35 నుంచి 40 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణమన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు ఎస్ఐ వి.వెంకటరమణ (కమ్యూనికేషన్), ఏఎస్ఐ పి.వెంకటేశ్వరరావు (నాతవరం పి.ఎస్), ఏఎస్ఐ పి.కేశవరావు (వి.మాడుగుల పి.ఎస్), ఏఎస్ఐ బి.అప్పారావు (కొత్తకోట పి.ఎస్), హెచ్సీ పి.కొండల రావు (నర్సీపట్నం టౌన్ పి.ఎస్), హెచ్సీ ఆర్.రాఘవులు, హెచ్సీ హెచ్.టి.నాయుడు (జిల్లా ఆర్మడ్ రిజర్వ్)లను సన్మానించి విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.రవికుమార్, ఏఓ. సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, లక్ష్మి, వెంకటచిట్టి, రామకృష్ణారావు, మన్మథరావు, రమణమూర్తి, సేనం రమేష్, పిల్లా రమేష్, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
సీవీఏపీ యూనిట్ను సందర్శించిన సీపీవో
నక్కపల్లి: మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పీ4 కార్యాలయాన్ని జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి జి. రామారావు మంగళవారం సందర్శించారు. ఇక్కడ కానిస్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ (సీవీఏపీ)యూనిట్లో నిర్వహిస్తున్న అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు సమీకరిస్తున్నారనే విషయాలను ఆరా తీశారు. యంగ్ ప్రొఫెషనల్ మోరంపూడి జయరామ్ జీరో పావర్టీ కార్యక్రమాలు, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల భాగస్వామ్యం, అవసరాల గుర్తింపు, అవసరాల పరిష్కార చర్యలు, క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాల గురించి సీపీవోకు వివరించారు. పీ4 కార్యక్రమాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతిరావు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
వరి నారుమళ్లకు అనుకూల వాతావరణం
అనకాపల్లి టౌన్ : జిల్లాలో రాగల ఐదు రోజులు తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి.ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి నారుమళ్లు రైతులు వేసుకోవచ్చని, నేలను దున్ని తయారు చేసుకొని నారుమడి ఎత్తుగా వేసుకోవాలన్నారు. ఐదు సెంట్లు నారుమడికి 2009 కిలోల పశువుల ఎరువును, 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలన్నారు. తగిన తేమ చూసుకొని మొక్కజొన్న పంటకు నేలను దున్ని తయారు చేసుకొని డి.హెచ్.ఎం–115, 112,119.121 రకాలను ఎకరాకు 8 కిలోలు చొప్పున తగిన దూరంలో విత్తుకోవాలన్నారు. వర్షాధార చెరకు వేసుకునే రైతులు ముదురు గడల నుంచి విత్తనాన్ని సేకరించి వర్షం పడిన చోట ఎకరాకు 20 వేలు మూడు కళ్ల మెచ్చెల చొప్పున 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలన్నారు. నాటే ముందు మెచ్చెలను 10 శాతం సున్నపు నీటిలో ఒక గంట సేపు ముంచి నాటుకోవాలన్నారు. అలాగే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున నాటిన మూడో రోజున చెరకు తెచ్చి కప్పాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ వి.గౌరి, డాక్టర్ సిహెచ్ సీతా రామలక్ష్మి పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ
కశింకోట: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి దూసుకురావడంతో వృద్ధ మహిళ దుర్మరణం చెందింది. కశింకోట ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ప్రకారం... జగ్గయ్యపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కశింకోట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి హైవే పక్కనున్న కాలువ మీదుగా కొంత దూరం ముందుకు దూసుకొచ్చింది. అక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రవేశంలో మదుం, సోలార్ లైట్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఆ సమయంలో మట్టి పాత్రలు తీసుకొని విశాఖ వెళ్లడానికి మదుంపై కూర్చొని వాహనం కోసం నిరీక్షిస్తున్న స్థానిక కుమ్మరి వీధికి చెందిన దేవరపు చంద్ర (61) తీవ్రంగా గాయపడింది. ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఉన్న త వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కోడలు జగదీశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసి చంద్ర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి తీర్చుకున్నారు. వారిని వేరే బస్సుల్లో గమ్యాలకు చేర్చారు. ప్రమాదానికి గురైన బస్సు ముందు భాగం, అద్దం దెబ్బతిన్నాయి. హైవే పక్కన మురుగు కాలువ, మదుం గోడ దెబ్బతిన్నాయి. సోలార్ లైట్ స్తంభం ధ్వంసమై నేలకొరిగింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. -
విద్యాప్రమాణాల పెంపునకు మరింత కృషి అవసరం
మాడుగుల రూరల్ : పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. మండలంలో తాటిపర్తి పంచాయతీ శివారు కాశీపురం ఎంపీపీఎస్ పాఠశాలను మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిషు, లెక్కల పుస్తకాలు ఆయన విద్యార్థుల పక్కన కూర్చొని చదివించారు. విద్యార్థుల విద్యాప్రమాణాలు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. విద్యార్థులకు అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, తదితర వాటి గురించి పాఠశాల హెచ్ఎం దయాసాగర్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏడో తరగతి చదువుతూ మధ్యలో చదువు మానేసిన ఇ.కళ్యాణం రిషి వసంత అనే విద్యార్థిని ఆయన సమ్మతితో తిరిగి 7వ తరగతిలో ఎం.కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో చేర్పించారు. అనంతరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో చిన్నారులతో చిన్న చిన్న వాక్యాలు చదివించారు. ఆయన వెంట స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
నన్ను అనాథలా వదిలేశారు.. నా ఆశయాన్ని కాదు
నాకు ఏడాది వయసులోనే అమ్మ చనిపోయారు. నాన్న దివ్యాంగుడు కావడం వల్ల.. నన్ను పోషించలేక హైదరాబాద్లోని ఎస్ఓఎస్ అనాథ శరణాలయంలో చేర్పించారు. అప్పటి నుంచి నా ఆలనా పాలనా అంతా శరణాలయమే చూసుకుంది. ఉన్నత విద్యకు కావాల్సిన మొత్తం సహకారం అందించారు. నేను అనాథలా అయ్యానే తప్ప.. నా ఆశయం కాదని నిరూపించేందుకే పట్టుదలతో చదివాను. గ్రాడ్యుయేషన్, ఎంబీఏ ఇక్కడే పూర్తి చేశాను. ప్రస్తుతం జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. – జొన్నలగడ్డ దివ్య, గోల్డ్మెడల్ విద్యార్థిని, హైదరాబాద్ -
● బీఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శించాలి ● కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్ధంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై మంగళవారం ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మిలతో కలసి ఆమె మండల స్థాయి బూత్ లెవల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. అంటువ్యాధుల నివారణకు ఇన్స్పెక్షన్ కమిటీలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ఇతర నివాస సంస్థల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా పరిపాలన జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కమిటీలు సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పారిశుధ్యం, తాగునీటి నాణ్యత, ఆహార భద్రతతో పాటు విద్యా ర్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలన్నారు. -
రైల్వే భద్రతపై జీఎం సమీక్ష
తాటిచెట్లపాలెం: పని ప్రదేశాల్లో భద్రత, ఆస్తుల నష్ట నివారణ, రైళ్ల సమయపాలనపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం జీఎం కార్యాలయంలో జోనల్ పరిధిలోని నాలుగు డివిజన్ల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు, ఆస్తుల రక్షణ, రైళ్ల సమయపాలనపై అధికారులతో చర్చించారు. భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ
● ఆర్డీవో వి.వి.రమణ మాట్లాడుతున్న ఆర్డీవో రమణ నర్సీపట్నం : సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో వి.వి.రమణ పేర్కొన్నారు. ఎలక్షన్ డీ టీ, సర్ సూపర్వైజర్లతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అధికారి విధులు నిర్వహించాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేసిన తరువాత తిరిగి తీసుకోవడంలో తీవ్రజాప్యం ఏర్పడుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీఆర్వోలు,బీఎల్వోలు పరస్పర సమన్వయంతో పని చేసి, గడువులోపు సర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నా రు. పోలింగ్ కేంద్రాల వివరాలు, భౌగోళిక సరిహద్దులు, ఇంటి నంబర్లు, ఓటర్ల డేటా వంటి అంశాల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రామారావు పాల్గొన్నారు. -
స్కూటీని ఢీకొట్టిన లారీ
యలమంచిలి రూరల్ : విధి నిర్వహణలో భాగంగా జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్తున్న పంచాయతీ కార్యదర్శిని రోడ్డు ప్రమాదం కబళించింది. పంచాయతీ కార్యదర్శి నడుపుతున్న స్కూటీని యలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. 16వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలివి. పాయకరావుపేటకు చెందిన కిల్లాడ బాబూరావు(52) నక్కపల్లి మండలం ఎన్.నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అనకాపల్లిలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి స్కూటీపై వెళ్తుండగా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిబంద వద్ద వెనుక నుంచి వస్తున్న ఏపీ39యూజెడ్ నంబరు గల లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో రోడ్డుపై పడిపోవడంతో తల, శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదస్థలంలోనే పంచాయతీ కార్యదర్శి బాబూరావు ప్రాణాలు విడిచారు. అతని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఊహించని విధంగా పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సమాచారం తెలియడంతో యలమంచిలి మార్చురీ వద్దకు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు చేరుకుని బాబూరావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
గొలుగొండ: స్థానిక పీహెచ్సీ పరిధిలో మంగళవారం కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. చిన్నయ్యపాలెం, జోగుంపేట గ్రామాలకు చెందిన రాజు, నూకరత్నం, తలుపులతో పాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరికి గొలుగొండ పీహెచ్సీలో చికిత్స చేసినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మండలంలో చీడిగుమ్మల, కృష్ణదేవిపేట, గొలుగొండ పీహెచ్సీల పరిధిలో కుక్కలదాడిలో 22 మంది గాయపడ్డారు. పశువులు మృతి మాకవరపాలెం: మండలంలోని జి.కోడూరు కుక్కల సంచారం అధికమై ఇటీవల పశువులు, మనుషులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. వీటి దాడిలో వేగి రాఘవేంద్రరావు, బొడ్డేటి పరిదేశినాయుడు, నగిశెట్టి రమణ, కర్రి గోవింద, కొండా సాయిబాబాకు చెందిన పాడి రైతుల పశువులు మృతి చెందాయని మంగళవారం తెలిపారు. మరికొన్ని గాయపడ్డాయన్నారు. వేగి రామునాయుడు, మళ్ల గోవిందలు కూడా కుక్కల దాడిలో గాయపడ్డారన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్
రోలుగుంట : గంజాయి కేసు నమోదై నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కొర్రా ప్రసాద్ను గాలించి పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ పి.రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పెదబయిల గ్రామానికి చెందిన కొర్రా ప్రసాద్ రోలుగుంట పోలీస్ స్టేషన్లో 155/2022 గంజాయి కేసులో 4.ఎ నిందితుడుగా ఉండి నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అతనిని గాలించి పట్టుకొని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరిచి, జైలుకు తరలించడం జరిగిందని ఎస్ఐ విలేకరులకు తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి
మునగపాక : స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడూ జరిగినా వైఎస్సార్సీపీ జెండాలు గ్రామాల్లో ఎగురవేసేలా పాటుపడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా ఽఅధికార ప్రతినిధి ఆడారి జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఇచ్చిన పదవులకు వన్నె తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందేవని, నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఏ పథకం ఎపుడు వస్తుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమంలో బీఎల్ఏలు చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు, ఇల్లా శిరీషా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు ఇందల హేమలత నాయుడు, చదరం నాయుడు, కర్రి పెదబ్బాయి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెంటకోట హరేరామ పాల్గొన్నారు. -
రసరమ్యంగా లవకుశ నాటక ప్రదర్శన
మునగపాక : మండలంలోని తోటాడలో ఏర్పాటు చేసిన సురభి నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రదర్శించిన లవకుశ పౌరాణిక నాటకం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీ భానోదయ సురభి నాట్యమండలి వారు ప్రదర్శించిన ఈ నాటకం ఆహుతులను అలరించింది. నాటకంలోని నటీ నటులతో పాటు సెట్టింగ్లు, గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. నాటకాన్ని తిలకించేందుకు కళాభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా నాటకాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా స్థానిక కళాకారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొడ్డేడ రాజగోపాల్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వండర్ కిడ్స్ అధినేత మల్ల రామనాయుడు, మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్, దాడి వీరమహలక్ష్మినాయుడు, దొడ్డి కోటేశ్వరరావు, ఆళ్ల మహేశ్వరరావు, దొడ్డి రమేష్, పొలమరశెట్టి ఆనందరావు, సుందరపు కనకప్పారావు,ఆళ్ల వీరునాయుడు, రాపేటి పరమేష్, ఆడారి జగన్నాధరావు, దాడి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సురభి నాటకోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన బుధవారం రాత్రి 9గంటలకు మాయాబజార్ పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. -
ఎవరెస్ట్ క్యాంపు విద్యార్థికి సత్కారం
విద్యార్థి దుర్గా ప్రసాద్ను సత్కరిస్తున్న యూత్ హాస్టల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాఘవేంద్రరావు, గోపాలరావు నర్సీపట్నం : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన గొలుగొండ మండలం, జోగంపేట హైస్కూల్కు చెందిన విద్యార్థి రావి దుర్గాప్రసాద్ను నర్సీపట్నం యూత్ హాస్టల్ అడ్హాక్ కమిటీ, లయన్స్క్లబ్ వారు సోమవారం ఘనంగా సత్కరించారు. లయన్స్క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్, యూత్ హాస్టల్ చీఫ్ డి.రాఘవేంద్రరావు, అధికారి గోపాలరావు విద్యార్థికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించి విద్యార్థి చరిత్ర సృష్టించాడని అఽతిథులు కొనియాడారు. కార్యక్రమంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ కన్వీనర్ పాలపర్తి సత్యానందం, లయన్స్క్లబ్ అధ్యక్షుడు ఎం.రఘురామ్, సెక్రటరీ టి.రామారావు, ట్రెజరర్ శర్మ పాల్గొన్నారు. -
సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతికత వినియోగం
అల్లిపురం: కోవిడ్ అనంతరం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని, వాటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ రీఫండ్ మేళా–3.0లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురైన 310 మంది బాధితులకు రూ.6,02,41,725 విలువైన రీఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైన వెంటనే బాధితులు 1930 హెల్ప్లైన్కు కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా తమ డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ రీఫండ్ మేళాల ద్వారా ఇప్పటివరకు మూడు దశల్లో మొత్తం 1,550 మంది బాధితులకు రూ.28.49 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని తిరిగి అందజేశామన్నారు. అదేవిధంగా జాబ్ ఫ్రాడ్లు, టాస్క్ గేమ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, వాహన విక్రయ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టి కోట్లాది రూపాయలను రికవరీ చేసి బాధి తులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. -
శాస్త్రోక్తంగా మూడో విడత చందనం సమర్పణ
సింహాచలం : నిజ జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి సోమవారం మూడో విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు, అనంతరం సుమారు మూడు మణుగులు (సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని స్వామివారికి సమర్పించారు. తదనంతరం ఆరాధన, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ఆస్థాన మండపంలో వేంచేపు చేసి జ్యేష్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పంచామృతాలు, గంగధార జలాలతో అభిషేకాలు చేసి, విశేష హారతులు సమర్పించారు. నాలుగు వేదాల పారాయణాల నడుమ స్వామివారిని కీర్తించారు. శిరస్సుపై చందనంతో అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి భక్తులకు కనువిందు చేశారు. -
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యువాత
నక్కపల్లి : దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో వివాహిత మృత్యువాత పడిన ఘటన సోమవారం జరిగింది. సీఐ జె.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన ఓలపల్లి ఈశ్వరరావు తన భార్య గాయత్రి (26)తో కలసి మోటారు సైకిల్పై సోమవారం ఉదయం అన్నవరం సత్యదేవుని దర్శనానికి బయలుదేరారు. నక్కపల్లి దాటాక న్యాయంపూడి వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ను అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల మధ్య బైక్ ఇరుక్కుపోయింది. స్కూటీ వెనుక కూర్చొన్న గాయత్రి ఐషర్ వ్యాన్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే మరణించింది. బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఈశ్వరరావుకు స్పల్ప గాయలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి
మునగపాక: మండలంలోని తోటాడలో సోమవారం రాత్రి సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాతి గాంచిన భానోదయ సురభి నాట్యమండలి వారిచే ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజున శ్రీకృష్ణలీలలు పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. నాటకంలోని నటీనటులు అద్భుతంగా నటించారు. నాటకంలోని సన్నివేశాలతోపాటు సెట్టింగ్లు ఆహూతులను అలరించాయి. ఈ పోటీలను జ్యోతి వెలిగించి వక్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్ మాట్లాడుతూ కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతో అనుభవం కలిగిన కళాకారులు ఉన్నారని తెలిపారు. వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సురభి నాటకాలకు దేశంలోనే తగిన గుర్తింపు ఉందన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించడంలో మునగపాక మండలం ఎప్పుడూ ముందుంటుందన్నారు. గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో తోటాడలో సురభి నాటక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
తుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాస్ దరఖాస్తుదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఏడీ సర్వే, ఇరిగేషన్, జీవీఎంసీ, ఏడీ అగ్రికల్చర్, మైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్, లేబర్ ఆఫీస్, ఫిషరీస్, ఏపీఎస్ఆర్టీసీ, డ్వామా, తాగునీరు శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను కేవలం సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం కాదని, ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులను తిరస్కరించాల్సి వస్తే, దానికి సరైన కారణాలను తెలియజేస్తూ ఫిర్యాదుదారునికి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం పీజీఆర్ఎస్–131, రెవెన్యూ క్లినిక్– 147 వినతులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుడికి స్థలం కేటాయించాలని వినతి సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి వంద చదరపు గజాల స్థలంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మించామని కమిటీ వారు , భక్తులు తెలిపారు. గుడి నిర్మించిన స్థలం సర్వే నంబరు 103లో ఉందని, దాన్ని అధికారికంగా గుర్తించి హిందువుల మనోభావాలను కాపాడుతూ న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో ప్రజలందరికి ఉపయోగపడే ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామివారి గుడి ఒక్కటి మాత్రమే ఉందని, తమ అభ్యర్థనను మన్నించి ఆ స్థలం అధికారికంగా కేటాయించాలని కలెక్టర్ను కోరారు. అనకాపల్లి జోన్లో కార్మికుల నియామకాలు చేయాలి జీవీఎంసీ అనకాపల్లి జోన్ ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులుగా 250 మందిని కొత్తగా నియమించాలని, ప్రస్తుతం ఉన్న వారిపైనే పనిభారం తీవ్రంగా ఉన్నందున ఆర్సి నంబరు 436/2025/ ప్రకారం రూ. 147 డైలీ వేజ్ ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులుగా నియమించాలంటూ కార్మికులు కలెక్టర్కు వినతి అందించారు. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 27 మందిని సచివాలయానికి ఒకరు చొప్పున నియమించి మిగతా 120 మంది. పోస్టులు ఇంకా నియమించలేదన్నారు. వెంటనే మిగిలిన పోస్టులను పారిశుధ్య కార్మికులుగా పనిచేసి రిటైర్మెంట్, డెత్, సిక్ కార్మికుల వారసులను నియమించాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీపై దాడి దారుణం
మహారాణిపేట: అమరావతి ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రభుత్వం తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని రైతులు మొరపెట్టుకోగా, వాస్తవాలు పరిశీలించేందుకే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడిన కమిటీని వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపించారని వివరించారు. తాడేపల్లి ప్రాంతంలో ఈ ఉన్నత స్థాయి కమిటీపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడటం అత్యంత దారుణమని ఖండించారు. ప్రతిపక్షానికి ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కు ఉందని, అమరావతి ఎవరి జాగీరూ కాదని అన్నారు. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ గాయపడటం విచారకరమని, హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారాలు ఎవరికీ శాశ్వతం కావని హితవు పలికారు. అలాగే, సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా బి.ఎస్. కృష్ణ డిమాండ్ చేశారు. -
గుట్టుచప్పుడు కాకుండా పాత్రుడు చెరువు రీ సర్వే
తుమ్మపాల : అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెం సర్వే నెం.243లో పదేళ్లగా వివాదంలో ఉన్న పాత్రుని చెరువుకు రెవెన్యూ అధికారులు సోమవారం చేపట్టిన రీసర్వే తీవ్ర వివాదానికి తెరలేపింది. 13.70 ఎకరాల చెరువు కబ్జాదారులకు గ్రామస్తులకు మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త తోపులాటగా మారి కూటమి పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పోల్నాటి అప్పారావును మూడు గంటల పాటు గ్రామస్తులు నిర్బంధించారు. అతనితో పాటు చెరువు రికార్డులు తారుమారు చేసి కబ్జాకు యత్నిస్తున్న మరో టీడీపీ సీనియర్ నేత మామిడి చిన్నారావు, మండలంలో బడా వ్యాపారవేత్త గొట్టిపాటి సుధాకర్ రావాలంటూ, చెరువుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పదేళ్లుగా వివాదంలో ఉన్న చెరువుపై కబ్జాదారులకు సమాచారమిచ్చి రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామస్తుల అభ్యంతరంతో వివాదంలో కొనసాగుతున్న చెరువు రీసర్వేను గ్రామస్తులకు తెలియకుండా సర్వే చేపట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల క్రితం చెరువు రీసర్వేకు సిద్ధమైనప్పటికీ గ్రామపెద్దలు అభ్యంతరం తెలపడంతో సర్వే బృందం రీసర్వేను నిలిపివేసింది. మరలా ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాదారుల సమక్షంలో రీసర్వే చేపట్టడంలో అధికారుల తీరు అనుమానాలకు తావిచ్చింది. రీసర్వేను అడ్డుకున్న గ్రామస్తులు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. పోలీసుల రాకతో అక్కడ నుంచి కబ్జాదారులు జారుకున్నారు. దీంతో గ్రామస్తులంతా అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నీటి సంఘం చైర్మన్ మంత్రి కాసులునాయుడు, వైఎస్సార్సీపీ నేత మంత్రి సత్తిబాబు, వైస్సర్పంచ్ కాపుశెట్టి రామకృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ గనిరెడ్డి రాజు మాట్లాడుతూ కాపుశెట్టివానిపాలెంలో పాత్రుని చెరువుగా ఉన్న 13.70 ఎకరాల చెరువు రెవెన్యూ రికార్డును 2016లో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మామిడి చిన్నారావు అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క బినామీల పేర్లతో మార్చేసారని, చెరువు విక్రయించేసి రూ.రెండు కోట్లు వరకు దోచేసిన ఉదంతంపై అప్పట్లో ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి బినామీల పేర్లను తొలగించకుండా డిస్ప్యూట్గా మాత్రమే చేర్చి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. చెరువుపై జరిగిన దస్తావేజులను రద్దు చేసుకుంటామంటూ ఇద్దరు టీడీపీ నేతలతో పాటు వ్యాపారవేత్త గొట్టిపాటి సుధాకర్ కూడా కాపుశెట్టివానిపాలెం రామాలయంలో హమీలిచ్చి ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చెరువుకు రీసర్వే చేపట్టడం దారుణమన్నారు. పాత్రుని చెరువు జలాధారంగా 150 ఎకరాల ఆయకట్టు భూమి ఉందని, కబ్జాదారులపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, కూటమి పార్టీ నేతలు గొంతిన శివశంకర్, కాపుశెట్టి అర్జునరావు, కోసిరెడ్డి మహేష్, కరణం మాణిక్యాలరావు, బొద్దపు కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో ప్రజాహితం
కశింకోట : ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి తద్వారా పండే ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తులను అందించి ప్రజాహితానికి రైతులు దోహదపడాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. మండలంలోని బయ్యవరం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవనాల శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఎద్దుల నాగలితోపాటు ట్రాక్టర్పై దుక్కి దున్నారు. వరి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రైతులు పంట భూములు, ప్రజలకు హాని కలిగించే రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. యూరియా అవసరానికి మించి వినియోగించరాదన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలకు అనుగుణంగా దీన్ని వాడాలన్నారు. ప్రతి పొలానికి నీరు అనే నినాదంతో నీటిపారుదల శాఖ ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచడం, నీటి వృధాను తగ్గించి, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. త్వరలోనే జిల్లాకు పోలవరం నీరు : ఎమ్మెల్యే రామకృష్ణ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం నీటిని జిల్లాకు త్వరలోనే అందించనున్నారన్నారు. పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తి అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 8 వేల ఎకరాలకు సాగునీరు లభించనుందన్నారు. రూ.7.5 కోట్లతో సాగునీటి కాలువలల్లో పూడికలు తీయించారని, దీనివల్ల పంట భూములకు సమృద్దిగా నీరు అందుతుందన్నారు. యూరియా కొరత లేదని, పాసు పుస్తకం ఉన్న పంట భూములకు యూరియా ఎరువు అందిస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ వరి విత్తనాల పంపిణీకి నిబంధనలు సరళతరం చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వరి విత్తనాలు అందజేస్తామన్నారు. సాగు యంత్రాల ప్రదర్శన ఈ సందర్భంగా రైతులకు రాయితీపై అందజేసే పవర్ వీడర్లను, డ్రోన్ను ప్రదర్శించారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన వన, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో అందజేస్తున్న యంత్రాలు, పరికరాలను ప్రదర్శించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో డబ్ల్యూడీసీపీ–పీఎంకేఎస్వై 2.0 పథకం కింద బయ్యవరం చేరి చెరువును రూ.50 లక్షలతో అభివృద్ధి చేయడానికి కలెక్టర్ విజయకృష్ణన్ శంకుస్థాపన చేశారు. గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త ముకుందరావు, ఎంపీడీవో చంద్రశేఖరరావు, మండల వ్యవసాయ అధికారి స్వప్న, కూటమి నాయకులు గొంతిన శ్రీనివాసరావు, కాయల మురళీధర్, వేగి గోపీకృష్ణ, దాసరి బాబు పాల్గొన్నారు. -
ఏయూలో ఫీజుల మంట!
వర్సిటీకి ‘షాడో’ సంకెళ్లు! కార్పొరేట్ తరహా వసూళ్లు ఆపాలి ప్రభుత్వ విద్యాసంస్థ అయిన ఏయూలో హాస్టల్ అభివృద్ధి పేరుతో వేలల్లో వసూలు చేయడం అన్యా యం. ఇక్కడ చదువుతున్నది పేద విద్యార్థులనే విషయాన్ని వర్సిటీ యంత్రాంగం పూర్తిగా మరిచిపోతోంది. ఏయూ రిజిస్ట్రార్ సగం ఫీజు అయినా కట్టాల్సిందే అనడం పేదలపై అదనపు భారమే. క్యాంపస్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, కార్పొరేట్ తరహాలో ఏయూ చేస్తున్న దోపిడీ విధానాన్ని ఆపకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం. –కుసుమాంజలి, కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ విశాఖ విద్య: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రస్తుత పరిణామాలు మారుతున్నాయి. ఉన్నత విద్యాశాఖపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధా నాలు వర్సిటీ స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. సమూల మార్పుల పేరిట ప్రైవేటు వ్యక్తుల హస్తగతం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మేధావి వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయంలో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపక వర్గాల్లో ఒక రకమైన ఆందోళన వాతావరణం నెలకొంది. ఉత్సవ విగ్రహాలుగా వీసీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వర్సిటీలకు మేధావులను ఉపకులపతులుగా నియమిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఐఐటీల్లో పనిచేసిన అనుభవజ్ఞులను ఏయూ వీసీగా తెచ్చామని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో వారికి కనీస పాలనాపరమైన స్వేచ్ఛ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అసలు మంత్రి కంటే, విశాఖకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ‘షాడో’గా వ్యవహరిస్తూ వర్సిటీ వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సదరు నేత గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సిందే అన్న టాక్ నడుస్తోంది. బడ్జెట్లో భారీ కోత.. శతాబ్ది వేడుకల వేళ నిరాశ! శతాబ్ది ఉత్సవాలు చేసుకున్న ఏయూకు బడ్జెట్ పరంగా పెద్ద షాక్ తగిలింది. 2026–27 వార్షిక బడ్జెట్లో ఉన్నత విద్యకు కేటాయింపులు నామమాత్రంగా ఉండగా, ఏయూ వార్షిక బడ్జెట్ను రూ.389.34 కోట్లుగా తేల్చారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.27.91 కోట్లు తక్కువ కావడం గమనార్హం. నిధుల కొరతతో వర్సిటీ పరిశోధనలు, మౌలిక వసతుల కల్పన కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకోకపోతే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి మసకబారడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు. విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పేద విద్యార్థులకు ‘వసతి’ ఇప్పుడు పెనుభారంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ‘వసతి దీవెన’ బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో చేతులెత్తేసిన వర్సిటీ యంత్రాంగం.. ఆ భారాన్ని విద్యార్థులపైకి నెట్టేసింది. ‘హాస్టల్ డెవలప్మెంట్ ఫండ్’ పేరిట వేల రూపాయల కొత్త బాదుడుకు తెరలేపింది. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి, కనీసం తలదాచుకునేందుకు రూమ్ కేటాయింపు కోసం పడిగాపులు కాస్తున్న విద్యార్థులపై రూ.5,500 కొత్త ఫీజు షరతు పెట్టడం క్యాంపస్లో కార్పొరేట్ తరహా దోపిడీని తలపిస్తోంది. అడిగితే సగం కట్టాల్సిందేనని రిజిస్ట్రార్ భీష్మించుకుని కూర్చోవడం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రూ.5,500 కడితేనే రూమ్ హాస్టల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట ఏకంగా రూ.5,500 చెల్లించాలని విద్యార్థులపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ పెద్ద మొత్తాన్ని కడితేనే హాస్టల్ రూమ్ కేటాయిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ సారథ్యంలో విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబును నిలదీశారు. యూనివర్సిటీ అవలంబిస్తున్న ఇలాంటి నిర్ణయాలు పేద విద్యార్థుల పాలిట శాపంగా మారాయని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట రూ.వేలు వసూలు చేయడం దారుణమని, తక్షణమే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అధికారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. విద్యార్థుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని చెబుతూనే, ప్రస్తుతానికి సగం ఫీజు అయినా చెల్లించాల్సిందేనని రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. ఏయూకు పాలనా గ్రహణం తెరవెనుక ప్రజాప్రతినిధి పెత్తనం వీసీ స్వేచ్ఛకు బ్రేక్ బడ్జెట్లో కోతతో ఆర్థిక కష్టాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేద విద్యార్థులు బలి ‘వసతి దీవెన’ విడుదల చేయని సర్కార్ ‘హాస్టల్ డెవలప్మెంట్ ఫండ్’ పేరిట కొత్త బాదుడు రూ.5,500 కడితేనే రూమ్ అలాట్మెంట్ రిజిస్ట్రార్ను నిలదీసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పడిగాపులు కొత్త విద్యా సంవత్సరంలో హాస్టల్లో చేరేందుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చిన విద్యార్థినులకు వర్సిటీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ ఫీజులు చెల్లించాలంటూ హాస్టల్లో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. ఫీజుల భారం ఒక్కసారిగా పడటంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాస్టల్ లోపలికి అనుమతించకపోవడంతో గంటల తరబడి ఫుట్పాత్లపైనే నిరీక్షించారు. -
చట్టపరిధిలో సమస్యలకు వారం రోజుల్లో పరిష్కారం
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 62 అర్జీలు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎస్పీ తుహిన్ సిన్హాకు తెలియజేశారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకుని వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిఽధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దిగువ స్థాయి పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 62 ఆర్జీలు భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఈవీఎం గొడౌన్ తనిఖీ చేసిన జేసీ
రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఈవీఎం గొడౌన్ తనిఖీ చేసిన జేసీ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల : ఈవీఎం గొడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్ను తనిఖీల్లో భాగంగా సోమవారం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆయేషాతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళాలు తీయించి గొడౌన్ లోపల భాగంలో కూడా పర్యటించారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్బుక్లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై నేతలతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు వివరించారు కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరెండెంట్ వాసు నాయుడు, నాయకులు బి.నివాసరావు, కె..హరినాథ్ బాబు, డి.వేణుగోపాలకృష్ణ , స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు. -
భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం
గోపాలపట్నం: భర్త తనను మోసం చేశాడంటూ భార్య అతడి ఇంటి ముందు మౌన పోరాటం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని వెలుగువాడకు చెందిన గోర్ల వనజాక్షికి, పాత కరాసాకు చెందిన గోకర్ల శ్రీనివాసరావుకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2019లో ఒక కుమారుడు జన్మించాడు. అయితే పెళ్లయిన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వనజాక్షి ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమె కనిపించకుండా పోయిందంటూ మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి ఆమె పుట్టింట్లో ఉన్నట్లు గుర్తించి, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా, ఆ తర్వాత అత్తమామలు మళ్లీ వేధించడంతో ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఏడాది వనజాక్షి గర్భం దాల్చగా, ఆ గర్భాన్ని తీయించుకోవాలంటూ భర్త కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. భార్య వస్తోందని తెలిసి ఇంటికి తాళం వేసి.. తన కుమారుడితో మాట్లాడించాలని కోరినా భర్త శ్రీనివాసరావు అవకాశం ఇవ్వలేదని వనజాక్షి కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలోనే తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడిని చూసుకునేందుకు ఆమె కరాసాలోని భర్త ఇంటికి వచ్చింది. అయితే ఆమె వస్తున్నట్లు ముందే తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తనను, బిడ్డను నిర్లక్ష్యం చేస్తూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని వనజాక్షి ఆరోపిస్తూ ఆ ఇంటి ముందే కూర్చుని రోదిస్తూ నిరసన చేపట్టింది. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భర్త శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
అనకాపల్లి : మాతృభాషతో పాటు ఆంగ్ల భాషపై ఆసక్తి పెంచుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకుడు డాక్టర్. విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ఫోనెటిక్స్ ఏ బిగినర్స్ గైడ్‘ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మాతృభాషతో పాటు, ఇంగ్లిష్, హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల పంపంచంలో ఎక్కడికై నా వెళ్లి తిరిగిరావచ్చన్నారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేటి ప్రపంచీకరణలో చేసే వృత్తితో సంబంధం లేకుండా, తన విద్యార్హత సంబంధం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడడం అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిందన్నారు. ఇంగ్లిష్ ఉచ్ఛారణ పడకుండా నిజమైన ఇంగ్లిష్ వారిలాగే మాట్లాడగలిగితే అటువంటి వ్యక్తికి ఈ ప్రపంచం ఎర్ర తివాచీ పరుస్తుందని, అలాగే వారు ఎక్కడైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు సునాయాసంగా సంపాదించగలరని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాట్లాడించడానికి మార్కెట్లో చాలా పుస్తకాలు దొరుకుతాయని, తాను రాసిన ఫోనెటిక్స్ ఏ బిగినర్స్ గైడ్ అనే పుస్తకం ఇంగ్లిష్లో ఏ పదాలను ఎలా పలకాలి, వాటిని స్పష్టంగా పలికే విధానం, ఏ పదాలకు ఎక్కడెక్కడ వత్తి పలకాలి, అలా పలకడం ద్వారా ఒకే మాటకి రెండు మూడు అర్థాలు ఎలా వస్తాయి అనే విషయాలను రచయిత ఈ పుస్తకంలో వివరించిన తీరు ఇంగ్లిషు భాషను దాని సరైన ఉచ్ఛారణతో నేర్చుకోవాలి అనుకునే పాఠకులకు ఎవరికై నా ఈ పుస్తకం ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం అందేలా చర్యలు
● కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్ తుమ్మపాల: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పురోగతి, బాధితులకు అందించిన ఆర్థిక సహాయం, పునరావాస చర్యలు, కేసుల దర్యాప్తు, న్యాయపరమైన చర్యలపై సమగ్రంగా విచారణ చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరును సమీక్షించేందుకు జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అందించే అన్ని రకాల సహాయాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడంతోపాటు, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు, ఆర్డీవో షేక్ అయేషా, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
డిజైన్లు!
కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అంతస్తులు.. శరవేగంగా పనులు ● రెండు భూగర్భ బేస్మెంట్లు పూర్తయ్యాయి. ● గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేశారు. ● ప్రస్తుతం మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. ● అప్రోచ్ రోడ్డు పూర్తయింది. ● ప్రహరీ గోడ నిర్మాణం సుమారు 60 శాతం పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.121.58 కోట్లను ఆమోదించగా, ఇప్పటికే రూ.42.14 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, విశాఖపట్నం: ఇది కేవలం ఒక కార్యాలయ భవనం కాదు.. భారతీయ రైల్వే పరిపాలనకు కొత్త గుర్తింపు. ఇది కేవలం పది అంతస్తుల నిర్మాణం కాదు.. భవిష్యత్ రైల్వే కార్యాలయాల రూపురేఖలకు నమూనా. ఇది కేవలం సిమెంట్, స్టీల్తో నిర్మిస్తున్న కట్టడం కాదు.. సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల సౌకర్యం, శక్తి పొదుపు, ఆధునిక వాస్తుశిల్పం అన్నింటినీ ఒకే వేదికపై కలిపిన విజన్. ముడసర్లోవలో 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్లలో ఒకటిగా అవతరించబోతోంది. భారతీయ రైల్వే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా నిర్మించే రైల్వే పరిపాలన భవనాలకు రోల్మోడల్గా నిలవనుంది. ప్రతి అంతస్తుకూ ప్రత్యేక రూపకల్పన ఈ భవనానికి మొదటి చూపులోనే ప్రత్యేకత కనిపిస్తుంది. రెండు భూగర్భ బేస్మెంట్లపై పది అంతస్తుల టవర్గా నిర్మిస్తున్న ఈ కార్యాలయంలో ప్రతి అంతస్తును ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ డిజైన్తో రూపొందిస్తున్నారు. మధ్యలో భారీ ఫ్రేమ్డ్ వాల్యూమ్.. ఇరువైపులా మెట్ల ఆకృతిలో పైకి ఎదిగే స్టెప్డ్ బ్లాక్స్.. మొత్తం భవనానికి ప్రత్యేకమైన శిల్ప సౌందర్యాన్ని తీసుకొస్తాయి. పగటి సమయంలో సహజ కాంతి భవనం అంతటా విస్తరించేలా డిజైన్ చేయడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో నగర స్కైలైన్లో ఈ భవనం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోనుంది. ఐజీబీసీ ప్రమాణాలతో గ్రీన్ క్యాంపస్ ఈ ప్రధాన కార్యాలయం పూర్తిగా పర్యావరణ హిత నిర్మాణంగా రూపుదిద్దుకుంటోంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం సాగుతోంది. భవనంపై సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం, పునర్వినియోగ సదుపాయాలు, నీటిని ఆదా చేసే ప్లంబింగ్ ఫిక్చర్లు, ఇంధన సామర్థ్యం అధికంగా ఉండే ఎలక్ట్రికల్ వ్యవస్థలు ఇందులో భాగం కానున్నాయి. భవిష్యత్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎలా ఉండాలో చెప్పేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఉద్యోగులకు మరింత సౌకర్యం సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాల తరహాలో మూసపద్ధతి గదులు కాకుండా విశాలమైన ఓపెన్ వర్క్స్పేస్లను రూపొందిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయం పెరిగేలా కార్యాలయ విభాగాలను అనుసంధానిస్తున్నారు. సందర్శకులు సులభంగా సేవలు పొందేందుకు ప్రత్యేక పబ్లిక్ ఇంటర్ఫేస్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన పార్కింగ్, వాహనాలు–పాదచారులకు వేర్వేరు సర్క్యులేషన్ మార్గాలు, ల్యాండ్స్కేప్ బఫర్ జోన్లు, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు, అందమైన ఉద్యానవనాలు, మైక్రో కై ్లమేట్ వాటర్ ఎలిమెంట్స్ ఈ క్యాంపస్కు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. భారతీయ రైల్వేకు ల్యాండ్ మార్క్గా.. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయిన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే పరిపాలనా సముదాయాల్లో ఒకటిగా నిలుస్తుంది. భవిష్యత్ రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది రోల్మోడల్గా మారుతుంది. –సందీప్ మాథుర్, జనరల్ మేనేజర్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిష్టాత్మక వేడుకకు పటిష్ట ఏర్పాట్లు సాక్షి, మహారాణిపేట: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరిశీలించారు. శాఖల మధ్య సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అనితతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తదితర ఉన్నతాధికారులు నోవాటెల్ హోటల్, వి–కన్వెన్షన్ హాలులోని ప్రధాన కార్యక్రమ వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు లతామాధురి, మణికంఠ, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణ నమూనాచురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులు రూ.121.58 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అత్యాధునిక ప్రధాన కార్యాలయం ఇప్పటివరకు రూ.42.14 కోట్ల నిర్మాణ పనులు పూర్తి దేశానికే ఆదర్శంగా ఆధునిక రైల్వే అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను సకాలంలో చెల్లించండి డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిధిలోని ఆస్తి యజమానులు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి అర్థ సంవత్సర ఆస్తిపన్నును ఈ నెల 30లోగా తప్పనిసరిగా చెల్లించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. గడువులోగా పన్ను చెల్లించడం ద్వారా వడ్డీ భారం నుంచి మినహాయింపు పొందవచ్చని తెలిపారు. అలాగే జీవీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, మంచినీటి కుళాయి చార్జీలను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశాఖలో రూపుదిద్దుకుంటున్న భారతీయ రైల్వే భవిష్యత్తు ముఖచిత్రంవేడి కాదు.. వెలుగు మాత్రమే లోపలికి.. ఈ భవనంలో అత్యంత ప్రత్యేకత థర్మల్ కంఫర్ట్. విశాఖలాంటి తేమ అధికంగా ఉండే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని డీప్ వర్టికల్ ఫిన్స్, రీసెస్డ్ గ్లేజింగ్, ఇంటిగ్రేటెడ్ షేడింగ్ సిస్టమ్స్ను వినియోగిస్తున్నారు. దీంతో సూర్యరశ్మి నుంచి వచ్చే వేడి భవనంలోకి చేరకుండా అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో సహజ కాంతి మాత్రం సమృద్ధిగా లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఎయిర్ కండిషనింగ్పై ఆధారపడటం తగ్గి విద్యుత్ వినియోగం గణనీయంగా ఆదా అవుతుంది. ఉద్యోగులకు ఆహ్లాదకరమైన పని వాతావరణం ఏర్పడుతుంది. 10 -
షాడో
మాయాజాలం!అన్ని పనులకూ ఒకటే నిబంధన.. రూ.5 కోట్ల టర్నోవర్ మస్ట్ రూ.కోటి పనులకు ‘సింగిల్ వర్క్’ నిబంధనలు ఒక్కరికే పనులు కట్టబెట్టేలా టెండర్ నిబంధనల మార్పు కాంట్రాక్టులకు బహుమతిగా.. కమిషనర్ బంగ్లాలో రూ.50 లక్షలతో మినీ థియేటర్ మెట్రోపాలిటన్ ఖజానాకు ‘టెండర్’ పెడుతున్న షాడో చైర్మన్ వీఎంఆర్డీఏ టెండర్లలో అక్రమాలకు వత్తాసు పలుకుతున్న అధికారులు అంతా ‘అసిరితల్లి’ దయ అంటున్న షాడో చైర్మన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాధారణంగా ఎవరైనా అడ్డగోలు పనులను హడావిడిగా, గుట్టుచప్పుడు కాకుండా చేస్తారు. కానీ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) లోని ‘షాడో చైర్మన్’ మాత్రం చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఒక ‘మినీ థియేటర్’ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు, యుద్ధ విమానాన్ని క్లీన్ చేస్తున్నట్లు.. ఎంతో జాగ్రత్తగా, పద్ధతిగా అవినీతికి తెరలేపారు. మెట్రోపాలిటన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్కరికే అన్ని పనులు దక్కేలా ఆయన పక్కా స్కెచ్ వేశారు. వీఎంఆర్డీఏలో ఈ షాడో చైర్మన్ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తమకు కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. టెండర్లలో అసలు పోటీనే లేకుండా చేసి, తమకు కావలసిన కాంట్రాక్టర్కే పనులన్నీ అప్పగిస్తున్నారు. తాజాగా పిలిచిన టెండర్లన్నింటికీ ఒకటే తరహా నిబంధనలు పెట్టడం వీఎంఆర్డీఏ వర్గాల్లోనే తీవ్ర విస్మయం కలిగిస్తోంది. హౌస్కీపింగ్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులకు సంబంధించి సదరు సంస్థకు ఏకంగా రూ. 5 కోట్ల టర్నోవర్ ఉండాలంటూ కొత్త కొర్రీ పెట్టారు. అంతేకాకుండా కచ్చితంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల విలువైన ‘సింగిల్ వర్క్’ చేసిన అనుభవం ఉండాలని టెండర్ డాక్యుమెంట్లలో నిబంధనను చేర్చారు. దీనికి తోడు విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ అయిన సంస్థకు మాత్రమే అవకాశం ఉందంటూ.. ఎన్నడూ లేని విధంగా నిబంధన పెట్టడం షాడో చైర్మన్ అడ్డగోలుతనానికి నిదర్శనం. సాధారణంగా రూ. కోటి లోపు విలువైన హౌస్ కీపింగ్, మెయింటెనెన్స్ పనులకు ఇలాంటి ‘సింగిల్ వర్క్’ కండిషన్ ఎక్కడా ఉండదు. కానీ, మొత్తం పనులన్నీ ఒక్కరికే అప్పగించాలన్న దురుద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. అంతా ‘అసిరితల్లి’ దయ! టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లెవరూ పోటీ పడకుండా చేసేందుకు పన్నిన అసలైన పన్నాగం ‘లోకల్ రిజిస్ట్రేషన్’. విశాఖపట్నంలో మాత్రమే రిజిస్టర్ అయిన సంస్థలకే టెండర్లలో అవకాశం ఉంటుందని కఠిన నిబంధన విధించారు. రూ. 5 కోట్ల టర్నోవర్, సింగిల్ వర్క్ అనుభవం, విశాఖలోనే రిజిస్ట్రేషన్ ఉండాలనే ఈ అర్హతలు కేవలం ఒకట్రెండు సంస్థలకు మాత్రమే ఉన్నాయని ముందే నిర్ధారించుకుని మరీ ఈ వ్యవహారం నడిపారు. ముఖ్యంగా.. ‘మాతా అసిరితల్లి’ అనే సంస్థకే కాంట్రాక్టులన్నీ కట్టబెట్టేందుకు ఈ తంతు నడిపించినట్లు తెలుస్తోంది. అన్నీ తానై నడిపిస్తున్న షాడో చైర్మన్ ఎంతో ‘వినయ’ంగా సదరు సంస్థకే ఎండాడ, చీమలాపల్లి వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ల నిర్వహణ బాధ్యతల పనులను కూడా ఎలాంటి పోటీ లేకుండా అప్పగించేయడం గమనార్హం. -
సీపీఎం నాయకుల గృహనిర్బంధం
నక్కపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన సందర్భంగా రాజయ్యపేటలో సీపీ ఎం, మత్స్యకార నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు మాట్లాడుతూ ఇటీవల లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయని, వ్యర్థరసాయనాలు కలిసి ఉప్పుటేరు నీరు కలుషిత మవుతోందని, ఈ ఘటనలను మంత్రి దృష్టికి తీసుకెళ్తారనే భయంతో నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం అమానుషమన్నారు. ఫిష్ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన రాజయ్యపేట వచ్చిన మంత్రి మెప్పు కోసం పోలీసులు అతిగా వ్యవరించారని ఆరోపించారు. మత్స్యకార నాయకులు ఎం.మహేష్, బైరాగి రాజు, సోమేష్ తదితరులను బయటకు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. పోలీసులు చట్టాలను తమచేతుల్లోకి తీసుకుంటున్నారని, మత్స్యకారుల సమస్యలు మంత్రికి చెప్పుకునే అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కె.జె.పురంలో తండ్రికి తలకొరివి పెడుతున్న లక్ష్మి మాడుగుల రూరల్: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని కేజే పురంలో ఆదివారం జరిగింది. కె.జె.పురానికి చెందిన వేగి రామస్వామినాయుడు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య నాగమణి, కుమారైలు లక్ష్మి, సుప్రియ ఉన్నారు. కుమారులు లేకపోవడంతో రామస్వామినాయుడు మృతదేహానికి ఆయన పెద్ద కుమారై లక్ష్మి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించి, తండ్రి రుణం తీర్చుకుంది. -
పోలవరం మట్టి లూటీ!
కూటమి నేతల కనుసన్నల్లో తవ్వకాలు● పట్టపగలే లారీల్లో యథేచ్ఛగా తరలింపు ● అధికారుల అండతోనే దందా ● బలహీనపడుతున్న కాలువ గట్లు ● ఆందోళనలో ప్రజలు నక్కపల్లి: మట్టిమాఫియా బరితెగించింది. నియోజకవర్గంలో పోలవరం కాలువను గుల్ల చేస్తోంది. అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా తవ్వేసి తరలించుకుపోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు 6,7 ప్యాకేజీల కింద చేపట్టారు. పాయకరావుపేట నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని కొత్తలి వరకు ఈ పనులు నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 50 శాతం పైగానే పూర్తయ్యాయి. కాలువ తవ్వకాల్లో వచ్చిన మట్టిని గట్లుగా వేశారు. కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి గట్లుగా పోయడంతో అక్రమార్కుల కళ్లు ఈ మట్టిపై పడ్డాయి. నెలకు రూ.కోటి కొల్లగొట్టి.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రేయింబవళ్లు పొక్లెయిన్లతో తవ్వేసి లారీల్లో తరలించుకుపోతున్నారు. ఇలా రోజుకు 50 నుంచి 70 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నట్టు సమాచారం. టిప్పర్ మట్టి ధర రూ.4 వేలపైనే పలుకుతోంది. రోజుకు రూ.2 లక్షలు, నెలకు సుమారు రూ.కోటి వరకు వెనకేసుకుంటున్నారని భోగట్టా. నక్కపల్లి మండలం ముకుందరాజుపేట, రమణయ్యపేట, గుల్లిపాడు,సీతం పాలెం, ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నం,పాయకరావుపేట మండలం పి.ఎల్.పురం, సీతారాంపురం తదితర గ్రామాల పరిధిలో ఉన్న కాలువ మట్టిని తరలిస్తున్నారు. సమీపంలో ఉన్న అనధికార లేఅవుట్లకు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పునాదులు, అపార్ట్మెంట్లకు, వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు, అధికార ప్రైవేటు భవనాలకు వినియోగిస్తున్నారు. పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న పలు కంపెనీలకు కూడా ఈ పోలవరం మట్టిని అమ్ముకుని లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ముకుందరాజుపేట, రమణయ్యపేట గ్రామాల పరిధిలో పోలవరం కాలువ మట్టిని సమీపంలో టీడీపీ నాయకులకు చెందిన భూముల్లో వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పోలవరం కాలువ గట్లపై ఉన్న మట్టిని తవ్వడం వల్ల కాలువను ఆనుకుని ఉన్న గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. భారీ వర్షాలు పడిన సమయంలో ఎగువ ప్రాంతాల్లో వర్షంనీరు ఈ కాలువలో భారీగా చేరుతుందని, మట్టి తవ్వడం వల్ల గట్లు బలహీన పడి కాలువకు గండి పడే ప్రమాదముందని ముకుందరాజుపేట, గుల్లిపాడు, రమణయ్యపేట, సీతంపాలెం, రామయ్యపట్నం, డొంకాడ, సీతానగరం, పి.ఎల్.పురం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కళ్లముందే లక్షలాది క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టి తరలిపోతుంటే ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మట్టిని తరలించేవారికి కూటమిపార్టీల్లో ప్రముఖ వ్యక్తులతో సత్సంబంధాలు ఉండడం వల్లే అధికారులు వారిపై చర్యలకు వెనుకాడుతున్నారని తెలిసింది. మట్టితవ్వకాల వల్ల బలహీన పడుతున్న గట్లకు రక్షణ కల్పించాలని, పట్టపగలే నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర నియోజకవర్గంలోని 49వ వార్డు బర్మా కాలనీ పరిధిలోని నెహ్రూనగర్ కప్పరాడలో గల రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని స్థానిక నిరుపేద బర్మా కాందిశీకులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబరు 13/ఏ/14లో ఉన్న ఈ 3 ఎకరాల భూమిని కాపాడాలంటూ ఆదివారం లాసన్స్బే కాలనీలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజులను బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు.వైఎస్సార్సీపీ మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు ఆధ్వర్యంలో నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్య వేదిక కమిటీ ప్రతినిధులు నరసింహులు, అప్పారావు, దీపక్, శీను, బాబు, దేవా, రాజేష్, నారాయణరావు, శివకుమార్, రమేష్లతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న ఇటువంటి అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా వైఎస్సార్సీపీ తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ భూకబ్జా వ్యవహారాన్ని రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు. పలుమార్లు కలెక్టర్కు విన్నవించుకున్నా చర్యల్లేవు అనంతరం మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు, ఐక్య వేదిక ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం బర్మా కాందిశీకులకు నివాసాల నిమిత్తం ఈ సర్వే నెంబరులో స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. నివాసాల నిర్మాణం పోను మిగిలిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం కొందరు అక్రమార్కులు గూండాలతో కలిసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అక్కడ అనధికారికంగా ప్రైవేట్ షెడ్లు నిర్మించడమే కాకుండా, వాటికి యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.పేదలకు ఇళ్లు ఇస్తున్నామనే నెపంతో అడ్డగోలుగా ఇప్పటివరకు 40కు పైగా అక్రమ షెడ్లను నిర్మించి, ఒక్కో షెడ్డును రూ.4 లక్షల చొప్పున అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ ధర గజం రూ.80 వేల వరకు పలుకుతోందని, ఈ లెక్కన వంద కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజంగా ఇళ్లు లేని కాందిశీకులు చాలా మంది ఉన్నారని, ప్రభుత్వం వారిని గుర్తించి అర్హులైన వారికి మాత్రమే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ భూమిని కాపాడాలని జీవీఎంసీ కౌన్సిల్లో కూడా పలుమార్లు మాట్లాడినట్లు అల్లు శంకర్ రావు గుర్తుచేశారు. ఈ భూకబ్జాపై కలెక్టర్కు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి, రెవెన్యూ అధికారులకు పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కబ్జాను ప్రశ్నిస్తే.. తమకు స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని, పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తామంటూ అక్రమార్కులు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. -
బాబోయ్.. బండరాళ్ల లారీలు
● లైనుకొత్తూరు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన లారీ ● త్రుటిలో తప్పిన ప్రమాదం యలమంచిలి రూరల్: బండరాళ్ల లారీలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఈ లారీలు కూటమి పా ర్టీల ప్రజాప్రతినిధులవి కావడంతో స్థానిక పోలీసు,రవాణాశాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.ఆదివారం ఓవర్ లోడ్తో వెళ్తున్న ఓ బండరాళ్ల లారీ లైనుకొత్తూరు సమీపంలో బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఇతర వాహనాలు,జనం ఎవరూ లేకపోవడంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. నక్కపల్లి నుంచి రాంబిల్లి ఎన్ఏవోబీకి బండరాళ్లను తీసుకెళ్తున్న లారీ యలమంచిలి మండలం లైనుకొత్తూరు సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.లారీ వెనుక ఉన్న బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి.ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు.ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా బంగరాళ్లను లోడు చేసి రవాణా చేయడం,కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేల టన్నుల బరువు ఉన్న బండరాళ్లు జారి పడినప్పుడు గానీ,వాటిని రవాణా చేస్తున్న లారీలు ప్రమాదాలకు గురైనప్పుడు గానీ భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
లాలంకోడూరు కళాశాల విద్యార్థినికి షైనింగ్స్టార్ అవార్డు
యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం లాలంకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన శానాపతి రామశిల్ప షైనింగ్స్టార్ అవార్డుకు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాయుడు తెలిపారు.గత మార్చిలో జరిగిన ఇంటర్మీడియెట్ వార్షిక పబ్లిక్ పరీక్షల్లో రామశిల్ప హెచ్ఈసీ గ్రూపులో 723 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది.మండలంలోని పెదకలవలాపల్లి గ్రామానికి చెందిన రామశిల్ప తల్లిదండ్రులు కన్నయ్యనాయుడు,నాగేశ్వరి సాధారణ రైతులు.కుమార్తెకు అవార్డు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.రామశిల్పను ప్రినిపాల్ స్వామినాయుడు,అధ్యాపకులు అభినందించారు. -
అపోలో వైద్యుడు సతీష్రాజుకు జాతీయ స్థాయి పురస్కారం
