ఆయుష్మాన్ కేంద్రాన్ని సందర్శించిన టాస్క్ఫోర్స్
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు
అచ్యుతాపురం రూరల్: మండలంలోని చోడపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం సందర్శించారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికలకు వైద్య పరీక్షలు, తదితర వివరాలు పరిశీలించారు. జిల్లా ఎన్హెచ్ఎం అధికారి డాక్టర్ ప్రశాంతి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎ.రామచంద్రరావు, డీపీవో కె.జగదీష్, అధికారులు పాల్గొన్నారు.


