breaking news
-
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
కౌలాలంపూర్ నుండి సిడ్నీకి వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ Malaysia Airlinesవిమానంలో 58 ఏళ్ల భారతీయుడు మరణించారు. ఎనిమిది గంటల విమాన ప్రయాణంలో ఆయనకు అకస్మాత్తుగా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పేరు, ఇతర వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.పీపుల్ మ్యాగజైన్ పోలీసులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, విమాన ప్రయాణంలో అతనికి ఆస్తమా సోకడంతో మరణించారని సమాచారం. విమానంలో ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడని సమాచారం అందడంతో, సెప్టెంబర్ 16న సాయంత్రం 5:50 గంటలకు (స్థానిక సమయం) సిడ్నీ విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్కు అధికారులు చేరుకున్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఒక ప్రకటనలో పీపుల్కు తెలిపారు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ప్రథమ చికిత్స అందించడానికి ప్రయత్నించారని, కానీ ఫలితం లేకపోయిందని విమానంలో ఉన్న వైద్యుడు కూడా దీనని ధృవీకరించారని అధికారులు తెలిపారు. తరువాత మరణించినట్లు ప్రకటించారుఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతిఅయితే దీన్ని అనుమానాస్పదంగా పరిగణించడం లేదని, తదుపరి పోలీసు చర్యలు ఉండవని కూడా పోలీసులు తెలిపారు. అటు మలేషియా ఎయిర్లైన్స్ మరియు సిడ్నీ విమానాశ్రయం ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్ -
ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! 40 రోజుల్లోనే..
నీమ్ కరోలి బాబా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘హనుమాన్ అంశ్’. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రూ.291.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 40 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోబినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో విశ్వాసం, ప్రేమ, సేవ, భక్తి వంటి అంశాలను చూపించారు.ముగ్గురు మహిళల పెట్టుబడి..‘హనుమాన్ అంశ్’ నిర్మాణంలో ముగ్గురు మహిళలు కీలకంగా వ్యవహరించారని మీకు తెలుసా. రాగిణి సోనా, నమ్రత జీ. సింగ్తో పాటు 21 ఏళ్ల అనుప్రియా నగర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఒక్కొక్కరు సుమారు రూ.60 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామని అందులో ఒకరైన అనుప్రియా వివరించారు. అయితే తాను సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రాజెక్టులో లేనని అనుప్రియా స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దశలో తాను చిత్ర బృందంలోకి వచ్చినట్లు తెలిపింది. ‘నేను ముగ్గురు మహిళా నిర్మాతల్లో చిన్నదాన్ని. షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలోకి వచ్చాను. పోస్ట్ ప్రొడక్షన్ కోసం డబ్బులు అవసరమైన సమయంలో నా వంతు పెట్టుబడి పెట్టాను’ అని అనుప్రియా తెలిపింది.దర్శకుడు ఏమన్నారంటే?అనుప్రియా పాత్రపై దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా స్పందించారు. ఆమె తమ బృందంలో నిర్మాతేనని, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచారని చెప్పారు. అయితే అనుప్రియా కథ రాశారని, సినిమాను ఆమె క్యూరేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఆమె స్వయంగా ఆ విషయాన్ని ఖండించారని తెలిపారు. ఇక అసలు నిర్మాతలైన రాగిణి సోనా, నమ్రతా సింగ్ కూడా సినిమాకు ఎంతో కష్టపడ్డారని విశాల్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?)ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఆఫర్లుథియేటర్లలో ఊహించని విజయాన్ని అందుకోవడంతో ‘హనుమాన్ అంష్’పై ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒకటి, రెండు కాకుండా మూడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ సినిమా హక్కుల కోసం సంప్రదిస్తున్నట్లు నిర్మాత రాగిణి సోనా వెల్లడించారు. అయితే ఈ సినిమాను మొదటి నుంచే ఓటీటీ కోసం తెరకెక్కించలేదని ఆమె స్పష్టం చేశారు. పెద్ద తెరపైనే ప్రేక్షకులు సినిమాను చూడాలనేది తమ ఉద్దేశమని తెలిపారు.22 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..దర్శకుడు విశాల్ చతుర్వేది ప్రకారం.. తొలుత 26 రోజుల షూటింగ్కు బడ్జెట్ సిద్ధం చేసుకున్నారట. అయితే ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో 22 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేశారట. పరిమిత వనరులతో సినిమాను పూర్తి చేయడం తమకు పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. కాగా అనుమన్ అంశ్ తెలుగులో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. -
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అఫిడవిట్లలో భూముల వివరాలపై కేటీఆర్ను నిలదీసిన పొంగులేటి.. కేసీఆర్ ఆస్తులపై ప్రశ్నిస్తే.. కేటీఆర్కు ఎందుకంత ఉలికిపాటు?. 2004 అఫిడవిట్లో భూములు లేవు.. ఇప్పుడు వందల ఎకరాలు ఎలా?. అఫిడవిట్లలో నిజాలు రాశారా? ప్రజలను మోసం చేశారా?. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించిన పొంగులేటి.. అఫిడవిట్లలో ఒకటి.. మాటల్లో మరొకటా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కుటుంబానిదే. భూముల పెరుగుదలపై లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు? కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని పొంగులేటి డిమాండ్ చేశారు.‘‘అఫిడవిట్లలో పేర్కొన్న భూముల వివరాలను ప్రజల ముందు పెట్టాలి. కేటీఆర్ మాటలకు.. ఎన్నికల అఫిడవిట్లకు పొంతన ఉందా?. భూ ఆరోపణలపై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలా?’’ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ...ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు… pic.twitter.com/E9oOjS8UBW— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 17, 2026ఇదీ చదవండి: పొరపాట్లు జరిగాయి.. పరిష్కరిస్తాం -
నోటి మాటతో బ్రెయిలీ అక్షరమాల
స్ఫూర్తి పొందడానికి క్షణం చాలు...ఆ క్షణమే చాలు గొప్ప మార్పునకు నాంది పలకడానికి... అని చెప్పేందుకు చక్కని ఉదాహరణ ఈ సంఘటన. పాఠశాలకు వెళ్లిన ఓ యువతికి బ్రెయిలీ లిపి రాసేందుకు ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థిని కనిపించింది. ‘ఇలా కాకుండా సులభంగా రాయలేమా’ అన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచననే సవాలుగా తీసుకుని పరిశోధనల దిశగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నమే కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఆ ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన లింగంపల్లి హిమజ శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతోంది. కాలేజీలో మామూలుగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా హిమజ దృష్టిలోపం ఉన్న విద్యార్థుల పాఠశాలకు వెళ్లింది. అక్కడ స్లేట్ పిన్తో కాగితాన్ని ఒక్కో చుక్కగా గుచ్చుతూ బ్రెయిలీ రాస్తున్న ఓ బాలిక హిమజ దృష్టిలో పడింది.‘ బ్రెయిలీని ఇంతకంటే సులభంగా రాయలేమా?’ అని హిమజ ఆలోచించింది. వాయిస్ ప్రింటర్ ‘రుద్ర’ తయారీ కార్యక్రమం ముగిశాక హిమజ మనసులో మెదిలిన ‘బ్రెయిలీని సులభంగా రాయలేమా’ అన్న ఆలోచనే... ఆమెకు బ్రెయిలీ ప్రింటర్ను తయారు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మొదట ఆరు బటన్లతో బ్రెయిలీ ప్రింటర్ను తయారు చేసింది. అయితే టెస్టింగ్ సమయంలో ఓ విద్యార్థిని వేసిన ప్రశ్న హిమజ ఆలోచననే పూర్తిగా మార్చివేసింది. ‘అక్కా మన మెందుకు బటన్స్ ఉపయోగించాలి..? నోటి మాట చాలదా?’ అని విద్యార్థిని వేసిన ప్రశ్న హిమజలో ఆలోచన నింపింది. వాయిస్ కమాండ్ తో పనిచేసే బ్రెయిలీ లిపి ప్రింటర్ ఫోటో టైప్ను హిమజ తయారు చేసింది. ఈ పరికరానికి ఆమె ‘రుద్ర’అనే నామకరణం చేసింది.‘రుద్ర’ పనితీరు ఇలా...‘రుద్ర’తో మాట్లాడితే ఆ మాటల్ని అలెక్సా టెక్ట్స్గా మారుస్తుంది. ఆ సమాచారాన్ని రాస్బెర్రీ పై అనే మరో డివైజస్ బ్రెయిలీ నమూనాగా మార్చుతుంది. ఆ తర్వాత యంత్రం కాగితంపై అవసరమైన చుక్కలను ప్రెస్ చేసి అక్షరాలను రూపొందిస్తుంది. అంటే చేతితో ఒక్కో చుక్కని గుర్తించి రాయాల్సిన అవసరం లేకుండానే... మాట్లాడితే చాలు– బ్రెయిలీ ప్రింట్ అవుతుందన్నమాట.అంతర్జాతీయ గుర్తింపుహిమజ ఆవిష్కరణకు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ డిజైన్ ఇంజినీరింగ్ కాంపిటిషన్ అయిన ‘జేమ్స్ డైసన్ అవార్డుకు భారతదేశం నుంచి హిమజ ఆవిష్కరణ ఎంపికైంది. ఇందుకు గాను రూ.6 లక్షల నగదు బహుమతి లభించింది. వాస్తవానికి బ్రెయిలీ ప్రింటర్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నప్పటికీ వాయిస్ కమాండ్తో పని చేసే హిమజ ఆవిష్కరణ అందుకు భిన్నంగా నిలిచింది. రుద్ర పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బ్రెయిలీ లిపి ప్రింటింగ్ ఇప్పుడు మరింత సులభతరం కానుంది. ఇదీ చదవండి: సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్లో ఇంటికి వెళ్లేలా..!) -
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్ను తొలగించడంతో డ్రోన్కు ఆపరేటర్తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026ఇదేం కొత్త కాదు!ఉక్రెయిన్లో డ్రోన్లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్ను విసిరి రష్యా డ్రోన్ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట! -
బురదలో బీజేపీ ఎమ్మెల్యే కారు.. ట్రాక్టర్తో బయటకు..
మిర్జాపూర్: ఉత్తర్ప్రదేశ్లోని మిర్జాపూర్లో బీజేపీ ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా కారు బురదలో చిక్కుకుపోయింది. రైల్వే అండర్పాస్లో మట్టి, బురదలో ఇరుక్కున్న వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది. రాయిని తాకడంతో కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిర్జాపూర్లోని ఛాన్బే ప్రాంతం అకోఢీ రైల్వే అండర్పాస్లో ఈ ఘటన చోటుచేసుకుంది.గంగా నది నీటిమట్టం పెరగడంతో కర్ణావతి నదికి వరదలు వచ్చాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో అకోఢీ రైల్వే అండర్పాస్ దాదాపు నెల రోజులపాటు నీరు, మట్టి, మల్బాతో నిండిపోయింది. అకోఢీతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 15 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు జేసీబీ సాయంతో అండర్పాస్లోని నీరు, బురదను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఇదీ చదవండి: ఎల్నినో ఎఫెక్ట్: అట్లాంటిక్ను తాకని హరికేన్లు! -
బిగ్బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?
బిగ్బాస్ విడుదల చేసిన తాజా ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోలో కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా హౌస్లోకి రావడం.. షాలినీని పట్టుకుని బయటకు తీసుకెళ్లడం కనిపించింది. వారిని చూడగానే ఇంట్లోని సగం మంది కంటెస్టెంట్లు భయపడిపోయారు. దీంతో అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.అయితే ఇదంతా నిజంగా జరిగిన ఘటన కాదని, హౌస్మేట్స్ను ఆటపట్టించేందుకు చేసిన ప్రాంక్ కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటే బిగ్బాస్ ఫార్మాట్ ప్రకారం నామినేషన్లు, ఎలిమినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అలాంటిది ఎలాంటి ప్రక్రియ లేకుండా షాలినీని తీసుకెళ్లడం వెనుక ఏదైనా టాస్క్ లేదా ట్విస్ట్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.బిగ్బాస్ అసంతృప్తి..ఇదిలా ఉంటే.. షాలినీ విషయంలో బిగ్బాస్ ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమయపాలన పాటించడం లేదంటూ ఆమెను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రోమోలో షాలినీని టార్గెట్ చేయడంతో హౌస్లో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.చరణ్ ఎంట్రీకి సంబంధించిన వారేనా..మరోవైపు చైత్ర కంటే చరణ్కే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. చరణ్ త్వరలోనే బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నట్లు ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రోమోలో కనిపించిన వ్యక్తులు చరణ్ ఎంట్రీకి సంబంధించినవారేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అసలు షాలినీని పట్టుకెళ్లడం వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి? ఇది ప్రాంక్నా.. టాస్క్లో భాగమా? చరణ్ ఎంట్రీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్నది పూర్తి ఎపిసోడ్లోనే క్లారిటీ రానుంది.(ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..) -
సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారో తెలుసా?
సినిమాల్లో నవరసాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. యాక్షన్, ఎమోషన్, కామెడీతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా కథలో భాగంగా ఉంటాయి. కొన్ని చిత్రాల్లో కథను బట్టి ఇంటిమేట్ సీన్లు కూడా కనిపిస్తుంటాయి. అయితే తెరపై ఎంతో సహజంగా కనిపించే ఇలాంటి సన్నివేశాలను నిజానికి ఎలా చిత్రీకరిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో చాలామందికి ఉంటుంది. నటీనటులు ఇబ్బందికి గురికాకుండా, వారి వ్యక్తిగత పరిమితులను గౌరవిస్తూ ఈ సీన్లను చిత్రీకరించేందుకు ప్రత్యేక పద్ధతులను పాటిస్తుంటారు. తాజాగా హాలీవుడ్ నటి సారా షాహి అలాంటి ఓ ఆసక్తికరమైన ట్రిక్ గురించి వెల్లడించారు. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘సెక్స్/లైఫ్’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సారా షాహి.. ఇంటిమేట్ సీన్ల చిత్రీకరణపై మాట్లాడారు. ఇలాంటి సన్నివేశాల్లో నటీనటులు సౌకర్యంగా ఉండేందుకు చిత్రబృందాలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయని తెలిపారు.ఓ ఇంటర్వ్యూలో సారా షాహి చెప్పిన వివరాల ప్రకారం.. ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఇద్దరు నటీనటుల మధ్య గాలి తీసేసిన చిన్న యోగా బాల్ను ఉంచుతారు. సన్నివేశంలో కదలికలు ఉన్నప్పటికీ.. ఎదుటి నటుడు వాస్తవానికి ఆ బాల్ను మాత్రమే తాకేలా ఈ ఏర్పాటు చేస్తారు.ఈ పద్ధతి వల్ల సన్నివేశంలో నటిస్తున్న సమయంలో ప్రత్యక్ష శారీరక స్పర్శను తగ్గించవచ్చని సారా షాహి వివరించారు. తాను ఆ సమయంలో ఎదుటి నటుడి స్పర్శకు బదులుగా యోగా బాల్ తాకిడినే అనుభవిస్తానని చెప్పారు. దీంతో నటీనటులు తమకు అసౌకర్యంగా అనిపించే శారీరక స్పర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు.ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు నటీనటుల వ్యక్తిగత పరిమితులు, సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని సారా షాహి చెప్పిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. తెరపై సహజంగా కనిపించే సన్నివేశాల వెనుక.. నటీనటుల సౌకర్యం, భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక పద్ధతులు కూడా ఉపయోగిస్తుంటారని ఆమె వెల్లడించారు. -
మైకు చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడొద్దు!
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో ఇరువురి మధ్య అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. జిల్లా మంత్రి సమక్షంలోనే ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పెద్ద కేకలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఐఏఎస్ అధికారి అన్న కనీస మర్యాద మరిచి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్చంద్ర.. కలెక్టర్ను లక్ష్యంగా చేసుకుని, ఆరోపణలకు దిగారు. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ, జిల్లా అధికారుల ముందటే ఆయన్ను అగౌరవపరిచారు. దీన్ని కలెక్టర్ ప్రభాకరరెడ్డి దీటుగా తిప్పికొట్టారు.మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై బుధవారం పార్వతీపురం మన్యం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయ్చంద్రతో పాటు.. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇతర జిల్లా అధికారులంతా హాజరయ్యారు.వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ, ఉద్యానవన, మహిళా సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో బలిజిపేట మండలం పెదపెంకి రోడ్ల కాంట్రాక్టు విషయంలో ఎమ్మెల్యే విజయ్చంద్ర లేవనెత్తారు. డ్రైనేజీ, ఆక్రమణల తొలగింపు వ్యవహారంతో పాటు.. కాంట్రాక్టరును మార్చడంపైనా ప్రశ్నించారు. అధికారుల తీరును.. ముఖ్యంగా కలెక్టరు ప్రభాకరరెడ్డి వైఖరిని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కలెక్టరు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేయడం సరైంది కాదని బదులిచ్చారు. నిబంధనలు, చట్టం ప్రకారం తాము కూడా పని చేస్తామని స్పష్టం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. “మీకు ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించండి. రోడ్డును ఆక్రమించకుంటే కొట్టకూడదు. చెరువును కబ్జా చేస్తే తొలగించకూడదు. వారికి మీరే హామీ ఇచ్చేస్తారు. తిరిగి మమ్మల్నే అంటారు. మేం చట్టప్రకారం చేస్తున్నామా, లేదా? చట్ట ప్రకారం పని చేస్తున్నామా, లేదా? వ్యక్తిగత అంశాలను ఇక్కడ తీసుకురాకూడదు. అధికారుల మీద ఎప్పుడూ పడతారెందుకు?’ అంటూ కలెక్టరు గట్టిగా సమాధానమిచ్చారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రి సంధ్యారాణి సముదాయించే ప్రయత్నం చేశారు. “ఒక కలెక్టరు, ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ ఒక మంత్రి ఉన్నా.. చూడరా? మీకు ఏమైనా సమస్యలుంటే ఛాంబరులో కూర్చొని ఇలాంటివి మాట్లాడుకోండి.’ అని హితవు పలికారు. లేనిపోని వార్తలు ప్రసారం చేసే దుర్మార్గులుంటారు జాగ్రత్త : కలెక్టర్ ఈ వివాదం సద్దుమణిగాక, జిల్లా అధికారులనుద్దేశించి మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేమ్ చేద్దామని, దాని ద్వారా తృప్తి చెందుదామని, ఇష్టానుసారం మీడియా ద్వారా వార్తలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్బు వార్తలు రాయించుకుని, తనను బ్లేమ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని తెలిపారు. ‘ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు, ఆడియోలు చేయడం, ఆడియో రికార్డులు, లేనిపోనివి ప్రచారం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు దుర్మార్గులు. ఫేక్ న్యూస్ అయితే ఫేక్ అని ఖండించండి. సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. సైబర్ క్రైం కూడా ఉంది. మీ శాఖల పరంగా ఏ విధంగా ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చినా సహించవద్దు. ఫేక్ న్యూస్ ఏ రకంగా వచ్చినా ఊరుకునేది లేదు. ఖండించండి.’ అని అధికారులకు సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే విజయ్చంద్రను ఉద్దేశించే కలెక్టర్ చేశారని అర్థమవుతోంది. రోడ్డు పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం రోడ్డు పనుల జాప్యంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతి 15 రోజులకోసారి చెబుతున్నానని, అయినా పట్టించుకోరా? అని అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తరా>్వత టెండరు అయిన సాలూరు–మక్కువ రోడ్డు తన నియోజకవర్గంలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కాంట్రాక్టర్లతో ఎందుకు మొహమాటమని ప్రశ్నించారు. బాగువలస నుంచి మక్కువ రహదారిని నేటికీ ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టరుకు సూచించారు. ఏ రోడ్డు అయినా ఏడాది దాటినా ప్రారంభించకపోతే టెండరును రద్దు చేయాలని స్పష్టం చేశారు.ఇదీ చదండి: టీడీపీ నేతల వికృత చేష్టలు -
సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం రోజే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. గురువారం తన స్వరాష్ట్రం మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ పోరాటాన్ని ప్రారంభించారు.ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో (Adivasi School Thik Karo)లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, వసతి పరిస్థితులను సీజేపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ఉద్దేశమని దీప్కే తెలిపారు. ఇప్పటికే CJP దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో (School Thik Karo) పేరుతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి కొనసాగింపుగానే గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది.వందల మంది మృతి!గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ దీప్కే.. సంచలన ఆరోపణలకు దిగారు. మహారాష్ట్రలో గత రెండేళ్లలో 590 మందికి పైగా గిరిజన విద్యార్థులు మరణించారని ఆయన పేర్కొన్నారు. పాముకాట్లు వంటి నివారించగల ప్రమాదాలతోనూ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లోనూ ఇటీవల గిరిజన విద్యార్థుల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.ఏకలవ్య పాఠశాలలపైనా ప్రశ్నలుఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితిపైనా సీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా మంజూరైన 720 పాఠశాలల్లో 477 పనిచేయడం లేదని దీప్కే ఆరోపించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యలో ప్రవేశాలపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.‘అన్ని ప్రభుత్వాలూ నిర్లక్ష్యం చేశాయి’గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను గత 80 ఏళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని దీప్కే ఆరోపించారు. పెద్ద నగరాల్లోని విద్యార్థులకు లభించే విద్యా సదుపాయాలు, భద్రత, నాణ్యమైన విద్య గిరిజన ప్రాంతాల పిల్లలకూ అందాలని అన్నారు. కేవలం ఆర్థిక వృద్ధి గణాంకాలు చెప్పడం సరిపోదని.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వాలను కోరారు.మోదీ బర్త్డే రోజే ఎందుకు?మోదీ జన్మదినం సెప్టెంబర్ 17నే సీజేపీ ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెన్ జీ పోరాట వేదిక కావాలనే ఇలా చేసిందా? అని నెట్టింట చర్చ నడిచింది. అయితే ఇదేం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని దీప్కే స్పష్టత ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే తాము ఉద్యమం మొదలుపెట్టామని అంటున్నారు.అంతకు ముందు.. ఆశుతోష్ రాంకా చేసిన ఓ పోస్ట్ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఈ ఉదయం ‘ఆశీర్వాద్ కా దియా’ పేరుతో దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. అయితే ఇలా ఎందుకు అంటూ రాంకా ఓ ట్వీట్ చేశాడు. “గాయిస్.. చెప్పండి, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఆశీర్వాద దీపం వెలిగించమని ఎందుకు చెప్పారు? ఎవరి పుట్టినరోజో చెప్పండి?” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.बताओ कल देशभर के कॉलेज को सुबह सुबह आशीर्वाद का दीया जलाने के लिए क्यो बोला गया है guys?बताओ कल सारे काम छोड़कर देशभर के टीचर्स को किसकी भक्ति करने के लिए कहा गया है guys?बताओ कल किसका जन्मदिन है guys? pic.twitter.com/ZkLdESTaQt— Ashutosh Ranka (@AshutoshRanka) September 16, 2026ఇదీ చదవండి: మోదీ గుండె ధైర్యానికి ఇదే ఎగ్జాంపుల్ -
సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్లో ఇంటికి వెళ్లేలా..!
ఓ ఫుడ్ డెలివరి బాయ్, కస్టమర్ మధ్య జరిగి భావోద్వేగ కథ. ఎప్పటిలానే డెలివరి చేసిన ఫుడ్ ఆర్డర్ ఆరోజు ఊహించని మలుపు తిరిగి కృతజ్ఞతతో కళ్లు చెమ్మగిల్లే కథగా మారింది. కొన్ని సాయాలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో..పొందే వరకు లేదా అందే వరకు తెలియదేమో. కానీ ఆ హృద్యమైన కథ విన్నాక..ఆ ఫుడ్ డెలివరీ బాయ్ని నిస్సందేహంగా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు.అసలేం జరిగిందంటే..అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ కథను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన చాలాసార్లు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఆరోజు కూడా ఎప్పటిలానే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వచ్చిన డెలివరీ బాయ్ కూడా అపరిచితుడేం కాదు. చాలాసార్లు అతడు పాండే ఇంటికి వచ్చిన డెలివరీ బాయే. అయితే ఆరోజు ఎందుకో అతడు చాలా తేడాగా ఉన్నట్లు గమనించాడు. డెలివరీ బాయ్ కూడా చాలా సంకోచంగా కొంచెం నీళ్లు కావాలని అడిగాడు. దాంతో పాండే అతడిని లోనికి ఆహ్వానించాడు. మంచి నీళ్లు ఇచ్చి అతడి ముఖం తేరిపార చూసి..ఏమైందని నెమ్మదిగా అడిగాడు. అతడి కళ్లు ఎర్రబడి ఏడ్చినట్టు ఉండటంతో ఏదో తేడా కొడుతుందని..అతడితో మాటలు కలిపాడు పాండే. దాంతో ఆ డెలివరీబాయ్ తన పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించాడు. తన తల్లి ఉదయం మెట్లపై నుంచి పడిపోయిందని, ఆమె పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉందంటూ బోరుమన్నాడు. వీలైనంత త్వరితగతిన వెళ్దామంటే తన ఊరికిపోయే రైలు రాత్రి 11 గంటలకంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈలోగా ఏ వార్త వింటానో అని ప్రతి క్షణం ఓ నరకంలా టెన్షగా ఉందంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు. దాంతో చలిపోయిన పాండే తక్షణమే అతడు ఫ్లైట్లో వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. రూ. 4000ల టికెట్తో విమానంలో వెళ్లేలా బుక్ చేశాడు. తాను ఇంతవరకు విమానం ఎక్కలేదని చెప్పడంతో..పాండే తనలోని ఆందోళన అర్థం చేసుకుని, సాయంగా ఒక స్నేహితడుని కూడా ఏర్పాటు చేశాడు. దాంతో ఆ డెలివరీ బాయ్ తన స్వస్థలానికి సకాలంలో వెళ్లి..తన తల్లి బాగోగులు చూసుకొన్నాడు. ఆ మరుసటి రోజే తన తల్లికి ప్రమాదం తప్పిందని, కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తుందని ఆనందంగా పాండేకి చెప్పాడు. అలాగే ఆ డెలివరీ బాయ్ విమాన టికెట్కి అయిన రూ. 4 వేలు తిరిగి ఇచ్చేశాడని, కానీ వాటిని తన తల్లి ఆరోగ్య ఖర్చులకు ఉపయోగించుకోమని వద్దని వారించినట్లు పోస్ట్లో చెప్పుకొచ్చారు పాండే. చివరగా.. ఒక చిన్న సహాయం ఎంత పెద ప్రభావాన్ని చూపి, ఒక వ్యక్తికి ఎంత పెద్ద భరోసాని ఇస్తుంది అనడానికీ ఈ ఘటనే ఉదాహరణ అంటూ తన పోస్ట్ని ముగించారు. నెటిజన్లు పాండే ఉదారతకు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపించడంతో ఈ పోస్ట్ నెట్టింట అమితంగా వైరల్ అయ్యింది. నిజంగా ఈ కథ..లక్షలు వెచ్చించి భారీ సహాయాలు చేయకపోయినా..కనీసం మన చుట్టూ ఉండే వాళ్ల ముఖాల్లోని దిగులు, కష్టంగా గడుస్తున్న రోజుని అర్థం చేసుకుని తగిన సాయం అందించగలిగితే చాలు అనేందుకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. Update on yesterday's story... I wasn't expecting this.The Zomato delivery partner I booked a flight for yesterday called me this morning.His first words were,"Bhaiya... mummy ab danger se bahar hain. Doctor ne kaha 4–5 din mein ghar aa jayengi."A few minutes later, he… https://t.co/g8r354En4M pic.twitter.com/PDw7TMXXAL— Ankit Pandey (@iamankitpande) July 11, 2026 ఇదీ చదవండి: రాజకీయ ఫ్యాషన్కి కేరాఫ్గా మోదీ..! చివరికి అది కాస్తా..) -
సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
సాక్షి, విజయవాడ: సాక్షి టీవీ దెబ్బకు కూటమి సర్కార్ మరోసారి దిగొచ్చింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీని మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టే విధానంపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. నియామకాల్లో అక్రమాలకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నిరుద్యోగుల తరఫున ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలను తిరిగి ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త జీవోతో ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి టీవీ కథనాల నేపథ్యంలో కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దీంతో, జీవో మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం గమనార్హం. కూటమి సర్కార్ పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టే విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రసారాలు చేసిన సాక్షి టీవీ.. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేసింది. ఈ వ్యవహారంలో సాక్షి టీవీపై మంత్రి అచ్చెన్నాయుడు గతంలో విమర్శలు చేసి అబాసుపాలయ్యారు. తాజాగా నియామక ప్రక్రియపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాక్షి టీవీ చెప్పిందే నిజమని ప్రభుత్వం అంగీకరించింది.ఏపీపీఎస్సీ ద్వారానే నియామకాలు..ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించనున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇదీ చదవండి: బాబు సర్కార్ మరో 2000 కోట్ల అప్పు -
ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజలు ఆస్తులుగా భావించే ఇల్లు, కార్లు అసలు ఆస్తులే కాదని, అవి జేబుల్లోంచి డబ్బులను గుంజే అప్పుల కుప్పలని ఆయన స్పష్టం చేశారు."మీరు ఉండే ఇల్లు ఆస్తి కాదు అని 1997లోనే నేను రాశాను. ఆ సమయంలో నా మాటలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పదేళ్లపాటు నన్ను తీవ్రంగా విమర్శిస్తూ మెయిల్స్ పంపారు. కానీ 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు లక్షల మంది సర్వస్వం కోల్పోయాక నా మాటల్లోని నిజం ప్రపంచానికి అర్థమైంది""మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టేది 'ఆస్తి' (Asset). అదే మీ జేబులోంచి డబ్బును బయటకు తీసేది 'అప్పు' (Liability). ఇదే అసలైన సూత్రం. ఈ లెక్కన మీరుండే ఇల్లు, పూర్తిగా ఈఎంఐలు చెల్లించిన కారు కూడా అప్పు కిందకే వస్తాయి. ఎందుకంటే అవి మీ జేబు నుంచి నిర్వహణ ఖర్చులను గుంజుతాయి" కియోసాకి రాసుకొచ్చారు.ప్రతినెలా మీ ఖాతాలోకి నగదు ప్రవాహాన్ని (Cash Flow) తీసుకురానిది ఏదీ నిజమైన సంపద కాదని, అది కేవలం భద్రత అనే భ్రమను మాత్రమే కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం చేస్తూ, ఇల్లు కొనుక్కొని, 45 ఏళ్ల వయస్సులో చేతిలో తగినంత నగదు లేక ఇబ్బంది పడటానికి ఈ తప్పుడు ఆలోచనా విధానమే కారణమన్నారు.'త్రీ పిగ్గీ బ్యాంక్స్' ఫార్ములాతాను, తన భార్య కిమ్ కియోసాకి కలిసి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి 'త్రీ పిగ్గీ బ్యాంక్స్' (Three Piggy Banks) అనే సూత్రాన్ని పాటించామని ఆయన వెల్లడించారు. వచ్చిన ప్రతి రూపాయిలోంచి బిల్లులు చెల్లించడానికి ముందే 10 శాతం పొదుపునకు (Savings), 10 శాతం పెట్టుబడికి (Investing), మరో 10 శాతం విరాళాలకు (Charity) కేటాయించేవాళ్లమని తెలిపారు.ఆ 10 శాతంతో పెట్టిన పెట్టుబడులే తమకు అసలైన ఆస్తులను తెచ్చిపెట్టాయని, ఆ ఆస్తుల ద్వారా వచ్చే రాబడితోనే తాము ఖర్చులు (Liabilities) వెచ్చించేవారమని చెప్పారు. జీతం డబ్బులతో ఖర్చులు పెట్టడానికి, ఆస్తులు తెచ్చిపెట్టే రాబడితో ఖర్చులు చేయడానికి మధ్య ఉన్న ఈ చిన్న తేడాయే చిన్న వయస్సులోనే రిటైర్మెంట్ సాధించడానికి కారణమవుతుందని కియోసాకి వివరించారు. -
‘నిన్ను పట్టించుకోమని టీమిండియా సెలక్టర్లు చెప్పేశారు’
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటిచ్చింది.ఇద్దరికీ మొండిచేయిఅయితే, గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ సిరీస్తో వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తారని విశ్లేషకులు భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం వీరిద్దరికి మొండిచేయి చూపారు. హార్దిక్ భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైనప్పటికీ.. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని విండీస్తో వన్డే జట్టుకు ఎంపిక చేశారు.ఊహించని రీతిలోఅదే విధంగా.. పంత్ను కాదని యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. నిజానికి రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఇషాన్ కిషన్ లేదంటే పంత్నే ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇషాన్ టీ20 జట్టుతో బిజీగా ఉన్నందున పంత్ రాక ఖాయమని అభిమానులు సైతం భావించారు.కానీ సెలక్టర్లు ఊహించని రీతిలో వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయని ధ్రువ్ జురెల్కు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ను ఇక పట్టించుకునే ప్రసక్తే లేదని సెలక్టర్లు చెప్పకనే చెప్పారని పేర్కొన్నాడు.నిన్ను మేము పట్టించుకోవడం లేదుఈ మేరకు.. ‘‘బ్యాకప్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేరు కాబట్టి వన్డే జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కాల్సింది. కానీ సెలక్టర్లు ధ్రువ్ జురెల్కు ప్రాధాన్యం ఇచ్చారు. పంత్ను వెనక్కి నెట్టి జురెల్ ముందుకు వచ్చేశాడు.తద్వారా.. ‘నిన్ను మేము పట్టించుకోవడం లేదు’ అని సెలక్టర్లు పంత్కు నేరుగానే చెప్పినట్లు అనిపించింది. గత రెండు సిరీస్లలో కూడా అతడికి అవకాశం ఇవ్వలేదు. దీనిని బట్టి సెలక్టర్ల మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు. ఫామ్ గురించే సమస్య అనుకోవడానికి వీలులేదు.పంత్ స్థానం గల్లంతే!ఎందుకంటే పంత్ ఇటీవల శ్రీలంక పర్యటనలో మంచి స్కోర్లే సాధించాడు. ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. అయితే, చాన్నాళ్లుగా టెస్టు జట్టులో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా వచ్ఛేశాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పంత్ స్థానాన్ని జురెల్ మెల్లగా పూర్తిస్తాయిలో లాగేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదని అభిప్రాయపడ్డాడు.ఆ జట్టు కెప్టెన్గాకాగా వెస్టిండీస్తో వన్డేల నుంచి పంత్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. రెడ్బాల్ టోర్నీ ఇరానీ కప్-2026లో భాగంగా రెస్టాఫ్ ఇండియా జట్టుకు అతడిని కెప్టెన్గా నియమించింది. ఇదిలా ఉంటే.. పంత్ చివరగా 2024లో శ్రీలంక పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు. నాటి మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు.చదవండి: విండీస్తో సిరీస్.. భారత జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు -
ఐదుగురి అరెస్టుతో సరిపుచ్చారు...