మహారాణిపేట: విశాఖ అపోలో ఆసుపత్రి చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ సతీష్ రాజు ఇందుకూరిని ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం వరించింది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నిర్వహించిన 9వ టైమ్స్ నౌ డాక్టర్స్ డే కాన్క్లేవ్లో ఆయనకు ‘భారతదేశంలోని 20 మంది స్ఫూర్తిదాయకమైన ఆర్థోపెడిక్ సర్జన్లలో ఒకరు’ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేశారు. ఇండియన్ నేవీ డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్ లెఫ్టినెంట్ జనరల్ సీజీ మురళీధరన్ చేతుల మీదుగా డాక్టర్ సతీష్ రాజు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. సతీష్రాజు ప్రస్తుతం విశాఖ అపోలో హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ సర్జరీ బృందానికి నాయకత్వం వహిస్తూ, రోబోటిక్, రివిజన్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. -
నయన మనోహరం
పోర్టు వెంకన్న నౌకా విహారం డాబాగార్డెన్స్: పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం సాయంత్రం సాగరతీరంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవ, హోమాలు నిర్వహించిన అనంతరం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను విద్యుద్ధీపాలతో అలంకరించిన నౌకపై సాగర విహారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో శ్రీనివాస్, ప్రధానార్చకులు శ్రీనివాస జగన్నాథాచార్యులు భక్తులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా, సోమవారం ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం దొంగల దోపు ఉత్సవం, ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. -
97.75 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు
అనకాపల్లి ఎన్టీఆర్ కాలనీలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న వైద్య సిబ్బంది అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఐదేళ్లలోపు వయసున్న 1,63,803 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు చిన్నారులు 1,67,576 మందికి ఉండగా 97.75శాతం మందికి చుక్కలు వేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ విజయ కృష్ణన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈనెల 29,30న వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్వో ఎం.హైమావతి తెలిపారు. స్థానిక చిన్నరాజుపేట అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆమె పోలియో చుక్కలను వేశారు. అంతకుముందు అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో చిన్నారులకు తుమ్మపాల సీహెచ్సీ వైద్యసిబ్బంది పోలియోచుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు చోద్యం చూస్తున్నారు
పోలవరం కాలువ మట్టి తరలించుకుపోతుంటే మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజూ వందలాది లారీల్లో పట్టుకుపోతున్నారు. టీడీపీ వాళ్లనయితే చూసీ చూడనట్లువదిలేస్తున్నారు.అదే పేదలు ఇళ్లల్లో పునాదుల కోసం మట్టి తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తున్నారు. మట్టిని లూటీ చేయడం వల్ల దిగువ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. – వియ్యపు శ్రీను, రైతు, ముందుకురాజుపేటగ్రామాలు మునిగిపోయే ప్రమాదం కూటమి నేతల అండదండలతో పోలవరం కాలువ మట్టిని తరలించుకుపోతూ అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తున్నారు. గట్టు బలహీన పడి పరిసర గ్రామాలు, పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ మట్టిదందా అధికారులకు తెలిసే జరుగుతోంది. పునాదుల కోసం పేదలు తట్టమట్టి పట్టుకెళ్తే కేసులు రాస్తున్న అధికారులు, పట్టపగలే లారీల్లో తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారు.అక్రమార్కులకు కూటమినేత అండదండలు ఉన్నాయి. – చొప్పా శ్రీను, రైతు, ముకుందరాజుపేట -
క్యాట్వాక్తో కెవ్వుకేక
ఏయూక్యాంపస్: జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జేడీ వార్షిక డిజైన్ అవార్డులు–2026’ వేదికపై వినూత్న వస్త్రాలంకరణతో మోడల్స్ ర్యాంప్పై హొయలుపోయారు. బీచ్రోడ్డులోని ఒక హోటల్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్షోను రేస్ ఎంటర్టైన్మెంట్స్ సమన్వయంతో నర్విహించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. ఇలా పంచభూతాల ప్రేరణతో ‘వసుధైవ కుటుంబం’ అనే థీమ్తో విద్యార్థులు ఈ డిజైనర్ దుస్తులను మలిచారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కలర్ఫుల్ దుస్తులను ధరించి ముంబై, బెంగళూరు, పశ్చిమ బెంగాల్కు చెందిన మోడల్స్ ర్యాంప్పై నడుస్తుంటే వేదిక ధగధగలాడింది. సంస్థ చైర్మన్ రూపల్ దలాల్, డైరెక్టర్లు హర్ష్ దలాల్, కట్టమూరి ప్రదీప్, కట్టమూరి దివ్యలు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో ప్రతిభ కనబరిచిన యువ డిజైనర్లకు అవార్డులను అందజేశారు. -
● నీలి సాగరంలో.. నల్లటి విషం!
పచ్చని కొండలు.. నీలిరంగు సాగర జలాలు.. ప్రకృతి రమణీయత మధ్య సాగే పడవ ప్రయాణం ఎవరికై నా ఎంతో హాయినిస్తుంది. కానీ, ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం చూస్తే మాత్రం గుండె ఝల్లుమనక మానదు! ఒకవైపు సాగర పర్యావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఆకాశాన్ని కమ్మేసేలా దట్టమైన నల్లటి పొగను కక్కుతోంది ‘ఝాన్సీరాణి’ బోటు. అలాగే సామర్థ్యానికి మించి పర్యాటకులతో కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణం సాగుతోంది. పర్యావరణం, పర్యాటకుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోర్టు, మైరెన్ అధికారులపై ఉందని విశాఖ వాసులు గుర్తు చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఆటస్థలంలో మొక్కలు..విద్యార్థినులకు తిప్పలు
నాతవరం : కూటమి నేతలు అతి ఉత్సాహంతో గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థినులకు ఆట స్థలం లేకుండా చేసి వసతి సమస్య తెచ్చిపెట్టారు. మండలంలో తాండవలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారుగా 300 వరకు విద్యార్థినులు చదువుతున్నారు. అసలే విద్యార్థినులకు ఆటస్థలం లేక ఉన్న కొద్దిపాటి స్థలంలోనే దుస్తులతో పాటు ఇతర సామగ్రి ఎండలో ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఈనెల 27వ తేదీన అనంత ఆరణ్య మహోత్సవం సందర్భంగా ఇరుగ్గా ఉన్న ఆశ్రమ పాఠశాల ప్రాంగణం స్థలంలో కూటమి నేతలు తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజాన వీర సూర్య చంద్రతో పాటు టీడీపీ జనసేన నాయకులు, ఎంపీడీవో సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్భాటంగా మొక్కలు నాటారు. గతంలో ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన భవన నిర్మాణాలకు స్థలం చాలకపోవడంతో అప్పటి కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి ఆదేశాల మేరకు తాండవ ప్రాజెక్టుకు చెందిన ఇరిగేషన్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యార్థినులకు ఆటలు అడుకునేందుకు కొంత స్థలం మాత్రమే ఉండేది. ఆ స్థలంలో కూటమి నేతలు పూర్తిగా మొక్కలు నాటేయడంతో విద్యార్థినులు బయటకు రాకుండా గదిలోనే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వృక్షాలుగా పెరిగే మొక్కలు వేయడంతో అవి పెరిగాక భవనాలకు ప్రమాదం ఉంటుందని అంటున్నారు. పండ్ల మొక్కలు వేస్తే బాగుండేదని ఈ ప్రాంతీయులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
అనకాపల్లి/ఎస్.రాయవరం: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో మంత్రి అనిత, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈనెల 29,30న హెల్త్ సిబ్బంది ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్వో ఎం.హైమావతి, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి, డా. కె.చంద్ర శేఖర్ దేవ్, వైద్యులు జె.నరసింగ రావు, కృష్ణారావు, ఏ. రామచంద్ర రావు, గణాంకాల అధికారి ఈఈ లక్ష్మీ నారాయణ, ఎస్.రాయవరం వైద్యాధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పీవీ
బీచ్రోడ్డు: గడ్డు కాలంలో ఉన్న భారతదేశాన్ని తన అద్భుత సంస్కరణలతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. పీవీ 105వ జయంతి సందర్భంగా ఆదివారం గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన పీవీ, ఆర్థిక సంస్కరణలకు పితామహుడని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.నారాయణ, పార్టీ నాయకులు శ్రీవాత్సవ్, పల్లా దుర్గారావు, దండూరి సుబ్రహ్మణ్యం, జె.సురేష్, రాపాక శ్రీనివాస రావు, కొయ్య చిన్ని యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చాణక్యంతో అభివృద్ధి: దూరదృష్టి, రాజకీయ చాణక్యంతో పీవీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని హిందీ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. పీవీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీ బహుభాషా కోవిదుడని, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను పెంచిన మహానేతగా చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు పాల్గొన్నారు. -
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
నక్కపల్లి: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, బి.సి.జనార్దనరెడ్డి తెలిపారు. మండలంలో దొండవాక, బోయపాడు తీరాల్లో ిఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయపాడు, దొండవాక, రాజయ్యపేట,చందనాడ తీరాల్లో రెండు ఫిష్ ల్యాండింగ్సెంటర్లను నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కో ఫిష్ల్యాండింగ్ సెంటరును రూ.24.77 కోట్లతో నిర్మించనున్నట్టు తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఆధునిక మౌలిక వసతులు, సురక్షిత బోటు ల్యాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.రాష్ట్రానికి మంజూరైన మూడుఫిష్ల్యాండింగ్సెంటర్లలో రెండింటిని పాయకరావుపేట నియోజకవర్గానికి మంజూరు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో రూ.60 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ హస్టల్ను మంజూరు చేశామని, ఉద్దండపురం నుంచి తిరుపతి పాలెం వరకు రూ.7 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించామన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్, ఫిషరీస్ జేడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.మంత్రులు అనిత, జనార్దన్రెడ్డి -
‘విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’
మాట్లాడుతున్న ప్రేమ చంద్రశేఖర్ అనకాపల్లి: విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు కరువు భత్యం బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి సంస్థలో విలీనం చేయాలని, తెలంగాణ తరహాలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.48వేలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాడేందుకు కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు చెప్పారు. దీనిలో భాగంగానే ఎస్ఈ, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నామని, వచ్చేనెల 15న ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన, ఆగస్టులో చలో విద్యుత్ సౌధా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులందరూ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేపాడ సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు వి.రమేష్, జిల్లా నాయకులు గోపి, శేషు, రాజేష్, ఎస్.ఎం.జానీ, రాజేశ్వరరావు, అశోక్ కుమార్, ఎల్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గుడిలో బడి నిర్వహణ దారుణం
ఎస్.రాయవరం: మేజర్ గ్రామ పంచాయతీ తిమ్మాపురం శివారు కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను గుడిప్రాంగణంలో కూర్చోబెట్టి పాఠాలు బోధించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మండిపడ్డారు. శనివారం ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులు ఆ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకంలో ఈ పాఠశాలకు నిధులు విడుదలయ్యాయని, అవసరమైన సామగ్రి సమకూర్చినా ఉపాధ్యాయులు, కాంట్రాక్టరు ఎందుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏళ్లతరబడి రామాలయం వరండాలో తరగతులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హోం మంత్రి క్యాంపు కార్యాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలో ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రజాప్రతినిధులు ఎందుకుపట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా జిల్లాఉన్నతాధికారులు స్పందించి పాఠశాల భవననిర్మాణాలు పూర్తి చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.ఆదివారం నియోజకవర్గ పర్యటనకు వస్తున్న హోం మంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ నాయకుడు నానాజీ, విద్యార్థులు తల్లిదండ్రులు,ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
అనకాపల్లి
● జెట్టీ క్రెడిట్ జగనన్న ప్రభుత్వానిదే ● నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు.. ● నేడు ‘కూటమి’ శంకుస్థాపన ● రూ. 24 కోట్లు విడుదల చేస్తూ జీవో 7ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026నక్కపల్లి: గంగపుత్రులకష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్ లాండింగ్ సెంటర్(జెట్టీ)కి ఎట్టకేలకు మోక్షంకలిగింది.జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఫిష్ల్యాండింగ్ సెంటరు క్రెడిట్ కూటమిప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే చర్యల్లో భాగంగా అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత,రోడ్లు భవనాల శాఖా మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ జెట్టీ మంజూరు జగనన్న వల్లే సాధ్యమైందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. 2023లో రూ. 24.77 కోట్లు మంజూరు పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటలో జెట్టీ నిర్మాణానికి 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.24.77 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలపరిశీలన కూడా పూర్తయింది. ఢిల్లీనుంచి నేషనల్ ఓషనోగ్రఫీకి చెందిన ప్రత్యేక బృందం, శాస్త్రవేత్తల బృందాలు వచ్చి సర్వేచేసి జెట్టీ నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలమని నివేదికలు సమర్పించాయి. దొండవాక, రాజయ్యపేట సరిహద్దుల్లో ఈ జెట్టీనిర్మాణానికి దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు రావడంతో జెట్టీ నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఇదేదో తన ఘనతే అన్నట్లు ఈ ఏడాది జనవరిలో రాజయ్యపేటలో జెట్టీ మంజూరు చేస్తున్నట్లుప్రకటించి, రూ.24 కోట్లు విడుదల చేస్తూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంది. మత్స్యకారుల మెప్పుకోసం ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం అట్టాసంగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అనకాపల్లి వై– జంక్షన్ వద్ద మొక్కలు నాటుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ‘హరిత హారం‘ కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి వై– జంక్షన్ వద్ద సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ శౌర్యమాన్ పటేల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, భవిష్యత్తు తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దేశ సంపద, పరిశ్రమల భద్రతతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం కూడా సామాజిక బాధ్యత అని చెప్పారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సీఐఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు, ఎంటీపీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. జెట్టీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్న అప్పటి కలెక్టర్ రవిపటాన్ శెట్టి (ఫైల్) గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిధుల కేటాయింపు వివరాలురాజయ్యపేట జెట్టీకి మోక్షం -
‘పది’ంతల ప్రతిభకు పురస్కారాలు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదివి ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 మంది విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. జెడ్పీ సమావేశం మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన సేనాపతి పునీత్ కుమార్(592), ఇమంది దేవిక (592), వంగపండు శివసాయి అతిథి(591), అనకాపల్లి జిల్లాకు చెందిన ఆడారి ప్రణతి(593), తనకాల ఉషా(592), కనిగిరి హరిణి(591), అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పరుంబుడి దేవి(593), పెరుశెట్టి ఊర్మిళ(515), కె.కీర్తన(505) పురస్కారాలు అందుకున్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ జేసీ విద్యాధరి, అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీ తిరుమణి శ్రీపూజ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యానారాయణమూర్తి, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్, డిప్యూటీ సీఈవో రాజ్కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
యువతకు ఆదర్శం.. ఆయన సాహసం
అచ్యుతాపురం రూరల్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్న పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నీడి కృష్ణమోహన్కు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ 5 పదులు దాటిన వయస్సులో సుమారు 6500 కిలోమీటర్లు బైక్పై ప్రయాణం చేసి శిఖరం అధిరోహించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సాధించిన విజయం ఉపాధ్యాయ వర్గానికే కాకుండా విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయులు కృష్ణమోహన్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిని విజయాలు సాధించి దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు, గణేష్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బంగారం, వెండి చోరీ
ఎన్సీసీ విభాగంలో లోకజ్ఞ ప్రతిభ అచ్యుతాపురం రూరల్ : ఎన్సీసీ విభాగంలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యా ర్థిని లోకజ్ఞకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమని వ్యవస్థాపకుడు కూండ్రపు మూర్తి శనివారం విద్యార్థిని లోకజ్ఞను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 25న విశాఖపట్నం ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డీడీజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుందన్నారు. ఎన్సీసీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం, చురుకై న భాగస్వామ్యాన్ని ప్రదర్శించిన క్యాడెట్లలో ఆరుగురు బాలికలను డీడీజీ ప్రశంసాపత్రానికి ఎంపిక చేయగా వారిలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యార్థిని లోకజ్ఞ చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్, వివిధ ఎన్సీసీ యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్.రాయవరం: ధర్మవరం అగ్రహారంలో ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తులం బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు ఆపహరణకు గురైనట్టు ఎస్ఐ రమేష్ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన కలిగట్ల నాగ సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి గోకులపాడులో బంధువుల పెళ్లికి వెళ్లారని, ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువా తలుపులు తెరచి బంగారు చెవి దిద్దులు, వెండి వస్తువులు చోరీ చేసినట్టు ఎస్ఐ చెప్పారు. అందిన ఫిర్యాదు మేరకు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ ఆధ్వర్యంలో కేసునమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ ?
