breaking news
Anakapalle District News
-
నేషనల్ గ్రాప్లింగ్ రెజ్లింగ్ పోటీలకు 18 మంది ఎంపిక
నర్సీపట్నం : ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరగనున్న 6వ జాతీయ గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు నర్సీపట్నం నింజాస్ అకాడమీ నుంచి 18 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని కోచ్ వేపాడ ప్రియాంక తెలిపారు. ఈ నెల 21 నుండి 23 వరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. నేషనల్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను నింజాస్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు, జనరల్ సెక్రటరీ సుతాపల్లి శ్రీకాంత్ శాప్ కోచ్ అబ్బు అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న 3 శాతం క్రీడా రిజర్వేషన్తో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. -
ఒకే పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యుల ఓట్లు
సీపీఎం నాయకుల వినతితుమ్మపాల: ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్ల్లో ఉండడం వల్ల ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్ ప్రక్రియలో భాగంగా ఒకే పోలింగ్ బూత్లో నమోదు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు కోరారు. మంగళవారం కలెక్టరేట్లో డీఆర్వో వై. సత్యనారాయణరావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ఒకే చిరునామాలో నివసిస్తున్నప్పటికీ వేర్వేరు బూత్లకు ఓట్లు కేటాయించడం సరికాదన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసుకునేలా అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగానే తుది జాబితా ప్రచురించేలోపే ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఒకే ఇంటి చిరునామాలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓట్లను ఎన్నికల నిబంధనలు, పోలింగ్ కేంద్రాల పరిధికి లోబడి ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సవరణలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
అవయవదానంతో అమరుడైన శ్రీదత్తు
తుమ్మపాల : పేద కుటుంబంలో జన్మించి నిరంతరం శ్రమిస్తూ కుటుంబానికి అండగా నిలిచిన ఓ యువకుడు అనూహ్యంగా మృత్యువాత పడిన బాధను దిగమింగుతూనే తల్లిదండ్రులు తీసుకున్న గొప్ప నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. తమ కుమారుడి అవయవాలను దానం చేసి, మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు రావడం, బౌతికంగా కుమారడు లేకపోయినా అవయవాలతో మరోకరికి జీవితాన్నిచ్చేలా వేసిన అడుగు అందరికి ఆదర్శంగా నిలిచింది. ఆ పేద కుటుంబం సమాజం పట్ల తీసుకున్న నిర్ణయంతో శ్రీదత్తు అంతిమయాత్రకు విశేష పలువురి ప్రశంసలు అందుకుంది.వివరాలివి. అనకాపల్లి గవరపాలేనికి చెందిన పెంటకోట శివ సూర్యనారాయణ, మాణిక్యంలకు ద్వితీయ కుమారుడు పెంటకోట శ్రీదత్తు (యువకుడు) టైల్స్ మేస్త్రిగా పనిచేస్తూ ఈ నెల 13న పరవాడకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కిమ్స్కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అధిక రక్తపోటు కారణంగా మెదడులోని ఎడమ భాగంలోని రక్తనాళాలు దెబ్బతిన్నాయని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. రెండు రోజులపాటు వైద్యులు తీవ్రంగా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదత్తు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషాదంలోనూ గొప్ప నిర్ణయం... కుమారుడు లేడని వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అవయవదానంపై అవగాహనతో తీవ్ర బాధలోనూ మరొకరికై న తమ కుమారుడి ద్వారా జీవం అందించాలనే గొప్ప ఆలోచన చేశారు. అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు పెంటకోట మాణిక్యం, శివ సూర్యనారాయణ, అన్నయ్య భాస్కర్ కుమార్ అనుమతించడంతో ఈ నెల 16న వైద్యుల సమక్షంలో అవయవదానం ప్రక్రియ మొదలుపెట్టి అధికారుల ధ్రువీకరణతో అవయవాల సేకరణ పూర్తి చేసి మంగళవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కన్నీటి వీడ్కోలు శ్రీదత్తు భౌతికకాయాన్ని స్వస్ధలమైన అనకాపల్లి గవరపాలేనికి మొదటిగా తీసుకొచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శన నిమిత్తం భారీగా తరలివచ్చిన జనంతో సుంకరమెట్ట కూడళి నుంచి నుంచి దాసరి గెడ్డ రోడ్డు, పార్క్ సెంటర్, శతకంపట్టు, శ్రీసంతోషిమాత ఆలయం మీదుగా బాలకృష్ణ బస్స్టాప్, శంకరం, రేబాక, గొలగాంలోని ప్రస్తుత నివాసముంటున్న చోట వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడంతో కుటుంబసభ్యులు రోధనలు మిన్నంటాయి. అక్కడ నుంచి శ్మశానవాటికకు తీసుకెళ్లి అంతిమ సంస్కారం పూర్తి చేశారు. శ్మశానవాటిక వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్నేహితులు, స్థానికులు శ్రీదత్తు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారం రోజులుగా హైబీపీ.. శ్రీదత్తు అందరితో ఆప్యాయంగా, సరదాగా ఉండే వ్యక్తిగా కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తు చేసుకున్నారు. నిరంతరం కష్టపడి పనిచేసే శ్రమజీవి. అయితే మరణానికి ముందు వారం రోజులుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నప్పటికీ పని ముఖ్యమంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు అదే తీవ్ర పరిణామాలకు దారితీసి ప్రాణాలను బలిగొంది. యువతకు ఓ హెచ్చరిక.... ఇటీవలి కాలంలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోయినా యువతలో ఆకస్మిక మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీదత్తు ఘటన కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో తెలియజేస్తోంది. యువత పని, సంపాదన అని కాకుండా తమ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆకస్మిక మరణం..అవయవదానంతో మరో జన్మ కొడుకును కోల్పోయిన విషాదంలోనూ అవయవదానానికి కుటుంబం నిర్ణయం భారీ బైక్ ర్యాలీతో అంతిమయాత్ర -
రైతులకు కొండంత అండ
● ధారకొండ దిగువన నాట్లు ● తీవ్ర వర్షాభావంలోనూ సాగుకు నీళ్లు గొలుగొండ : ధారకొండ అండ అంటే ఈ ప్రాంత రైతులకు కొండంత అండ. ఏనాడు నాట్లు వేయలేని దుస్ధితి ఉండదు., తీవ్ర వర్షాభావ పరిస్ధితులు వచ్చినా ఏనాడా రైతులు నాట్లు వేయకుండా ఉండరు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడినప్పుటికి నాట్లు వేయడం కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఈ ప్రాంతంలో నాట్లు వేయకుండా ఉండలేరు. ధారమఠం శివాలయం ఆనుకొని ఉన్న ధారకొండ నుంచి వచ్చే సాగునీరు ఈ ప్రాంతంలో రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ధారకొండ నుంచి ధారగా... మహాపర్వతం ధారకొండ నుంచి వచ్చి సాగునీరు గొలుగొండ మండలంలో కొత్తపాలెం, ధారగెడ్డ, పాతమల్లంపేట, పరిసర ప్రాంతాల్లో ఉన్నత 700 ఎకరాల సాగు భూములకు ఎంతో అండగా నిలుస్తోంది. ఈ కొండపై వర్షం కురిస్తే సాలు ఈ ప్రాంతం అంతా సస్య శ్యామలమే. కానీ ఈ ఏడాది కనీవిని ఎరగని రీతిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఇక్కడి కొండపై ఏ మాత్రం వర్షం కురిసినా ధారగెడ్డ పొంగి ప్రవహించడం జరుగుతుంది. వర్షం లేకపోయినా ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న సాగునీరు ఆధారంగా సుమారుగా ఇప్పటికే 400 ఎకరాల్లో నాట్లు వేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో సాగునీరు సరిపోలేదని రైతులు సరుగుడు, ఇతర వ్యవసాయాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఉన్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని వరి సాగు చేయడం జరుగుతుంది. తాండవ జలాశయానికి కష్టమే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిపెద్ద జలాశయంగా పేరున్న తాండవ జలాశయానికి ఈ ఏడాడి సాగు నీరు అందడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రైతులు నాట్లు వేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తాండవ జలాశయానికి ప్రదాన ఆధారం గొలుగొండ మండలంలో ఉన్న ధారగెడ్డ, బోరింగ్గెడ్డ, బొడ్డేరు గెడ్డలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఈ గెడ్డల నుండి చుక్కనీరు ప్రవహించడం లేదు. ఇప్పటికే తాండవ జలాశయం నీటిని విడుదల చేయడం జరిగింది. తాండవ జలాశయానికి ఆధారమైన పై గెడ్డల నుంచి చుక్క నీరు తాండవకు చేరడం లేదు. వర్షాలు కురిస్తే తప్ప తాండవ జలాశయానికి నీరు చేరదు. దారకొండ దిగువన ఉన్న ప్రాంతంలో ఉన్న పంట భూములకు మాత్రం ప్రస్తుతం ప్రవహిస్తున్న సాగునీరు వల్ల నాట్లు జరుగుతున్నాయి. ఈ కొండే తమకు అండ అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కసరత్తు !
స్థానిక పోరుకుసాక్షి, అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఆలస్యం కావడంతో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2025 ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో, రెండు మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు ఇంటింటా సర్వే మంగళవారం నుంచి ప్రారంభమైంది. తొలుత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ఐదు వార్డులు(80 నుంచి 84 వరకూ వార్డులు) మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉండగా, యలమంచిలి, నర్సీపట్నంలో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో ముగిసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) మొదటి దశ గత నెలలో పూర్తికాగా, ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తుది ఓటరు జాబితాలను అక్టోబరు 3వ తేదీన విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటే తుది జాబితాలు విడుదలైన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో, గత ఏడాది ఓటరు జాబితాల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం వచ్చే నెలలో పూర్తికానుండగా, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల తర్వా త వీటికి ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. రిజర్వేషన్లపై కసరత్తు గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాలను సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 243 (37.62 శాతం) పంచాయతీ సర్పంచు పదవులను బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. సెప్టెంబరు 7న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లతో తుది జాబితాను ప్రచురిస్తారు. విభజిత జిల్లాల వారీగానే ఎన్నికలు..? అనకాపల్లి జిల్లా కేంద్రంగా జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పాత ఆర్డీవో కార్యాలయంలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రూ.20 లక్షలతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి సమగ్ర సమాచారంతో వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. జిల్లాలో అడ్డురోడ్డు, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 24 మండలాలు ఉన్నాయి. 644 పంచాయతీలు, 6,282 వార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్లో ప్రచురితమైన ఓటర్ల జాబితా వివరాలు మేరకు 644 పంచాయతీల్లో 12,35,083 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,02,281, మహిళలు 6,32,785 ఇతరులు 17 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 మంది ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 2021లో 39 జెడ్పీటీసీ స్థానాలు, 651 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 37 జెడ్పీ స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగగా, రెండు ఏకగ్రీవమయ్యాయి. 651 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 612 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి విభజిత జిల్లాల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రారంభమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వే ఐదు రోజుల పాటు గ్రామాల్లో సర్వే సెప్టెంబర్ 7న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఆగస్టు 31లోగా పోలింగ్ కేంద్రాలఎంపిక పూర్తికి ఆదేశాలు ‘సర్‘ ప్రక్రియ ఆలస్యం కావడంతోనే ఎన్నికల కమిషన్ నిర్ణయం జిల్లాలో 646 పంచాయతీలు,2 మున్సిపాలిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్వే షెడ్యూల్ ఇలా.. ఆగస్టు 18 నుంచి 22 : గ్రామాల్లో అధికారుల ద్వారా ఇంటింటా సర్వే ఆగస్టు 23, 24 : సర్వే ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వర్గీకరణ ఆగస్టు 25 : పంచాయతీ నోటీసు బోర్డుల్లో ప్రాథమిక జాబితాల ప్రదర్శన ఆగస్టు 26 నుంచి 28 : జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2 : అభ్యంతరాల పరిశీలన, విచారణ సెప్టెంబరు 3 నుంచి 6 : గ్రామసభల్లో జాబితాల పరిశీలన, ఆమోదం సెప్టెంబరు 7 : ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురణ రిజర్వేషన్ల వారీగా సర్వే ప్రారంభమైంది.. నిర్దేశించిన షెడ్యూల్ అనుగుణంగానే జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రిజర్వేషన్ల సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత అధికారులు, సిబ్బందికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాం. నిర్ణీత గడువు లోగా సర్వే, ఆయా వర్గాల ఓటర్ల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణ, గ్రామసభల నిర్వహణ తదితర ప్రక్రియలను పూర్తి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్ సర్వే ఈ నెల 22వ తేదీలోగా పూర్తవుతుంది. సెప్టెంబర్ 7న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఫైనల్ జాబితా ప్రచురిస్తాం. – సందీప్, డీపీఓ, అనకాపల్లి జిల్లా -
హిందూ ధర్మ రక్షణకు కృషి
● విశ్వహిందూ మహాసంఘ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు చెల్లయ్యనాయుడు మునగపాక : మండలంలోని మూలపేటకు చెందిన బొడ్డేడ చెల్లయ్యనాయుడు విశ్వహిందూ మహాసంఘ భారత్ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వహిందూ మహా సంఘ భారత్ అధ్యక్షుడు శ్రీ లంకా గణేష్ నుంచి ఉత్తర్వులు అందాయి. చెల్లయ్యనాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర గోసంరక్షణ అధ్యక్షుడు యాసపు శ్రీనుతో పాటు ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడతానని పేర్కొన్నారు. -
కోటా కత్తి!
ఉచిత విద్యుత్కురైతులపై లక్షల్లో బిల్లుల భారంకోటా మించితే ప్రతి యూనిట్కు రూ.7.75 వసూలు ఏడాదిన్నర బకాయిలను ఒకేసారి చూపుతూ భారీ బిల్లులు ఒక్కో రైతుపై రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా భారం బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు 2024 వరకు సున్నా బిల్లులు.. 2025 నుంచి చార్జీల బాదుడుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రైతులకు ఉచితంగా అందుతున్న వ్యవసాయ విద్యుత్కు చంద్రబాబు ప్రభుత్వం కోటా కొర్రీలు పెడుతోంది. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద ఏడాదికి 6,000 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా సరఫరా చేస్తామని, అంతకుమించి వినియోగిస్తే ప్రతి యూనిట్కు రూ.7.75 చొప్పున చార్జీలు వసూలు చేస్తామని చెబుతోంది. తాజాగా ఏడాదిన్నర బకాయిలను ఒకేసారి చూపిస్తూ భారీ మొత్తాలతో బిల్లులు జారీ చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.50 వేల నుంచి లక్షకుపైగా బకాయి ఉన్నట్లు చూపిస్తోంది. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసుల్లో హెచ్చరిస్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. 2025 నుంచే మారిన లెక్కలు 2024 చివరి వరకు రైతులు ఎంత విద్యుత్ వినియోగించినా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ చార్జీలు విధించలేదు. అయితే 2025 నుంచి కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. తొలుత నేరుగా విద్యుత్ బిల్లులు జారీ చేయకుండా నెలకు రూ.30 చొప్పున కస్టమర్ చార్జీలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని ఆరు నెలలకు ఒకసారి రూ.180 చొప్పున రైతులు చెల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం 6,000 యూనిట్ల పరిమితిని తెరపైకి తీసుకొచ్చి, దానికి మించి వినియోగించిన విద్యుత్కు చార్జీలు విధిస్తోంది. ఏడాదికి 6,000 యూనిట్లు అంటే నెలకు సగటున 500 యూనిట్లకు పరిమితి విధించినట్లవుతోంది. అంతకు మించి వినియోగించిన ప్రతి యూనిట్కు రూ.7.75 చొప్పున బిల్లు వేస్తోంది. ఫలితంగా ఏడాదిన్నరగా పేరుకుపోయిన మొత్తాన్ని ఇప్పుడు ఒకేసారి రైతులపై మోపుతోంది. కోటా పేరిట కోతలు వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని అమలు చేశారు. అనంతరం 2009 ఎన్నికల్లో 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతూ వచ్చింది. రైతులు 9 గంటల పాటు ఎంత విద్యుత్ వినియోగించినా ఉచిత విద్యుత్ పథకం వర్తించేది. ఇప్పుడు మాత్రం వినియోగానికి యూనిట్ల పరిమితి విధించడం ద్వారా పథకానికే కోతలు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 5 హెచ్పీ మోటార్లు వినియోగించే రైతులకు ఏడాదికి 6,000 యూనిట్ల పరిమితిని వర్తింపజేస్తూ, అదనపు వినియోగానికి చార్జీలు విధిస్తున్నారు. యూనిట్కు రూ.7.75 చొప్పున వసూలు రైతులకు 9 గంటల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామని చెబుతూనే వినియోగించే విద్యుత్కు యూనిట్ల పరిమితి విధించడం విరుద్ధంగా ఉందని రైతులు అంటున్నారు. 9 గంటల సరఫరా సమయంలో రైతు తన అవసరానికి అనుగుణంగా మోటారు నడుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏడాదికి 6,000 యూనిట్లకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్కు రూ.7.75 చొప్పున చార్జీ విధిస్తున్నారు. ఇలా అదనపు వినియోగంపై విధిస్తున్న రేటు వాణిజ్య కేటగిరీ తరహాలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కొద్దికాలానికే ఉచిత కోటా పూర్తయిందంటూ చార్జీలు విధించడం వల్ల వ్యవసాయ విద్యుత్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ కట్ తాజాగా జారీ చేస్తున్న బిల్లుల్లో నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని ఈపీడీసీఎల్ హెచ్చరిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి రూ.180 మాత్రమే చెల్లిస్తున్న తమకు ఇప్పుడు రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు బకాయిలు చూపించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్కు యూనిట్ల పరిమితి విధించి, అదనపు వినియోగానికి చార్జీలు వసూలు చేయడంతోపాటు, పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ను క్రమంగా కుదించే దిశగా అడుగులు వేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ వ్యతిరేకతే..! వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో చంద్రబాబు వైఖరిపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. రైతులు విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఉద్యమించిన సమయంలో హైదరాబాద్లోని బషీర్బాగ్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు రైతులు మృతి చెందారు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు దానిపై విమర్శలు చేశారు. వైఎస్ హయాంలో అమలులోకి వచ్చిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం తర్వాతి ప్రభుత్వాల్లోనూ కొనసాగింది. ఇప్పుడు వినియోగ పరిమితి విధించడం, అదనపు వినియోగానికి చార్జీలు వసూలు చేయడం, భారీ బకాయిలను రైతులపై మోపడం వంటి పరిణామాలతో ఉచిత విద్యుత్ పథకంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. -
పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం సహించను
తుమ్మపాల : అర్హులైన వారికి పింఛన్లు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సామాజిక పింఛన్ల పంపిణీపై జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతిక సమస్యల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై కారణాలు తెలిసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా సమర్ధంగా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, క్షేత్రస్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న దాదాపు 7వేల నంబర్లకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి, వచ్చే వారం నాటికి పూర్తి స్థాయి జీఎస్ స్టేట్మెంట్ సమర్పించాలని ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎంపీడీఓలు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి నెలా లబ్ధిదారులందరికీ క్రమం తప్పకుండా పింఛన్ అందేలా చూడాలి. పింఛన్ల పంపిణీకి ముందు రోజు రాత్రే పీడీవోలతో సమావేశం నిర్వహించి, కేటాయించిన లబ్ధిదారులందరికీ ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించాలని, ఫోన్ నంబర్ల నవీకరణ చేయాలని తెలిపారు. మొత్తం 7,221 మంది పింఛనర్ల ఫోన్ నంబర్లు డేటాబేస్లో అప్డేట్ కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వి.మాడుగుల (644), నాతవరం (573), చోడవరం (497) మండలాల్లో అధిక సంఖ్యలో పెండింగ్ ఉన్నాయని, ఎంపీడీవోలు తక్షణమే స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని ఫోన్ నంబర్లను తనిఖీ చేసి అప్డేట్ చేయాలన్నారు. అవినీతికి తావులేకుండా సచివాలయ స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.కలెక్టర్ విజయకృష్ణన్ -
డీసీఈబీ కార్యదర్శిగా నూకరాజు
నక్కపల్లి: డీసీఈబీ(జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) కార్యదర్శిగా మండలంలోని దేవవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేమగిరి నూకరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 26 ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఆయన గతంలో మండల విద్యాశాఖాధికారిగా పనిచేశారు. నూకరాజు పనితీరును గుర్తించి విద్యా శాఖ డీసీఈబోర్డు కార్యదర్శిగా నియమించింది. ఈ నియామకం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని నూకరాజు తెలిపారు. -
ఫార్మసిస్టు అదృశ్యంపై ఫిర్యాదు
దేవరాపల్లి : మండలంలోని రైవాడ గ్రా మానికి చెందిన సారిపల్లి ఎరుకునాయుడు (31) అదృశ్యమైనట్టు అతని భార్య కృష్ణ కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అదృశ్యమైన ఎరుకునాయుడు అల్లూరి జిల్లా హుకుంపేటని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగ రీత్యా నెల రోజుల క్రితం నుంచి పాడేరులోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారన్నారు. ఈ నెల 2న తన సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకోవాలని భార్యతో కలిసి స్వగ్రామం రైవాడ వచ్చాడన్నారు. అయితే ఈ నెల 3న ఉదయం 11 నుంచి ఒంటి గంట ప్రాంతంలో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి పరిసర గ్రామాలతో పాటు బంధువులు ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదని అతని భార్య ఈ నెల 10న ఫిర్యాదు చేసిందన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యక్తి ఆచూకీ లభిస్తే వెంటనే పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
పోలీసులకు విరాళంగాబాడీ వార్న్ కెమెరాలు
అనకాపల్లి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్శాఖ ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పరవాడ ఈఐఎస్ఎఐ ఫార్మా కంపెనీ సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 25 బాడీ వార్న్ కెమెరాలను ఎస్పీకి మంగళవారం కంపెనీ ప్రతినిధులు గిరీష్ దీక్షిత్, ఆనంద్ గాల్ఫాడే, మదన్మోహన్లు ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ కెమెరాలను త్వరలో అందజేయడం జరుగుతుందన్నారు. -
పట్టపగలే ఇల్లు గుల్ల
● మునగపాకలో భారీ చోరీ ● 10 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదు అపహరణమునగపాక : మండల కేంద్రంలో పట్టపగలు చోరీ సంఘటన చోటు చేసుకుంది. నిత్యం జన సంచారం ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మునగపాకలోని సాంబశివుని ఆలయ సమీపంలో అనకాపల్లి భీమ, లక్ష్మి దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. భీమ పరవాడ ఫార్మాసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మి అచ్యుతాపురంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దంపతులిద్దరూ మంగళవారం ఉదయం ఏ షిప్టుకు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు తీసి ఉండడాన్ని గుర్తించి లోపలికి వెళ్లే సరికి బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు నిర్ధారించుకున్నారు. బీరువాలోని 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు చోరీకి గురైందని తెలుసుకొని మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకొని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ప్రమాదవశాత్తూనదిలో పడి యువతి మృతి
పాయకరావుపేట : మండలంలో కుమార పురం గ్రామానికి చెందిన చాపల నందిని (19) గ్రామ సమీపాన గల పంపానదిలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతురాలు చాపల నందిని ఈ నెల 14 వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి మరలా ఇంటికి తిరిగి రాలేదు. 15 వ తేదీన తన కుమార్తె కనిపించలేదని తల్లి చేపల బంగారు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే తన కుమార్తె గ్రామ శివారు పంపానదిలో చనిపోయి ఉందని, మూడు నెలల నుండి టైఫా యిడ్ జ్వరంతో బాధపడుతుందని, పాయకరావుపేటలో చికిత్స పొందేదని, మానసిక అనారోగ్యంతో ఉండేదని, 14న నందిని బహిర్భూమికి వెళ్లి కాలుజారి నదిలో పడిపోయి మృతి చెందిందని ఆమె తల్లి మరలా ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. -
బస్సులో మర్చిపోయిన బ్యాగ్ అందజేత
అనకాపల్లి : విశాఖ నుంచి అనకాపల్లి వస్తున్న 500 మెట్రో ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు ఈనెల 16న బ్యాగ్ను మర్చిపోయి దిగిపోవడం జరిగిందని డిపో మేనేజర్ రాజేశ్వరి అన్నారు. పట్టణానికి చెందిన వెంకటరాజు ఈనెల 16న 500 బస్లో రాత్రి సమయంలో బ్యాగ్ను మర్చిపోయి వెళ్లడంతో బస్ కండక్టర్ కె.బి.ఆర్.లక్ష్మి బ్యాగ్ను డిపోలో సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించింది. విషయం తెలుసుకున్న ప్రయాణికుడు వెంకటరాజు ఈనెల 18న డిపో మేనేజర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సెక్యూరిటీలో వద్ద భద్రపర్చిన బ్యాగ్ను చూపించగా వెంకటరాజు తమ బ్యాగ్గా గుర్తించడంతో డిపో మేనేజర్ రాజేశ్వరి అతనికి బ్యాగ్ను అందజేశారు. -
కె.కోటపాడులోకలెక్టర్, జేసీ పర్యటన
● 22న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ● పాల్గోనున్న సీఎం చంద్రబాబు! కె.కోటపాడు : ఈ నెల 22న మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్టు తెలిసింది. ఆ రోజున ముందుగా స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గోనున్న చంద్రబాబు తరువాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం మాడుగుల నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గోనున్నారు. కె.కోటపాడు మండలంలో సీఎం చంద్రబాబు పాల్గొనే గ్రామాన్ని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్పటేల్ మంగళవారం సాయంత్రం పర్యటించారు. మేడిచర్ల, ఎ.కోడూరు, చౌడువాడ గ్రామాల్లో పర్యటించారు. వీటిల్లో చౌడువాడ గ్రామంలో సీఎం కార్యక్రమాన్ని జరిపేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అయితే సీఎం పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. -
యలమంచిలి మున్సిపాలిటీలో 32 వార్డులు
● ఉత్తర్వులు జారీ చేసినపురపాలక శాఖ కమిషనర్ యలమంచిలి రూరల్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రక్రియలో భాగంగా వార్డుల పునర్విభజన, పెంపునకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. 25 వార్డులుగా ఉన్న యలమంచిలి పురపాలకసంఘంలో వార్డుల సంఖ్య 32కు పెంచుతూ పురపాలక శాఖ కమిషనర్ కె. సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. దీనిపై పరిశీలన జరిపిన అధికారులు తాజాగా వార్డుల సంఖ్య 32కు పెంచారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
మునగపాక : మునగపాకలో జరిగిన హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు యలమంచిలి సీఐ ఎస్.ధనుంజయరావు తెలిపారు. కేసు వివరాలను ఆయన స్థానిక ఎస్ఐ ప్రసాదరావుతో కలిసి విలేకరులకు తెలిపారు. రెండు కుటుంబాల మధ్య గతంలో జరిగిన మాటల వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేయడంతో మృత్యువాతకు గురయ్యాడన్నారు. మునగపాకలోని పల్లపు వీధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన దాడి భాస్కరరావు అతని సోదరుడు జగదీష్లతో దేవకికి రెండు రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. వారి మధ్య మాటల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. సోమవారం రాత్రి దేవకి నాగప్పారావు తన మేడపై నిద్రిస్తున్న సమయంలో భాస్కరరావు, జగదీష్లు కలిసి దాడి చేశారు. ఈ సంఘటనలో దేవకీ నాగప్పారావు తీవ్రంగా గాయపడడంతో అతనిని అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. మునగపాకలో విషాద ఛాయలుఎంతో ప్రశాంతంగా ఉండే మునగపాక నాగప్పారావు హత్యతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అందరితో సరదాగా మెలిగే దేవకీ నాగప్పారావు మృత్యువాతకు గురయ్యారన్న సమాచారంతో మునగపాకలో విషాదం నెలకొంది. మృతదేహానికి అనకాపల్లి వందపడకల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియలకు మునగపాక గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళవారం ఉదయం యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎస్ఐ ప్రసాదరావుతో పాటు క్లూస్ టీమ్ పరిశీలించి పలు వివరాలు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమాండ్కు తరలింపు -
పనుల్లేక.. ఖాళీ కంచాల మోత
రావికమతం : మండలంలో కవ్వుగుంట పంచాయతీ బుడ్డిబంద గ్రామంలో వీ–బీజీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని గ్రామానికి చెందిన గిరిజనులు మంగళవారం కంచాలు చేతపట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలో పస్తుతం వీఆర్పీ లేకపోవడంతో మాకు ఉపాధి పనులు కల్పించలేదు.. ప్రతి కుటుంబానికి పభుత్వం 125 రోజులు పని కల్పించాలి, కానీ ఉపాధి పనులు కల్పించలేదని గిరిజనులు వాపోయారు. గ్రామంలో 181 ఎకరాల భూమి ఉంది. వరి ఆకుపోతలు వేసి ఉన్నాము. వర్షాలు లేకపోవడంతో వరి నారు మడులు ఎండిపోతున్నాయి. పెద్దేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో భూములు ఉన్నాయి. పెద్దేరు నీరు విడుదల చేసినప్పటికి నీరు రాలేదు. వర్షాలు లేకపోవడంతో ఈ సంవత్సరం పంటలు పండే పరిస్థితి కనబడడం లేదు. కనీసం ఉపాధి పనులు కల్పించాలని పలుమార్లు కోరినప్పటికీ పనులు కల్పించలేదు.. మా పంచాయతీకి వీఆర్పీని నియమించి, మాకు ఉపాధి పనులు కల్పించాలని వేడుకున్నారు. లేని పక్షంలో సోమవారం రావికమతం ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.గోవిందరావు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజనులు, రైతులు పాల్గొన్నారు.ఉపాధి పనుల కోసం గిరిజనుల వేడుకోలు -
భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిశ్రమల్లో తగురీతిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్రెడ్డిలు డిమాండ్ చేశారు. వారు ఫార్మాసిటీలోని అరాజెన్ పరిశ్రమను మంగళవారం సందర్శించి యాజమాన్యంతో చర్చలు జరిపారు. నిర్వాసితుల ఉపాధిపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో సర్వస్వం కోల్పోయిన లంకెలపాలెం దరి లేమర్తి భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాది అవకాశాలు దక్కలేదని ఆరోపించారు. 2005లో ఫార్మాసిటీ పరిశ్రమల ఏర్పాటు సమయంలో నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఇచ్చిన హామీ అమలు కాకపోవడం విచారకరమన్నారు. అనేక పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ నిర్వాసితులకు సరైన రీతిలో న్యాయం చేసేలా యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాతపాటి ఆర్ఎస్వీ ప్రసాద్రాజు, అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, పరవాడ మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు, మండల వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నక్కా రమణబాబు, పూర్ణానందశర్మ, బోరా సోమునాయుడు, ఇళ్లపు వాసు, జీలకర్ర నాగేంద్ర, గొందేసి శ్రీనివాస్ రెడ్డి, గొడబా మనోజ్, పైడిరాజు, ఎర్ని రమణ, బిమ్మిటి శ్రీనివాస్, చొప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.47 లక్షల బిల్లు
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం సిరసపల్లి (టి) గ్రామానికి చెందిన రైతు మద్దల వెంకటరావు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ (సర్వీసు నంబర్ 1172682212000366) ఇందుకు ఉదాహరణ. 2023 సెప్టెంబరులో ఆయన 300 యూనిట్ల విద్యుత్ వినియోగించారు. అప్పట్లో వచ్చిన బిల్లు సున్నా. అంటే వ్యవసాయ విద్యుత్ పూర్తిగా ఉచితంగా అందిందన్నమాట. అదే సర్వీసుకు 2026 ఆగస్టులోఈపీడీసీఎల్ జారీ చేసిన బిల్లులో మాత్రం రూ.1,47,361 బకాయి ఉన్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 2లోగా బకాయి చెల్లించాలని, లేకపోతే సెప్టెంబరు 3న విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేసింది. ఒకప్పుడు సున్నా బిల్లు వచ్చిన అదే వ్యవసాయ కనెక్షన్కు ఇప్పుడు లక్షన్నర రూపాయలకు చేరువలో బకాయి చూపించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూ సమస్యలపై ఎస్సీ కమిషన్ సభ్యుడు ఫిర్యాదుల స్వీకరణ
బుచ్చెయ్యపేట : మండలంలో గల పలు గ్రామాల్లో భూ ఫిర్యాదులపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పరిశీలించారు. మంగళవారం ఆయన లోపూడిలో రెల్లి అప్పలనరస భూ ఫిర్యాదుపై అక్కడ స్థలం పరిశీలించారు. అక్కడ సాగు రైతుల నుంచి భూ రికార్డుల వివరాలను పరిశీలించారు. బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో కొమళ్లపూడిలో విద్యుత్ సబ్స్టేషన్కు సేకరించిన భూ నిర్వాసితుల నుంచి ఫిర్యాదులను తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బుచ్చెయ్యపేట మండలంలో శింగవరం, పొట్టిదొరపాలెం,లోపూడి తదితర గ్రామాల్లో భూ సమస్యలను ఎస్సీ సెల్ జిల్లా యువజన అధ్యక్షుడు బూసి కోటి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పలువురు బడాబాబులు దళితుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేశారని వాటిపై విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ లక్ష్మి, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, వీఆర్వో సుధాకర్, సచివాలయ సర్వేయర్ సాయి పాల్గొన్నారు. -
మెట్రో మాయాజాలం!