గుంటూరు : మైనర్ను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మైనర్ను సుమారు ఏడాదిపాటు వ్యభిచార కూపంలోకి దించిన మహిళ, మరో నలుగురు వ్యక్తుల అరెస్ట్ విషయంలో ఏదైనా మతలబు జరిగిందా..? అనే అనుమానాలు లేకపోలేదు. పది రోజుల క్రితం గుంటూరు ఈస్ట్ సబ్డివిజన్ పాతగుంటూరు పోలీసుస్టేషన్లో మైనర్తో వ్యభిచారం చేయించిన ఘటనపై కేసు నమోదైంది. పరిస్థితిని ఆసరాగా తీసుకుని... మైనర్ విద్యార్థిని తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఒంగోలులో ఉంటున్న తల్లి దగ్గర నుంచి తండ్రి వద్దకు వచ్చిన మైనర్ను నగరంలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. ఈ క్రమంలో తండ్రి పాతగుంటూరు బాలాజీనగర్లో నివాసం ఉండే తన సోదరుడి దగ్గర కుమార్తెను ఉంచి చదివిస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే పావని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. విద్యార్థినికి మాయమాటలు చెప్పి, లేనిపోని ఆశలు చూపి వ్యభిచార కూపంలోకి దించింది. అసలు ఆ బాలిక ఇంటికి కూడా సరిగా రావడం లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై ఈ నెల 5వ తేదీన పాతగుంటూరు పీఎస్లో కేసు నమోదు చేశారు. తొలి నుంచి గోప్యమే... ఈ కేసులో పోలీసులు తొలి నుంచి గోప్యంగానే వ్యవహరించారు. విషయం బయటకు పొక్కకుండా, మీడియా అడుగుతున్నప్పటికీ సమాధానం దాటవేస్తూ వచ్చారు. ప్రధాన నిందితురాలు పావని, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి, వారిని సైలెంట్గా కోర్టుకు హాజరుపరిచారు. ఫిర్యాదులో స్పష్టంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు పావని తనను తీసుకుని వెళ్లిందని మైనర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలల తరబడి ఈ తంతు జరిగినా కేవలం ముగ్గురిని మాత్రమే నిందితులుగా చూపడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అసలు ఏ లాడ్జికి తీసుకుని వెళ్లారు.. అక్కడ ఆధార్ ఏం ఇచ్చారు.. మైనర్ లాడ్జిలోకి వెళ్తుంటే ఎలా అంగీకరించారు..? అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి. ఈ కేసులో ఇంకెంత మంది నిందితులు ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నాడు బాధితులకు న్యాయం మేడికొండూరుకు చెందిన ఒక మైనర్ ఘటన గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసు విషయంలో అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న కె. సుప్రజ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఏపీ, తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలకు వెళ్లి మరీ 112 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరికి లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. ఈ కేసు విచారణ సుమారు సుదీర్ఘంగా మూడు నెలలపైనే సాగింది. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగింది. తీవ్ర నిర్లక్ష్యం ఈ కేసు పరిణామంలో పోలీసులు నిందితులను వదిలివేశారా..? కేసును తూతూ మంత్రంగా విచారించారా..? ఎవరైనా పెద్దల ప్రమేయం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావని, ఆమె భర్త, కేవలం ముగ్గురు విటులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసి మమ అనిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పోలీసులు.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఈ కేసులో లాడ్జి నిర్వాహకులు, పావనికి సహకరించిన మరికొంత మందిని ఎందుకు నిందితులుగా చేర్చలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాకు తెలియకుండా అరెస్ట్ చూపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ నేతల వికృత చేష్టలు -
పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ పన్ను తగ్గింపు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు, రీఫైనింగ్ మార్జిన్లలో మార్పుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్)పై విండ్ఫాల్ టాక్స్ (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం)ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సవరించిన పన్ను వివరాలుసమీక్షలో భాగంగా డీజిల్పై గతంలో ఉన్న లీటరుకు రూ.25 సుంకాన్ని రూ.20కి తగ్గించారు. డీజిల్పై ప్రత్యేకదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.20గా నిర్ణయించగా, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఆర్ఐసీ)ను పూర్తిగా సున్నాకు తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ఎగుమతులపై లీటరుకు రూ.19గా ఉన్న పన్నును రూ.15కు కుదించారు. పెట్రోల్పై గతంలో ఉన్న లీటరుకు రూ.1.5 సుంకాన్ని రూ.0.50 (50 పైసలు)కు తగ్గించారు. స్థానిక మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్పై ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని, ఇవి యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.నిర్ణయానికి గల కారణాలు.. మార్కెట్ విశ్లేషణపశ్చిమాసియాలో ఉద్రిక్తతల మూలంగా ముడిచమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ సౌదీ అరేబియా ఆసియా రిఫైనరీలకు అదనపు చమురు సరఫరాను ప్రారంభించడంతో బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ విపణిలో డిమాండ్, రిఫైనింగ్ లాభాల సమీక్ష ఆధారంగా దేశీయ ఎగుమతిదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సవరణ చేసింది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు, విదేశీ మార్కెట్లలో అధిక లాభాల కోసం మాత్రమే ఎగుమతి చేయడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ తరహా పన్నులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ప్రస్తుత కోత వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, నాయరా ఎనర్జీ, ఓఎన్జీసీ వంటి దిగ్గజ చమురు శుద్ధి, ఉత్పత్తి సంస్థల లాభదాయకత మెరుగయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా? -
టీడీపీ నేతల వికృత చేష్టలు
దర్శి( ప్రకాశం జిల్లా): గ్రామాల్లో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వినాయకచవితి వేడుకల సందర్భంగా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్లో ఎటువంటి పోలీస్ అనుమతులు లేకుండా డీజే సౌండ్లతో డ్యాన్సర్లను తీసుకువచ్చారు. టీడీపీ నేత వేముల వెంగళరత్తయ్య ఆధ్వర్యంతో డీజే బాక్స్ల్లో పెద్ద పెద్ద సౌండ్లతో పాటలు పెట్టి డ్యాన్సర్లతో నృత్యాలు చేయించారు. డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారని తెలుసుకున్న స్థానిక యువకులు అక్కడకు చేరుకున్నారు. డ్యాన్స్ కార్యక్రమాన్ని వీడియోలు తీశారు. దీంతో వీడియోలు తీసిన దేవండ్ల వినోద్, బండారు తిరుపతి అనే యువకుల వద్దకు వచ్చి వీడియోలు డీలిట్ చేయాలని బెదిరించడంతో వారు వెంటనే ఫోన్ల నుంచి ఆ వీడియోలు డీలిట్ చేసి వెనుదిరిగారు. కొంత దూరం వెళ్లిన తరువాత వారిని వెనక్కి పిలిచి వీడియోలు ఎందుకు తీశారని టీడీపీ నేతలు ఆ ఇద్దరిని చుట్టుముట్టి చితకబాదారు. వారి సెల్ఫోన్ తీసుకొని వినోద్ మెడలో ఉన్న చైన్ కూడా లాగేసుకున్నారు. గొడవ జరుగుతుందని తెలుసుకున్న వారి బంధువులు, స్థానికులు అక్కడకు వెళ్లగా వారిపై కూడా గొడవకు దిగారు. మద్యం మత్తులో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు వినోద్, తిరుపతిలను తీసుకొని పోలీస్స్టేషన్కు వెళ్లి రాత్రి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కానిస్టేబుల్ అక్కడకు వచ్చి గొడవ పడుతున్న వారిని సర్దిచెప్పారు. డీజేలకు అనుమతి లేకున్నా ఇష్టం వచ్చినట్లు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా స్థానికులపై దాడి చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.ఇదీ చదవండి: ఐదుగురి అరెస్టుతో సరిపుచ్చారు... -
వెనక్కితగ్గని ‘రణబాలి’.. షూటింగ్ పూర్తి..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ప్రత్యే పోస్టర్ను పంచుకుంది.కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది.మసాచుసెట్స్లోని లోవెల్లో ఉన్న తన ఇంట్లోని గదిలో హుస్సేన్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్కు ఆగస్టు 28న టెక్సాస్లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్మేట్ ద్వారా సమాచారం అందింది.తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్కు రప్పించే ఏర్పాట్లు చేయడంలో తగిన ఏర్పాట్లు చేయాలని అతని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యంఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
సిద్ధరామయ్యకు ఇంతటి అవమానమా?
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఘోర అవమానం.. అదీ ఉద్దేశపూర్వకంగానే జరిగిందా?. కన్నడ నాట ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కలబురగిలోని సిద్ధరామయ్య సర్కిల్లో ఉన్న విగ్రహ తొలగింపు.. ఆయన వర్గీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలబురగి పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆసక్తి రేపుతోంది.ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ కలబురగిలో పర్యటించాల్సి ఉంది. కల్యాణ కర్ణాటక ఉత్సవాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే.. ఈ ఉదయం అక్కడి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంస్య విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే సిద్దూ అభిమానుల నుంచి విమర్శలు రావడంతో.. డీకే పర్యటనకు, విగ్రహ తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టారని వివరణ ఇచ్చారు. అలాగే ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్ను బయటపెట్టారు.A Siddaramaiah statue has appeared overnight near High Court Cross in Kalaburagi, at a spot that had earlier been turned into a Siddaramaiah Circle.The installation was allegedly carried out without permission, though the district administration is yet to clarify what action,… pic.twitter.com/UeVQW2fV1M— Deccan Herald (@DeccanHerald) September 17, 2026మూడేళ్ల కిందట ఈ సర్కిల్కు కొందరు స్థానికులు సిద్ధరామయ్య అని పేరు పెట్టారు. అయితే అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు అంటున్నారు. అంతేకాదు.. తాము తొలగించిన విగ్రహం కూడా గత రాత్రే ఏర్పాటు చేశారని.. దానికి కూడా పర్మిషన్ లేదని చెబుతున్నారు. ‘‘దాదాపు ఏడేనిమిది మంది వ్యక్తులు అర్ధరాత్రివేళ విగ్రహాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. విగ్రహం చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లుగా ఉంది. వాళ్ల ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని పోలీసులను కోరాం’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాంక్రీట్ కూడా పూర్తిగా ఆరకముందే తమ సిబ్బంది అక్కడికి చేరుకుని వెంటనే విగ్రహాన్ని తొలగించినట్లు తెలిపారు.2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. చివరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున సీఎం పదవిని పంచుకుంటారనే చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఇరువురి మధ్య అధికార భాగస్వామ్యంపై చర్చలు జరిగినప్పటికీ.. అలాంటి ఒప్పందాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. చివరకు.. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించింది. ఇదీ చదవండి: అధికారులపై కోపంతో ఏం చేశాడో చూడండి! -
ఎల్నినో ఎఫెక్ట్: అట్లాంటిక్ను తాకని హరికేన్లు!
అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క హరికేన్ కూడా ఏర్పడలేదు. 1966 తర్వాత ఇంత సుదీర్ఘకాలం హరికేన్ లేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసిన ‘ఎల్నినో’ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. జూన్ 1న ప్రారంభమైన ప్రస్తుత హరికేన్ సీజన్లో అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క భారీ హరికేన్ కూడా ఏర్పడలేదు. సెప్టెంబర్ 15 వరకు హరికేన్లు ఏర్పడకపోవడం అరుదైన పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. 2026లో కనిపిస్తున్న బలమైన ఎల్నినో దీనికి కారణమని వారు చెబుతున్నారు.హరికేన్లు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 1966 తర్వాత అట్లాంటిక్లో హరికేన్ ఏర్పడకుండా కొనసాగుతున్న సుదీర్ఘ విరామం ఇదే. 1991-2020 మధ్య వాతావరణ గణాంకాల ప్రకారం.. సాధారణంగా ప్రతి సీజన్లో తుఫాను జూన్లో ఏర్పడుతుంది. తొలి హరికేన్ సాధారణంగా ఆగస్టు ప్రారంభంలో లేదా మధ్యలో ఏర్పడుతుంది. గతంలోనూ హరికేన్లు ఆలస్యంగా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. 2022లో డేనియల్ సెప్టెంబర్ 2న ఏర్పడి ఆ ఏడాది అట్లాంటిక్లో తొలి హరికేన్గా నిలిచింది. 2013లో హంబర్టో సెప్టెంబర్ 11న ఏర్పడి ఆ సీజన్లో తొలి హరికేన్గా నమోదైంది.ఈ ఏడాది బలమైన ఎల్నినో కారణంగా అట్లాంటిక్లో తక్కువ సంఖ్యలో తుఫానులు ఏర్పడతాయని వాతావరణశాఖ ముందుగానే అంచనా వేసింది. ఈ సీజన్లో 7 నుంచి 13 పేరున్న తుఫానులు ఏర్పడవచ్చని అంచనా వేయగా.. ఇప్పటివరకు ఆర్థర్, బెర్తా, క్రిస్టోబల్, డాలీ, ఎడ్వార్డ్ అనే ఐదు ఉష్ణమండల తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయి. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోని కొంత ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటమే ఎల్నినో లక్షణం. వేడెక్కిన సముద్ర జలాలు తూర్పు పసిఫిక్లో ఉష్ణమండల తుఫానుల అభివృద్ధికి అనుకూలిస్తాయి. అయితే అట్లాంటిక్లో ఎల్నినో ప్రభావంతో సముద్ర జలాలు చల్లబడటంతో ఉష్ణమండల తుఫానులు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు తగ్గుతాయి.ఇదీ చదవండి: వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక! -
పెన్సిల్వేనియాలో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో వైఎస్సార్ పదిహేడవ వర్ధంతి నేపథ్యంలో 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మరణార్థం ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్ 12, 2026 న అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్త దాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, శివ మేక పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 300 మంది దాక కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్కి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది దాక రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ పోలంరెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, ఎల్లంపల్లి రామమోహన్ రెడ్డి, నగేష్ ముక్కమల్ల, ఆనంద్ తొండపు, ప్రసాద్ సానికొమ్ము, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, భాస్కర రెడ్డి, ఉయ్యూరు నాగి రెడ్డి, రవి మరక, కొత్త రమణ, కొండా లక్ష్మీనరసింహ రెడ్డి, గీత దోర్నాదుల, ఆళ్ళ అనుపమ రెడ్డి, తాతా రావు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.యువ వాలంటీర్స్ అనేక మంది ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ పెనుమాడ, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, హరి కురుకుండ, వెంకటరామి రెడ్డి శనివరపు మరియు ఇతరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంది డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్!మంచి భోజనం ఏర్పాటు చేసిన పెప్పర్ హౌస్ రాజేంద్ర మోదుగుల వారికి, సాక్షి టీవీ శివ్ వొడపల్లి గారికి కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా ఇలాంటి మెగా రక్త దాన శిబిరాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా అభినందించింది.ఇదీ చదవండి: వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల) -
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సురేష్ లొంగుబాటు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న సురేష్ సిట్ ఎదుట లొంగిపోయాడు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సురేష్ లొంగుబాటుతో ఈ కేసులో తదుపరి విచారణ కీలకంగా మారింది.కాగా, సాయికృష్ణ మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం ఈ వ్యవహారంలో సురేష్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సిట్ విచారణ తర్వాత ఆయన పరారీలో ఉన్నాడు. తాజాగా సిట్ కార్యాలయానికి చేరుకుని అధికారుల ఎదుట లొంగిపోయాడు. సురేష్ లొంగుబాటుతో ఈ కేసులో తదుపరి విచారణ కీలకంగా మారింది. మృతదేహం మాయం, కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ ప్రయత్నాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బాబు సర్కార్ మరో 2000 కోట్ల అప్పు.. -
రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) మరణం కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం సంచలనంగా మారింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నశివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరేకు భారీ షాక్ తగిలింది. అనుమానాస్పదంగా మరణించిన తన కుమార్తెకు న్యాయం చేయాలనిపోరాడుతున్న దిశా తండ్రి సతీష్ సాలియన్ రూ. 500 కోట్ల నష్టపరిహాం కోరుతూ నోటీసులు పంపారు. శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే , ఎన్సిపి (ఎస్పి) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ల కు పరువు నష్టం దావా నోటీసులు జారీ అయ్యాయి. ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా రాజకీయ ప్రేరేపితమైందిగా తాను చేస్తున్న న్యాయ పోరాటాన్నిచిత్రీకరించడానికి ఈ ఇద్దరు నాయకులు ప్రయత్నించారని సతీష్ సాలియాన్, దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తన నోటీసులో పేర్కొన్నారు.బహిరంగ క్షమాపణకు డిమాండ్సతీష్ సాలియన్ 'షరతులు లేని, స్పష్టమైన , ఎలాంటి షరతులు లేని లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ' చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్షమాపణను అన్ని ప్రధాన ప్రింట్, టీవీ మరియు డిజిటల్ మీడియా వేదికలలో ప్రచురించి, ప్రసారం చేయాలి. అంతేకాదు బేషరతుగా బహిరంగ క్షమాపణలతోపాటు, సోషల్ మీడియాలో మూడు నిమిషాల వీడియోను పోస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు ఆదిత్య థాకరే మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఇప్పటికే ఖండించారు. దిశా సాలియాన్ను తాను ఎప్పుడూ కలవలేదని, తన పేరును ఈ కేసులో అనవసరంగా లాగుతున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు.Let’s cut through the noise and talk facts, once again: I have never met or known Disha Salian. Linking my name to this tragic case constantly is a deliberate, evidence-free attempt at character assassination by a few individuals with clear political and personal motives, for…— Aaditya Thackeray (@AUThackeray) September 16, 2026 2020 జూన్ 8న 28 ఏళ్ల దిశా సాలియన్, ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక ఎత్తైన నివాస భవనం నుండి పడి మరణించింది. పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా పరిగణించి, యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్) నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించారు.ఈ కేసును సీబీఐ తాజాగా తన చేతులోకి తీసుకుని, హత్య మరియు క్రిమినల్ కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
‘గబ్బర్ సింగ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గతంలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకొని గబ్బర్సింగ్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని చూస్తున్న వీడియో వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) ద్వారా రమేశ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే ‘అంత్యాక్షరి’ కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనంతరం అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ పాత్రల్లో నటించాడు. సోషల్ మీడియాలో కూడా రమేశ్ యాక్టివ్ గా ఉండేవారు. ‘గబ్బర్సింగ్’ ఫేమ్ నటుడు రమేశ్కు బ్రెయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ❤️🩹ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 🙏❤️#Ramesh #GabbarSingh #GetWellSoon #Tollywood #Trending pic.twitter.com/YKmvFWn0Ok— Sanjuuuuu🐦 (@speaks57458) September 17, 2026 -
ఉత్సవమే కాదు... నిమజ్జనం కూడా..!
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శ్రీ గణేశునికి విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ గణేశుడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలను తొలగించే దేవతగా ఆయనను ఆరాధిస్తాం. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే మన జీవితంలోని అసలైన విఘ్నాలు బయట ఉండేవి కావు. మనలోని అహంకారం, జడత్వం, భయం, అజ్ఞానం, అస్థిరతలే మన ఎదుగుదలకు ప్రధాన అవరోధాలు. వీటిని అధిగమించడానికి కావలసిన వివేకాన్ని ప్రసాదించే శక్తే శ్రీ గణేశ తత్వం.ప్రకృతి వెనుక ఉన్న దైవశక్తి, మన చుట్టూ కనిపించే ప్రకృతి, జీవం, విశ్వం– ఇవన్నీ ఒక అద్భుతమైన దైవిక వ్యవస్థలో భాగాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచతత్వాల సమన్వయంతో జీవ సృష్టి కొనసాగుతోంది. శ్రీ మాతాజీ నిర్మలా దేవి తమ ఆధ్యాత్మిక సందేశంలో శ్రీ గణేశ తత్వాన్ని ప్రకృతి, సృష్టి, జీవశక్తితో అనుసంధానిస్తూ వివరిస్తారు. ప్రకృతిలోని పంచతత్వాలను కదిలించి జీవసృష్టికి మార్గం సుగమం చేసే దైవశక్తిగా శ్రీ గణేశుని తత్వాన్ని ఆమె వివరిస్తారు.కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాలు జీవరాశుల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టిలో వీటిని వివిధ దైవశక్తులకు ప్రతీకలుగా భావించి, సష్టి వెనుక పనిచేసే చైతన్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. విజ్ఞానం ప్రకృతి ఎలా పనిచేస్తుందో వివరిస్తే, ఆధ్యాత్మికత ఆ ప్రక్రియ వెనుక ఉన్న చైతన్యాన్ని అనుభూతి చేయడానికి మనిషిని అంతర్ముఖుడిని చేస్తుంది. ఈ సమస్త ప్రక్రియల మధ్యలో ఉన్న సమన్వయ శక్తినే శ్రీ గణేశ తత్వంగా చూడవచ్చు. అనంత చతుర్దశికి ఒక విశేషం వుంది. ఆ రోజు నాడే శ్రీ వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఆయనను ప్రతిష్టించి పది రోజులు పూజలు జరుపుకున్న తరువాత మట్టితో చేసిన ఆయన ప్రతిమను నదిలో గానీ, సముద్రంలో గానీ కలపడానికి కారణం అలా పూజలందుకున్న వినాయకునికున్న శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాపిస్తాయని, ఆ విధంగా శ్రీ గణేశుని శక్తులు, తత్వం అయిన పవిత్రత, వివేకం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణ భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి.అనంత అంటేనే శ్రీ వినాయకుడు. అనంత అంటే నాశనం లేనివాడు. అనంతంగా వ్యాపించి ఉన్న గణేశశక్తి. అంతటి మహత్తు, మహిమాన్వితుడిని గంగానదిలో గానీ, సముద్రంలో కలపడానికి గానీ తీసుకెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, మేళతాళాలతో, మంగళ ప్రదమైన గణేశ్ కీర్తనలతో ఆయనను సాగనంపాలి.ఆయన జన్మించిన నాల్గవ రోజు అంటే చవితి నాడు ఆయనను ప్రతిష్టించి, ఆ తరువాత పదవ రోజున, అంటే అనంత చతుర్దశి నాడు సముద్రంలో నిమజ్జనం చేయడానికున్న ప్రాముఖ్యత అటువంటిది. మట్టినుండి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి తద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత గణేశ నవరాత్రి ఉత్సవాలను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా అంతే గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పుణ్యకార్యంగా జరుపుకోవాలి.– డా. ప్రతాని రాకేశ్(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాలు ఆధారంగా) శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఇదీ చదవండి: జింకపిల్లకు పులిపాలు! -
HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్!
సాక్షి హైదరాబాద్: తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో 9 సంస్థల్లో ఆహార ఉత్పత్తులు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించి, లైసెన్సులను రద్దు చేశారు. మరో 5 సంస్థలకు పరిస్థితులను మెరుగుపరచుకోవాలని నోటీసులు అందించారు. మొత్తం 20 ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఉన్న 20 ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కలుషిత మాంసం, పురుగులు పట్టిన ముడి సరుకులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద, అపరిశుభ్రమైన వంటశాలలు, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన ముడి సరుకులు లభించాయి. ఆహార తయారీదారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారించారు. హోటల్ సంగీత్ గ్రాండ్, బహార్ బిర్యానీ కేఫ్, బాలాజీ ఫేని, అండ్ నమ్కిన్, భువనేశ్వరి ఆయిల్ ఇండస్ట్రీ, హోటల్ సింధూర ఈస్ట్ కోర్ట్, కెమెస్ట్రీ బార్ అండ్ కిచెన్ (సురభి గ్రాండ్), న్యూ లిమ్రా హోటల్, ఎన్ విలేజ్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ చంపాపేట్, కినరా గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బార్. వనస్థలిపురం సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు టీజీ సేఫ్ అధికారులు వివరించారు. రామకృష్ణ ఆయిల్ మిల్, గ్రీన్ల్యాండ్ దాబా, కెఫీ కేఫ్, వన్ లాంజ్ బార్ అండ్ కిచెన్లకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్, అన్టెరా–నాగోల్, హోటల్ సారథి గ్రాండ్, లక్కీ రెస్టారెంట్–నాగోల్, విజయ రాఘవేంద్ర హోటల్, భగవతి మిస్తాన్ భండార్, ది జాయింట్ అల్ మండీ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదీ చదవండి: KBR Park: ఇక అదే దారి -
పన్ను చెల్లింపుదారులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్
ఇన్కమ్ టాక్స్ సెటిల్మెంట్ కమిషన్ (ఐటీఎస్సీ) తుది ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అదే అంశాన్ని లేదా పన్ను వివాదాన్ని అసెస్సింగ్ ఆఫీసర్లు (ఏఓ) మళ్లీ రీఓపెన్ చేసి పునపరిశీలించడం (రీఅసెస్మెంట్) చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్టసభలు (పార్లమెంట్) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని చాప్టర్ XIX-A రూపకల్పనలో ఇటువంటి చర్యలను ఏమాత్రం ఊహించలేదని కోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ‘అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ వర్సెస్ ఎం/ఎస్ ఒమాక్స్ లిమిటెడ్’ కేసులో పన్ను శాఖ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.కేసు నేపథ్యంరియల్ ఎస్టేట్ సంస్థ ఒమాక్స్ లిమిటెడ్ 2006-07 అసెస్మెంట్ సంవత్సరానికి గాను హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సెక్షన్ 80-IB(10) కింద రూ.78.99 కోట్ల మినహాయింపు పొందింది. అనంతరం పన్ను వివాద పరిష్కారం కోసం కంపెనీ సెటిల్మెంట్ కమిషన్ను ఆశ్రయించగా 2008 మార్చిలో కమిషన్ తుది తీర్పునిస్తూ టాక్సబుల్ ఇన్కమ్ను ఖరారు చేసింది. అయితే, 2009 డిసెంబర్లో పన్ను శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా సెక్షన్ 148 కింద అసెస్సింగ్ ఆఫీసర్ రీఓపెన్ నోటీసులు ఇచ్చి, మినహాయింపులను నిరాకరిస్తూ రూ.65.65 కోట్లను అదనపు ఆదాయంగా చేర్చారు.దీన్ని సవాలు చేస్తూ ఒమాక్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు రీఓపెనింగ్ నోటీసులను రద్దు చేసింది. పన్ను శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పన్ను శాఖ అప్పీలును తోసిపుచ్చింది.ధర్మాసనం కీలక వ్యాఖ్యలుసెక్షన్ 245D(1) కింద సెటిల్మెంట్ దరఖాస్తును కమిషన్ ఆమోదించిన క్షణం నుంచే ఆ కేసుపై పూర్తి అధికార పరిధి కమిషన్కు మాత్రమే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ సెక్షన్ 143(2), 148, లేదా 154ల కింద అసెస్సింగ్ ఆఫీసర్లకు మళ్లీ స్వతంత్ర విచారణ అధికారాలు ఇస్తే సెటిల్మెంట్ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా లభించిన తుది నిర్ణయ పునాదే దెబ్బతింటుంది. సెటిల్మెంట్లో మోసం లేదా వాస్తవాల సమర్పణలో తప్పుదోవ పట్టించారని పన్ను శాఖ భావిస్తే సెక్షన్ 245D(6) కింద సెటిల్మెంట్ కమిషన్నే ఆశ్రయించాలి తప్ప అసెస్సింగ్ ఆఫీసర్లు నేరుగా రీఓపెన్ చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. ఒమాక్స్ విషయంలో పన్ను శాఖ దాఖలు చేసిన సెక్షన్ 245D(6) పిటిషన్ను కూడా కమిషన్ ఇప్పటికే తిరస్కరించిందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా? -
నిజాంను పొగిడే నేతల డీఎన్ఏ టెస్ట్ చేయాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందని.. అలాంటిది నిజాంను పొగిడే నాయకులు ఓసారి ఇక్కడి పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కాస్త తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ నాలుగు పండుగలు ఒకేసారి వచ్చాయని ఆయన అన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకేరోజు రావడం ప్రత్యేకమన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్ర్యం పొందితే.. తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు.నిజాం పాలనపై తీవ్ర వ్యాఖ్యలునిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ప్రజలు విమోచనం సాధించుకున్నారని బండి సంజయ్ అన్నారు. వీర బైరాన్పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాంటి చరిత్రను పక్కనపెట్టి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.నిజాంను పొగిడే నాయకులు తెలంగాణ పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో నిజాంను ప్రశంసిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని రక్తపాతం సృష్టించిన నిజాం పాలనను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. నిజాంను పొగిడే నేతలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని, అసలు వారు ఈ దేశ పౌరులేనా? లేక విదేశీ డీఎన్ఏ ఉందా? అనేది చూడాలంటూ వ్యాఖ్యానించారు.చరిత్రను భావితరాలకు చెప్పాలితెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిన చరిత్ర మోదీ ప్రభుత్వానిదేనని బండి సంజయ్ పేర్కొన్నారు.అవినీతిపై విమర్శలుకొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి తావులేకుండా మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు.తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలో ఆలోచించుకోవాలని ఆయన కోరారు. అవినీతిమయమైన పాలన కావాలా? అవినీతి రహిత పాలన కావాలా? తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసే పాలన కావాలా? లేక ఆ చరిత్రను భావితరాలకు అందించే పాలన కావాలా? అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీకి ప్రతి తెలంగాణ పౌరుడు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాట చరిత్రను పాట, సంగీతం, దృశ్యరూపంలో ప్రజలకు అందించిన ఆకుల నాగేశ్వర్, వందేమాతరం శ్రీనివాస్, దీపికలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇదీ చదవండి: ‘ఎవరి ఆస్తులు ఎంతో తేలుద్దామా?’.. కేటీఆర్ సవాల్ -
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టును అదృష్టం వరించింది. మ్యాచ్ ఆడే అవసరం లేకుండానే ఆసియా క్రీడల సెమీ ఫైనల్లో బంగ్లా అడుగుపెట్టింది. అసలేం జరిగిందంటే.. జపాన్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.చైనాతో మ్యాచ్ఇందులో భాగంగా మహిళల క్రికెట్ జట్ల మధ్య సెప్టెంబరు 17 నుంచి సెప్టెంబరు 22 వరకు టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా మహిళా జట్లు మ్యాచ్ ఆడాల్సి ఉంది.ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దుఅయితే, వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ నేరుగా సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు.. ఒక్క బంతి కూడా పడకుండానే చైనా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.చైనా జట్టు (PC: X)సెమీస్కు బంగ్లాదేశ్ అర్హతకాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ మహిళా జట్టు పదో స్థానంలో ఉండగా.. చైనా 36వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్- పాకిస్తాన్ జట్లు గురువారమే తలపడనున్నాయి.మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా- శ్రీలంక మహిళా జట్లు పోటీ పడనుండగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ జట్లు తలపడతాయి. కరోగి స్పోర్ట్స్ పార్క్లో సెప్టెంబరు 18న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన జట్టును బంగ్లాదేశ్ సెమీస్లో ఢీకొంటుంది. సెమీ ఫైనల్లో భారత్తో ఢీబలాబలాలు, ర్యాంకింగ్స్ ఆధారంగా హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు జపాన్ కంటే పటిష్ట స్థితిలో ఉంది. కాబట్టి సెప్టెంబరు 20న జరిగే తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాను ఎదుర్కొనే అవకాశం ఉంది.చదవండి: అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్! -
వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!
వాషింగ్టన్: అమెరికా నైరుతి ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలను రానున్న రోజుల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అరిజోనా, న్యూ మెక్సికో, ఉటా, కొలరాడోలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల (సుమారు 30 సెం.మీ.) వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది సంభవిస్తే ‘1,000 ఏళ్లకు ఒకసారి’ చోటుచేసుకునే స్థాయి వర్షపాతంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో దాదాపు కోటి మంది అమెరికన్లు వరదల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వరద హెచ్చరికలను అమెరికా జాతీయ వాతావరణ శాఖ జారీ చేసింది. తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. గంటకు 2–3 అంగుళాల వర్షపాతం నమోదయ్యేంత తీవ్రత ఉండొచ్చని పేర్కొంది. స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ వాతావరణ నిపుణులు తెలిపారు. ఫీనిక్స్, టక్సన్ ప్రాంతాల్లో శుక్రవారం నాటికి 2–4 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే అరిజోనాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నెలకొంది. బుధవారం (సెప్టెంబర్ 16) టక్సన్లో అరగంట వ్యవధిలో మూడు అత్యవసర ఘటనలను అగ్నిమాపక సిబ్బంది పరిష్కరించారు. పాక్షికంగా నీటిలో మునిగిన కారుపై చిక్కుకున్న ఓ డ్రైవర్ను రక్షించారు. మరో వాహనదారుడు నార్త్ అలామో అవెన్యూ, ఈస్ట్ రోజ్వుడ్ స్ట్రీట్ వద్ద కారులో చిక్కుకోగా.. వరద నీటిలో కొట్టుకుపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించాయి. మరో వ్యక్తి గ్రాంట్ రోడ్, వ్యాట్ డ్రైవ్ సమీపంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సకాలంలో కాపాడారు.ఈ సమయంలో నైరుతి అమెరికాలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సాధారణమేనని అక్యూవెదర్ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతంలో గాలుల దిశ మారడంతో మెక్సికో, కాలిఫోర్నియా గల్ఫ్ నుంచి వేడి, తేమతో కూడిన గాలి ఉత్తర దిశగా వస్తుంది. తేమ పైకి ఎగసి ఉరుములతో కూడిన వర్షాలుగా మారుతుంది. కొలరాడో, న్యూ మెక్సికో, నెవాడాలోని కొన్ని ప్రాంతాలకు వర్షం అవసరమైనప్పటికీ.. ఆకస్మికంగా భారీ వర్షాలు కురిస్తే వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఇదే చివరి భారీ వర్షాల ఉద్ధృతి కావచ్చని, అయితే బలమైన ఎల్నినో పరిస్థితులు దీనిని మార్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు.. 76 కప్పుల టీ ఉచితం! -
ఆస్తి తీసుకున్నారు.. అమ్మను గెంటేశారు
హైదరాబాద్: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లికి చివరి దశలో అండగా నిలవాల్సింది పోయి ఆస్తి కోసం ఆమెను వేధించి ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తూ 68 ఏళ్ల వృద్ధురాలు కన్నీటిపర్యంతమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగార్జున నగర్ కాలనీకి చెందిన కందడి వెంకటమ్మ ఇప్పటికే భర్త, కుమారుడిని కోల్పోయింది. జీవిత చరమాంకంలో తన ఇద్దరు కుమార్తెలు అండగా ఉంటారని భావించినా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. తనకున్న ఆస్తిని ఇద్దరు కుమార్తెలు తమ పేర్లపై రాయించుకున్న అనంతరం తనపై దాడి చేసి, దుర్భాషలాడి ఇంటి నుంచి బయటకు నెట్టివేశారని వెంకటమ్మ ఆరోపిస్తున్నారు. తనను చూసుకునేవారు కూడా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన వెంకటమ్మ ఆరుబయట కూర్చొని భోరున విలపిస్తోంది. ఆమె పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. ఘటనపై అధికారులు స్పందించి వృద్ధురాలు వెంకటమ్మకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వెంకటమ్మ బుధవారం పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని, వృద్ధాప్యంలో భద్రత, అండ కలి్పంచాలని వేడుకున్నారు. ఇదీ చదవండి: అమ్మో.. అంత అవినీతా..? -
డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలడంతో కారు క్యాబిన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ కలెక్టరేట్కు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ బయలుదేరారు. అయితే, చింతపల్లి వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా కేబిన్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది వెంటనే వాహనం నుంచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి.భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం పెద్దదిగా మారలేదు. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిసి అధికారులు, స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పవర్ బ్యాంక్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్కి తప్పిన ప్రమాదంఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో చెలరేగిన మంటలుడ్రైవర్కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిమహబూబాబాద్లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో… pic.twitter.com/dR5qFiKciq— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026Video Credit: Telugu Scribeఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్ -
కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన వాణిజ్య వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తోంది కియా. తన ప్రతిష్టాత్మక 'ప్లాట్ఫారమ్ బియాండ్ వెహికల్'(PBV) శ్రేణిలో భాగంగా రెండవ ఎలక్ట్రిక్ వ్యాన్ ‘PV7’ ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇదివరకే విడుదలైన చిన్న మోడల్ PV5 తర్వాత, భారీ సైజులో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ వ్యాపార, రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.బ్యాటరీ, రేంజ్.. ఛార్జింగ్పవర్ అండ్ మోటార్: ఇందులో ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండి, దాదాపు 268 హెచ్పీ (200 kW) పవర్, 420 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.బ్యాటరీ ఆప్షన్లు: ఇది 71.5 కిలోవాట్లు, 96.2 కిలోవాట్లు సామర్థ్యంగల NCM (నికెల్-కోబాల్ట్-మాంగనీస్) బ్యాటరీ ప్యాక్లతో రానుంది.డ్రైవింగ్ రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 460 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.ఫాస్ట్ ఛార్జింగ్: వ్యాన్ను 800V E-GMP.S ఆర్కిటెక్చర్పై నిర్మించారు. 350kW DC ఫాస్ట్ ఛార్జర్ను ఉపయోగిస్తే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ 10% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది.డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్స్: వాణిజ్యపరంగా సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ముందు వైపు AC/DC ఛార్జింగ్ పోర్ట్తో పాటు వెనుక వైపు ఆప్షనల్ AC ఛార్జింగ్ పోర్ట్ను కూడా అందించారు.అదనపు సాంకేతికత: ఇందులో V2L (వెహికల్-టు-లోడ్) టెక్నాలజీ ఉంది. దీని ద్వారా వాహనం బ్యాటరీ నుంచి బయటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పవర్ టూల్స్కు విద్యుత్ను వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్ను కూడా తీసుకరానున్నారు.పరిమాణం, డిజైన్చిన్న మోడల్ PV5 డిజైన్ థీమ్తోనే వచ్చినప్పటికీ, PV7 భారీ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. పొడవు 5,350 మిమీ, వెడల్పు 1,995 మిమీ, ఎత్తు 1,990 మిమీ, వీల్బేస్ 3,500 మిమీ ఉంటుంది. ముందు భాగంలో సన్నని ఎల్ఈడీ హెడ్లైట్లు, సిల్వర్ యాసెంట్లతో కూడిన బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, C-ఆకారపు ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) దీనికి ఆధునిక లుక్ను ఇస్తాయి. ప్రయాణికుల వెర్షన్లో సాంప్రదాయ లిఫ్ట్-అప్ టైల్గేట్ ఉండగా, కార్గో మోడల్లో సామాన్లు వేగంగా నింపేందుకు వీలుగా ట్విన్-స్వింగ్ టైల్గేట్ ఆప్షన్ కూడా కలదు.ప్యాసింజర్ & కార్గో మోడళ్లుప్యాసింజర్ వెర్షన్: అత్యధిక మార్కెట్లలో 7 నుండి 9 సీట్ల కాన్ఫిగరేషన్తో రానుంది. అయితే దక్షిణ కొరియాలో 11 సీట్ల వెర్షన్ అందుబాటులోకి రానుంది. అవసరాన్ని బట్టి తీసివేసేందుకు (Removable) వీలైన సీటింగ్ అమరిక ఉంటుంది.కార్గో వెర్షన్: వ్యాపార అవసరాల కోసం రూపొందించిన ఈ మోడల్ 1,200 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాంపాక్ట్, లాంగ్, హై-రూఫ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. సామాన్ల బరువును బట్టి వాహనం నడిచే విధానాన్ని సర్దుబాటు చేసే ‘హెవీ-లోడ్ డ్రైవింగ్ మోడ్’ కూడా ఇందులో ఇచ్చారు.ఇంటీరియర్, ఇన్ఫోటైన్మెంట్ & సేఫ్టీకనెక్టివిటీ: ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే 14.6 అంగుళాల బిగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటాయి.ఫీచర్స్: క్యాబిన్లో యాంబియంట్ లైటింగ్, వెనుక ప్రయాణికులకు రూఫ్-మౌంటెడ్ ఎస్సీ వెంట్స్, ప్రతీ సీటు వద్ద100W USB-C ఛార్జింగ్ పోర్టులు ఏర్పాటు చేశారు.సేఫ్టీ: ప్రయాణికుల భద్రత కోసం పైకప్పులో కో-డ్రైవర్ ఎయిర్బ్యాగ్తో సహా మొత్తం 7 ఎయిర్బ్యాగ్లు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.విడుదల ఎప్పుడంటే?కియా PV7 ఎలక్ట్రిక్ వ్యాన్ను 2027 ద్వితీయార్థంలో ముందుగా దక్షిణ కొరియా, యూరప్ మార్కెట్లలో లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం దీనిని భారతదేశంలో విడుదల చేసే ఆలోచన ఏదీ లేదని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. లాంచ్కు ముందే బుకింగ్లు -
భగవాన్ విశ్వకర్మకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విరాట్ విశ్వకర్మ భగవాన్, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు ఎస్.ఎం. పవిత్ర, తోలేటి శ్రీకాంత్, విశ్వబ్రాహ్మణ నాయకులు ఎస్.డి. మురళీకృష్ణ, కె. గురవాచారి, ఉదయ్కుమార్, శేఖర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. -
దేవిశ్రీ ప్రసాద్కి జోడీగా అనంతిక!