మునగపాక: కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దోచుకోవడం,దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే 33 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే విజయకుమార్ చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రాంబిల్లి మండలం పంచదార్లలో విలువైన కొండలను తవ్వేస్తూ అక్రమార్జనకు పాల్పడిన సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలుసని చెప్పారు. పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెట్టీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా గంగాదేవిపేట నుంచి మునగపాక వరకు ఉన్న సాగునీటి కాలువలను కప్పేసి రైతులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా కాలువలను కప్పేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. యలమంచిలి నుంచి అచ్యుతాపురం మీదుగా పరవాడకు రహదారి విస్తరణ చేస్తామంటూ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయడంలో ఎమ్మెల్యే విజయకుమార్ విఫలమయ్యారని విమర్శించారు. కాపు యువకుడు సాయికృష్ణ మృతి వెనుక ఎంతోమంది పోలీసుల పాత్ర ఉందని, వారి వెనుక ఉన్న నేతల ప్రమేయంపై ప్రభుత్వం ఎందుకు నిగ్గు తేల్చడం లేదని ప్రశ్నించారు. కూటమి నేతలు కుల రాజకీయం చేయడం విచారకరమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటతీరు సరిగ్గా లేదని, సినిమాల్లో పవన్కల్యాణ్ యాక్టింగ్ చేసినట్లు రాజకీయంగా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. కూటమి నాయకుల అన్యాయాలు, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,వైస్ ఎంపీపీ మళ్ల కాశీ సురేష్, రాంబిల్లి మాజీ ఎంపీపీ తిరుపతిరావు,పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ,కాండ్రేగుల జగన్,శరగడం జగన్నాథరావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో గాడి తప్పిన పాలన
అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని లాకప్డెత్లు చేస్తున్న తీరు కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. స్ధానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన గాడి తప్పాయని, యుద్ధాల వల్ల నిత్యావసర ధరలు పెరిగినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. అయోధ్య రామ మందిరం హుండీ కానుకల చోరీ కేసు సిట్కు కాకుండా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఆగస్ట్ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వాహించాలని, ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతుల సమస్యలపై నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సహాయ కార్యదర్శి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాకై ్సట్ తవ్వకాలపై రగడ
మహారాణిపేట (విశాఖ): గిరిజన చట్టాలను గౌరవించాలని, గిరిజన ప్రాంతాల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర కోరారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడు తూ, గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పోడియం వద్ద నిరసన సమావేశం ప్రారంభం కాగానే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరా జు ఆరోపించారు. అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగం, భారీ వాహనాల రాకపోకలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, దొండా రాంబాబు తదితరులు పోడియంను చుట్టుముట్టి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన చైర్పర్సన్ జె.సుభద్ర, గిరిజనుల హక్కులను కాలరాసే ఏ చర్యకై నా సహకరించవద్దని అధికారులను ఆదేశించారు. తవ్వకాలపై జీవోలు లేవు: జాయింట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడం లేదని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, సర్వేలు నిర్వహించేందుకు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని ఆమె వెల్లడించారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. అనంతరం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. గిరిజన రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందడం లేదని మాడుగుల ఎంపీపీ దాలపురెడ్డి వెంకట రాజారావు ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని సభ్యులు తెలిపారు. దీనిపై స్పందించిన గనుల శాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామ న్నారు. అనుమతులు పొందిన మేరకు మాత్రమే తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య,విద్య, వ్యవసాయ రంగాలను కూట మి సర్కార్ గాలికి వదిలి వేసిందని గొలుగొండ ఎంపీపీ మణి కుమారి ఆరోపించారు. పెదబయలు జెడ్పీటీసీ బొంజుబాబు మాట్లాడుతూ పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతోపాటు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా సమస్యలపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 108 వాహనాల పనితీరు బాగోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా డీఎంహెచ్వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం కాగా, ఆయనను సరెండర్ చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ సుభద్ర కోరారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, విద్య తదితర రంగా లకు ప్రాధాన్యత ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. ●అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గుర్తు చేశారు. అనంతగిరి మండలంలో ఐదు గ్రామాలను నాన్–షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, విశాఖపట్టం జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గతంలో బాకై ్సట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేసినట్టు చెప్పారు. -
రాష్ట్రంలో ఆరాచక పాలన
నర్సీపట్నం: చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలోని పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలసుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆ ప్రాంత వైఎస్సార్సీపీ సమన్వయకర్తలపై టీడీపీ గుండాలు దాడి చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రులు పేర్నినాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కాన్వాయ్పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతో పోలీసుల సమక్షంలో టీడీపీ గుండాలు ఆరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకుడు అప్పిరెడ్డి తప్పించుకోవడంతో టీడీపీ గుండాలు విసిరిన బండరాయి కానిస్టేబుల్కు తగలడంతో తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఆ ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిశారని, అవసరం అనుకుంటే న్యాయపోరాటం ద్వారా అండగా నిలుస్తానని జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షులు సమన్వయ కమిటీ వేశారన్నారు. రాజధాని పేరుతో అమరావతిలో కూటమి పాల్పడుతున్న ఆరాచకాలు బయట పడతాయనే దురుద్దేశంతో రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో దాడులు చేశారన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు, లోకేష్ ఆరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మాకవరపాలెం మండల అధ్యక్షుడు చిటికెల వెంకటరమణ, రాజుబాబు పాల్గొన్నారు. -
పోలియో రహిత సమాజమే ధ్యేయం
నాతవరం: పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, ఇందు కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రసంయుక్త సంచాలకుడు, పల్స్పోలియో జిల్లా అబ్జర్వర్ జె.నర్సింగరావు అన్నారు. ఆయన నాతవరం పీహెచ్సీని శనివారం తనిఖీ చేశారు. పీహెచ్సీలో గల ప్రధాన సమస్యలను వైద్యాఽధికారులు ప్రసన్నకుమార్, నాగభూషణరావులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో పోలియో వ్యాక్సిన్ నిల్వలు, పోలింగ్ బూత్ల ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్ రవాణా, మైక్రో ప్లానింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియోను నివారించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు చేశామన్నారు.సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 5ఏళ్ల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పలు చోరీ కేసుల్లో నిందితురాలి అరెస్టు
అనకాపల్లి: పలు చోరీ కేసుల్లో నిందితురాలిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ జి.ప్రమ్కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సబ్బవరం నుంచి అనకాపల్లి వస్తున్న ఆటోలోంచి గంటా మీనా అనే మహిళ దిగి వెళ్లిపోతుండగా అనుమానం వచ్చి విచారణ చేయగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామం 202 కాలనీకి చెందిన మీనా ఆటోల్లో ప్రయాణిస్తూ పలు చోరీలకు పాల్పడినట్టు చెప్పారు. ఈనెల 11న అనకాపల్లి పట్టణం భీమునిగుమ్మం ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరి సంచిని బ్లేడ్తో కోసి అందులోని రూ.20వేలు నగదు చోరీకి చేసినట్టు తెలిపారు. ఈనెల 17న విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఆటోఎక్కి ఒక మహిళ మెడలో సుమారు రెండున్నర తులాల బంగారు మంగళ సూత్రాలతో కూడిన పుస్తెల తాడును దొంగలించినట్లు చెప్పారు. నిందితురాలి నుంచి రెండు చోరీలకు సంబంధించి రెండున్నర తులాల బంగారం, రూ.14వేలు నగదు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. విలేకరుల సమావేశంలో క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష మొక్కలు లక్ష్యం
కశింకోట: జిల్లాలో అనంత అరణ్య కార్యక్రమంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తాళ్లపాలెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అనంత అరణ్య కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 70 వేల మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో 1,650 మొక్కలు నాటినట్టు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విరివిగా మొక్కలు నాటారు. డ్వామా పీడీ నిర్మలదేవి, అడిషనల్ పీడీ మణికుమార్, ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖరరావు, ఏపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కూటమి ‘మట్టి’ దందా..!
సబ్బవరం: సబ్బవరం మండలంలో సాగునీటి చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపించే గనులుగా మారిపోయాయి. వ్యవసాయం ముసుగులో చెరువుల నుంచి మట్టిని తోడేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది డంపర్లతో మట్టిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. కళ్లెదుటే సహజ వనరులు లూటీ అవుతున్నా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. వ్యవసాయ అనుమతుల ముసుగులో.. మండలంలోని సాగునీటి చెరువులు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ అవసరాల కోసం భూములను మెరక చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే అనుమతులను కొందరు అధికార కూటమి నేతలు, వారి అనుచరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. స్థానిక ఆదిరెడ్డిపాలెం పరిధిలోని పోతురాజు చెరువు, పెదనాయుడుపాలెంలోని నాయనప్ప చెరువు, బాటజంగాలపాలెంలోని చిక్కాలవాని చెరువులతో పాటు గొల్లలపాలెం చెరువుల్లో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు ఒక చోట.. తరలింపు మరో చోట వ్యవసాయ భూములను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం రైతులకు పరిమిత స్థాయిలో మాత్రమే మట్టి తరలింపు అనుమతులు జారీ చేస్తోంది. అయితే సబ్బవరం మండలంలో ఆ అనుమతుల ఉద్దేశాన్నే పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అనుమతి పొందిన రైతు భూమికి కాకుండా, పూర్తిగా భిన్నమైన ప్రాంతాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, లేఅవుట్లకు, కమర్షియల్ ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. అనుమతుల్లో పేర్కొన్న పరిమాణానికి మించి, కేవలం కొద్ది ట్రిప్పుల పత్రాలతో వందలాది ట్రిప్పుల మట్టిని దోచేస్తున్నారు. భారీ యంత్రాలతో చెరువులపై దాడి చెరువుల్లో జేసీబీలు, పొక్లెయిన్లు, ఎక్స్కవేటర్ల వంటి భారీ యంత్రాలతో మట్టిని తోడేస్తున్నారు. చెరువుల అడుగు భాగాన్ని లోతుగా తవ్వుతూ సహజ స్వరూపాన్ని మార్చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ డంపర్లు, లారీలు, ట్రాక్టర్లలో మట్టిని నింపి నిరంతరాయంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ఈ యంత్రాలు, వాహనాలు జోరుగా పనిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నియంత్రణ లేని తవ్వకాల వల్ల చెరువుల లోతు, కట్టల భద్రత, నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిని భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు ఈ అక్రమ మట్టి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు చెరువుల్లో ప్రభుత్వం అనుమతించిన పరిమితుల్లోనే మట్టి తవ్వకాలు జరిగేలా పర్యవేక్షణ చేపడుతున్నాం. రైతులు వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఈ మట్టిని వినియోగించాలి. అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్లు, లేఅవుట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలిస్తే వెంటనే అనుమతులు రద్దు చేస్తాం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కార్తీక్, ఏఈ, ఇరిగేషన్ శాఖ, సబ్బవరం మండలం -
పాముకాటుతో కూలీ మృతి
మాడుగుల రూరల్: మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను(40) పాముకాటుతో శుక్రవారం మృతి చెందాడు. కృష్ణాపురంలో నీరుకొండ ప్రసాదరావుకు చెందిన పామాయిల్ తోటలో ఉదయం కూలి పనికి వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా మధ్యాహ్నం అతడి కాలిపై పాము కాటేసింది. వెంటనే మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు భార్య లక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారైలు ఉన్నారు. రోజూ మాదిరిగానే పామాయిల్ తోటకు పనికి వెళ్లిన శ్రీను మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సెలింగ్
తుమ్మపాల: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (రేబాక)లో శుక్రవారం పాలిసెట్–2026 రెండవ రోజు కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. 80 మంది అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఐ.వి.ఎస్. ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి 20,001 నుంచి 42,000 వరకు ర్యాంక్లు సాధించిన విద్యా ర్థుల్లో 51 మంది బాలురు, 29 మంది బాలికలు హాజరయ్యారన్నారు. ఈ నెల 27 న 42,001 నుంచి 65,000 వరకు ర్యాంకు గల అభ్యర్థుల సర్టిఫికెట్లు ధ్రువీకరణ జరుగుతుందని తెలిపారు. -
మాలలపై హోంమంత్రి వివక్ష
పాయకరావుపేట: మాలలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతూ అన్యాయం చేస్తోందని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనిత సైతం మాలల పట్ల వివక్ష చూపుతున్నారని మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆరోపించారు.మాలల ఐక్యత చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన పాయకరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రవ్యాప్తంగా మాలల హక్కులు కాపాడుకోవడం కోసం చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను మాలలపై దాడులు , అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి స్పందించడం లేదని, కనీసం పరామర్శించడం లేదని చెప్పారు. మంత్రిగా కొనసాగే అర్హత ఆమెకు లేదన్నారు. హోంమంత్రితో పాటు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా మాలలకు వ్యతిరేకరంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. 18 మంది మాలలపై అత్యాచారాలు, దాడులు జరిగితే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మాలల పట్ల వివక్ష చూపిస్తున్నారని, మంత్రులు, కమిషన్ చైర్మన్లు అదే దారిలో ప్రయాణం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రిపై ప్రజల్లో నమ్మకంపోయిందని, ముఖ్యంగా మాలల్లో వారు నమ్మకం కోల్పోయారని చెప్పారు. రాష్ట్రంలో అడవులు, ప్రభుత్వ భూము లు, చివరకు సముద్రజలాలను కూడా కూటమి నాయకులు కబ్జాచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న 65లక్షలపెన్షన్లలో 25లక్షలు అగ్రవర్ణాల వారికే ఇస్తున్నారని చెప్పారు. మాదిగల్లో చెప్పులు కుట్టేవారికి, డప్పు కళాకారులకు పింఛన్లు ఇస్తున్నారని, మాలలకు మాత్రం పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. గ్రామస్థాయి నుంచే ప్రతి నియోజకవర్గంలో 25 వేల మాలల ఓట్లు తొలగించే కుట్రజరుగుతోందని ఆరోపించారు. మాలలు, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను తొలగించేందుకు యత్నిస్తున్నారు. మాలల్లో 40 శాతం మంది కూటమిపార్టీలకు, పవన్కల్యాణ్కు ఓట్లేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మాలలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలల హక్కుల సాధనకు విజయవాడ నడిబొడ్డున 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, దీని కోసం మాలల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోట్ల గంగాధర్,మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, మాల మహానాడు స్థానిక నాయకులు పెదపాటి మేఘరంజన్, నెలపర్తి అర్జున్, ఇంజరపు సూరిబాబు, గారా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనితకు మంత్రిగా కొనసాగే అర్హతలేదు ప్రతి నియోజకవర్గంలో 25వేల మాలల ఓట్ల తొలగింపునకు కుట్ర 10లక్షల మందితో విజయవాడలో సభ మాల మహానాడు రాష్ట్రఅధ్యక్షుడు వెంకటరావు -
ఊబిలో చిక్కుకుని యువకుడి మృతి
● ధారమటం జలపాతం వద్ద ఘటన ● గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు గొలుగొండ: కన్నవారికి పుత్రశోకం మిగిలింది. ఎదిగొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. సరదాగా జలపాతాల వద్ద స్నానం చేద్దామని అనుకున్న యువకుడు కాలుజారి ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకొన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన చుక్కల సాంబశివ(21) ప్రమాదశాత్తూ ధారమఠం జలపాతంవద్ద శుక్రవారం మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు ఈ ప్రాంత ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే..బంధువులైన వాడపల్లి మణికంఠ, పలక భానుప్రసాద్తో కలిసి జి. మాడుగుల గ్రామానికి చెందిన చుక్కల సాంబశివ(21) శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ధారమఠం శివా లయానికి వచ్చాడు. శివాలయం వద్ద నుంచి కొండఅంచున చాలా దూరం వెళ్లి అక్కడ మూడు కొండల నడుము ఉన్న జలపాతం వద్ద సాంబశివ స్నానం చేసే సమయంలో కాలుజారి పక్కనే ఊబి లో కూరుకుపోయాడు. అక్కడే ఉన్న మణికంఠ, భానుప్రసాద్ హుటాహుటిన గుడి వద్దకు వచ్చి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న స్థానికులు గొలుగొండ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో గొలుగొండ ఎస్ఐ పి.రామారావు, కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు ప్రమాదం జరిగిన ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించారు. సాంబశివ పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్టు గుర్తించి తాళ్లు, కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. దారమఠం వద్ద ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారికావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాంబశివ విశాఖ ఏయూలో ఇంజినీరింగ్(ఈఈఈ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. -
కూటమి నేతలు చెబితే విత్తనాలు