పట్టాలెక్కక ముందే.. సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కకముందే.. అంచనాల అంకెలు పరుగులు పెడుతున్నాయి. 46.23 కిలోమీటర్ల తొలి దశకు ప్రభుత్వం గతంలో రూ.6,250 కోట్లతో టెండర్లు పిలవగా.. అదే ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.11,498 కోట్లకు చేరింది. అంటే టెండర్ అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.5,248 కోట్లు పెరగడం గమనార్హం. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో 76 కిలోమీటర్ల తొలి దశకు రూ.9,669 కోట్లుగా అంచనా వేసిన నేపథ్యంలో.. ఇప్పుడు దూరం తగ్గినా వ్యయం పెరగడంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మదింపు తర్వాత సాధారణంగా వ్యయం తగ్గాల్సి ఉండగా.. విశాఖ మెట్రో విషయంలో మాత్రం అంచనాలు అమాంతం పెరగడం వెనుక కారణాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 140.13 కిలోమీటర్లను మూడు దశల్లో నిర్మించేలా రూ.14,309 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపించారు. ఇందులో తొలి దశగా 76 కిలోమీటర్లకు రూ.9,669 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్రం ఆమోదించే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. చంద్రబాబు గద్దెనెక్కాక.. మళ్లీ డీపీఆర్లో మార్పులంటూ ఆలస్యం చేశారు. డబుల్ డెక్కర్ అంటూ కొత్త ప్రతిపాదనని పంపించారు. విశాఖలో డబుల్డెక్కర్ వయబుల్ కాదంటూ కేంద్రం అక్షింతలు వేసింది. దీంతో.. ఎంతో కొంత మేర డబుల్డెక్కర్ ఫ్లైఓవర్ ఉండాలని చంద్రబాబు పట్టుబట్టడంతో.. ప్రాజెక్టు ముందుకు కదలలేదు. దూరం తగ్గినా.. వ్యయం పెరిగింది! గత ప్రభుత్వంలో 76 కిలోమీటర్ల తొలి దశకు రూ.9,669 కోట్లుగా అంచనా వేయగా.. ప్రస్తుత ప్రతిపాదనలో దూరాన్ని 46.23 కిలోమీటర్లకు కుదించి వ్యయాన్ని మాత్రం రూ.11,498 కోట్లకు పెంచారు. తక్కువ దూరానికి ఎక్కువ వ్యయం ఎలా వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సవరించిన డీపీఆర్లో అంచనాలు ఇంత భారీగా పెరగడానికి కారణాలు, టెండర్ డాక్యుమెంట్లలో లేని కొత్త పనుల వివరాలు, ప్రతి విభాగానికి సంబంధించిన వ్యయ బ్రేకప్ గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం. రూ.6,250 కోట్ల నుంచి రూ.11,498 కోట్లకు.. 46.23 కిలోమీటర్ల తొలి దశ నిర్మాణానికి గతేడాది జూలైలో రూ.6,250 కోట్లతో (జీఎస్టీ అదనం) ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. అయితే సింగిల్గా కాకుండా ప్యాకేజీలుగా విభజించడం వంటి నిబంధనల కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక మదింపు కోసం పంపిన సవరించిన డీపీఆర్లో అదే 46.23 కిలోమీటర్లకు రూ.11,498 కోట్లుగా అంచనా వేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. టెండర్ అంచనాతో పోలిస్తే రూ.5,248 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. భూసేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, కోచ్ల కొనుగోలు తదితర వ్యయాలను కలిపినా ఇంత భారీగా పెరిగే అవకాశం లేదని, ఇందులో ఏదో పెద్ద మాయాజాలమే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
వృద్ధుడు అదృశ్యంపై ఫిర్యాదు
దేవరాపల్లి : దేవరాపల్లిలోని తమ బంధువుల పెళ్లి వేడుకులకు వచ్చిన విశాఖపట్నం తాటిచెట్లపాలేనికి చెందిన పొన్నాడ లక్ష్మణరావు (61) అదృశ్యమయ్యాడని అతని బంధువులు స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం దేవరాపల్లిలో ఈ నెల 16న జరిగిన పెళ్లికి లక్ష్మణరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం వరకు అందరితో ఉన్న అతడు సాయంత్రానికి కనిపించలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం అతని బంధువులు పలు ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనిపించలేదు. వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 9010622874, 9573268376కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. కాగా లక్ష్మణరావు చిన్న కుమారుడుకి వచ్చే నెలలో వివాహం నిశ్చయం కావడంతో అతని బంధువులు ఆందోళన చెందుతున్నారు. -
డిజిటల్ అరెస్ట్.. రూ.1.46 కోట్లు స్వాహా!
అల్లిపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసులో మ్యూల్ అకౌంట్గా బ్యాంక్ ఖాతాను అందించిన నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్యను టెలికాం, పోలీస్, ఈడీ, సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అక్రమంగా డబ్బులు సంపాదించారని, అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో వారి జీవితకాల పొదుపు సొమ్ము నుంచి రూ.1,46,50,220ను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానిప్రసాద్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాపుపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న బాధితుడి ఖాతా నుంచి రూ.29.20 లక్షలు బదిలీ అయిన ఖాతాను పోలీసులు పరిశీలించారు. కేవైసీ వివరాల ప్రకారం పీఎం షబీర్, అబూతాహీర్ జాయింట్ అకౌంట్ హోల్డర్లుగా ఉన్నారు. మొబైల్ నంబర్, ఇతర సాంకేతిక ఆధారాలతో షబీర్ను గుర్తించారు. విచారణలో తన బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు, సిమ్ కార్డును ఇతరులకు ఇచ్చినట్లు షబీర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని ఖాతా ద్వారా సుమారు రూ.92 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ఈ మోసంతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు, వారి పాత్రపై కీలక సమాచారం లభించిందని, వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. -
శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా బోధన
● రాష్ట్ర బాలికా అభివృద్ధి అధికారి జయలక్ష్మి వంటల నాణ్యత పరిశీలిస్తున్న విజయలక్ష్మి మాకవరపాలెం: ఇంటర్, పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన సాగించాలని రాష్ట్ర బాలికా అభివృద్ధి అధికారి పి.జయలక్ష్మి ఆదేశించారు. స్థానిక కేజీబీవీని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంట చేసే ప్రాంతం, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. పది, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ అమలు, తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమీక్షించారు. వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థినులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలికా అభివృద్ధి అధికారి జెమీమా పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 64 అర్జీలు
అర్జీదారు సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై 64 అర్జీలు వచ్చాయన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తొంగకుండా కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. స్టేషన్లో కేసులు ఏ దశలో ఉన్నాయో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్బీ సీఐ ఎస్.బాలసూర్యారావు, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గరిశింగిలో 12 అడుగుల గిరినాగు హల్చల్
గరిశింగిలో భారీ గిరినాగును పట్టుకుంటున్న వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు దేవరాపల్లి: మండలంలోని గరిశింగిలో సోమవారం ఉదయం భారీ గిరినాగు జనావాసాల మధ్యకు ప్రవేశించి గ్రామస్తులను హడలెత్తించింది. గ్రామంలోని రెండు ఇళ్ల మధ్య సందులో సుమారు 12 అడుగుల మేర పొడువున్న గిరినాగు చేరింది. ఇటుకలు తీసేందుకు వెళ్లగ ఒక్కసారిగా గిరినాగు పడగ విప్పి బుసలు కొట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు చోడవరం అటవీశాఖ అధికార్లు ద్వారా తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. ప్రసాద్, కృష్ణ, ఇషాక్ తదితర సమితి సభ్యులు అక్కడికి చేరుకొని సుమారు గంట పాటు శ్రమించి అతి కష్టం మీద భారీ గిరినాగును సురక్షితంగా పట్టుకున్నారు. చీడికాడ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
ఒంటి నిండా ‘హష్’
నాగోలు: పోలీసుల కళ్లుగప్పి.. హష్ ఆయిల్(గంజాయి నుంచి తయారు చేసిన డ్రగ్) ప్యాకెట్లను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాకుచెందిన ఆరుగురిని ఎస్వోటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. సుమారు రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీ నగర్లోని సీపీ క్యాంపు ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హష్ ఆయిల్ సేకరించి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎల్బీ నగర్ చింతల్కుంట వద్ద మాటువేసి నిందితులను అడ్డుకున్నామని సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం గెమ్మెల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియాతో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను, నిబియా, చిక్కుడు శరణ్, పంగి జగదీష్తో పాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. మైనర్లను జువైనల్ హోమ్కు తరలించారు. కాళ్లకు..కడుపునకు కిలో చొప్పున పోలీసుల కళ్లు గప్పేందుకు క్యారియర్లు వినూత్న పద్ధతిని అనుసరించారు. రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపునకు మరో కిలో..చొప్పున ఒక్కొక్కరూ 3 కిలోల హష్ ఆయిల్ ప్యాకెట్లను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకున్నారు. నలుగురు కలిపి 12 కిలోలు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా హష్ ఆయిల్ బెంగళూరుకు తరలించేందుకు వీరు అక్కడి రిసీవర్ సిజోతో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరు నుంచి దందా నడిపిస్తున్నట్టు సీపీ తెలిపారు. గెమ్మెలి శ్రీనుపై గతంలోనే నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, జైలుకు వెళ్లాడని సీపీ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ డ్రగ్స్ రవాణా ప్రారంభించినట్లు వెల్లడించారు. హష్ ఆయిల్ సరఫరా చేసిన కృష్ణ, బెంగళూరులోని ప్రధాన రిసీవర్ సిజో ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఎస్ఓటీ డీసీపీ మనోహర్, ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ షాకీర్ హుస్సేన్, వనస్ధలిపురం ఏసీపీ కాశిరెడ్డి, సీఐ రవిబాబు, ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ప్రతాప్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వేను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
మాకవరపాలెం: మండలంలోని రాచపల్లి రెవెన్యూలో సర్వేను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. రాచపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 737లో 1600 ఎకరాల భూమిలో ఇప్పటికే 406 ఎకరాలను ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల నుంచి మిగిలి ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ భూమికి సంబంధించి రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య సరిహద్దుల నిర్ధారణపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ చేపట్టిన సర్వే ఫారెస్ట్కు చెందిన భూముల్లో ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సోమవారం కోటవురట్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి వివేకానంద తన సిబ్బందితో కలసి పరిశీలించారు. ప్రస్తుత సర్వే అనకాపల్లి రేంజ్ పరిధిలో జరుగుతుందని నిర్ధారించుకున్నారు. నర్సీపట్నం రేంజ్ పరిధి కాకపోవడంతో ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు. ఇదిలా ఉండగా 30 ఏళ్లకుపైగా ఈ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. పరిశ్రమలకు తమ సాగు భూమిని సేకరిస్తే ప్రభుత్వం, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
క్షేత్రస్థాయిలో అర్జీలపై పరిశీలన జరపండి
తుమ్మపాల : పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీలపై అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్ఓ వై.సత్యనారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.సందీప్ అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 301 వినతులు నమోదు కాగా రెవిన్యూ క్లినిక్– 143, పీజీఆర్ఎస్–158 ఉన్నాయి. బీఎంఎస్ ఆధ్వర్యంలో నిరసనలు అంగన్వాడీ, ఏఎస్ఐఐఏ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్ఐఐఎం, ఇతర పథకాల కార్యకర్తల వేతనం పెంపు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల తక్షణ పరిష్కారం కోరుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆయా పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం రూ.30 వేలు అందించాలని, కనీస పింఛను నెలకు రూ.21 వేలు నుంచి రూ.27,500 పెంచడం, వీడీఏ, ఆయుష్మాన్ భారత్ యోజనతో అనుసంధానం చేయడం ఈపీసీ–95 కింద కనీస పింఛనును నెలకు రూ.21000 నుంచి 27,500కు పెంచాలని అన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐసి బోనస్ లెక్కింపుల కింద కవరేజ్ గరిష్ట పరిమితులను రెట్టింపు చేయడం, పాత పింఛను పథకం పునరుద్ధరణ, గ్రాట్యూటీ లెక్కింపును 15 రోజుల వేతనం నుంచి 30 రోజుల వేతనానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా సవరించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులతో సహా ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాల పెంపు, అన్ని రకాల పథకాల కార్యకర్తలకు (ఆంగన్వాడీ, ఏఎస్ఐఐఏ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్ఐఐఎం ఇతర పథకాల కార్యకర్తలు గౌరవ వేతనం పెంచాలని, బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడం, కార్మిక చట్టాలలోని కార్మిక వ్యతిరేక నిబంధనలను తొలగించేలా సవరించాలన్నారు. ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగ భద్రత, తొలగింపు, సింహాద్రి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. నీటి వనరులను కాపాడాలి కాగిత గ్రామంలో గెడ్డ భూములు చెరువులకు వర్షపునీరు అందించే ఇతర కాలువలను ప్రైవేట్, ప్రభుత్వ అవసరాలకు బదిలీచేసే ప్రతిపాదనను తక్షణమే రద్దుచేయాలని, నీటివనరులను కాపాడాలంటూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. నక్కపల్లి మండలం కాగిత గ్రామ సర్వే నంబర్.128, 195, 164, 176, 177, 162 (గ్రామకంఠం), 187 గెడ్డలుగా స్పష్టమైన రెవెన్యూ రికార్డులు ఉంటూ గ్రామ పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ప్రధాన నీటివనరుగా ఉన్నాయి. వర్షపు నీరు ప్రవహించడానికి భూగర్భజలాలు రీచార్జ్ అవ్వడానికి ఎంతో కీలకంగా ఉన్నాయి. భూములను రైల్వే స్లైడింగ్ ప్రాజెక్ట్ (ఎఎంఎన్ఎస్) కోసం కేటాయించి నిర్మాణాలు చేపడితే నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల చుట్టుపక్కల వందలాది ఎకరాల పంట భూములు ఎండిపోవడమే కాకుండా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి రైతులు రైతు కూలీలు వారి జీవనోపాధి కోల్పోతారని, రైతులు, పశుపోషకులు సాధారణ ప్రజలు కూడా నీటి వనరులను పారిశ్రామిక అవసరాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామసభ ఆమోదం లేకుండా సహజ వనరులను బదిలీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతి అందించారు. -
జూడాల సమ్మెతో.. రోగుల హాహాకారాలు
మహారాణిపేట: వైద్యం కోసం వచ్చిన నిరుపేద రోగులకు తిప్పలు తప్పడం లేదు. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి వారు అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. గత ఏడు రోజులుగా కొనసాగుతున్న ఈ సమ్మెతో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సహా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వెలవెలబోయిన ఓపీలు జూనియర్ వైద్యులు, పీజీ విద్యార్థులు విధులకు గైర్హాజరు కావడంతో ఓపీ విభాగాలు వెలవెలబోయాయి. కేజీహెచ్లోని 26 ఓపీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నిత్యం వేలాది మంది రోగులను చూసే జూడాలు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు గంటల తరబడి పడిగాపులు కాశారు. అత్యవసరం కాని శస్త్రచికిత్సలన్నింటినీ అధికారులు వాయిదా వేశారు. కేజీహెచ్తో పాటు విక్టోరియా, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి, రాణీ చంద్రమణి దేవి, ఈఎన్టీ, టీబీ ఆసుపత్రుల్లోనూ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్యుల అవతారంలో నర్సులు ఇన్పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సమయానికి వైద్యులు రాకపోవడంతో రోగులు నరకయాతన అనుభవించారు. సరైన వైద్యం అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని విభాగాల్లో గత్యంతరం లేక నర్సులు, నాలుగో తరగతి సిబ్బందే వైద్యుల అవతారమెత్తి రోగులకు ప్రాథమిక చికిత్సలు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఆసుపత్రి ప్రాంగణాల్లోనే నిస్సహాయంగా ఎదురుచూస్తూ కనిపించారు. ప్రత్యామ్నాయాలతో కలగని ఉపశమనం జూడాల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర నాయుడు, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి అత్యవసర చర్యలు చేపట్టారు. వైద్యుల సెలవులన్నింటినీ రద్దు చేశారు. డీఎంహెచ్వో పరిధిలోని 8 మంది వైద్యులతో పాటు నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన 47 మంది వైద్యులను విధుల్లోకి తీసుకున్నారు. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లను కూడా అత్యవసర వార్డుల్లో నియమించారు. మొత్తం 55 మంది వైద్యులతో మూడు షిఫ్టుల్లో రోస్టర్ విధానం అమలు చేస్తూ ఐసీయూ, క్యాజువాలిటీ, ఆపరేషన్ థియేటర్లలో సేవలు కొనసాగేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత ఏడు రోజులుగా జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయినా పట్టనట్లు వ్యవహరిస్తుండటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే తాము సమ్మె బాట పట్టామని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (ఏపీ జూడా) నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని యూనియన్ నాయకులు దినకర్ సాయి శ్రీనివాస్, కె.రవీంద్ర, డాక్టర్ సిరాజ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. -
వచ్చే నెలాఖరుకల్లా తాగునీటి సమస్యకు పరిష్కారం
అనకాపల్లి: అగనంపూడి నుంచి అనకాపల్లి తాగునీటి సరఫరాను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు తీసుకురావడం జరుగుతుందని, పట్టణ పరిధిలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. స్థానిక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి, అర్జీదారుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టణ పరిధిలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తున్నామన్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు వారంలో రెండురోజులు అనకాపల్లి జోనల్ కార్యాలయానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. జీవీఎంసీ పరిధిలో 525 సచివాలయాలు ఉన్నాయని, వాటి పరిధిలో పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించడం జరిగిందని అన్నారు. 15 ఫైనాన్స్ నిధులతో పలు అభివృద్ధి పనులకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం పట్టణలో ఏఎంసీ కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న రాజీవ్ గృహాలను పరిశీలించి, అక్కడ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. గవరపాలెం రాజీవ్గాంధీ ఇండోర్ స్టేడియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గతవారం పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులతో ఫోన్లో నేరుగా కమిషనర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషన్ కె.చక్రవర్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
22 నుంచి బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం
ఈయన వదలరు.. ఆయన కదలరు..! సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, చిత్రంలో పలు శాఖల అధికారులు మహారాణిపేట: బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం–2026కు పటిష్ట భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 22, 23 తేదీల్లో నోవోటెల్లో సమావేశం జరుగుతుందని, 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రతినిధులు 21 నుంచి 24 వరకు నగరంలో ఉంటారని చెప్పారు. అతిథులకు రాడిసన్ బ్లూ, నోవోటెల్లో వసతి, భద్రత, రవాణా, ప్రోటోకాల్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. 22న గాలా డిన్నర్, 23న బీచ్లో సైకిల్ ర్యాలీ, కై లాసగిరిలో గ్లాస్ బ్రిడ్జి సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమాలతోపాటు తొట్లకొండ, రుషికొండలో పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ సీఎండీకి 41 ఫిర్యాదులు
మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 41 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా లో–వోల్టేజ్, విద్యుత్ బిల్లులు, లైన్ షిఫ్టింగ్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, రూఫ్టాప్ సోలార్, కొత్త విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వితేజ్ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం, 9493681912 వాట్సాప్ నంబర్కు చాట్ చేయడం ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సంస్థ సూచించింది. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీ సూర్యప్రకాష్, సీజీఎం పి.సోల్మన్రాజు, జనరల్ మేనేజర్లు ఎం.ఝాన్సీ, వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్, వి.వి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడండి
ఆర్డీవో అయేషాకు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు అనకాపల్లి టౌన్ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపిల్లి అప్పలరాజు అన్నారు. స్ధానక ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీవో అయేషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రైతుల పెట్టుబడులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఖరీఫ్లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు, కౌలు రైతులకు రూ. 50వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వై.ఎన్. భద్రం, కోన లక్ష్మణ్, రైతు సంఘం నాయకులు కాసుబాబు, కోరుబిల్లి శంకర్రావు పాల్గొన్నారు. -
కష్టాల సేద్యం.. బీమా భారం..!
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో లక్షా 32 వేల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటివరకూ 79,592 ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. 72,575 మంది రైతుల పేరు మీద ఈ బీమా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్లో ఎల్నినో ప్రభావంతో 60.52 శాతం వరకూ పంటల బీమా ప్రీమియం పూర్తయింది. రైతులు ఈ ఏడాది పంటల బీమాగా 1 లక్షా 32 వేల ఎకరాలకు రూ.1,10,88,000 చెల్లించనున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ మొత్తం ప్రభుత్వమే భరించింది. సాక్షి, అనకాపల్లి : ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో వర్షాలు లేకపోవడంతో రైతులు పంట వేయాలో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆందోళనలో ఉన్నారు. నష్టాలు వచ్చి అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో పలు చోట్ల నెలకొన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి విపత్తుల సమయంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు ఉచిత పంట బీమా తీసుకొచ్చింది. విపత్తు ప్రభావంతో ఏ రైతు నష్టపోకుండా ప్రతి రైతునూ ఆదుకునేందుకు అండగా ప్రభుత్వం నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తుంది. వాతావరణ పరిస్థితుల అనుకూలించక నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు సగం పూర్తయినా జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 10 శాతం కూడా వరినాట్లు జరగలేదు. నారు వేసుకుని, వర్షాలు పడితే నాట్లు వేద్దామనే రైతుల ఆశశ..నిరాశగానే ఉంది. ఉచిత బీమా లేకపోయినా రైతులు స్వయంగా బీమా చెల్లించుకుంటున్నారు. సాగు లేకున్నా ప్రీమియం చెల్లించాల్సిందే.. ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడకపోవడంతో వరిసాగు నత్తనడకన సాగుతోంది. రైవాడ, తాండవ రిజర్వాయర్ల నుంచి సాగు నీరు విడుదల చేయడతో ఆయా ఆయకట్టు ప్రాంతాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. మిగిలిన చోట్ల వర్షాలు లేక ఇంకా సాగు ప్రారంభం కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వమే ఉచిత పంట బీమా కింద డబ్బులు రైతు తరుపున చెల్లించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రెండేళ్లుగా ఉచిత బీమా పథకానికి ఎసరు పెట్టింది. గత రెండు ఖరీఫ్ సీజన్లలో రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు. అప్పు చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చేశారు. ఈ ఏడాది కరువు పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు అనిశ్చితిలో ఉంది. కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులే బీమా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. అది కూడా సాగు లేకున్నా ప్రీమియం చెల్లించాలంటూ నిబంధన పెట్టారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్లో వరి పంట సాగు ఇంకా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో రైతుకు పంటల బీమా అనేది భారంగా మారింది. సాగు చేయకపోయినా ఎకరాకు రూ.84 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం కూడా ఒక్కో జిల్లాలో ఒక్కోలా ఉంది. అనకాపల్లి జిల్లాకు పొరుగు జిల్లాలైన విశాఖలో ఎకరాకు రూ.420, కాకినాడ జిల్లాలో రూ.720 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. సాగుపై అనిశ్చితి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. జూలై, ఆగస్టు నెలలో దాదాపు 69 శాతం వర్షపాత లోటు నమోదైంది. రాబోయే నెలల్లో కూడా 35 నుంచి 40 శాతం వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం వాతావరణ మార్పులతో వర్షం పడితే ఒకటే కుండ పోత..లేదంటే ఉక్కపోత అన్నట్టుగా పరిస్థితి ఉంది. అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కేవలం 2, 3 రోజుల్లోనే విపరీతంగా వానలు పడి ఆ తరవాత మళ్లీ సాధారణమైపోవడం జరుగుతోంది. ఇప్పుడు ఆగస్టు వచ్చింది. వర్షాలు పడే కాలం. కానీ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు లేవు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ వరకూ వర్షాభావ పరిస్థితులే ఉండనున్నాయి. ఇలాంటి సమయంలో సాగుకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా సాగునీరు విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్కు సరైన విధంగా సన్నద్ధం కాకపోతే రైతులకు ఆర్థిక సవాళ్లతో పాటు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అస్కారం ఉంది. 31వ తేదీ వరకూ గడువు పొడిగింపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) కింద దిగుబడి ఆధారిత పంటల ప్రీమియం చెల్లింపు గడువును మరోసారి బీమా కంపెనీలు పొడిగించాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 31 వరకూ ప్రీమియం చెల్లింపునకు వెసులుబాటు కల్పించాయి. అనకాపల్లి జిల్లాలో ఈ నెలాఖరి వరకూ వెసులుబాటు ఉంది. బీమాతో సాగుకు రక్షణ ఎల్నినో నేపథ్యంలో వర్షాలు పడకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. రిజర్వాయర్లలో సాగు నీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే తాండవ, రైవాడ రిజర్వాయర్ల ద్వారా సాగునీరు విడుదల చేశారు. వాటి ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ సాగు జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాగు వేయకపోయినా బీమా చెల్లించుకోవచ్చు. గతేడాదితో పోల్చితే భారీగా ఇప్పటి వరకూ బీమా 60.52 శాతం చెల్లించారు. ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది. వరిసాగు చేసే ప్రతి రైతు బీమా చెల్లించాలి. బీమా చెల్లించడం కారణంగా మీకు పంట నష్టం కలిగితే బీమా కంపెనీలే పరిహారం చెల్లిస్తాయి. ఇప్పటివరకూ బీమా చెల్లించని రైతులు ఈ నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాలి. – ఆశాదేవి, జిల్లా వ్యవసాయాధికారి, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా నాతవరం మండలంలో బీమా లక్ష్యం 14,996 ఎకరాలు కాగా, తరువాత మాడుగుల మండలంలో 10,338 ఎకరాలు, ఎస్.రాయవరం మండలంలో 8,357 ఎకరాలు, దేవరాపల్లి మండలంలో 8273 ఎకరాలు పెట్టుకున్నారు. అత్యల్పంగా పరవాడ మండలంలో 336 ఎకరాలు, అచ్యుతాపురం 1764 ఎకరాలు, కశింకోట 2,530 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. -
విశాఖ రైల్వే స్టేషన్లో జీఎం పర్యటన
ఏఐ ఆధారిత సహాయక సిస్టంను పరిశీలిస్తున్న జీఎం సందీప్ మాధుర్ తాటిచెట్లపాలెం (విశాఖ): సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రాతో కలిసి స్టేషన్లోని పలు విభాగాలను పరిశీలించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ‘సారిక’ సహాయక వ్యవస్థ పనితీరును పరిశీలించారు. దీని ద్వారా స్టేషన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, వెయిటింగ్ హాళ్లు, రిజర్వేషన్ కౌంటర్లు తదితర వివరాలను ప్రయాణికులు తెలుసుకోవచ్చు. వ్యవస్థ పనితీరును పరిశీలించిన జీఎం పలు సూచనలు చేశారు. -
వచ్చే నెల 3 నుంచి ఆర్మీ ర్యాలీ
సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, చిత్రంలో పలు శాఖల అధికారులు మహారాణిపేట: విశాఖలో సెప్టెంబర్ 3 నుంచి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే ర్యాలీలో రాత పరీక్షలో అర్హత సాధించిన 10,355 మంది అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు. ఆర్కే బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వరకు 1.6 కిలోమీటర్ల నైట్ రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు తాగునీరు, వైద్య సేవలు, రవాణా, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, ఐటీ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కల్నల్ అమరేష్ సింగ్, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
శివయ్య చెరువుకు శఠగోపం
నాతవరం: ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులకు అప్పనంగా అప్పగించేస్తున్నారు. ఇదే తరహాలో నాతవరం మండలం వి.బి. అగ్రహారం గ్రామ రెవెన్యూలో సర్వే నంబరు 21/1లో నాలుగెకరాల శివయ్య చెరువును ఓ వ్యక్తికి రాసిచ్చేశారు. బ్రిటిష్ కాలం నాటి ఈ చెరువు ఆయకట్టు కింద 150 ఎకరాల్లో వరి సాగు చేసుకునేవారు. తాండవ రిజర్వాయరు నిర్మించిన తర్వాత నుంచి ఈ చెరువు నీరుపై రైతులు ఆధారపడటం లేదు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా తునికి చెందిన యేడిద గంగారావు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క తన భార్య పద్మావతి పేరుపై మూడెకరాలకు డీపట్టా మంజూరు చేయించుకున్నాడు. 2017లో పద్మావతి తన కుమారుడు రామచంద్రరావు పేరు మీద గిఫ్ట్ డీడ్ కింద తునిలో రిజిస్ట్రేషన్ చేసింది. ఇటీవల ప్రభుత్వ రీసర్వేలో చెరువు విస్తీర్ణం ఎకరం మాత్రమే నమోదు కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభవ పరిస్థితుల్లో చెరువు ఎండిపోయింది. సదరు వ్యక్తి గత నెలలో వ్యవసాయం చేసేందుకు వచ్చాడు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ వద్ద రికార్డులు ఉన్నాయంటూ అతడు ఎదురుదాడికి దిగాడు. దాంతో గ్రామస్తులు పోరాటానికి దిగారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చెరువును కాపాడుకునేందుకు గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ నెల 14వ తేదీన తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. చెరువు గర్భంలో ఇచ్చిన పట్టాను వెంటనే రద్దు చేసి నిబంధనలు ఉల్లఘించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తుని వ్యక్తికి డీ పట్టా మంజూరు ఆపై గిఫ్డ్గా రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారుల తీరుపై విస్మయం లోకాయుక్తను ఆశ్రయించిన వి.బి.అగ్రహారం గ్రామస్తులు -
ఇక సెలవు!
మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్.. ఫ్లైట్ నం. వీటీజెడ్.. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూ భోగాపురం ఈజ్ నౌ రెడీ ఫర్ టేకాఫ్.. అండ్ ల్యాండింగ్ ఎట్ భోగాపురం టుడే ఆన్వార్డ్స్. ఆల్ బుక్డ్ ప్యాసింజర్స్.. ఆర్ రిక్వెస్టెడ్ టూ కీప్ దెయిర్ లగేజ్ అండ్ ప్రొసీడ్ టూ ది భోగాపురం ఎయిర్పోర్ట్.. ఏంటి.. నా అనౌన్స్మెంట్ మారిందని ఆలోచిస్తున్నారా..? నేనేనండీ.. మీ వైజాగ్ ఎయిర్పోర్ట్ని. మీ ఊరి సరిహద్దు దాటి.. గగనవీధిలో దూరతీరాలకు ఎగరాలనుకున్నప్పుడు మీ పాదాలకు ప్రప్రథమంగా రెక్కలు తొడిగింది నేనే! తీపి జ్ఞాపకాలతో మహా నగరానికి వచ్చిన ప్రియమైన వారిని మీ ఒడికి చేర్చింది.. కొత్త ఆశల వైపు మిమ్మల్ని నడిపించింది నేనే.! ఇకపై.. నేను మీతో అనుబంధాన్ని పంచుకోలేనేమో.. ఎందుకంటే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవడంతో.. సుదీర్ఘ కాలం పాటు మీకు అందించిన పౌర విమాన సేవలకు స్వస్తి చెబుతూ ఈరోజుతో వీడ్కోలు పలుకుతున్నాను. ఇకపై సివిల్ సర్వీసులు నిలిపేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని మా డైరెక్టర్ (ఎయిర్పోర్ట్) పురుషోత్తం కూడా ప్రకటించేశారు. ఎనిమిది దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను చూసిన వెలుగు నీడలు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఒడిదొడుకుల జ్ఞాపకాలను ఒక్కసారి మీతో పంచుకోవాలనిపించింది. నా జ్ఞాపకాలు మీ గుండెల్లో పదిలంగా ఉన్నాయని నాకు తెలుసు. నా సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్లు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధించిన విజయాల జ్ఞాపకాలను ఒక్కసారి మీ ముందుంచుతున్నాను. నా పుట్టుకే ఓ ‘యుద్ధం’..! అమ్మ కడుపులోంచి మీరందరూ బయటకు రావడానికి ఓ యుద్ధమే జరుగుతుంది. అలానే నా రక్తసిక్తమైన యుద్ధ భూమిలో నా జననం జరిగింది. నా పుట్టుక ఏ సౌకర్యవంతమైన ప్రయాణాల కోసమో జరగలేదు. 1940 ప్రారంభంలో.. ద్వితీయ ప్రపంచ యుద్ధ మేఘాలు అలముకున్న వేళ.. రాయల్ ఎయిర్ఫోర్స్(రాఫ్).. తమ సైనిక అవసరాల కోసం మేఘదూతలా ఒక చిన్న ఎయిర్స్ట్రిప్గా నేను రూపుదిద్దు కున్నాను. యుద్ధం ముగిశాక కొంతకాలం ప్రశాంతంగా ఉన్నా.. 1972 నాటికి భారత నౌకాదళం నా పరిసరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 1986లో నా పూర్తి యాజమాన్యం భారత నౌకాదళం పరిధిలోకి వచ్చింది. 1991 అక్టోబర్ 21న నాకు అధికారికంగా ’ఐఎన్ఎస్ డేగాా’ అని నామకరణం పేరుపెట్టి నేవల్ ఎయిర్స్టేషన్గా తీర్చిదిద్దారు. ఒక్క విమానంతో మొదలై.. నౌకాదళానికి చెందిన స్థలంలోనే పౌర విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ‘ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ నా ప్రాంగణంలో సివిల్ ఎన్క్లేవ్ని ఏర్పాటు చేసింది. నా స్థావరం నుంచి క్రమబద్ధంగా వాణిజ్య ప్రయాణికుల సేవలు 1981లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఇండిగో (అప్పట్లో ఇండియన్ ఎయిర్లైన్స్) విమానం రోజుకు కేవలం ఒకే ఒక్క సర్వీసుతో ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ప్రయాణించేది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి సరిపడా నా పాత 6,000 అడుగుల రన్వే సరిపోయేది కాదు. దీంతో.. 2007 జూన్ 15న ఏకంగా 10,007 అడుగుల (3,050 మీటర్లు) భారీ రన్వే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఎదురు చూడలేదు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయం కలిపి 70కి పైగా విమానాలు.. నా దగ్గర నుంచి రయ్రయ్మంటున్నాయి. 2009 ఫిబ్రవరిలో నూతన టెర్మినల్ భవనం ప్రారంభమైంది. అప్పటిదాకా పగటి పూటకే పరిమితమైన నాకు 2012లో ‘రాత్రివేళల ల్యాండింగ్’ సదుపాయం కల్పించారు. దాంతో సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకూ నా ద్వారా రాకపోకలు విస్తరించుకుంటూ.. మీకు సేవలందించాను. ఆంక్షల మరకలు.. ఒక వైపు పౌర విమానాలు, మరోవైపు రక్షణ శాఖ యుద్ధ విమానాలతో నా వల్ల మీరు(ప్రయాణికులు) ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రివేళల్లో ఆంక్షలు, నావికాదళ శిక్షణ సమయంలో సివిల్ విమానాలకు నిరీక్షణ వంటి సమస్యలు నాకు ఎంతో ఆవేదన మిగిల్చాయి. కానీ.. మీరు ఎప్పుడూ నన్ను దూరం చేసుకోలేదు. ఆ పట్టుదలతోనే.. నా కలలకు రెక్కలు తొడుగుతూ.. మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేర్చాను.అటెన్షన్ ప్లీజ్ ప్యాసింజర్స్... ఇక్కడ చివరి ఫ్లైట్ విజయవాడ.. అక్కడ తొలిఫ్లైట్ సింగపూర్ నా సేవలు ఆదివారం అర్ధరాత్రితో ముగిసిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్లిన చివరి ఫ్లైట్ సర్వీస్గా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో సర్వీసు నిలిచిపోయింది. అదేవిధంగా.. ఇక్కడ ల్యాండింగ్ అయిన చివరి సర్వీసుగా విజయవాడ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం చరిత్రలో నిలిచిపోతుంది. అన్నట్లు.. మీ కొత్త ప్రయాణం మొదలయ్యే భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న తొలి సర్వీసుగా సింగపూర్ స్కూట్ ఎయిర్లైన్స్ విమానం కొత్త చరిత్రకు తొలి అడుగుగా మారుతోంది. నన్ను వీడి భోగాపురం చేరుకున్నా.. మీ ప్రతి ప్రయాణంలో.. నా జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా.. గగన విహారంలో వెళ్తున్నప్పుడు.. పై నుంచి నేను కనిపిస్తే.. ఒక హాయ్ చెప్పడం మర్చిపోవద్దు సుమా..! ఇక సెలవు! మీ.. విశాఖపట్నం అంతర్జాతీయవిమానాశ్రయం – సాక్షి, విశాఖపట్నం గోపాలపట్నం: ఆదివారం రాత్రి 10.45 గంటలకు విజయవాడ నుంచి విశాఖకు దిగిన ఎయిర్ ఇండియా విమానమే ఇక్కడ చివరి షెడ్యూల్డ్ ఫ్లైట్గా నిలిచింది. నిజానికి ఈ విమానం ఒక యుగాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. రన్వేపై చక్రాలు తాకిన ఆ క్షణమే, ఎన్నో కుటుంబాల కథలు, ఎన్నో వీడ్కోళ్లు, ఎన్నో కలయికలు నేసిన ఈ గడ్డ... ఇవాళ్టితో మౌనంగా మారిపోయింది. 65 ఏళ్లు అంటే మాటలు కాదు. ఈ టార్మాక్పై తొలిసారి కాలుమోపిన అధికారి ఈపాటికి రిటైరై మనవళ్లతో ఆడుకుంటుండొచ్చు. ఇక్కడి కౌంటర్ల దగ్గర తొలి జీతం అందుకున్న యువకుడు ఈరోజు తెల్లబడిన జుట్టుతో, తడిసిన కళ్లతో తన ఐడీ కార్డును చివరిసారి మెడలో నుంచి తీస్తున్నాడు. దశాబ్దాలుగా ఇక్కడే సేవలందించిన కార్మికులు, సిబ్బంది ఈరోజు తమ కళ్లను తడి చేసుకోకుండా ఉండలేకపోయారు. కొందరు తోటి ఉద్యోగుల భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంటే, మరికొందరు మాట రాక మౌనంగా నిలబడిపోయారు. ‘ఈ నేలతో మా జీవితం పెనవేసుకుపోయింది, ఇప్పుడు దాన్ని వదిలి వెళ్లాలంటే గుండె తరుక్కుపోతోంది’ అంటూ కొందరు ఉద్యోగులు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఎవరికి వారు గుర్తుచేసుకుంటున్నారు.. ఎన్నో వానాకాలాల్లో ఫ్లైట్లు ఆలస్యమైనప్పుడు కలిసి టీ తాగిన క్షణాలను, పండగలకు సెలవులు లేకున్నా విధి నిర్వర్తించిన రాత్రులను, కంట్రోల్ టవర్ నుంచి ప్రతి ల్యాండింగ్నూ కళ్లారా చూసిన ఉద్విగ్న క్షణాలను. సామాన్లు సర్దుతున్న సిబ్బంది చేతులు వేగంగా కదులుతున్నా, మనసులు మాత్రం వెనక్కి లాగుతున్నాయి. ఒకరినొకరు కావలించుకుని, ‘మళ్లీ కలుద్దాం’అని బొంగురుపోయిన గొంతుతో చెప్పుకుంటున్నారు.. ఈ గోడల మధ్య, ఈ రన్వే పక్కన మాత్రం మళ్లీ కలవలేమని అందరికీ తెలుసు.ఇకపై ఇక్కడ యుద్ధ విమానాల గర్జన వినిపించొచ్చు, పోలీసు హెలికాప్టర్ల రెక్కల చప్పుడు వినిపించొచ్చు. కానీ సామాన్యుడిని ఆకాశంలోకి మోసుకెళ్లిన ఆ విమానాల శబ్దం మాత్రం, ఇక ఇక్కడ వినిపించదు. విశాఖ గగనానికి, పాత విమానాశ్రయానికి మధ్య ఉన్న ఈ అనుబంధం... ఈ రాత్రితో చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. కానీ ఆ 65 ఏళ్ల జ్ఞాపకాలు మాత్రం, ఇక్కడ సేవలందించిన ప్రతి గుండెలోనూ శాశ్వతంగా ఎగురుతూనే ఉంటాయి. -
మహిళను రక్షించిన లైఫ్గార్డ్స్
పెదగంట్యాడ: యారాడ తీరంలో సముద్రంలో దిగిన ఓ మహిళ కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్గార్డ్స్ కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరంలోని రైల్యే న్యూ కాలనీకి చెందిన సూర్యలక్ష్మి(55) అనే మహిళతో మరో నలుగురు కుటుంబ సభ్యులతో కలసి యారాడ తీరంలో సరదాగా గడిపేందుకు ఆదివారం ఉదయం వచ్చారు. అక్కడ కాసేపు ఇసుక తిన్నెల్లో గడిపి, అనంతరం ఐదుగురూ సముద్రంలో దిగారు. ఒక్కసారిగా అలల తాకిడి ఎక్కువ కావడంతో అందులో సూర్యలక్ష్మి సముద్రంలోకి కొట్టుపోతుండగా.. అక్కడే ఉన్న లైఫ్గార్డ్స్ కదిరి లోవరాజు, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీనివాస్, కదిరి వెంకటేష్ గమనించారు. వెంటనే వారు సముద్రంలో దిగారు. కొట్టుకుపోతున్న సూర్యలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకొని ఆమెను రక్షించిన లైఫ్గార్డ్స్కు కృతజ్ఞతలు తెలిపారు. -
జీఎంఆర్ లబ్ధి కోసమే విశాఖ విమానాశ్రయం మూత
మద్దిలపాలెం: జీఎంఆర్ సంస్థ లాభాల కోసం సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ ఎయిర్పోర్ట్ను శాశ్వతంగా మూసివేసి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఎం సీనియర్ నాయకుడు సీహెచ్ నర్సింగరావు ఆరోపించారు. ఎయిర్పోర్ట్ మూసివేతను వ్యతిరేకిస్తూ సీపీఎం ఇచ్చిన బ్లాక్డే పిలుపులో భాగంగా ఆదివారం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ విమానాశ్రయంగా కొనసాగిస్తూ, భోగాపురం ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ విమానాశ్రయం ద్వారా ఏటా 45 లక్షల మందికి పైగా ప్రయాణ సేవలు పొందుతున్నారని, అలాంటి విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ బి.గంగారావు, ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ జీఎంఆర్కు లబ్ధి చేకూర్చేందుకే విశాఖ ఎయిర్పోర్ట్ను మూసివేస్తున్నారని విమర్శించారు. విశాఖ అభివృద్ధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ వ్యయంపై అనుమానాలున్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. రూ.1500 కోట్లు కూడా ఖర్చుకాని భోగాపురం విమానాశ్రయానికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.మణి, వి.కృష్ణారావు, కె.ఎం.శ్రీనివాస్, ఎం.సుబ్బారావు, వెంకటరావు, నరేంద్రకుమార్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకుడు సీహెచ్ నర్సింగరావు -
ప్రకృతి ప్రకోపంతో భయపడిపోయాను..
నా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. నేనెన్నో మెరుపులు చూశాను.. కొన్ని చేదు మరకలనూ ఎదుర్కొన్నాను. 2005లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిపోయాను. దాదాపు 10 రోజుల పాటు నా రన్వే నీటిలో మునిగిపోయి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక నా పనైపోయిందని అందరూ అన్నారు. ఇక 2014లో నా జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగింది. 2014 అక్టోబరు 12న గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన హుద్ హుద్ తుపాన్ గాలులు.. నా టెర్మినల్ కప్పును ఎగరగొట్టాయి. అద్దాలన్నీ పగిలిపోయి, నా సర్వస్వం ఛిన్నాభిన్నమైంది. అదే నా చివరి రోజు అని అనుకున్నాను. కానీ, నేవీ అధికారుల అహోరాత్రులు శ్రమించడంతో.. కేవలం పదంటే పది రోజుల్లోనే కోలుకుని మళ్లీ విమానాలకు స్వాగతం పలికాను. ఇందులో మీ సహకారం కూడా ఎంతో ఉందని నాకు తెలుసు. -
అల్లుడికి అదిరిపోయే అల్పాహార విందు
నర్సీపట్నం: కొత్త అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వడంలో గోదావరి జిల్లాల అత్తింటివారు ముందుంటారు. వారికి దీటుగా నర్సీపట్నంలో శాంతినగర్కు చెందిన దంపతులు శ్రావణమాసానికి ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేక అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఒకటో, రెండో కాదు దాదాపు 100 రకాల టిఫిన్లు పెట్టారు. నాళం రమేష్, కళావతి దంపతులు తమ కుమార్తె లక్ష్మీనవ్యసాయిని ఇదే పట్టణానికి చెందిన పూసర్ల హర్షకు ఇచ్చి వివాహం చేశారు. ఆషాఢమాసం ముగియడంతో ఆదివారం ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఘనంగా స్వాగతం పలికారు. గేటు వద్ద నుంచి ఇంటి లోపలి వరకు పూలతో వంద గడులు తీర్చిదిద్దారు. ఈ గడులను దాటుకుంటూ వెళ్లిన అల్లుడికి అడుగుకో బహుమతిని బంధువులతో అందజేశారు. వంద రకాల వంటకాలతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. గత సంక్రాంతి పండగ సమయంలో కూడా ఇదే రీతిన అల్లుడికి అత్తమామలు విందు ఏర్పాటు చేశారు. ఇడ్లీ, అటుకుల ఉప్మా, పూరీ, పులిహోర, ఉప్మా పెసరట్టు, మిల్లెట్స్ ఇడ్లీ, పెరుగు సేమియా, మసాల దోశ, పన్నీరు దోశ, ఊతప్పం వంటి రకరకాల వంటకాలు అల్పాహార విందులో పెట్టారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రికి రిఫరల్ సుస్తీ
అనకాపల్లి: జిల్లా కేంద్రం అనకాపల్లిలోగల ఎన్టీఆర్ ఆస్పత్రికి నిర్లక్ష్యపు సుస్తీ చేసింది. సకాలంలో వైద్య సేవలందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పర్యవేక్షణ లోపించడంతో చిన్నపాటి వ్యాధులకు కూడా రోగులను కేజీహెచ్కు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. దీంతో పేద రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో వైద్య సేవలందకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల నుంచి వైద్యం కోసం రోగులు వస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రిలో సేవలు నానాటికీ తీసికట్టుగా మారాయి. పబ్లిసిటీకి చేస్తున్న ఖర్చులో కొంతభాగమైనా పేద రోగులకు ఖర్చు చేస్తే బాగుంటుందని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ ఆస్పత్రికి వందలాదిమంది రోగులు వస్తుంటారు. సోమవారం, బుధవారం, గురువారాల్లో ఓపీ 1200 వరకూ ఉంటుంది. మిగతా రోజుల్లో 600 నుంచి 800 వరకు ఉంటుంది. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో వచ్చే పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. ఆస్పత్రిలో సకల సదుపాయాలు ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక వైద్యుల కొరత ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం పెద్ద శాపంగా మారింది. అత్య వసర సర్జరీలు చేయాల్సి వస్తే చేతులెత్తేస్తున్నా రు. మౌలిక సదుపాయాల లేమి, సక్రమంగా పనిచేయ ని వెంటిలేటర్లు, నిరుపయోగంగా మారిన డయాగ్నోస్టిక్ పరికరాల కారణంగా రోగులకు సక్ర మంగా వైద్యసేవలందడం లేదు. ఈ ఆస్పత్రిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 50 పడకల క్రిటికల్ కేర్ నూతన ఆస్పత్రిని నిర్మించారు. సుమారు ఏడాదిగా ఇది నిరుపయోగంగా మారింది. కేజీహెచ్పై పెరిగిన భారం ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చిన చిన్నచిన్న కేసులను కూడా ఇక్కడి వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవడం ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. నెలలో ఇక్కడి నుంచి 170 కేసుల వరకూ కేజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు.అధిక సంఖ్యలో కేసులను రిఫర్ చేస్తుండడంతో కేజీహెచ్కు రోగుల తాకిడి ఎక్కువవుతోంది. దీంతో అక్కడ వైద్య సేవలందడంలో జాప్యం జరుగుతోంది. పేదలపై మోయలేని ఆర్థిక భారం అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తే సకాలంలో 108 అంబులెన్సులు దొరకక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దూరప్రాంతాల నుంచి కేజీహెచ్కి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుండటంతో వేలాది రూపాయ లు ఖర్చవుతున్నాయి. ఉచిత వైద్యం అందుతుందని భావించిన నిరుపేదలకు ఈ ప్రయాణ ఖర్చు లు మోయలేని భారంగా మారుతున్నాయి. ఆస్పత్రిలో సక్రమంగా రక్తపరీక్షలు నిర్వహించకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి, నగదు చెల్లించి పరీక్షలు చేయించుకోవలసి వస్తోంది. అందుబాటులో ఉండని వైద్యులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది వైద్యులు ఆరోగ్య సమస్యను పూర్తిగా వినకుండానే, పరిశీలించకుండానే వారికి తోచిన మందులు రాసి పంపిస్తున్నారని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్లకు రమ్మని చెబుతున్నారని వాపోతున్నారు. వైద్య విద్యార్థులతో ట్రీట్మెంట్ పట్టణ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను చదువుతున్న విద్యార్థులే రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారికి సరైన అవగాహన లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 15 రోజుల క్రితం ఒక వైద్య విద్యార్థి వేసిన ఇంజెక్షన్ వికటించింది. అక్కడే ఉన్న వైద్యుడు సకాలంలో స్పందించడంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు ఏరో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు
డాబాగార్డెన్స్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం నుంచి ‘ఏరో ఎక్స్ప్రెస్’ పేరిట ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏఎస్ఆర్–1, ఏఎస్ఆర్–2 పేరిట రెండు మార్గాల్లో బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ రెండు మార్గాల్లోనూ ప్రతి అరగంటకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని, బస్సులు ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నడుస్తాయని తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి అనుగుణంగా ఈ సర్వీసులను వినియోగించుకుని సౌకర్యవంతమైన ప్రయాణం పొందాలని అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఏఎస్ఆర్–1 రూట్ గాజువాక, ఎన్ఏడీ, గురుద్వార్, జూపార్క్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఏర్పాటు జంక్షన్ మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ బస్సు నడుస్తుంది. ప్రయాణ చార్జీలు: పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి రూ.400, ఎన్ఏడీ నుంచి రూ.350, గురుద్వార్ నుంచి రూ.300, జూపార్క్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఏర్పాటు జంక్షన్ నుంచి రూ.50. ఏఎస్ఆర్–2 రూట్ గాజువాక, సింధియా, విశాఖ రైల్వేస్టేషన్, ద్వారకా బస్టేషన్, సిరిపురం,సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్,ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ బస్సు నడుస్తుంది. ప్రయాణ చార్జీలు: పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి రూ.400, సింధియా నుంచి రూ.400, సిరిపురం నుంచి రూ.350, ఇస్కాన్ టెంపుల్ నుంచి రూ.300, ఐటీ హిల్స్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఏర్పాటు జంక్షన్ నుంచి రూ.50. -
ప్రైవేట్ ఆస్పత్రికి వెళితేనే జ్వరం తగ్గింది
జ్వరంతో బాధపడుతున్న నా కుమారుడు విఘ్నేష్ను జూలై 7న ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లాను. వైద్యులు రక్త పరీక్షలు రాసి, మందులు అందజేశారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేసిన రక్త పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ కాలేదు. సుమారు 15 రోజుల పాటు మందులు వాడినా జ్వరం తగ్గలేదు. 20 రోజుల తరువాత పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా టైఫాయిడ్ జ్వరం అని నిర్ధారణ అయింది. ప్రైవేట్ వైద్యులు ఇచ్చిన మందులు వాడడంతో బాబు ఆరోగ్యం కుదుటపడింది. – గొల్లవిల్లి శ్రీను, కొత్తూరు, అనకాపల్లి మండలం. -
ఉరి వేసుకుని పెయింటర్ ఆత్మహత్య
పీఎం పాలెం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు... విజయనగం జిల్లా మెంటాడ మండలానికి చెందిన గండి కామునాయుడు(41) బతుకు తెరువుకోసం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. క్రికెట్ స్టేడియం వెనుక తులసీనగర్ లే ఔట్లో భార్య వెంకటితో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబ పోషణకు పెయింటింగ్ పనులకు వెళుతుంటాడు. అతనికి ఓ కుమార్తె(18), ఓ కుమారుడు(16) ఉన్నారు. కామునాయుడుకు మద్యపానం వ్యసనంతో పాటు పలు ఆరోగ్య సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుని భార్య వెంకటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు
యలమంచిలి రూరల్: పట్టణంలో కొత్తపేట రామాలయం వద్ద ఆదివారం జరిగిన మొదటి జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలో పలు తైక్వాండో క్లబ్బుల నుంచి మొత్తం 108 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 38 మంది బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్టు జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి నగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వారిలో 25 మంది బాలురు, 13 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఈ నెల 21న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గోనున్నట్టు చెప్పారు. మరో 11 మంది బాలురు రజిత పతకాలు సాధించారు.అంతకుముందు తైక్వాండో పోటీలను ఏజీపీ రాజాన గోవిందరావు ప్రారంభించారు. విద్యార్థులు, యువకులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల దేహదారుఢ్యంతో పాటు,మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారపురెడ్డి వెంకటరావు,కార్యదర్శి శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడు ఎల్వీ రామకృష్ణ, న్యాయవాదులు రాయవరపు సుధాకర్,వేముశెట్టి కృష్ణ,పోలిశెట్టి వీర ప్రజానాయక్,కూనిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 38 మందికి బంగారు పతకాలు -
లేబర్ కోడ్స్తో కార్మికులకు తీవ్ర నష్టం
సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్మద్దిలపాలెం: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే కేంద్ర కార్మిక సంఘాలన్నీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్పై మద్దిలపాలెంలోని ఏచూరి భవన్లో రెండు రోజులపాటు జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమలుతో కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక హక్కులు కోల్పోతారని, సంఘం పెట్టుకునే హక్కును కఠినతరం చేశారని, యాజమాన్యంతో బేరసారాలాడే హక్కును కూడా కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. గతంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే సమ్మె సందర్భంగా 14 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరి కాగా, ఇప్పుడు అన్ని సంస్థలకూ ఇది వర్తింపజేశారని తెలిపారు. లేబర్ డిపార్ట్మెంట్లో కన్సిలియేషన్ నమోదైన దగ్గర్నుంచి సమ్మె చేయకూడదని, అలా చేస్తే యూనియన్ను రద్దు చేయడంతోపాటు నాయకులను జైలుకు పంపే అవకాశం కల్పించారని ఆరోపించారు. కంపెనీలు, పరిశ్రమలు మూసివేతకు గతంలో అవసరమైన ప్రభుత్వ ముందస్తు అనుమతి ఇప్పుడు అవసరం లేదని ఈ చట్టాల్లో పేర్కొన్నారని, ఈ చట్టాల పరిధిలోకి కార్మికులందరూ వస్తారని ప్రభుత్వం చేస్తున్న వాదన తప్పుడుదని విమర్శించారు. ఈ లేబర్ కోడ్స్ యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలు కార్మికులను దోపిడీ చేసేందుకే ఉపయోగపడతాయి తప్ప, కార్మికుల జీవితాల్లో మెరుగుదల తీసుకురావని, వీటి రద్దు కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు యు.రామస్వామి అధ్యక్షత వహించిన ఈ వర్క్షాప్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.ఏం.శ్రీనివాస్, ఆర్కేఎస్వీ కుమార్తోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్ అథారిటీ, బీహెచ్ఈఎల్, రక్షణ రంగం, హిందుస్థాన్ షిప్యార్డ్, ఎన్టీపీసీ, రైల్వే తదితర రంగాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ రాజారావుకు వచ్చిన ముందుస్తు సమాచారం మేరకు సిబ్బందితో గబ్బాడ పంచాయతీ శివారు రిట్టవానిపాలెం వద్ద మాటువేశారు. ఇద్దరు వ్యక్తులు కాలేజీ బ్యాగ్తో బైక్పై వస్తూ, పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని, 7.48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా గోకవరం మండలం గంగంపాలెంకు చెందిన నక్కరాజు లోవరాజు(30), అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల సూర్యప్రకాష్(24)ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
సక్రమంగా వైద్య సేవలందడం లేదు
ఎన్టీఆర్ ఆస్పత్రి పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’లా మారింది. రోగులకు సరైన వైద్యం అందడం లేదు. కొన్ని విభాగాల్లో సిబ్బంది చేతివాటం ఎక్కువగా పెరిగిపోయింది. కొత్త మందులు రావడం లేదు. పాత మందులతో వ్యాధులు తగ్గడం లేదు. ఆస్పత్రికి వస్తున్న సీఎస్ఆర్ నిధులు ఎక్కడికి వెళ్లిపోతున్నాయో అర్థం కావడం లేదు. కలెక్టర్ స్థాయి అధికారులు దృష్టి సారించకపోతే ఆస్పత్రి గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు. – కె.లక్ష్మణ్, ఎన్టీఆర్ ఆస్పత్రి కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ). జిల్లా అధ్యక్షుడు. -
మతిస్థిమితం లేని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత
మతిస్థిమితం లేని మహిళను అప్పగిస్తున్న రూరల్ ఎస్ఐ రాజారావు నర్సీపట్నం: మతిస్థిమితం లేక గబ్బాడ శివారులో తిరుగుతున్న 27 ఏళ్ల మహిళకు రూరల్ ఎస్ఐ రాజారావు చికిత్స అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. ఓ మహిళ అనారోగ్యంతో, మతిస్థిమితం లేక సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్ఐ రాజారావు, సిబ్బందితో వెళ్లి ఆమెను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి, పేరు, చిరునామా వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. తన పేరు భార్గవి అని, స్వస్థలం కదిరి సత్యసాయి జిల్లా అని మాత్రమే ఆమె చెప్పింది. ఆమెను ఏరియా ఆస్పుత్రిలో చేర్పించారు. అతి కష్టం మీద కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులు చింతలపల్లి లక్ష్మి, నారాయణస్వామికి ఆమెను అప్పగించారు. -
ఘనంగా ముగిసిన గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం
మునగపాక: గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం శనివారం రాత్రితో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా నందీశ్వర ప్రాంగణం తులసీ కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువజన మందిరం ద్వారా ఒకవైపు క్రీడా పోటీలు, మరోవైపు నాటక రంగ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలతోపాటు క్రీడలు, నాటక పరిషత్లు నిర్వహించి రాష్ట్రంలో మరింత గుర్తింపువచ్చేలా కృషి చేయాలన్నారు. ఐ కిడ్స్ అకాడమి వారిచే కూచిపూడి, భరతనాట్యం, బాల రామాయణం వంటి ప్రదర్శనలు నిర్వహించారు. అయిదు రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మందిర అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్రీడా విభాగం మండల కన్వీనర్ పెంటకోట విజయ్, పీఏసీఎస్ అధ్యక్షుడు విల్లూరి నరసింగరావు, మాజీ అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, విద్యావేత్త పెంటకోట వెంకటరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మందిర ఉపాధ్యక్షులు మళ్ల సంజీవరావు, మళ్ల రామజగన్నాథం, ఆడారి లక్ష్మణరావు, మందిర మాజీ అధ్యక్షులు ఆడారి గంగమహేష్, ఆడారి సూర్యచంద్రరావు, ఆడారి రమణబాబు తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెలో జూడాలు, రోగుల అవస్థలు
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్లో జూనియర్ వైద్యుల నిరవధిక సమ్మెతో రోగులకు వైద్య సేవలు అందక అవస్థలు తప్పడం లేదు. మరోవైపు శనివారం ఆగస్టు 15 కావడంతో రెగ్యులర్ వైద్యులకు అధికారిక సెలవు ఉండటం, ఆదివారం కూడా సెలవు కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వైద్యులు అందుబాటులో లేని సమయంలో మూడు షిఫ్టుల్లో జూనియర్ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులు నిర్వహిస్తుంటారు. అయితే జూనియర్ వైద్యులు సమ్మెలో ఉండటంతో ఆ సేవలు నిలిచిపోయాయి. దీంతో కొన్ని చోట్ల నర్సులే అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యుల కోసం రోగులు, వారి సహాయకులు ఎదురుచూడాల్సి వస్తోంది. జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఓపీ రోగులపైనా పడింది. కేజీహెచ్కు శనివారం సాధారణ రోజులతో పోలిస్తే కొత్తగా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర పరిస్థితి లేని కొందరు రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు రావడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. కేజీహెచ్లోని పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
11 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వందేమాతరం, దేశ్రంగీలా, తల్లిభారతి, కోలాటం, వేదభూమి ఇది, పిరమిడ్స్, థింసా, పాడవోయి భారతీయుడా, ఇదే మన భారతం, యోగా వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తానాం పాఠశాలకు ప్రథమ స్థానం పరవాడ మండలం తానాం ఎంజీపీఎపీ బీసీఆర్ స్కూల్ విద్యార్థులు యోగా ప్రదర్శనలో మొదటి స్థానం సాధించగా, నక్కపల్లి మినీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ‘పాడవోయి భారతీయుడా’కు ద్వితీయ స్థానం లభించింది. కశింకోట మండలం ఏసీడీఎస్ విద్యార్థులు ప్రదర్శించిన ‘వందేమాతరం’కు మూడో స్థానం లభించింది.కోలాటం, థింసా ప్రదర్శించిన సరుగుడు గ్రామం పురుషులు, మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపి, బహుమతులను అందజేశారు. -
ఘనంగా కలశం ఊరేగింపు
నక్కపల్లి: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి సప్తతి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా శనివారం శంషాబాద్ ఆశ్రమం నుంచి వచ్చిన కోదండరాముని హృదయ కలశ ఊరేగింపు ఉపమాక కల్కి వేంకటేశ్వరస్వామి ఆల య మాడవీధుల్లో ఘనంగా జరిగింది. వికాస తరంగిణి సభ్యులు, భక్తుల శ్రీరామనామస్మరణ మధ్య గోముఖ ముద్రతో బియ్యాన్ని సమర్పించారు. ఈ కలశాన్ని శంషాబాద్లోగల ఆశ్రమానికి పంపించ డం జరుగుతుందని ఉపమాక ప్రధానార్చకులు వరప్రసాద్ తెలిపారు. దీపావళి నాడు తిరునక్షత్ర మహోత్సవంలో ఈ కలశంతో 108 దివ్యదేశాలలో ఉన్న మూర్తులకు, కోదండరామునికి విశేష అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. -
రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు
పోలీసులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్ నాతవరం: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం నుంచి తాండవ వరకు రూ.3.50 కోట్లతో ఇటీవల అఽర్అండ్బీ శాఖ తారురోడ్డు నిర్మించింది. పంట పొల్లాల్లోకి వాహనాలు వెళ్లడానికి, తాండవ నీరు తరలించేందుకు రోడ్డు మార్జిన్ చమ్మచింత పంచాయతీ పరిధిలో సింహాలు రైస్మిల్లు వద్ద ఇదే గ్రామానికి చెందిన దొరబాబు పొక్లెయిన్తో తవ్వేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పొక్లెయిన్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. తారురోడ్డుపై ఐరన్ చక్రాలతో దమ్ము చేసే ట్రాక్టర్లు తిరిగితే కేసు పెడతామన్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా దమ్ము చేసే ట్రాక్టర్ల యజమానులకు నోటీసులు పంపినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఎందరో మహనీయుల త్యాగఫలం
అనకాపల్లి: మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 80 ఏళ్లు పూర్తయింది. ఎందరో సమర వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భగత్సింగ్, సర్ధార్ వల్లబాయ్పటేల్ వంటి అనేక మంది మహనీయులు పోరాటాలు చేయడం వల్ల మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో సాకారమైందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉగ్గిన అప్పారావు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షులు కాండ్రేగుల హైమావతి, పద్మకుమారి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులు మర్రిపల్లి శోభ, పద్మ, లక్ష్మి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కుండల రామకృష్ణ, కడిమిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం -
మహనీయుల స్ఫూర్తి.. అభివృద్ధి దీప్తి
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి అనిత ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనఅనకాపల్లి/తుమ్మపాల : ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అనకాపల్లి కేవలం జిల్లా కాదని... పోరాటాల గడ్డని, అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం జిల్లాకు ఎంతో పేరు తెచ్చాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి వందన సమర్పణ చేశారు. పరేడ్ కమాండర్ పి.హరినాథ్ ఆధ్వర్యంలో పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా, పోలీస్ బ్యాండ్ బృందం జాతీయగీతాన్ని ఆలపించింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న స్వేచ్ఛా యుత, సమృద్ధి, శాంతియుత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. స్వాతంత్య్రం మనకు స్వేచ్ఛను ఇచ్చిందని, స్వర్ణ ఆంధ్ర 2047 మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చిందని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. రైతుకు భరోసా, మహిళకు సాధికారత, అవ్వాతాతలకు పింఛన్లు, పేద కుటుంబాలకు సంక్షేమం, యువతకు ఉపాధి, పరిశ్రమలకు ప్రోత్సాహం, పర్యాటక రంగం అభివృద్ధి, గ్రామాలకు మౌలిక వసతులు.. ఇవే అభివృద్ధికి నిజమైన కొలమానాలన్నారు. రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎల్ నినో మిటిగేషన్ ప్లాన్లో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించిన సూచనలు, సలహాలు అందిస్తున్నట్టు చెప్పారు. రూ.9.82 కోట్లతో 3,850 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆయిల్పామ్ తోటల పునరుద్ధరణ, సస్యరక్షణకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్యాక్హౌస్లు, శీతల గిడ్డంగుల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్లతో పంటకోత అనంతరం నష్టాల తగ్గింపు, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ● ఈ ఏడాది 7.52 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 38 వేల మెట్రిక్ టన్నుల మాంసం, 125 కోట్ల గుడ్ల ఉత్పత్తి ద్వారా రూ.11,722 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎల్నినో ప్రభావం ఎదుర్కోడానికి 32 ఎంటీల పశుగ్రాసం విత్తనాలు 75 శాతం రాయితీతో సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ● మోటార్ బోట్లు ఉన్న మత్స్యకారులకు డీజిల్పై లీటరుకు రూ.9 సబ్సిడీగా రూ.53.05 లక్షల చెల్లింపు. పీఎంఎంఎస్వై కింద 129 మందికి బోటు ఇంజిన్లు, 3 బయోఫ్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్, 3 చేపల రవాణా వాహనాలు, 474 బోట్లకు భద్రతా పరికరాలు, 100 మందికి జీపీఎస్, 200 మందికి సోలార్ లైట్లు పంపిణీ. ● జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2026–27లో 41,878 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రూ.610.96 కోట్లు, 21,043 మందికి సీ్త్రనిధి ద్వారా రూ.183.81 కోట్లు పంపిణీ. ● జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా వీబీ–జి–రామ్–జీ పథకం ద్వారా 2.45 లక్షల మందికి 90.80 లక్షల పనిదినాలు కల్పించి, రూ.256.81 కోట్ల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ. ● స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ ద్వారా రూ.35.45 కోట్ల ఇంటి పన్నులు వసూలు, 24 స్వచ్ఛరథాల ద్వారా 601 టన్నులకు పైగా పొడి చెత్త సేకరణ. శృంగవరం గ్రామ పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుతో పాటు రూ. కోటి గ్రాంటు. ● జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో 116 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్, 171 ఖాళీ పోస్టుల భర్తీ. ● నవచేతన్ యాప్ ద్వారా 1,567 కేంద్రాల్లో ఏఐ ఆధారిత బాల్య వికాస స్క్రీనింగ్ ప్రారంభం. ● సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 533 మంది ఎస్టీ విద్యార్థులకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కింద రూ.1.06 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 3,270 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.3.85 కోట్ల స్కాలర్షిప్లు. ● ఖనిజ ప్రభావిత ప్రాంతాల్లో రూ.32.44 కోట్ల తో 245 పనులకు అనుమతులు మంజూరు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో పల్లెపండగ 2.0 కింద రూ.101.17 కోట్లతో 197.20 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.5.11 కోట్లతో 10.33 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం. ● అనకాపల్లి–అచ్యుతాపురం నాలుగు లైన్ల రహ దారి విస్తరణ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యశాఖలో జల్జీవన్ మిషన్ కింద 1,226 పనులు పూర్తి, 3.04 లక్షల గృహాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేసినట్టు ఆమె చెప్పారు. 560 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 560 మంది అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హోంమంత్రి, కలెక్టర్, ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతబాబు, మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రెండు శకటాలకుసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. 16 శకటాలను ప్రదర్శించగా ప్రథమ బహుమతిని రెండు శకటాలు గెలుచుకున్నాయి. నూతన పెట్టుబడులకు పారిశ్రామిక గమ్యస్థానం (జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ అనకాపల్లి), బాల్య వివాహాల నిర్మూలన (పీడీ డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్) శకటాలు ప్రథమ బహుమతి సొంతం చేసుకున్నాయి. స్వయం ఏపీ (పీడీ డీఆర్డీఏ అండ్ పీడీ ఎంపీఎంఏ), సురక్షిత కార్మికులు–సుస్థిర పారిశ్రామిక ప్రగతి (డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్) శకటాలు ద్వితీయ బహుమతి సాధించాయి. జిల్లా అగ్రికల్చర ల్ ఆఫీసర్ (అనకాపల్లి), డీపీఎం ఏపీ న్యాచురల్ ఫార్మింగ్ కార్పొరేషన్, జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ (ఎల్ నినో–ఆల్టర్నేటివ్ క్రాప్స్ – మాతృక పంటలు) శకటాలు మూడో బహుమతి పొందాయి.జాతీయ జెండాకు వందనం చేస్తున్న హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హామువ్వన్నెల జెండా మురిసింది... ఆకాశం నిండా మెరిసింది. ఆబాలగోపాలం మా తుజే సలామ్ అంటూ ముక్తకంఠంతో నినదించింది. వందేమాతర గీతం ప్రతిధ్వనించింది. జనగణమన అంటూ జనులందరూ గొంతెత్తి పాడగా జాతీయ పతాకం పరవశించిపోయింది. జిల్లాలో స్వాతంత్య్ర సంబరాలు నింగినంటాయి. జిల్లా కేంద్రం అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాళ్లు, శకటాలు అలరించాయి. -
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
మహారాణిపేట: జిల్లాకు కొత్తగా వచ్చిన రెండు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీభరత్ శనివారం పోలీస్ బ్యారెక్స్ వద్ద ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గాజువాక నుంచి, విమానాశ్రయం నుంచి గంటకో బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ.300, గాజువాక నుంచి రూ.400 చార్జీగా నిర్ణయించారు. అనంతరం మంత్రి, ఎంపీతోపాటు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి తదితరులు బస్సులో ఆర్కే బీచ్ వరకు ప్రయాణించారు. -
తల్లిని గాయపరిచిన కుమార్తె
కలెక్టరేట్లో ఘనంగా జెండా పండగ మాడుగుల రూరల్: కన్న కూతురే తల్లిని సన్నికాలురాయితో తలమీద, ఛాతీభాగంలో కొట్టి గాయపరిచిన సంఘటన గాదిరాయి లో జరిగింది. స్థానిక ఎస్ఐ జి.నారాయణరా వు శనివారం అందించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలో గాదిరాయి గ్రామానికి చెందిన పెచ్చేట్టి చిలుకమ్మ అనే మహిహిళ తన కుమారై సిరిసొల్ల దేవి, అల్లుడు వెంకటరమణతో కలిసి నివాసం ఉంటోంది. చిలుకమ్మ ఎడమకాలుకు రెండు సంవత్సరాలు క్రితం ఆపరే షన్ జరిగింది. విశాఖపట్నంలో డాక్టర్ వద్దకు వెళ్లేందుకు గతంలో డాక్టరు రాసిన మందుల చీటి, ట్రిట్మెంట్కు సంబంధించిన ఫైల్ ఇవ్వాలని కుమార్తె దేవిని శుక్రవారం రాత్రి కోరింది. ఆమె ఇవ్వకపోగా, తీవ్రంగా దూషించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో చిలుకమమ్మ నిద్రిస్తుండగా తన ఇంట్లో ఉన్న సన్నికాలురాయితో తలపైన, ఛాతీభాగంలో బలంగా దేవి కొట్టి గాయపరిచింది. దీంతో చిలకమ్మకు తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ నారాయణరావు తెలిపారు. తుమ్మపాల: కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ విజయ కృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి వందనం సమర్పించారు. కలెక్టరేట్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, సీపీవో రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో... అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్పీ సతీమణి, 3వ అదనపు సివిల్ న్యాయమూర్తి, 13వ అదనపు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ నిఖితా సెంగర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు లభించిన స్వేచ్ఛ ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, డీఎస్పీలు ఇ.శ్రీనివాసరావు, కె.రవికుమార్, జి.ఆర్.ఆర్.మోహన్, బి.మోహన్రావు, సీఐలు టి.లక్ష్మి, శ్రీనివాసరావు, ఎం.వెంకటనారాయణ, జి.ప్రేమ్కుమార్, అశోక్కుమార్, రమేష్, రమణయ్య రామకృష్ణారావు, మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు. -
100 ఎంఎంటీ లక్ష్యంగా విశాఖ పోర్ట్ దూకుడు
గౌరవ వందనం స్వీకరిస్తున్న వీఎపీఏ చైర్మన్ జేఎస్ బింద్రా సీతంపేట(విశాఖ): పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు పోర్ట్ గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో వైభవంగా జరిగాయి. చైర్మన్ జె.ఎస్. బింద్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సీఐఎస్ఎఫ్ పరేడ్ను పరిశీలించి సెల్యూట్ స్వీకరించారు. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావిస్తూ.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పోర్ట్ చరిత్రలోనే అత్యధికంగా 91.17 ఎంఎంటీల కార్గోను నిర్వహించి 10.34 శాతం వృద్ధి సాధించినట్టు బింద్రా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్,జూలైలో 32.10 ఎంఎంటీల నిర్వహణతో 13 శాతం వృద్ధి నమోదైంది. జూన్ 5న 292 మీటర్ల కేప్సైజ్ నౌక బెర్తింగ్, 24 గంటల్లో 24 నౌకల రాకపోకలు, ఒకే రోజు 5.5 లక్షల టన్నుల కార్గో నిర్వహణ వంటి మైలురాళ్లను ఆయన ప్రస్తావించారు. దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు 50 శాతం ఈ పోర్ట్ ద్వారానే జరుగుతుండగా, 4 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందుతోందని చెప్పారు. రూ.178 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది 100 ఎంఎంటీల మైలురాయిని అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన ఉద్యోగులు, వాటాదారులకు అవార్డులు అందజేశారు. -
భర్తను పీక కోసి చంపేసిన భార్య
సాక్షి, చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేద్కర్ కాలానీలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్న ఇందిర అనే మహిళ శనివారం తన భర్త వెంకట్రావును కిరాతకంగా హతమార్చింది. భర్తను పీక కోసి చంపేసింది. వివాహేతర సంబంధం కారణంగా ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఇందిరను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొంత కాలంగా వెంకట్రావు, ఇందిర దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరో మహిళతో వెంకట్రావు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విబేధాలు మొదలయ్యాయి. తాజాగా ఈ రోజు కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఇందిర కత్తి తీసుకుని వెంకట్రావును హతమార్చింది. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. చదవండి: పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా? -
102 కిలోల పసుపుకొమ్ములతో వాసవీ కన్యకాపరమేశ్వరికి అర్చన
కె.కోటపాడు: శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి 102 కిలోల పసుపు కొమ్ములతో అర్చన చేశారు. మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు. మునగపాకలో సాక్షుల విచారణ మునగపాక: మండల కేంద్రం మునగపాకలో జరిగిన కొట్లాట కేసులో సాక్షులను పరవాడ డీఎస్పీ మోహనరావు శుక్రవారం విచారించారు. గ్రామంలో పర్యటించి, గొడవ జరిగిన సమయంలో బైపాస్ రోడ్డులో ఉన్న కొంతమంది నుంచి, మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించారు. ఆయన వెంట ఎస్ఐ ప్రసాదరావు ఉన్నారు. -
‘ఎస్పీ సంపర్క్’కు 10 వినతులు
అనకాపల్లి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సంపర్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీ సీఐ ఎస్.బాలసూర్యారావు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సంబంధించిన కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, సెలవులు, పోస్టింగ్ల అంశాలపై మొత్తం 10 మంది సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేసినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9346912011 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ–2 సీఐ టి.లక్ష్మి, కార్యాలయ సూపరింటెండెంట్ దేవరాజు, తదితరులు పాల్గొన్నారు. -
చెరువు గర్భానికి డీ పట్టా మంజూరుపై ఆగ్రహం
నాతవరం: చెరువు గర్భానికి సంబంధించి డీపట్టా మంజూరు చేయడంపై వి.బి.అగ్రహారం గ్రామస్తులు ఆగ్రహించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వి.బి.అగ్రహారంలో సర్వే నంబరు 21లో నాలుగెకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో 70 సెంట్లు మినహాయించి మిగతా భూమికి రెవెన్యూ అధికారులు ఓ వ్యక్తికి డీ ఫారం పట్టా ఇచ్చారు. ప్రస్తుతం చెరువు గర్భంలో వ్యవసాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. సదరు వ్యక్తి డీపట్టా చూపించి ఎదురు దాడికి దిగాడు. రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి చెరువు గర్భంలో పట్టా ఇవ్వడంపై ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో రైతులతోపాటు మహిళలు సైతం శుక్రవారం నాతవరం తహసీల్దారు చందనరేఖకు ఫిర్యాదు చేశారు. డీపట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెరువు ఆయకట్టు కింద ఏటా ఖరీఫ్ సీజన్లో 150 ఎకరాల్లో వరినాట్లు వేసేవారమని, 1974లో తాండవ రిజర్వాయరు ఏర్పాటుతో చెరువుపై ఆధారపడటం తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో చెరువుపై కన్నేసి ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆగ్రహించారు. దీనిపై తహసీల్దారు చందనరేఖ మాట్లాడుతూ డీపట్టా రద్దు చేసేందుకు కలెక్టరుకు నివేదిస్తానన్నారు. తహసీల్దారుకు వి.బి.అగ్రహారం గ్రామస్తుల ఫిర్యాదు -
పెట్టుబడుల పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అనకాపల్లి: ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. స్టాక్ మార్కెట్, క్రిప్టో ట్రేడింగ్ పేరుతో తక్కువ సమయంలో అధిక లాభాలు, రోజువారీ గ్యారెంటీ ఆదాయం ఇస్తామని నమ్మబలుకుతూ మోసగాళ్లు బాధితులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లకు బదులుగా అనుమానం రాకుండా ఉండేందుకు ‘బోన్చార్జ్’వంటి ప్రత్యేక మెసేజింగ్ యాప్ల ద్వారా మాత్రమే సంప్రదిస్తారని వెల్లడించారు. స్థానికంగా సెమినార్లు, రిక్రూట్మెంట్ మీటింగ్లు నిర్వహిస్తూ, రెఫరల్ బోనస్ల ఆశ చూపించి స్నేహితులు, బంధువుల ద్వారా నెట్వర్క్ను విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ తరహా మోసాలపై సమీప పోలీస్స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. బాధితులు తక్షణమే 1930 ఉచిత హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. -
మురిసిన మువ్వన్నెల జెండా
కుసుర్లపూడిలో 100 మీటర్ల జెండాతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కె.కోటపాడు/రోలుగుంట/మునగపాక/బుచ్చెయ్యపేట: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కె.కోటపాడు మండలం ఏ కోడూరు హైస్కూలు విద్యార్థులు 150 మీటర్ల జాతీయ జెండాతో, రోలుగుంట మండలం కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో మునగపాకలో బీజేపీ నాయకులు, విద్యార్థులు 200 మీటర్ల జెండాను ప్రదర్శించారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో 200 మీటర్ల హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. -
అగ్గిపిడుగు.. అల్లూరి
● విప్లవాగ్ని రగిలించిన సమరయోధుడు గొలుగొండ/పద్మనాభం: భరతమాత ముద్దు బిడ్డ...విప్లవాగ్నిని రగిలించిన మన్యం వీరుడు... ఆంగ్లేయులపై స్వాతంత్య్ర సమరం సాగించిన ధీరోదాత్తుడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ అగ్గిపిడుగు.. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన పుట్టిన పాండ్రంగి.. మన్యంలో మొదటిగా అడుగుపెట్టిన గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నేడుఆవిప్లవ చరిత్రకుసజీవసాక్ష్యంగా నిలుస్తున్నాయి. పాండ్రంగిలో పుట్టి.. మన్యానికి చేరి అల్లూరి అసలు పేరు శ్రీరామరాజు. 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ముద్దుగా ‘చిట్టిబాబు’ అని పిలిచేవారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత, యోగం, వేదాంతంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. విలువిద్య, గుర్రపు స్వారీ, ఆయుర్వేద వైద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. దేశ పరిస్థితులను ఆకళింపు చేసుకున్న తర్వాత స్వాతంత్య్రోద్యమం వైపు అడుగులు వేశారు. 20 సంవత్సరాల వయస్సులో 1917న గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామానికి వచ్చారు. మన్యంలో గిరిజనులు బ్రిటిష్ అధికారుల దోపిడీ, అణచివేతకు గురవుతున్న దృశ్యాలు ఆయనను కదిలించాయి. గిరిజనుల విముక్తి కోసం వారినే సమీకరించి సాయుధ పోరాటానికి సిద్ధం చేశారు. గంటం దొర, మల్లు దొర తదితరులు ఆయనకు అండగా నిలిచారు. పోలీస్ స్టేషన్లపై మెరుపుదాడులు 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్స్టేషన్పై దాడితో మన్యం పోరాటం ఒక్కసారిగా ఉధృతమైంది. మరుసటి రోజు కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి, 1922 సెప్టెంబర్ 2న జి.మాడుగుల పోలీస్స్టేషన్లపైనా దాడులు జరిగాయి. ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. సెప్టెంబర్ 24న దామణాపల్లి ఘాట్రోడ్డులో బ్రిటీష్ ఽప్రధాన అధికారి అయిన హైటర్ను హతమార్చి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరారు. అల్లూరిని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారీ సైనిక బలగాలను రంగంలోకి దించింది. అస్సాం రైఫిల్స్ను దించి అడవులను జల్లెడ పట్టినా.. అల్లూరి గెరిల్లా వ్యూహాల ముందు బ్రిటిష్ దళాలు చాలాకాలం తలవంచక తప్పలేదు. కీలక అధికారి అయిన స్కాట్ కవర్టు, హైటర్ హతమార్చడం, కీలక పోలీస్ స్టేషన్లును కొల్లగొట్టడంతో అల్లూరి సీతారామరాజును హతమార్చాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణియించింది. 1924 మే 7.. విప్లవతార అస్తమయం దాదాపు రెండేళ్లపాటు సాగిన పోరాటం అనంతరం 1924 మే 7న మంప సమీపంలోని మాడేరు నది వద్ద అల్లూరి పట్టుబడ్డారు. బ్రిటిష్ సైనికులు ఆయనను కాల్చిచంపారు. అల్లూరి సీతారామరాజు కృష్ణదేవిపేటకు చెందిన చిటికెల భాస్కరనాయుడుతో స్నేహంగా ఉండేవారు. దీంతో ఆయన వద్దకు మృతదేహాన్ని తీసుకువచ్చి ... మృతదేహం అల్లూరి సీతారామరాజుదేనని నిర్ధారణ చేసుకుని మృతిని అధికారకంగా ప్రకటించారు.అల్లూరి భౌతికంగా దూరమైనా.. ఆయన రగిలించిన స్వాతంత్య్ర స్ఫూర్తి మాత్రం ఆరిపోలేదు. కృష్ణదేవిపేటలోనే సీతారామరాజు మృతదేహాన్ని ఖననం చేశారు. అక్కడే అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేశారు. -
దక్కని ‘నేతన్న సేవ’పై నిరసన
పాయకరావుపేట: నేతన్న సేవ పథకం కింద ఆర్థిక సాయం అందకపోవడంతో పట్టణంలోని పలువురు చేనేత కార్మికులు స్థానిక చేనేత సహకార సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో 113 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం సాయం అందాల్సి ఉంది. వీరిలో 71 మందికి మాత్రమే సాయం అందింది. మిగతా 42 మంది చేనేత కార్మికులు చేనేత సహకార సంఘం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు జగతా శ్రీనివాస్, తదితరులు మద్దతు తెలిపారు. సమస్యపై సంఘం మేనేజరు గోరు నాగేశ్వరరావుతో చర్చించారు. అలాగే చేనేత జౌళీ శాఖ ఏడీతో ఫోన్లో మాట్లాడారు. సాంకేతిక సమస్య కారణంగా కొందరి నేతన్న సేవ పథకం సాయం ఇంకా అందలేదని, అర్హులందరికీ సాయం అందుతుందని ఏడీ చెప్పినట్లు నాయకులు తెలిపారు. దీంతో చేనేత కార్మికులు నిరసన విరమించారు. -
ఎట్ హోమ్కు రాంబాబు మాస్టారు
నాతవరం: మండలంలోని చమ్మచింతలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అప్పన రాంబాబుకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో నిర్వహించే ఎట్ హోమ్ (తేనేటి విందు)కు ఆహ్వానం అందింది. 2007 నుంచి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాంబాబు 2014లో వృక్ష మిత్ర సమితి ఏర్పాటు చేశారు. నాటి నుంచి తన జీతంలో కొంత మొత్తంతో మొక్కలు నాటడం ప్రారంభించారు. నర్సీపట్నం డివిజన్లో ఇంతవరకు 2 లక్షలు మొక్కలు నాటారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవలకుగాను కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా శాఖ అటవీ శాఖాధికారులతో పురస్కారాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం రావడంతో డీఈవో, డిప్యూటీ డీఈవో, నాతవరం ఎంఈవోలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కోటి మొక్కలు నాడటమే తన జీవిత ఆఽశయమన్నారు. -
చెరువుల బదలాయింపును నిరసిస్తూ తీర్మానం
నక్కపల్లి: కాగిత రెవెన్యూ పరిధిలో చెరువులు, గెడ్డలను మిట్టల్ స్టీల్ ప్లాంట్కు బదలాయించడం సమంజసం కాదని గ్రామస్తులు, రైతులు ముక్తకంఠంతో ఖండించారు. గ్రామ పరిధిలో 17 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులు, గెడ్డలను స్టీల్ ప్లాంట్కు అప్పగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి, చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోందని పేర్కొన్నారు. సాగునీటి వనరులను పరిశ్రమలకు కేటాయించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అనంతరం తీర్మానం కాపీని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
‘రిజర్వాయర్ ఆక్రమణపై కలెక్టర్ విచారణ చేయాలి’
రావికమతం: కల్యాణపులోవ రిజర్వాయర్ పీటీఎల్ ప్రాంతంలో భూ ఆక్రమణపై విచారణ పారదర్శకంగా ఉండాలని ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ కల్యాణ్, గిరిజనులు డిమాండ్ చేశారు. త్రిసభ్య కమిటీకి బదులుగా తహసీల్దార్, మండల సర్వేయర్, వీఆర్వో హాజరై ప్రజా సంఘాలకు సమాచారం ఇవ్వకుండా స్థానికులను దగ్గరకు రానివ్వకుండా విచారణ చేయడంపై శుక్రవారం వీరు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పారదర్శకంగా విచారణ చేపట్టకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. రిజర్వాయర్ను రక్షించుకునే బాధ్యత 14 గ్రామాల రైతులకు ఉందన్నారు. కలెక్టర్ వచ్చి పారదర్శకంగా విచారణ చేయాలని ఆదివాసీ నాయకులు కొత్తెం అప్పారావు, తుర్రే రవి తదితరులు కోరారు. -
త్యాగధనుడు అమరయ్యశెట్టి
మాడుగుల రూరల్: మాడుగుల గడ్డపై పుట్టిన మహనీయుడు... దేశ స్వాతంత్య్రం కోసం విద్యను, వ్యక్తిగత భవిష్యత్తును, చివరకు తన ఆస్తులను సైతం త్యాగం చేసిన త్యాగధనుడు...పుట్టా అమరయ్యశెట్టి. జాతీయోద్యమం వైపు అడుగులు : మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. అదే సమయంలో విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్. కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అమరయ్య దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1930లో జరిగిన చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బ్రిటీష్ ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయకుండా, పోలీసుల నిఘాను తప్పించుకుంటూ రహస్యంగా జాతీయోద్యమ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే బ్రిటీష్ పాలకుల నుంచి ఎక్కువ కాలం తప్పించుకోలేకపోయారు. చివరకు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బరంపురం, రాయవేలూరు జైళ్లలో సుమారు రెండేళ్లపాటు ఆయన జైలు జీవితం గడిపారు. అమరయ్య ఇల్లే ఉద్యమ కేంద్రం : పుట్టా అమరయ్యశెట్టి దేశభక్తికి మాడుగులలోని ఆయన ఇల్లు ఒక చారిత్రాత్మక సాక్ష్యం. ఆయన జైలులో ఉన్న సమయంలో కూడా మాడుగుల ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమం బలహీనపడకూడదని భావించారు. స్థానిక ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కొనసాగించేందుకు తన నివాసాన్ని ఉద్యమ కార్యకలాపాలకు కేంద్రంగా అందించారు. ఈ క్రమంలో అప్పటి ప్రముఖ జాతీయ నాయకులు, భవిష్యత్తులో భారత రాష్ట్రపతిగా సేవలందించిన వరాహగిరి వెంకటగిరి (వి.వి.గిరి) మాడుగులకు వచ్చారు. అమరయ్య నివాసంలో సుమారు ఆరు నెలలపాటు ఉండి స్థానిక ప్రజల్లో స్వాతంత్య్రోద్యమంపై అవగాహన కల్పిస్తూ చైత న్యం నింపారు. అమరయ్యశెట్టి పేద రైతుల కోసం భూములు త్యాగం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మాడుగుల ప్రాంత అభివృద్ధికి విశేషంగా కషి చేశారు. -
రెజ్లింగ్ పోటీల్లో అవంతి విద్యార్థుల ప్రతిభ
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి 6వ రెజ్లింగ్ పోటీల్లో తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. అనకాపల్లిలోని వి.వి.రమణ రైతుభారతి కల్యాణ మండపంలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న ఏడుగురు అవంతి విద్యార్థులు సీనియర్ యూత్ విభాగంలో 5 బంగారు, 2 వెండి పతకాలు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ మోహనరావు శుక్రవారం తెలిపారు. స్టేట్ చాంపియన్ షిప్లో కూడా తృతీయ స్థానం సాధించారన్నారు. వీరితోపాటు ఇటీవల కబడ్డీ, బాక్సింగ్, ఖోఖో, యోగా, బాడ్మింటన్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికై న 32 మంది విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్లు పాల్గొన్నారు. -
సత్సంగంతో ఆధ్యాత్మిక చైతన్యం
తుమ్మపాల: సత్సంగం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు, మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, బాధ్యతలు పెరుగుతాయని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.డి.నాయుడు అన్నారు. తుమ్మపాలలోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సత్సంగ వర్గ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వీహెచ్పీ ఆవిర్భావ లక్ష్యాలు, హిందూ ధర్మ పరిరక్షణలో సంస్థ చేస్తున్న సేవలు, హిందూ సమాజ సంఘటన అవసరం గురించి వివరించారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో సత్సంగాల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పీలా హేమ జగదీష్ నాయుడు, జిల్లా కోశాధికారి గోకవరపు రమేష్, నగర అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, సత్సంగ నిర్వాహకులు ఐ.వి.కూర్మనాథం, దేవస్థాన కమిటీ సభ్యులు మార్టూరు అజయ్, నడిపల్లి బోసుబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆస్తులపై ప్రభుత్వానికేం అధికారం ఉంది ?
ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రైతుల షేర్ క్యాపిటల్, ఫ్యాక్టరీ లాభాలతో ఏర్పడిన ఈ ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించడానికి అసలు ఏం అధికారం ఉంది.? రైతుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలి. అన్ని షుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సుమారు రూ.100–120 కోట్లకు మించదు, రైతుల ప్రయోజనం కోసం ఆ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయాలి. ఏటికొప్పాక ఫ్యాక్టరీ గతంలో లాభాలతో నడిచింది, చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో నష్టాల్లోకి వెళ్లింది. వైఎస్సార్ హయాంలో రైతులను ఆదుకునే విధానాలు అమలు చేస్తే, ఇప్పుడు ఫ్యాక్టరీల ఆస్తులను లిక్విడేషన్ పేరుతో ఏపీఐఐసీకి అప్పగించాల్సిన పనిలేదు కదా. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ జగన్ నాయకత్వంలో రైతుల తరఫున ఉద్యమిస్తాం. – సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ -
సచివాలయం
గ్రామ స్వరాజ్యంకేరాఫ్సాక్షి, అనకాపల్లి: గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పల్లె పాలనలో మార్పులకు నాంది పలికింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలోనే అందించాలనే లక్ష్యంతో 2019లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గతంలో ప్రభుత్వ సేవల కోసం మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త వ్యవస్థతో అనేక సేవలు గ్రామంలోనే అందుబాటులోకి వచ్చాయి. జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పింఛను, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఇంటి స్థలం, భూ రికార్డులు, విద్యుత్, తాగునీటి కనెక్షన్లు తదితర సేవలను సచివాలయాల ద్వారా నిర్ణీత గడువులో అందించే విధానం ఏర్పడింది. గ్రామంలోనే ప్రభుత్వ సేవలు రేషన్, ధ్రువీకరణపత్రాలు, సంక్షేమ పథకాలు తదితర సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలోనే వివిధ శాఖ ల సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో సచివాలయాలు కీలకంగా మారాయి. ప్రజలు తమ సమస్యలు, అవసరాల కోసం నేరుగా సచివాలయాన్ని సంప్రదించే అవకాశం ఏర్పడింది. దీనివల్ల గ్రామ స్థాయిలో పాలనకు ఒక కొత్త నిర్మాణం ఏర్పడింది. రైతు ముంగిట సేవలు రైతులకు సేవలను చేరువ చేసేందుకు రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) సచివాలయ వ్యవస్థతో అనుసంధానించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ సేవ లు ఒకేచోట అందించే విధానం అమల్లోకి వ చ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవ సా య సేవల పంపిణీకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది. గాంధీ గ్రామ స్వరాజ్య ఆలోచనకు అనుసంధానం స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడం, ప్రజలకు పాలనను చేరువ చేయడం వంటి అంశాలను గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్య భావనతో అనుసంధానించి అప్పటి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా స్థానిక పాలనను బలోపేతం చేయాలనే చర్చలో ఆంధ్రప్రదేశ్ మోడల్ కూడా ప్రస్తావనకు వచ్చింది. పేర్లు మారినా.. వ్యవస్థపై చర్చ ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలో సేవలు, నిర్మాణంలో ప్రభుత్వం తీసుకుంటున్న మార్పులతో గ్రామీణ పాలనపై మరోసారి చర్చ మొదలైంది. సచివాలయాలకు కొత్త పేర్లు, సేవల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ విమర్శలు, సమర్థనలు కొనసాగుతున్నాయి. అయితే పేర్లు, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి ముంగిటకు ఎంత వరకు చేరాయి? గ్రామ స్థాయిలో పాలన ఎంత సులభమైంది? అన్నదే ఈ వ్యవస్థ విజయాన్ని కొలిచే అసలు ప్రమాణంగా నిలుస్తోంది. జిల్లాలో వివరాలు ఇలా... గ్రామ/వార్డు సచివాలయాలు : 522 (465 గ్రామీణ, 57 వార్డు) సచివాలయ ఉద్యోగులు : 3,824 (ప్రస్తుతం) రైతు సేవా కేంద్రాలు : 450 వెల్ నెస్ సెంటర్లు: 172 -
చెరకు రైతులతో మహాఉద్యమం
గోవాడ చక్కెర పరిశ్రమలో 2024లో చేసిన క్రషింగ్కి ఇప్పటి వరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. చెరకు తోలిన రైతులకు రూ.30 కోట్ల బకాయిలు ఉన్నా ఇంత వరకూ చెల్లించలేదు. రెండేళ్లుగా జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించలేదు. ఇప్పటికై నా కలెక్టర్ ఆధ్వర్యంలో సహకార సంఘంలో భాగస్తులుగా ఉన్న రైతులను కూడా పిలిచి వాస్తవ పరిస్థితులు వివరించి అప్పుడే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. లేదంటే చెరకు రైతులతో మహా ఉద్యమం తప్పదు. – బూడి ముత్యాలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి -
బినామీల కోసం.. రైతన్నలకు వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా రైతాంగానికి జీవనాధారంగా ఉన్న సహకార చక్కెర కర్మాగారాలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలతో చెరకు సాగు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంటే.. మరోవైపు ప్రభుత్వం వాటిని ఆదుకోవాల్సింది పోయి.. ఫ్యాక్టరీల భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టి బినామీలకు దోచిపెట్టేందుకు కుయుక్తులు పన్నుతోందని వై ఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కర్మాగారాల్లో వేలాది మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారని, వారి ఆస్తులపై పెత్తనం చేసి విక్రయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించి, లిక్విడేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సెప్టెంబర్ 20 తర్వాత రైతాంగాన్ని ఏకం చేసి మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఒకప్పుడు 30 వేల హెక్టార్లలో సాగైన చెరకు, ఇప్పుడు కేవలం 3,000 హెక్టార్ల దిగువకు పడిపోయింది. ఎకరాకు రూ. 80 వేల వరకు పెట్టుబడి పెడుతుంటే, కనీసం గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. మూతపడిన ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల ఫ్యాక్టరీలను తెరిపించడానికి నిధులు వెచ్చించి, ఆధునికీకరించాల్సిన కూటమి ప్రభుత్వం, ఆ బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న ఏకై క సహకార కర్మాగారం ‘గోవాడ’ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు 24 వేల మంది రైతులు, కార్మికులకు సంబంధించిన రూ. 35 కోట్ల బకాయిలను రెండేళ్లుగా చెల్లించలేదు. కోఆపరేటివ్ నిబంధనలకు విరుద్ధంగా వాటిని లిక్విడేషన్ చేసి, భూములను ఏపీఐఐసీ ద్వారా కారుచౌకగా తమ అనుయాయులకు కట్టబెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. భూములపై కన్నేసిన చంద్రబాబు సర్కార్.! సుగర్ ఫ్యాక్టరీ రైతుల్ని ఆదుకోకపోవడానికి కారణం.. వాటి పరిధిలో ఉన్న విలువైన భూములే. ఆ భూముల్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్కెచ్ వేసింది. అందుకే.. ఫ్యాక్టరీలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. దీని వెనుక భూముల్ని తమ అనుయాయులకు కట్టబెట్టే మాస్టర్ప్లాన్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికే నలుగురు మంత్రులతో నామమాత్రంగా కమిటీ వేశారని విమర్శలొస్తున్నాయి. రైతుల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనమేంటి.? ఫ్యాక్టరీల భూములు ప్రభుత్వం ఇచ్చినవి కావు. ఉదాహరణకు, 1954లో దేశంలోనే తొలి కోఆపరేటివ్ ఫ్యాక్టరీగా ఏర్పడిన ఏటికొప్పాక ఫ్యాక్టరీలో 5,400 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతుల షేర్ క్యాపిటల్, ఫ్యాక్టరీ లాభాలతోనే సుమారు 120 ఎకరాల భూములు, ఆస్తులు సమకూరాయి. అటువంటిది రైతులతో కనీసం సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించడం లేదు. షేర్ హోల్డర్స్గా ఉన్న రైతుల సమ్మతి లేకుండా ఏకపక్షంగా ఆస్తులను ఏపీఐఐసీకి బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. రైతుల్ని ఆదుకున్న తండ్రీకొడుకులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చెరకు రైతులు, సహకార చక్కెర కర్మాగారాలకు స్వర్ణయుగమనే చెప్పాలి. ఒకవైపు వైఎస్సార్ తన పాలనలో చెరకు రైతులకు టన్నుకు రూ. 200 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం అందించి, చక్కెర కర్మాగారాలు లాభాల బాటలో నడిచేలా రైతులకు కొండంత అండగా నిలిచారు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా సంక్షోభంలో ఉన్న సహకార రంగానికి ఊపిరిపోసింది. మూతపడే స్థితికి చేరుకున్న చోడవరం (గోవాడ) వంటి కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీల్ని కాపాడేందుకు ఏకంగా రూ. 90 కోట్ల వరకు ప్రభుత్వ నిధులను గ్రాంట్గా మంజూరు చేసి ఆదుకుంది. అంతేకాకుండా, ఏటికొప్పాక, తాండవ కర్మాగారాల్లోనూ విజయవంతంగా క్రషింగ్ జరిగేలా చూడటమే కాకుండా, ప్రతీ ఏటా క్రమం తప్పకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో రైతుల పాత్రను, వారి హక్కులను గౌరవించిన ఘనత ఈ తండ్రీకొడుకులకే దక్కుతుంది. సెప్టెంబర్ 20 ప్రభుత్వానికి డెడ్లైన్ :వైఎస్సార్సీపీ ఏపీఐఐసీకి ఆస్తుల బదలాయింపు పేరుతో తీసుకొచ్చిన జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఫ్యాక్టరీ భూములను విక్రయించడం మానుకుని, ప్రత్యామ్నాయ పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని సూచించింది. సెప్టెంబర్ 20లోగా గోవాడ రైతులకు రూ. 35 కోట్ల బకాయిలు చెల్లించాలనీ.. వెంటనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఫ్యాక్టరీల భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, సెప్టెంబర్ 20 తర్వాత వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున సొంతంగా సర్వసభ్య సమావేశం నిర్వహించి.. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలోని పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, పార్టీ రీజనల్ కోర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మలసాల భరత్, నియోజకవర్గ పరిశీలకులు గండి రవి, వీసం రామకృష్ణ, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఐఐసీ ద్వారా ఆస్తులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు గోవాడ రైతులకు అందని బకాయిలు.. జీతాల్లేక కార్మికుల అవస్థలు రైతుల తరఫున పోరాటాలకు సిద్ధమైన వైఎస్సార్సీపీ కుట్రలు ఆపాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం సెప్టెంబర్ 20 లోపు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ లేదంటే రైతులతో సమావేశమై మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
అనకాపల్లి/తుమ్మపాల: 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి మంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇవ్వనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే 24 శకటాల ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజ లు పాల్గోనున్నారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లాలో 560 మంది ఉద్యోగులకు మెరిట్ అవార్డులు ప్రకటించారు. -
భూముల కోసం కుట్రపూరిత జీవోలు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60 శాతం మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ చంద్రబాబు రైతులను వరి వేయొద్దని, చెరకు వేయొద్దని, మిర్చి, పొగాకు ఏదీ వద్దని అంటు న్నాడు. మరి రైతులు ఏం సాగు చేయాలి? ఈ ప్రభుత్వం దేనికి మద్దతు ధర ఇస్తుంది? సుగర్ ఫ్యాక్టరీలకు చెందిన విలువైన భూములు దోచుకోవడానికి, బినామీలకు కట్టబెట్టడానికే చంద్రబాబు కుట్ర పూరిత జీవోలు తెస్తున్నారు. ఫ్యాక్టరీల్ని ఆదుకునేందుకు నెల రోజుల టైమ్ ఇస్తున్నాం. తర్వాత చెరుకు రైతుల ఆగ్రహం ఎలా ఉంటుందో ప్రభుత్వం చూస్తుంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
ఆస్తుల్ని ఏపీఐఐసీకి అప్పగిస్తే సహించేదిలేదు
కోఆపరేటివ్ ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేసే పేరుతో వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. షేర్ హోల్డర్లుగా ఉన్న రైతుల సమ్మతితో తీర్మానం చేయకుండా ఫ్యాక్టరీలపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. చోడవరం ఫ్యాక్టరీ భూముల విలువ పెరిగినందున వాటిని ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం హామీగా తీసుకున్న రుణాలను ప్రభుత్వం గ్రాంట్గా భరించాలి, ఆ భారాన్ని రైతులపై మోపకూడదు. చోడవరం రైతులకు కనీసం బ్యాంకు వడ్డీ అయినా చెల్లిస్తారో లేదో చెప్పాలి. ఆస్తుల బదలాయింపు చేస్తే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. – కరణం ధర్మశ్రీ, మాజీ ప్రభుత్వ విప్ -
ఆరు నెలల్లో 1046 ఫిర్యాదుల పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సీఎండీ’కి మంచి స్పందన లభిస్తోందని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఆరు నెలల్లో 1,087 ఫిర్యాదులు అందగా, 1,046 పరిష్కరించినట్లు వెల్లడించారు. మిగిలిన ఫిర్యాదులను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. వీటిలో వోల్టేజ్, విద్యుత్ సరఫరాకు సంబంధించి 561, కొత్త కనెక్షన్లు 173, స్తంభాలు–లైన్లు–డీటీఆర్లకు 124 ఫిర్యాదు లు ఉన్నాయి. సమస్యలను కేవలం నమోదు చేయడానికే పరిమితం కాకుండా, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా సంస్థ అడుగులు వేస్తోందని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఏకంగా రూ.7.47 కోట్ల అంచనాలతో 305 అభివృద్ధి పనులను సంస్థ మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా 164 సింగిల్ ఫేజ్, 47 త్రీ ఫేజ్ డీటీఆర్లు, 508 విద్యుత్తు స్తంభాలు, 55.27 కిలోమీటర్ల మేర లైన్ల నిర్మాణం, 2,590 మీటర్ల కేబుల్ ఏర్పాటు పనులు చేపట్టినట్లు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వివరించారు. -
ఏటీఎం కార్డులతో ఘరానా దొంగతనాలు
ఎంవీపీ కాలనీ (విశాఖ): వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులు మార్పిడి చేసి ఘరానా మోసాలకు పాల్పడుతున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం ప్రాంతానికి చెందిన పల్లా సురేంద్రకుమార్ (30)ను ఎంవీపీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.93 లక్షల నగదు, ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ వెంకటరావు తెలిపిన వివరాలు.. సురేంద్రకుమార్ ఏటీఎం కేంద్రాల వద్ద కాపుకాసి, ముఖ్యంగా వృద్ధులు డబ్బులు తీసేందుకు వచ్చినప్పుడు సహాయం చేస్తానంటూ వారి వెంట వెళ్లేవాడు. ఆ సమయంలో వారి ఏటీఎం కార్డును చాకచక్యంగా దొంగిలించి, అదే బ్యాంకుకు చెందిన మరో కార్డును వారికి ఇచ్చేవాడు. ముందుగానే బాధితుల పిన్ నంబర్ తెలుసుకుని, వారు వెళ్లిపోయిన వెంటనే అసలు కార్డుతో నగదు డ్రా చేసి పరారయ్యేవాడు. బాధితులు తమ కార్డు మారిపోయిందని గుర్తించేలోపే అక్కడి నుంచి తప్పించుకుని ఈ తరహాలో పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 60 కేసులు నమోదై ఉండగా, పలుమార్లు జైలుకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇటీవల ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దిలపాలెం ఎస్బీఐ ఏటీఎం, సీతమ్మధార అల్లూరి విగ్రహం సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం, అల్లిపురం, గాజువాక, తుని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాల సహాయంతో వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో చురుకై న పాత్ర పోషించిన సీఐ చక్రధర్రావు, ఎస్ఐ రాజు పర్యవేక్షణలో పనిచేసిన కానిస్టేబుల్ జగత్ కిరణ్ను ఏసీపీ అభినందించారు. సమావేశంలో పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిన్ల్యాండ్లో విద్యారంగఅధ్యయనానికి ఎంపిక
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతికి అంతర్జాతీయ విద్యా పరిశోధనకు అరుదైన అవకాశం లభించింది. ఆమెకు అందిన సమాచారం మేరకు ఈ నెల 15 న ఫిన్ల్యాండ్లో గల తుర్కు యూనివర్సిటీలో విద్యావిధానాలను అధ్యయనం చేయడానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ తనకు లభించిన ఆరుదైన అవకాశం గురించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకూ తుర్కు యానివర్సిటీలో విద్యా అధ్యయనం ఉంటుందన్నారు. అక్కడ విద్యా విధానాలు, బోధనా ప్రక్రియలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల అభ్యసన వాతావరణం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తానన్నారు. అక్కడ అధ్యయనం చేసిన అంశాలపై పట్టు సాధించి ఆచరణలోకి తీసుకురావడమే తన లక్ష్యం అన్నారు. -
రేషన్ స్టాక్ పాయింట్ కోసం గిరిజనుల ఆందోళన
దేవరాపల్లి: వాలాబు పంచాయతీ శివారు కోడాపల్లిలో ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి తమ రేషన్ కష్టాలకు విముక్తి కల్పించాలని కోడాపల్లి, రామన్నపాలెం, పూలగరువు, ఇప్పగరువు గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. కోడాపల్లిలో నాలుగు గ్రామాల గిరిజనులు గురువారం ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. వీరి నిరసనకు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దొర మాట్లాడుతూ గిరిజన పంచాయతీ వాలాబులో 14 గిరిజన గ్రామాలు ఉన్నాయని, వీరికి గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి రేషన్ సరఫరాను నిలిపివేయడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలాబు పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలకు వాలాబులో ఒక్క చోట మాత్రమే ఇవ్వడంతో శివారు గ్రామాలైన బుచ్చెంపాలెం, ఇప్పగరువు, పూలగరువు, రామన్నపాలెం, కోడాపల్లి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బుచ్చెంపాలెం గ్రామస్తులు సుమారు పది కిలోమీటర్ల మేర, మిగిలిన గ్రామాలకు గిరిజనులు ఆరు కి.మీ మేర కాలిన నడకన వెళ్లి రేషన్ తెచ్చుకుంటూ నరకయాతన పడుతున్నారని తెలిపారు. రేషన్ కోసం రోజంతా పనులు మానుకొని పస్తులు ఉండాల్సి దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. గతంలో బాధిత గిరిజనుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి కోడాపల్లిలో ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తామర్ల శంకరరావు, సిహెచ్బి. లక్ష్మి, సోములు, భీమాలమ్మ, సిహెచ్.చంద్రరావు, కాశీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం కోసం మెడికోల సమర దీక్ష
మహారాణిపేట (విశాఖ) : జూనియర్ వైద్యుల నిరవధిక సమ్మె మూడో రోజూ కొనసాగింది. స్టైఫండ్ పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు, వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యుల భద్రత, మెరుగైన పని వాతావరణం తదితర డిమాండ్లతో ఆంధ్రా మెడికల్ కాలేజీ, కేజీహెచ్ ప్రాంగణాల్లో గురువారం నిరసనలు చేపట్టారు. తొమ్మిది మంది పీజీ వైద్యులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. మిగిలిన జూనియర్ వైద్యులు, మెడికోలు ‘హైక్’ ఆకారంలో మానవహారం నిర్వహించి, ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. జూనియర్ వైద్యులు సమ్మెలో ఉండటంతో కేజీహెచ్తోపాటు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీలు, వార్డులు, శస్త్రచికిత్సలపై ప్రభావం పడింది. కేజీహెచ్లో సుమారు 26 ఓపీల్లో జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రోగులు ఓపీల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని శస్త్రచికిత్సలు కూడా వాయిదా పడ్డాయి. కేజీహెచ్లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీలు, 500 మంది జూనియర్ వైద్యులు, ఇతర వైద్య విద్యార్థులు వైద్య సేవల్లో పాల్గొంటుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో మూడు షిఫ్టుల్లో రోగుల పర్యవేక్షణపై ప్రభావం పడింది. గైనిక్ ఓపీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు రోగులకు సేవలందించారు. కాగా స్టైఫండ్ సవరణతోపాటు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు, పీజీలకు భద్రత, రాత్రివేళల్లో రక్షణ, పని ఒత్తిడి తగ్గింపు, మెరుగైన హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా నిరసన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. -
చెల్లని బిల్లులు..అక్రమ వసూళ్లు
బిల్లు ఉన్నా తప్పని కేసులు ప్రధాన రహదారులకే పరిమితమవ్వాల్సిన వసూళ్ల వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో గుడులు, బడుల వద్ద కూడా ఏఎంఆర్ సిబ్బంది తిష్ట వేస్తున్నారు. రద్దీగా ఉండే రహదారుల పక్కన టెంట్లు ఏర్పాటు చేసుకుని వాహనాలను అడ్డుకుంటున్నారు. ఎక్కడ మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతున్నా అక్కడికి సిబ్బంది వాలిపోతున్నారు. సీనరేజీ పేరుతో నగదు డిమాండ్ చేస్తున్నారు. అధికారిక అనుమతులు, గుర్తింపు, చెక్పోస్టుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకుండానే కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో వివాదాలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండేళ్ల కాలంలో ప్రతి రోజు వివాదాలు జరుగుతున్నాయి. వివాదాలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ పరిష్కారం చేయలేక పోలీసులు మిన్నకుండిపోతున్నారు. రోడ్డుపై బండి ఆపితే కేసులు నమోదు చేసే పోలీసులకు ఈ అనధికారిక శిబిరాలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీనరేజి పేరుతో రెండేళ్లుగా దోపిడీ గ్రామాల్లోనూ చెక్పోస్టులా...? -
నక్కపల్లి ఆస్పత్రి అప్గ్రేడ్కు చర్యలు
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్నుప్రారంభించిన హోంమంత్రి అనతి నక్కపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిని 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం ఆమె ఆస్పత్రిలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 పడకల స్థాయికి పెంచడంతోపాటు ట్రామాకేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం స్థానిక వారపు సంతలో హెటెరోవారి సీఎస్ఆర్ నిధులు రూ.60లక్షలతో నిర్మించిన షెడ్లను మంత్రి అనిత ప్రారంభించారు. గత ఏడాది అగ్నిప్రమాదం సంభవించి ఇక్కడ తాటాకు పాకలన్నీ దగ్ధమయ్యాయి.మూడు బ్లాకులలో 65 దుకాణాలు నిర్మించడం జరిగిందన్నారు. ఎండుచేపలకు ఎగుమతులకు ప్రసిద్ధి గాంచిన మార్కెట్లో షెడ్లు నిర్మించిన హెటెరో వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెటెరో ప్రతినిధులు కుళ్లాయిరెడ్డి, ఈశ్వర శర్మ, ఎంపీడీవో చలపతిరావు, ఏవో సీతారామరాజు, తహసీల్దార్ చిన్నికృష్ణ పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల పొట్ట కొట్టవద్దు
అనకాపల్లి: వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఆర్థికసాయం అందజేస్తే అందజేస్తే, కూటమి ప్రభుత్వం కుంటిసాకులతో చేనేత కార్మికులను మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు ఆకుల సంతోష్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో చేనేత కార్మికునికి రూ.24వేలు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా అందించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అనేక కుంటిసాకులు చెప్పి పథకం ఎగ్గొట్టిందని, తీరా ఈ సంవత్సరమైనా పూర్తిగా అందిస్తారు అనుకుంటే, కూటమి నాయకులు కొన్ని చోట్ల మగ్గం నేసే కార్మికుల నుంచి రూ.3 వేలు, మగ్గం నెయ్యని కార్మికుని నుంచి రూ.10వేలు వసూలు చేస్తూ పేద చేనేత కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులు అందరికీ ఒకేవిధంగా నగదు చెల్లించాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల పక్షాన పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చేనేత విభాగం పట్టణ అధ్యక్షుడు కొమ్మన శంకర్, జిల్లా సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి తంగెల్ల రామకృష్ణ్ణ, పట్టణ ట్రేడ్ యూనియన్ సభ్యులు దేశెట్టి బసవేశ్వర రావు, నాయకులు ఈమంది శ్యామలరావు, బేతా ఈశ్వరరావు పాల్గొన్నారు. -
ఏదీ ఎత్తిపోతల?
నాతవరం: తాండవ రిజర్వాయరు ఏలేరు కాలువ అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో పోలవరం కాలువ నుంచి తాండవకు ఎత్తిపోతల పథకం తెస్తానంటూ అయ్యన్న పాత్రుడు హామీచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో అయ్యన్న హామీ రైతులను మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తాండవ కాలువలు రూ. 65కోట్లతో సిమెంట్ లైనింగ్ పనలు చేసి రైతులకు దన్నుగా నిలిచారు. ఆయన తనయుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను తలపించేలా చేసేందుకు ఏలేరు కాలువ తాండవ ప్రాజెక్టు అనుసంధానం చేసేందుకు రూ. 470 కోట్లు 5లక్షలు మంజూరు చేసి ఆయనే స్వయంగా 2022లో డిసెంబరులో నర్సీపట్నంలో అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. అనుసంధానానికి నిధులు మంజూరు చేయడంతో రూ.10 కోట్ల మేర పనులకు ఖర్చు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజక్టు నుంచి అదనపు నీటిని ఏలేరు కాలువ ద్వారా తరలించేందుకు అదనపు భూమి సేకరించారు. మండలంలో అనుసంధానం పనులకు సంబంధించి ఏలేరు తాండవ కాలువలను రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఈఎన్సీ నార్త్కోస్ట్ సీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలన చేశారు. అనుసంధానం పనులకు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కె.ఎం.కె కంపెనీ సంస్థ కాంట్రాక్టరు దక్కించుకున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేస్తే రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పనుల్లో జాప్యం చేయడంతో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాండవ ఏలేరు అసునంధానం పనులు 25 శాతం కూడా పూర్తి చేయలేదంటూ రద్దు చేసింది. ఈ పనులు రద్దు పై రెండు జిల్లాల్లో రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయంతో స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం కాలువ నుంచి తాండవకు నీరు తెస్తానంటూ 2024 అక్టోబరులో మండల పర్యటనకు వచ్చినపుడు సభలో హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం నా జీవిత ఆశయమని..గొప్పగా చేప్పేశారు. పోలవరం కాలువ నీటిని తుని మండలం రేఖవానిపాలెం గ్రామం నుంచి తాండవకు తీసుకురావాలని దీనికి రూ.2400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నేటికీ పోలవరం తాండవ ఎత్తిపోతల పధకం ప్రతిపాదనలే ఇరిగేషన్ శాఖలో లేకపోవడం గమనార్హం. క్యాబినెట్లో ప్రస్తావన ఏదీ... రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపై చర్చించి కొన్ని ప్రాంతాలకు కొత్తవి మంజూరు చేశారు. పోలవరం తాండవ ఎత్తిపోతల పథకంపై కనీసం చర్చకు రాకపోవడం విశేషం. ఖరీఫ్ సాగుకు మంగళవారం తాండవ రిజర్వాయరు నుంచి ఆయకట్టుకు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఏలేరు తాండవ అనుసంధానం పనులు రద్దు చేయకుండా కొనసాగిేస్తే పనులు పూర్తి అయ్యేవని రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా పూడిక తీత పనులు ఆయకట్టుకు నీరు ప్రవహించే కాలువలో పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. గత నెలలో మన్యపురట్ల తాండవ నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువలో ఉన్న పూడికను స్వయంగా అధికారులను తీసుకెళ్లి చూపించారు. పూడిక తీశాకే నీరు విడుదల చేస్తే నీరు ప్రవహిస్తుందని తెలిపారు. అయితే ఆ కాలువలో పూడిక నేటికీ తీయలేదు. తాండవ ప్రధానగేట్లకు రూ.లక్షలు వ్యయంతో మరమ్మతులు చేసినా లీకేజీ అరికట్టలేదు. 2024లో పోలవరం–తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ సభలో హామీ ఇస్తున్న స్పీకర్ అయ్యన్న (ఫైల్) హామీ నెరవేర్చాలి.. స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం కోసం బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మా ప్రభుత్వం హయంలో మంజూరు చేసిన ఏలేరు తాండవ అనుసంధానం పనులు రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తి అయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులు పడే సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు ప్రజలు గమిస్తున్నారు. –పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదన లేదు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేదు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం తాండవ ప్రాజెక్టు పరిధిలో కాలువలో పూడికతీత మరమ్మతు పనులు చేస్తున్నాం. గతంతో పోలిస్తే ఈఏడాది బాగా చేశాం. –ఆనురాధ, డీఈ తాండవ ప్రాజెక్టు -
మా రైలు ఎప్పుడొచ్చేనో!