'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'ఎల్లమ్మ'. ఎప్పటినుంచో సెట్స్ మీద ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ల క్రితం గ్లింప్స్ లాంటి వీడియో రిలీజ్ చేశారు. ఆ తరువాత దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మరో అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో దేవిశ్రీ సరసన ఎవరు నటిస్తారనే చర్చ ఉంది. అయితే ఈ ఛాన్స్ అనంతిక సనిల్కుమార్ కొట్టేసిందట. ఇప్పటికే 'మ్యాడ్', '8 వసంతాలు', 'రోమాంచకం' వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ తార. ఇదే నిజం అయితే మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు: అల్లు అరవింద్ఇప్పటికే విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో పార్సి అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. క్లీన్ షేవ్ చేసిన లుక్లో దేవి డిఫరెంట్గా ఉన్నాడు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!
ఏపీలో మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశాలు పెట్టి ఏం సాధిస్తున్నట్లు?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల తరబడి ఇచ్చే స్పీచ్లను గమనిస్తే, ఒకసారి అంతా బాగుందని చెబుతారు. మరో సారి కలెక్టర్లు, ఐఏఎస్లు సరిగా పనిచేయడం లేదని అంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదలివేస్తుంటారని కూడా ఆయనే చెబుతారు. 12 గంటలపాటు కూర్చోలేరా? అని ప్రశ్నించి అధికారులందరిని ఆశ్చర్యపరుస్తారు. ఏవేవో ర్యాంకులు అంటారు. ఫైళ్ల క్లియరెన్స్ అంటారు. ఒక మంత్రి మొదటి స్థానంలో ఉన్నారంటారు. తదుపరి ఆ మంత్రి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రే మందలిస్తారు. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నామని, లక్షన్నర కోట్లు వ్యయం చేశామని చెబుతారు. అదెలాగో స్కీములవారీగా వివరణ ఇవ్వరు. అందులో నిజం అంత ఎన్నది ప్రజలు లెక్కవేసుకోవాల్సిందే. గత ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి చర్చించరు!అప్పట్లో చంద్రబాబు ప్రకటించిన వివిధ స్కీములకు ఏడాదికి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని ఆనాటి సీఎం జగన్ చెబితే, తమకు సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. ఈ రెండేళ్లలో ఇన్నిసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి కదా! ఎంత మేర సంపాదన సృష్టించింది లెక్కలు చెప్పి ఉండవచ్చు కదా! లేదా తాను చేసిన 3.90 లక్షల కోట్ల అప్పే సంపద అని అనుకోమంటారా!. మరోవైపు పెన్షన్దారులలో అనర్హుల పేరుతో ఏరివేయాలని అంటారు. చివరికి పెన్షన్ దారులను తాగుబోతులుగా అభివర్ణిస్తారు. మద్యం షాపులను ఇష్టారాజ్యంగా సిండికేట్లకు ఇచ్చి బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెడతారు. ఎంఆర్పీ మించి ధరకు అన్ని చోట్ల అమ్ముతున్నా,చర్యలు ఉండవుకాని, కలెక్టర్ల సదస్సులో మాత్రం హుంకరిస్తుంటారు.ఎన్నికలకు ముందు సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకుంటే తప్పేముందని,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఆయనే హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయి ఉండవచ్చు. డిఎస్సిని బాగా చేశామని అంటారు. అక్రమాలు బయటపడడంతో డిఎస్సి నిర్వహణ అంతా అధికారులే చూసుకున్నారని చెప్పేస్తారు.చంద్రబాబు చెప్పే అనేక అంశాలలో ఒకదానితో మరొకటి పొంతన ఉండదన్న భావన ఉంది.గత కలెక్టర్ల సమావేశాలలో వచ్చిన సమస్యలే మళ్లీ,మళ్లీ వస్తుంటాయి. అంతా ఏకపాత్రాభినయంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుందని కొందరు అదికారులు వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు అధికారులను ఆయన కావాలని అవమానించేలా మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతోందన్న ప్రచారం ఐఏఎస్ వర్గాలలో జరుగుతోంది.వీరిని స్కూల్ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయడం, తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది.ఎవరి పని తీరైనా నచ్చకపోతే వారిపై చర్య తీసుకోవచ్చు.లైవ్ లో టీవీ ప్రసారాలు జరుగుతున్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితే అదికారులలో నైతిక స్థైర్యం దెబ్బతినదా అన్నది ప్రశ్న. అధికారులు కొందరు సమావేశాలకు రాకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి కదా! మంత్రులు, ఐఏఎస్ లు అంతా రావల్సిందేనట.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు రాకపోయినా, ఈ సదస్సులకు హాజరుకాకపోయినా ఇలాగే ప్రశ్నిస్తున్నారా అని ఐఏఎస్ లు గుసగుసలాడుకున్నారట. ఐఏఎస్ లు ఈ చెవితో విని ,ఆ చెవితో వదలివేస్తున్నారని చంద్రబాబే చెప్పిన తర్వాత ఈ సదస్సులకు ఉన్న విలువ ఏమిటో అర్ధం అవుతూనే ఉంది.12 గంటలు కూర్చోవాల్సిందేనని సీఎం ఆదేశిస్తే, బయటకు వెళ్లిన తర్వాత అదికారులు ఏలా ఫీల్ అవుతారో ఊహించుకోపోవచ్చు. ఇదంతా లాఫింగ్ స్టాక్ అవుతుందని గమనించాలి.సుదీర్ఘంగా మాట్లాడడం అలవాటు చేసుకుని గంటల తరబడి ప్రసంగాలు చేస్తే ఎంత ఐఏఎస్ లైనా ఎలా భరించగలుగుతారు? నిజానికి సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందిన ఈ రోజుల్లో రెండు రోజుల పాటు ఇలా కలెక్టర్ల సదస్సులు పెట్టడం అవసరమా?కాదా?అన్న చర్చ ఉంది.అసలు సమావేశాలు వద్దని ఎవరూ అనరు.కాని అవి అర్ధవంతంగా లేకపోతే రెండు రోజుల ఖర్చు వృధా అవడం తప్ప ఏమీ ఉండదు కదా అన్నది కొందరి అభిప్రాయం. రాజకీయ పాలన చేయాలని ఐఏఎస్ లకు,ఐపిఎస్ లకు చెప్పిన తర్వాత ఇంక వారు చేసే సాధారణ పాలన ఏమి ఉంటుంది?తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన పనులు చేయడమే కదా రాజకీయ పాలన అంటే!ప్రత్యర్ధి రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఎలాంటి పనులు జరగకూడదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత కలెక్టర్లు నెత్తి,నోరు కొట్టుకోవడం తప్ప ఏమి ఉంటుంది?గంటల తరబడి ఉప్యాసాలు ఇచ్చేసి ,ఎవరైనా అధికారులు సమస్యలు చెప్పబోతే వారిని డబాయిస్తే అవి ఎలా పరిష్కారం అవుతాయి.గత సమావేశంలో కూడా అటవీ శాఖ,పర్యావరణ సమస్యలు వచ్చాయి. దానికి చంద్రబాబు ఇచ్చిన చిట్కా ఏమిటో తెలుసా!కాసేపు అటవీ,పర్యావరణ అధికారులు కళ్లు మూసుకోవాలట.అప్పుడు పనులు చేసుకోవాలట. సంబంధిత చట్టాలు చేసింది ఎవరు?వాటిని అమలు చేయవద్దని చెబుతున్నదెవరు? పెన్షన్ల ను,ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇచ్చేసిందట.సాచ్యురేషన్ మోడ్ లో గత ప్రభుత్వం వివిధ స్కీములను అమలు చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు గుప్పించి,కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత దానిని చంద్రబాబు తప్పుపడుతున్నారు.అది సరికాదని అనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసివేసి ఉండాలి కదా!రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపి స్థానిక ఎన్నికలకు ముందు పెన్షన్లు ఇవ్వడంలోకాని, అనర్హతతో రద్దు చేసే ఆలోచనకాని ఎందుకు చేస్తున్నట్లు?ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తమకు కావల్సినవారికే పెన్షన్ దరఖాస్తులు అప్ లోడ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే వైఎస్సార్సీపీ మద్దతుదారుల పెన్షన్లు రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలట. అదేమిటో అర్ధం కాదు.ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వారు బతుకుతారు. వారిలో అర్హులైనవారికి పెన్షన్లు,ఇళ్లు వంటివాటిని ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల పేరుతో వీటిని తగ్గించాలని చూస్తున్నారా అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.దీనికి ఎల్లో మీడియా పెట్టిన హెడింగ్ ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?దీనిని చంద్రబాబు ఆచరించి చూపారా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.కుటుంబం ఒక యూనిట్ అయితే పెన్షన్లు, ఇళ్లు తదితర అన్నీ స్కీములలో లబ్దిదారులు బాగా తగ్గిపోతారన్నమాట.ప్రస్తుతానికి లబ్దిదారులను యధాతధంగా కొనసాగిస్తామని అంటున్నా,దానికి గ్యారంటీ ఏమి ఉంటుంది. కొంతమందికి ఒక విధానం, మరికొందరికి ఇంకో విధానం ఉంటుందా? ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఎలా చెప్పారు?అప్పుడు ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించలేదా?యధా ప్రకారం వైఎస్సార్సీపీపైన పరోక్ష విమర్శలు చేయడం, ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్ లను వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ,లేదా మరికొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా అధికారులను పురికొల్పడం కోసం కలెక్టర్ల సమావేశాలు పెట్టాలా? ఇప్పటికే పోలీసు, అధికార యంత్రాంగం ద్వారా అన్ని కుట్రలు చేస్తున్నారు కదా! పైళ్ల క్లియరెన్స్ అంటూ లెక్కలు చెప్పడం ఆయనకు ఎప్పటి నుంచో అలవాటే. దాదాపు ప్రతి రోజు ఆయా జిల్లాలకు వెళ్లి సభలు పెట్టి అధికారులకు ర్యాంకులు ఇస్తున్న చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ర్యాంకులు అంటూ కధ నడపడం దేనికి?. విశేషం ఏమిటంటే చంద్రబాబేమో అన్ని పనులు చేసేయాలని హుకుం జారీ చేస్తుంటారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ అడిగింది లోకేష్కు అర్థం కాలేదా?ఆర్ధిక మంత్రి కేశవ్ ఏమో బడ్జెట్ తో సంబంధం లేకుండా మితిమీరి ప్రతిపాదనలు వస్తుంటే ఒత్తిడి అవుతోందని అంటున్నారు.నిధులు ఇచ్చినా,ఇవ్వకపోయినా పనులు జరగాలంటే అది ఎలా అవుతుంది. చివరికి అసలు విషయం ఏమిటంటే తమది రాజకీయ పాలన కనుక కూటమి నేతలకు అధికారుల వద్దకు వస్తే గౌరవించాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రజలు ఎవరు వచ్చినా, ఏ రాజకీయ పార్టీవారు వచ్చినా మర్యాద ఇవ్వండి అని చెప్పవలసిన చంద్రబాబు ఇలాంటి ప్రసంగాలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం అనిపించదా!అయినా ఆయన తప్పులేదనుకోవాలి.రాజకీయ పాలన చేస్తామని ఆయన చెబుతుంటే జనం నిలదీయనంతకాలం ఇలాంటి నేతలు ఇలాగే పాలన చేస్తారు.-కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నగవులు నిజమని నమ్మేదా?
‘నగవులు నిజమని నమ్మేదా..’ అన్న నానుడి కేవలం మానవ సంబంధాలకే కాదు, నేటి ఆర్థిక ప్రపంచానికీ అక్షరాలా వర్తిస్తుంది. షేర్ మార్కెట్ ఇండెక్స్లు ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరడం, ఆకర్షించే ప్రకటనలు, చవకైన ఈఎంఐల హంగామా చూసి అందరూ బాగున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. పైకి కనిపించే ఈ ‘ఆర్థిక నవ్వులు’ నిజమైన పురోగతికి సంకేతాలా? లేక సామాన్యుడిని ఆకర్షించే అందమైన మాయాజాలమా? లోతుగా పరిశీలిస్తే ఆ వెలుగుల వెనుక పరుచుకున్న చీకట్లు స్పష్టంగా కనిపిస్తాయి.సూచీల హంగామా..నేడు భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న వ్యవస్థగా రికార్డులు సృష్టిస్తోంది. కానీ, ఈ వృద్ధి ఫలాలు సగటు పౌరుడికి ఏమేరకు అందుతున్నాయనే ప్రశ్నలొస్తున్నాయి. అధికారికంగా ద్రవ్యోల్బణ గణాంకాలు కంట్రోల్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నా నిత్యావసర సరుకులు, పప్పుధాన్యాలు, వైద్యం, విద్య ఖర్చులు సగటు మధ్యతరగతి జేబుకు చిల్లులు పొడుస్తూనే ఉన్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆదాయం పెరగకపోవడం, ఖర్చులు రెట్టింపు కావడమే దీనికి ప్రధాన కారణం.ఈఎంఐల మాయ.. అప్పుల ఊబిప్రస్తుతం విపణిలో ‘ఈజీ ఈఎంఐ, బై నౌ - పే లేటర్’ సంస్కృతి విపరీతంగా పెరిగింది. చేతిలో డబ్బు లేకపోయినా జీవనశైలిని ప్రదర్శించేందుకు సామాన్యులు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా భద్రత లేని రుణాలు(అన్సెక్యూర్డ్ లోన్లు) వేగంగా పెరగడం పట్ల పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. పైకి కనిపిస్తున్న ఆర్థిక విలాసం వెనుక జీవితాంతం తీర్చాల్సిన అప్పుల భారం దాగి ఉందనేది చేదు నిజం.పెట్టుబడుల్లో విచక్షణే రక్షణసోషల్ మీడియాలో వచ్చే ఫిన్ఫ్లూయెన్సర్ల సలహాలు, రాబడి ఆశజూపే క్లిక్-బైట్ ప్రకటనలను చూసి సాధారణ ప్రజలు తమ కష్టార్జితాన్ని రిస్కీ పథకాల్లో పెట్టి నష్టపోతున్నారు. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే స్వల్పకాలిక లాభాలను చూసి శాశ్వత సంపద అనుకోవడం పొరపాటు.ఏం చేయాలంటే..బాహ్య ఆడంబరాలను చూసి మోసపోకుండా పక్కా ఆర్థిక ప్రణాళిక పాటించాలి. ఊహాజనిత లాభాల వెనుక పరిగెత్తకుండా అత్యవసర నిధి, సరైన ఇన్సూరెన్స్, సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోవడమే నిజమైన ఆర్థిక భద్రతకు మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. కొందరి ముఖంలో కనిపిస్తున్న నవ్వు వెనుక ఉన్న కపటత్వాన్ని ఎలాగైతే గమనిస్తామో, ఆర్థిక ఆఫర్ల వెనుక ఉన్న నిజమైన వ్యయాన్ని గ్రహించినప్పుడే సామాన్యుడు ఆర్థికంగా నిలదొక్కుకోగలడు.ఇదీ చదవండి: బోరుమని ఏడ్చేసిన నిర్మలా సీతారామన్ -
22-A భూములపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో 22-A భూముల వివాదం రాజకీయంగా వేడెక్కుతున్న వేళ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22-A భూముల వ్యవహారంలో తప్పు కాంగ్రెస్ పార్టీది కాదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ అంశంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలా? లేదా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఢిల్లీలో ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన వారు సర్వం కోల్పోతే.. కేసీఆర్ కుటుంబం మాత్రం భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విచారణకు ఆదేశించడం అభినందనీయమన్నారు. 22-A భూముల అంశంపై బీఆర్ఎస్ ఇప్పటికే జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం కూడా భూ వ్యవహారాలపై విచారణకు చర్యలు చేపట్టింది.కాగా, తన పదవీకాలానికి మరో ఏడాది సమయం ఉందని మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ జరపాలా? వద్దా? అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో పెండింగ్లో ఉన్న పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లలో సంస్థాగతంగా సాధించిన పురోగతిని అధిష్టానం పెద్దలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. గాంధీభవన్ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. 22-A భూముల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. 22-A జాబితాలో భూముల చేర్పుపై బీఆర్ఎస్ జ్యుడీషియల్ విచారణ కోరుతుండగా.. కాంగ్రెస్ గత ప్రభుత్వ హయాంలోని భూ వ్యవహారాలను ప్రస్తావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్ సవాల్ -
IND vs WI: భారత జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లలో తలపడనుంది. ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇందుకు సంబంధించి తమ వన్డే, టీ20 జట్లను బుధవారం ప్రకటించింది.హార్దిక్, పంత్లకు దక్కని చోటువెస్టిండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకుంటున్న పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. వారికి తొలి పిలుపుఅయితే, పంజాబ్ ఆల్రౌండర్ నమన్ ధీర్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. దేశవాళీల్లో పంజాబ్ తరఫున నిలకడగా రాణిస్తున్న నమన్ ధీర్... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. ఇక కౌంటీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆఖిబ్ నబీకి వన్డే జట్టు నుంచి పిలుపు వచ్చింది.దిగ్గజాలతో పాటు జడ్డూ కూడాఇక టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులో చోటు నిలబెట్టుకోగా... స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్టర్లు సీనియర్ ప్లేయర్లపై విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల 20 వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించనుండగా... భారత్ ‘ఎ’ తరఫున ఆడిన తర్వాతే అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయి. నితీశ్ రెడ్డి రాకఇక పాండ్యా అందుబాటులో లేకపోవడంతో ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టులో ఉన్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్తో వన్డే జట్టులో చేర్చారు. హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రూపంలో ముగ్గురు పేసర్లు ఉండగా... అదనంగా నబీని ఎంపిక చేశారు.గతంలోనే నబీ శ్రీలంకతో సిరీస్కు భారత టెస్టు జట్టులోకి ఎంపికైనా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. బుమ్రా లేడుఇక వెస్టిండీస్తో తలపడే టీ20 జట్టు విషయానికి వస్తే ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో స్వల్ప మార్పులతో విండీస్తో సిరీస్కు జట్టును ఎంపిక చేశారు. ఆసియా క్రీడల్లో ఆడనున్న జట్టులోని యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ల స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ను ఎంపిక చేశారు.అయితే ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ తర్వాత ఆసియా క్రీడల్లో పాల్గొననున్నాడు. విండీస్తో వన్డే, టి20 సిరీస్ల కోసం ప్రకటించిన జట్లలో మాత్రం అతడి పేరు లేదు. దీనిపై సెలెక్టర్లు కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.విండీస్తో సిరీస్కు భారత వన్డే జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మెహమ్మద్ సిరాజ్, ఆఖిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.విండీస్తో సిరీస్కు భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్‡్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్. భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయాలు వన్డే సిరీస్👉సెప్టెంబరు 27- తొలి వన్డే- త్రివేండ్రం- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 👉సెప్టెంబరు 30- రెండో వన్డే- గువాహటి- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 👉అక్టోబర్ 3- మూడో వన్డే- న్యూచండీగఢ్- మధ్యాహ్నం రెండు గంటల నుంచిటీ20 సిరీస్👉అక్టోబర్ 6- తొలి టీ20- లక్నో- రాత్రి ఏడు గంటల నుంచి 👉అక్టోబర్ 9- రెండో టీ20- రాంచీ- రాత్రి ఏడు గంటల నుంచి👉అక్టోబర్ 11- మూడో టీ20- ఇండోర్- రాత్రి ఏడు గంటల నుంచి👉అక్టోబర్ 14- నాలుగో టీ20- హైదరాబాద్- రాత్రి ఏడు గంటల నుంచి👉అక్టోబర్ 17- ఐదో టీ20- బెంగళూరు- రాత్రి ఏడు గంటల నుంచిప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), జియో హాట్స్టార్ (డిజిటల్). -
అమ్మో.. అంత అవినీతా..?
సాక్షి, విశాఖపట్నం: లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయి.. సర్వీసు నుంచి ఉద్వాసనకు గురైన వాల్తేరు మాజీ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. 2024 నవంబర్ 16న కాంట్రాక్టర్ల వద్ద రూ.25 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఈ అవినీతి అధికారి.. విశాఖ కేంద్రంగా భారీ స్థాయిలోనే చేతివాటం ప్రదర్శించినట్లు సీబీఐ తాజా విచారణలో బట్టబయలైంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలోనే ఆయన తన చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఏకంగా 62 శాతం మేర అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేశారు. లంచం కేసులో సీబీఐ తీగ లాగితే ఇప్పుడు అక్రమాస్తుల డొంక కదలడంతో విశాఖ డివిజన్లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. ఏకంగా రూ.2.19 కోట్ల అక్రమాస్తుల కేసు నమోదు చేసిన దర్యాప్తు బృందం.. వాల్తేరు డివిజన్ వ్యవహారాలపై మళ్లీ డేగకన్ను వేయడంతో కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమార్జన అంతా విశాఖలోనే.. 2023 జూలైలో వాల్తేరు డీఆర్ఎంగా సౌరభ్కుమార్ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు సెప్టెంబర్ 2021 నుంచి 2023 జూలై వరకూ సెంట్రల్ రైల్వేలో చీఫ్ రోలింగ్ స్టాక్ ఇంజినీర్గా బాధ్యతలు నిర్వర్తించారు. లంచం కేసులో చిక్కుకున్న తర్వాత నుంచి సౌరభ్ అవినీతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 2021 నుంచి 2025 మధ్య కాలంలోనే ఈయన అక్రమార్జనకు పాల్పడ్డారంటూ దర్యాప్తులో తేటతెల్లమైంది. ముఖ్యంగా.. వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అవినీతి తారాస్థాయికి చేరుకుందని గుర్తించింది. అత్యంత కీలక బాధ్యతల్లో ఉంటూ తన అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.2.19 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఇదంతా ఆయన చట్టబద్ధమైన ఆదాయం కంటే 62.04 శాతం అధికమని తాజాగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. ఈ అక్రమార్జన అంతా ప్రధానంగా ఆయన విశాఖ కేంద్రంగా పనిచేసిన కాలంలోనే జరగడం గమనార్హం. నాటి లంచం.. నేటి అక్రమాస్తుల కేసు.! రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు ముంబైలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటంతో అప్రమత్తమైన రైల్వే బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అత్యవసర నిబంధన రూల్ 56(జే)ని ప్రయోగించి ఆయనను తక్షణమే సర్వీస్ నుంచి తొలగించింది. నాటి లంచం కేసు దర్యాప్తులో తీగ లాగితే, ఇప్పుడు ఏకంగా రూ.కోట్ల అక్రమాస్తుల డొంక కదిలిందని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముంబైలోని చెంబూర్లోనూ, వాల్తేరు డీఆర్ఎం బంగ్లాలోనూ సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అమెరికన్ డాలర్లు, యూరోలు, స్విస్ఫ్రాంక్స్, మారిషస్ రూపాయలు వంటి విదేశీ కరెన్సీని స్వా«దీనం చేసుకున్నారు. వీటితో పాటు లెక్కల్లోకి రాని భారీ సంఖ్యలో బంగారు నాణేలు, పసిడి, వెండి ఆభరణాలు, పెట్టుబడులకు సంబంధించిన పలు కీలకమైన ఆర్థిక పత్రాలను దర్యాప్తు అధికారులు సీజ్ చేశారు. పెరిగిన నిఘాతో..విశాఖ డివిజన్లో కలకలం తాజా పరిణామాలతో విశాఖ డివిజన్(పూర్వపు వాల్తేరు)లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. సౌరభ్ ప్రసాద్ డీఆర్ఎంగా ఉన్న సమయంలో మంజూరైన టెండర్లేంటి?, అడ్డదారిలో క్లియర్ చేసిన బిల్లులేంటి? సదరు కాంట్రాక్టుల వెనుక ఉన్నదెవరు? అన్న కోణంలో దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. సౌరభ్ ప్రసాద్తో అంటకాగిన అధికారులపై సీబీఐ నిఘా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో అక్రమాలకు పాల్పడిన వారిలో వణుకు మొదలైంది. ఇదీ చదవండి: ఆఫీసులో కుక్కల హల్చల్.. ట్రెండింగ్లో వీడియో -
ఏపీ: గణేష్ నిమజ్జన ఊరేగింపులో విషాదం.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న భక్తులపైకి ఐషర్ వ్యాన్ దూసుకెళ్లడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వి.కోట మండలం నాయకనేరి టోల్ ప్లాజా వద్ద జరిగింది.వివరాల మేరకు.. గందోడిపాల్య గ్రామానికి చెందిన భక్తులు గణేష్ విగ్రహాన్ని గురువాయం ఉదయం నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో చిత్తూరు నుంచి హాసన్ వైపు వెళ్తున్న ఐషర్ వాహనం అదుపుతప్పి నిమజ్జన ఊరేగింపుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం కుప్పం పీఎస్ ఆస్పత్రికి తరలించారు.ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ప్రైవేటుకు పవర్! -
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ‘రాజభాషా కీర్తి’ పురస్కారం
బ్యాంకింగ్ రంగంలో అధికారిక భాషా విధాన అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి ‘రాజభాషా కీర్తి పురస్కారం’ దక్కింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాజభాషా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత రాజభాషా సదస్సులో ఈ పురస్కారాన్ని బ్యాంక్కు అందజేశారు.సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రథమ బహుమతిగా అందించిన రాజభాషా షీల్డ్ను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా చేతుల మీదుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కల్యాణ్ కుమార్ స్వీకరించారు. అధికారిక భాషా నియమాలను సమర్థవంతంగా అమలు చేయడం, హిందీ భాషా విస్తరణకు సంస్థాగతంగా కృషి చేయడం వల్లే ఈ అరుదైన గుర్తింపు లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.శతాబ్ది సంచిక విడుదలఈ సదస్సు వేదికగా బ్యాంక్కు చెందిన ప్రతిష్ఠాత్మక ద్విభాషా అంతర్గత పత్రిక ‘సెంట్రలైట్’ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక ‘హెరిటేజ్ ఎడిషన్’ను ఆవిష్కరించారు. శతాబ్ద కాలంగా బ్యాంకింగ్ వర్గాలకు, సిబ్బందికి సమాచార వారధిగా నిలిచిన ఈ పత్రిక వైభవాన్ని ఈ ప్రత్యేక సంచికలో ఆవిష్కరించారు.115 ఏళ్ల చరిత్ర ప్రతిబింబించేలా ప్రదర్శనబ్యాంక్ సాధించిన ప్రగతి, అధికారిక భాషా రంగంలో సాధించిన విజయాలు, బ్యాంకింగ్ ఆవిష్కరణలను చాటిచెప్పేలా 115 సంవత్సరాల ప్రస్థానంతో కూడిన ప్రత్యేక ప్రదర్శనను (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేశారు. వివిధ నమూనాలు, డిజిటల్ ప్రదర్శనల ద్వారా బ్యాంక్ సుదీర్ఘ వారసత్వాన్ని, సాంకేతిక పురోగతిని సందర్శకులకు వివరించారు.ఇదీ చదవండి: బోరుమని ఏడ్చేసిన నిర్మలా సీతారామన్ -
ఏఐ వాడకంపై సామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. మనిషి జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీగానే ఇప్పటివరకు ఎక్కువగా కనిపించింది. కానీ అదే ఏఐ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదాలకు దారితీయొచ్చన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భయాలకు మరింత బలం చేకూర్చేలా ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భయపడటం తప్పేమీ కాదని.. నిజానికి అలా భయపడటానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సేల్స్ఫోర్స్ డ్రీమ్ఫోర్స్ సదస్సులో ఆల్ట్మన్ ఏఐ భవిష్యత్తుపై మాట్లాడారు. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం గతంతో పోలిస్తే ఇప్పుడు సులభమైందని చెప్పారు. ‘‘ఏఐ విషయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుందో ఊహించడానికి ఇప్పుడు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. ప్రపంచం దీనిని చూసి భయపడటం సరైనదే’’ అని ఆల్ట్మన్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరించగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఏఐ అభివృద్ధిలో భద్రత, మానవ విలువలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం.. వాటిపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఏఐకి ఇంత భయం ఎందుకు?ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతుండటమే తాజా ఆందోళనలకు ప్రధాన కారణమని ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఏఐతో సాధ్యం కాదనుకున్న అనేక పనులను ఇప్పుడు అధునాతన మోడళ్లు చేయగలుగుతున్నాయన్నారు. మరింత శక్తిమంతమైన వ్యవస్థలు మనుషుల కంటే కొన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచే దిశగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మరోవైపు.. ఏఐ సంస్థలు మరింత శక్తివంతంగా మారితే ఆ టెక్నాలజీపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. శక్తిమంతమైన ఏఐ సంస్థలు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం చూపడం లేదా తమ అభిప్రాయాలను సమాజంపై ప్రభావితం చేసే స్థాయికి చేరడం వంటి ప్రమాదాలపై కూడా ఆల్ట్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాలపై టెక్ దిగ్గజాల్లో చర్చఏఐ భద్రతపై టెక్ పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, ఆంథ్రపిక్ సీఈఓ డారియో అమోడీ లాంటివాళ్లు ఏఐ అభివృద్ధిలో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వేగాన్ని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని చెబుతున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు, నియంత్రణల అవసరంపై టెక్ పరిశ్రమలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. ఇటీవల ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా ప్రవర్తించిన కొన్ని ఘటనలు కూడా ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ, నియంత్రణలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చర్చిస్తున్నారు. భయం.. కానీ ఆపేయాలా?ఏఐపై భయాలు పెరుగుతున్నప్పటికీ.. దాని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలా? లేదంటే భద్రతా ప్రమాణాలతో కొనసాగించాలా? అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్ కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వాలు ఈ విషయంలో వేర్వేరు విధానాలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆల్ట్మన్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐను అభివృద్ధి చేస్తున్న సంస్థలకే దాని ప్రమాదాలపై ఆందోళనలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడుతోంది. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీగా ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే సమయంలో దాని సామర్థ్యాలను బాధ్యతగా నియంత్రించడం కూడా అంతే కీలకంగా మారుతోంది.ఇదీ చదవండి: ఏఐ స్లోకి ట్రంప్ భయపడుతున్నారా? -
చెదలు పట్టాయని.. రోడ్డుపై నోట్లు పారేశాడు!
విశాఖపట్నం: నగరంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో చిరిగిన కరెన్సీ నోట్లు కనిపించడంతో కలకలం రేగింది. సెంట్రల్ పార్క్ ఎదురుగా బుధవారం తెల్లవారుజామున వాకర్స్ వీటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కేజీహెచ్ ప్రాంతంలోని తాడివీధికి చెందిన ఆదిమూలం సూర్యారావు నోట్లను అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి విచారించగా.. తాను కిరాణా దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తుంటానని తెలిపాడు. కొంతకాలంగా ఇంట్లోని అట్టపెట్టెలో నగదుతోపాటు ఎల్ఐసీ రసీదులు ఉంచినట్లు చెప్పాడు. వాటికి చెదలు పట్టడంతో.. కుటుంబ సభ్యులకు తెలిస్తే వివాదం తలెత్తుతుందనే ఉద్దేశంతో మంగళవారం సాయంత్రం చిరిగిన నోట్లను సెంట్రల్ పార్క్ ఎదురుగా రోడ్డుపై పడేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. చిరిగిన నోట్ల విలువ సుమారు రూ.3 వేల వరకు ఉంటుందని సూర్యారావు చెప్పాడు. అవి వినియోగానికి పనికిరావని భావించి రోడ్డుపై పడేసినట్లు వివరించాడు. దీంతో నోట్లతోపాటు అక్కడ లభించిన ఎల్ఐసీ రసీదులు, పాన్కార్డును పోలీసులు బుధవారం మధ్యాహ్నం సూర్యారావుకు అందజేశారు. పోలీసుల దర్యాప్తుతో రోడ్డుపై చిరిగిన నోట్లు ప్రత్యక్షమైన ఘటన వెనుక మిస్టరీ వీడింది. విశాఖలో కలకలం.. పార్క్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప -
రాజకీయ ఫ్యాషన్కి కేరాఫ్గా మోదీ..! చివరికి అది కాస్తా..
