నిరాశపరిచిన బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ కూడా అన్ని వర్గాలనూ నిరాశపరిచింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్ అన్నారు.ఎన్నికల ప్రచార సభల్లోనూ పదే పదే చెప్పారు.దీంతో చాలా మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఓట్లు వేశారు.కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు.నాడు,నేడు పనులతో పాటు వేతన సవరణ,నిరుద్యోగ భృతి,ఆడబిడ్డ నిధి వంటి హామీలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసమే అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులున్నాయి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి విస్మరించారు.
– అర్రెపు గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్,యలమంచిలి