నాతవరం: మీకు నచ్చిన విత్తన రకం కావాలంటే కూటమి నేతలు చెబితే చాలు అధికారులు ఠంచనుగా ఇచ్చేస్తారు. అదే వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రైతులు వెళ్తే సవాలక్ష నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇది నాతవరం మండలంలో వరి విత్తనాల పంపిణీలో చూపిస్తున్న వివక్ష.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో జిల్లాలోనే నాతవరం మండలంలో అధిక విస్తీర్ణంలో వరి పంట రైతులు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మండలంలో 8 వేల నుంచి 10 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఖరీఫ్ సాగుకు 1,507 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు చేశారు. గత నెల 29వ తేదీన మండలానికి వచ్చిన నాలుగు రకాల విత్తనాలు 553 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు తరలించారు. ఈ నెల 12వ తేదీన చినగొలుగొండపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి ఆధ్వర్యంలో స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు రైతులకు విత్తనాలు పంపిణీని ప్రారంభించారు. స్పీకరుతో ఆర్భాటంగా పంపిణీ చేయడంతో రైతులందరికి కావలసిన విత్తనాలు సకాలంలో అందుతాయని ఆశించారు. కూటమి నేతలు చీటీలు రాసి ఇస్తే విత్తనాలు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది కొరత ఉండటంతో క్షేత్రస్థాయిలో కూటమి నేతలు ఇష్టానుసారంగా పెత్తనం చేస్తున్నా రు. కొన్ని గ్రామాల్లో వరి విత్తనాలు కూటమి నేతలు వద్దకు వెళ్లి చీటీలు రాసి తెచ్చుకుంటే కావలసిన రకం విత్తనాలు ఇస్తున్నారు. నేరుగా రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే విత్తనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. రేపుమాపు రావాలంటూ రైతులను తిప్పించుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. తాండవ రిజర్వాయరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామంటూ అధికారులు ప్రకటన చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులకు కావలసిన వరి విత్తనాలు పంపిణీ చేయడంలో వివక్ష చూపకుండా కూటమి నేతలు పెత్తనం లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు. రైతులకు వరి విత్తనాలు పంపిణీలో వివక్ష అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో పంపిణీ వైఎస్సార్సీపీ మద్దతు రైతులకు ఇబ్బందులు -
ఆటోడ్రైవర్ నిజాయితీ
యలమంచిలి రూరల్: బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తన ఆటోలో మర్చిపోయిన ప్రయాణికురాలికి తిరిగి ఆ బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ను పోలీసులు,సహచర ఆటోడ్రైవర్లు ప్రశంసించారు.అతని నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు రూ.500 నగదు బహుమతి అందజేశారు.వివరాలివి..గుంటూరుకు చెందిన మహిళ బత్తుల రమణ యలమంచిలి మండలం ములకలాపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చి, తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు ములకలాపల్లి గ్రామంలో ఆటో ఎక్కింది.యలమంచిలి బస్టాండుకు చేసుకున్నాక తన బ్యాగును ఆటోలో మర్చిపోయి దిగిపోయింది.తర్వాత బ్యాగు మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి ఆటో కోసం వెతకసాగింది.సమీపంలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామారావుకు విషయం చెప్పింది.ఇద్దరూ కలిపి ప్రధాన రహదారిపై ఆటోకోసం వెతుకుతున్న సమయంలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిన ఆటోడ్రైవర్ అక్కడకు వచ్చి నా ఆటోలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిందని హెడ్ కానిస్టేబుల్ రామారావుకు చెప్పాడు. బ్యాగు తనదేనని చెప్పిన ప్రయాణికురాలు రమణకు పట్టణ పోలీసుల సమక్షంలో బ్యాగును అప్పగించారు.బ్యాగులో తులంపావు బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు.మర్చిపోయిన బ్యాగును నిజాయితీగా అప్పగించిన ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అందిబోయిన సత్యనారాయణను పట్టణ ఎస్ఐ సావిత్రి అభినందించారు. బంగారు ఆభరణాలతో మర్చిపోయిన బ్యాగు అప్పగింత -
ఇప్పటి వరకూ పంపిణీ చేసినవి 13,763 క్వింటాళ్లు
మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,70,569 ఎకరాలు ఖరీఫ్కు సిద్ధం చేసిన విత్తనాలు 22,062 క్వింటాళ్లు వీటిలో వరి విత్తనాలు 21,000 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నది 3,485 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ 2,722 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినవి 928 క్వింటాళ్లు గడ్డి విత్తనాలు 1062 క్వింటాళ్లు జిల్లాలో రైతు సేవా కేంద్రాలు 432 సాక్షి, అనకాపల్లి : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సాగుకు సిద్ధం చేస్తూ, వరి నారు వేసుకునేందుకు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నా రు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందస్తుగా రావడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం, భరోసా కరువవ్వడంతో వారిలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. విత్తనాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతులకు పంపిణీ చేసేందుకు 22,062 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటికి 14,691 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వరి విత్తనాలు 13,763 క్వింటాళ్లు రైతులకు అందజేశారు. యూరియా 2,722 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా, 3,485 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్టు అధికా రులు తెలిపారు. రెండేళ్లుగా పంట నష్టాలు.. గత రెండేళ్లగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అన్నదాతలు తీవ్ర పంట నష్టాలను చవి చూశారు. దీనికి తోడు పెట్టుబడి సాయం అందకపోవడంతో జిల్లాలోని మెజారిటీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా ప్రకృతి సహకరించి, ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, ఎరువులు సకాలంలో అందితే ఆశించిన మేర దిగుబడులు సాధించవచ్చని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులకు నకిలీల ముప్పు లేకుండా, ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ఈ ఏడాదైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా రైతాంగం కోరుతోంది. గత చేదు అనుభవాలు..వెంటాడుతున్న భయం గత ఏడాది రైతు సేవా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా పంపిణీ చేసిన వరి విత్తనాలు నాసిరకంగా ఉండడంతో రైతులు నిలువునా మునిగిపోయారు. పంపిణీ చేసిన విత్తనాల్లో మొలక శాతం పరీక్షించకుండానే నేరుగా రైతులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో పొల్లు, కేళీలు (కల్తీలు) ఎక్కువగా ఉండడం వల్ల వరి నారు సరిగ్గా మొలకెత్తలేదు. దీంతో పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై, నష్టాల బాట పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విత్తన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిర్వీర్యమైన అగ్రి ల్యాబ్స్..! ‘విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది.. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు’. రైతులు నకిలీ, నాసిరకం విత్తనాలతో మోసపోకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ’వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్’ను అందుబాటులోకి తెచ్చింది. ల్యాబ్స్లో విత్తనాలను క్షుణ్ణంగా పరీక్షించి, నాసిరకం, పొల్లు లేకుండా నిర్ధారించిన తర్వాతే రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అగ్రి ల్యాబ్స్ను పూర్తిగా నిర్వీర్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్స్ పనితీరు మందగించడం వల్లే మార్కెట్లోకి నాసిరకం విత్తనాలు వస్తున్నాయని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నాణ్యతపై రాజీలేదు... ఈ ఏడాది ఖరీఫ్కు నాణ్యమైన వరి, చెరకు, పత్తి, అపరాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం. జిల్లాలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. నాణ్యతలో ఎక్కడా రాజీపడేది లేదు. రైతు సేవా కేంద్రాల్లో, ప్రైవేట్ దుకాణాల్లో ఎక్కడా నకిలీ విత్తనాల పంపిణీకు ఆస్కారం లేదు. అలా మా దృష్టికి వస్తే వారిపై చర్యలుంటాయి. ఖరీఫ్ సాగుకు ముందు మండల అగ్రికల్చర్ అధికారులు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రి అసిస్టెంట్లతో ఖరీఫ్ పంటలపై, భూసారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైతు వరి నారు వేసే సమయంలో భూసారం, జింకు లోపం వంటివి సమతుల్యంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. – ఆశా దేవి, జిల్లా వ్యవసాయ అధికారి నాసిరకం విత్తనాలతో నష్టంగత ఏడాది ఖరీఫ్ సీజన్లో బుచ్చెయ్యపేట మండలంలో కేపీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి శ్రీను రైతు సేవా కేంద్రంలో ఆర్జేఎల్ 2537 రకం మూడు బస్తాల వరి విత్తనాలను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దమ్ము చేసి వరి నారు వేశారు. విత్తనాలు వేసి 18 రోజులైనా సరిగా మొలకెత్త లేదు. మూడు బస్తాలు విత్తనాలు వేస్తే.. ఒక బస్తాకి తగ్గ వరి విత్తనాల వేస్తే వచ్చే నారు వలే పలుచగా తయారైంది. ఇతర రైతులకు చూపించగా నాసిరకం విత్తనాలుగా గ్రహించారు. రైతు సేవాకేంద్రంలో అగ్రి అసిస్టెంట్ను ప్రశ్నించగా మాకు ఇలానే వచ్చాయి. అవే ఇచ్చామని చెప్పారు. ఆ రైతు ఏమి చేయలేక ప్రైవేట్ దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసి, వేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో నాతవరం మండ లం ఎస్బీ పట్నం గ్రామానికి చెందిన గాడి గణేష్ రైతు సేవా కేంద్రంలో 1,262 రకం నాలుగు బస్తాల వరి విత్తనాలు తీసుకున్నారు. వరి నారు వేయడానికి ఆ మూటలు విప్పగా అందులో కేళీ ధాన్యం ఎక్కువగా ఉన్నాయి. 30 శాతానికి పైగా కేళీ ఉండడంతో ఆ బస్తాల నుంచి పొల్లుగా ఉన్న విత్తనాలను సెపరేట్గా చేసి నారు వేశారు. దీంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే సరిచేస్తామని చెబుతున్నారు. విత్తు... ఆదమరిస్తే విపత్తు! -
మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం
నర్సీపట్నం: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి అబిద్సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. అబిద్సెంటర్లో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా విద్య, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకొని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ గపూర్, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావు, దామోదర్నాయుడు, రామారావు, రాజారావు, తారకేశ్వరరావు, రుషికేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు -
గుడ్డిప విద్యార్థికి మద్రాస్ ఐఐటీలో సీటు
రావికమతం: రైతు కుటుంబంలో పుట్టిన మాచపల్లి సంతోష్కుమార్ మద్రాస్ ఓషన్ స్ట్రక్చ ర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్లో సీటు సంపాందించాడు. రావికమతం మండలం గుడ్డిప గ్రామానికి చెందిన సంతోష్కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన గేట్ పరీక్షలో సత్తా చాటి ఆలిండియాలో 6వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా మద్రాస్ ఓషన్ స్ట్రక్చర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్లో సీటు ఖరారు చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, గంగాభవాని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి సంతోష్కుమార్ను గ్రామ పెద్దలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందించారు. -
అప్పన్నను దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వద్ద ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కప్పస్తంభాన్ని జస్టిస్ నవీన్ చావ్లా ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నా రు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకు లు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో తిరుమలేశ్వరరావు ఆయనకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. -
షైనింగ్ స్టార్ అవార్డుకుకేజీబీవీ విద్యార్థిని ఎంపిక
అచ్యుతాపురం రూరల్ : రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ అవార్డుకు అచ్యుతాపురం కేజీబీవీ విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రిక ఎంపికై నట్టు మండల విధ్యాశాఖ అధికారి దేవరాయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అచ్యుతాపురం మండలానికి చెందిన విద్యార్థిని ఎంపికవడం గర్వకారణమన్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కేవలం ఒక్క విద్యార్ధిని ఎంపికవడం విశేషమన్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 29న మంగళగిరిలో రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రికతో పాటు తల్లిదండ్రులు తప్పనిసరిగా జూన్ 28 మద్యాహ్నం 2 గంటలలోపు మంగళగిరికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు విద్యార్థినికి అభినందనలు తెలిపారు. -
చేపల మృతిపై నివేదిక బహిర్గతం చేయాలి
నక్కపల్లి: ఇటీవల బోయపాడు సముద్ర తీరంలో లక్షలాది చేపలు మృతి చెందిన ఘటనపై నివేదికను బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మత్స్యకారులతో కలసి నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 20వ తేదీన బోయపాడు, రాజయ్యపేట సముద్రతీరాల్లో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. సెంట్రల్ మైరెన్, ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫిషరీస్శాఖ అధికారులు వచ్చి పరిశీలించారన్నారు. చనిపోయిన చేపలు, సముద్రజలాల శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపించారని చెప్పారు. సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు నివేదికలు బహిర్గతం చేయలేదని తెలిపారు. గతంలో కూడా ఇలాగే వేల సంఖ్యలో చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వస్తే సముద్రంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందని, వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల చేపలు చనిపోయాయని సంబంధిత అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ఇప్పుడు కూడా వాస్తవాలు దాచిపెట్టి రసాయన కంపెనీలను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాకినాడ జిల్లాలో ప్రజ లు వ్యతిరేకించడంతో బల్క్డ్రగ్పార్క్ను ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ఈ పార్క్ కార్యకలాపాలు ప్రారంభమైతే చేపలే కాకుండా మనుషులు కూడా మరణించే ప్రమాదం ఉందని చెప్పారు. మత్స్యకారుల ఉపాధికి, ఉనికి ముప్పు వాటిల్లుతుందన్నారు. మత్స్యకారుల మనుగడకు నష్టం కలిగించే చర్యలకు ప్రభు త్వం పూనుకోవడం సమంజసం కాదన్నారు. తక్షణమే బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు ఎం.మహేష్, సోమేష్, బి.నూకరాజు, కె.దేముడు, వీరబాబు, అప్పలరాజు, కాశీరావు, రమణ,కాశీ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకుల డిమాండ్ -
కొండలను తవ్వేస్తున్న మాఫియా
చోడవరం: తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టు గా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. యంత్రాల తో కొండలను పిండిచేసి రాత్రికి రాత్రే లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తోంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మండలంలోని ముద్దుర్తి, అంబేరుపురం, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, ఎం.కొత్తపల్లి, నంబారువానిపాలెం, వెంకన్నపాలెం, నర్సాపురం, రాయపురాజుపేట, భోగాపురం గ్రామాల పరిధి కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నడుస్తున్నాయి. అక్రమార్కులు ఈ కొండలను కొల్లగొడుతున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో పొక్లెయిన్, జేసీబీల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నా రు. ముద్దుర్తి కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై ఇప్పటికే పీజీఆర్ఎస్లో అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. రాత్రిళ్లు ఎక్కువగా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. ముద్దుర్తి, గంధవరం, అడ్డూరు, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే కొండల నుంచి గ్రావెల్ మెటల్, మట్టిని తవ్వేసి రియల ఎస్టేట్ భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. కొందరు స్థానిక వీఆర్వోల సహకారంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపణ లు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మైన్స్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనధికారంగా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమా దం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు
అనకాపల్లి : పారిశ్రామిక ప్రాంతంలో పరవాడ సమీపంలో ఉన్న కల్పక– అచ్యుతాపురంలో ఉన్న బ్రాండిక్స్ సబ్స్టేషన్ల మధ్య 220 కేవీ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొలుగొండ, నాతవరం మండలాల పరిధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులకు రోజుకు రెండు విడతల్లో మొత్తం 9 గంటల పాటు త్రీ–ఫేజ్ విద్యుత్ సరఫరా చేయనున్నామని, మొదటి ఫేజ్గా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు (4 గంటలు), రెండో ఫేజ్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు (5 గంటలు) వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున రైతులు ఈ సమయాలను గమనించి, అధికారులకు సహకరించవలసిందిగా ఎస్ఈ ప్రసాద్ కోరారు. -
ఆర్.భీమవరంలో అధికారుల పర్యటన
బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరంలో అధికారులు పర్యటించారు. ఆర్. భీమవరంను వేధిస్తున్న కిడ్నీ సమస్యపై గురువారం ప్రచురితమైన సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఉమా మహేశ్వరరావు, చోడవరం ల్యాబ్ నీటి సాంద్రత సిబ్బంది, వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. కిడ్నీ సమస్యతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి వివరాలు, ఇంకా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారి వివరాలు అధికారులు సేకరించారు. పలువురు ఇళ్లకు వెళ్లినపుడు మంచినీరు వల్లే కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు పలువురి ఇళ్లకి వెళ్లి కుళాయిల నుంచి అలాగే గ్రామం అంతటికి నీటిని సరఫరా చేస్తున్న బోరు పంపు నుంచి వేరువేరుగా నీటి శాంపిల్స్ తీసి పరీక్షించారు. అలాగే చోడవరం, విశాఖ ల్యాబ్లకు శాంపిల్స్ తీసిన నీటిని తరలించారు. గ్రామంలో తాగునీరు కలుషితం అవుతున్నదీ లేనిది మంచినీటి పైపులను పరిశీలించారు. ల్యాబ్ల నుండి వచ్చిన మంచినీటి రిపోర్టులు ఆధారంగా కిడ్నీ సమస్య ఎందుకు వస్తున్నది తెలియజేస్తామని గ్రామ పెద్దలు బల్లిన అమ్మునాయుడు, గొల్లవిల్లి సత్యనారాయణ, నాయుడు తదితరులకు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ కె. ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
అతిథి అథ్యాపకులకు దరఖాస్తులు
యలమంచిలి రూరల్: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ, డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసేవారు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీల్లో కనీసం 55 శాతానికి మించి మార్కులు పొంది ఉండాలన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్ స్లెట్,పీ హెచ్డీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆశక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాల ఐక్యూఏసీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. -
గ్రావెల్ అక్రమ రవాణా అడ్డగింత
మునగపాక : ఎటువంటి అనుమతులు గాని రికార్డులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న లారీలను వైఎస్సార్సీపీ నేతలు కాండ్రేగుల జగన్, సియాద్రి బుజ్జి తదితరులు అడ్డుకున్నారు. మండలంలోని తిమ్మరాజుపేట జంక్షన్ దరి ప్రైవేటు స్థలాన్ని కప్పేందుకు లారీలతో వస్తున్న లారీలను గురువారం సాయంత్రం అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు లేకుండా పోతున్నాయన్నారు. ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టేలా కూటమి నేతల ప్రోత్సాహంతో దందా జరుగుతుందన్నారు. అక్రమ వ్యాపారం చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలకు గ్రావెల్ గాని మట్టి గాని తరలించాలంటే తప్పనిసరిగా సంబంధిత ఽఅధికారుల అనుమతులు కావాల్సి ఉన్నా కొంతమంది కూటమి నేతలు అక్రమార్జన కోసం వ్యాపారం చేస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను స్టేషన్కు తీసుకువచ్చారు. సంబంధత వాహన దారులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