ఒక రాజకీయ నాయకుడి ప్రసంగాలకు మించి అతని వార్డోరోబ్ ఉండటం అత్యంత అరుదు. కానీ ప్రనరేంద్ర మోదీ ఆ విషయంలో విజయం సాధించారు. కార్యక్రమానికి అనుగుణమైన వేషధారణ, అది కూడా నిలకడతో తనదైన శైలితో కనిపించే తీరు..అందర్నీ ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే అది మోదీ మార్క్గా స్థిరపడిపోయింది. పండుగలాంటి కార్యక్రమానికి వేడుక వాతావరణం ఉట్టిపడేలా ఆయన ఆహార్యం ఉంటుంది. దశాబ్దాల నాటి ఫ్యాషన్ని ట్రెండీగా మార్చి..తన పేరుతో గుర్తింపు తెచ్చుకునేలా ఫ్యాఫన్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఇన్నాళ్లు రాజకీయ వేషధారణలో చిన్నారులు తీర్చిదిద్దడానికి నెహ్రు జాకెట్లు ఉపయోగించేవారు. అంతెందుకు పెద్దవాళ్లు సైతం ఆ స్టైల్నే అనుకరించేవారు. అలాంటిది ఇవాళ మార్కెట్లో ఎటు చూసినా.. మోదీ స్టైల్తో కూడిన జాకెట్లే దర్శనమిస్తున్నాయి. పైగా మోదీ జాకెట్ పేరుతో బ్రాండ్గా ప్రసిద్దిగాంచడం విశేషం. ఇవాళ ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన ధరించే జాకెట్ విశేషాలు, ఆ స్టైల్ ఎలా బ్రాండ్గా మారింది తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!. మోదీ దశాబ్దాల నాటి స్లీవ్లెస్ జాకెట్ని తనదైన శైలిలో ట్రెండీ ఫ్యాషన్వేర్గా మార్చేశారు. ఆఖరికి దాని పేరు కూడా ఆయన పేరుతో మేళవించే డిజైన్గా మారిపోయింది. మెన్స్ వేర్ షాపుల్లో హుందాగా స్టైలిష్గా కనిపించాలని ఓ 50-60 మధ్య వయస్కులు అడగగానే మోదీ జాకెట్లు ఇవ్వమంటరా అని ఠక్కున అడుగుతుండటం విశేషం. పార్లెమెంట్ నుంచి ప్రపంచ సదస్సుల వరకు దాదాపు ప్రతి ప్రధాన బహిరంగ కార్యక్రమంలో మోదీ దీన్ని ధరించారు. దాంతో రిటైలర్లు అంతా ఆ సాధారణ జాకెట్ని మోదీ జాకెట్ పేరుతో విక్రయించడం మొదలుపెట్టారు పెళ్లిళ్లు, పండుగలు, మరేదైన ప్రత్యేక కార్యక్రమంలో పురుషుల కలెక్షన్లో ఇది తప్పనిసరి అనేలా ప్రత్యేకతను దక్కించుకుంది. నిజానికి నెహ్రూ మృదువైన బ్లేజ్, గ్రే రంగులు ఇష్టపడితే..మోదీ జాకెట్లను కాషాయం, మెరూన్, రాయల్ బ్లూ, మస్టర్డ్ జ్యువెల్ టోన్స్ వంటి ప్రస్ఫుటమైన రంగులను ఎంచుకుంటారు. మోదీ కుర్తాకు జతగా ఈ జాకెట్లను ధరించడం విశేషం. ఈ లుక్ ఆధునికంగా కనిపించేలా చేయడమే గాక గ్రాండ్గా కనిపించేలా చేస్తుంది. వాటిలో బాగా ఫేమస్ అయ్యినవి..ప్రచార సమయంలో తరుచుగా ధరించే ప్రకాశవంతమైన వెస్ట్కోట్తో కూడిన సగం చేతుల కుర్తా ప్రారంభంలోనే ట్రేడ్మార్క్గా మారింది. ఆ తర్వాత మ్యాండరిన్ కాలర్తో చక్కగా కుట్టిన బంద్గాలా సూట్లు వచ్చాయి. వీటిని మోదీ బ్రిక్స్ సమావేశం వంటి శిఖరాగ్ర సమావేశాలలోనూ, అమెరికా పర్యాటనల సందర్భంగా ధరించి తన రూపానికి అంతర్జాతీయ రేంజ్ లుక్ని అందించేలా తీర్చిదిద్దుకుంటారు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసిన జాకెట్ స్టైలింగ్ సుస్థిరతపై ఒక ప్రకటనగా మార్చింది. ఆ తర్వాత 2018లో దక్షిణ కొరియా అప్పటి అధ్యక్షుడు మూనే జే ఇన్కు ఇచ్చి ఒక ప్రత్యేకమైన బహుమతి చర్చనీయాంశంగా మారింది. అందులో ఆయన ప్రత్యేకంగా కుట్టించిన జాక్లెట్లు ఉన్నాయి. వాటిని ‘మోదీ వెస్ట్’లుగా పిలుస్తూ బహిరంగంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మోదీ జాకెట్లను అందరు ఇష్టపడతారు, ఎందుకంటే భారతీయ హస్తకళ, ఖాదీకి మూలం అవి. కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతేగాదు నిలకడ అనేది ధరించే దుస్తుల్లో కూడా పాటిస్తే..అదే మనకు గర్తింపు తెచ్చిపెడుతుందనే విషయాన్ని హెలెట్ చేస్తోంది మోదీ ఫ్యాషన్ శైలి. ఆయన ఏమీ ఆ శైలిని ఆవిష్కరించకపోయినా..ఆ పురాత భారతీయ శైలి మోదీ కారణంగా వెలుగులోకి రావడమే గాక యావత్తు ప్రపంచం భారత సంప్రదాయ ఫ్యాషన్కి ఆకర్షితులయ్యేలా చేసేందుకు దారితీయడం విశేషం.ఇదీ చదవండి: Japan: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు! -
KBR Park: ఇక అదే దారి
హైదరాబాద్: కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కుల తొలగింపునకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడేసి చొప్పున ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మించాలని తలపెట్టింది. ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ వన్వే అమలు చేసింది. దీనికోసం చేసిన మార్పులు చేర్పులతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. దీంతో అధికార యంత్రాంగం రూ.1,250 కోట్లు వెచ్చించి.. ఏళ్లు శ్రమించి ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించడం కంటే శాశ్వత ప్రాతిపదికన వన్వే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే.. తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారిన పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డు నెం.36 వరకు లేదా రోడ్డు నెం.45 వరకు ఇది ఉండాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు చేరాయి. వీటిలో ఏదో ఒకటి ఖరారు చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వాహన చోదకుల ఫీడ్బ్యాక్.. ‘హెచ్–సిటీ’ పనుల్లో భాగంగా అధికారులు గత నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేశారు. ఇది అమల్లోకి వచి్చన పది రోజుల్లోనే ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గి ఫలితాలు కనిపించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నామంటూ వాహన చోదకుల నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు దాదాపు రెండేళ్లు వన్వే అమలు చేయాలని భావించిన అధికారులు.. ఈ విధానం శాశ్వతం చేయాలని నిర్ణయించారు. మరోపక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి యంత్రాగానికి సవాళ్లు ఎదురయ్యాయి. చెట్ల కొట్టివేతను నిరసిస్తూ కేబీఆర్ పార్కు వాకర్లతో పాటు పర్యావరణవేత్తలు, సేవ్ కేబీఆర్ ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ™ దీంతో పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. పలు పరిణామాలతో.. చెట్లను కొట్టివేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉండటంతో సదరు నిర్మాణ రంగ సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు ఎన్నిచెట్లు మిగిలి ఉన్నాయో వాటి జియో ట్యాగ్ను కూడా పర్యావరణవేత్తలు తీసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఒక్క చెట్టును కూడా కొట్టడానికి వీల్లేకుండాపోయింది. దీనికి తోడు ఈ నిర్మాణాల కోసం మొత్తం 247 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో పలువురు ప్రము ఖులవీ ఉన్నాయి. ఈ కారణంగా వీటి సేకరణ పెను సవాల్గా మారింది. పలువురు ఇళ్ల యజమానులు భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కేబీఆర్ పార్కుకు నిర్ణయించిన ఎకో సెన్సిటివ్ జోన్పై సుప్రీం కోర్టులోనూ కేసు పెండింగ్లో ఉంది. ఈ పరిణామాలకు శాశ్వత వన్ వే ఓ పరిష్కారం చూపింది. సీఎం రేవంత్రెడ్డి కూడా ఈ వన్వేలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం హెచ్–సిటీ పనులు ఆగిపోయాయి. ఈ పనులతో పోలిస్తే ఎలివేటెడ్ కారిడార్కు చాలా తక్కువే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం! -
మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన అన్నిరంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆస్తుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన నేపధ్యంలో కేటీఆర్ ఆయనకు సవాల్ విసిరారు. 1954 నుంచి 2026 వరకు మా ఆస్తుల లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం తన సొంత సోదరునికి అక్రమంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి కళంకం తెస్తున్నారు. కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. రేవంత్ రెడ్డి సంస్కారం లేని వ్యక్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి బంగ్లాలు ఎలా కట్టారో చెప్పాలి. నవీన్ రావు, సంతోష్ రావులతో మాకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేవరకు తాము పోరాటం చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి కళంకం తెస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి సీఎం రేవంత్రెడ్డి తమను వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ''ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలి. మా ఆస్తుల విషయంలో సీఎంకు దమ్ముంటే న్యాయ విచారణ చేయాలి. ఎవరికెన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కతీద్దామా'' అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో రేవంత్రెడ్డి అవాస్తవాలు మాట్లాడారు. కమీషన్లు దండుకునేందుకే 22ఏను తీసుకొచ్చారు. కేసీఆర్కు రేవంత్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆన్నారు. రేవంత్ రెడ్డి ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉందని విమర్శించారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ పవిత్రతను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని రేవంత్ తప్పడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇదీ చదవండి: గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే.. కవిత -
వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.జూమ్ ద్వారా జరుగుతున్న ఈ మీటింగ్లో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. కరువు పరిస్థితులు, పలు ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై నేతల నుంచి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ప్రజలకు ఎదురవుతున్న ఇతర సమస్యలు, ఆయా జిల్లాల్లోని తాజా పరిస్థితులపైనా పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల వారీగా పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, స్థానికంగా పార్టీ కార్యకలాపాలపై కూడా నేతలతో జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కొండ పైనా క్రెడిట్ చోరీనా? -
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెల (సెప్టెంబరు)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్-2027 వరకు అగార్కర్నే సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగించాలని బోర్డు భావించినట్లు తెలిసింది.అయితే, అగార్కర్ మాత్రం చీఫ్ సెలక్టర్గా కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు బుధవారం భారత వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలక్షన్ కమిటీ చైర్మన్గా అగార్కర్కు ఇదే ఆఖరి సమావేశం అని సమాచారం.రేసులో వారేఈ నేపథ్యంలో ఎన్డీటీవీ కథనం ఆసక్తికర విషయం వెల్లడించింది. చీఫ్ సెలక్టర్గా అగార్కర్ స్థానాన్ని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ లేదంటే.. మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొనట్లు తెలిపింది. కాగా పార్థివ్ పటేల్ (గుజరాత్), ప్రజ్ఞాన్ ఓజా ఇద్దరూ టీమిండియా తరఫున సత్తా చాటడంతో పాటు మూడుసార్లు టైటిళ్లు గెలిచిన ఐపీఎల్ జట్లలో సభ్యులు కావడం విశేషం. ఇక ఒడిశాకు చెందిన ఓజా ఇప్పటికే సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.ఘనమైన విజయాలుకాగా 2023 జూలైలో అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా నియమితుడయ్యాడు. అతడి హయాంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్కప్లో ఫైనల్కు చేరింది. ఇక 2024, 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో చాంపియన్గా నిలిచింది. అదే విధంగా 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అంతేకాదు గతేడాది ఆసియా కప్ టైటిల్ను కూడా సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్లోనే అగార్కర్ పదవీకాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అతడిపై నమ్మకంతో అక్టోబరు 4 దాకా గడువు పొడిగించింది. అయితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను వన్డే ప్రపంచకప్-2027 దాకా కొనసాగించే విషయంలో అగార్కర్- బీసీసీఐ పెద్దల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.అందుకే విభేదాలు!రో-కో ప్రపంచకప్ ఆడే విషయంపై స్పష్టత ఇవ్వలేదంటూ అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రో- కో మాత్రం తాము కచ్చితంగా వన్డే వరల్డ్కప్ ఆడతామనే సంకేతాలు ఇచ్చారు. ఇక రోహిత్- కోహ్లి అర్దంతరంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం కూడా అగార్కర్ వైఖరేనని గతంలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తలెత్తిన విభేదాల కారణంగా బీసీసీఐ పెద్దలు, అగార్కర్ మధ్య దూరం పెరిగిందని.. అందుకే అగార్కర్ ఇక తన పదవి నుంచి దిగిపోకతప్పలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: ఆసియా క్రీడలకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం -
ప్రజలే కేంద్రంగా పాలన.. హైదరాబాద్ కోసమే ఫ్యూచర్ సిటీ: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణలో రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైన రోజుగా సెప్టెంబర్ 17ను గుర్తిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ప్రజలు పోరాడిన చరిత్ర ఉందని, పాలకులపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని వ్యాఖ్యానించారు.సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన వారికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడారు. ప్రజల మాటకు విలువ ఇవ్వడం, ప్రభుత్వ వనరులు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే ప్రజాపాలన అని పేర్కొన్నారు. పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతు భరోసా కింద రూ.20,616 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని, ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసాతో పాటు రైతు బీమా, భూభారతి సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లతో ప్రణాళిక రూపొందించామని రేవంత్రెడ్డి తెలిపారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. దళితులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుతో పాటు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి రూ.927 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపైనా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగ పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్రెడ్డి అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఇటీవల టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. గోషామహల్లో రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందిస్తూ ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై దృష్టి పెట్టామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును 55 కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047 ద్వారా భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవమే ప్రజాపాలనలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘స్టార్టప్ స్టేట్గా తెలంగాణ’ -
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున స్వల్పంగా పెరిగి నేడు తిరిగి దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.భారత్ స్పందన.. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.ట్రంప్ డెస్క్ మీద.. అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. ఇక భారత్పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు? -
సంప్రదాయ దుస్తుల్లో యాంకర్ స్రవంతిని చూశారా..
ఒకప్పుడు తన డ్రెస్సింగ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న యాంకర్ స్రవంతి చొక్కారపు.. ఇప్పుడు పూర్తిగా సంప్రదాయ లుక్లో మెప్పిస్తున్నారు. వినాయకుడి పూజల్లో చీరకట్టులో పాల్గొన్న ఆమె తాజా ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. సినిమా ఈవెంట్లు, టీవీ కార్యక్రమాల్లో తనదైన యాంకరింగ్తో బిజీగా ఉంటోంది స్రవంతి.. సంప్రదాయ దుస్తులంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని గతంలోనే చెప్పింది. తన దగ్గర ఏకంగా వెయ్యికి పైగా చీరలు ఉన్నాయని వెల్లడించింది.సినిమా ఈవెంట్లలో మాత్రం సందర్భాన్ని బట్టి దుస్తులు ఎంచుకోవాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో నిర్వాహకులే కాస్ట్యూమ్స్ నిర్ణయిస్తారని స్రవంతి చెప్పింది. అందుకే తనకు ఆప్షన్ ఉంటే మాత్రం చీరనే ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేసింది. వినాయకుడి పూజల్లో పాల్గొన్న స్రవంతి ఫొటోలు ప్రస్తుతం ఫొటోలు వైరల్ అయ్యాయి. -
ఆఫీసులో కుక్కల హల్చల్.. ట్రెండింగ్లో వీడియో
నిరసనలు పలు రకాలు.. సమస్యను బట్టి వినూత్నంగా, వెరైటీగా చేపట్టేవి మరికొన్ని. కానీ వీధికుక్కల బెడదపై చేపట్టిన ఈ నిరసన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారులెంతకూ పట్టించుకోవడం లేదంటూ ఏకంగా కుక్కలనే నగర పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చి అధికారి టేబుల్పై వదిలేశారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లతో దండ వేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్లో వైరల్గా మారి ట్రెండింగ్లోకి వచ్చింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. చిన్న సంచుల్లో తీసుకొచ్చిన వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే టేబుల్పై వదిలారు. దీంతో అవి అక్కడి నుంచి అటూ ఇటూ పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.Yuva Sena district chief Vikram Randhave reportedly released 4–5 stray dogs inside the Niphad Nagar Panchayat chief officer’s office to protest the growing stray dog menace and alleged inaction by the civic body. 💀😭 pic.twitter.com/0wgQpHP00l— Ghar Ke Kalesh (@gharkekalesh) September 16, 2026నిఫాడ్ పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయిందని, వాటి వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. పలువురు కుక్కకాటుకు గురయ్యారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో మండపాలకు వచ్చే ప్రజల్లోనూ వీధికుక్కల కారణంగా భయాందోళన నెలకొందని తెలిపారు.వీధికుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించడంతోపాటు వాటిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాంధవే డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా టెండర్ ప్రక్రియలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇదే తరహాలో అధికారుల కార్యాలయంలో కుక్కలను తీసుకొచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.ఇటీవల మధ్యప్రదేశ్లోని ఖండ్వాలోనూ వీధికుక్కల సమస్యను నిరసిస్తూ ఓ వ్యక్తి కుక్క మాస్క్ ధరించి ప్రజావాణికి హాజరైన ఘటన వైరల్గా మారింది. తాజాగా నిఫాడ్లో కార్యకర్తలు ఏకంగా కుక్కలనే అధికారుల కార్యాలయంలోకి తీసుకురావడంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.Khandwa, Madhya Pradesh - In a highly unusual form of protest, the Leader of the Opposition in the Khandwa Municipal Corporation, Deepak Rathore, arrived at the district Collectorate during a public hearing accompanied by a man wearing a dog mask. The demonstration was aimed at… pic.twitter.com/fkUih3zv4F— NextMinute News (@nextminutenews7) August 19, 2026ఇదీ చదవండి: మొసలిని ఇంటికి తెచ్చాడు.. అమ్మ మాటతో వెనక్కి వెళ్లాడు -
బాబు సర్కారు మరో రూ.2,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట వివిధ సంస్థల ద్వారా అప్పులు చేయడాన్ని చంద్రబాబు సర్కారు నిరంతరంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్లు టర్మ్ రుణం తీసుకునేందుకు అనుమతిస్తూ ఆ మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ హామీ రుణం మొత్తం కాలపరిమితి వరకు వర్తిస్తుంది. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుంది. అసలు, వడ్డీ చెల్లింపుల షెడ్యూల్తోపాటు వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం కాలం వంటి వివరాలను సమర్పించాలి. ఏపీపీఎఫ్సీఎల్ తన సొంత వనరుల నుండే రుణ సేవా బాధ్యతలను నిర్వహించాలి.రుణమొచ్చన సంస్థకు చెల్లించాల్సిన బాధ్యతలను తీర్చడంలో విఫలమైన సందర్భంలో మాత్రమే ఈ ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. హామీ ఇచి్చన మొత్తంపై ఐదు శాతం హామీ కమీషన్ను చెల్లించాలి. -
అల్లునిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం.. తరువాత?
మైన్పురి: ఉత్తరప్రదేశ్లోని మైన్పురిలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లి తన అల్లుడితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తోందన్న ఆరోపణలు కుటుంబంలో కలకలం రేపాయి. ఖర్గ్జిత్ నగర్లో ఈ ఘటన వెలుగుచూసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించి గొడవకు దిగారు. చివరకు పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఘిరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళకు, కురావలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనాయ్ అశోక్పూర్ గ్రామానికి చెందిన ఆమె అల్లుడికి మధ్య సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారని, కలిసి జీవించడంపై కూడా చర్చించుకున్నారని తెలిపారు. ఈ విషయం పిల్లలకు తెలియడంతో వారు తల్లి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.గొడవ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఖర్గ్జిత్ నగర్కు చేరుకున్నారు. అక్కడున్న వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. మహిళతో పాటు ఆమె అల్లుడిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి? కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.అలీగఢ్లోనూ ఈ తరహా ఘటన2025 ఏప్రిల్లో అలీగఢ్లోని మద్రక్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఓ యువతికి వివాహం జరగాల్సి ఉండగా, ఆమె తల్లి అనిత తన కాబోయే అల్లుడు రాహుల్తో సన్నిహితంగా ఉంటోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారని తెలిపారు. అనంతరం అనిత ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని రాహుల్తో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తన ఇష్టప్రకారమే రాహుల్తో వెళ్లానని అనిత పేర్కొన్నది.ఇదీ చదవండి: పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్ నాగ్ కీలక వ్యాఖ్యలు -
పోలవరం పనులను పరిశీలించిన పీపీఏ బృందం
పోలవరం రూరల్: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనులను ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ’ (పీపీఏ) బృందం బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించింది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సంజీవ్ వోహ్రా నేతృత్వంలో విచ్చేసిన ఉన్నతాధికారుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైన ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో జరుగుతున్న పలు పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేసేందుకు మరింత వేగం పెంచాలని సూచించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురామ్, జలవనరుల శాఖ ఇంజినీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) కె. నరసింహమూర్తి, ఎస్ఈ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ ఈఈలు కె.బాలకృష్ణ, బి.దామోదర్, డి.శ్రీనివాస్, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు ప్రాజెక్టులో జరుగుతున్న పనులు, వివిధ నిర్మాణ దశలు, భవిష్యత్ కార్యాచరణను బృందానికి వివరించారు.సీఎస్ఎంఆర్ఎస్ బృందం తనిఖీలుపీపీఏ బృందంతో పాటు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం కూడా ప్రాజెక్టు ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటించింది. నిపుణులు హరేంద్ర ప్రకాశ్, దీపముద్ర నాయక్, శాస్త్రవేత్త గౌరవ్ పాండే తదితరులు గ్యాప్ 1, 2 లలో ఉపయోగిస్తున్న మట్టి, రాయి నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతాన్ని ఆయా క్షేత్రాలలో స్వయంగా పరీక్షించారు. ఈ తనిఖీల్లో జలవనరుల శాఖ నాణ్యత నియంత్రణ విభాగం డీఈలు శివప్రసాద్, మల్లికార్జున, ఎంఈఐఎల్ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు ‘పవర్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ రంగం ప్రైవేటుపరానికి చంద్రబాబు సర్కారు పన్నాగం పన్నుతోంది. దీనిలో భాగంగా రాజధాని అమరావతిలో విద్యుత్ సరఫరా, పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రీన్ఫీల్డ్ నగరాల్లో భూగర్భ విద్యుత్ వ్యవస్థ(అండర్ గ్రౌండ్ కేబుల్) ఏర్పాటు, స్మార్ట్ గ్రిడ్ నిర్వహణ నుంచి వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం వరకూ అనుభవం ఉన్న అంతర్జాతీయ, దేశీయ సంస్థలు, జాయింట్ వెంచర్లుగా ఏర్పడిన సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చునని పేర్కొంది. 2022–23 నుంచి 2024–25 వరకు మూడేళ్లలో సగటున రూ.వెయ్యి కోట్ల చొప్పున లావాదేవీలు నిర్వహించి ఉండి.. రూ.200 కోట్ల మేర నగదు నిల్వలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే బిడ్లు దాఖలుకు అర్హత ఉంటుందని షరతు విధించింది. బిడ్ దాఖలుచేసే సంస్థలను గత రెండేళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వంగానీ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉండకూడదని స్పష్టం చేసింది. ముందే ఎంపిక చేసిన సంస్థకే రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను కట్టబెట్టడానికి ముఖ్యనేత రంగం సిద్ధం చేశారన్న వాదన విద్యుత్రంగ నిపుణుల నుంచి వినిపిస్తోంది. రాజధానిని ప్రయోగశాలగా మార్చి.. ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు.. అప్పట్లో నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి 54 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం ముసుగులో అస్మదీయులకు ధారాదత్తం చేశారు. అప్పట్లోనే విద్యుత్ రంగాన్ని పైవేటీకరించేందుకు అడుగులు వేశారని.. తీవ్రమైన ప్రజావ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గారని విద్యుత్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జెన్కో, ట్రాన్స్కో, పంపిణీ సంస్థలు(ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్)లతో కూడిన విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి సీఎం చంద్రబాబు రాజధానిని ప్రయోగశాలగా మార్చి ఆటలాడుతున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర, నిరంతర విద్యుత్ సరఫరా ముసుగులో.. స్వర్ణాంధ్ర–2047 విజన్లో భాగంగా రాజధాని అమరావతి నగరాన్ని నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. రాజధాని ప్రాంతంలో 2047 నాటికి జనాభా 1.40 కోట్లకు చేరుతుందని.. రాజధాని నగరం అమరావతిలోనే 20 లక్షల మంది నివసిస్తారని.. 12.80 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. అమరావతి 2047 నాటికి ఏకంగా 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) ఆరి్థక వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతోంది. నివాస, వాణిజ్య, ఐటీ, ఆస్పత్రులు, విద్యా సంస్థలు భారీ ఎత్తున వస్తాయని.. వాటికి అనుగుణంగా సుస్థిరమైన, అంతరాయం లేని స్మార్ట్ విద్యుత్ సేవలను అందించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొంటోంది. ఈ ముసుగులోనే విద్యుత్ వ్యవస్థ ప్రైవేటీకరణకు అడుగులు వేసింది. ఈ మేరకు సీఆర్డీఏతో నోటిఫికేషన్ జారీచేయించింది. అక్టోబర్ 12 వరకూ ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చని సీఆర్డీఏ పేర్కొంది. అక్టోబర్ 13న బిడ్ను తెరిచి.. ఎల్–1గా నిలిచిన సంస్థకు రాజధాని విద్యుత్ రంగం పనులను కట్టబెట్టేందుకు సీఆర్డీఏ షెడ్యూలు విడుదల చేసింది. రూ.వేల కోట్లతో బలోపేతం చేసిన వ్యవస్థ నామమాత్రపు ధరకే.. వేలాది కోట్ల రూపాయలను అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి రాజధానిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డీఏ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు వాటిని పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ప్రైవేటు సంస్థకు నామమాత్రపు ధరకే కట్టబెట్టనుంది. రాజధాని ప్రాంతం ప్రస్తుతం ఏపీసీపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో ఉంది. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ నిర్వహణ దగ్గర నుంచి వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వసూలు చేసే బాధ్యత వరకూ ప్రైవేటు సంస్థకు అప్పగించనుంది. ఆ తర్వాత వేలాది కోట్ల రూపాయల వ్యయంతో బలోపేతం చేసిన ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఏపీఎస్పీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో నిర్మించిన విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను దశలవారీగా నామమాత్రపు ధరకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సర్కార్ అడుగులు వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై బాదుడే బాదుడు..కారి్మకులకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రైవేటుపరం చేస్తే.. వాటిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుందని విద్యుత్ ఉద్యోగ, కారి్మక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా పెంచేయడానికి ఆస్కారం ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొత్తగా కనెక్షన్ మంజూరు చేయడానికి.. రీకనెక్షన్ ఇవ్వాలన్నా భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నీంటినీ ఒకేసారి ప్రైవేటుపరం చేస్తే అటు ఉద్యోగులు.. ఇటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించే తొలుత రాజధానిలో విద్యుత్ వ్యవస్థ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ తొలి అడుగు వేసిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను విజయవంతంగా ఎంపిక చేసిన సంస్థకు కట్టబెట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే సర్కార్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
ప్చ్.. మళ్లీపోయింది!
సాక్షి, అమరావతి: విద్యుత్ కోతలతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జనం అల్లాడుతున్నారు. వేసవిని తలపిస్తూ విద్యుత్ కోతల తీవ్రత పెరుగుతున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య పలు ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు సరఫరాలు నిలిపివేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం (సెప్టెంబర్ 15న) విద్యుత్ డిమాండ్ 264.521 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరగా, అధికారిక లెక్కల్లోనే 7.03 ఎంయూల లోడ్ రిలీఫ్ (విద్యుత్ కోత) నమోదైంది. వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోవాల్సిన దుస్థితి వచ్చింది. విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా అందించలేకపోతున్న ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు విద్యుత్ పొదుపు పాటించాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులకు పలు విజ్ఞప్తులు చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే అధికారిక గణాంకాల్లో మాత్రం మొత్తం డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నట్లు చూపుతుండడం... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండడం గమనిస్తున్న ప్రజలు, ప్రభుత్వ వైఖరితో మరింత అసహనానికి గురవుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సబ్స్టేషన్లను సైతం ముట్టడించే పరిస్థితి ఏర్పడింది. అన్నదాత ఆవేదన వ్యవసాయానికి రోజుకు 9 గంటల సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో రోజుకు 5 నుంచి 7 గంటలు, ఇతర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ సరఫరాను కూడా రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. రాత్రివేళ రెండు గంటలు సరఫరా ఇవ్వడంతో చీకట్లో పొలాలకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీంతో ఆ సమయంలో కరెంటు ఇచ్చినా అది వృథా అవుతుందని అంటున్నారు. పగటి పూట ఇచ్చే కొద్ది గంటల సరఫరాతోనే పొలాన్ని తడుపుకుంటున్నారు. పగలు ఒకే విడతలో 9 గంటలు విద్యుత్ సరఫరా వ్యవసాయానికి అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండుమూడు రోజులకే బొగ్గు నిల్వలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అత్యంత దారుణంగా పడిపోయాయి. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం (వీటీపీఎస్)లో 2.87 రోజులకు, రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లో 2.56 రోజులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయి. ఈ థర్మల్ కేంద్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కృష్ణపట్నంలో 11.23 రోజులు, హిందూజాలో 5.99 రోజులు, సెయిల్లో 16.56 రోజులకు సరిపడా బొగ్గు ఉంది. కానీ ఇది ఏమాత్రం సరిపోదు. థర్మల్ కేంద్రాల్లో కనీసం 15 రోజుల నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గు లేకపోతే ఉత్పత్తి చాలా కష్టం. ఏ కారణం చేతనైనా రోజువారీ బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడితే థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి ఒక్క సారిగా కుప్పకూలుతుంది. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ డిమాండ్కు తగిన ఉత్పత్తి రాష్ట్రంలో లేదు. పోనీ ముందస్తు ప్రణాళికలు ఏవైనా వేశారా అంటే అదీ లేదు. కాగితాల్లో తప్ప ఆచరణలో ఎలాంటి ప్లానింగ్ అమలు చేయకపోవడంతోపాటు పెరిగిన డిమాండ్ను తగ్గట్లు విద్యుత్ను సమకూర్చలేక రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. బహిరంగ మార్కెట్ నుంచి 40 ఎంయూల నుంచి 50 ఎంయూల వరకూ ప్రతి రోజూ విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకు మొత్తం రూ.28.415 కోట్లు నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చవుతోంది. ఇందులో డే ఎహెడ్ మార్కెట్ ద్వారా 29.270 ఎంయూలను యూనిట్కు సగటున యూనిట్ రూ.5.774 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రియల్ టైమ్ మార్కెట్లో 6.960 ఎంయూలకు యూనిట్కు రూ.9.994 చొప్పున అత్యధిక ధర చెల్లిస్తున్నారు.వాటిని వాడకండి: పృధ్వీతేజ్ వాషింగ్ మెషిన్లు, ఐరన్ బాక్సులు, బ్యాటరీ చార్జింగ్లు వంటివి పగటిపూట మాత్రమే వాడుకుంటే గ్రిడ్పై భారం తగ్గుతుందంటూ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృధ్వీతేజ్ వీడియో బుధవారం సందేశాన్ని విడుదల చేశారు. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు అవసరం లేని మెషిన్లు, విద్యుత్ ఉపకరణాలు వినియోగం తగ్గించుకోవాల్సిందిగా ఆయన కోరారు. కొంచెం ఎక్కువే చెప్పండి: మంత్రి ఆదేశాలు విద్యుత్ కోతలపై ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని, ఎంత సేపు విద్యుత్ కోత విధిస్తున్నామనే వివరాలను, ఆయా వేళలను ముందుగానే చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ కోతలు, సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కాల్ సెంటర్కు అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటన్నిటికీ సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందని వినియోగదారులు అడిగితే, అవసరమైతే కాస్త ఎక్కువ సమయమే చెప్పమని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. బొగ్గు నిల్వలపై దృష్టి సారిస్తున్నామని, బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు అనుమతించామని మంత్రి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై మంత్రి వివరణ ఇచ్చారు. ప్రజావ్యతిరేకత తీవ్రమవకుండా ‘చిట్కాలు’ విద్యుత్ శాఖ చెబుతున్నదాని కంటే ఎక్కువగానే రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో అనధికార విద్యుత్ కోతలు, నిర్వహణ పేరుతో వారంలో ఒకటి రెండు రోజులు వ్యవసాయానికి నిలిపివేయడం వంటి చర్యల ద్వారా డిమాండ్ను కంట్రోల్ చేస్తున్నారు. కోతలు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి విధించడం లేదు. అలాగే ఒకేసారి ఎక్కువ సమయం కూడా సరఫరా తీసేయడం లేదు. అలా చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కొద్ది కొద్ది సమయాలు, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో సరఫరా ఆపుతున్నారు. ఎవరైనా కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడిగితే నిర్వహణ, సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తున్నారు. -
చారిత్రక క్షేత్రానికి ముప్పు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా కొడవలి బౌద్ధ క్షేత్రంపై చారిత్రక వైభవం కలిగిన కొండలను కూటమి నేతృత్వంలోని మట్టి మాఫియా భారీ యంత్రాలతో కొల్లగొడుతోంది. కొండ ఆనవాళ్లు కోల్పోయేలా రాత్రి, పగలు తవ్వి తరలిస్తున్నారు. వేలాది లారీల్లో మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి సంపదతో పాటు స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన ఈ కొండ ప్రసుత్తం యంత్రాల కింద నలిగిపోతోంది.చారిత్రక నేపథ్యం ఇదీ.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో సర్వే నంబర్ 133/1లో ఉన్న కొడవలి బౌద్ధ క్షేత్రం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి అత్యంత ప్రాచీన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. దీనిని భారత పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా పరిరక్షిస్తోంది. బౌద్ధ స్తూపం నిరి్మత కట్టడమైన ధనకొండ, దానికి ఆనుకుని ఉన్న తురుక్కుల కొండలు నేమాలదిబ్బగా పేరు గాంచాయి. వీటిని వేర్వేరు పేర్లతో పిలుస్తున్నా.. ఆ సముదాయమంతా ప్రాచీన చారిత్రక కొడవలి బౌద్ధ క్షేత్రంలో అంతర్భాగమే. సర్వే నంబర్ 133/1లో సుమారు 372 ఎకరాల్లో చారిత్రక బౌద్ధ క్షేత్ర కట్టడాలు విస్తరించి ఉన్నట్లు కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి వెల్లడిస్తోంది. కొండ చుట్టూ తవ్వకాలువిశేష ప్రాధాన్యత కలిగిన తురుక్కుల కొండపై కూటమి మట్టి మాఫియా కన్ను పడింది. కొండ చుట్టూ తవ్వకాలు చేపడుతోంది. రోజూ వందల లారీలు, టిప్పర్లలో మట్టి అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఈ అక్రమ తంతు కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు కొండ వెనుక భాగంలో సుమారు వంద అడుగుల మేర తవ్వకాలు జరిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. కొండ చుట్టూ తవ్వేసి మట్టి తరలిస్తే.. కొండపైన ఉన్న బౌద్ధ స్తూపాలు కిందకు కుంగిపోయే ప్రమాదం ఉంది. కూటమి నేతల చర్యలతో బౌద్ధ మత చారిత్రక వైభవం సైతం మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.ఏఎస్ఐ నిబంధనలకు తూట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిబంధనల మేరకు బౌద్ధ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో 300 మీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదు. ఈ నిబంధనలకు కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. 300 మీటర్ల పరిధిలోనే తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ నేతల ప్రమేయంతో ఆగిన వైనం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ సర్వే నంబర్ 133లో సామర్లకోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ విషయమై కాకినాడ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో అనుమతులను తాత్కాలికంగా వాయిదా వేశారు.పవన్ ఇలాకాలో జరుగుతున్నా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చారిత్రక ఆధారాలను ధ్వంసం చేసే ప్రక్రియకు నాంది పలుకుతున్నా ఎందుకు ప్రశి్నంచడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను స్థానికులు ప్రశి్నస్తున్నారు. బౌద్ధ ప్రదేశాల్లో మైనింగ్ జరుగుతుంటే, ఎందుకు మిన్నకుండిపోయారన్న ఆరోపణలు లేకపోలేదు. -
పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్ నాగ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించనుంది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించిన ఆయనకు భారతీయ సినిమాకు అందించిన విశిష్ట సేవలకు ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించారు. సెప్టెంబరు 22న గుజరాత్లోని కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందజేయనున్నారు.అవార్డు ప్రకటన అనంతరం పీటీఐతో మాట్లాడిన అనంత్ నాగ్.. సినీ పురస్కారాల ఎంపిక విధానంలో బంధుప్రీతి, పక్షపాతం ఉండేవని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా ఆ విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వ్యక్తి పేరును ప్రజలు సిఫారసు చేయాలని మోదీ కోరడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా అవార్డుల ఎంపిక ప్రక్రియను ప్రజల ముందుకు తీసుకువచ్చారని వివరించారు.దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం తనకు వస్తుందని తాను ఊహించలేదని 79 ఏళ్ల అనంత్ నాగ్ తెలిపారు. ఈ పురస్కారాన్ని తన స్వస్థలమైన కర్ణాటక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. అవార్డును ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అనంత్ నాగ్ 250కిపైగా చిత్రాల్లో నటించారు. కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ గుర్తింపు పొందారు. 1973లో ‘సంకల్ప’తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ‘అంకుర్’, ‘నిశాంత్’, ‘మంథన్’, ‘భూమిక’, ‘కల్యుగ్’, ‘గెహ్రాయీ’ వంటి చిత్రాల్లో నటించారు. దూరదర్శన్లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’లోనూ కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు -
కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య
ఖమ్మం జిల్లా: క్షణికావేశంలో నాగార్జునసాగర్ కాల్వలో దూకిన గల్లంతయ్యాడనే విషయం తెలిసి సదరు వ్యక్తి భార్య ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆటో నడుపుతూ జీవనం సాగించే అమ్మపాలెంనకు చెందిన తేజావత్ హరిప్రసాద్కు అన్నవరం గ్రామానికి చెందిన సునీత(28)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా అప్పులయ్యాయి. దీనికి తోడు వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలుకావడంతో హరిప్రసాద్ బుధవారం ఉదయం బయటకు వెళ్లి తన అన్న రామ్మూర్తికి ఫోన్ చేసి చనిపోతున్నానని, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇదే సమాచారం సర్పంచ్కు కూడా ఇవ్వగా వారు పోలీసులకు తెలపడంతో ఫోన్ నంబర్ ఆధారంగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా హరిప్రసాద్ ఆటో, చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో ఆయన కాల్వలో దూకాడనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. కాగా, భర్త కాల్వలో దూకాడని తెలియగానే సునీత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హరిప్రసాద్ దంపతులు ఇటీవలే ప్రైవేట్ బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చిన సిబ్బంది ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. దీంతో సునీత ఉరి వేసుకుని కనిపించగా స్థానికులకు చెప్పడంతో పరిశీలించేసరికి ఆమె మృతి చెందింది. అయితే, సునీత బలవన్మరణంపై ఆమె తరఫు బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారణలో వివరాలు వెల్లడవుతాయని ఎస్ఐ సూరజ్ తెలిపారు. కాగా, హరిప్రసాద్ కానరాకుండా పోవడం, సునీత ఎందుకు మృతి చెందిందో తెలియక వీరి పిల్లలు మనోహర్, భార్గవి అడుగుతున్న ప్రశ్నలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
సీఎం ‘రెండో పెళ్లి’పై బిగ్ ట్విస్ట్.. ఛానల్ ఎండీపై ఎఫ్ఐఆర్!
తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీశన్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ బయటకొచ్చిన పత్రాలు.. ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసుకు దారితీశాయి. కాగా, ఆ పత్రాలు నకిలీవని ఆరోపిస్తూ రిపోర్టర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఆంటో అగస్టిన్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేపీసీసీ అధికార ప్రతినిధి రాజు పి. నాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అగస్టిన్ను మొదటి నిందితుడిగా చేర్చగా.. మరో ఇద్దరిని గుర్తు తెలియని నిందితులుగా పేర్కొన్నారు.వివాదం ఎలా మొదలైందంటే.. 2012లో కర్ణాటకలో సతీశన్ మరో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు పేర్కొంటున్న కొన్ని పత్రాలతో ఇద్దరు వ్యక్తులు తన కార్యాలయానికి వచ్చారని ఆంటో అగస్టిన్ తెలిపారు. అప్పటికే సతీశన్కు వివాహం జరిగి ఉందని చెబుతూ ఆ పత్రాలను తనకు చూపించారని వెల్లడించారు. అయితే పత్రాలను పరిశీలించిన తర్వాత అవి నకిలీవని తేలడంతో తమ సంస్థ ఆ కథనాన్ని ప్రసారం చేయలేదని అగస్టిన్ చెప్పారు. అయినప్పటికీ ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఈ వ్యవహారంపై రాజు పి. నాయర్ పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయడం, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడం కోసం కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో కేరళ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, క్రిమినల్ కుట్ర, పరువునష్టం కలిగించే సమాచార ప్రచురణకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు రిపోర్టర్ టీవీపై సిట్ సోదాలుఇదే రోజున రిపోర్టర్ టీవీ, ఆ సంస్థ ప్రమోటర్లకు సంబంధించిన ప్రాంగణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సోదాలు నిర్వహించడం మరింత చర్చకు దారితీసింది. లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ జట్టును కేరళకు తీసుకురావాలన్న విఫల ప్రయత్నానికి సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా కొచ్చి, వయనాడ్లోని ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్లతో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.సోదాల సమయంలో జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఉపయోగించే మొబైల్ ఫోన్లను పోలీసులు తీసుకెళ్లారని రిపోర్టర్ టీవీ ఆరోపించింది. అయితే పోలీసులు ఈ వాదనను ఖండించారు. ఎలాంటి ఫోన్లను స్వాధీనం చేసుకోలేదని, దర్యాప్తుకు అవసరమైన పత్రాల కోసమే సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మీడియా స్వేచ్ఛ అంశాన్ని లేవనెత్తాయి. సీఎం సతీశన్ మాత్రం సోదాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని, ప్రభుత్వం దర్యాప్తులో జోక్యం చేసుకోదని తెలిపారు. ఇలా సీఎం ‘రెండో పెళ్లి’ అంటూ మొదలైన వివాదం.. నకిలీ పత్రాల ఆరోపణలు, పోలీస్ కేసు, టీవీ ఛానల్పై సోదాలతో మరింత ముదిరింది. అసలు ఆ పత్రాలు ఎలా వచ్చాయి? వాటి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై ఇప్పుడు పోలీసుల దర్యాప్తు సాగుతోంది.ఇదీ చదవండి: అంతరిక్ష యుద్ధానికి మనం సిద్దమా? -
గ్రీన్ మార్క్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 23,258 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 పాయింట్లు పుంజుకొని 74,398 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.33బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 5 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.45 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.01 శాతం పడిపోయింది.Today Nifty position 17-09-2026(time: 09:21 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జమ్ముకశ్మీర్ ఉధంపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ (JeM) ఉగ్ర సంస్థకు చెందినవారై ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో చేపట్టిన గాలింపు చర్యలు.. చివరకు భారీ ఎన్కౌంటర్కు దారితీశాయి.ఉధంపూర్లోని సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు భారీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రంతా కొనసాగిన ఆపరేషన్ అనంతరం గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్రీయ రైఫిల్స్, పారా (స్పెషల్ ఫోర్సెస్), జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.ప్రాథమిక సమాచారం మేరకు జైషే మహ్మద్తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు, వారి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోంది.Udhampur, Jammu and Kashmir: Security forces continued their operation in the Majalta area of Udhampur district following reports of suspicious movement in the forested Khubban/Brettal-Sowan belt pic.twitter.com/crzAKvev9h— IANS (@ians_india) September 17, 2026ఇటీవల జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచాయి. సెప్టెంబర్ 5న బుద్గాం జిల్లాలో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ భద్రతా బలగాల కాల్పుల్లో హతమైనట్లు అధికారులు తెలిపారు. ఉధంపూర్లో తాజా ఎన్కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా జరిగింది.ఇదీ చదవండి: రెడ్ లైన్గా మక్కా నగరం! ఎందుకో తెలుసా? -
జింకపిల్లకు పులిపాలు!
తమిళనాడులోని మదురైకి సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయం స్తంభంపై చెక్కబడిన అరుదైన శిల్పం ఒకటి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం మురుగేశుని ఆరు పడై వీడులలో మొదటిదిగా పేరుగాంచింది. మదురై నగర కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందమలై అనే పవిత్ర కొండపై ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆరవ శతాబ్దంలో పాండ్యుల కాలంలో రాతిని తొలచి నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తర్వాత నాయక రాజులు పదహారవ శతాబ్దంలో విస్తరించారు. శివుడు, విష్ణువు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయంలోని ఒక ప్రత్యేకమైన లక్షణం. ఆ శిల్పంలో పరమశివుడు ఒక జింక పిల్లను ఒడిలో పట్టుకుని రక్షిస్తున్నట్లుగా పక్కనే నోరు తెరిచిన పులి ఆకృతి కనిపిస్తుంది. ఈ చిత్రంలో పాలు తాగుతున్న జింకను చూడవచ్చు. ఈ శిల్పానికి ఉన్న పురాణ నేపథ్యం తమిళ శైవ భక్తి గ్రంథాలలో ముఖ్యంగా తిరువిళైయాడల్ పురాణం శివుని అరవై నాలుగు లీలలలో కనిపిస్తుంది. కథ ఏమిటంటే ఒకప్పుడు అడవిలో ఒక తల్లి లేడి తన చిన్న కూనను ఒక పొదలో సురక్షితంగా దాచి నీరు తాగడానికి వెళ్తుంది. ఆ సమయంలో ఒక వేటగాడు ఆ తల్లి లేడిని వేటాడి చంపేస్తాడు. దీంతో ఆ లేడి కూన అనాథగా మిగిలి ఆకలితో అలమటిస్తుంది. ఆ దీనస్థితిని చూసిన కరుణామయుడైన శివుడు మదురైలో ఆలవాయ్ అళగన్గా పిలువబడే సోమసుందరేశ్వరుడు ఆ పిల్లను రక్షించడానికి ఒక అద్భుత లీల చేస్తాడు. అడవిలోని ఒక ఆడపులిని పిలిపించి దానిలో మాతృత్వాన్ని ప్రేరేపించి ఆ పులి ద్వారానే ఆ జింక పిల్లకు పాలు తాగించి కాపాడతాడు. సహజ శత్రువులైన పులి, జింకల మధ్య కూడా శివకరుణతో వాత్సల్యం ఏర్పడుతుందని ఈ లీల చెబుతుంది. ఈ అపార కరుణా ఘట్టాన్నే తిరుప్పరంకుండ్రం ఆలయ శిల్పులు రాతిలో అద్భుతం గా మలిచారు. శివుని చేతిలో లేడి పిల్ల... దానికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న పులి– ఇది శివుడు కేవలం సంహారకారుడు మాత్రమే కాదు సకల ప్రాణులను సమానంగా కాపాడే ప్రాణదాత, కరుణామూర్తి అని చెప్పే ప్రతీక. ఆలయంలోని ఆస్థాన మండపం, కంబతాడి మండపంలో ఇలాంటి అనేక అరుదైన శిల్పాలు కనిపిస్తాయి. అదే రాతి కొండపైనే మహిషాసుర మర్దిని కర్పగ వినాయకర్ తదితర దేవతా మూర్తులు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రధాన ఆలయ గోడలపై శివుని వివిధ నృత్య భంగిమలను చూపే ఫలకాలు కూడా భక్తులను ఆకట్టుకుంటాయి.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ఇదీ చదవండి: గణేశ్ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్.. అంత ఖరీదా ఆ చీర!) -
నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం!
ఖమ్మం జిల్లా: ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ... ఓ రైతు కలుపు మందు తాగడమేకాక తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించాడు. ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) స్వగ్రామంలోనే కాక ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయిలో భూమి కౌలుకు తీసుకుని భార్యతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.ఈక్రమాన భార్య అప్పలనరసింహాపురంలోని ఇంట్లో ఉండగా... సూర్యాపేట జిల్లా కోదాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న కుమార్తె లాస్య (14), నేలకొండపల్లి మండలం చెరువుమాధారం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కుమారుడు నిఖిల్ (11)ను బుధవారం వారి పాఠశాలలకు వెళ్లి తీసుకొచ్చాడు. ఆపై పిల్లలతో కలిసి గండ్రాయిలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియక... ముందుగా శ్రీనివాస్ థమ్సప్ సీసాలో గడ్డి మందు కలిపినట్లు తెలుస్తుండగా, పొలం వద్ద తొలుత తాను తాగాడు. ఆ తర్వాత లాస్య, నిఖిల్కు కూడా తాగించాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియని ఆ చిన్నారులు సైతం తాగేశారు. ఆపై బంధువులకు ఫోన్ చేసిన శ్రీనివాస్ విషయాన్ని చెప్పి స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంధువులు, గ్రామస్తులు గండ్రాయిలోని పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసుల సాయం తీసుకుని ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గుర్తించేసరికి ముగ్గురూ స్పృహ తప్పి కనిపించాడు. ఈ మేరకు శ్రీనివాస్, ఇద్దరు పిల్లలను ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ తండ్రి, కుమార్తె లాస్య మృతి చెందారు. ఇక కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. శ్రీనివాస్కు గ్రామంలో ఉత్తమ రైతుగా పేరుండటమేకాక అందరితో కలివిడిగా ఉండేవాడు. దీంతో ఆయన ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఏపీలోని చిల్లకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
‘ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు’
గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో విద్యాంసురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎం.ఎస్’. అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కమల్హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ బయోపిక్ తీయాలని స్ఫూర్తి పొందాం‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిసిన తర్వాత ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎంఎస్ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించారో చాలా మందికి తెలీదు. అమ్మ సంగీతాన్ని రీక్రియేట్ చేసేంత గొప్పవాళ్లం కాదు. అందుకే అనిరుధ్ సంగీతంతో ఓ గొప్ప బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నాం’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కాగా చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్మికపై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి కమల్హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!) -
ప్రదాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘భగవంతుడు మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో పాటు.. దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు.Wishing Hon’ble PM Shri @narendramodi ji a very happy birthday. May God bless him with good health, long life and the strength to serve the nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2026ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్.. కూటమి సర్కార్ అరాచకం -
మోదీ గుండె ధైర్యానికి ఇదిగో సాక్ష్యం!
నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న భారత ప్రధాని. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే మోదీ చిన్ననాటి జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఓ ఘటన తెలిస్తే మాత్రం.. ఆయన ‘గుండె ధైర్యం’ ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. మోదీకి చిన్నతనంలో ఈత అంటే చాలా ఇష్టం ఉండేదట. ఉదయం కుటుంబ టీ దుకాణంలో పని చేసిన తర్వాత మోదీ వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సుకు వెళ్లేవారు. సరస్సు మధ్యలో ఉన్న ఆలయం వరకు ఈత కొట్టి, అక్కడి జెండాను తాకి తిరిగి ఒడ్డుకు వచ్చేవారు. ఇలా రోజుకు మూడుసార్లు చేసేవారు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైంది. ఈత కొడుతుండగా ఓ మొసలి ఆయన కాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో వారం రోజులు ఆయన మంచానికే పరిమితం అయ్యారు. అయితే నెల తిరగకుండానే ఆయన మళ్లీ అదే సరస్సులో ఈతకు వెళ్లారట. ఈ విషయాన్ని మోదీ జీవితంపై వచ్చిన నరేంద్ర మోదీ: ది గేమ్ చేంజర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ సురేశ్ కే వర్మ ప్రస్తావించారు. అదే తొలిసారి కాదు!మోదీ చిన్ననాటికి సంబంధించిన మరో మొసలి కథ కూడా ప్రచారంలో ఉంది. ఓసారి సరస్సు ఒడ్డున ఓ మొసలి పిల్ల కనిపించడంతో దాన్ని ఆయన భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లారట. అది అడుగుకుపైగా పొడవు ఉందట. దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని మోదీ అనుకున్నప్పటికీ.. తల్లి హీరాబెన్ మాత్రం వద్దని చెప్పారట. వెంటనే దాన్ని ఆయన తిరిగి సరస్సులో వదిలేశారట. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మోదీ స్వయంగా కూడా 2019లో బేర్ గ్రిల్స్తో కలిసి పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సాధారణ కుటుంబంలో, చిన్న ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి మళ్లింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ జీవితంలోనూ ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాల్యంలో మొసలిని ఎదుర్కొన్న ఘటన కావొచ్చు.. తర్వాత పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కావొచ్చు.. మోదీ జీవిత ప్రయాణంలో ధైర్యం, నిర్ణయాత్మకతకు సంబంధించిన అధ్యాయాలు చాలానే కనిపిస్తాయి. అయితే వాటన్నింటికీ చాలా ముందే.. వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సు దగ్గర ఓ బాలుడిగా ఎదుర్కొన్న ఆ మొసలి ఘటన మాత్రం ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: మోదీని శ్రీ కృష్ణుడితో పోల్చేశాడే! -
క్యాష్ కొడితేనే పెళ్లి భోజనం!
మన దగ్గర పెళ్లి తంతు పూర్తవగానే.. కళ్లు చూసేది భోజనాల వైపే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా డైరెక్ట్గా భోజనానికి వెళ్లడానికి వీల్లేదు. డైనింగ్ రూమ్కి ముందుండే సెక్యూరిటీ గార్డు.. ద్వారపాలకుడిలా అమాంతంగా ఆపేస్తాడు. భోజనం చేయడానికి వీల్లేదని నిర్దయగా చెప్పేస్తాడు. ‘కానుక ఇచ్చుకో .. కంచం పుచ్చుకో’ అని హుకుం జారీ చేస్తాడు. అదీనూ ఏదో ఒక గిఫ్ట్ కాదూ.. కచ్చితంగా క్యాషే ఇవ్వాలని ఆర్డర్ వేసేస్తాడు. క్యాష్ ఇచ్చి.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతనే టోకెన్ ఇస్తాడు. దక్షిణ కొరియాలో ఉన్న ఈ వింతైన వివాహ సంస్కృతి గురించి తాజాగా ఓ భారతీయ యువతి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. కవర్లో క్యాష్ ఉంటేనే భోజనం అనే ఈ సంస్కృతిని కొరియన్ల భాషలో ‘చుగిగుమ్’ అని పిలుస్తారు. పెళ్లికి వచ్చిన అతిథులు ముందుగా ఓ ప్రత్యేకమైన డెస్క్ వద్ద తమ క్యాష్ కవర్ను అందించి తమ పేరు నమోదు చేసుకుంటారు. ఆ తరువాతే వివాహ వేడుకలోపా ల్గొంటారు. అయితే ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది. గిఫ్ట్స్ రూపంలో కాకుండా డబ్బులు ఇవ్వడమే.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటకు తోడ్పాటునిస్తుందన్నదే ఆ ఆలోచన. అంటే వారిచ్చే డబ్బే వారి కొత్త ఇంటికి అవసరమైన వస్తువులు, ఇతర ఖర్చులు వంటి వాటికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే తమకు నచ్చిన వస్తువు కొనడం కంటే, అవసరానికి తగ్గట్టు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం కొరియన్ల సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుగిగుమ్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎవరు తమ పెళ్లికి ఎంత ఇచ్చారో గుర్తుంచుకోవడం. భవిష్యత్తులో అతిథుల ఇంట్లోనూ పెళ్లి జరిగినప్పుడు తగిన మొత్తంలో తిరిగి ఇవ్వాలనే సామాజిక ఆనవాయితీ కూడా ఉంది. అయితే కాలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలో ఇప్పుడిప్పుడే మార్పులు ప్రారంభమయ్యాయి. అంటే డిజిటల్ పేమెంట్ల ద్వారా కూడా కానుకలు పంపే పద్ధతి నెమ్మదిగా విస్తరిస్తోందంట. ఏది ఏమైన ప్పటికీ ఈ గమ్మత్తైన ఆచారం వివాహం జరిపే కుటుంబాలకు, వివాహం చేసుకుంటున్న దంపతులకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తూ.. అండగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (చదవండి: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!) -
మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు గురువారం వారణాసిలో సమావేశం కానున్నారు. మోదీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసితో పాటు ఆయన జన్మస్థలమైన గుజరాత్లోని వడ్నగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట నెల రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనుంది.వారణాసి కార్యక్రమాలువారణాసిలో జరిగే కార్యక్రమంలో ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ ప్రధానంగా ఉంటుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ యాత్రను వారణాసి నుంచి గుజరాత్లోని వడ్నగర్ వరకు ప్రారంభించనున్నారు. అదే సమయంలో వడ్నగర్ నుంచి వారణాసి వైపు మరో యాత్ర ప్రారంభమవుతుంది. ఎన్డీయేకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వారణాసి సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ తదితరులు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.సేవా కార్యక్రమాలు‘సేవా మేరా యోగదాన్’ కింద రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు సహా 25 సేవా కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. ప్రజలు కనీసం ఒక కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. దేశవ్యాప్తంగా యువత, సేవా యాత్రికులతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అభినందనలు.. విమర్శలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాధనాన్ని వినియోగించడంపై ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రశ్నలు లేవనెత్తారు. ఛత్తీస్గఢ్లో 1.5 కోట్లకు పైగా దీపాలను వెలిగించేందుకు ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలకు మోదీపై ప్రశంసా వీడియోలు రికార్డు చేయాలని ఆదేశించారన్న ఆరోపణలను సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ ఆరోపణలను హెచ్టీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.ఇదీ చదవండి: గణేశ మండపంలో అవయవదాన సందేశం -
అడిడాస్లో లేఆఫ్లు.. ఒకే దెబ్బకు సగానికిపైగా..
ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్వేర్ దిగ్గజం అడిడాస్ తమ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా భారత్లో ఉద్యోగ కోతలు చేపట్టింది. హరియాణాలోని గురుగ్రామ్లో ఉన్న కంపెనీ ఇండియా టెక్నాలజీ హబ్లో దాదాపు 350 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేంద్రంలో ఉన్న మొత్తం 700 మంది ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిపై ఈ లేఆఫ్ల ప్రభావం పడింది.ఇటీవల నిర్వహించిన టౌన్హాల్ సమావేశంలో యాజమాన్యం ఈ నిర్ణయాన్ని ఉద్యోగులకు అధికారికంగా వెల్లడించింది. తొలగింపునకు గురైన వారిలో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఉన్నారు. బాధితులను రెండు విభాగాలుగా వర్గీకరించారు. మొదటి గ్రూప్ ఉద్యోగులకు వెంటనే ఎగ్జిట్ లెటర్లు అందజేయగా, రెండో గ్రూప్నకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఈ సమయంలో వారు ఇతర హబ్ల్లోని సహచరులకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్(కేటీ) పూర్తి చేయాల్సి ఉంటుంది.సంస్థాగత మార్పులు.. యాజమాన్యం స్పందనఈ నిర్ణయాన్ని అడిడాస్ అధికారిక ప్రకటన ద్వారా ధ్రువీకరించింది. ‘మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్ మోడల్ను పునర్నిర్మించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. వ్యాపార నిర్వహణను మరింత సరళతరం చేయడంతో పాటు క్లిష్టమైన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. అదే సమయంలో, భారత మార్కెట్ తమకు ఎంతో వ్యూహాత్మకంగా కీలకమైనదని, ఇక్కడి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆవిష్కరణలలో టెక్ హబ్ పాత్ర కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. బాధితులకు తగిన పరిపరిహారంతో పాటు కెరీర్ ట్రాన్సిషన్ సాయం అందిస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: బోరుమని ఏడ్చేసిన నిర్మలా సీతారామన్ -
గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!
నిద్రపోతూ కూడా బహుమతులు సాధించవచ్చా? ‘యస్’ అంటోంది జపాన్లో జరిగే స్లీప్ టోర్నమెంట్. టోక్యోకు చెందిన ఒక మ్యాట్రస్ కంపెనీ స్లీప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటుంది. ఈ పోటీలో బాగా నిద్రపోయిన వ్యక్తి మన కరెన్సీలో చెప్పాలంటే 13.76 లక్షలు గెలుచుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోటీదారులు 90 నిమిషాల వ్యవధిలో గాఢమైన, నాణ్యమైన నిద్రలోకి జారుకున్నామని నిరూపించుకోవాలి. ఈ టోర్నమెంట్లో పోటీదారుల నిద్రను ట్రాక్ చేసే పరికరాన్ని ఉపయోగిస్తారు. స్లీప్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ముందు పోటీదారులు కొన్ని వ్యాయామాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా మేల్కొవడం లేదా నిద్రమాత్రలు వేసుకుని తీవ్రమైన నిద్రలేమితో టోర్నమెంట్లో పాల్గొనడాన్ని నిషేధించారు. ఈ టోర్నమెంట్ వచ్చే నెల మొదటి వారంలో టోక్యోలోని షేర్ గ్రీన్ మినామీలో జరగనుంది. ఇదీ చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు! -
దేశాన్ని వీడతానన్న గ్రామం
లండన్: ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ యూకేలోని ఒక చిన్న గ్రామం తన నిరసన గళాన్ని బలంగా విన్పించింది. తప్పదనుకుంటే బ్రిటన్ నుంచి వేరుబడి యూరప్తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామంలోని మెజారిటీ ప్రజలంతా ఏకతాటి మీదకొచ్చారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో కొనసాగాలా వద్దా అంటూ చేపట్టిన ఒక అనధికారిక రెఫరెండమ్లో పిడ్డింగ్టన్ గ్రామానికి చెందిన ప్రజలంతా పాల్గొన్నారు. ఈ గ్రామ జనాభా కేవలం 350. వీరిలో 311 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో 285 మంది యూకే నుంచి విడిపోవాలని ఓటేశారు. 26 మంది బ్రిటన్లోనే కొనసాగాలని అనుకూలంగా ఓటేశారు. ‘‘మెజారిటీ ప్రజలు తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటారు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సందేశం కాదు. యావత్ ప్రపంచానికి మేమిచ్చే సందేశం’’ అని అక్కడి గ్రామ కౌన్సిల్ చైర్మన్ టిమ్ మెక్నాలీ వ్యాఖ్యానించారు. గ్రామానికి కేవలం 800 మీటర్ల దూరంలో ఉన్న సైన్యానికి చెందిన ఒక పాత స్థావరాన్ని విదేశీ వలసదారులకు కేటాయించి అక్కడ 1,200 శరణార్థి గృహాలను నిర్మించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తుండటంతో పిడ్డింగ్టన్ గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు వందలాదిగా కొత్తగా ఇళ్లను నిర్మిస్తే ఈ ప్రాంతంలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోతాయని, ఇది స్థానిక మధ్యతరగతి కుటుంబాల కొత్త ఇంటి కలను కాలరాస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వలసదారుల రాకతో ఈ ప్రాంతంలో భద్రత కరువవుతుందని, నేరాలు పెరిగే ప్రమాదముందని వాళ్లంతా ఆరోపిస్తున్నారు. ఈ రెఫరెండమ్ ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని పలువురు అభిప్రాయపడ్డారు. 1940లలో నాజీ జర్మనీ వైమానిక దాడులను బ్రిటన్ సేనలు అడ్డుకున్నట్లే ఇప్పుడు మేం విదేశీ వలసదారుల రాకను అడ్డుకోబోతున్నాం. మా ముందు తరాల వాళ్లు పోరాడినట్లే మేం సైతం పోరాటం కొనసాగిస్తాం’’అని 76 ఏళ్ల గ్రామçస్తుడు హెర్బెర్ట్ ఓవెన్ చెప్పారు. కానీ స్థానికంగా కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం ఈ ఘటనను ఒక వింతగా కొట్టిపారేశారు. బ్రిటన్ నుంచి ఒక గ్రామం విడిపోయేందుకు సాహసించిన కథతో రూపొందిన ‘పాస్పోర్ట్ టు పిమ్లికో’ సినిమాతో ఈ ఘటనను పోల్చిచూస్తున్నారు. -
గణేశ మండపంలో అవయవదాన సందేశం
సూరత్: భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అవగాహనకు గుజరాత్లోని సూరత్లో నిర్వహిస్తున్నగణేశోత్సవం వేదికగా నిలుస్తున్నది. వాస్తవ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ అనే థీమ్తో వినూత్న గణేశ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాందేర్ రోడ్లోని తాడ్వాడీ చార్ రాస్తా వద్ద బేజన్వాలా కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మండపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.వినాయక మండపం నేపథ్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆకర్షణీయమైన పోస్టర్లు, స్ఫూర్తినిచ్చే వాస్తవ ఘటనలు, సందేశాల ద్వారా మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా అవసరమైన వారికి జీవితంపై కొత్త ఆశ కల్పించవచ్చని వారు భక్తులకు వివరిస్తున్నారు. ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవదానం ద్వారా 8 నుంచి 9 మంది వరకు ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.అవయవదానానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను వివిధ దృశ్యాలు, సందేశాల ద్వారా ప్రదర్శించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యులకు అవయవదానంపై కౌన్సెలింగ్ ఇవ్వడం, కుటుంబ సభ్యుల సమ్మతి అనంతరం అవయవదాతకు గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం, గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాలను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించే ప్రక్రియను ఇందులో చూపించారు.డొనేట్ లైఫ్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నీళేశ్ మండలేవాలా మాట్లాడుతూ.. 2047 నాటికి అవయవాల కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోని పరిస్థితి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గణేశోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతకు ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ సందేశాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు! -
‘బాహుబలి, పుష్పాలకే ప్లాప్ అన్నారు.. తెలుగోళ్లకే ఎందుకిలా ?’
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెట్లు.. ఆడపిల్ల అని కూడా చూడలేదు)‘సంజయ్ను తెలుగు సినిమాకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, గుర్తింపు ఇచ్చారు. సంజయ్ అనుకుంటే ఎవరితోనైనా సినిమా చేయగలరని, కానీ నాతోనే తొలి చిత్రంలో హీరోగా తనను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘సిగ్మా’ కోసం నన్ను ఎంపిక చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ తెలుగులో మాత్రం సందీప్ను ఎందుకు హీరోగా తీసుకున్నారనే ప్రశ్నలు వచ్చాయని సందీప్ తెలిపారు.మనోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తాం?తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటని సందీప్ అన్నారు. అయితే ఆ సినిమా విడుదలైన తొలినాళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్లాప్ టాక్ వచ్చిందని గుర్తుచేశారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. ‘మనోళ్లను మనం పెంచుకోవడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి గొప్పగా చేస్తుంటే.. ‘తెలుగోళ్లు ఏదో చేయగలరు’ అంటూ ఇతర రాష్ట్రాల వారు మన టాలెంట్ను గుర్తిస్తున్నారు. ఇదే మన తెలుగు గొప్పతనం’ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.కాగా సినిమా విషయానికి వస్తే ‘సిగ్మా’లో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ‘సిగ్మా’పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. -
బానెట్పై ఎక్కించి,ఈడ్చుకెళ్లి..
లక్నో: తనతో మాట్లాడుతున్న మహిళను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను కారు బానెట్పైకి ఎక్కించి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నోలోని గోమతీ నగర్ పరిధిలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ రోడ్డులో బుధవారం ఉదయం అనామిక అనే ఒక మహిళ గతంలో స్నేహితుడైన షానవాజ్తో వాగ్వాదానికి దిగింది. కారు దిగి మాట్లాడాలని ఆమె సూచించినా అతను కారు దిగలేదు. దీంతో ఆమె కారు ఎదుట నిలబడి వాగ్వాదానికి దిగింది. అయినాసరే ఆమెను పట్టించుకోకుండా కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆమె కారు బానెట్ను పట్టుకుని అలాగే 25 మీటర్లకుపైగా ముందుకెళ్లింది. తర్వాత కొన్ని సెకన్లపాటు కారు ఆగింది. ఆ సమయంలో ఆమె కారు ముందు అద్దాన్ని బలంగా కొట్టడంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి అలాగే ఆమె మీదకు కారును పోనిచ్చాడు. దీంతో బానెట్పై వేలాడుతూ ఏడుస్తూ కాపాడండి అని అరిచింది. అయినాసరే పట్టించుకోకుండా అలాగే ఆమెను ఈడ్చుకెళ్లాడు. కారు వేగంగా దూసుకెళ్లడంతో ఆమె తర్వాత పక్కకు పడిపోయింది. తలకు అత్యంత సమీపంలో కారు కుడి ముందు టైరు దూసుకుపోయింది. దీంతో కొద్దిలో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఇదంతా అక్కడ సమీపంలోని ఒక వ్యక్తి తన స్మార్ట్ఫోన్లో రికార్డ్చేశారు. గాయాలపాలైన మహిళ అనామిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షానవాజ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు లక్నో ఈస్ట్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీక్షా శర్మ తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని హత్యాయత్నం నేరం కింద 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే అనామిక, షానవాజ్ ఏడాది క్రితం సహజీవనం చేశారని, షానవాజ్ ఇప్పుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి బుధవారం గొడవ పడినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని షానవాజ్ చెప్పాడు. తన నగదును ఆమె తీసుకుందని అతను ఆరోపించాడు. కేసు దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. "राजधानी लखनऊ के जनेश्वर मिश्र के पास युवती पर कार चढ़ाने की कोशिश.. वीडियो वायरल.."कार के बोनट पर टंगी युवती जान बचाते हुए चीखती रही.. शाहनवाज नाम के युवक पर युवती को कुचलने की कोशिश का आरोप.. शाहनवाज और युवती आपस में परिचित बतए जा रहे हैं.. शाहनवाज पर हिंदू बनकर युवती को… pic.twitter.com/jDPBD3vm8f— Vivek K. Tripathi (@meevkt) September 16, 2026 -
పాటపాడుతూ నిర్మలా సీతారామన్ భావోద్వేగం
కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎనలేని ప్రతిభను, ఆమె సమాజానికి అందించిన అసమాన సేవలను స్మరించుకుంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె సంగీత ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, తాను భారతీయ సంస్కృతికి సాధికార రూపమని కొనియాడారు.సంగీత సాధన.. భక్తి తత్త్వంఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్రంలో వెల్లివిరిసే భక్తిరసం, శ్రోతలను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు. వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజనల ద్వారా ప్రతి ఇంటా ఆమె స్వరం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సుబ్బులక్ష్మి కేవలం ఒక గాయని మాత్రమే కాదని, భారతీయ మూలాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అని వ్యాఖ్యానించారు.VIDEO | Karnataka: Union Minister Nirmala Sitharaman gets emotional as she remembers legendary singer MS Subbulakshmi at an event in Bengaluru to mark her 110th birth anniversary. pic.twitter.com/bRtr565lXz— Press Trust of India (@PTI_News) September 16, 2026సామాజిక సేవకు సంగీతమే ఆయుధంతమ సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగాన్ని వివిధ సామాజిక కార్యక్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి ఉదారతను మంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. గాంధీజీతో ఆమెకున్న అనుబంధాన్ని, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రతిధ్వనించిన ఆమె గాత్రం దేశానికి తెచ్చిన ఖ్యాతిని గుర్తు చేస్తూ నిర్మలా సీతారామన్ కంటతడి పెట్టారు. కళ అనేది మానవతా దృక్పథాన్ని, సమాజ సంక్షేమాన్ని పెంచేదిగా ఉండాలనడానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆమె చూపిన బాట నేటి తరం కళాకారులకు, యువతకు నిరంతర ప్రేరణ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది! -
కొండపైనా క్రెడిట్ కొట్టేశారు!
తిరుమల: తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం చేపట్టి, అధిక భాగం పూర్తి చేసిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారం మొత్తం చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడంపట్ల భక్తులు, ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మ్యూజియం పనులకు అప్పుడే శ్రీకారం శ్రీవారి ఆలయ చరిత్ర, కళా సంపదను భక్తులకు పరిచయం చేసేలా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. 2023లోనే టీటీడీ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. మ్యూజియం ఆధునీకరణకు టీసీఎస్ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ రూ.20 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చాయి. మొత్తం రూ.145 కోట్ల ప్రాజెక్టులో 19 గ్యాలరీలను అభివృద్ధి చేయనున్నట్లు అప్పట్లోనే టీటీడీ వెల్లడించింది. అన్నమయ్య రాగి రేకులు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి తదితర చారిత్రక వస్తువులను ప్రదర్శించేలా గ్యాలరీలను రూపొందించే పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమై, 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం పనులకు ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్ల సమయం పట్టింది. దీనిని విస్మరించి, మ్యూజియం అభివృద్ధి మొత్తం బాబు ప్రభుత్వంలోనే జరిగినట్లుగా చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్యోగుల ఇళ్ల స్థలాలపైనా అదే చర్చ టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2022లోనే వడమాలపేట మండలంలోని పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 300.22 ఎకరాల భూమిని ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందుకోసం రూ.61.63 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్కు అందించినట్లు టీటీడీ అప్పట్లోనే వెల్లడించింది. 2023 ఆగస్టులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి భూమిని కూడా పరిశీలించారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులకు 35/55 అడుగుల చొప్పున స్థలాలు కేటాయించే ప్రణాళికను అప్పట్లోనే ప్రకటించారు. లేఅవుట్, కచ్చా రోడ్లు, టౌన్ ప్లానింగ్ అనుమతుల కోసం కూడా చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లుగా ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లతో మౌలిక వసతులు కలి్పస్తామని చంద్రబాబు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దావూద్తో ఆ ఒక్క ఫొటో.. ఆమె జీవితాన్నే మార్చేసింది!