గూడ్స్కు గ్రీన్ సిగ్నల్.. ప్రయాణికులకు రెడ్ సిగ్నల్సాక్షి, విశాఖపట్నం: ‘ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ప్లాట్ఫారమ్పైకి రావాల్సిన రైలు నిర్ణీత సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గమనించగలరు..’ రైల్వే స్టేషన్లలో అప్పుడప్పుడూ వినిపించే ఈ ప్రకటనలు ఇప్పుడు విశాఖపట్నం డివిజన్లో సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు సమయపాలనలో ‘సూపర్ఫాస్ట్’గా దూసుకెళ్లిన డివిజన్.. ఇప్పుడు ‘ప్యాసింజర్’ రైలు కంటే నెమ్మదించింది. తాజాగా రైల్వే బోర్డు విడుదల చేసిన దేశవ్యాప్త రైళ్ల సమయపాలన ర్యాంకింగ్స్లో టాప్–70 డివిజన్లలో విశాఖ 62వ స్థానానికి పడిపోయింది. కేవలం 63.21 శాతం పంక్చువాలిటీ నమోదైంది. ప్రతిరోజూ రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను రూపొందించారు. సాధారణంగా 80–85 శాతానికి పైగా పంక్చువాలిటీతో ఉండే విశాఖ.. ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంటే ప్రతి పది రైళ్లలో దాదాపు నాలుగు నిర్ణీత సమయానికి చేరడం లేదన్నమాట. కళ్లు చెదిరే ఆదాయం ఆర్జించే డివిజన్.. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చడంలో ఎందుకు విఫలమవుతోంది? గూడ్స్ రైళ్లకు ఉన్న ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకు దక్కడం లేదా? టెర్మినల్ స్టేషన్ కావడం కూడా ఇందుకు కారణమా? పొరుగు డివిజన్ల స్పీడ్.. మనకెందుకు లేదు? రాష్ట్రంలోని ఇతర డివిజన్ల పనితీరుతో పోలిస్తే విశాఖ పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. గుంతకల్లు 99.33 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు 94.03 శాతంతో 17, విజయవాడ 88.30 శాతంతో 26వ స్థానంలో ఉన్నాయి. విశాఖ మాత్రం 63.21 శాతంతో 62వ స్థానంలో నిలిచింది. ట్రాక్ల ఆధునీకరణ, బైపాస్ లైన్లు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇతర డివిజన్లు ముందుకు సాగుతుండగా.. విశాఖలో కీలక పనులు నత్తనడకన సాగుతుండటం వ్యత్యాసానికి ఓ కారణంగా కనిపిస్తోంది. టెర్మినల్ స్టేషన్తో తిప్పలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ టెర్మినల్ కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి రైలుకు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లోకో రివర్సల్కు 20–30 నిమిషాల సమయం పడుతుంది. దీనికితోడు ప్లాట్ఫారమ్ల కొరత ఉంది. ఒక రైలు లోపలికి రావాలంటే మరోటి దువ్వాడ, సింహాచలం, గోపాలపట్నం ఔటర్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక్క రైలు ఆలస్యం ప్రభావం మిగిలిన సర్వీసులపైనా పడుతోంది. గూడ్స్కే పెద్దపీట? దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో సరకు రవాణా కీలక ఆదాయ వనరు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి నిత్యం భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పోర్టు సరకు రవాణాకు మార్గం కల్పించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల రైళ్లను లూప్ లైన్లలో నిలిపివేయాల్సి వస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రీమియం రైళ్లకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇక వందేభారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్ణీత సమయానికి నడిపించేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. రెగ్యులర్ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం పడుతోందనే విమర్శలున్నాయి. వేగవంతమైన రైళ్లకు మార్గం కల్పించేందుకు ఇతర సర్వీసులను నిలిపివేయాల్సి వస్తుండటంతో ఆలస్యాల పరంపర కొనసాగుతోంది. అభివృద్ధి పనుల్లో జాప్యం రైళ్ల రద్దీకి తగ్గట్టుగా స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో జాప్యం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది. విశాఖపట్నం స్టేషన్ రీడెవలప్మెంట్, ప్లాట్ఫారమ్ల విస్తరణ, మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తికాకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రోజుకు 5–6 రైళ్లను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అప్పుడే పట్టాలెక్కేనా? విశాఖ డివిజన్ పనితీరు మెరుగుపడాలంటే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు థర్డ్, ఫోర్త్ లైన్ పనులను వేగవంతం చేయాలి. దువ్వాడ బైపాస్ లైన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. లోకో రివర్సల్తో పడుతున్న సమయభారాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. ట్రాక్లపై రద్దీని సమర్థంగా నిర్వహించగలిగితేనే.. ఒకప్పుడు సమయపాలనలో ముందున్న విశాఖ డివిజన్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోగలదు. -
ఓపీలకు బ్రేక్.. రోగులకు నిరీక్షణ
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మెతో కేజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సమ్మెలో భాగంగా బుధవారం రెండో రోజు కూడా జూనియర్ వైద్యులు ఓపీలను బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో కేజీహెచ్లోని 26 ఓపీల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఓపీల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వార్డుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. బుధ వారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన ఆంధ్ర మెడికల్ కాలేజీ, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా జూనియర్ వైద్యులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు. విశాఖలోని కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీ వైద్యులు, 500 మంది జూనియర్ వైద్యులు ఓపీ సేవలు అందిస్తుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, విశాఖ యూనియన్ నాయకుడు డాక్టర్ శిరాజ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. -
దివ్యాంగులకు నిరామయ ఆరోగ్య బీమా
సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె.శ్రీరాములు అనకాపల్లి టౌన్/నర్సీపట్నం: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులందరికీ నిరామయ ఆరోగ్య బీమా పథకం ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు సమగ్రశిక్ష అడిషనల్ ప్రొజెక్ట్ కో–ఆర్డినేటర్ కె. శ్రీరాములు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 24 మండలాల్లోని అర్హులైన దివ్యాంగుల వివరాలను నిరామయ పోర్టల్లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మానసిక వైకల్యం, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మల్టిపుల్ డిజేబిలిటీ వంటి వైకల్యాలు కలిగిన వారు ప్రయోజనం పొందేందుకు అర్హులని తెలిపారు. ఇందుకోసం జిల్లా జోనల్ అధికారిగా సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయ అధికారి బి.రామకృష్ణ నాయుడును నియమించామన్నారు. ఈ నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ పథకంలో నమోదు చేసుకున్న అర్హులైన దివ్యాంగులకు ఏడాదికి రూ.లక్ష వరకు వైద్య బీమా సదుపాయం అందుబాటులో ఉంటుందని, వైకల్యానికి సంబంధించిన ఇప్పటికే ఉన్న సమస్యలు చేసే కరెక్టివ్ సర్జరీలకు గరిష్టంగా రూ.55 వేల వరకు, ఓపిడి చికిత్సలకు రూ.19 వేల వరకు, వైకల్యం ప్రభావాన్ని తగ్గించేందుకు కొనసాగుతున్న థెరపీలకు రూ.20 వేల వరకు, ఆయుష్ చికిత్సలకు రూ.4 వేలు, రవాణా ఖర్చులకు రూ.2 వేల వరకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. అర్హులైన సదరం సర్టిఫికెట్తో పాటు సంబంధిత దివ్యాంగుల గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, విద్యార్థి బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు జెరాక్స్లతో వివిధ మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల ప్రత్యేక ఉపా ధ్యాయులను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి దివ్యాంగుడు స్వదినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9885288151 నంబర్లో సంపదించాలని సూచించారు. -
అసోం వరద బాధితులకు ఆపన్నహస్తం
తుమ్మపాల: విపత్తు సమయంలో బాధిత ప్రజలకు సహాయం చేయడంలో జిల్లా యాంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని, అసోం రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో నిధులు సేకరించి పంపించననున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతరుల సహకారంతో రూ.26,74,296 నిధులను సేకరించినట్టు తెలిపారు. అసోం వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అసోం వరద సహాయ నిధి కోసం జిల్లా నుంచి రూ.10 లక్షల నిధులు సేకరించాలని ప్రారంభ లక్ష్యంగా నిర్ణయించామని, అయితే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతరుల సమష్టి కృషి, ఉదారత నిర్దేశించిన లక్ష్యానికి రూ.రెండున్నర రెట్లకు పైగా నిధులను సేకరించగలిగామన్నారు. సేకరించిన మొత్తాన్ని పారదర్శకంగా, నేరుగా అసోం వరద బాధితులకు సహాయపడే విధంగా సంబంధిత అధికారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అసోంలోని సంబంధిత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు నేరుగా బదిలీ చేసేందుకు చెక్కును అందజేస్తున్నట్టు తెలిపారు. అసోం వరద సహాయ నిధికి సంబంధించిన చెక్కు అందజేసే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ) రామారావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జాడలేని మేఘం ● ఖరీఫ్కు కష్ట కాలం
వరి నారు మడులను మోటారుతో తడుపుతున్న రైతులురావికమతం: మండలంలో దొండపూడి, కొత్తకోట, కిత్తంపేట, మత్సవానిపాలెం, మేడివాడ, టి.అర్జాపురం తదితర గ్రామాల్లో నారు మడులను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుకు అదనపు భారం అవుతున్నా బోరుబావులున్నా చోట్ల మోటర్లతో నారుమళ్లకు నీటి తడులు అందిస్తున్నారు. బోర్లు, చెరువులు లేని చోట్ల రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది డీజిల్ ఇంజిన్లు పైపులతో దూరం నుంచి నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. కల్యాణపులోవలో అడుగంటిన నీళ్లు కల్యాణపులోవ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ ఏడాది వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. కల్యాణపులోవ జలాశయం ఆయకట్టు కింద దొండపూడి, గంపవానిపాలేం, జెడ్.కొత్తపట్నం, జెడ్.బెన్నవరం, కొత్తకోట, మర్రివలస, చీమలపాడు, మత్సవానిపాలెం తదితర 14 గ్రామాల్లో రైతులు 6వేల ఎకరాల్లో వరి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 460 అడుగులుకాగా బుధవారం నాటికి 449.5 అడుగులు ఉంది. గతేడాది ఇదే సమయానికి 456 అడుగులు పైబడి నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు 30 రోజుల వరకు సరిపోతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరి పంటకు 120 రోజుల వరకు నీరు అవసరం ఉంటుంది, కానీ నీరు వదిలిన 30 రోజుల లోపు వర్షాలు పడకపోతే రైతులు పరిస్థితి ఏంటి రైతులు వాపోతున్నారు. -
ఏటీఎం మోసగాడు అరెస్ట్
అనకాపల్లి టౌన్: ఏటీఎంలో సహాయం చేస్తానంటూ వృద్ధుడిని నమ్మించి ఏటీఎం కార్డు, పిన్ విరాలు సేకరించి రూ.10 వేలు కాజేసిన అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న మెయిన్రోడ్ మాణిక్య లాడ్జి కింద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 76 ఏళ్ల ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి లావాదేవీ నిర్వహిస్తుండగా నిందితుడు ప్రత్తి రాజేష్ సహాయం చేస్తానని నమ్మించి, ఆయన ఏటీఎం, పిన్ వివరాలను తెలుసుకొని బాధితుడికి తెలియకుండా ఖాతా నుంచి రూ.10 వేలు విత్డ్రా చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాఽధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, గూడ్స్ రోడ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిందితుడిపై ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలలో 12 దొంగతనం, చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
ఆటోప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆటోకి తగిలి గాయపడిన వ్యక్తి మృతి చెందినట్టు ఏఎస్ఐ వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి కోనవానిపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోన రాజు(38) మంగళవారం అడ్డురోడ్డు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి సడన్బ్రేక్ వేయడంతో తన ఆటోకి ముందు భాగం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు డ్రైవర్ రాజుని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆపై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ చెప్పారు. -
గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కొమ్మాది: గిరిజన విద్య, సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం సూచించారు. రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా మిషన్ (టీసీఆర్టీఎం) కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సంస్థ చేపడుతున్న అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన భాషల ప్రైమర్లు, చిత్రకోశాలను ఆశ్రమ పాఠశాలల లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధ్యాయులకు గిరిజన సంస్కృతిపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్, విలువ పెంపు కోసం ఐఐఎం విశాఖపట్నంతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సమిధా సింగ్, టీసీఆర్టీఎం డైరెక్టర్ రాణి మందా తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ మాఫియా నుంచి కొండల్ని కాపాడండి
నక్కపల్లి: మండలంలో గ్రావల్ మాఫియానుంచి కొండలను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ విజయ్కృష్ణన్ను కోరారు. బుధవారం నక్కపల్లి మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ వేంపాడులో పాలకొండను కొల్లగొట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు నక్కపల్లితో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అనధికార లేఅవుట్లకు ఈ గ్రావల్ తవ్వి తరలించేందుకు సిద్దపడుతున్నారన్నారు. పాలకొండను మరో పంచదార్ల కొండలా చేయొద్దని కోరారు. ఉద్దండపురం, బోదిగల్లంలో ఉన్న కొండలను కూడా కొల్లగొడుతున్నారన్నారు. నిత్యం వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావల్ను ట్రిప్పర్లలో తరలించుకుపోతున్నారని, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. తునికి చెందిన ఒక టీడీపీ నాయకుడికి వేంపాడు పాలకొండలో గ్రావల్ తవ్వి లేఅవుట్లోకి తరలించేందుకు ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇప్పటికే కమీషన్ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. పాలకొండలో గ్రావల్ తవ్వకాలకు అనుమతిస్తే వైఎస్సార్సీసీ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా కలిసి ఉద్యమ బాటపట్టాల్సి వస్తుందన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఉన్న కొండల్లో గ్రావల్ను కూడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీఽ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తళ్ల భార్గవ్ పాల్గొన్నారు. సాగునీటి వనరులు స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దు మండలంలో కాగితలో చెరువులు, గెడ్డలు, వాగులను స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దని గ్రామానికి చెదందిన పలువురు రైతులు కలెక్టర్ను కోరారు. వైఎస్సార్సిపి నేత వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు బుధవారం కలెక్టర్ విజయ్కృష్ణను కలిసారు. గ్రామంలో సుమారు 17 ఎకరాల వీస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, గొల్ల చెరువు, గెడ్డలను స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ప్రధాన సాగునీటి వనరులను స్టీల్ప్లాంట్కు కేటాయిస్తే ఆయకట్టు భూములపై ఆధారపడ్డ వందలాది మంది రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములు సాగునీరు అందక బీడు వారతాయన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతులు దేవవరపు శివ,పోతంశెట్టి బాబ్జి, గుమ్మిళ్ల గోవిందరావు,పోతంశెట్టి వీరబాబు, దేవవరపు గోవిందరావు,పోతంశెట్టి గణేష్, సకుర్తి సత్తిబాబు,గంగేశ్వరరావు ఉన్నారు.కలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతల వినతి -
పాముకాటుకు గురైన మహిళ మృతి
చీడికాడ: పాముకాటుకు గురైన వివాహిత విశాఖ కేజిహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు మండలంలోని వరాహపురం తాజామాజీ సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలిబోయిన ఘాఠీలు(29)ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి బయట ఉన్న సమయంలో విష సర్పం కాటు వేసింది. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న భర్త అర్జునకు ఘాఠీలు చెప్పడంతో హుటాహుటినా చోడవరం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడ నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం ఘాఠీలు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిదన్నారు. ఘాఠీలకు పార్ధు(12),షణ్ముకం(9),దీక్షిత(6) వయస్సు గల ముగ్గురు పిల్లలున్నారు. భర్త అర్జున ఫిర్యాదు మేరకు చీడికాడ ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ఘాఠీలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
తప్పుడు కూతల కూటమి
సాక్షి, అనకాపల్లి: కూటమి నేతలు ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఏటా 20 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు నిరుద్యోగ భృతి రూ. 3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ ఏర్పాటు చేస్తామని, సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగిస్తామంటూ హామీలు ఇచ్చారు.. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్న్ను రద్దు చేసి దానికి అదనంగా కొన్ని ఉద్యోగాలు యాడ్ చేసి మెగా డీఎస్సీ పేరిట రిక్రూట్మెంట్ జరిగింది. అందులో కూడా స్పోర్ట్స్ కోటా కొత్త జీవోలంటూ భారీ అవకతవకలకు పాల్పడ్డారు. కనీస విద్యార్హత గానీ, డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే అక్రమమార్గంలో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ డీఎస్సీ అక్రమాలపై రెండు నెలలుగా రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులు, నిరుద్యోగులు వరుస ఉద్యమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ను భర్తరఫ్ చేయాలని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలంటూ శాంతియుతంగా ఇటీవల చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వరుసగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై దుర్భాషలకు దిగారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జగన్ హయాంలో సున్నా ప్రభుత్వ ఉద్యోగాలు..కూటమి హయాంలో 16 వేల ఉద్యోగాలు..అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ హోర్డింగ్లను ఏర్పాటు చేయడంపై కూటమి నేతల దిగజారుడుతనానికి పరాకాష్టగా ప్రజలు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లాలో 30,654 ఉద్యోగాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో 30,654 మందికి ఉద్యోగాలు కల్పించింది. అదేవిధంగా ప్రైవేట్ పరిశ్రమల్లో, రేషన్ పంపిణీ వాహనాల పేరిట, పశుసంవర్ధక శాఖ అంబులెన్స్లు, 104, 108 అంబులెన్న్స్ల్లో 3,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించింది. అదే కూటమి ప్రభుత్వంలో జిల్లాలో 25 వేలకు పైగా ఉద్యోగాలను తీసేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిన దానినే అమలు చేశారు. చందబాబు ప్రభుత్వంలో తీసిన ఏకై క డీఎస్సీ రిక్రూట్మెంట్కు వస్తే అందులో భారీ అవకతవకలకు పాల్పడ్డారు. జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు... జిల్లా వ్యాప్తంగా 10,000 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు వైద్య, ఆరోగ్య శాఖలో 2,000 అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలు ఎండోమెంట్, ఏపీపీఎస్సీ, ఇతర శాఖల్లో 500 ఉద్యోగాలు ఆప్కాస్లో 4,000 ఉద్యోగాలు జిల్లాలో 12,000 వలంటీర్ ఉద్యోగాలు ఏపీఎస్ఆర్టీసీలో 1,800 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం ప్రైవేట్, ఫార్మా పరిశ్రమల్లో 2 వేల మందికి ఉపాధి 1998 డీఎస్సీ క్వాలిఫైడ్(ఎంటీఎస్) రిక్రూట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది టీచర్లను నియమిస్తే..వీటిలో ఉ మ్మడి జిల్లాలో 354 మందికి ఉద్యోగాలు ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడు దల. కోర్టు కేసు కారణంగా నిలిపివేత సుమారుగా 7 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. ఎన్నికలు, కోర్టు కేసుల కారణంగా నిలిపివేత. తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి...మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని అవమానిస్తూ హోర్డింగ్స్ పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం డీఎస్పీ పి.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాయంలో రాష్ట్రంలో వ్యాప్తంగా పాలన చేపట్టిన తొలి నాలుగు నెలల్లోనూ లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఐదేళ్లలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అవి ఆధారాలతో పాటు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయంటూ వాటిని వక్రీకరిస్తూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో సున్నా ఉద్యోగాలంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో హోర్డింగ్స్ తొలగించకపోతే శాంతియుత ఆందోళన చేపడతామని గణేష్ అన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు, పార్టీ నేతలు ఏకా శివ, శానపతి వెంకటరత్నం, చిటికెల రమణ, పాణిశాంతరామ్, నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు సుర్ల నాయుడు, జిల్లా ప్రచార కమిటీ నాయకులు పిళ్లా శ్రీను, హరిబాబు, రాజుబాబు, రఘు కూటమి తప్పుడు ప్రచారాలను ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై బురద చల్లుతున్న కూటమి నేతలపై ప్రజలు, యువత, విద్యార్థులు మండిపడుతున్నారు. తాజాగా వాస్తవాలను వక్రీకరిస్తూ మున్సిపాలిటీలో తప్పుడు వ్యాఖ్యలతో హోర్డింగ్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. -
వేతనాల్లేవు...రామ్జీ
యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డులు 2,35,085 జిల్లాలో మొత్తం జాబ్ కార్డుల సంఖ్య 2,72,319ఉపాధి పొందినవేతనదారులు 2,35,575 2026–27 ఆర్థిక సంవత్సరంలోఉపాధి పనులు రూ.256.81 కోట్లు ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్) సాక్షి, అనకాపల్లి: వీబీజీ–రామ్జీ ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వాలన్న నిబంధనను కూటమి సర్కార్ గాలికి వదిలి వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఆసరాగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించింది. ఒక వైపు కరవు విలయతాండం చేస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వ్యవసాయ పనులు లేవు. ఎల్నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో వరినాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటి అవసరాలు తీరతాయనే ఆశతో ఉపాధి హామీ పథకం పనులకు వెడితే అక్కడ వేతనాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలో జూన్ 8వ తేదీ నుంచి నేటి వరకూ రెండు నెలలు వేతనాలు బకాయి పడింది. గతేడాదిలోనూ ఇదే సమస్య.. వేతన బకాయిల కోసం కూలీలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తే గతేడాదికి సంబంధించిన వేతన బకాయిలనూ జాప్యం చేసుకుంటూ ఆలస్యంగా ఐదు వారాల బకాయిలు విడుదల చేసింది. ఇప్పుడు జూన్ నెల 8వ నుంచి నేటి వరకూ ఉపాధి డబ్బులు ఎప్పుడు పడతాయా..!అంటూ కూలీలు ఎదురుచూస్తున్నారు. బయట పనులు లేకపోవడంతో వీటిపైనే ఆధారపడే కుటుంబాలు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి. వారికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టినా రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే రూ.250–300లకు మించి రావడంలేదు. ఉపాధి పనులకెళ్లినా వేతనాలు వెంటనే అందని పరిస్థితి ఉండడంతో ఇల్లు గడిచేదెలా అంటూ కూలీలు ఆవేదన పడుతున్నారు. జిల్లాలో 24 మండల పరిధిలో ఉపాధి వేతనాలు సుమారుగా రూ.173 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. విడుదలైన నిధులు రూ.83.81 కోట్లు పేరు మారినా..రాత మారలేదు... కేసులు పెట్టకముందే కూలి చెల్లించండి... జిల్లాలో రెండు నెలలుగా ఉపాధి హామీ బకాయిలను చెల్లించలేదు. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉంది. అ పరిస్థితి రాక ముందే తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండి కూలీలు కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఉపాధి హామీకి రూ.లక్ష కోట్లు ఉన్న బడ్జెట్ను పీఎం మోదీ ప్రభుత్వం దశలవారీగా రూ. 62 వేల కోట్లకు తగ్గించారు. కొన్ని చోట్ల గట్టి నేల ఉంటుంది. అలాంటి చోట్ల వేతనదారులకు డబ్బులు పెంచాలి. –డి.వెంకన్న, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిసాంకేతిక కారణాల వల్లే జాప్యం వేతనాలు పెండింగ్ విషయమై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఉపాధి వేతనాలు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే. టెక్నికల్ సమస్యల నేపథ్యంలో ఆలస్యమైంది. ఆలస్యమైనా అందరికీ వేతనాలు పడతాయి. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. – సీహెచ్ నిర్మల దేవి, డ్వామా పీడీ, అనకాపల్లి జిల్లా. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్వరూపం మారిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ పథకం ప్రవేశ పెట్టింది. ఇటీవల ఈ పథకం అమలులోకి వచ్చింది. గతంలో ఏడాదికి 100 రోజులు పనిదినాలు ఇచ్చేవారు. కానీ కొత్త పధకం కింద 125 పనిదినాలకు పెంచారు. ప్రస్తుతం రోజువారీగా రూ.311 రూపాయలు వేతనం అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో 645 పంచాయతీల్లో 2,72,319 మందికి జాబ్ కార్డులు ఇచ్చారు. జూన్ 8వ తేదీ నుంచి వీరికి వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లాలో మొత్తం రూ.173 కోట్లు రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. కూలీలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. -
మలేరియా మందుల కొరత
మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా వ్యాధి వచ్చిన వారికి ఆస్పత్రుల్లో మందులు కొరత అధికంగా ఉందని, దీని నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో చెత్త చెదారాలు పేరుకుపోవడం వల్ల, వర్షాలు కురవడం వల్ల దోమలు విజృంభిస్తున్నాయని జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ,ఉమాదేవి అన్నారు. గ్రామీణ, మన్య ప్రాంతాల్లో పెరుగుతున్న మలేరియా కేసుల పట్ల సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానిక ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు అంశాలపై సభ్యులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు చర్యలు చేపట్టాలని చైర్పర్సన్ ఆదేశించారు. ఉపాధి పనుల్లో సదుపాయాలు కల్పించాలి ఉపాధి కూలీలకు పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడ (షెడ్లు), తాగునీటి సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని ప్లాంటేషన్లలో చనిపోయిన 10 రకాల మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని సూచించారు.దేవరాపల్లి, కోటవురట్ల తదితర మండలాల్లో కాలువల పూడికతీత, రైవాడ ఆయకట్టు నీటి సరఫరా, జలధార పథకం పనుల పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను సభ్యులు ఉమాదేవి, సత్యం కోరారు. జగనన్న ఇళ్లకు సదుపాయాలేవీ.. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే విద్యుత్ సరఫరా, తాగునీటి కనెక్షన్లు కల్పించాలని జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు కోరారు. నిలిచిపోయిన హౌసింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో కూరగాయల సాగు, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి సబ్సిడీలు, బ్యాంక్ లింకేజీ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సభ్యులు కోరారు. ఉమ్మడి జిల్లాల్లో హౌసింగ్ బిల్లు పెండింగ్లో ఉండడం పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిలో ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర : చైర్పర్సన్ గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన శిక్షణ సదస్సులో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025పై అవగాహన పెంచుకుని, క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు. -
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం తుమ్మసాల: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఈ నెల 13 నుంచి ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరం నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 15 తేదీ వరకు ప్రతి ఇల్లు, దుకాణం, ప్రభుత్వ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ఐసీడీఎస్ (అంగన్వాడీ కేంద్రాలు), డీఎంహెచ్ఓ (పీహెచ్సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు), డీసీహెచ్ఎస్ ఆసుపత్రులు, రవాణా శాఖ పరిధిలోని అన్ని కేంద్రాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో జాతీయ జెండాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులందరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను పోస్ట్ చేయాలని తెలిపారు. ఈ నెల 10 నుండి 15 వరకు ఈ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘మరి మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నిస్తూ మరొకరికి ఛాలెంజ్ విసరాలని తెలిపారు. అధికారులందరూ వీడియో రూపకల్పన పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం, ఆ లింకులను వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేయాలని, సమాచార శాఖ అధికారి దీనిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యాశాఖ ద్వారా పాఠశాల విద్యార్థులతో కూడా ఇదే శైలిలో వీడియోలను రికార్డు చేయించాలన్నారు. ప్రతి మండలం నుంచి అత్యుత్తమంగా నిలిచే 20 వీడియోలను ఎంపిక చేసి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి పంపించాలన్నారు. ఈ నెల 13న ప్రత్యేకంగా ‘హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు తమ సిబ్బందితో పాటు స్థానిక పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేయాలని, ఈ ర్యాలీలో దాదాపు 3 వేల నుండి 5వేల మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే రోజు పురపాలక, మండల స్థాయిలలో భారీ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ 1 కిలోమీటరు పరిధిలో ఈ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 14న ప్రతి ప్రభుత్వ కార్యాలయం కాంపౌండ్ లోపల, సమీపంలోని పాఠశాల ప్రాంగణాల్లో ప్రతి అధికారి కనీసం 10 స్వదేశీ రకాల మొక్కలను నాటాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ భవనాలను ఈ నెల 14 సాయంత్రం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు (3 రోజుల పాటు) విద్యుత్ కాంతులతో అలంకరించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారులందరూ జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకొని తమ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ చిత్రాలుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి. రమణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్కుమార్ పాల్గొన్నారు. -
తాండవ నీరు పొదుపుగా వాడండి
నాతవరం: తాండవ రిజర్వాయరు నీటిని రైతులంతా పొదుపుగా వాడుకోవాలని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఖరీఫ్ సాగుకు తాండవ రిజర్వాయర్ నీటిని మంగళవారం గేట్లు ఎత్తి కాలువల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టుతో పాటు పంట కాలువలు అభివృద్ధికి రెండేళ్ల కాలంలో రూ.12 కోట్లు మంజూరు చేశానన్నారు. మిగిలి ఉన్న పనులను వివిధ దశల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నాతవరం, గొలుగొండ మండలాలను అనుసంధానం చేసే తాండవ ఘాట్ రోడ్డుకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం 375.2 అడుగులు నీరు ఉందన్నారు. నీటిని రెండు కాలువలు ద్వారా రోజుకు 500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తే 70 రోజులు ఆయకట్టు భూములకు ప్రవహిస్తుందన్నారు. శివారు ఆయకట్టుకు సైతం నీరు సరఫరా చేసేందుకు నీరు ఎక్కడా వృథా కాకుండా పొదుపుగా వాడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ మేడపురెడ్ది జోగుబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, రాష్ట్ర కార్పొరేషన్ డైర్టెక్టర్లు రాజాన వీర సూర్య చంద్ర, కొండ్రు మరిడియ్య, లాలం కాశీనాయుడు, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ చందనరేఖ, ప్రాజెక్టు డీఈ ఆనురాధ, జేఈ శ్యామ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో మూర్తిబాబు, ఆర్అండ్బీ డీఈ విద్యాసాగర్ జేఈ నాయుడుబాబు, నీటి సంఘాల అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
తుమ్మపాల: రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో సత్వర వైద్యం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి – రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్’ (పీఎం రాహత్) పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో (మొదటి గంట) బాధితులకు ప్రాణాపాయం కలగకుండా, వేగవంతమైన నగదు రహిత ఉచిత వైద్య సేవలను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, బాధితులకు ఆర్థిక భారం లేకుండా, నాణ్యమైన చికిత్సను అందజేయడానికి ఈ పథకం రూపొందించబడిందన్నారు. ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించబడుతుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ చికిత్స వర్తిస్తుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు 48 గంటల వరకు, ఇతర కేసుల్లో 24 గంటల వరకు ఆసుపత్రులు తప్పనిసరిగా స్థిరీకరణ చికిత్స అందించాలన్నారు. పోలీస్ రిపోర్టింగ్, హాస్పిటల్ క్లెయిమ్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఈ పథకం పూర్తి డిజిటల్ విధానంలో పనిచేస్తుందని, ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో అమలు చేయబడుతుందని, దీనికి సంబంధించి ఆసుపత్రులకు చెల్లింపులు’ మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా జరుగుతుందన్నారు. జిల్లాలో–5 ప్రైవేట్, 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 13 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. -
● నిత్య‘కృషీ’వలుడు
తన పొలంలో కూలీలతో కలిసి వరినాట్లు వేస్తున్న విద్యాశాఖ ఏడీ అప్పారావునాయుడునర్సీపట్నం: అనకాపల్లి జిల్లా డీఈవోగా పని చేసిన గిడ్డి అప్పారావునాయుడు పాడేరులో తన సొంత పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తున్న దృశ్యమిది. ప్రస్తుతం తన వాట్సాప్ స్టేటస్లో చక్కర్లు కొడుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా అప్పారావునాయుడు నిబద్ధత..నిజాయితీతో పని చేసి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) మీడ్డే మీల్ విభాగం అధికారిగా ఉన్నారు. అప్పారావునాయుడు తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో కూలీలతో కలిసి వరి నాట్లు వేసి రైతు బిడ్డ అనిపించుకున్నారు. -
గోబందను వదులుకోం...