వరాహనదిలో బాలుడు గల్లంతు
ఎస్.రాయవరం : బంగారమ్మపాలెం సమీపంలో శారదా, వరాహనదుల కలయిక వద్ద వరాహనది ప్రాంగణంలో 9వ తరగతి విద్యార్థి ఈతకోసం వెళ్లి గల్లంతైనట్టు ఎస్ఐ రమేష్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కారే అశోక్(14) గురువారం సెలవు కావడంతో గ్రామంలో శివారులో వరాహనదిలో తెప్పలు నిలిపే చోటుకు వెళ్లి ఈత కోసం నదిలో దిగి గల్లంతయ్యాడని చెప్పారు. వెంటనే స్థానికులు వెతికినా కనిపించకపోవడంతో, సమీపంలో ఉన్న ఎన్ఏవోబి సిబ్బందిని, బాలుడిని వెతికేందుకు సహకరించాలని ఎస్ఐ కోరడంతో ఆ సిబ్బంది నదిలో సాయంత్రం వరకు గాలించారు. గల్లంతైన వెంటనే బాలుడు నది అడుగున ఉన్న ఊబిలో కూరుకు పోయి ఉండవచ్చని చెబుతున్నారు. చీకటి పడడంతో గాలింపు పనులు నిలిపివేసి, శుక్రవారం మరళా గాలింపు చేస్తామని చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
నీటి నిల్వలతో తాండవ కళకళ
నాతవరం : జిల్లాలో ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరులో నీటినిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో సాగుకు నీటి విడుదల సకాలంలోనే విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాండవ రిజర్వాయరు ప్రఽమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా డేడ్ స్టోరేజీ 345 అడుగులుగా అధికారులు పరిగణిస్తారు. తాండవలో నీటి మట్టం గురువారం సాయంత్రానికి 374.6 అడుగులు ఉంది. గత నెలలో నీటి మట్టం 373,6 అడుగులు ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరడంతో తాండవ ప్రాజెక్టులో ఓ మోస్తరు నీటి మట్టం పెరిగింది. తాండవ రిజర్వాయరు నీరు అధారంగా అనకాపల్లి జిల్లాలో నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం, పాయకరావుపేట మండలాలు ఉండగా కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని, రౌతులపూడి, శంఖవరం మండలాలు పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారుగా 52వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులు తాండవ ప్రాజెక్టు కమిటీ సభ్యులు ఆయకట్టుదారులు సాగు రైతులు అభీష్టం మేరకు నీటి మట్టాన్ని పరిశీలించి నీటిని ఆగస్టులో ప్రధాన గేట్లు నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో నీటి మట్టం సమృద్ధిగా ఉండడంతో రైతులు ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు ఆమోదం మేరకు ముందుగానే నీరు విడుదల చేసే అవకాశం కన్పిస్తుంది. రానున్న కాలంలో భారీ వర్షాలు కురిసి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో నీరు పెరిగితే తాండవ రిజర్వాయరు నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరితే వృథాగా నీటిని స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి విడుదల చేస్తుంటారు. అందుచేత ప్రస్తుతం తాండవ ప్రాజెక్టులో నీటి నిల్వలు బాగుండడంతో ఖరీఫ్లో సాగుకు సకాలంలో నీరు విడుదల చేసేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై తాండవ ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామని ఆయకట్టు పరిధిలో రైతులంతా వరినారు సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
స్కూళ్లు, వసతి గృహాల్లో దోమల నివారణకు చర్యలు
కోనాం బాలుర వసతి గృహంలో వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా అధికారులు చీడికాడ: పాఠశాలల్లో,వసతి గృహాల్లో దోమల నివారణపై తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలదొర, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జి.మంగవేణి పాఠశాల, వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలోని కోనాంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను వారు గురువారం సందర్శించారు. ఇటీవల కోనాంలో బాలుర ఆశ్రమ పాఠశాలలో ఐదుగులు,బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు, అప్పలరాజుపురం ఎస్సీ వసతి గృహం ముగ్గురు విద్యార్థులకు వైద్యపరీక్షల్లో మలేరియా జ్వరాలు సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు,వసతి గృహాలను పరిశీలించారు. వెంటనే దోమల నివారణతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని పాఠశాల సిబ్బందిని, వైద్యసిబ్బందికి సూచనలు జారీ చేశారు. -
శ్రద్ధ చూపండి
పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీపై తుమ్మపాల : ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. పీజీఆర్ఎస్కు అందుతున్న ప్రజా వినతులను సంబంధిత మండలాలకు వెంటనే పంపించి, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు నెలలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ కొందరికి అందలేదని అర్జీలు వస్తున్నాయని తక్షణమే మిగిలిన వాటిని పంపిణీ చేయుటకు శ్రీకారం చుట్టాలని ఎమ్మార్వోలు, వీఆర్వోలను ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వేలో ఎంత భూమి సాగు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిపోయాయా లేదా చూసి ఈ– కే వైసీ ద్వారా ఆధార్ నెంబరు, డాక్యుమెంట్ నెంబర్ చెక్ చేసుకొని పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయలన్నారు. జేసీ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్ బుకింగ్, ఓడీఎఫ్ గ్రామాలు, డీఆర్డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్య ఘర్ యోజనలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ ఓడీఎఫ్ హోదాను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ వై.శ్రీనివాస్తో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎస్.రాయవరం : బైకుతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గుర్రాజుపేట గ్రామానికి చెందిన గొంప అప్పారావు(42) గ్రామం నుంచి తన బైకులో పెట్రోలు పోయించుకునేందుకు రేవు పోలరవం వైపు బయలుదేరాడు. ఈ సమయంలో బైకు స్టాండ్ తీయకపోవడంతో సైడ్ స్టాండ్ రోడ్డుకి తగిలి బైకు అదుపు తప్పింది. ఆర్వీనగర్ పేటగడ్డ మదుంవద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం అయ్యింది. స్థానికులు వెంటనే అప్పారావును నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయం
యలమంచిలి రూరల్ : మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల వినియోగం విద్యార్థులు, యువత భవిష్యత్తులను నాశనం చేస్తుందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభిప్రాయపడ్డారు. నషా ముక్త్ భారత్ సప్తాహ్లో భాగంగా గురువారం యలమంచిలి భాష్యం స్కూల్లో వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వలన కలిగే నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే స్నేహితులను దూరంగా ఉంచాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కష్టమవుతుందన్నారు. దేశాభివృద్ధికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. భావితరాల సంక్షేమం దృష్ట్యా మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ తమ వంతు కృషి చేయాలన్నారు. పరవాడ డీఎస్పీ బి. మోహన్రావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగించినా, అమ్మినా, రవాణా చేసినా కటకటాల పాలవుతారన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం డ్రగ్స్కు దూరంగా ఉంటామని,దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ శ్రీనివాసులు,యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎన్డీపీఎస్ విభాగం సీఐ పిల్లా రమేష్, ఎస్ఐలు కె.సావిత్రి, ఎం.ఉపేంద్ర, బి. రామకృష్ణ, ప్రసాదరావు, మహిళాశిశు సంక్షేమం సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
అండర్–16 విశాఖ జట్టు విజయం
విశాఖ స్పోర్ట్స్: ఏసీఏ అండర్–16 మల్టీడే అంతర జిల్లాల నార్త్జోన్ క్రికెట్ పోటీల్లో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు తొలి ఇన్నింగ్స్లో 61 పరుగులకే ఆలౌటైంది. విశాఖ బౌలర్లలో యతీష్ మూడు వికెట్లు పడగొట్టగా, రామ్చరణ్, లోహిత్, భాను తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన విశాఖ జట్టు 6 వికెట్ల నష్టానికి 749 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ చైతన్య 82 పరుగులు చేయగా, గణేష్కృష్ణ 210 పరుగులతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రామ్చరణ్ (119), రుత్విక్ (నాటౌట్ 100) సెంచరీలతో రాణించగా, చెరిష్వర్ధన్ 86 పరుగులు చేశాడు.భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 92 పరుగులకే ఆలౌటైంది. మణివర్ధన్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విశాఖ బౌలర్లలో లోహిత్ నాలుగు వికెట్లు, భాను మూడు వికెట్లు, యతీష్ రెండు వికెట్లు పడగొట్టారు.దీంతో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరికలు
ఎస్.రాయవరం: అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. భీమవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఇరువురు సీనియర్ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇతరులతో కలిపి పది మంది వైఎస్సార్సీపీలో చేఆరు. కంబాల జోగులు వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంబాల జోగుల మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే చతికిలబడిందని ఎద్దేవా చేశారు. కుట్ర రాజకీయాలతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మరింత సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మధువర్మ, స్థానిక గ్రామ కమిటీ అద్యక్షులు గరగా శ్రీనివాసరావు, పార్టీలోచేరిన పాలపర్తి శ్రీను, రామారావు కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘బొడ్డేడ’ రచనకు జాతీయ స్థాయి బహుమతి
కశింకోట: కశింకోటకు చెందిన కథా రచయిత బొడ్డేడ బలరామస్వామి రాసిన ‘మొక్కు’ కథ జాతీయ స్థాయి కథల పోటీలో వరుసగా మూడోసారి తృతీయ బహుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన 2026 కథల పోటీ ఫలితాలను బుధవారం ప్రకటించగా బహుమతి వచ్చినట్లు బలరామస్వామి తెలిపారు. ఈ మేరకు పది వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో వచ్చే నెల 19,న జరిగే కార్యక్రమంలో బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో 2024లో డేగ, 2025లో తోడపెద్దు కథలకు తృతీయ బహుమతులు వచ్చాయన్నారు. సాహితీవేత్తలు, స్థానిక పెద్దలు బహుమతి పొందిన బలరామస్వామిని అభినందించారు. -
గిరిజన యువతి జాతీయ స్థాయి ప్రతిభ
ముంచంగిపుట్టు : న్యూఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్(ఐఎన్ఐ–సెట్)–2026 జూన్ సెషన్ ఫలితాలలో ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామానికి చెందిన గిరిజన యువతీ డాక్టర్ చిట్టపులి శ్రావ్య దీప్తి ప్రియాపడాల్ ప్రతిభ కనబర్చింది.అఖిల భారత స్థాయిలో 6,436వ ర్యాంకు,కేటగిరీ ర్యాంకులో 38వ స్థానం సాధించారు.దీంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థలలో ఒకటైన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో ప్రసూతి, సీ్త్రరోగ విభాగంలో(ఎం.డి.గైనకాలజీ)లో సీటును మొదటి ప్రయత్నంలోనే కై వసం చేసుకుంది. కిలగాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు చిట్టపులి శ్రీనివాస్పడాల్,కృష్ణకుమారి దంపతుల ద్వితీయ కుమార్తె శ్రావ్య దీప్తి ప్రియా పడాల్.10వ తరగతి వరకు పాయకరావుపేటలోని శ్రీప్రకాశ్ విద్యానికేతన్,ఇంటర్మీడియెట్ అంత విశాఖలోని శ్రీచైతన్యలో,2019లో నీట్–యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ప్రవేశం పొంది, 2025లో వైద్య విద్యను పూర్తి చేశారు.గిరిజన ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి యువతీ శ్రావ్య దీప్తిప్రియాపడాల్ ఈ స్థాయికి చేరుకోవడం యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని,భవిష్యత్తులో వైద్య సేవా రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కిలగాడ గ్రామానికి చెందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు,నేతలు,ప్రజలు, మండల వాసులు అభినందనులు తెలియజేస్తూ,ఆకాంక్షించారు. -
తల్లిదండ్రులే మన ముందున్న దేవుళ్లు
మద్దిలపాలెం (విశాఖ): నిత్యం మన కళ్లెదుట కనిపించే తల్లిదండ్రులే ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దైవాలని ప్రఖ్యాత గజల్ గాయకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘గజల్ శ్రీనివాస్ భారతీయం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు), కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్ అతిథులుగా హాజరై మూడు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతలో బాధ్యత, విలువలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంచేలా గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో గజల్ శ్రీనివాస్ ఒకరని కొనియాడారు. సందేశాత్మకమైన గజల్స్ దాదాపు రెండు గంటల పాటు సాగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల పట్ల గౌరవం, దేశభక్తి, మానవ విలువలను ప్రతిబింబించే గజల్స్ను గజల్ శ్రీనివాస్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన గేయాల ద్వారా సందేశమిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపు
చీడికాడ: మండలంలోని ఖండివరం గ్రామం మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న మోదమాంబ పాదల నుంచి ఖండవరం, ఎల్.బి.పట్నం గ్రామాలకు చెందిన సూమారు 50 కళ్లాలకు వెళ్లే మార్గంలో ఆక్రమణలను బుధవారం తొలగించి రెవెన్యూ అధికారులు సరిహాద్దులు వద్ద రాళ్లు పాతించారు. ఈ రహదారిని ఖండివరం గ్రామానికి చెందిన గండి సూర్యనారాయణ అనే నాయకుడు ఆక్రమించుకుని ఆ మార్గంలో వెళ్లే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు గత సోమవారం పీజీఆర్ఎస్లో బాధిత రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గత గురువారం సాయంత్రం తహసీల్దార్ కిషోర్ లింకన్ ఆక్రమణ గురైన వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వం స్థలమని నిర్ధారించారు.అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.ఈ మేరకు బుధవారం మండల సర్వేయర్ సురేష్, వీఆర్వో అర్జునరావు, రైతులు, గ్రామపెద్దలు సి.డి.సి చైర్మన్ సుంకర శ్రీనువాసరావు, కో–ఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు మోసూరి సన్నిబాబు, మండల కో–ఆప్సన్ మెంబర్ షేకు సూర్యనారాయణలు, వేచలపు కామేశ్, అమ్మతల్లినాయుడు సమక్షంలో సర్వే రాళ్లు పాతారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : విశాఖ–విజయవాడ స్థానిక అనకాపల్లి శారదనది బ్రిడ్జి రైల్వే ట్రాక్పై సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడు నల్లరంగు పుల్హ్యాండ్స్ చొక్కా, ఎర్ర రంగు బనియాన్, నలుపురంగు ఫ్యాట్ ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ 7382058996 ను సంప్రదించాలన్నారు. -
పాఠశాల తెరిచి రెండు వారాలైనా చేరని విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రాథేయపడుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో మొత్తం 300కి పైగా ఏకోపాధ్యాయ స్కూళ్లు వాటిలో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్కి పరిమితం 20 స్కూళ్లలో ఒక్కరూ చేరని పరిస్థి
సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకటి కాదు..జిల్లాలో 20కి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులు ఒక్కరూ కూడా లేరు. బడి తెరిచి రెండు వారాలవుతున్నా ఒక్క విద్యార్థి కూడా అడుగుపెట్టలేదు. మరో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పది లోపే (సింగిల్ డిజిట్) ఉంది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పాతాళానికి పడిపోయింది. మౌలిక వసతుల లేమి, పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు కరువవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య వ్యవస్థ క్షీణించడంతో ప్రైవేట్ బాట పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది పాఠశాలలు మూతపడే దిశగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బడిబాటపాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి‘సున్నా’ సారు.. డిప్యుటేషన్ జోరు! విద్యార్థులు ఒక్కరూ లేని పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించిన విడ్డూరమైన ఘటన మాకవరపాలెం మండలంలోని బూరుగుపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది. ఈ పాఠశాలలో గతేడాది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేవలం ఇద్దరే విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయురాలు వేసవి సెలవులకు ఆరు నెలల ముందే వ్యక్తిగత కారణాలతో ముందస్తు పదవీ విరమణ చేశారు. దీంతో అప్పటి నుంచి అకడమిక్ ఇన్స్ట్రక్టర్తోనే మమ అనిపించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న పాఠశాల తెరిచినా.. ఇప్పటి వరకు ఈ బడిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇదే గ్రామంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న హైస్కూల్ అందుబాటులో ఉండడంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఒక్క విద్యార్థి కూడా లేని ఈ ప్రాథమిక పాఠశాలకు అధికారులు రోజూ ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్్పై పంపుతుండడం విమర్శలకు తావిస్తోంది. రోజూ వచ్చే సారు ఖాళీ క్లాస్ రూమ్లో బెంచీలను, టేబుళ్లను చూస్తూ కూర్చోవడం తప్ప మరేం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు లేని బడికి డిప్యుటేషన్లు ఎందుకని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 20..! ఇది కేవలం బూరుగుపాలెం సమస్య మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి తాండవిస్తోంది. జిల్లాలో మొత్తం 1436 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో ప్రైమరీ 1037, అప్పర్ ప్రైమరీ 57, హైస్కూల్స్ 342 ఉన్నాయి. వీటిలో 300కి పైగా స్కూళ్లు కేవలం ఏకోపాధ్యాయుడి (సింగిల్ టీచర్)తో నడుస్తున్నాయి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 20 వరకూ ఉన్నాయి. దైన్య స్థితిలో ఉపాధ్యాయులు పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి, గ్రామసభలు పెట్టి తమ బడిలో పిల్లలను చేర్పించాలంటూ తల్లిదండ్రులను ప్రాధేయపడినా విద్యార్థులు చేరడం లేదు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, విద్యా కానుక కిట్లు ఇవ్వకపోడం, గతేడాదిలో తల్లికి వందనం అరకొరగానే ఇవ్వడం, నాడు–నేడు ద్వారా స్కూల్ మౌలిక వసతులు కల్పించకపోవడం వంటి మరెన్నో కారణాలు విద్యార్థులను చేరకుండా దూరం చేస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల నమోదు పెంచేలా చర్యలు తీసుకోవాలని, అలాగే హేతుబద్ధత లేని డిప్యుటేషన్లను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు జిల్లాలోని కె.కోటపాడు(31), పరవాడ(32), అచ్యుతాపురం(27), సబ్బవరం(26), కశింకోట(25), దేవరాపల్లి(25), చోడవరం(21), కోటవురట్ల(22)తో పాటు పలు మండలాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు లేదా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. గవరపేట, చినబొడ్డేపల్లి, చిప్పాడ, శ్రీరాంపురం, విశారపుదొడ్డి వంటి గ్రామాల్లో ఒకటి, రెండు సీట్లతోనే బడులు నడుస్తున్నాయి. వీటిలో.. నర్సీపట్నం మున్సిపాలిటీలో కొత్తవీధి, రూరల్లో పాత ఉప్పరగూడెం, అప్పనపాలెంలో ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులు ఉన్నారు. మాకవరపాలెంలో 20 లోపు విద్యార్థులు ఉన్న 30 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో వెంకయ్యపాలెంలో ప్రాథమిక పాఠశాలలో కూడా ముగ్గురు, నలుగురు విద్యార్థులు ఉన్నారు. గ్రామ సభలు పెట్టి విద్యార్థులు పాఠశాలల్లో చేరాలని సమావేశాలు పెడుతున్నా ఫలితం ఉండడం లేదు. గొలుగొండ మండలంలో విప్పలపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. నాతవరం మండలంలో ఐదు పాఠశాలలున్నాయి. పాయకరావుపేట మండలంలో 8 ఏకోపాధ్యాయ పాఠశాలున్నాయి. అక్కడ 20 లోపు విద్యార్థులున్నారు. అరట్లకోట, కొత్తూరు, కువాడ, సత్యవరం, పెద్దిపాలెం, ఎం.ఎస్ పేట, కండిపేట, రాజయ్యపేట గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులున్నారు. కోటవురట్ల మండలంలో 22 పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులున్నాయి. చినబొడ్డేపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, కోటవురట్ల శివారు గవరపేట స్కూల్లో ఒకరే విద్యార్థి ఉన్నారు. ఎస్.రాయవరం మండలంలో మూడు ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. కాపులవాతాడ, చిన ఉప్పల, బసవపాడు ప్రాథమిక పాఠశాల్లో 20 లోపు విద్యార్థులున్నారు. అనకాపల్లి మండలంలో 18 పాఠశాలలున్నాయి. కశింకోట మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. యలమంచిలి మండలంలో 8 పాఠశాలలున్నాయి.అచ్యుతాపురం రూరల్ మండలంలో 27 ఉన్నాయి. చిప్పాడ, వెంకటాచలం, భోగాపురం గ్రామాల్లో ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మాడుగుల మండలంలో 5 పాఠశాలలు ఉన్నాయి. ముకుందపురం, బిల్లలపాలెం, పోతనపూడి, వాడపాడు ప్రాథమిక పాఠశాలలో 20 లోపు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. కె.కోటపాడు మండలంలో 31 ఏకోపాధ్యాయ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో మూడు పాఠశాలల్లో విద్యార్థులు ఒక్కరూ లేరు. దేవరాపల్లి మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. శ్రీరాంపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, తెనుగుపూడి పంచాయితీలో విషారపుదొడ్డిలో ఇద్దరు విద్యార్థులు, ఎం.అలమండ గ్రామంలో ఇద్దరు విద్యార్థులున్నారు. చీడికాడ మండలంలో 11 పాఠశాలలున్నాయి. చోడవరం మండలంలో ఏకోపాధ్యాయ స్కూల్స్ 21 ఉన్నాయి. రోలుగుంట మండలంలో 15 ఏకోపాధ్యాయ స్కూల్స్ ఉన్నాయి. ఎన్.కొత్తూరు. తడాలపాలెం, మునిపల్లి, ఎం.కే పట్నం గ్రామాలో సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు. బుచ్చెయ్యపేట మండలంలో 8 పాఠశాలలున్నాయి. పరవాడలో 32 ఏకపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. సబ్బవరం మండలంలో 26 ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. -
