సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం
అనకాపల్లి: ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా జి.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నర్సింగరావుపేట అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వి.కృష్ణ మోహన్, ఆర్థిక కార్యదర్శిగా రాజాన సన్యాసినాయుడు, సహ అధ్యక్షుడిగా వేదూరి శ్రీనివాసరావు,అదనపు ప్రధాన కార్యదర్శిగా కనిశెట్టి ఉమ, మహిళా అధ్యక్షురాలిగా మల్ల ఉమామహేశ్వరి, మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎం.సూర్యకుమారి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.ఉమామహేశ్వరరావు, ఎస్.సంతోష్ కుమా ర్, ఆర్.రామ్చరణ్తో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా సి.గణేష్, ఎం. ఈశ్వరరావు, అబ్రహం సునంద వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన సీపీఎస్ విధానం రద్దుకోరుతూ విశాఖలో జరగబోయే సాగర ఘోష కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి కృషి చేస్తామన్నారు.


