విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా కార్యవర్గం
అనకాపల్లి టౌన్: ఏపీ విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్.ఎస్.అప్పారావు ఎన్నికయ్యారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఐ.శ్రీను, కార్యదర్శిగా సి.హెచ్. ఉమామహేష్, సహాయ కార్యదర్శిగా పి.రవి ప్రసాద్, కోశాధికారిగా ఎస్.మోహన్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా బి.సంతోష్ కుమార్, మహిళా కార్యదర్శిగా జి.బాల, న్యాయ, క్రమశిక్షణ కార్యదర్శిగా ఇ.దిలీప్ కుమార్, కమ్యూన్కేషన్,ఐటీ కార్యదర్శిగా పి.శ్రీనివాస్, సంక్షేమ కార్యదర్శిగా కె.సంతోష్, సలహాదారుడిగా కె.మురళీ ఎన్నికయ్యారు.