నక్కపల్లి: గ్రామస్తులు పశువుల మేతకు, మత్స్యకారులు చేపల వేటకోసం ఉపయోగించుకుంటున్న గోబందను స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని డీఎల్పురం గ్రామస్తులు స్పష్టం చేశారు. మంగళవారం ఈ గోబందను స్వాఽధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు ఆడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. డీఎల్పురం సర్వే నంబరు 81లో సుమారు 190 ఎకరాల ప్రభుత్వ భూమి (గోబంద) ఉంది. ఈ భూమిలో చాలా ఏళ్ల నుంచి గ్రామస్తులు పాడి రైతులు పశువుల మేత కోసం, దళితులు గుల్లబట్టీల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఈ భూమిని స్టీల్ప్లాంట్కు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే అధికారులతో కలసి గతంలో పలు సందర్భాల్లో సర్వే చేసేందుకు సిద్ధపడగా గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఈనెల 10వ తేదీన నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఈ గోబందను పశువుల మేతకు, గుల్లబట్టీలకు ఉపయోగించుకుంటున్నామని దీన్ని స్టీల్ప్లాంట్కు ఇవ్వడానికి కుదరదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ మంగళవారం మరోసారి రెవెన్యూ, సర్వేశాఖ అధికారులు మందీ మార్బలంతో వెళ్లి భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారు. గ్రామస్తుల ఆమోదం లేకుండా ఈ గోబందను స్వాధీనం చేసుకోడానికి వీల్లేదని మాజీ ఎంపీటీసీ గింజాల వెంకటరమణ, మాజీ సర్పంచ్లు కిల్లాడ రామకృష్ణ, మత్స్యకార నాయకులు ఓసిపల్లి చిట్టిబాబు, మేరుగు గోవిందు స్పష్టం చేశారు. డీఫారం, జిరాయితీ భూములతోపాటు గ్రామస్తులు తమ అవసరాల కోసం కేటాయించుకున్న భూములను కూడా స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. మరోసారి గ్రామస్తులంతా సభ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వస్తామని అప్పటివరకు ఈ భూముల జోలికి రావొద్దని వారు అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కనకారావు, రాంబాబు, శ్రీను, రమణ పాల్గొన్నారు. -
మాచ్ఖండ్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు సీలేరు: ఆంధ్ర–ఒడిశా ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సెప్టెంబర్ నాటికి అన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రాజారావు తెలిపారు. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి గురైన మాచ్ఖండ్ కేంద్రంలో యూనిట్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 8న రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుదుత్పత్తి ప్రారంభించామని చెప్పారు. మూడో యూనిట్ మరమ్మతులు ఈ నెలాఖరుకు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో, ఐదో యూనిట్ను రెండో వారంలో, నాలుగో యూనిట్ను సెప్టెంబర్ చివరి వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఆరో యూనిట్ పునరుద్ధరణపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పారు. సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి రెండు దశల్లో అనుమతులు వచ్చాయని, మిగిలిన అనుమతులు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని సీఈ తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే వరకు మెగా ఇంజినీరింగ్ కంపెనీలో, అనంతరం జలవిద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికులుగా ఉపాధి కల్పిస్తామన్నారు. నిర్వాసితుల ఉపాధి బాధ్యతను ప్రభుత్వం, ఏపీ జెన్కో తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు సీలేరు జలవిద్యుత్ కేంద్రం పరిసరాలను గ్రీన్బెల్ట్గా అభివృద్ధి చేసేందుకు 10 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంలో తొలగించే చెట్ల కొమ్మలతో మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసి, వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీఈ వెంట ఎస్సీ జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీ జైపాల్, ఏఈఈ సురేష్ ఉన్నారు. -
14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య
మాకవరపాలెం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై మంగళవారం స్థానిక కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు ఇవ్వాలని, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై వివరించారు. రక్షణ అధికారి మనోహర్ మాట్లాడుతూ పిల్లల హక్కులకు భంగం కలిగితే 1098, 181 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ శారదాదేవి, రూప పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
నర్సీపట్నం: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల విద్యార్థిని సింధు జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ 800 మీటర్స్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం, ఎంఈవో సిహెచ్.తలుపులు, పీడీ, ఇన్ఛార్జి హెచ్ఎం నూకరాజు, ఉపాధ్యాయు లు బద్రీనారాయణ, లక్షణరావు, ధర్మరాజు అభినందించారు. నర్సీపట్నం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరినీ ప్రిన్సిపాల్ వి.వి.రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. జిల్లాస్థాయి అమరావతి చాంఫియన్షిప్ పోటీల్లో కబడ్డీ కె.ఆశోక్, ఎ.లోకేష్, వాలీబాల్ పి.ప్రసాద్, వెయిట్ లిప్టింగ్ ఎ.రోహిత్, లాంగ్జంప్ టి.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అద్భుతంగా రాణించిన విద్యార్థులు, తర్ఫీదు ఇచ్చిన పీడీ వినోద్ను ప్రిన్సిపాల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 9 మంది ఎంపిక మాకవరపాలెం: అమరావతి ఛాంపియన్ షిప్ పోటీ ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపీడీవో చాయిసుధ, ఎంఈవోలు మూర్తి, ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ అభినందించారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ లో కబ డ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, రన్నింగ్ పోటీల్లో మాక వరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈవో మూర్తి మంగళవారం తెలిపారు. వీరిని ఆయనతోపాటు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో అభినందించారు. మాకవరపాలెం: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు 32 మంది అవంతి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మోహనరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అనకాపల్లిలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అయితే బాక్సింగ ఖోఖో, యోగా, బాడ్మింటన్, కబడ్డీ, వాటీబాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చూపి 32 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. తిరుపతిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. -
రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నలుగురు అరెస్టు, ఒకరు పరార్కశింకోట: కశింకోటలో పోలీసులు సుమారు రూ.30 లక్షలు విలువైన అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టుకొని నలుగుర్ని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సీఐ అల్లు స్వామినాయుడుతో కలిపి అనకాపల్లి ఇన్ఛార్జి డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వివరించారు. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు ఆటోలో ఇద్దరు బైక్ల ఎస్కార్ట్తో వెళుతుండగా అనుమానించి కశింకోట వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గోనె సంచుల్లో 30 ప్యాకెట్ల గంజాయిని నింపి ఆటో వెనుక ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతోపాటు గంజాయి తరలిస్తున్న కాకినాడకు చెందినగాడి సత్యంరాజు (28), రాజమండ్రికి చెందిన చైతన్య (34), ఒడిశాలోని కోరాపుట్కు చెందిన గుంత హిమాన్సు శేఖర్(27), కారా కేసరి(32) పోలీసులను చూసి పరార్ అవుతుండగా పట్టుకొని అరెస్టు చేశారు. మరో నిందితుడు మర్రి ఘాషి అలియాస్ రవి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. గంజాయి పట్టుకోవడంలో ఎస్ఐ లక్ష్మణరావు, చాకచక్యం ప్రదర్శించిన ఏఎస్ఐ శ్యామ్ సుందర్, హోంగార్డు డి.ఎస్ బాబుల పీసీలకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ ప్రత్యేక నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందించారు. కేసులో ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది సహకారం అందించారు. -
ఆరోగ్యకరమైన జీవనానికి మొక్కలు నాటాలి
అనకాపల్లి: జన్మించిన ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణ, మొక్కలను నాటి వాటి పర్యవేక్షణ చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మానవ మనుగడకు, ఆరోగ్యకరమైన జీవితానికి మొక్కలు అత్యంత అవశ్యకమని అన్నారు. చెట్ల ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ అభించమే కాకుండా పర్యావరణ సమతుల్యత కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి పూర్తి బాధ్యత స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, డీఎస్పీ కె.రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారు ఆభరణాల చోరీ
పాయకరావుపేట: పట్టణంలో గల రాజుగారిబీడులో ఆదివారం రాత్రి 88 గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు. రాజుగారిబీడుకు చెందిన రామోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి తిరిగి 10 వ తేదీన సోమవారం ఇంటికి వచ్చారు. ఇంటి మెయిన్గేటు, ఇంటి లోపల తలుపులు తెరిచి ఉండి, బెడ్రూమ్లో వున్న బీరువా తాళాలు పగులగొట్టి 88 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇంటి వరండాలో ఉన్న యాక్టివా మోటారు బైక్ను కూడా దుండగులు ఎత్తుకుపోయారని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
‘పాత పెన్షన్’ కోసం 1న చలో విజయవాడ
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ, ఏపీపీటీఏ జిల్లా అధ్యక్షుడు చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన జూడాలు
మహారాణిపేట: స్టైపెండ్ పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కేజీహెచ్లో ఓపీ సేవలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులకు దూరంగా ఉండటంతో వైద్యుల కోసం రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. పలు విభాగాల్లో శస్త్రచికిత్సలు సైతం వాయిదా పడ్డాయి. కేజీహెచ్తోపాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమ్మణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ, టీబీ ఆస్పత్రుల్లోనూ జూడోల సమ్మె ప్రభావం కనిపించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలను బహిష్కరిస్తున్నామని, అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతామని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు. -
పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్కు ఊరట
నర్సీపట్నం: పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులకు ఊరట లభించింది. విశాఖ ఎయిర్పోర్టులో మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన కోడి కత్తితో హత్యాయత్నం ఘటనపై ఆందోళన చేయడంపై 2018లో మాజీ ఎమ్మెల్యే గణేష్, మరికొంత మందిపై నర్సీపట్నం టౌన్ పోలీసు అక్రమ కేసు పెట్టారు. అదే సంవత్సరంలో ఓటరు లిస్ట్లో ఓటర్లను తొలగించడంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే అక్రమ కేసు బనాయించారు. తన వాదనలు విన్న కోర్టు ఈ రెండు కేసులను కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందని లాయర్ మాకిరెడ్డి బుల్లిదొర తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, సీనియర్ నాయకులు ఏకా రాజుబాబుకు ఊరట లభించింది. -
కొత్త సాఫ్ట్వేర్తో అదనపు భారం
విద్యుత్ వినియోగదారుల ఆందోళననర్సీపట్నం: విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం వినియోగదారులకు గుదిబండగా మారింది. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారులు సరైన సాంకేతిక అవగాహన, పర్యవేక్షణ లేకుండా రీడింగ్ నమోదు చేసే మిషన్లలో జియో ఫెన్సింగ్(జీపీఆర్ఎస్) సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రీడింగ్ సిబ్బంది స్వయంగా విద్యుత్ మీటర్ వద్దకు వెళ్తేనే తప్ప రీడింగ్ రాదు. మీటర్ల రీడింగ్ నమోదులో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా జియోఫెన్సింగ్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా 12వ తేదీలోపు మీటర్ రీడింగులు నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కొత్త సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయకపోవటం వల్ల 50 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిబ్బంది మీటర్ వద్దకు వెళ్లినప్పటికీ రీడింగ్ నమోదు కాకపోవడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి అదనపు ఆర్థిక భారం పడుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎలక్ట్రికల్ ఏఈఈ త్రినాథరావును వివరణ కోరగా, కొత్త సాఫ్ట్వేర్ వల్ల మొదటిలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. సకాలంలో రీడింగ్ నమోదు కానందున వినియోగదారులపై భారం పడకుండా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. -
లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్స్టాప్ సెంటర్కు తరలించినట్టు సీఐ తెలిపారు. -
గజ రాజసం
పొద్దున లేస్తే పావు టన్ను ఆహారం.. 150 లీటర్ల మంచి నీళ్లు! ఒక్కో గజరాజు ఏటా తిని, తాగేందుకే ఏకంగా రూ.4.30 లక్షల ఖర్చవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా సరే.. ఆ లెక్కలను పక్కనపెట్టి ప్రేమానురాగాలతో వాటి పొట్ట నింపుతున్నారు విశాఖ జూ అధికారులు, దాతలు. ఒకప్పుడు అడవుల్లో రాజసంగా తిరిగిన ఏనుగుల అడుగుల చప్పుడు.. కాలంతో పాటు క్రమంగా తగ్గుతోంది. ఆక్రమణల నడుమ గజరాజుల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నాలుగు ఏనుగులకు సురక్షిత అభయారణ్యంగా మారింది. నేడు ‘ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం’ వేళ విశాఖ ‘గజ’నేస్తాల ముచ్చట ఇదీ.. ఆరిలోవ: అరణ్యాల్లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంరక్షణ కూడా సవాలుగా మారింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్న గజరాజులు.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాటి సంఖ్య 250 లోపే ఉండటం గమనార్హం. ఇవి ఎక్కువగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూ రు జిల్లాల అడవులలో సంచరిస్తున్నాయి. ఒక్కోసారి ఆహారం కోసం ఇవి గుంపులుగా పంట పొలాల్లోకి చొరబడి భయపెడుతున్నాయి. కానీ విశాఖవాసులకు మాత్రం ఈ గజరాజులు నేస్తాలుగా మారిపోయాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో నాలుగు ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయి. విశాఖ జూలో ప్రత్యేక సంరక్షణ విశాఖ జూ పార్కులో లక్ష్మి, సరస్వతి అనే రెండు ఆడ ఏనుగులు, కృష్ణ, రాజు అనే రెండు మగ ఏనుగులు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇద్దరు మావటీలు, ఇద్దరు యానిమల్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. మావటీలు మాట్లాడే భాషను ఏనుగులు గుర్తుపట్టి, వారు చెప్పినట్లు వింటాయి. వీటి కోసం జూలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ‘మోట్’ ఉంది. అందులో రాత్రి వేళల్లో నిద్రించడానికి ‘నైట్ క్రాళ్లు’ నిర్మించారు. ఆరేళ్ల క్రితం వీటి స్నానం కోసం ప్రత్యేకంగా ఒక కొలనును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా అనారోగ్యం వస్తే జూ వెటర్నరీ వైద్యులు మావటీల సమక్షంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ‘కృష్ణ’ ● జూలో ఉన్న ఏనుగులలో 48 ఏళ్ల వయసు గల ‘కృష్ణ’ సుమారు 39 ఏళ్లుగా ఇక్కడే పెరుగుతోంది. అయితే ఇది ఒక్కోసారి మతిస్థిమితం కోల్పోయి మావటీల మాట కూడా వినదు. అందుబాటులో ఉన్న రాళ్లను తొండంతో తీసి విసురుతుంటుంది. అందుకే దీనిని సందర్శకులకు దూరంగా నైట్ క్రాల్కే పరిమితం చేసి సంరక్షిస్తున్నారు. ● 26 ఏళ్ల ‘రాజు’ అనే మగ ఏనుగును 2015 మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ అడవుల నుంచి పట్టుకుని జూకి తరలించారు. ● 61 ఏళ్ల సరస్వతి, దాని పిల్ల 25 ఏళ్ల లక్ష్మిలను చిత్తూరులోని కుప్పం ఏనుగుల క్యాంప్ నుంచి తీసుకొచ్చారు. ఇవి సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. రోజుకి 265 కిలోల ‘ఆహార’ విందు! జూలో ఒక్కో ఏనుగుకు రోజుకి సుమారు 265 కిలోల వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తారు. అలాగే రోజుకు కనీసం 150 లీటర్ల నీరు తాగుతాయి. ఒక్కో ఏనుగు రోజువారీ మెనూ.. అరటి దవ్వ 125 కిలోలు పచ్చి గడ్డి 75 కిలోలు చెరకు 40 కిలోలు పుచ్చకాయ 10 కిలోలు రాగి తోప 6 కిలోలు క్యాటిల్ ఫీడ్ 4 కిలోలు అరటి పండ్లు 6 కిలోలు ఆకుకూరలు 4 కిలోలు కొబ్బరికాయలు 2 బెల్లం పావు కిలో (తవుడు, ఇతర పదార్థాలతో కలిపి) ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా ఈ ఆహారాన్ని అందిస్తారు. జూలో అన్ని జంతువుల కంటే ఏనుగుల పోషణకే అత్యధికంగా ఖర్చవుతుంది. ఒక్కో ఏనుగు ఆహారం, పోషణ నిమిత్తం ఏడాదికి రూ.4.30 లక్షలు ఖర్చవుతోంది. ఇది పెద్ద మొత్తం కావడంతో దాతలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏనుగులను బాధ్యతగా సంరక్షిస్తున్నాం విశాఖ జూ పార్కులో ప్రతి ఏటా ఆగస్టు 12న ఏనుగుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాం. ఇక్కడున్న నాలుగు ఏనుగులకు పూర్తిస్థాయి రక్షణ, వైద్య సేవలు అందిస్తున్నాం. వాటి ఆహారానికి ఎక్కువ ఖర్చవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం. మరికొందరు కూడా ఈ సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. – డాక్టర్ జి.మంగమ్మ, జూ క్యూరేటర్, విశాఖపట్నం -
విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు అరెస్టు
ఎస్.రాయవరం : మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ మోటర్లు, వాటి వైర్లు చోరీ గురి కావడంతో రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో ఎస్.రాయవరం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. ఈ సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ రమేష్ ఉన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కశింకోట: అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేసి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్ అదనపు డైరెక్టర్ టి చైతన్య కల్యాణ జయ భరత్రాజ్ ఆదేశించారు. మండలలోని స్వర్ణ గ్రామ పంచాయతీగా ఎంపికై న జి.భీమవరం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పాలనా పరమైన చర్యలు చేపట్టి కొనసాగించాలన్నారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, ఇతర సేవలను మెరుగుపర్చడం, అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలు, ప్రభుత్వ పథకాల అమలుపై పారదర్శకత ఉండాలన్నారు. స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. గ్రామాన్ని జాతీయ పురస్కారం పొందడం కోసం పలు సూచనలు చేశారు. ఎంపీడీవో చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సాగునీటి వనరులూ మిట్టల్ స్టీల్కే...!
నక్కపల్లి : కూటమి ప్రభుత్వం ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం అన్నదాతలకు అన్యాయం తలపెడుతోంది. తరతరాలుగా సాగు అవసరాల కోసం ఉపయోగిస్తున్న వనరులను స్టీల్ప్లాంట్ ప్రయోజనాల కోసం కేటాయించేందుకు నిర్ణయించింది. మండలంలో కాగిత రెవెన్యూ పరిధిలో 17 ఎకరాల చెరువులు, గెడ్డలు గ్రామకంఠం భూములను ఏపీఐఐసీ ద్వారా స్టీల్ప్లాంట్కు బదలాయించేందుకు తెరలేపింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకోవాలని గ్రామ పంచాయతీలో నోటీసుల ద్వారా తెలియజేసింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం 2250 ఎకరాల భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాగిత గ్రామస్తులు తమ రెవెన్యూ పరిధిలో సుమారు 30 ఎకరాలను 80 అడుగుల రోడ్డుకోసం త్యాగం చేశారు. ఇపుడు రైతులు సాగు చేసుకుంటున్న భూములకు జీవనాధారమైన చెరువులు, గెడ్డలు, ఇతర సాగునీటి వనరులను సైతం స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే ఈ నీటి వనరులపై ఆధారపడి సాగు చేసుకుంటున్న భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం ఉందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రతిపాదన వస్తే హోంమంత్రిని ఆశ్రయిస్తే అటువంటి సమస్యలు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రెవెన్యూ అధికారులు కాగిత పరిధిలో ఉన్న చెరువులను స్టీల్ప్లాంట్కు ధారాదత్తం చేసే ప్రక్రియ చేపట్టంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములు బీడు వారాల్సిందేనా... ఈ చెరువులు, గెడ్డల కింద సుమారు 200 ఎకరాల వరకు ఆయకట్టు భూములున్నాయని, వరి, అపరాలు, కూరగాయలు ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటామని రైతులు చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం సాగునీటి వనరుల బదలాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాని పక్షంలో బోర్లు, వ్యవసాయ బావులు తదితర ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు. -
డెఫ్ టీ20 క్రికెట్ చాంపియన్షిప్ విజేత అనకాపల్లి
విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందిస్తున్న జేసీ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల: దివ్యాంగులమని వెనుకంజ వేయకుండా అద్భుత ప్రతిభ కనబరిచిన జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు ఫైనల్ పోటీలో విజయం సాధించి చాంపియనషిప్ ట్రోఫీని కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని జేసీ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో క్రీడాకారులకు ఆయన మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1, 2 తేదీల్లో విశాఖలోని నిర్వహించిన 4వ జోనల్–1 డెఫ్ టీ–20 క్రికెట్ చాంపియషిప్–2026 పోటీల్లో అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్లు పాల్గొన్నాయి. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన డెఫ్ క్రికెట్ జట్టు సభ్యులను అధికారులు అభినందించారు. -
గర్జించిన యువత
నిర్బంధాలను అధిగమించి మెగా డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువత, విద్యార్థులు చోడవరం : చోడవరంలో భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్, యువజన, విద్యార్థి విభాగాల నాయకులునర్సీపట్నం : నిరసన ర్యాలీని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే గణేష్, పార్టీ నాయకులు, యువతయలమంచిలి రూరల్ : యలమంచిలిలో ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త ధర్మశ్రీ, పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి నాయకులు పాయరావుపేట : పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంబాల జోగులు, పార్టీ నాయకులు, యువజన నాయకులుసాక్షి, అనకాపల్లి: : మెగా డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు కదంతొక్కారు. వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీలకు విశేష స్పందన లభించింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పలు చోట్ల ముందస్తు నోటీసులు జారీ చేస్తూ, అరెస్టులు చేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, పోలీసుల అక్రమ నిర్బంధాలను, ఆంక్షలను తెంచుకుంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, పాదయాత్రలకు అనుమతి లేదంటూ ర్యాలీలు ప్రారంభానికి 10 నిమిషాలు, అర్ధగంట ముందే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయనే నెపంతో నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో వందలాది మంది పోలీసులను మోహరించి బారికేడ్లు, రోప్లతో అడ్డుకున్నారు. అయినా సరే, యువత అవేమీ లెక్కచేయకుండా బారికేడ్లను తొలగించుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బైక్ ర్యాలీలకు అనుమతి నిరాకరించడంతో నాయకులు, విద్యార్థులు పాదయాత్రలుగా మారి నిరసన తెలిపారు. ఉద్రిక్తల నడుమ ర్యాలీ... అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గంలో యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అక్రమ నిర్బంధాలను అధిగమించి నిరసన ర్యాలీను విజయవంతంగా ముగించారు. ర్యాలీ ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు పోలీసులు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. అయినా యువత, విద్యార్థులు తగ్గేదేలేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటలకు సుంకరమెట్ట జంక్షన్ నుంచి బాలకృష్ణ బస్ట్ స్టాప్ వరకూ 1 కి.మీ మేర బైక్ ర్యాలీ చేశారు. ర్యాలీలో భారీగా యువత, విద్యార్థులు పాల్గొనడంతో పథకం ప్రకారం బాలకృష్ణ బస్ స్టాప్ వద్ద రోపుతో బైక్ ర్యాలీను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సమన్వయకర్త మలసాల భరత్కుమార్ నేతృత్వంలో బైక్ ర్యాలీ కాకుండా పాదయాత్రగా ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయినా పోలీసులు ఆగలేదు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ మోహన్రావు నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, యువత, విద్యా ర్థులను అడ్డుకున్నారు. దీంతో యువతకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. యువత ర్యాలీ ని పోలీసు నిర్బంధాలు ఆపలేకపోయాయి. అక్కడ నుంచి పాదయాత్రగా మరో రెండు కి.మీ మేర ర్యాలీ సాగించి విజయవంతంగా ముగించారు. నియోజకవర్గ పరిశీలకుడు సతీష్వర్మ, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, మందపాటి జానకీరామ్, గొర్లిసూరిబాబు పాల్గొన్నారు. బారికేడ్లు, రోప్లు దాటి.. పాయకరావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలకు యువత, విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. శాంతియుత ర్యాలీను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేశారు. పోలీసుల ఉద్రిక్తత నడుమ డీఎస్సీ అక్రమాలపై యువత, విద్యార్థులు తలపెట్టిన నిరసన ర్యాలీ సాగింది. ఉదయం 11 గంటలకు పాయకరావుపేట టౌన్లో పంచాయితీ కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రగా ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ కార్యాలయం నుంచి ఒక కి.మీ మేర పాదయాత్ర చేశారు. ర్యాలీని పోలీసులు రోపుతో అడ్డుకున్నారు. అయినా ఆగకుండా పోలీసుల రోపును తోసుకుంటూ అర కిలోమీటర్ వరకూ ర్యాలీ చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నినాదాలు చేసి ర్యాలీ ముగించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. అడుగడుగునా అడ్డంకులు యలమంచిలి నియోజకవర్గంలో మాజీ ప్రభుత్వ విఫ్, సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసులు ఆంక్షల నడుమ శాంతియుతంగా నిరసన ర్యాలీ విజయవంతం చేశారు. ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వ హించాలని భావించారు. ఇంతలో పోలీసులు వచ్చి ర్యాలీకు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. అయినా ర్యాలీ ఆపేది లేదంటూ ఉదయం 10.30 గంటలకు పాదయాత్రగా ర్యాలీ చేశారు. ముగ్గురు ఎస్ఐ, ఇద్దరు సీఐలతో పోలీస్ సిబ్బంది అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడా ఆగలేదు. పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకూ కిలోమీటరన్నర పాటు పాదయాత్రగా ర్యాలీ చేశారు. ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. గంటన్నర పాటు గృహ నిర్బంధంఅడ్డుకున్నా..రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో పోలీసుల ఆంక్షల నడుమ పాదయాత్ర ర్యాలీ విజయవంతంగా సాగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు బెదిరించే ప్రయత్నాలకు పాల్పడ్డారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ హైస్కూల్ జంక్షన్ నుంచి పాదయాత్రగా ర్యాలీ ప్రారంభమయ్యే అర్థ గంట పోలీసులు అనుమతి లేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు నోటీసు జారీ చేశారు. అయినా ఎక్కడా ర్యాలీ అపేది లేదంటూ యువత, విద్యార్థులు చెప్పడంతో పోలీసులు అడ్డుకునేందుకు తీవ్ర యత్నం చేశారు. భారీగా యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుతప్పుకున్నారు. ప్రభుత్వ హైస్కూల్ జంక్షన్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకూ 2 కి.మీ మేర పాదయాత్రగా రెట్టింపు ఉత్సాహంతో యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు శాంతియుత ర్యాలీ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్,ముఖ్యనాయకుడు దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. ర్యాలీకి ముందు నోటీసులు పోలీసు నిర్బంధాలను అఽధిగమించి వైఎస్సార్సీపీ యువ గర్జన పోలీస్ రోప్లు, బారికేడ్లు తొలగించుకొని దూసుకెళ్లిన యువత బైక్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పాదయాత్రగా ర్యాలీలు నియోజకవర్గం కేంద్రంలో వందలాది పోలీసులతో అడ్డగింత, తోపులాట భారీగా తరలి వచ్చిన యువత, విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులు గంటన్నర పాటు గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణ కోరుతూ హోరెత్తిన నినాదాలునర్సీపట్నం నియోజకవర్గంలో సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ర్యాలీను అడ్డుకున్నారు. ఆయనను గంట పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన చేయడానికి అనుమతి లేదంటూ ర్యాలీకు గంట ముందే నోటీసులు జారీ చేశారు. గణేష్ ఇంటికి సమీపంలోని మెయిన్ రోడ్డుపై పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులను గణేష్ నివాసానికి వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయకర్త ఇంటికి రావడంతో అక్కడ నుంచి పోలీసులను నిర్భందాలను అధిగమించి శాంతియుతంగా పాదయాత్ర ర్యాలీ చేశారు. పోలీసులు భారీ రోప్లు వేసి అడ్డుకున్నారు. దీంతో మెయిన్ రోడ్డుపై గణేష్తో పాటు యువత, విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులు బైటాయించారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని గణేష్ పోలీసుతో వాదనకు దిగారు. దీంతో సీఐ గపూర్, గణేష్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గణేష్ రోడ్డుపై బైఠాయించారు. జెండాలు, ప్లేకార్డులతో పార్టీ శ్రేణులు చేతపట్టి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ సిబ్బంది రిలేదీక్షలు
కశింకోట : కశింకోటలోని ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది తమకు జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టి నిర్వహించారు. ముందుగా కళాశాల ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది నిరాహార దీక్షలు చేపట్టారు. కుదించిన జీతాలను పునరుద్ధరించాలని, వేతన సవరణ ప్రకారం జీతాలు ఇవ్వాలని, రాజీనామా చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలు కొనసాగిస్తుండగా మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, అధ్యాపక సిబ్బంది యూనియన్ ప్రతినిధులతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు పిలిచి ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీఈపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ వనజ, సీఈవో రామకృష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్ సాల్మాన్రాజు, విజిలెన్స్ ఎస్పీ కింజరపు శ్రీనివాసరావు, ఎపీఈపీడీసీఎల్ అనకాపల్లి సూపరింటిండెంటింగ్ ఇంజనీర్, ఆర్ఈసీఎస్ ఎండీ కూడా అయిన జి.ప్రసాద్ తదితరులు పాల్గొని చర్చించిన అనంతరం ఈ నెల 20లోగా సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. అలాగే రెండు మూడు రోజుల్లో ఏపీఈపీడీసీఎల్ సీఎండీని కలిసే ఏర్పాట్లు కూడా చేస్తామని, దీక్షలు విరమించాలని కోరారు. దీంతో దీక్షలను తాత్కాలికంగా వరమిస్తున్నట్టు కళాశాల ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు హేమంత్, కార్యదర్శి నగేష్, అధ్యాపక సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి
సాక్షి, అనకాపల్లి : భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహిస్తున్న ‘పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అండ్ హ్యాస్ అనే నేను’ కార్యక్రమంలో జిల్లా ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. 30 సెకన్ల పాటు ‘అనే నేను’ వీడియోను దేశ ప్రగతికి మీ లక్ష్యాన్ని పేర్కొంటూ రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యతను చాటేలా, తమ వంతుగా చేయగలిగే ఒక మంచి పనిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 14న నిర్వహించే రాష్ట్రవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను, దేశ నిర్మాణంలో తాము చేయాలనుకుంటున్న కృషిని వెల్లడించేలా ప్రోత్సహించాలని తెలిపారు. వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో PartnersInNationBuilding, # MyIndia MyVision, # IndependenceDay2026, # AneNenu హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించి @APOfficialNews ట్యాగ్ చేయాలని తెలిపారు. -
ఎంపీ రమేష్ గనుల దోపిడీపై ఢిల్లీలో తేల్చుకుంటాం
● మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్జిల్లాలో మైనింగ్ చోడవరం : జిల్లాలో మైనింగ్ మాఫియా నడిపిస్తూ గనులను దోచేస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంగతి ఢిల్లీలో తేలుస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్ అన్నారు. చోడవరంలో వైఎస్సార్సీపీ సోమవారం నిర్వహించిన ర్యాలీలో అమర్నాఽథ్ మాట్లాడుతూ దోచుకోవడానికి సీఎం రమేష్ అనకాపల్లి వచ్చారని ఆరోపించారు. పచ్చని పొలాలను ఆనుకొని ఉన్న పచ్చని కొండలను పిండి చేసి మైనింగ్ మాఫియా నడిపిస్తూ గనులను దోచుకొని అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ధ్వజమెత్తారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండతో పాటు జిల్లాలో గ్రానైట్, నల్లరాయి, మెటల్, మట్టి వంటి గనులను అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. ఆయన దోపిడీ నుంచి ఈ ప్రాంతాలన్నీ పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. -
జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి
దేవరాపల్లి : జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేవరాపల్లిలో సోమవారం ‘జైల్ భరో’ కార్యక్రమం జరిగింది. రైవాడ అతిథి గృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర, ఈర్లె నాయుడుబాబు, రొంగలి ముత్యాలనాయుడు, గాడి ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 31 వేలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయులు మాకవరపాలెం : జిల్లాస్థాయి ఆటల పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మూడు రోజులుగా అనకాపల్లిలో జిల్లాస్థాయిలో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.సింధుజ, కె.ఇందు, వి.పూజిత, అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఎస్.తులసీరాజ్, అండర్–17 చెస్ పోటీల్లో వి.చరణ్ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం వి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. వీరిని పీఈటీలు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. -
పీజీఆర్ఎస్పై తగ్గుతున్న నమ్మకం
తుమ్మపాల : సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఆశతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు వ్యయప్రయాసల కోర్చి వచ్చారు. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ, అర్జీ పరిష్కారం మాత్రం కింది స్థాయి అధికారుల పరిధిలోకి వెళ్లడంతో అక్కడే సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అర్జీదారులు చెబుతున్నారు. పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. దీంతో పీజీఆర్ఎస్పై ప్రజల్లో క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కలెక్టరేట్కు వచ్చే అర్జీదారుల కోసం ఇటీవల కొన్ని వారాలుగా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అర్జీదారులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు, ఎండ నుంచి రక్షణ కల్పించే టెంట్లు, తాగునీటి వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 306 అర్జీలు ననమోదు కాగా వాటిలో 170 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. పీజీఆర్ఎస్, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, పలు శాఖల అధికారులు గోపాల్ రాజా, ఆశా దేవి పాల్గొన్నారు. నూరుశాతం వైకల్యం..పింఛను అందించరూ.. వైద్య అధికారుల నమోదు చేసిన వివరాల్లో జరిగిన తప్పిదం కారణంగా 100 శాతం దివ్యాంగుడైన తన కుమారుడికి ప్రభుత్వం అందించాల్సిన పూర్తి పింఛన్ అందడం లేదని అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ కొత్తతలారివానిపాలెం గ్రామానికి చెందిన గంతకోరు సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టుకతో దివ్యాంగుడైన తన కుమారుడి జశ్వంత్ సదరం సర్టిఫికెట్లో దివ్యాంగత్వాన్ని తప్పుగా నమోదు చేయడంతో నెలకు రూ.6 వేల పింఛన్ మాత్రమే వస్తోందని, దీనిని సరిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.15 వేల పింఛన్ అందించాలని కోరింది. ఏఎంఆర్ అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఏఎంఆర్ సంస్ధ చెక్పోస్టులను తొలగించి ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఓనర్స్,డ్రైవర్స్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సీనరేజ్ పేరుతో ప్రతి గ్రామంలో చెక్పోస్టులు పెట్టి మైనింగ్ లారీల నుంచి సరుకు టన్నుల లెక్కన లెక్కింపు చేసి వసూళ్లు చేసిన సోమ్మును ప్రభుత్వానికి చెల్లింపులు చేయకుండా అక్రమ బిల్లులతో ఏఎంఆర్ సంస్ధ దోచుకుంటుందని ఆరోపించారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. భూ నిర్వాసితుల హామీలు నెరవేర్చండి.. పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ భూ నిర్వాసిత రైతులకు ఉద్యోగ, ఉపాధి, ఆర్అండ్ఆర్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈమేరకు స్పష్టమైన రాత పూర్వక హమీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలని పీజీఆర్ఎస్లో వినతి అందించారు. పాస్టర్ల నిరసన క్రైస్తవులను కూడా షెడ్యూల్డ్ కులాలుగా గుర్తిస్తూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేసి వేధింపులు, దాడులు, అఘాయిత్యాల నుంచి క్రైస్తవ మైనారిటీ సమాజాన్ని రక్షించాలంటూ పాస్టర్లు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. షెడ్యూల్డ్ కులాల మూలానికి చెందిన క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల హోదా నుంచి మినహాయించడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, వైస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జోసెఫ్, క్రిస్టియన్ సంఘ పెద్దలు ఫాదర్స్ జోసఫ్ ప్రభాకర్, రవీంద్ర, రత్నాకర్, ప్రసాధ్, బాలరాజు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 55 అర్జీలు
ఎస్పీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ మోహన్రావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు సోమవారం 55 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు ఆర్జీదారుల ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత హామీలు, ఆర్థిక నేరాలు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వాటిపై ఆర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుకు రెండు పాడి ఆవులు మృతి
రావికమతం: మండలంలో మరుపాక శివారు దాసరయ్యపాలెంలో ఆదివారం పాముకాటుకు గురై రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దాసరయ్యపాలెం గ్రామానికి చెందిన వేపాడ సత్తిబాబు రెండు పాడి ఆవులు ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. సత్తిబాబు ఆదివారం కూలీ పనికి వేరే ప్రాంతానికి వెళ్లగా భార్య కొండమ్మ ఆవులను మేతకు తోలుకెళ్లింది. మధ్యాహ్నం ఆవులను పశువుల పాక వద్దకు తోలుకొచ్చి దాణా పెట్టి ఇంటికి వెళ్లింది. సాయంత్రం కొండమ్మ పశువుల పాక వద్దకు రాగా అప్పటికే రెండు ఆవులు మృతి చెందడంతో కొండమ్మ ఏడుస్తూ కేకలు వేసింది. పాకకు సమీపంలో ఉన్న రైతులు పాక దగ్గరకు వచ్చి చూడగా పాము కరవడం వల్లనే ఆవులు చనిపోయి ఉండవచ్చు ఆని రైతులు తెలిపారు. ఆవుల మృతి చెందిన సమాచారం గ్రామ సచివాలయం పశువైధ్యాధికారి సత్యనారాయణకు తెలియపర్చగా ఆయన వచ్చి ఆవులను పరీశీలంచగా పాము కాటుకు మృతి చెందాయని నిర్ధారించారు. జీవనాధారమైన రెండు ఆవులు రూ.1లక్ష 40 వేలు విలువ చేస్తాయని, అప్పులు చేసి ఆవులు కొని జీవనం సాగిస్తున్నామని రైతు సత్తిబాబు, భార్య కొండమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఫ్లైయాష్ రవాణా
ప్రాణసంకటంగా..టోల్ఫీజును తప్పించుకునేందుకు రోడ్లపైనే అన్లోడింగ్ టోల్ప్లాజావద్ద రోడ్డుపై పడిన ఫ్లైయాష్ను తొలగిస్తున్న టోల్ ఎన్హెచ్ఏఐ కార్మికులునక్కపల్లి: పరవాడ ఎన్టీపీసీ నుంచి బూడిద (ఫ్లై యాష్) అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పరిమితికి మించి లారీల్లో లోడ్ చేసి కాకినాడ తరలిస్తున్నారు. ఎన్టీపీసీ, రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు నిర్లిప్తంగా వ్యవహరించడానికి కారణమేంటి ? తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నా ఉన్నతాధికారులు తగిన విధంగా స్పందించకపోవడంతో జాతీయరహదారిపై ప్రయాణించేవారు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెనాల్టీల నుంచి తప్పించుకునేందు.. రాజమండ్రి నుంచి గత కొద్దినెలలుగా బండరాళ్లను రాంబిల్లి ప్రాంతాలకు భారీ లారీల్లో తరలిస్తున్నారు. 40 టన్నులకు మించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఒక్కో లారీలో 80 టన్నుల వరకు లోడు వేసి టోల్ఫీజునుంచి తప్పించుకునేందుకు వేంపాడు, చందనాడ, ఉపమాక మీదుగా జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే లారీల్లో పరవాడ వద్ద ఉన్న ఎన్టీపీసీ నుంచి వెలువడే ఫ్లైయాష్ను కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. నిత్యం సుమారు 40 నుంచి 50 ట్రిప్పర్లలో ఈ బూడిదను 70 నుంచి 80 టన్నుల వరకు లోడింగ్ చేసి తీసుకెళ్తున్నారు. టోల్ప్లాజా వద్ద తనిఖీలు చేసి, ఓవర్ లోడ్ కారణంగా రూ.5 వేల వరకు పెనాల్టీ వేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తే తప్ప టోల్గేట్లో నుంచి అనుమతించడం లేదు. దీంతో డ్రైవర్లు లారీలను కొద్దిదూరం వెనక్కి తీసుకెళ్లి సగం ఫ్లైయాష్ను రోడ్డుపక్కన, జాతీయరహదారి మధ్యలో ఇష్టానుసారం అన్లోడ్ చేస్తున్నారు. కొన్ని లారీల డ్రైవర్లు టోల్ఫీజు నుంచి తప్పించుకునేందుకు మారుమూల గ్రామాలనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. భయం భయంగా... జాతీయరహదారిపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహన చోదకులు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించేవారి కళ్లల్లో ఈ బూడిద పడి నేత్ర సంబంధిత సమస్యలు వస్తున్నాయి. రోడ్డుపక్కన, మధ్యలో అన్లోడ్ చేసిన బూడిద విపరీతంగా వీచే గాలుల వల్ల ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుండడంతో రోడ్డు కనిపించడం లేదు. దీంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.రోడ్డుపై వెళ్లాలంటే భయ పడుతున్నారు. కనీసం బండిపై ఫ్యామిలీని తీసుకు వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. భారంగా మారిన తొలగింపుటోల్ప్లాజాకు సమీపంలో ఈ ఫ్లైయాష్ను అన్లోడ్ చేయడం వల్ల గాలులు వీచే సమయంలో బూడిద వచ్చి ప్లాజా వద్ద పేరుకుపోతోంది. దీంతో అక్కడి సిబ్బంది నిత్యం దానిని తొలగించవలసి వస్తోంది. రోడ్డుపై పడిన ప్లైయాష్ శుభ్రం చేసేందుకు కొంతమంది స్వీపర్లను ప్రత్యేకంగా వినియోగించాల్సి వస్తోంది. ఈ పని తలకు మించిన భారంగా మారుతోందని టోల్ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదకరంగా రాకపోకలు కళ్లలో పడి నరకయాతన పడుతున్న ప్రయాణికులు పరిమితికి మించి ఎన్టీపీసీ నుంచి బూడిద తరలింపుకూటమి నేతల అండదండలతో యథేచ్ఛగా రవాణాఅధికారులు పట్టించుకోవడం లేదు జాతీయరహదారిపై ఎక్కడికక్కడ ఫ్లైయాష్ను ట్రిప్పరు డ్రైవర్లు అన్లోడ్ చేస్తున్నారు. కాగిత సమీపంలో కూడా వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లేవారి కళ్లలో ఈ బూడిద పడుతుండడంతో నరకయాతన పడుతున్నారు. కంటిచూపు పోయే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాదినుంచి ఈ దందా సాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. టోల్ఫీజు తప్పించుకునేందుకు ఈలారీలు గ్రామాల్లోనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. –పోతంశెట్టి బాబ్జి, కాగిత పరవాడ ఎన్టీపీసీ ఫ్లై యాష్ (బూడిద) తరలింపు ప్రయాణికుల పాలిట ప్రాణసంకటంగా మారింది. గాలికి ఆ రేణువులు వాహన చోదకుల కళ్లలో పడుతుండంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. తరలించే సమయంలో తనిఖీలు నిర్వహించి అధిక పెనాల్టీలు విధిస్తుండడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు రోడ్లపై ఎక్కడిపడితే అక్కడ బూడిదను డంప్ చేస్తుండడంతో రహదారుల్లో పరిస్థితి దారు ణంగా ఉంది. కొంతమంది డ్రైవర్లు అధిక లోడుతో ఉన్న లారీలను ఉపమాక, చందనాడ, అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయరహదారిపై చేరుకుని టోల్ప్లాజాను తప్పించుకుని వెళ్లిపోతున్నారు. అనుమతి లేని రహదారుల్లో మితిమీరిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా గ్రామాల మధ్యలో నుంచి వెళ్లే సమయంలో బూడిద ఆ రోడ్లపై పడి గాలికి ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ఆయా గ్రామాల వారు ఇబ్బందులకు గురతున్నారు. 80 టన్నుల బరువుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల గ్రామీణ రోడ్లు శిథిలమై... ఎక్కడికక్కడ గోతులు పడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఫ్లైయాష్ రవాణా చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫ్లైయాష్ రవాణాకు ఉమ్మడి విశాఖ జిల్లా, కాకినాడ జిల్లాకు చెందిన కొంతమంది కూటమిపెద్దల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ
● పద్మనాభం సంతాప సభలో బొత్స,కన్నబాబు, అమర్నాథ్ ● పాల్గొన్న కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు తోట రాజీవ్, ఉత్తరాంధ్ర కాపు నేతలు సాక్షి, విశాఖపట్నం: ‘దివంగత మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు జాతి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, ఆయన ఆశయం, ఆలోచన, స్ఫూర్తితో కాపులంతా ఒక్కటై అదే బాటలో పోరాటం సాగించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో సిరిపురం జంక్షన్లోని వీఎంఆర్డీఏ ఎరేనాలో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాపునాడు నాయకుడు తోట రాజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీలకతీతంగా కాపు నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాపు జాతికి ముద్రగడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ముద్రగడ చిత్రపటానికి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తోట రాజీవ్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ హర్షకుమార్, కాపునాడు జేఏసీ నాయకులు సాయిసుధాకర్ నాయుడు, చందు జనార్థన్, ఆకుల రామకృష్ణ, ఏసుదాస్, ఆరేటి ప్రకాష్, తోట రామకృష్ణ, అడ్వకేట్ బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది కేవలం ముద్రగడ సంతాప సభ మాత్రమే కాదని, కాపు జాతికి ఒక సందేశ సభ అని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు నాటి ప్రభుత్వం జీవో నెం.30 ఇచ్చినప్పటికీ, అది ఆచరణలో పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేదన్నారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా వేర్వేరు పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ, ఏ ఒక్కరూ తమ సొంత జాతికి నష్టం చేకూర్చేలా వ్యవహరించకూడదని కోరారు. ‘‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తమ పార్టీ నాయకులు సొంత సామాజిక వర్గ కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీలోని కాపు నాయకులు ముద్రగడ సంతాప సభకు వెళ్లకూడదని ఆదేశించడం ఆయన శైలికి, రాజకీయ పరిపక్వతకు తగదు’’ అని విమర్శించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎందరో నాయకులను చూశామని, కానీ కాపు జాతి కోసం ముద్రగడ వేసిన ముద్ర చెరగనిదని కొనియాడారు. చాలామంది రాజకీయ నాయకులు తమ సామాజిక వర్గాల ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, కానీ ముద్రగడ మాత్రం జాతి ప్రయోజనాల కోసం పదవులను, రాజకీయాలను సైతం త్యాగం చేశారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంతో తమ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉందని తెలిపారు. ముద్రగడ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదన్నారు. కాపు రాష్ట్ర జేఏసీ నాయకుడు తోట రాజీవ్ మాట్లాడుతూ ముద్రగడ తనకు చిరకాల మిత్రుడని, ఆయన మన మధ్య లేరనే వార్త కాపు జాతి అభ్యున్నతకే అడ్డుపడినట్లేనన్నారు. కాపు జాతి కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచే ముద్రగడతో పరిచయం ఉందని, తనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది ఆయనేనని తెలిపారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముద్రగడకు వందలాది ఎకరాల ఆస్తి ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆర్థికంగా ఎదగలేదని, పైగా సొంత ఆస్తులనే ప్రజల కోసం ఖర్చు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, కాపు నేతలు జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్గాంధీ, పీలా ఉమారాణి, గూటూరు నరసింహమూర్తి, పీవీ సురేష్, కోరాడ రాజుబాబు, కోడిగుడ్ల ఫూర్ణిమ శ్రీధర్, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
నాతవరం: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమాధికారి జి.మంగవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక గిరిజనుల సమస్యలు పరిష్కరించామని, మిగతా వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. పూర్వ ఆచారాలు పక్కన పెట్టి తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పట్టుదలతో సాధించాను.. పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఐఏఎస్ సాధించానని చెప్పారు. తమ స్వగ్రామం, తల్లిదండ్రుల పరిస్థితి, యూపీఎస్సీ పరీక్షలు రాసిన తీరు తదితర వివరాలను తెలిపారు. చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదని, నేడు అనేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని చెప్పారు. బాల్య వివాహాల జోలికి వెళ్లకుండా పిల్లలను బాగా చదివించాలని సూచించారు. నన్ను నా తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే నేను కలెక్టర్ను కాకపోయేదానిని అని అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మంగవేణి మాట్లాడుతూ జిల్లాలో నాబార్డు నిధులు రూ.9.66 కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. 6,716 మంది గిరిజనుల ఇళ్ల వద్ద కుళాయిలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 22 గిరిజన పాఠశాలల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. ఘన స్వాగతం అంతకుముందు కలెక్టర్, ఇతర అధికారులకు గిరిజన సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరలో తిలకం దిద్ది, హారతి ఇచ్చి పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఆశ్రమ పాఠశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి కలెక్టర్ థింసా నృత్యం చేశారు. బాణం సంధించి, గిరిజన సంప్రదాయ సంగీత పరికరాలను వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటర్మీడియెట్, పదవ తరగతి పరీక్షల్లో జిల్లాస్థాయిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ, గిరిజన పెద్దలను ఘనంగా సత్కరించారు. ముందుగా మొక్కలు నాటి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు రాజాన వీర సూర్యచంద్ర, వెలకాడ వెంకట కృష్ణారావు, కోండ్రు మరిడియ్య, జిల్లా మలేరియా అధికారి వరహాలదొర, తహసీల్దార్ చందనరేఖ, ఇన్చార్జి ఎంపీడీవో పోలుపర్తి పార్థసారథి, డిప్యూటీ తహసీల్దార్ టి.వి.ఎల్. రాజు, వైఎస్సార్సీపీ నాయకుడు బండి గంగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టరు పట్టెం రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం దోపిడీ ఆచార్యా..!
విశాఖవిద్య: అవకాశం ఇవ్వాలే కానీ మొత్తం పిండేస్తాం అన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు అడ్డగోలుగా వర్సిటీ సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన పేరుతో రీసెర్చ్ స్కాలర్స్ను అడ్డంగా వాడుకుంటున్న వ్యవహారం ప్రస్తుతం వర్సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏయూ నిధులను అడ్డదారిలో మళ్లించేందుకు లక్షల విలువైన దొంగ బిల్లులను వైస్ చాన్సలర్ టేబుల్ వద్దకు చేర్చినట్లు ప్రచారం సాగుతోంది. పలు విభాగాల్లో పీహెచ్డీ స్కాలర్లను టెంపరరీ టీచింగ్ అరేంజ్మెంట్స్ కింద పనిచేస్తున్నట్లు చూపించి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలు దోపిడీ ఇలా... సాధారణంగా ఏయూలో పీహెచ్డీ పూర్తిచేసిన వారికి టీటీఏలుగా అవకాశం కల్పించి విద్యార్థులకు బోధన చేయిస్తారు. వీరికి సెమిస్టర్ చొప్పున ఏయూ రూ.లక్షల్లో ఫీజు చెల్లిస్తుంది. అయితే పీహెచ్డీ స్కాలర్స్తో ఉచితంగా టీచింగ్ సేవలు వినియోగించుకోవాలని యూజీసీ నిబంధన ఉంది. దానికి అనుగుణంగా వైస్ చాన్సలర్లు ప్రొసీడింగ్స్ ఇస్తుంటారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు విభాగాధిపతులు స్కాలర్లతో ఉచితంగా పాఠాలు చెప్పిస్తూ, వారిని టీటీఏలుగా చూపుతూ దొంగ బిల్లులు పెట్టి వర్సిటీ సొమ్ము దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి టీటీఏలుగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. కానీ కొందరు విభాగాధిపతులు వర్సిటీ యాజమాన్య మెతక వైఖరిని అవకాశంగా తీసుకుని, స్కాలర్లనే టీటీఏలుగా చూపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వైస్ చాన్సలర్ కళ్లుగప్పి ఈ దొంగ బిల్లుల వ్యవహారమంతా వైస్ చాన్సలర్ కళ్లుగప్పి నడుస్తున్నట్లు ఏయూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీసీ పర్యవేక్షణ లోపాన్ని అదునుగా చేసుకుని కొందరు ఆచార్యులు ఈ కక్కుర్తికి పాల్పడుతున్నట్లు సమాచారం. పీహెచ్డీ స్కాలర్లకు జరుగుతున్న అన్యాయంపై వైస్ చాన్సలర్కు ఫిర్యాదు వెళ్లడంతో, ఆయన విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి ఆరా తీశారు. డిపార్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ దృష్టికి ఈ విషయాలను తీసుకువచ్చారా లేదా అని ప్రశ్నించారు. అయితే అప్పటికప్పుడు వీసీని నమ్మించి, డీఆర్సీ రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసేందుకు కూడా కొందరు దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఇలా పరిపాలన రంగాన్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయల దొంగ బిల్లులను పంపగా, అవన్నీ ప్రస్తుతం వీసీ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి. సమగ్ర విచారణ జరపాలి: ఉద్యోగ సంఘాలు పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉండి కాసులకు కక్కుర్తి పడుతూ, స్కాలర్లను వాడుకుంటూ దొంగ బిల్లులతో వర్సిటీ ఆదాయానికి గండికొడుతున్న విభాగాధిపతులపై తక్షణమే విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్డీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి అవకాశం దక్కకుండా చేస్తున్న ఇటువంటి పరిస్థితుల నుంచి వర్సిటీని కాపాడాలని కోరుతున్నారు. వర్సిటీ పాలనపై వీసీ పూర్తిస్థాయి దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఘనంగా మోదమాంబ అమ్మవారి జాతర
మాడుగుల రూరల్: కె.జె.పురం మోదమాంబ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఘాటాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించారు. సాయంత్రం నుంచి నేల వేషాలు, శక్తి వేషాలు, తీనుమార్, తప్పెటగుళ్లు, జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రికి గ్రామంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దాతల సహకారంతో పులిహోర, మజ్జిగ, ప్రూటు సలాడు, స్వీటు భక్తులకు అందజేశారు. అరుణా కేటరింగ్ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు, చిరు వ్యాపారులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్సాహంగా ఎడ్ల పరుగు పోటీలు జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పోటీలను మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జాతరలో ఆకర్షణీయంగా ఆడారి కుటుంబీకులు అయిన ఆడారి కామునాయుడు కుటుంబ సభ్యులు ప్లాస్టిక్తో తయారు చేసిన ఏలిఏనుగు మీద ఎక్కి గ్రామంలో తిరిగారు. -
వీకెండ్ సందడి
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి, అరకు ఫైనరీలో ఆదివారం సందడి నెలకొంది. శనివారం బంద్ కారణంగా పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయిలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు గిరిజన సంప్రదాయ వస్త్రాలను ధరించి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. అరకు ఫైనరీ వద్ద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటస్థలంలో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు. పర్యాటక ప్రదేశాల్లో గిరిజనులు విక్రయించే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీకి ప్రత్యేక ఆదరణ లభించింది. -
సమస్యలపై ఏకరువు
నాతవరం: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో పలువురు ఏకరువు పెట్టారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సరుగుడు, అసనగిరి పంచాయతీల పరిధిలో 16 శివారు గ్రామాలున్నాయని, సెల్ టవర్లు లేక సెల్ సిగ్నల్స్ రావడం లేదని, దీంతో సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 589 మందికి హక్కు పత్రాలు ఇచ్చారని, మిగిలిన వారికి మంజూరు చేయాలని కోరారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ గిరిజనులకు అందడం లేదని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు జనార్ధన్ మాట్లాడుతూ నర్సీపట్నంలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో 1/70 యాక్టు పరిధిలో ఉన్న మండలాల్లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణం తెలిపారు. రావికమతం మండలం కల్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
స్వల్పంగా పెరుగుతున్న ‘కోనాం’ నీటిమట్టం
చీడికాడ: చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోనాం జలాశయం నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతూ ప్రస్తుతం 93.05 మీట ర్లకు చేరుకుంది. 35 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు. ఈ జలాశయం కింద ఐదు మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువ కాలువ పరిధిలో 4,500 ఎకరా లు, దిగువ కాలువ పరిధిలో 10 వేలఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఎగువ కాలువలో నీరు పారే అవకాశం లేదు. మరో 3 మీటర్ల నీటిమట్టం పెరిగితే తప్ప కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఆయ కట్టు రైతులు వరినారు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఇదే నెలలో నీటిమట్టం 93.90 మీటర్ల వద్ద ఉన్నా, తర్వాత వర్షాలు కురవడంతో ప్రమాదస్థాయికి చేరుకుంది. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమాలను సో మవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో నిర్వహించను న్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. అర్జీదారులు నేరుగా కార్యాలయాలకు చేరు కుని తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేని వారు ఆన్లైన్లో Meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో సమర్పించిన అర్జీల సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్. 1100కు కాల్చేసి తెలుసుకోవాలని సూచించారు. -
13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు. నిత్య పూజలు.. సమయాలు నెల రోజుల పాటు రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పూజలు జరుగుతాయి. అలాగే విశేష దినాలైన గురు, శుక్రవారాల్లో రెండు విడతలుగా ఉదయం 8 నుంచి 9 వరకు, 9.30 నుంచి 10.30 వరకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పూజలో భాగంగా సంకల్పం, లక్ష్మీ సహస్రనామార్చన, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం మరియు వేదాశీర్వచనం చేపడతారు. భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చనుంది. టికెట్ రుసుము ఈ సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలచే భక్తులు (దంపతులు) రూ.516 టికెట్ రుసుము చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్ ముక్క, పావు కేజీ పులిహోర, పావు కేజీ చక్కెర పొంగలి, రాగి శ్రీచక్రయంత్రాన్ని మహాప్రసాదంగా అందజేస్తారు. ముఖ్యమైన పర్వదినాలు శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 21) వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించనున్నారు. మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో (ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4, 11) విశేష కార్యక్రమాలు ఉంటాయి. 13న పూజల ప్రారంభం ఈ నెల 13న ఉదయం 8.20 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పూజలను అధికారికంగా ప్రారంభించనున్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఈవో కోరారు. పరోక్ష/ఆన్లైన్ సేవల వివరాలు: ఆలయానికి నేరుగా రాలేని స్థానికేతర భక్తుల గోత్రనామాలతో పూజ నిర్వహించి, లక్ష్మీ యంత్రం, కుంకుమ, ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతారు. బ్యాంక్ ఖాతా వివరాలు: 060810011006691 (ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0806081), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్. ఫోన్ నంబర్లు: 0891–2568645, 2566515, 2731250 వెబ్సైట్: www.aptemples.org ఆన్లైన్ పూజల సమాచారం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్లో కూడా సంప్రదించాలని ఈవో సుజాత పేర్కొన్నారు. -
రాయితీ రుణాలకు ఎదురుచూపులు
కె.కోటపాడు: బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇంటర్వ్యూలు నిర్వహించి 16 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25కు సంబంధించి బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు 2025 మార్చిలో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మాడుగుల నియోజకవర్గం నుంచి 2,275 మంది దరఖాస్తు చేశారు. కె.కోటపాడు మండలం నుంచి 645 మంది, దేవరాపల్లి మండలం నుంచి 520 మంది, చీడికాడ మండలం నుంచి 200 మంది, మాడుగుల మండలం నుంచి 910 మంది దరఖాస్తు చేసుకున్నారు. కె.కోటపాడు మండలంలో దరఖాస్తుదారులకు మండల పరిషత్ అధికారులు బ్యాంకర్లతో కలిసి 2025 ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు జరిగి సుమారు 16 నెలలు గడిచినా ఏ ఒక్కరికీ రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు.రుణాలు మంజూరవుతాయని, తద్వారా ఉపాధి పొందవచ్చని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 26 నెలలు గడుస్తున్నా ఒక్క ఏడాది కూడా రుణాలు మంజూరు కాలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు ఇవ్వాలి బీసీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేశా ను. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాను. సబ్సిడీతో రుణం మంజూరు చేస్తే ఆటో కొనుగోలు చేయాలని అనుకున్నాను. ఇంటర్వ్యూలు పూర్త యి నెలలు గడుస్తున్నా ఏ ప్రకటనా రాలేదు. – ఎల్.నర్సింగరావు, చౌడవాడ,కె.కోటపాడు మండలం -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో ఆదివారం బీఎస్ఎఫ్ 103వ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. బీఎస్ఎఫ్ కమాండెంట్ నీరజ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బీఎస్ఎఫ్ జవాన్లు, విద్యార్థులు, స్థానికులు క్యాంప్ నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఈ సందర్భంగా కమాండెంట్ నీరజ్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. -
న్యాయవ్యవస్థలో అడ్వకేట్ గుమాస్తాల పాత్ర కీలకం
అల్లిపురం: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ క్లర్కుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇటీవల మరణించిన సీనియర్ అడ్వకేట్ క్లర్క్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ సుదీర్ఘంగా 53 సంవత్సరాల పాటు గుమస్తాగా అందించిన సేవలను కొనియాడారు. అలాగే న్యాయవాదులు, అడ్వకేట్ క్లార్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం.కె. శ్రీనివాసరావు, ఎస్. నాగేశ్ కుమార్ మాట్లాడుతూ.. అడ్వకేట్ క్లర్కుల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లర్కుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో క్లార్కుల సంక్షేమం, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, సీనియర్ న్యాయవాదులు బెవర సత్యనారాయణ, కే. సురేష్ కుమార్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు పిల్ల బంగారు నాయుడు, కార్యదర్శి నల్ల భాస్కర రావు, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సభ్యులు జి. శివకృష్ణ, గొర్లి కృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు పాల్గొని నివాళులర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు -
విత్తన బంతులతో అడవుల పునరుజ్జీవనం
సీలేరు: ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ అడవులు ప్రకృతికి పెట్టింది పేరుగా ఉండేవి. విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, వృక్ష, జంతు సంపదకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది. కాలక్రమేణా పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ● అడవుల నరికివేతతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అటవీశాఖ అడవుల పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. విత్తన బంతులతో పచ్చదనం జిల్లాలోని ఏజెన్సీలో అటవీ విస్తరణను పెంచేందుకు ఈ ఏడాది విత్తన బంతుల కార్యక్రమాన్ని చేపట్టారు. పాడేరు, చింతపల్లి అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్లలో విత్తన బంతులను తయారు చేసి అడవుల్లో నాటే కార్యక్రమం చేపట్టారు. ● సాంప్రదాయ పద్ధతిలో గోతులు తీసి మొక్కలు నాటడంతో పాటు.. మారుమూల, కొండ ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల డ్రోన్ల ద్వారా విత్తన బంతులను అడవుల్లో వెదజల్లారు. ప్రతి హెక్టారులో నిర్ణీత సంఖ్యలో విత్తన బంతులు నాటేలా చర్యలు చేపట్టారు. గ్రామ సభలతో అవగాహన ● డ్రోన్ల ద్వారా విత్తన బంతులు వెదజల్లడంతో పాటు.. అటవీశాఖ సిబ్బంది గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అడవుల నరికివేత, వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, గిరిజనులకు విత్తన బంతులను అందజేసి వారి భూముల్లో వాటిని నాటించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ● చింత, రావి, నేరేడు, తురకవేప, మామిడి, నల్లమద్ది తదితర మొక్కలకు సంబంధించిన విత్తనాలను విత్తన బంతుల రూపంలో తయారు చేసి నాటుతున్నారు. అటవీ అభివృద్ధికి కృషి ఏజెన్సీలో అడవులు అంతరించిపోతున్న తరుణంలో.. అటవీశాఖ చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులు, గిరిజనులు సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటి అటవీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపడతాం. గిరిజనులు ఎవరూ చెట్లు నరకవద్దని, అడవులను కాపాడుకోవాలని కోరుతున్నాం. అడవులను కాపాడితేనే మానవాళికి ఎదురయ్యే ముప్పును తగ్గించగలుగుతాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
టైరు పేలి డివైడర్ను ఢీకొన్న కారు
ముగ్గురికి గాయాలు ఎస్.రాయవరం: మండలంలోని గోకులపాడు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అడ్డురోడ్డు వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుతున్న కారు టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. కారులో సేఫ్టీ బెలూన్లు ఓపెన్ కావడం, ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. ప్రథమ చికిత్స అనంతరం మరో వాహనంలో వారు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.


