ఉత్సాహంగా సైక్లింగ్సెలక్షన్స్ పోటీలు
అనకాపల్లి టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలకు మేరకు మంగళవారం నిర్వహించిన శాప్ లీగ్ సైక్లింగ్ సెలక్షన్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–18 విభాగంలో పట్టణంలో సుంకరమెట్ట జంక్షన్ నుంచి దేవీపురం వరకు జరిగిన పోటీల్లో 45 మంది బాలురు, 10 మంది బాలికలు పాల్గొన్నారు. వ్యక్తిగత, మాస్టర్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 28 నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు.