ఆర్.భీమవరంను వేధిస్తున్న కిడ్నీ సమస్య
బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరం గ్రామస్తులను కిడ్నీ సమస్య వేధిస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడాదిన్నరలోనే గ్రామంలో కిడ్నీ సమస్యతో 12 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా 70 నుండి 90 ఏళ్లు వృద్ధాప్యం వచ్చినవారు కాదు 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు లోపువారే. బుధవారం గ్రామానికి చెందిన పతివాడ సన్యాసినాయుడు 45 ఏళ్లకే మృతి చెందాడు. ఇతనికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో వీరు రోడ్డున పడ్డారు. ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన పతివాడ సన్యాసినాయుడుతో పాటు రొంగలి చిన్నంనాయుడు, రెడ్డి అప్పారావు, మట్టా నూకరత్నం, బల్లిన అప్పలనాయుడు, రాపర్తి అప్పారావు, పాలిశెట్టి సరోజిని, మట్టా అప్పారావు, కొండ్రపు చెల్లయమ్మ, కోడూరు దేముడు (బట్టయ్య) కోడూరు క్రిష్ణయ్య, బొడ్డు సత్తిబాబు(పాత్రుడు)లు కిడ్నీ సమస్యతో చనిపోయారు. ఇంకా గ్రామంలో మట్టా అప్పారావు, కోడూరు దేముడు, రొంగలి చిన్నంనాయుడు, మట్టా కార్తీక్ తదితరులు కిడ్నీ సమస్యతో మంచాన పడి డయాలసిస్ చేయించుకుంటూ వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామంలో మరికొంత మంది కిడ్నీ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకుంటే తమకు కిడ్నీ సమస్య ఉందని తెలిస్తే వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుందని పలువురు ఎటువంటి వైద్య సేవలు చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాగునీటి కాలుష్యం వల్లేనా...? సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 వేల లీటర్లు సామర్థ్యం ఉన్న మంచినీటి ట్యాంకు ద్వారా గ్రామస్తులందరికి తాగునీరు అందిస్తున్నారు. ఈ ట్యాంకు నీరు తాగడం వల్లే కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంచినీళ్లు పట్టుకుంటే మీద ఆయిల్ తేలుతుందని పలువురు తెలియజేస్తున్నారు. పలుసార్లు తమ గ్రామంలో ఉన్న మంచినీటిని పరీక్షించి తాగడానికి మంచిదో కాదో నిగ్గు తేల్చాలని గ్రామస్తులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా నీటి పరీక్షలు మాత్రం బయటపెట్టడం లేదు. ఒకే గ్రామంలో ఇంత మంది కిడ్నీ సమస్యతో మృత్యువాత పడుతున్నా ఆరోగ్య ,గ్రామీణ నీటి సరఫరా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. కొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్య కారణంగా ప్రాణ భయంతో ఉన్న ఊరును కాదని గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. తక్షణం జిల్లా అధికారులు స్పందించి ఆర్.భీమవరంలో కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హాస్టల్లోప్రవేశాలకునోఛాన్స్
నర్సీపట్నం : బీసీ హాస్టల్లో విద్యార్థులను చేర్పేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. దీంతో బాలబాలికలను సంబంధిత వసతి గృహాల్లో చేర్చుకునేందుకు సంక్షేమాధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. పేదవర్గాలు చిన్నారుల చదువులకు భరోసా ఇవ్వడంలో ఇవి పునాదిలా నిలుస్తున్నాయి. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందుతుండడంతో వీటిలో సీట్లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ముందుచూపుతో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో మరమ్మతులు చేపట్టి ఉంటే విద్యార్థులకు మేలు చేకూరేది. వెంటాడుతున్న సమస్యలు నర్సీపట్నం మండలం, వేములపూడి బీసీ బాలికల వసతి గృహంలో 15 గదులు ఉండగా వీటిలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతిని పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో వసతి గృహంలో ఇప్పటికే వసతి పొందుతున్న విద్యార్థులను మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. కొత్త విద్యార్థులు చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. వసతి సమస్యతో సతమతం నర్సీపట్నం సబ్ డివిజన్లో వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 11 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సుమారు 1600 మంది విద్యార్థిని, విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఒక్కో హాస్టల్లో 100 నుంచి 300 మందిని చేర్చుకునేందుకు అవకాశం కల్పించారు. వేములపూడి బాలికల వసతిగృహంలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన పది గదుల్లో ఉన్న విద్యార్థులకే వసతి సమస్య కారణంగా కొత్త విద్యార్థులను తీసుకోవడం లేదు. 70 మంది విద్యార్థినులు వసతి గృహంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. సీటు వస్తుందనే నమ్మకంతో సమీపంలోని హైస్కూళ్లలో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించారు. తీరా వసతి గృహానికి వెళ్తే కొత్త విద్యార్థులను చేర్పించుకోవడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టి విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవనం మరమ్మతుపనులకు ప్రతిపాదనలు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ స్థానిక సంక్షేమాధికారి, హైస్కూళ్ల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. వసతి చాలని కారణంగా కొత్త విద్యార్థులను చేర్చుకోవద్దని ఉన్నతాధికారులు సూచించినట్టు సంక్షేమాధికారి వెంకటలక్ష్మి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తొందరపడి విద్యార్థులను తిరిగి పంపించొద్దని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుందామని సూచించినట్టు తెలిసింది. దీనిపై ఏబీసీ డబ్ల్యూవో గోపీనాథరావును వివరణ కోరగా వసతి సమస్య వల్లనే పిల్లలను చేర్చుకోవడం లేదని తెలిపారు. భవన మరమ్మతులకు రూ.23 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదలైన వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. వసతి సమస్య తీరిన వెంటనే విద్యార్థులను చేర్చుకుంటామని తెలిపారు. -
మెరుగైన విద్య అందించాలి
మాట్లాడుతున్న డీఐఈవో వినోద్ బాబు మాడుగుల: కళాశాలలో మెరుగైన విద్య అందించాలని అనకాపల్లి జిల్లా డీఐఈవో మద్దిల వినోద్బాబు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాలను ఆయన బుధవారం అకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అడ్మిషన్లు పెంచాలన్నారు. 2026 మార్చిలో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలవగా మాడుగుల ప్రత్యేక స్థానం దక్కించుకుందున్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు సిబ్బందికి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆయన వెంట జిల్లా సూపరింటెండెంట్ సుధాకర్, యూడీసీ శ్రీనివాస్, కళాశాల సిబ్బంది తదితరులున్నారు. -
విద్యుత్ బస్లను ప్రభుత్వమే నడపాలి
అనకాపల్లి : బడుగు, బలహీన ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్లను దశలు వారిగా ప్రభుత్వం నిర్వీర్యం చేసి, కొత్తగా విద్యుత్ బస్లను ప్రవేశపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని, విద్యుత్ బస్ను ఆర్టీసీలో కొనసాగించాలని ప్రజారవాణాశాఖ ఉద్యోగుల సంఘం(జేఏసీ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు అన్నారు. స్థానిక డిపో వద్ద బుదవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్లను ఆర్టీసీ వారే నిర్వహించాలని, మూసివేసిన డిపోలను తక్షణమే తెరిపించాలని, ఫినాజిల్ కంపెనీలో ఒప్పందాలు రద్దు చేయాలని, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటిని ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, బకాయిపడ్డ నాలుగు డీఏలు చెల్లించాలని, కొత్తగా నాలుగువేల బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నాయకులు కె.ఎన్.వి.రమేష్, వై.వి.ఎస్.కుమార్, టిఏ.రాజు, ఎల్యూఆర్.బాబు, జి.వి.రమణ, డి.ఎన్.మూర్తి, బి.ఎ.రావు, టి.టి.మూర్తి పాల్గొన్నారు. -
శారదానదిలో బాలుడు గల్లంతు
కశింకోట: మండలంలోని అమీన్సాహెబ్పేట వద్ద శారదానదిలో మిత్రులతో పాటు కలసి సరదాగా స్నానానికి దిగిన యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... యలమంచిలి మండలం వెంకటాపురానికి చెందిన వీసం చందు (16), మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి వారితో పాటు ఎఎస్ పేట వద్ద శారదా నదిలో స్నానానికి దిగాడు. ఈత రాక నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ మేరకు అందిన సమాచారంపై సంఘటనా స్థలాన్ని సందర్శించి ముమ్మరంగా నవీన్చంద్ర ఆచూకి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. పోలీసుల గాలింపు చర్యలు (ఇన్సెట్) చందు (ఫైల్) -
కరిగిపోయిన కలలు
నిప్పుల గుండంలో దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు సజీవ దహనంప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే పరవాడ : ఆ తెల్లవారుజామున వారిద్దరూ ఎప్పటిలాగే తమ విధుల్లో మునిగిపోయారు. కుటుంబాలను సాకుతున్నామన్న తృప్తి, రేపటి జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పరిశ్రమే వారికి చితిగా మారింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్(ఏపీఐఐసీ జోన్–3)లో గల ’దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు యువ కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ హఠాత్పరిణామంతో అనకాపల్లి జిల్లాలోని రెండు గ్రామాలు ఒకేసారి కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి. క్షణాల్లో జరిగిన ఘోరం ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, ఇంధన నూనెలను తయారు చేసే ఈ పరిశ్రమను గతేడాది సెప్టెంబరులోనే ప్రారంభించారు. సోమవారం రాత్రి షిఫ్ట్ విధులకు హాజరైన ఆపరేటర్ వేపాడ వెంకటేష్(34), ఫిట్టర్ బోడపు త్రినాథ్(24)లు మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద ప్రాసెసింగ్ పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక రియాక్టర్ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది, గోడలు బీటలు వారాయి. క్షణాల వ్యవధిలో పరిశ్రమను దట్టమైన మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ వద్దే ఉన్న వెంకటేష్, త్రినాథ్లు తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గుండెలు పగిలేలా రోదనలు ఈ ప్రమాదం సృష్టించిన బీభత్సం ఒకవైపు అయితే, మృతుల కుటుంబాల గాథలు కంటతడి పెట్టించాయి. పరిశ్రమ గేటు వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది. అధికారుల సందర్శన ప్రమాద వార్త తెలియగానే పరవాడ డీఎస్పీ మోహన్రావు, సీఐ భాస్కరరావులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జేసీ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్రెడ్డి తదితరులు పరిశ్రమను సందర్శించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.33 లక్షలు నష్టపరిహారం రాంకీ కమర్షియల్ హబ్లో ఆర్డీవో ఆధ్వర్యంలో యాజమాన్యం, పోలీసు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.33 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం మహారాణిపేట: ‘దక్షిణ్ ఎనర్జీ’ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు వేపాడ వెంకటేష్, బొడ్డాపు త్రినాథ్ల మృతదేహాలకు మంగళవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోలీసులు పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
జీతం కోసం వెళ్తే.. జీవచ్ఛవం కావాలా?
సాక్షి, అనకాపల్లి/విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్ ప్రాంతాల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. విధులకు వెళ్లిన కార్మికుడు సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరతాడన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎంఎన్సీ స్థాయి పరిశ్రమల్లోనూ వరుసగా అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు చోటుచేసుకుంటుండటం పారిశ్రామిక భద్రతలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. తాజాగా మంగళవారం పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో గత రెండేళ్లుగా పరవాడ–అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల పరంపర మరోసారి చర్చనీయాంశమైంది. గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాల రూపంలో ఇప్పటికే 20 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, యాజమాన్యాలు, పర్యవేక్షణ సంస్థల వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఎసైన్షియా తర్వాత ఏమైంది? ఎసెన్షియా ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ఆడిట్లు నిర్వహించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని ప్రకటించారు. పరిశ్రమలు, ఏపీపీసీబీ అధికారులను నిలదీశారు. కానీ రెండేళ్లు పూర్తవుతున్నా పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు. నాటి ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణ్ ఎనర్జీ ప్రమాదం తర్వాత మళ్లీ సేఫ్టీ ఆడిట్ల అంశం తెరపైకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాగితాలకే పరిమితమైన నివేదికలు ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు, పైప్లైన్లు, ట్యాంకర్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఐఎస్వో ప్రమాణాలు, ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నివేదికలు సిద్ధమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త అనుమతులు, విస్తరణలు, బ్యాంకు రుణాలు, లైసెన్స్ రెన్యూవల్స్ కోసమే ఆడిట్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రమాదాలపై కమిటీలు సమర్పించిన నివేదికలు కూడా ప్రజల ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు ఎక్కడ? పరిశ్రమల్లో లోపాలను గుర్తించి సరిచేయాల్సిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడిగా తనిఖీలు చేసి, ఆ తర్వాత మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాలపై చర్చించిన నెల రోజుల్లోనే మూడు ప్రమాదాలు చోటుచేసుకోవడం అధికార యంత్రాంగం పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రక్షణ లేని కార్మిక జీవితాలు ప్రమాదకరమైన రియాక్టర్ల వద్ద నైపుణ్యం కలిగిన సిబ్బందికి బదులుగా కాంట్రాక్ట్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియాక్టర్లలో ఒత్తిడి పెరగడం, రసాయనిక చర్యలు అదుపు తప్పడం వంటి పరిస్థితులను సకాలంలో గుర్తించే నిపుణులు లేకపోవడంతో ప్రమాదాలు తీవ్రమవుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అధిక లాభాల కోసం తక్కువ వేతనాలతో వలస కార్మికులను నియమించడం, వారికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. భద్రతా లోపాలపై ప్రశ్నించిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు ఎక్కడ? పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్లలో కలిపి 300కు పైగా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పరిశ్రమ వద్ద అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. చాలా కంపెనీల్లో అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్లు, సమర్థవంతమైన ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు లేకపోవడం బయటపడుతోంది. దీంతో తీవ్రంగాా గాయపడిన కార్మికులు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారాలు ప్రకటించడం, కమిటీలు వేయడం, విచారణలు జరపడం పరిపాటిగా మారింది. కానీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గత నివేదికలపై ఏ చర్యలు తీసుకున్నారు? సేఫ్టీ ఆడిట్ల ఫలితాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావడం లేదు. ఎసెన్షియా నుంచి దక్షిణ్ వరకు జరిగిన ప్రమాదాల పరంపర ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టలేరు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకుండా చూసే వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, యాజమాన్యాలపై ఉంది. లేకపోతే జీతం కోసం వెళ్లిన కార్మికుడు జీవచ్ఛవంగా తిరిగి రావాల్సిన దుస్థితి మరింత విషాదకరంగా మారుతుంది. కూటమి ప్రభుత్వంలో వరుస ప్రమాదాల పరంపర 2024 ఆగస్టు 21: అచ్యుతాపురం సెజ్లోని ’ఎసైన్షియా అడ్వాన్స్డ్ ఫార్మా’లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోర ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 2025 జూన్: ’సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్స్’లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. 2025 సెప్టెంబర్: ’డెక్కన్ రెమెడీస్’లో మెథనాల్ గ్యాస్ లీక్ అయి మరో కార్మికుడి ప్రాణాన్ని బలిగొంది. 2026 జనవరి: అచ్యుతాపురంలోని ’ఎస్వీఎస్ కెమికల్స్’లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ ఆస్తి నష్టం సంభవించింది. 2026 జూన్ 23: పరవాడ ఫార్మాసిటీలోని ’దక్షిణ్ ఎనర్జీ’ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవడం పారిశ్రామిక భద్రతపై మళ్లీ పెను ప్రశ్నలు లేవనెత్తింది. రెండేళ్లుగా వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పారిశ్రామిక భద్రతా విభాగాల వైఫల్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
చెల్లి పెళ్లి చేయాలనుకున్న త్రినాథ్
అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బోడపు త్రినాథ్ది అత్యంత నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు పారునాయుడు, రమణమ్మలతో పాటు చెల్లి మాధవిని తనే పోషిస్తున్నాడు. త్వరలోనే చెల్లికి పెళ్లి చేసి, ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళ్లల్లో ఆశలు ఇంకా మిగిలి ఉండగానే, 24 ఏళ్ల ప్రాయంలోనే త్రినాథ్ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోదిస్తున్న త్రినాథ్ బంధువులు


