మాడుగుల వారపు సంతలో ఎదురు చూస్తున్న గిరి రైతులు
మాడుగుల: స్థానిక వారపు సంతలో చింత పండుకు గిరాకీ పెరిగింది. పాడేరు, చింతపల్లి, దేవాపురం గిరి ప్రాంతాల నుంచి శివరాత్రికి ముమ్మురంగా చింత పండు వచ్చేది. ఈ ఏడాది శివరాత్రి దాటిపోయినా సరే అరకొరగా కొత్త చింతపండు రావడంతో డిమాండ్ పెరిగిపోయింది. 40 కిలోల కావిడి చింతపండు రూ. 4 వేల నుంచి రూ.4,500 వరకు ధర పలికింది. గత ఏడాది ఇదే కావిడి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ధర ఉండేది. ప్రస్తుతం చింతపండు ఆలస్యంగా రావడంతో ధరలు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.