ఒక ఫొటో.. అప్పట్లో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెను సంచలనం. ఏకంగా అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో అప్పుడే స్టార్డమ్ దిశగా అడుగులేస్తున్న యువనటి నవ్వుతూ కనిపించింది. ఆ ఫొటో చుట్టూ ఎన్నో కథనాలు, ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఇద్దరి మధ్య సంబంధం ఉందని, దావూద్తో ఆమె డేటింగ్ చేసిందని, సీక్రెట్గా పెళ్లయ్యిందని.. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడంటూ వార్తలు గుప్పుమన్నారు. అయితే మొదటి నుంచీ ఆమె వాటిని ఖండిస్తూనే వచ్చారు. కానీ, తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారామె. ఆ ఫొటో తన కెరీర్కు చాలా నష్టం చేసిందని చెప్పారామె.ఏఎన్ఐ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అలనాటి అందాల తార మందాకిని మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి తనకు పరిచయం లేదని.. అతను తనను దుబాయ్కు పిలవలేదని.. ఓ షో కోసం తానే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. అక్కడే ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దావూద్ కనిపించాడని.. ఆ సమయంలోనే మాట్లాడుకున్నామని చెప్పారామె. అయితే ఓ కళాకారిగా తాను ఎంతోమందిని కలుస్తుంటానని, ఆ ఫొటో ఆధారంగా రకరకాల కథనాలు రావడంపై తానేమీ చేయలేనని చెప్పారు. ఈ వివాదం తనకు ఎంతో నష్టం చేసిందని, అప్పట్లో వచ్చిన రూమర్లను తాను మీడియా ముందే ఖండించానని గుర్తుచేశారు.సుమారు 1994–95 ప్రాంతంలో ఆ ఫొటో వెలుగులోకి వచ్చిన తర్వాత మందాకిని, దావూద్ సంబంధంపై రకరకాల కథనాలు వచ్చాయి. దావూద్ను పెళ్లి చేసుకున్నారని, అతనితో కలిసి దుబాయ్లో ఉంటున్నారని, వారికి ఓ కుమారుడు పుట్టాడని కూడా ప్రచారం జరిగినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే 2005లో మందాకిని స్వయంగా ఈ వాదనలను ఖండించారు. దావూద్తో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని, తాను 1990లో డాక్టర్ ఆర్. థాకూర్ను వివాహం చేసుకున్నానని చెప్పారు. తన కుమారుడు తన భర్తతోనే ఉన్నాడని స్పష్టం చేశారు. ‘ఆ విషయాలన్నీ తర్వాతే తెలిసింది’1980లలో బాలీవుడ్లో అండర్వరల్డ్ డబ్బు, ప్రభావం గురించి తనకు అప్పట్లో తెలియదని మందాకిని తాజాగా చెప్పారు. సినిమాల్లో తర్వాత వచ్చిన కథల ద్వారానే ఆ విషయాలు తెలుసుకున్నానన్నారు. ఆ ఫొటో చుట్టూ జరిగిన ప్రచారం తన కెరీర్పై తీవ్ర ప్రభావం చూపిందని, ఒకానొక టైంలో సినీ ఆఫర్లు బాగా తగ్గిపోయాయన్నారు. ఇలాంటి వివాదాలను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక టీమ్ ఉండాల్సిన అవసరాన్ని తర్వాత అర్థం చేసుకున్నానని చెప్పారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.సినిమా కాంట్రవర్సీ పైనా.. మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్. 1985లో రాజ్కపూర్ దర్శకత్వంలో వచ్చిన రామ్ తేరీ గంగా మైలీతో వెండితెరకు పరిచయమైన ఆమె.. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రంలో జలపాతంలో టాప్లెస్గా కనిపించడం అలాగే.. బిడ్డకు చనుబాలు ఇచ్చే సీన్లు ఆమెపై చిత్రీకరించారు. తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ చిత్రీకరణ జరిగిందని, రాజ్కపూర్ ఎంతో సున్నితంగా సన్నివేశాలను వివరించారని చెప్పారు. జలపాతం సన్నివేశంలో తనకు ఎలాంటి అసభ్యత అనిపించలేదని, కథలో గంగా పాత్ర పవిత్రతను చూపించేందుకే వాటిని రూపొందించారని పేర్కొన్నారు. బిడ్డకు పాలిచ్చే సన్నివేశం కూడా కెమెరా యాంగిల్స్తో అలా కనిపించేలా చిత్రీకరించారని, నిజంగా పాలివ్వలేదని వివరించారు. ఆ తర్వాత చాలామంది జలపాతం సన్నివేశాన్ని మళ్లీ చేయాలని కోరినా తాను మాత్రం అంగీకరించలేదని తెలిపారు. మందాకిని హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తీసిన సింహాసనంతో పాటు మలయాళంలో ఇతిలే ఇనియుమ్ వరూ, కన్నడలో హోస జీవన వంటి సినిమాల్లో నటించారు. దాదాపు 11 ఏళ్ల సినీ ప్రయాణంలో పలు చిత్రాల్లో కనిపించిన ఆమె.. 1996లో జోర్దార్ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే రామ్ తేరీ గంగా మైలీలోని జలపాతం సన్నివేశం, బిడ్డకు పాలిస్తున్నట్లు కనిపించే సన్నివేశం, ఆ తర్వాత దావూద్ ఇబ్రహీంతో ఉన్న ఫొటో చుట్టూ సాగిన వివాదం.. ఇవన్నీ ఆమె సినీ జీవితంలో ఇప్పటికీ ఎక్కువగా చర్చకు వచ్చే అంశాలుగా మిగిలిపోయాయి. తాజాగా ఈ విషయాలపై స్పందిస్తూ.. దావూద్తో ఫొటో వివాదం తన కెరీర్కు చాలా నష్టం చేసిందని మందాకిని చెప్పారు.ఇదీ చదవండి: చాక్లెట్ తిన్నంత మాత్రాన ప్రాణం పోతుందా? -
కీసరలో అర్ధరాత్రి ఏసీబీ దాడులు.. సీఐ, ఎస్ఐ అరెస్ట్
సాక్షి, కీసర: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ... రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. దీంతో, ఈ కేసులో సీఐ ఆంజనేయులు, లంచం తీసుకున్న ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. అంతేకాకుండా కొంతకాలంగా నిందితుడితో బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. లంచం డబ్బులు తీసుకునే బాధ్యతను సీఐ ఆంజనేయులు తన కింద పనిచేసే ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డికి అప్పగించినట్లు గుర్తించారు.దీంతో డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు వల పన్నారు. కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్ఐ.. బాధితుడి నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకునే విధంగా ప్లాన్ చేశారు. అదే సమయంలో అధికారులు అక్కడికి చేరుకోవడంతో ఎస్ఐ అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు సమాచారం. కెమికల్ పరీక్షలకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డితో పాటు సీఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి -
శ్రీవారి వద్ద సేవే చేయాలి.. ఉద్యోగం కాదు
తిరుమల : శ్రీవారి వద్ద సేవ చేయాలే తప్ప ఉద్యోగాలు కల్పించే సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) మారకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో అంతవరకే ఇస్తామని స్పష్టంచేశారు. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే టీటీడీ ఆదాయంలో 100 శాతం జీతాలకే వెళ్లిపోతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వారి సేవలను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. వైద్య, విద్యారంగాల్లో పనిచేసే వారిని కూడా సేవకులుగా మార్చి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. తిరుపతికి స్కైవాక్.. 50 ఎకరాల్లో పార్కింగ్.. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఆ ప్రాంతాన్ని అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల తిరుపతిలో సేకరించిన 50 ఎకరాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్గా మార్చాలన్నది తమ ఆలోచన అని ∙తెలిపారు.రూ.3,165 కోట్ల అన్నదానం కార్పస్ ఫండ్.. టీటీడీలోని ఎస్వీ అన్నదానం ట్రస్ట్కు దాదాపు రూ.3,165 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని సీఎం వెల్లడించారు. ప్రాణదానం ట్రస్ట్ ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. 65 ఆలయాలకు ఏ, బీ, సీ కేటగిరీలు.. టీటీడీ ఆధ్వర్యంలోని 65 ఆలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూములు తదితర వివరాలను ఆన్లైన్లో ఉంచేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలకు నీటి భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో పలు ప్రారంభోత్సవాలు.. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దుర్లభ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ఉన్నాయి.సీఎం వ్యాఖ్యలపై టీటీడీ సిబ్బంది ఫైర్!సాక్షి టాస్్కఫోర్స్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల నియామకాలపై సీఎం చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు ఉండవు.. అవసరం మేరకే ఉంటాయి.. శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వచ్చే ఆదాయం వంద శాతం ఉద్యోగుల జీతాలకే వెళ్తుంది’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. ఉద్యోగాల విషయంలో ఇలా మాట్లాడటాన్ని టీటీడీ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగానికి బదులు ‘సేవ’?.. రాష్ట్రంలో ప్రభుత్వంతో సమాంతరంగా తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తుంది. టీటీడీలో శాశ్వత, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద సుమారు 15 వేల నుంచి 16 వేల మంది పనిచేస్తున్నట్లు సమాచారం. టీటీడీలో పనిచేసే ఉద్యోగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి వివిధ రూపాల్లో జీవనోపాధి లభిస్తుంది. అటువంటి ధార్మిక సంస్థలో ఉద్యోగావకాశాలకు గండికొట్టేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఇటు టీటీడీలోనూ.. అటు జనంలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం, విద్య తదితర రంగాల్లో కొత్తగా ఉద్యోగాలను భర్తీచేయడం కంటే ఇప్పటికే ఉన్న శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి సేవా కార్యక్రమాల్లో వినియోగించుకోవాలన్న దిశగా సీఎం వ్యాఖ్యలు ఉండడంపై టీటీడీ ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
వెంటాడిన 3,700 ఏళ్ల నాటి వైరస్.. 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి!
ఏథెన్స్: గ్రీస్లో 2025లో, అలాగే ఈ ఏడాది వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి చెందడం లేదా వ్యాధి నియంత్రణలో భాగంగా వధించాల్సి వచ్చింది. అత్యధిక మరణాల రేటు కలిగిన ఈ వైరస్ సుమారు 3,700 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన గ్రంథాలు రాసేందుకు ఉపయోగించిన గొర్రె చర్మపు పార్చ్మెంట్లో ఈ వైరస్కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్కు చెందిన మాలిక్యులర్ పాపులేషన్ జెనెటిక్స్ ల్యాబ్ పరిశోధకుడు లూయిస్ ఎల్హోట్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గొర్రె చర్మంపై రాసిన యార్క్ గాస్పెల్స్ సహా పలు చారిత్రక పత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా కాంస్య యుగానికి చెందిన గొర్రెల దంతాలను కూడా విశ్లేషించారు. వైరస్కు సంబంధించిన అత్యంత పురాతన ఆధారాలు ఈ దంతాల్లోనే లభించాయని పరిశోధకులు తెలిపారు.కాంస్య యుగంలోనే యూరేషియన్ స్టెప్పీ ప్రాంతంలోని పెంపుడు గొర్రెల మందల్లో ప్రస్తుతం అత్యంత అంటువ్యాధిగా, తీవ్ర ప్రభావం చూపే వ్యాధికారక వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఎల్హోట్ తెలిపారు. స్టెప్పీ ప్రాంతంలోని ఆ కాలానికి చెందిన గొర్రెల్లో వ్యాధికారకానికి సంబంధించిన ఆధారాలు లభించడం.. అక్కడి పశుపోషక సమాజాలు అనేక రకాల పశు వ్యాధులతో పోరాడి ఉండొచ్చని సూచిస్తోందన్నారు.మధ్యయుగ కాలంలో జంతువుల చర్మంతో తయారు చేసిన పత్రాల్లో ఎస్పీపీవీ జన్యువులు పెద్ద సంఖ్యలో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఆ కాలంలో గొర్రెలకు ఈ వైరస్ సోకడం యూరప్ సమాజాలకు తరచూ ఎదురైన సమస్యగా భావిస్తున్నారు.షీప్పాక్స్కు కారణమయ్యే క్యాప్రిపాక్స్వైరస్.. మనుషుల్లో మశూచికి కారణమయ్యే వేరియోలా వైరస్కు దగ్గరి సంబంధం కలిగి ఉంది. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో రోమ్లో ఈ వ్యాధికి సంబంధించిన తొలి లిఖిత ఆధారాలు లభించాయి. రచయిత లూసియస్ కొలుమెల్లా గొర్రెల చర్మంపై ఏర్పడే గాయాలను ‘పస్ట్యూల్స్’గా పేర్కొన్నారు. పశువుల లెక్కలు, వ్యవసాయ గ్రంథాల్లో ఈ వ్యాధిని ‘పాక్స్’ లేదా ‘వేరియోలా’గా కూడా పేర్కొన్నారు. వ్యాధి విజృంభించిన ప్రతిసారీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గినట్లు ఆ రికార్డులు సూచిస్తున్నాయి.మధ్యయుగ యూరప్లో పశువులకు అర్థంకాని వ్యాధులు సోకినప్పుడు వాటిని చేతబడి ప్రభావంగా కూడా ప్రజలు భావించేవారు. షీప్పాక్స్ వైరస్ జంతువుల చర్మంలో నిలిచిపోయేది. ఆ చర్మాన్ని పార్చ్మెంట్ తయారీకి ఉపయోగించడంతో శాస్త్రవేత్తలు పురాతన పత్రాల ద్వారా వైరస్ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేశారు.ఈ వ్యాధి తూర్పు యూరప్, కాకేసస్ స్టెప్పీ ప్రాంతాల్లో తొలుత ఉద్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి ప్రజలు గొర్రెలను దుస్తులు, మాంసం, పాల ఉత్పత్తుల కోసం పెంచేవారు. పెద్ద నివాస ప్రాంతాలు లోహాలు, సిరామిక్ వస్తువుల వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు ఈ వస్తువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, విదేశీ వ్యాపారులు తెలియకుండానే వైరస్ను తమ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇతర గొర్రెల మందలతో కలవడం కూడా వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్నారు.చారిత్రక పత్రాలను పరిశీలించిన ఎల్హోట్కు.. చర్మం బయటి భాగంతో పోలిస్తే మాంసం వైపు ఎక్కువ వైరస్ డీఎన్ఏ కనిపించింది. గొర్రెలను పెంపుడు జంతువులుగా మార్చిన సమయంలోనే షీప్పాక్స్ ఉద్భవించి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాల్లో జ్వరం, ఆకలి తగ్గడం, కళ్ల నుంచి స్రావాలు రావడం, ఉన్ని లేని ప్రాంతాల్లో చర్మంపై గాయాలు ఏర్పడటం కనిపించాయి.ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు! -
పురుగులకెరుక.. మనిషి మృత్యురేఖ!
సాక్షి, హైదరాబాద్: పాపాలు చేస్తే పురుగులు పట్టిపోతావు... అనేది ముతక సామెత. ప్రస్తుతం మృతదేహంపై వచ్చే ఈ పురుగులే మరణ సమయాన్ని స్పష్టం చేయనున్నాయి. దీనికి సంబంధించిన సరికొత్త సాఫ్ట్వేర్ను తెలుగు పరిశోధకులు రూపొందించారు. ‘ఆటోమేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎంటమాలజీ’పేరుతో జరిగిన పరిశోధన ద్వారా దీనికి రూపమిచ్చారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆరు విద్యా సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్ క్లూస్ టీమ్లో పని చేస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వెంకన్న ఈ పరిశోధన ఉపయుక్తమన్నారు. హత్య కేసుల్లో అదే కీలకం మరణం ఎప్పుడు సంభవించిందనేది హత్య కేసుల దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘టైమ్ సిన్స్ డెత్’అని పిలుస్తారు. ఇప్పటి వరకు మృతదేహం లభించిన సమయం, శవపరీక్ష నివేదిక, శరీర ఉష్ణోగ్రత, కండరాలు బిగుసుకుపోవడం తదితర అంశాల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయిన తర్వాత ఈ అంచనా అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇలాంటి సందర్భాల్లో శవంపై వాలే ఈగలు, వాటి లార్వాలు తదితరాలు కీలక ఆధారాలుగా మారుతున్నాయి. వాటి పెరుగుదల దశ, పరిమాణాన్ని విశ్లేíÙంచి మరణం జరిగి ఎన్ని రోజులైందో అంచనా వేస్తున్నారు. 40 మృతదేహాలపై పరిశోధన ఈ పరిశోధనలో అమృత్సర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శవపరీక్షకు గురైన 40 కుళ్లిన మృతదేహాలను పరిశీలించారు. ఈ విధానంలో కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా వచ్చిన ఫలితాలు సంప్రదాయ పద్ధతిలో వచి్చన ఫలితాలతో 99 శాతానికి పైగా సరిపోలాయి. దీంతో క్లిష్టమైన హత్య కేసుల్లో మరణ సమయాన్ని వేగంగా అంచనా వేసేందుకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మృతదేహం కుళ్లడం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక రకాల ఈగలు దానిపై గుడ్లు పెడతా యి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి పెరుగుదల వేగంలో మార్పులు ఉన్నప్పటికీ.. ఒక నిర్దిష్ట జాతి పురుగు ఏ దశలో ఉందో, దాని పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా మృతదేహంపై పురుగులు చేరిన సమయాన్ని అంచనా వేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎలా పని చేస్తుందంటే... మొదటి దశలో మృతదేహం లేదా దానిపై ఉన్న పురుగులు/కీటకాలు స్పష్టంగా కనిపించేలా ఫొటో తీస్తారు. దీన్ని ఆ సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసినప్పుడు ఒక్కో పురుగును ప్రత్యేకంగా గుర్తించి సంఖ్య కేటాయిస్తుంది. ఆ తర్వాత ప్రతి పురుగు పొడవు, ఆకారం, పరిమాణాన్ని లెక్కిస్తుంది. ఆపై పురుగు ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అనంతరం పురుగు ఆక్రమించిన ప్రాంతాన్ని లెక్కించి దాని విస్తీర్ణాన్ని లెక్కిస్తుంది. ఆపై పురుగు పరిమాణాన్ని దాని ఎదుగుదల దశతో పోలుస్తుంది. గుడ్డు నుంచి ఈగగా మారే క్రమానికి పట్టే సమయాలను పరిశోధకులు ముందుగానే సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. ఇలా ఆ కీటకాలు ఎంతకాలంగా పెరుగుతున్నాయో అంచనా వేస్తుంది. ఆ సమాచారాన్ని ఉపయోగించి మరణించి ఎన్ని రోజులైందో చూపిస్తుంది. -
సౌదీకి కొత్త టెన్షన్.. హౌతీల సంచలన ప్రకటన!
సౌదీ అరేబియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా సౌదీకి చెందిన ఎఫ్-15నే కూల్చేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన ఇప్పుడు పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది. యెమెన్ గగనతలంలో సౌదీకి చెందిన అత్యాధునిక యుద్ధవిమానాన్ని స్థానికంగా తయారుచేసిన క్షిపణితో నేలకూల్చినట్లు ప్రకటించింది. విమానం కూలుతున్న దృశ్యాలంటూ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న హౌతీలు.. ఇప్పుడు యుద్ధవిమానాన్నే కూల్చినట్లు చెప్పడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. అయితే ఈ ప్రకటనను సౌదీ ధృవీకరించలేదు.గత వారం రోజుల్లో యెమెన్ వ్యాప్తంగా సౌదీ అరేబియా 450కిపైగా వైమానిక దాడులు జరిపిందని హౌతీలు ఆరోపించారు. ఖమీస్ ముషైత్, తాయిఫ్ వైమానిక స్థావరాల నుంచి ఎఫ్-15, టైఫూన్ యుద్ధవిమానాలతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తైజ్, లహిజ్, అల్-జౌఫ్, హజ్జా, మారిబ్, సాదా, అల్-బైదా ప్రావిన్సుల్లో దాడులు జరిగాయని, పౌరులు మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారని హౌతీలు వెల్లడించారు. ఈ దాడులకు ప్రతిగా మారిబ్ గగనతలంలోకి వచ్చిన సౌదీ యుద్ధ విమానాలపై తమ దళాలు క్షిపణులతో దాడి చేశాయని పేర్కొన్నారు. కూలిన విమానం శకలాల కోసం గాలిస్తున్న సౌదీ యుద్ధ విమానాలను కూడా లక్ష్యంగా చేసుకుని వెనక్కి వెళ్లేలా చేశామని హౌతీ వర్గాలు ప్రకటించాయి.మరో సౌదీ డ్రోన్ కూడా కూల్చివేత?ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే.. మరో కీలక ప్రకటన చేసింది హౌతీ సైన్యం. మారిబ్ ప్రాంతంలో సౌదీకి చెందిన వింగ్ లూంగ్-2 సాయుధ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లు వెల్లడించింది. తమపై దాడులకు పాల్పడుతున్న సమయంలోనే దానిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.مشاهد نوعية لإسقاط طائرة مقاتلة سعودية من نوع F15 وحطامها في محافظة مأرب - 16 سبتمبر 2026م https://t.co/rk0suliePT— الإعلام الحربي اليمني (@MMY1444) September 16, 2026మరోవైపు.. సౌదీ, హౌతీల మధ్య ఘర్షణలు మక్కా సమీపానికి చేరడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మక్కాకు దక్షిణంగా ఓ హౌతీ డ్రోన్ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రకటించింది. అది నగర నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేసినట్లు తెలిపింది. పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం ‘రెడ్లైన్’ దాటడమేనని రియాద్ హెచ్చరించింది. అయితే మక్కాపై తాము దాడి చేయలేదని హౌతీలు తెలిపారు. ఈ ఘటనను సౌదీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.2015 నుంచి కొనసాగుతున్న పోరుసౌదీ అరేబియా 2015 నుంచి యెమెన్లో హౌతీలకు వ్యతిరేకంగా సైనిక కూటమికి నాయకత్వం వహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో కాల్పుల విరమణతో ఘర్షణలు కొంత తగ్గినప్పటికీ.. ఈ నెలలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగినట్లు కథనాలు చెబుతున్నాయి. ఎర్ర సముద్ర తీర ప్రాంతాలు, బాబ్ అల్-మండేబ్ జలసంధి పరిసరాల్లోనూ హౌతీలు తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎఫ్-15ను కూల్చినట్లు చేసిన ప్రకటన తమ వైమానిక రక్షణ సామర్థ్యం పెరిగిందనడానికి నిదర్శనమని హౌతీ నేతలు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక -
ఒక్క క్షణం ఆలస్యమైనా...
రీల్ అద్భుతంగా రావాలి. ప్రత్యేకంగా కనిపించాలి. లక్షల వ్యూస్ కావాలి. అంతే అనుకున్నదేమో ఒక తల్లి. రీల్స్ మాయలో తన వెంట బిడ్డ ఉందనే సంగతిని కూడా మరిచిపోయింది. ఏమీ తెలియని ఆ చిన్నారి ప్రమాదపుటంచుల్లోకి వెళ్లినా పట్టించుకోలేదు. ఆందోళన కలిగించే ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఓ మహిళ బ్రిడ్జిపై నిలుచుని రీల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వెంట ఉన్న చిన్నారి నెమ్మదిగా వంతెన అంచుల వైపునకు పాకుతూ వెళ్లింది. కానీ ఆ తల్లి కెమెరా వైపు చూస్తూ అదేమీ గమనించలేదు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి.. పాపను ప్రమాదం నుంచి రక్షించాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలు స్పష్టంగా లేకపోయినప్పటికి .. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనలు, రోడ్లు, నీటి ప్రదేశాలు, ఎతైన ప్రాంతాల దగ్గర పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని గుర్తుచేస్తున్నారు. రీల్ కొన్ని సెకన్ల పాటే.. కానీ చిన్నారి భద్రత మాత్రం జీవితాంతం ముఖ్యమని సూచిస్తున్నారు. -
యూపీఐ ‘ట్యాక్స్’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్కు కౌంటర్!
యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో రాజకీయ రగడ ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఛార్జీల విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఆయన ‘యూపీఐ ట్యాక్స్’గా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరును హైలైట్ చేస్తూ బీజేపీ తాజాగా కాంగ్రెస్పై ప్రశ్నలు సంధించింది.బీజేపీ వర్గాల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యూపీఐకి సంబంధించి శ్రేణుల వారీగా (టైర్డ్) ఎండీఆర్/రెవెన్యూ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్కు చెందిన పి. చిదంబరం(మాజీ ఆర్థిక మంత్రి), మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కే. గోపీనాథ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న కమిటీ నివేదికను ఆమోదించిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్లో ఎలాంటి అసమ్మతి నమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.దీంతో.. పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడే యూపీఐకి స్థిరమైన రెవెన్యూ మోడల్ అవసరమని సిఫార్సు చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.ఆ కమిటీ ఏం చెప్పిందంటే..యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు టైర్డ్ రెవెన్యూ మోడల్ అవసరమని కమిటీ పేర్కొంది. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన మొత్తం సుమారు రూ.2,000 కోట్లుగా ఉండగా.. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం దాదాపు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ప్రస్తావించింది. తగిన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, నెట్వర్క్ మౌలిక వసతులపై పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.అసలు కొత్త ఛార్జీ ఎంత?కేంద్రం ప్రకటించిన ప్రస్తుత విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300గా పరిమితి ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ బదిలీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్యుత్, నీటి వంటి కొన్ని విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు శాతం ఆధారిత ఎండీఆర్కు బదులుగా ఫ్లాట్ రూ.5 రుసుము ఉండనుంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.రాహుల్ గాంధీ ఏమంటున్నారు?ఈ కొత్త విధానాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీఐ ట్యాక్స్ వెనక అమెరికా ఒత్తిడి ఉందని ఆరోపించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తిరస్కరించింది. యూపీఐ విధాన నిర్ణయాలు ఎలాంటి బయటి ఒత్తిళ్లతో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం మరోవైపు ఎండీఆర్ అంటే పన్ను కాదని, వినియోగదారుల నుంచి ప్రభుత్వం లేదంటే ఎన్పీసీఐ నేరుగా వసూలు చేసే ఛార్జీ కూడా కాదని చెబుతోంది. పేమెంట్ వ్యవస్థలోని బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లు తదితర భాగస్వాముల మధ్య ఈ రుసుము పంపిణీ అవుతుందని వివరిస్తోంది.ఇక రాజకీయంగా కొత్త చర్చ..ఇలా రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వేళ.. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన టైర్డ్ రెవెన్యూ మోడల్ సిఫార్సును బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నివేదిక ఆమోద సమయంలో ఉన్నారని, ప్రచురితమైన మినిట్స్లో వారి అసమ్మతి నమోదు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ మోడల్కు, ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఎండీఆర్ విధానానికి ఉన్న తేడాలు ఏమిటన్నదే తాజా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఛార్జీలు కట్టాల్సిందేనా?! -
ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు!
ఒకవైపు బియ్యం గింజపై సైతం ఇమిడిపోయేంత చిన్నగా వెండితో రూపొందించిన గణేశుడి అష్టవినాయక రూపాలు.. మరోవైపు ఏకంగా 50 వేల గణేశ విగ్రహాలతో ఏర్పాటు చేసిన భారీ సేకరణ.. గణేశ్ ఉత్సవాల వేళ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు విశేషాలు భక్తి, కళ, సృజనాత్మకతకు భిన్నమైన రూపాలను ప్రదర్శిస్తున్నాయి. మైక్రో ఆర్టిస్ట్ రాజేశ్ సోనీ కేవలం 6 మిల్లీమీటర్ల పొడవు, 70 మిల్లీగ్రాముల బరువున్న వెండి అష్టవినాయక కళాకృతిని రూపొందించగా.. సంజయ్ క్షత్రియ 50,000 గణేశ విగ్రహాలను సేకరించి భద్రపరిచారు. ఒకటి సూక్ష్మ కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిస్తే.. మరొకటి గణేశుడి వివిధ రూపాలు, కళా సంప్రదాయాలను ఒకేచోట చేర్చిన ప్రత్యేక సేకరణగా నిలుస్తోంది.బియ్యపు గింజపై ఇమిడే గణేశుడుమధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లా జావద్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రాజేశ్ సోనీ వెండితో గణేశుని అష్టవినాయక రూపాలను అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. మొత్తం కళాకృతి పొడవు కేవలం 6 మిల్లీమీటర్లు కాగా, బరువు 70 మిల్లీగ్రాములు. పరిమాణం చాలా చిన్నగా ఉండటంతో దీనిని బియ్యం గింజపై లేదా పూజలో ఉపయోగించే దూర్వ గడ్డిపైన కూడా ఉంచవచ్చు. గణేశుడి అష్టవినాయక రూపాలను ఇంత చిన్న పరిమాణంలో రూపొందించడం ఈ కళాకృతికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.ఎనిమిది రూపాలు.. అద్భుత కళాకృతిరాజేశ్ సోనీ రూపొందించిన సూక్ష్మ కళాకృతిలో శ్రీ మయూరేశ్వర, శ్రీ సిద్ధివినాయక, శ్రీ బల్లాలేశ్వర, శ్రీ వరదవినాయక, శ్రీ చింతామణి, శ్రీ గిరిజాత్మజ, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ మహాగణపతి రూపాలను పొందుపరిచారు. దీంతో దూర్వపై ఉంచిన ఈ సూక్ష్మ కళాకృతి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.మిల్లీమీటర్ల భాగాలతో రూపకల్పనఈ కళాకృతిని రూపొందించేందుకు ఒక్కో గణేశ రూపంలోని తల, తొండం, పొట్ట, చేతులు, కాళ్లు, చెవులను విడివిడిగా తయారు చేశారు. ఒక్కో భాగం 2 నుంచి 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంది. అనంతరం గ్యాస్పై అత్యంత తక్కువ మంటతో వాటిని కలిపారు. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతను నియంత్రించడం ప్రధాన సవాలుగా మారింది. మంట కొద్దిగా ఎక్కువైనా వెండి సన్నని తీగ కరిగిపోయే అవకాశం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా ఈ పనిని పూర్తి చేసినట్లు రాజేశ్ సోనీ తెలిపారు.మైక్రో ఆర్ట్లో ఇప్పటికే ఎన్నో ఘనతలురాజేశ్ సోనీకి మైక్రో ఆర్ట్ రంగంలో గతంలోనూ అనేక ప్రత్యేక కళాకృతులు రూపొందించిన అనుభవం ఉంది. ప్రపంచంలోనే అతి చిన్న తాజ్మహల్, ప్రపంచ కప్ ట్రోఫీ వంటి కళాకృతులను ఆయన రూపొందించారు. ఈ కళాకృతులకు సంబంధించి ఆయన పేరు ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. తాజాగా వెండితో రూపొందించిన అష్టవినాయక కళాకృతి కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.మరోవైపు 50 వేల గణేశ విగ్రహాలుమహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్కు చెందిన సంజయ్ క్షత్రియ గణేశుడిపై తనకున్న ఆసక్తిని విస్తృతమైన విగ్రహాల సేకరణగా మార్చుకున్నారు. ఆయన వద్ద ప్రస్తుతం 50,000 గణేశ విగ్రహాలున్నాయి. వివిధ పరిమాణాలు, డిజైన్లు, రూపాలు, కళా శైలలలో ఉన్న ఈ విగ్రహాలను ఆయన కొన్ని ఏళ్లుగా సేకరించి భద్రపరిచారు. గణేశ్ ఉత్సవాల సమయంలో ఈ సేకరణకు ప్రత్యేక ఆదరణ లభిస్తోంది.ఒక్కో విగ్రహానిదో ప్రత్యేక శైలిక్షత్రియ సేకరణలో సంప్రదాయ రూపాల నుంచి ఆధునిక కళాత్మక రూపకల్పనల వరకు వివిధ రకాల గణేశ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల భంగిమలు, ముఖ కవళికలు, కిరీటాలు, ఆభరణాలు, రంగుల కలయికలు, సున్నితమైన అలంకరణలు ఒక్కో విగ్రహానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. వివిధ పదార్థాలు, కళాత్మక పద్ధతులతో రూపొందించిన విగ్రహాలు భారతీయ విగ్రహ తయారీ సంప్రదాయాల్లోని వైవిధ్యాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.మారుతున్న గణేశ కళకు దృశ్య రికార్డుమహారాష్ట్ర సామాజిక, సాంస్కృతిక జీవనంలో గణేశుడు కీలక భాగంగా ఉన్నారు. ఇళ్లలో జరిగే వేడుకల నుంచి భారీ బహిరంగ గణేశ ఉత్సవాల వరకు విగ్రహాల రూపం, ప్రదర్శనలో కాలక్రమేణా మార్పులు వచ్చాయి. సంజయ్ క్షత్రియ సేకరణలోని విభిన్న విగ్రహాలు ఈ మారుతున్న కళా సంప్రదాయాలను ఒకేచోట చూడటానికి అవకాశం కల్పిస్తున్నాయి. కళాకారులు తమ భక్తిని వివిధ రూపాలు, డిజైన్లు, సృజనాత్మక ఆలోచనల ద్వారా ఎలా వ్యక్తం చేశారో ఈ సేకరణ ద్వారా చూడవచ్చు.భక్తి.. కళ.. వారసత్వం50 వేల విగ్రహాలను సేకరించి భద్రపరచడం సాధారణ విషయం కాదు. ఇంత పెద్ద సేకరణకు సరైన నిల్వ సౌకర్యాలు, క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సంరక్షణ అవసరం. సంజయ్ క్షత్రియకు ఇది కేవలం సంఖ్యల సమాహారం కాదు. ప్రతి విగ్రహం ఒక ప్రత్యేక కళాత్మక వ్యక్తీకరణకు ప్రతీకగా ఆయన సేకరణలో భాగమైంది. అదే సమయంలో రాజేశ్ సోనీ రూపొందించిన 6 మిల్లీమీటర్ల అష్టవినాయక కళాకృతి సూక్ష్మ కళలోని నైపుణ్యాన్ని చాటుతోంది. ఈ రెండు ఉదాహరణలు గణేశుడిపై భక్తి ఎలా విభిన్న కళారూపాల్లో వ్యక్తమవుతుందో తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సంతోషం కోసం వెతకొద్దు.. ఈ సూత్రాలు పాటించండి! -
భారత్లో జిన్పింగ్కు స్ట్రోక్?.. మోదీ విందుకు దూరం?
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యంపై తాజాగా షాకింగ్ ప్రచారం మొదలైంది. భారత్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) బారినపడ్డారని చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ ఆరోపించారు. అయితే ఈ ప్రచారంపై చైనా, భారత్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బ్రిక్స్ విందుకు దూరం.. ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్లో పర్యటించిన జిన్పింగ్.. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. అయితే మోదీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మాత్రం ఆయన హాజరుకాలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు నేతలు విందులో పాల్గొనగా.. చైనా తరఫున విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రాతినిధ్యం వహించారు.సుదీర్ఘమైన కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి జిన్పింగ్ హోటల్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే విందుకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై అధికారిక వివరణ రాలేదు. ఇదే సమయంలో బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం సందర్భంగా జరిగిన ఓ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చర్చకు వచ్చింది. మోదీ.. చైనా ప్రతినిధి బృందం వైపు తిరిగి ఇట్స్ ఓకేనా? అని అడగడం, జిన్పింగ్ స్పందించినట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.ఆసుపత్రిలో అత్యవసర చికిత్స?చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ జిన్పింగ్ ఆరోగ్యంపై పలు ఆరోపణలు చేశారు. బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహ కోల్పోయారని, వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బీజింగ్కు తరలించారని ఆరోపించారు. భారత్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి భారత అధికారులకు తెలిసిపోతుందనే భయంతో జిన్పింగ్ నిరాకరించారని కూడా షీ పేర్కొన్నారు. బీజింగ్కు చేరుకున్న వెంటనే ఆయనను సైనిక హెలికాప్టర్లో 301 ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపించారు.అక్కడి వైద్యులు జిన్పింగ్కు తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించారని, విమాన ప్రయాణం కారణంగా అత్యవసర చికిత్సకు కీలకమైన సమయం కోల్పోయారని షీ తన పోస్టుల్లో పేర్కొన్నారు. విమానంలో శస్త్రచికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారని ఆరోపించారు. జిన్పింగ్కు 301 ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారని వాంజున్ షీ మరో పోస్టులో పేర్కొన్నారు. ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి ఇంకా బయటపడలేదని ప్రచారం చేశారు. అంతేకాకుండా చైనా సైనిక కమాండ్లు, గ్రూప్ ఆర్మీలు అప్రమత్త స్థితికి చేరుకున్నాయని, దేశంలో పరిణామాలను పర్యవేక్షిస్తున్నాయని కూడా ఆరోపించారు.ఎవరీ వాంజున్ షీ?జిన్పింగ్ ఆరోగ్యంపై ఆరోపణలు చేసిన వాంజున్ షీ.. చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను డెమోక్రసీ పార్టీ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. 1998లో చైనాలో ఏర్పాటైన ఈ రాజకీయ సంస్థను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నిషేధించింది. బహుళపార్టీ ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ఎన్నికలు, అధికారాల విభజన, భావప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన వంటి అంశాల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ప్రకటించుకుంది. పార్టీ ఏర్పాటులో భాగమైన పలువురు ప్రజాస్వామ్య కార్యకర్తలను చైనా అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మానవ హక్కుల సంస్థలు గతంలో నివేదించాయి. ప్రస్తుతం ఈ సంస్థ చైనా వెలుపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!
