మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం: మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం నుంచి ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకు కల్యాణపులోవ, ధారమఠం శివక్షేత్రాలకు నర్సీపట్నం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్.ధీరజ్ తెలిపారు. నర్సీపట్నం నుంచి ధారమఠానికి 10 బస్సులు, కల్యాణపులోవకు నర్సీపట్నం, కొత్తకోట, దొండపూడి ఫారెస్ట్ గేట్, కొంతలం, రావికమతం, చోడవరం ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