బిగ్బాస్10 హౌస్ కెప్టెన్సీ రేస్ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్బాస్ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్లు ఇచ్చారు. మొదటి లెవల్లో ‘యానిమల్ పార్క్’ టాస్క్ ఇవ్వగా.. రెండో లెవల్లో ఫిజికల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!యానిమల్ పార్క్.. మొదటి లెవల్లో భాగంగా ‘యానిమల్ పార్క్’ టాస్క్ను బిగ్బాస్ ఇచ్చారు. ఈ గేమ్లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్ రోప్ సహాయంతో కర్టెన్ను లాగుతూ.. తన పార్ట్నర్ ఏ జంతువులా యాక్ట్ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్ను తీసుకుని.. తమ పార్ట్నర్ ఉన్న ఫ్రేమ్లో జంతువులను సరైన సీక్వెన్స్లో అమర్చాలి. అన్ని బ్లాక్స్ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్ వెనుక ఉన్న హ్యాండిల్ను స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్బాస్ నియమించారు.జాన్సీ–ముకేశ్ జోడీ విజయంఈ గేమ్లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్–ఝాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్)రెండో లెవల్లో అసలు ఫిజికల్ వార్!ఆ తర్వాత రెండో లెవల్ మొదలైంది. ఈ లెవల్లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్కు మొగ్గుచూపారు. దీంతో లెవల్-2లో ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుందని బిగ్బాస్ ప్రకటించారు. ఈ టాస్క్కు ‘స్నాచ్ ఇట్.. టీమ్ ఇట్.. త్రో ఇట్’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి బ్యాగ్స్ పడుతుంటాయి. ఆ బ్యాగ్లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్తో ఫ్రేమ్లో ఏర్పాటు చేసిన డిస్క్లను కొట్టాలి. బజర్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్బాస్ వివరించారు. ఈ టాస్క్కు వంశీని సంచాలకుడిగా నియమించారు.రోహిత్,దేబ్జానీ వర్సెస్ రాంప్రసాద్,త్రిగుణ్రెండో లెవల్లో దేబ్జానీ ,రోహిత్ ఒక జోడీగా, రాంప్రసాద్, త్రిగుణ్ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్ మొదలైన వెంటనే ఫిజికల్ ఛాలెంజ్ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్–త్రిగుణ్ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్ టాస్క్ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్, రాంప్రసాద్లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్లో రాంప్రసాద్, తిగ్రణ్లు విజయం సాధించగా రోహిత్ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)రోహిత్,వంశీ మధ్య భారీ గొడవఇదే సమయంలో టాస్క్ నిర్వహణ విషయంలో రోహిత్, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్ టాస్క్ కేవలం గేమ్గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు బిగ్ సర్ప్రైజ్) -
వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
సాక్షి, హైదరాబాద్: మరో వారం రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆ కుటుంబంలో అంతలోనే తీరని విషాదం నెలకొంది. పెళ్లి పనుల నిమిత్తం బైక్పై వెళ్తున్న తండ్రి, కూతురును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.హయత్నగర్ నుంచి అత్తాపూర్ వైపు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కూతురు బురుషాన్ బేగం మృతి చెందారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి పనుల కోసం బయలుదేరిన తండ్రీకూతుళ్లు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వినాయక నిమజ్జనం వేళ విషాదం.. -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని ట్రంప్కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్లు విధించే అధికారాన్ని ట్రంప్కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
నేడే ప్రధాని మోదీ 76వ జన్మదినం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, ఆయన 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసి వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తారు. వారణాసి నుంచి వాద్నగర్ వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు సైతం హాజరుకాబోతున్నారు. వాద్నగర్ ప్రధానమంత్రి మోదీ జన్మస్థలం కాగా, ఆయన వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహించుకుంటున్న గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉజ్జయినిలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దేశవ్యాప్త స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధానమంత్రి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం గురువారం సాయంత్రం వేళ దేశవ్యాప్తంగా 700కు పైగా ప్రాంతాల్లో ఆశీర్వాదం దీపం వెలిగించబోతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నెల రోజులపాటు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
‘రెడ్ లైన్’గా మక్కా సిటీ
కైరో: అత్యంత పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేయడానికి హౌతీ మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరోపించింది. మక్కాను ‘రెడ్ లైన్’గా ప్రకటించింది. నగరం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు హౌతీలు సౌదీ అరేబియాలోని మౌలిక సదుపాయాలను, ఎర్ర సముద్రంలోని నౌకా రవాణాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాబ్ ఎల్–మాండేబ్ జలసంధిలో అనేక ద్వీపాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇరాన్ సైన్యం హార్మూజ్ జలసంధిలో విదేశీ చమురు రవాణా నౌకలను టార్గెట్ చేసింది. దాంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, యెమెన్ సరిహద్దు నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల(680 మైళ్ల) దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను హౌతీ రెబెల్స్ ఖండించారు. తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. అయితే, హౌతీలు ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, నాటో సభ్య దేశమైన తుర్కియే, అణ్వస్త్ర శక్తి అయిన పాకిస్తాన్ల మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందానికి ఈ తాజా దాడులు పరీక్షగా మారాయి. హౌతీల దాడులను తిప్పికొట్టాలని కోరుతూ సౌదీ అరేబియా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని తుర్కియే, పాకిస్తాన్ అధికారులు చెప్పారు. ఈ ఒప్పందం అమలులోకి రాకముందే మూడు దేశాల కూటమిని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తుర్కియే అధికారి ఒకరు వెల్లడించారు. మక్కాపై దాడి యత్నాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్, సౌదీ అరేబియాలు భుజం భుజం కలిపి నిలుస్తాయని వ్యాఖ్యానించారుర. దాడుల పట్ల ఏ దేశమూ ఉదాసీనంగా ఉండలేదని హౌతీలను పరోక్షంగా హెచ్చరించారు. 57కు పైగా ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ కూడా మక్కాపై దాడి ప్రయత్నాన్ని ఖండించింది. బుధవారం రాత్రి సమయంలో యెమెన్లోని మధ్య ప్రాంతమైన మారిబ్పైన సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమికి చెందిన ఎఫ్–15 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, అందుకు ఆధారాలు చూపించలేదు. దాడి యత్నం పట్ల భారత్ తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ: మక్కాపై డ్రోన్ దాడికి జరిగిన ప్రయత్నం పట్ల భారత్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, పశ్చిమాసియాలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని మరోసారి పిలుపునిచి్చంది. మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై దాడులను, పౌరుల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగించే చర్యలను భారత్ ఖండిస్తోందని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని ఉద్ఘాటించారు. మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలిటెంట్లు ప్రయోగించిన ఒక డ్రోన్ను మంగళవారం సాయంత్రం అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఈసారి భారత్లోనే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: మూడేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కార్యక్రమం భారత్లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు. ‘ప్రతి ఏడాది ఐపీఎల్ వేలం కార్యక్రమం భారత్లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్ కారణంగా వేదిక లభించడం కష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ వేలం భారత్లోనే ఉంటుంది. ఈసారి మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం’ అని రేపు జరిగే బీసీసీఐ ఏజీఎంలో మరోసారి ఐపీఎల్ చైర్మన్గా ఎన్నిక కానున్న అరుణ్ ధుమాల్ తెలిపారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఫ్రాంచైజీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. 2024 ఐపీఎల్ వేలం జిద్దాలో... 2025 ఐపీఎల్ వేలం దుబాయ్లో... 2026 వేలం అబుదాబిలో నిర్వహించారు. -
‘వసతి సమస్యే కాదు’
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని ఏషియన్ గేమ్స్ డిప్యూటీ చెఫ్ డి మిషన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ వెల్లడించాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో... అథ్లెట్ల వసతి కోసం కంటైనర్లను సిద్ధం చేయగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో శరత్ కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంటైనర్ రూమ్లు, క్రూయిజ్షిప్ వసతులకు భారత అథ్లెట్లు సులువుగా అలవాటు పడతారని... వారి ప్రదర్శనపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్లో భారత్ నుంచి 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు 265 మంది అధికారులు కూడా జపాన్కు చేరుకున్నారు. వీరిని షిప్పింగ్ కంటైనర్లు, క్రూయిజ్ షిప్లు, హోటల్స్లో వసతి ఏర్పాటు చేశారు. దీనిపై దక్షిణ కొరియాతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్లోని పలు సభ్య దేశాలు గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శరత్ కమల్ మాట్లాడుతూ... ‘ఇలాంటి వసతి ఏర్పాట్లతో భారత అథ్లెట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ సైతం అందించాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన పలు కేంద్రాల్లో కంటైనర్ రూమ్లు ఏర్పాటు చేసి అథ్లెట్లకు అందులో వసతి ఏర్పాటు చేశాం. దీంతో వారు పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. జపాన్కు వచి్చంది ఏషియన్ గేమ్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి. అథ్లెట్ల అందరి లక్ష్యం అదే’ అని వివరించాడు. ఐదు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్... నాలుగుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని రెండు పతకాలు గెలిచాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల టీమ్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన శరత్... ప్రస్తుతం క్రీడా పరిపాలన అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ‘ఈసారి ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు తప్పక పతకాలు గెలుస్తుంది. పురుషుల డబుల్స్ జోడీ మానవ్ ఠక్కర్–మనుశ్ షా... మిక్సడ్ డబుల్స్లో మనుశ్ షా–దియా జోడీలపై భారీ అంచనాలు ఉన్నాయి’ అని శరత్ వివరించాడు. ఏషియన్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ తరఫున ఐదుగురు మహిళా ప్లేయర్లు, ఐదుగురు పురుష ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు టీటీ పోటీలు జరగనున్నాయి. -
చెత్త వేయొద్దు... సంగీతం వినొద్దు... టాటూలు కనిపించొద్దు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతుండగా... ఇప్పటికే భారత క్రీడాకారులు క్రీడా వేదికకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ‘సాయ్’ మన అథ్లెట్లకు అవగాహన కల్పించింది. జపాన్ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంతో పాటు అక్కడ నడుచుకోవాల్సిన తీరును వీడియో ద్వారా అథ్లెట్లకు వివరించింది. జపాన్ వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు... అపరిచిత వ్యక్తులను ఆలింగనం చేసుకోకూడదు... రహదారులపై బిగ్గరగా మాట్లాడకూడదు... లిఫ్ట్లో స్నేహితులతో కలిసి నవ్వకూడదు... ప్రయాణ సమయంలో తోటివారిని ఇబ్బంది పెట్టేవిధంగా సంగీతం వినకూడదని ‘సాయ్’ అథ్లెట్లకు సూచించింది. ‘మీరు కేవలం ఒక అథ్లెట్గా జపాన్లో పర్యటించడం లేదు. మీరు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలను పాటిస్తూ... స్థానికులను గౌరవిస్తూ ముందుకు సాగండి’ అని ‘సాయ్’ ప్రత్యేక వీడియోలో పేర్కొంది. ఏషియన్ గేమ్స్లో భారత బృందానికి డిప్యూటీ చెఫ్ డి మిషన్గా వ్యవహరిస్తున్న టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కూడా... జపాన్లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు కొన్ని సూచనలు చేశాడు. ‘జపాన్లో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. శరీరంపై పెద్ద పెద్ద టాటూలు కనిపించకూడదు. వస్త్రాధారణ కూడా హుందాగా ఉండాలి. రోడ్లపై ఎక్కువ డస్ట్బిన్లు ఉండవు అయినా... చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. డస్ట్బిన్ కనిపించేంత వరకు చెత్తను మీ దగ్గరే పెట్టుకోవాలి. లైంగిక వేధింపుల వంటివైతే ఇక అంతే. అపరిచిత వ్యక్తిని ఏ కారణంతో అయినా తాకకూడదు. ఈ అంశంపై అథ్లెట్లకు తగిన సూచనలు ఇచ్చాం’ అని శరత్ కమల్ వెల్లడించాడు. ఇప్పటికే జపాన్లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు ఒక అంచనా ఏర్పడిందని... అయినప్పటికీ క్రీడల ఆరంభానికి ముందే అథ్లెట్లకు మరిన్ని సూచనలు చేస్తామని శరత్ కమల్ తెలిపాడు. భారత క్రీడాకారులకు మార్గదర్శకాల జాబితా → జపాన్ ప్రజల జీవనశైలిని గౌరవిస్తూ నడుచుకోవాలి. రోడ్లపై చెత్త వేయడం పూర్తిగా నిషిద్ధం. డస్ట్బిన్ కనిపించేంత వరకు చెత్తను తమ వద్దే ఉంచుకోవాలి. అవసరమైతే దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. → బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు శరీరంపై ఉన్న టాటూలు కనిపించకుండా దుస్తులు ధరించాలి. ఏ ప్రదేశంలో అయినా ‘క్యూ’ పద్ధతిని పాటించాలి. ఫోన్ మాట్లాడే సమయంలో స్పీకర్ ఆన్ చేయడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి చేయకూడదు. → ప్రజా రవాణ వసతులను వినియోగిస్తున్నప్పుడు పెద్ద శబ్దంతో సంగీతం వినకూడదు. ఇయర్ఫోన్లు తప్పక వాడాలి. → రహదారులపై నడుస్తున్నప్పుడు సైతం హుందాగా ప్రవర్తించాలి. అపరిచిత వ్యక్తులను తాకడం, కౌగిలించుకోవడం వంటివి చేయకూడదు. → స్థల పరిమితి కారణంగా అథ్లెట్ల కోసం ఓడరేవులోని నౌకలు, ప్రత్యేక కంటైనర్లలో వసతి ఏర్పాటు చేశారు. మన అథ్లెట్లు దీనికి అలవాటు పడేందుకు జపాన్ వెళ్లడానికి ముందే బెంగళూరు, పాటియాలా జాతీయ శిక్షణ శిబిరాల్లో అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే అథ్లెట్లకు బస కల్పించారు. → అన్నీ పోటీలు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుండటంతో అథ్లెట్లు వేర్వేరు హోటళ్లలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్లే వైద్యులు, ఫిజియోలను బృందాలుగా విభజించారు. → మన అథ్లెట్ల సౌకర్యం కోసం శాఖాహార భోజన వసతి సైతం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను భారత ఒలింపిక్ కమిటీ కోరింది. అలాగే క్రీడలు జరిగే సమీప ప్రాంతాల్లోని భారతీయ రెస్టారెంట్ల వివరాలను అథ్లెట్లకు అందించారు. -
ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!
సాక్షి, అమరావతి: అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా.. లేక ప్రశ్నించిన గొంతునే మూయించాలా? రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారాలపై తాజాగా తలెత్తుతున్న వివాదాలు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అరాచక, అసమర్థ పాలనను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. డీఎస్సీ–2025కు సంబంధించిన అక్రమాలపై ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. వాటిని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు, ఖాతాలపై ఫిర్యాదులు, తొలగింపు అభ్యర్థనలు, కేసుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోస్ట్ తొలగింపు.. ఖాతా నిలిపివేత.. కుదరకపోతే కేసు, అరెస్టు అన్నట్టుగా పరిస్థితి మారిందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవాబు చెప్పాల్సిన చోట.. ఖాతాలపై వేటు? డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్సీపీ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొన్ని ఉదంతాలు వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. వరుసగా ఆధారాలు బయటపెడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి అయిన ఆయన కుమారుడు లోకేశ్ గుక్కతిప్పుకోలేకపోతున్నారు. అందుకే ఆయా పోస్టులు, ఖాతాలపై చర్యలకు దిగుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి వేదికల్లో ప్రతిపక్ష పారీ్టలకు చెందిన ఖాతాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులపై ఫిర్యాదులు చేయడం ద్వారా వాటిని తొలగించేందుకు లేదా భారత్లో కనిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు చెబుతున్నారు. డీఎస్సీ అంశంపై పోస్టులు చేస్తున్న నేపథ్యంలో సాక్షి టీవీ ఫేస్బుక్ పేజీ, సాక్షి డిజిటల్ ఇన్స్ట్రాగామ్, బిగ్ టీవీ ఇన్స్ట్రాగామ్, జగనన్న కనెక్ట్స్ ఇన్స్ట్రాగామ్ ఖాతాలను తప్పుడు ఫిర్యాదులతో మూసివేయించారు. ఇందుకోసం సైబర్ క్రైమ్ విభాగాన్ని రంగంలోకి దింపి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తోంది. ఇన్స్పెక్టర్లే ‘సెన్సార్’ బోర్డులా? ఉండవల్లి కరకట్ట క్యాంప్ ఆఫీసు నుంచి వెళ్లిన ఆదేశాలతో పలు జిల్లాల్లో సీఐలు ఎఫ్బీఐ వంటి అంతర్జాతీయ సంస్థల పేరుతో ‘ఎక్స్’కు తప్పుడు రిక్వెస్టులు పంపి రాష్ట్రం పరువుతీశారు. కర్నూలు బస్సు దుర్ఘటనకు బెల్టు షాపులే కారణమంటూ 2025 అక్టోబర్ 26న వైఎస్సార్సీపీ పోస్టు పెట్టింది. ముఖ్యమంత్రిని అవమానించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ పోస్టులు తొలగించాలంటూ ‘ఎక్స్’కు నోటీసు పంపారు. గుంటూరులో ఇద్దరు నేతల ఎక్స్ పోస్టుల తొలగింపునకు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ ఈ–మెయిల్ నుంచి ఇన్స్పెక్టర్ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేశారు. అందులో ఫిర్యాదు చేసిన సంస్థ పేరును ఎఫ్బీఐ అని రాశారు. అది ఎఫ్బీఐ కాదు, ఏపీ పోలీసులేనని, ఎందుకు అలా రాశారో తమకే అర్థం కావడం లేదని ‘ఎక్స్’ సంస్థే బాధితులకు మెయిల్ పంపి గుట్టురట్టు చేసింది.విశాఖ సమీపంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూములు బలవంతంగా తీసుకుంటున్నారని తర్లువాడ రైతులు చేసిన వీడియోను అంతర్జాతీయ జర్నలిస్టుల నెట్వర్క్ ‘ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్’ ప్రచురించింది. ఆ రీల్ భారత్లో కనిపించకుండా పోయింది. అప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ.. ఇపుడు సెన్సార్షిప్.. భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు.. అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుపై ఆంక్షలా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలకు సమాధానం ఇవ్వడం, వాస్తవాలను ప్రజలకు వివరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజ ప్రక్రియ. కానీ చంద్రబాబు మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉంటే భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలి.. అధికారంలోకి వస్తే అన్నిటికీ సెన్సార్షిప్.. ఇదేం న్యాయం నారా వారూ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.డీఎస్సీలో అక్రమాలు.. సోషల్ మీడియాలో ప్రకంపనలు డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మంలో జరగని జూడో టోర్నమెంట్లో పాల్గొన్నట్లు కొందరు అభ్యర్థులు సర్టిఫికెట్లు సమర్పించారు.. సాఫ్ట్బాల్ విషయంలోనూ ఇదే తంతు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి తన రిజర్వేషన్ కేటగిరీలో టెట్లో అర్హత సాధించకపోయినా ఉపాధ్యాయ ఉద్యోగం పొందారు. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో.. వాటిని ప్రచారం చేస్తున్న ఖాతాలపై తప్పుడు ఫిర్యాదులతో చర్యలు తీసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 150 ఖాతాలు.. 770 పోస్టులు జర్నలిస్టులు, సాధారణ పౌరులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల పోస్టులపై ఏపీ సీఐడీ ‘ఎక్స్’కు లీగల్ అభ్యర్థనలు పంపి వాటిని మూసివేయించడానికి ప్రయత్నించింది. 150కి పైగా ఖాతాలకు చెందిన 770కి పైగా పోస్టులు ఆ అభ్యర్థనల్లో ఉన్నాయని, ఏకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖాతా కూడా లక్ష్యంగా మారిందని ఆ పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలగించేలా చేశారు. తర్వాత పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ భారత్లో కనిపించకుండా పోయింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరికి పునరుద్ధరించారు. ఒక గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారిక పేజీనే మూయించే స్థాయికి చంద్రబాబు దిగజారారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. -
భారత చెస్ జట్ల శుభారంభం
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్లో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు గెలుపు బోణీ కొట్టాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీ తొలి రౌండ్లో భారత మహిళల జట్టు 4–0తో డొమినికన్ రిపబ్లిక్ జట్టును ఓడించింది. బోర్డు–1పై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 31 ఎత్తుల్లో ఫ్రాంచెస్కా రమిరెజ్పై... బోర్డు–2పై వైశాలి 31 ఎత్తుల్లో మిగెలినా డెలారోసాపై... బోర్డు–3పై వంతిక అగర్వాల్ 50 ఎత్తుల్లో మేరీ గొంజాలెజ్పై... బోర్డు–4పై సవితాశ్రీ 38 ఎత్తుల్లో కార్లా నునెజ్ దియాపై గెలుపొందారు. మరోవైపు భారత పురుషుల జట్టు 3–1తో థాయ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. బోర్డు–1పై తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 54 ఎత్తుల్లో ప్రిన్ లావోహవిరాపాప్ చేతిలో అనూహ్యంగా ఓడిపోగా... బోర్డు–2పై నిహాల్ సరీన్ 28 ఎత్తుల్లో థానాడోన్ కుల్ప్రథనోన్పై... బోర్డు–3పై దొమ్మరాజు గుకేశ్ 37 ఎత్తుల్లో ఫారిస్ రషీద్పై... బోర్డు–4పై విదిత్ గుజరాతి 30 ఎత్తుల్లో తుఫా ఖుమ్నోరఖెవ్పై గెలిచారు. -
వైభవ్కు చాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్పై వరుస మ్యాచ్ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టి20ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టి20 మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచి లక్ష్యఛేదనకు మొగ్గుచూపిన టీమిండియా... ఈసారి అవకాశం వస్తే మొదట బ్యాటింగ్ చేస్తూ తమ బలాన్ని సరిచూసుకోవాలని భావిస్తోంది. అలాగే రిజర్వ్ ప్లేయర్లను ఈ మ్యాచ్లో పరీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ఎంత పోరాడినా గత రెండు మ్యాచ్ల్లో టీమిండియాకు సరైన పోటీనివ్వలేకపోయింది. ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నా... వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో టి20లో రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్తో ఆకట్టుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్తో పాటు గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డార్విష్, అజ్మతుల్లా, నబీ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. గత రెండు మ్యాచ్ల మాదిరిగానే పిచ్ బ్యాటింగ్కు సహకరించనుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశలు పెద్దగా లేవు. భిన్నమైన కూర్పుతో... ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా చూడాలి. రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... చివరి పోరులో భిన్నమైన కూర్పును ప్రయత్నిస్తామని వెల్లడించాడు. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందు ప్లేయర్లందరికీ తగినంత మ్యాచ్ టైమ్ దక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ చెరో మ్యాచ్లో హాఫ్సెంచరీలు బాదిన నేపథ్యంలో ఎవరి స్థానంలో సూర్యవంశీని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన వైభవ్... సొంతగడ్డపై ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలి కాలంలో ఫార్మాట్తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న ఇషాన్కు విశ్రాంతినిస్తారా చూడాలి. బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు అదనపు బౌలర్ను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్లో ఓ ప్లేయర్ తగ్గనున్నాడు. దీంతో పేస్ ఆల్రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై బ్యాటింగ్ భారం పెరగనుంది. బౌలింగ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతుండగా... అర్ష్ దీప్ సింగ్ అతడికి అండగా నిలుస్తున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే యశ్ ఠాకూర్కు మరోసారి అవకాశం దక్కొచ్చు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్కు దూరం కాగా... అతడి స్థానంలో అవకాశం దక్కించుకున్న రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ఫీల్డింగ్లో మాత్రం టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. భారత జట్టుతో జపాన్ రాయబారి భేటీ ఈనెల 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జపాన్ జట్టుతో భారత జట్టు తొలిసారి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్లో జపాన్ రాయబారి ఒనో కెచీ బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్తో పాటు భారత క్రికెటర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్కు జపాన్లో అదృష్ట చిహ్నానికి ప్రతీకగా భావించే ‘దారుమా’ బొమ్మను ప్రదానం చేశారు. తుది జట్లు (అంచనా) భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్, నితీశ్ రెడ్డి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్, బుమ్రా. అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డారి్వష్, అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్/నవీన్, ఫజల్హక్ ఫారూఖి. -
నేడు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉండేలా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలపై ఆయన మాట్లాడనున్నారు. -
భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక
న్యూఢిల్లీ: ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. ఈనెల 15న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. భారత యుద్ధనౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా, పీఎన్ఎస్ హునైన్ అనే పాక్ పెట్రోలింగ్ నౌక దానిని వెంబడించింది. ప్రమాద సంకేతాలను తెలియజేయడానికి ఉపయోగించే ఛానల్ 16 (సముద్ర రేడియో ఛానల్) ద్వారా పదేపదే హెచ్చరికలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ పాకిస్తాన్ నౌక అకస్మాత్తుగా వేగం పెంచి, భారత యుద్ధనౌక ముందు భాగాన్ని కుడి వైపున ఢీకొట్టింది. చివరికి పాకిస్తానీ నౌక ముందు భాగం భారత యుద్ధనౌకను తాకింది. అయితే, భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఈ సంఘటన తర్వాత కూడా భారత యుద్ధనౌక తన కార్యకలాపాలను యథాతథంగా కొనసాగించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం పరిణామం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్(సీడీఏ) సాద్ వరైచ్కు సమన్లు జారీ చేసింది. బుధవారం ఆయనను పిలిపించింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకను పాక్ నౌక ఢీకొట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. పాకిస్తాన్ది ఆమోదయోగ్యం కాని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైన ప్రవర్తన అంటూ తేల్చిచెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలు, నిబంధనలను గౌరవించాలని సంబంధిత పాకిస్తాన్ అధికారులకు తెలియజేయాలంటూ సాద్ వరైచ్కు సూచించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా ఇదే విధమైన నిరసనను తెలియజేయాలని అక్కడి భారత చార్జ్ డి అఫైర్స్ను ఆదేశించినట్లు స్పష్టంచేసింది. ‘‘అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన వల్ల పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ.. పాకిస్తాన్ నౌకాదళ నౌక వ్యవహరించిన తీరు మాత్రం సైనిక విన్యాసాలు, కదలికలు, దళాల తరలింపులకు సంబంధించిన ముందస్తు సమాచారంపై 1991 ఏప్రిల్లో భారత్–పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోని 10వ అధికరణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది’’అని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. మరోవైపు భారత నావికాదళం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తమ ఆందోళనను పాకిస్తాన్ సైన్యానికి తెలియజేసింది. పాకిస్తాన్కు చెందిన పీఎన్ఎస్ హునైన్ నౌక 2024 జూలైలో విధుల్లోకి ప్రవేశించింది. ఇందులో నౌకా విధ్వంసక, వైమానిక రక్షణ ఆయుధాలు, సెన్సార్లు, టెర్మినల్ రక్షణ వ్యవస్థ అమర్చారు. -
నూతన సాంకేతికతల్లో భారత్ అగ్రస్థానానికి చేరాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతల విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుధవారం ఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో జరిగిన సెమీకండక్టర్ రౌండ్టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారం అవసరమని తేల్చిచెప్పారు. దేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తుచేశారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని ప్రస్తావించారు. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల దశ నుంచి విస్తృత స్థాయి, గొప్ప అవకాశాలు కలిగిన దశకు మారుతోందని అన్నారు. సాంకేతిక పురోగతులు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మన విధానాలు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. విధానపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై సూచనలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలను మోదీ ఆహ్వానించారు. సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. భారతదేశ సెమీకండక్టర్ రంగం వృద్ధికి చొరవ తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికతల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ పిలుపునిచి్చనట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రౌండ్టేబుల్ సమావేశానికి సెమీ, మైక్రాన్, ఇని్ఫనియోన్, అప్లైడ్ మెటీరియల్స్, ఏఎస్ఎంఎల్, మెర్సెక్, టోక్యో ఎల్రక్టాన్ లిమిటెడ్, ఫుజిఫిలిం, ఇంటెల్, టాటా ఎల్రక్టానిక్స్, సెలెస్టా క్యాపిటల్, ఫాక్స్కాన్, ఐబీఎం రీసెర్స్ తదితర కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ‘‘సెమీకండక్టర్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేశంలో పెట్టుబడులకు, వ్యాపార వృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల ఉన్నతీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా నిరంతరం కృషి చేయాలి’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
ప్రజాసేవకు పనికొచ్చే ఏఐ అవసరం
న్యూయార్క్: కృత్రిమ మేధ టెక్నాలజీ సురక్షితమైందేనని నిర్ధారించుకోవాల్సింది ఆయా కంపెనీలేనని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్పష్టం చేశారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రమాదకరంగా మారుతోందని, భద్రతను సునిశ్చితం చేసుకునేంతవరకూ అభివృద్ధి కార్యకలాపాలకు పగ్గాలు వేయాలన్న ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, స్పేస్ఎక్స్ ఏఐల పిలుపుకు భిన్నంగా మెటా సీఈవో వ్యాఖ్యానించడం గమనార్హం. ఏఐ మనిషి నియంత్రణ నుంచి జారిపోకముందే దాన్ని ఎలా నియంత్రించాలన్న విషయంపై ఇటీవలి కాలంలో చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఏఐ అభివృద్ధి ఇలాగే కొనసాగితే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో అది ఇంటర్నెట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసు కోగలదని ఆంత్రోపిక్ అధ్యక్షుడు డారి యో ఆందోళన వ్యక్తం చేయగా.. ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మ్యాన్, స్పేస్ఎక్స్ ఏఐ సీఈవో ఎలాన్ మస్క్లు అందుకు మద్దతు పలికారు. అయితే ఈ వ్యాఖ్యలు వెలువడ్డ మూడు రోజులకు మెటా సీఈవో ఎక్స్ వేదికపై స్పందించడం గమనార్హం. ఏఐ కంపెనీలు ఇప్పటికే వాటిని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నాయని, హాని జరక్కుండా చూడటం ఆయా కంపెనీలపై ఉన్న బాధ్యత కూడా అని జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు. తాము అభివృద్ధి చేస్తున్న ఏఐ మోడల్ ‘మ్యూజ్’సురక్షితమైందని నిర్ధారించుకునేందుకు నెలలుగా దాని విడుదలను ఆపామని తెలిపారు. కంపెనీలు భద్రమైన ఏఐ మోడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, తమని తాము అభివృద్ధి చేసుకోగల మోడళ్లకు కాదని తెలిపారు. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని పిలిచే ఈ సామర్థ్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందన్నది అంచనా. ప్రజలకు ఉపయోగపడేందుకు కంప్యూటింగ్ను ఉపయోగించే మోడళ్లు కావాలి కానీ.. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సామర్థ్యమున్న వాటి కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేయడం కాదని పరోక్షంగా ప్రత్యర్థి కంపెనీకు చురకలంటించారు. -
అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా?
అంతరిక్షంలో ఆయుధం ఉందన్న అమెరికా ప్రకటన ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం నేలపై నుంచి కాకుండా అంతరిక్షంలోనే మొదలైతే... ఉపగ్రహాలే లక్ష్యంగా సాగితే తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న పలు దేశాల్లో మొదలైంది. రష్యా, చైనా లాంటి దేశాలు అంతరిక్ష యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సమకూర్చుకున్నట్లు వార్తలు వస్తూండగా.... అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారత్ పరిస్థితి ఏమిటి? ఉపగ్రహాలను కూల్చే సత్తా మనకుందా? ఉంటే.. అమెరికా మాదిరిగానే మనమూ అంతరిక్షంలో మనదైన అ్రస్తాన్ని సిద్ధంగా ఉంచగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా భారత్కు ఇప్పుడు కాదు... ఏడేళ్ల క్రితం అంటే 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను భారత్ పరీక్షించింది. అగ్రరాజ్యాలు అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతున్న కాలంలో పురుడుపోసుకున్న ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధాల ఆలోచన ఆ తరువాత బహుముఖంగా విస్తరించింది. అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది కూడా. ఇలా క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కంటికి కనిపించని, నిత్యం కదులుతూ ఉండే ఉపగ్రహాలను గుర్తించడం, క్షిపణులతో ఢీకొట్టడం అంతా చాలా సంక్లిష్టమైన వ్యవహారం. అందుకే డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న దేశాలు మాత్రమే ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగాయి. 1985లో అమెరికా మొట్టమొదటిసారి ఈ రకమైన వ్యవస్థలను ప్రయోగించి విజయం సాధిస్తే చైనాకు 2007 వరకూ సాధ్యపడలేదు. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్లు ఉన్నాయని ప్రకటించుకుంది. మన పరిస్థితి ఏమిటి? ముందుగా చెప్పుకున్నట్లు మిషన్ శక్తితో మనకు ఉపగ్రహాలను కూల్చేయగల సామర్థ్యం సమకూరింది. ఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది. నేరుగా ఢీకొట్టడం ద్వారా మాత్రమే పృథ్వీ క్షిపణి ఉపగ్రహాన్ని నాశనం చేయడం గుర్తించాల్సిన విషయం. అంటే.. క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదన్నమాట. ప్రయోగం తరువాత జరిపిన పరిశీలనల్లో క్షిపణి ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడంలో విజయవంతమైందని స్పష్టంగా తెలిసింది. దీనర్థం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను గుర్తించి.. దాని దారిని పరిశీలిస్తూ... అడ్డుకుని పేల్చేయగల సత్తా భారత్కు ఉందీ అని!!! ఇప్పుడు çపృథ్వీ క్షిపణిలో పేలుడు పదార్థం ఉందని ఒక్కసారి ఊహించుకోండి... – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎఫ్బీఐ పేరుతో ‘పోలీసింగ్’!
సాక్షి,అమరావతి: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును వాడి ఏపీ పోలీసులు తప్పుడు ఫిర్యాదులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో బుధవారం పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సైతం ఆయన ట్యాగ్ చేశారు. ఆ పోస్టులో ఇంకా జగన్ ఏమన్నారంటే.. దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య ‘‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్బీఐ’ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ... మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను అమెరికాకు చెందిన ‘ఎఫ్బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య. ఆ మెయిల్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ఈ –మెయిల్ చిరునామా నుంచే వచి్చందని ‘ఎక్స్’ ధృవీకరించింది. ఆ మెయిల్ పంపిన సంబంధిత అధికారి తాను ‘ఎఫ్బీఐ’ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారు. అసలు ఆ అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? అక్కడ ‘ఎఫ్బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు, ‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా? మీ రాజకీయ సెన్సార్íÙప్ను అమలు చేయడానికా పోలీసు యూనిఫాం? పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్íÙప్ను అమలు చేయడానికి కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పోస్టుల తొలగింపు చర్యలో ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్కు అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తింది. సోషల్ మీడియా యుగంలో వాస్తవాలను దాచి పెట్టలేరు.. అమలు చేయని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులు.. ఇదీ మీ పరిపాలన.. విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువు పరిస్థితుల్లో మొత్తం నష్టపోయిన రెతులను ఆదుకోండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. చాలా వేగంగా వ్యాప్తి చెందిన ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. మీ పనితీరుపై మీ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే, ప్రజలకు అంతా బాగా చేశామని అనుకుంటే.. అది మీ పనితీరులో చూపాలి. ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్íÙప్, వేధింపులతో కాదు’’ అని వైఎస్ జగన్ ఎక్స్లో తెలిపారు. -
మెటాకు సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: మెటాను కేవలం ఒక మధ్యవర్తి సంస్థగా (ఇంటర్మీడియరీ) పరిగణించడానికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏయే కంటెంట్కు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏది కనిపించేలా చూడాలనేది మెటా తమ అల్గోరిథంల ద్వారా నిర్ణయిస్తుందని పేర్కొన్నాయి. కాబట్టి, దాన్ని సేవలు అందించే సంస్థగానే పరిగణించాల్సి వస్తుందని, సర్వీస్ ప్రొవైడర్లకు నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ మెటాకి కూడా వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. నిర్దిష్ట చట్టాల నుంచి దానికి మినహాయింపులేమీ ఉండవని పేర్కొన్నాయి. అయితే, ఈ అంశంపై కోర్టు నిర్ణయమే అంతిమం అని వివరించాయి. పిల్లల వేధింపుల కంటెంట్ గురించి సమాచారాన్ని ఇప్పటివరకు అమెరికన్ నియంత్రణ సంస్థలకు మాత్రమే తెలియజేస్తూ వచి్చన మెటా తాజాగా భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నిర్వహించే పోర్టల్కి కూడా తెలియజేసేందుకు అంగీకరించిందని వివరించాయి. -
మెగా డీఎస్సీలో ‘ఫ్యామిలీ’ కోటా!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 భారీ కుంభకోణంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే పాపాల చిట్టా చాంతాడులా పెరిగిపోతోంది. స్పోర్ట్స్ కోటా ముసుగులో అసలు పరీక్షలే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఎత్తు కాగా అందులోనూ క్రీడా అసోసియేషన్ల నేతల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ ప్యాకేజీ మాదిరిగా పోస్టులు ఇచ్చుకున్నట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ విజేతలను పక్కనపెట్టి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం మెగా డీఎస్సీ అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండూ ఒకరి చేతికే అప్పగించి స్కామ్కు తెర తీయడం.. ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనడం.. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగి డీఎస్సీలో టాప్ ర్యాంకర్గా నిలవడం.. కానీ ఆ టాప్ ర్యాంకర్కు పోస్టు ఇవ్వకపోవడం.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్చేసి అక్రమాలకు గేట్లు ఎత్తడం.. పని పూర్తి కాగానే గేట్లు మూసేయడం.. అభ్యర్థులను 1:1లో వెరిఫికేషన్కు పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం.. సర్దుబాటు పేరుతో బుకాయించడం.. టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియో, వీడియోలు బట్టబయలైనా అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం.. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో క్వాలిఫై కానివారికి కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం.. లోకేశ్ యువగళం టీమ్ సభ్యులకు టీచర్ పోస్టులు కట్టబెట్టడం.. లాంటివన్నీ మెగా డీఎస్సీ స్కామ్కు తిరుగులేని సాక్ష్యాధారాలని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐతో విచారించాల్సిందేనని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభతో పనిలేదు.. పార్టిసిపేషన్ సర్టిఫికెట్ చాలు!! ప్రతిభావంతులైన నిజమైన క్రీడాకారులకు అండగా నిలిచి వారిని ప్రోత్సహించాల్సిన క్రీడా సంఘాల నేతలు తమ కుటుంబ సభ్యుల కోసం అడ్డదారులు తొక్కారు. రాష్ట్ర సాఫ్ట్బాల్æ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అండతో సంఘం కార్యదర్శులు తమ భార్య, కుమార్తెలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు వచ్చేలా చేసుకున్నారు. వాటి ద్వారా మెగా డీఎస్సీలో ఎలాంటి పరీక్ష రాయకుండానే నేరుగా ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలను పొందారు. వారంతా ఇప్పుడు అడ్డదారిలో వచ్చిన కొలువుతో ఉపాధ్యాయులుగా చలామణి అవుతున్నారు. నిజానికి స్పోర్ట్స్ కోటా ఎంపికలో కేవలం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా క్రీడలో ప్రతిభ, సాధించిన స్థానం, నిర్దేశిత ప్రాధాన్యత (ప్రయారిటీ) ఆధారంగా అర్హతను నిర్ణయించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా కేవలం పాల్గొన్న ధ్రువపత్రం (పార్టిసిపేషన్ సర్టిఫికెట్)తో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటే దీని వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అక్రమాలకు సాక్ష్యాలివిగో... వైఎస్సార్ కడప జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేసిన గండికోట ప్రసాద్ కుమార్తె జి.రుచిత సాఫ్ట్బాల్ సర్టిఫికెట్తో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టు పొందారు. ఆయన ప్రస్తుతం ఎంఈవోగా రాజుపాలెం మండలంలో పని చేస్తున్నారు. రుచిత లింగాల మండలం పెద్దకుడాల హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పని చేస్తుండగా ఇటీవల సర్దుబాటులో భాగంగా లింగాల హైసూ్కల్కు మారారు. ఆమె 2018 జూన్ 15 నుంచి 17 వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఇంటర్ డి్రస్టిక్ సాఫ్ట్బాల్ చాంపియన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో పాల్గొన్నట్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించారు. 2019 జనవరి 12వ తేదీ నుంచి 16 వరకు నాగ్పూర్ కస్తూరి చాంద్ పార్క్గ్రైండ్లో 40వ సీనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో కూడా పాల్గొన్నట్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొంది వాటితోనే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ రమణ భార్య లక్ష్మీదేవి సాఫ్ట్బాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో విజయనగరం జిల్లాలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయురాలిగా మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించారు. అనంతపురం జిల్లాలో 2016లో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్æ సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఏఎన్ రామప్రసాద్ భార్య కోలపల్లి నాగలక్ష్మి 2023లో శ్రీనగర్లో సాఫ్ట్బాల్æ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు మెగా డీఎస్సీలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించారు. ఆమె స్వస్థలం కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజువరం కాగా ఆమె భర్త రామప్రసాద్ ఐ.పోలవరం మండలం జి.మూలపొలం ఉన్నత పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పీఈటీగా పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ చాకాలపు సత్యనారాయణ భోగాపురం మండలం తూడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య లీలా శివజ్యోతి అనంతపురంలో 2021 డిసెంబర్ 24 నుంచి 28 వరకు జరిగిన సీనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మాత్రమే పొందారు. అయితే రెండో స్థానం (సిల్వర్ మెడల్) సాధించినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూన రవికుమార్ ధ్రువపత్రం జారీ చేశారు. ఈ పత్రంతో ఆమె మెగా డీఎస్సీలో 42 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించారు. విశాఖ జిల్లా స్థానికతతో స్కూల్ అసిస్టెంట్ మేథమెటిక్స్ పోస్టు దక్కించుకున్నారు. -
పసిడి హాల్మార్కింగ్ చార్జీలు పెంపు
ముంబై: పండుగల వేళ బంగారం ఆర్టికల్స్ స్వచ్ఛతను ధ్రవీకరించే హాల్మార్కింగ్ చార్జీలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సవరించింది. రూ. 45 నుంచి రూ. 75కి పెంచింది. వెండికి సంబంధించిన చార్జీలను మాత్రం యథాతథంగా రూ. 35గానే ఉంచింది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు బీఐఎస్ (హాల్మార్కింగ్) నిబంధనలను సవరించింది. ఇందులోని షెడ్యూల్ 4 కింద జ్యుయలర్లు ఒక్కో ఆర్టీకల్కి రూ. 75 చొప్పున, గుర్తింపు పొందిన అసేయింగ్–హాల్మార్కింగ్ సెంటర్లకు (ఏహెచ్సీ) హాల్మార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బంగారు ఆర్టీకల్స్కయితే ఒక్కో కన్సైన్మెంట్ బ్యాచ్కి రూ. 200, వెండి ఆర్టీకల్స్కి కనీసం రూ. 150గా ఉంటుంది. అయితే, అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) చార్జీల పెంపుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా 67% మేర ఎందుకు పెంచాల్సి వచి్చందనేది పరిశ్రమకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల నేపథ్యంలో తక్షణమే పెంపు నిర్ణయాన్ని సమీక్షించి, ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని జీజేసీ చైర్మన్ రాజేశ్ రోక్డే తెలిపారు. -
దీపావళి నాటికి 100 నగరాల్లో అమెజాన్ నౌ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీపావళి నాటికి 100 నగరాలకు అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సరీ్వసుల విభాగం అమెజాన్ నౌ సేవలను విస్తరించనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ సమీర్ కుమార్ తెలిపారు. పండుగల సీజన్ నేపథ్యంలో పది వారాల వ్యవధిలోనే నాలుగు రెట్లు నగరాలకు అమెజాన్ నౌ సేవలను విస్తరించినట్లు వివరించారు. దీనితో తిరుపతి, గుంటూరు, వరంగల్ సహా 60 నగరాలు, పట్టణాల్లో నిమిషాల్లో డెలివరీ సేవలు అందుబాటులోకి వచి్చనట్లు చెప్పారు. ఇందుకు 750 పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్, అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు తోడ్పడుతున్నాయని తెలిపారు. అమెజాన్ నౌ గత మూడు నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన 1 బిలియన్ డాలర్ల విలువ చేసే స్థూల విక్రయాలను నమోదు చేసినట్లు కుమార్ చెప్పారు. మరోవైపు కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 6 సోర్టింగ్ సెంటర్లు, 150 లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లను అమెజాన్ ప్రారంభించింది. -
క్యాబ్ అగ్రిగేటర్లకు చెక్..!
న్యూఢిల్లీ: ‘కెప్టెన్ రూ. 60 చార్జీకి ఒప్పుకోవడం లేదు.. మరో రూ.10, రూ.20, లేదా రూ.30 పెంచి బుకింగ్ ట్రై చేయండి’.. ‘రేటు పెంచితే రైడ్ బుక్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి’.. అంటూ ర్యాపిడో సహా వివిధ అగ్రిగేటర్ యాప్లలో క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకునేవారికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. రైడ్ బుక్ చేసుకోవడానికి ముందే అనుసరిస్తున్న ఇలాంటి ముందస్తు టిప్ ఆప్షన్ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్లను బుధవారం ఆదేశించింది. ఈ విధానం తప్పుదోవ పట్టించేలా, అన్యాయంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవçహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. క్యాబ్, బైక్ డ్రైవర్లకు ముందస్తు టిప్ ఆప్షన్ను అందించడంతో పాటు రకరకాల అక్రమ వ్యాపార విధానాలకు సంబంధించి బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడోపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ. 10 లక్షల జరిమానా విధించిన మర్నాడే కేంద్రం తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఈ విషయంలో క్యాబ్ అగ్రిగేటర్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయని.. దీంతో ఉబెర్, ఓలా వ్యాపార విధానాలను కూడా సీసీపీఏ నిశితంగా పరిశీలిస్తోందని, ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఖరే చెప్పారు. ముందుగానే ఎంతో కొంత టిప్ ఇవ్వకపోతే రైడ్ బుక్ కావడం లేదంటూ వినియోగదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతోనే, దీనిపై లోతుగా విచారణ జరిపి, నిలిపివేత ఆదేశాలిచ్చామని ఆమె వివరించారు. సీసీపీఏకు కూడా ఖరే సారథ్యం వహిస్తున్నారు. టిప్ అనేది పూర్తిగా స్వచ్ఛందమైన విషయమని, వినియోగదారులు తమకు సేవలు నచ్చితే రైడ్ పూర్తయ్యాక ఇచ్చే విధంగా వారి విచక్షణకే వదిలేయాలని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. -
ఎన్ఎస్ఈ ఐపీవో నేడే విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీవో నేడు (గురువారం) ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 21న ముగుస్తుంది. 22న షేర్ల కేటాయింపు, 24న ఎక్సే్చంజీలో లిస్టింగ్ ఉంటుంది. ఈ ఇష్యూ కింద ఒక్కో షేరుకి ధర శ్రేణిని రూ. 1,700–1,785గా నిర్ణయించారు. ఒక్కో లాట్ పరిమాణం 8 షేర్లుగా ఉంటుంది. అర్హత గల ఎన్ఎస్ఈ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 170 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. ఐపీవో ద్వారా ఎన్ఎస్ఈ సుమారు రూ. 22,569 కోట్ల వరకు సమీకరించనుంది. ఈ ఇష్యూ హ్యుందాయ్ మోటర్స్ (రూ. 27,870 కోట్లు) తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద ఐపీవోగా నిలవనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే ఉండే ఈ ఇష్యూలో భాగంగా 12.64 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 6,746 కోట్లు...ఐపీఓలో భాగంగా బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ద్వారా ఎన్ఎస్ఈ రూ. 6,746 కోట్లు సమీకరించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, గోల్డ్మన్ శాక్స్, ఫిడిలిటీ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. బీఎస్ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సర్క్యులర్ ప్రకారం 150 యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకి రూ. 1,785 ధర చొప్పున ఎన్ఎస్ఈ మొత్తం 3.77 కోట్ల షేర్లను కేటాయించింది. -
సాక్షి కార్టూన్ 17-09-2026
-
వేవేల ఊహలే చూపినా...
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్ కానుంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వేవేల ఊహలే చూపినా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, శ్రీ సాగర్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘వేవేల ఊహలే చూపినా..’ అనే సాంగ్ డిఫరెంట్ స్టైల్లో సాగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి’’ అన్నారు. -
వృద్ధుల విషయంలో జపాన్ ప్రపంచ రికార్డు
జపాన్లో తొలిసారిగా 100 అంతకన్నా ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో సెప్టెంబర్ 1 నాటికి శతాధిక వృద్ధుల సంఖ్య 1,07,677కు చేరుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, కార్మిక సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7,914 ఎక్కువ. శతాధిక వృద్ధుల్లో మహిళలు 94,298 మంది ఉండగా, పురుషులు 13,779 మంది ఉన్నారు.ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శతాధికుల్లో మహిళలదే అగ్రస్థానం. మొత్తం సంఖ్యలో సుమారు 88 శాతం, అంటే 94,298 మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత వృద్ధురాలిగా క్యోటోకు చెందిన 114 ఏళ్ల ఫుయో కిషిమోటో, అత్యంత వృద్ధుడిగా కుమామోటోకు చెందిన 112 ఏళ్ల హికారు కాటో రికార్డుల్లో నిలిచారు. జపాన్లో శతాధికుల సంఖ్య వృద్ధిని పరిశీలిస్తే.. 1963లో గణాంకాల సేకరణ ప్రారంభమైనప్పుడు వీరి సంఖ్య కేవలం 153 మాత్రమే ఉండేది. ఆ సంఖ్య 1981 నాటికి వెయ్యి దాటింది. 1998లో 10,000 కు, 2012లో 50,000 కు చేరింది. ఇప్పుడు ఏకంగా లక్ష మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గణాంకాలపై జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యునో హర్షం వ్యక్తంచేశారు.ఇదీ చదవండి: భారీగా హెచ్ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ! -
లంచం ఇవ్వడం నేరం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దం క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’కేసు విచారణ సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలు, ఏసీబీ దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే అధికారిక విధి కాదని, పాత చట్టం ప్రకారం ఈ కేసు నిలబడదని చెప్పారు. పాత చట్టం ప్రకారం అది నేరం కాదు.. : ఈ కేసు 2015 నాటిది కాబట్టి అప్పటి అవినీతి నిరోధక చట్టం (పీసీ) ప్రకారమే విచారించాలని లూథ్రా కోరారు. పాత చట్టంలోని సెక్షన్లు 7, 11 కేవలం లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకే వర్తిస్తాయని, సెక్షన్ 12 ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని వాదించారు. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక తీర్మానం మేరకు 2018లో వచ్చిన చట్ట సవరణల తర్వాతే లంచం ఇవ్వడాన్ని (కొత్త సెక్షన్ 8 కింద) ప్రత్యేక నేరంగా చేర్చారన్నారు. ఈ కేసుకు పాత చట్టం నిబంధనలే వర్తిస్తాయని, ఆ ప్రకారం లంచం ఇవ్వజూపడం నేరం కిందకు రాదన్నారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 171 ప్రకారం ఈ ఎన్నికలు అసెంబ్లీ స్పీకర్ పరిధిలో కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. ఇందులో స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టభద్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం ఓటరు (ఎలక్టోరేట్) పాత్రను మాత్రమే పోషిస్తారని తెలిపారు. దామాషా (సింగిల్ ట్రాన్స్ఫరబుల్) పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే ’ప్రజా విధి’లేదా ’అధికారిక విధి’కిందకు రాదని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ‘సీతా సోరెన్’తీర్పు కేవలం సభా హక్కుల పరిరక్షణకు మాత్రమే పరిమితమని, ఈ కేసుకు ఆ తీర్పు వర్తించదని చెప్పారు. ఎమ్మెల్యే ’పబ్లిక్ సర్వెంట్’కాదా? ధర్మాసనం కలుగజేసుకుని.. ‘ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ (ప్రజా సేవకుడు) కాదా? నామినేటెడ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?‘అని ప్రశ్నించింది. దీనికి లూథ్రా బదులిస్తూ.. పీసీ చట్టం వర్తించాలంటే వారు పబ్లిక్ సర్వెంట్ కావడంతో పాటు, వారు చేసే పని ’అధికారిక విధి’అయి ఉండాలన్నారు. కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్–అఫీషియో హోదాలో ఓటరుగా మాత్రమే వ్యవహరిస్తారని, నామినేటెడ్ ఎమ్మెల్యేల పాత్ర కూడా అదేనని వివరించారు. వాదనల సందర్భంగా ఏసీబీ తీరును లూథ్రా తీవ్రంగా తప్పుబట్టారు. 2015 మే 28న అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్ సన్) నేరుగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినా కనీసం జనరల్ డైరీలో ఆ విషయాన్ని నమోదు చేయలేదన్నారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, కనీస ముందస్తు అనుమతులు తీసుకోకుండానే మే 31న వలపన్ని దాడులు చేశారని కోర్టుకు తెలిపారు. దాడులు పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ముడుపులకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు. అప్పట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం, కక్షసాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదైందని చెప్పారు. దర్యాప్తు లోపాల కారణంగానే ఈ కేసులో ఏ–4గా ఉన్న నిందితుడి (మత్తయ్య) కేసును గతంలో హైకోర్టు కొట్టివేసిందని, ఆ తీర్పు ఏ–1కు (రేవంత్ రెడ్డి) కూడా వర్తిస్తుందని లూథ్రా వాదించారు. దీంతో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. కాగా, విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన సీనియర్ న్యాయవాది సుందరం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 30కి వాయిదా వేసింది. -
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.షష్ఠి ఉ.10.10 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: మఖ ప.2.53 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.2.38 నుండి 4.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.42 వరకు, తదుపరి ప.2.45 నుండి 3.34 వరకు, అమృత ఘడియలు: ఉ.9.07 నుండి 10.53 వరకు.సూర్యోదయం : 5.51సూర్యాస్తమయం : 6.00రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.వృషభం.. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మిథునం.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూవివాదాల పరిష్కారం. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.కర్కాటకం... బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.సింహం.... కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.కన్య.... పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల.... బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం.వృశ్చికం.... ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.ధనుస్సు..... ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.మకరం... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.కుంభం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం... కుటుంబసమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. -
భారీగా హెచ్ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ!
పసిఫిక్ దేశం ఫిజీలో హెచ్ఐవీ కేసులు భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్ హెచ్ఐవీ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. 10 లక్షల్లోపు జనాభా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. 2024లో కొత్తగా 2,060 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. గర్భిణులు, నవజాత శిశువుల్లోనూ కేసులు గుర్తిస్తున్నారు. ఒకే సిరంజీని పలువురు ఉపయోగించడం, అసురక్షిత లైంగిక సంబంధాలు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. డ్రగ్స్ ఎక్కించుకునేందుకు ఒకే సిరంజీని అనేక మంది ఉపయోగించడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాల వంటి కారణాలతో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. 2021లో 25గా ఉన్న హెచ్ఐవీ సంబంధిత మరణాల సంఖ్య 2025 నాటికి 117కు పెరిగింది. స్థానికంగా హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో కేవలం 39 శాతం మందికి మాత్రమే ఆ విషయం తెలుసని, నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని యూఎన్ఎయిడ్స్ ఫిజీ ప్రతినిధి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆసియా గేమ్స్కు స్టార్ ఆల్రౌండర్ దూరం -
‘స్టార్టప్ స్టేట్’గా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోగలదా? అవసరమైన వనరులు, సంస్థలు, పరిపాలనా సామర్థ్యం తెలంగాణకు ఉన్నాయా? రాష్ట్ర ఏర్పాటు సమయంలో వ్యక్తమైన అనేక సందేహాలకు అభివృద్ధి, పరిపాలనా విధానాల ద్వారా సమాధానం ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేది దేశ అభివృద్ధికి సమాధానంగా ఉండటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణను కేవలం కొత్త రాష్ట్రంగా కాకుండా ప్రజల కోసం విలువను సృష్టించే ‘స్టార్టప్ స్టేట్’గా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు సాగి విజయం సాధించామన్నారు. బుధవారం హరియాణా రాష్ట్రం సోనిపట్లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘పాలనలో నవకల్పన–ఒక స్టార్టప్ రాష్ట్రం కథ’అనే అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త రాష్ట్రం నిలబెట్టుకోగలదా? అన్నారు ‘తెలంగాణ ఏర్పడిన సమయంలో కొందరు ఈ రాష్ట్రం తనను తాను నిలబెట్టుకోగలదా? అని ప్రశ్నించారు. కొత్త పరిపాలనా వ్యవస్థను నిర్మించడం పెద్ద భారమని చెప్పారు. మేము మాత్రం అదే పరిస్థితిని కొత్త తరహా పాలనా సంస్కృతిని నిర్మించుకునే అవకాశంగా చూశాం. సందేహాలతో వాదించకుండా పనితీరుతో సమాధానం చెప్పడమే తెలంగాణ విధానంగా సాగింది’అంటూ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కథకు రెండు ప్రధాన కోణాలు ఉన్నాయని వివరించారు. ఒకటి నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రాథమిక అవసరాల ద్వారా ప్రజలకు భరోసా కల్పించడం కాగా.. రెండోది స్టార్టప్లు, నైపుణ్యాలు, ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడం. వ్యవసాయ రంగంపై... వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పును కూడా ఈ అభివృద్ధి నమూనాకు ఉదాహరణగా కేటీఆర్ ప్రస్తావించారు. 2014–15లో తెలంగాణలో సుమారు 44.4 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. ఆ ఏడాది దేశంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అదే విధంగా ఇళ్లకు 24 గంటల తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించామన్నారు. ఇప్పుడు తెలంగాణ దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలిచిందని, దశాబ్ద కాలంలో తలసరి ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందని, జాతీయ సగటు కంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఎకోసిస్టమ్ను నిర్మించాం ప్రాథమిక సదుపాయాలపై భరోసా ఏర్పడిన తర్వాత అవకాశాల ఎకోసిస్టమ్ను నిర్మించడంపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. టీ–హబ్, డబ్ల్యూఈ–హబ్, టీ–వర్క్స్, టాస్క్ వంటి సంస్థలను ఒకదానికొకటి అనుసంధానమయ్యే విధంగా రూపొందించామని తెలిపారు. ఈ–ఎకోసిస్టమ్ ఫలితాలను వివరించేందుకు స్కైరూట్ను ఉదాహరణగా ప్రస్తావించారు. విక్రమ్–1 అంతరిక్షంలోకి చేరడం హైదరాబాద్ ఆవిష్కరణ నమూనాను ప్రపంచానికి పరిచయం చేసిందని, స్కైరూట్ ప్రస్తుతం భారత తొలి స్పేస్టెక్ యూనికార్న్గా హైదరాబాద్ నుంచి ప్రపంచ మార్కెట్ కోసం రాకెట్లు నిర్మిస్తోందని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు ప్రసంగం తర్వాత విద్యార్థులతో కేటీఆర్ ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘2028 ఎన్నికల్లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా’? అంటూ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. ‘మేం వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుకోం. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము ఏ పారీ్టతోనూ పొత్తు పెట్టుకోలేదు’అంటూ సమాధానమిచ్చారు. ‘డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటి’అని మరో విద్యార్థి ప్రశ్నించగా.. ‘దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మాకు సమస్య లేదు’అన్నారు. ఏఐ, సాంకేతిక పరివర్తనలపై ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రతి పెద్ద సాంకేతిక మార్పు సమయంలోనూ ఆందోళనలు, సందేహాలు వ్యక్తమయ్యాయన్నారు. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని, సాంకేతిక మార్పును స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశం తర్వాత సెల్ఫీ అంటూ విద్యార్థులు పోటీపడటంతో ఆయన అందరికీ ఓపిగ్గా సెలీ్ఫలు ఇచ్చారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ‘నాతో పాటు మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపించండి. మా ఆస్తులు, మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల ఆస్తులు.. 2020 నుంచి ఇప్పటి వరకు ధరణి, భూభారతిలో జరిగిన వ్యవహారాలపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధం. మీరు సిద్ధమా?’ అంటూ సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేకే సీఎం వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ డ్రామాలు చేస్తూ ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్ని స్తున్న తమపై ఎదురుదాడి చేస్తున్నారని, దబాయింపులు, బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేతలపై బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ.. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి తదితరులతో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. అధికారులు, మంత్రిపై చర్యలేవీ? ‘నిషేధిత భూముల అంశంలో బీఆర్ఎస్ ఇన్నాళ్లుగా చెబుతోంది సీఎం మాటలే ధ్రువీకరించాయి. 3.71 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టామని, సమస్యను పరిష్కరించే క్రమంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి 30 లక్షల కుటుంబాలకు సమస్య ఏర్పడిందని సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనం. మేం ఇదే విషయాన్ని ఇన్నాళ్లూ చెబుతున్నాం. ఇప్పుడు సీఎం స్వయంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఒప్పుకున్నారు. మరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన తప్పిదానికి బాధ్యత ఎవరిది? ఆదేశాలు ఇచ్చిన అధికారులపై, జాబితాను అప్లోడ్ చేసిన కలెక్టర్లపై చర్యలెందుకు లేవు? ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని చెప్పిన రెవెన్యూ మంత్రిపై చర్యలెందుకు తీసుకోలేదు? 22ఏపై తప్పు జరిగిందని ఒప్పుకున్న ప్రభుత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారో కాలపరిమితితో ప్రకటించాలి. కమిటీ వేస్తాం.. పరిశీలిస్తాం.. మార్గదర్శకాలు ఇస్తాం.. ఫీజులు కట్టించుకుంటాం.. అంటూ మాటలు చెబుతున్నారు. ప్రజలకు పరిష్కారం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. ఎదురుదాడితో ప్రజల బాధ పోతుందా? సీఎంకు ఒక చట్టం.. సామాన్యుడికి మరో చట్టమా? మీ ఇల్లు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టే రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడి భూమికీ ఊరట కల్పించాలి..’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేవంత్ పొంతన లేని లెక్కలు ‘కేసీఆర్ ఎకరం కోసం, గజం కోసం ఆలోచించే వ్యక్తి కాదు. తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఉద్యమ నాయకుడు. ఆయనకు వెయ్యి ఎకరాలున్నాయని ఒకసారి.. ఇప్పుడు 60 ఎకరాలు ఉన్నాయని రేవంత్ పొంతన లేని లెక్కలు చెప్తున్నాడు. ఫామ్హౌస్, భూముల విషయంలో చేసిన ఆరోపణలన్నీ ఎన్నికల అఫిడవిట్లు, ఆదాయపు పన్ను రిటర్నుల్లో నేను వెల్లడించివే. నా భూములపై కలెక్టర్లు, సర్వేయర్లు, విజిలెన్స్, సీఐడీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలతో విచారణలు జరిపించినా అక్రమాలు నిరూపించలేకపోయారు. నా భూములపై అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు. నీ ఆస్తులు, నీ తమ్ముళ్ల ఆస్తులు, నీ కుటుంబ ఆస్తులపైనా అదే విచారణ జరుపుదాం. ఒక్క కొట్రలోనే మీ కుటుంబ సభ్యుల పేరిట 170 ఎకరాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మీ కుటుంబ సభ్యుల పేరిట 308 ఎకరాలకు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు అందాయి. సస్పెన్షన్ ఎత్తేస్తే అసెంబ్లీలో అన్నీ మాట్లాడతాం.. ధరణి, భూభారతిలో బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవకతవక పైనా విచారణకు సిద్ధం. మేం చేసిన ఆరోపణలకు ఆధారాలు సభలో పెడతాం. సస్పెన్షన్ ఎత్తేస్తే అసెంబ్లీకి వచ్చి ఆధారాలతో మాట్లాడతాం. భూ భారతి చలాన్ల వ్యవహారం, ప్రజల ఆస్తులు ఇతరుల పేర్లకు మారిన లావాదేవీలు, నాదర్గుల్ భూముల అంశం.. ఇలా మేం లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి..’ అని హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడి బీఆర్ఎస్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేశారని జగదీశ్రెడ్డి విమర్శించారు. తమ వద్ద ఒక్క ఇంచు భూమి అక్రమంగా ఉన్నా నిరూపించాలని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై సీఎం చేసిన ఆరోపణలు సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. -
పొరపాట్లు జరిగాయి.. పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. 22ఏ జాబితాలో చేర్చిన వివరాల్లో పొరపాట్లు జరిగాయని చెప్పారు. వాటిని పూర్తిగా సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో 22ఏపై చర్చలో భాగంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అటవీ, అసైన్డ్ భూములు తొలగించలేం.. ‘22ఏ కింద మొత్తం 1.02 కోట్ల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో సింహభాగం అటవీ, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములే. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేం. వాటిని తొలగించాలని కేసీఆర్, హరీశ్రావు లేఖ మీద రాసి ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆగస్టు 30, 2026 నాటికి 22ఏ జాబితాలో 1,02,05,250 ఎకరాలు ఉండగా, అందులో ప్రైవేట్ భూమి 3,73,980 ఎకరాలే. 22ఏలో ఉన్న మొత్తం విస్తీర్ణాన్ని ప్రైవేట్ పట్టా భూమిగా చూపడం సరికాదు. టీజీఐఐసీ, ఇతర భూములపై వచ్చేసారి బడ్జెట్ సెషన్లో వివరాలు బయటపెడతా. ఇప్పుడు కేవలం రెవెన్యూలో ధరణిలో పార్ట్–1 వివరాలు మాత్రమే బయటపెట్టా. సభలో వారుండాలి.. వారి ఎదురుగా నేనే మాట్లాడతా.. నా కళ్లలోకి చూడడానికి కూడా ధైర్యం రావొద్దు.. చూడాలంటే కూడా చేసిన దొంగతనాలకు ముక్కును నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ప్రత్యక్షంగా తీసుకువస్తా. నిజాం సర్కార్ ఇచ్చినదాన్ని పూర్తిగా లూటీ చేశారు.. జమీన్దార్, జాగిర్దార్లను లూటీ చేశారు. నిజాం పేదలు, దళితలులు, ఆదివాసులు, మైనారిటీలకు దక్కాల్సిన భూములను ఒకే కుటుంబం దోపిడీ చేసింది. ప్రైవేట్ భూమిపై హైపవర్ కమిటీ ప్రైవేటు భూమి 3.7 లక్షలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు సీసీఎల్ఎ, న్యాయ కార్యదర్శి, ఐజీఆర్ఎస్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. నిషేధిత జాబితాలోని నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 12 అంశాలకు పరిష్కారం.. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. ⇒ అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూములు కేటగిరీలో పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు, యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది. ⇒ ఈ విధానం పెండింగ్లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. ⇒ భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడతాం. ⇒ అదీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూములు, కాంపిటెంట్ అథారిటీలు (హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ) ఆమోదించిన లేఅవుట్లలో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తాం. ⇒ ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెడుతుంది. ⇒ సింగరేణి బొగ్గు గని ప్రాంతాల (కోల్ బెల్ట్) సమస్య కోసం జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిర్దేశిత అర్హత ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది. అసైన్డ్ భూములపై న్యాయ సమీక్ష ⇒ జీవో నంబర్ 59 సమస్యకు కన్వెయన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. ⇒ మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తాం. ⇒ జీవో నంబర్ 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం) సమస్య కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ నిరీ్ణత గడువులోగా పరిష్కరిస్తాం. ⇒ పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. ⇒ అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటాం. ⇒ ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లు అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది అయినందున, దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరుపుతాం. ఇందిరమ్మ ఇళ్లకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లను 5 సంవత్సరాల లాక్–ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి మంజూరు చేస్తాం. ⇒ ప్రైవేటు పట్టా భూములు – నాలా రుసుము చెల్లించని కేసులకు సంబంధించి నాలా చార్జీలు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయ విక్రయాలకు అనుమతిస్తాం. ⇒ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలకు సంబంధించి అనధికారిక లేఅవుదట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తాం. ⇒ సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్ధీకరణ కేసులను 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ⇒ స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములకు సంబంధించి సమస్యలో నిరుపేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను దసమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం. ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేద లబ్ధిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. -
ఆసియా గేమ్స్కు స్టార్ ఆల్రౌండర్ దూరం
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో పాల్గొనే టీమిండియా జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటికే గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించిన బీసీసీఐ తాజాగా స్టార్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డిని కూడా జట్టు నుంచి విడుదల చేసింది. ఇక గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇదే సమయంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు మాత్రం నితీశ్రెడ్డి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే ఆసియా గేమ్స్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించడం వెనుక బీసీసీఐ స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ, రాబోయే ఏడాదిలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా భావిస్తున్న నితీశ్రెడ్డికి వీలైనంత ఎక్కువగా వన్డే మ్యాచ్ల్లో అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న నితీశ్రెడ్డి వన్డేల్లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని బీసీసీఐ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆరు వన్డేలు మాత్రమే ఆడిన నితీశ్రెడ్డి వంద పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్కు మాత్రం నితీశ్కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది.ఆసియా గేమ్స్కు టీమిండియా:శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్. -
సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం
‘‘సుబ్బులక్ష్మి అమ్మ సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ... ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి. ఆమె సంగీతమే మనకు సందేశం’’ అని కమల్హాసన్ తెలిపారు. సంగీత సామ్రాజ్ఞి, గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ పేరుతో వెండితెరపైకి రానుంది. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కమల్హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ర ష్మికా మందన్నపై చిత్రీకరించిన సన్నివేశానికి కమల్హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మన దేశపు గొప్ప సంగీత సామ్రాజ్ఞి గురించి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాం’’ అని చెప్పారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవం’’ అన్నారు బన్నీ వాస్. ‘‘ఈ సినిమా వెనక ఏడెనిమిదేళ్ల ప్రయత్నం ఉంది’’ అన్నారు రాక్లైన్ వెంకటేశ్. ‘‘నటిగా గొప్ప చాన్స్ దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపో తోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు రష్మిక. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు. -
బ్రిటన్లో వేర్పాటు భేరి!
బ్రిటిష్ వలస పాలకులు తాము తప్పుకున్న మరుక్షణం భారత్ చిన్నాభిన్నం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఆ దేశమే ముక్కలయ్యే స్థితి ఏర్పడింది. మొన్న సోమవారం స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు(మన దగ్గర సీఎంల హోదాతో సమానం) అనధికార సమావేశం జరిపి, తమ స్వాతంత్య్ర ఆకాంక్షను వ్యక్తం చేసే ప్రకటనపై సంతకాలు చేశారు. దేశం కలిసుండాలా, విడిపోవాలా అనేది... అందుకు అనుసరించాల్సిన పద్ధతేమిటన్నది లండన్లోని జాతీయ పార్లమెంటు మాత్రమే నిర్ణయించాల్సిన అంశం కాబట్టి, ఇప్పటికప్పుడు దీనివల్ల జరిగేదేమీ ఉండదు. కానీ ఆర్థిక సంక్షోభాలు అగ్రరాజ్యాల్ని సైతం ఎలా కుదిపేస్తున్నాయో చెప్పడానికి తాజా పరిణామం ఉదాహరణ. అమెరికాపై పాతికేళ్లనాడు ఉగ్రదాడి జరిగినప్పుడు 3,000 మందిని పొట్టనబెట్టుకోవడం మినహా ఆ ఉగ్రవాదులు సాధించిందేమిటన్న ప్రశ్న వినబడింది. అటు తర్వాత అమెరికా సవ్యంగావుంటే ఉగ్రవాదం అంతరించేది. కానీ జరిగిందంతా అందుకు భిన్నం. అప్పట్లో అందరినుంచీ అమెరికాకు మద్దతు లభించింది. కొత్తగా అధికారంలోకొచ్చిన రష్యా అధినేత పుతిన్ అమెరికా ప్రారంభించిన ‘ఉగ్రవాదంపై యుద్ధా’నికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, తాలిబన్ల వేటకు మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్ సైనిక స్థావరాల వినియోగానికి ఉదారంగా అనుమతించారు. నాటో ఆవిర్భవించి అప్పటికి యాభైయ్యేళ్లు దాటగా... అందులోని మొదటి క్లాజు ‘సమష్టి రక్షణ’ను తొలిసారి ఉపయోగించి ఆ సంస్థ అమెరికాకు బాసటగా నిలిచింది. ఇలా చిన్నా పెద్దా దేశాలన్నీ తాలిబన్ల వేటకు తోడ్పడ్డాయి. కానీ దీన్ని అమెరికా దుర్వినియోగం చేసింది. మానవహక్కుల ఉల్లంఘన సంగతలా వుంచి ఇరాక్ మొదలు పలు దేశాలపై విరుచుకుపడి ధ్వంసరచనకు, మారణహోమాలకు పాల్పడింది. లక్షల కోట్ల డాలర్లను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేసింది. ప్రతీకారేచ్ఛ క్రమంలో తాను దివాలా తీస్తున్నాననీ, నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నాననీ, చైనాపై కన్నేసి వుంచాలన్న సంగతి మరిచాననీ గ్రహించలేక పోయింది. ఉగ్రదాడికి ముందు మిగులు బడ్జెట్లో ఉన్న అమెరికా ఇప్పుడు 40 లక్షల కోట్ల డాలర్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయింది. కరోనా మహమ్మారి పాత్ర కూడా ఇందులో ఉండొచ్చు గానీ... విచక్షణారహిత యుద్ధాల పరంపరే దాన్ని ఈ స్థితికి చేర్చింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు యుద్ధాల్లో పాలుపంచుకున్న నాటో బలహీన పడింది. అన్ని దేశాలూ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నాయి. ఈ కష్టాల పరంపరనుంచి గట్టెక్కటం కోసమే ఆరేళ్ల క్రితం ఈయూ నుంచి బ్రిటన్ బయటికొచ్చింది. బ్రెగ్జిట్ రిఫరెండమ్లో దీన్ని నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రజానీకం తిరస్కరించారు. కానీ వారి అభీష్టానికి విలువ లేకుండాపోయింది. ఇప్పుడు బ్రిటన్నుంచి విడిపోవటంతోపాటు ఈయూలో చేరటం కూడా ఈ ముగ్గురు అధినేతల ఎజెండా. చారిత్రకంగా మన రాష్ట్రాల కన్నా వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ భిన్నమైనవి. వేల్స్ను 13వ శతాబ్దంలో ఇంగ్లండ్ ఆక్రమించుకుంది. రాచరికాలు చుట్టరికం కలుపుకోవటంతో స్కాట్లాండ్,ఇంగ్లండ్ కలిసి ప్రయాణించి వందేళ్ల తర్వాత కలిసి 1703లో గ్రేట్ బ్రిటన్గా ఏర్పడ్డాయి. 1801లో దానిలో చేరిన ఐర్లాండ్ 1921లో విడిపోయింది. కానీ ఉత్తర ప్రాంతంలోని ఆరు కౌంటీలు యూకేలోనే కొనసాగుతామన్నాయి. బ్రిటన్ తప్పుడు నిర్ణయాలతో అన్ని ప్రాంతాలనూ భ్రష్టు పట్టించటంతోపాటు, వాటి అధికారాలను కుదిస్తూవచ్చింది. పన్నుల ఆదాయాన్ని సరిగా పంచక 90 దశకం చివర్లో హామీ ఇచ్చిన స్వయంప్రతిపత్తి హోదాకు ముప్పు తెస్తోందన్నది వాటి అభిప్రాయం. నిరుద్యోగం, జనాభా క్షీణతపై తమకు సరైన నిర్ణయాధికారాలు లేవని వాటి ఫిర్యాదు. సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడైనా సక్రమంగా వ్యవహరించటం చేతకాకపోతే అవి మరింత ముదురుతాయి. ఫెడరల్ వ్యవస్థను నీరుగార్చి ప్రశాంతంగా మనుగడ సాగించా లనుకోవటం చెల్లదని బ్రిటన్ పాలకులు గుర్తించకపోతే... ఇప్పటికి కేవలం రాజకీయ హెచ్చరికగానే తలెత్తిన ఈ నిరసన ఆ ప్రాంత జనాభాను తాకడానికి ఎన్నాళ్లో పట్టదు. అప్పుడు బ్రిటన్ లండన్గా మిగిలిపోక తప్పదు. చేసిన పాపాలు శాపాలై వెంటాడ తాయంటారు. మనతో సహా అనేక దేశాలను పీల్చిపిప్పిచేసిన బ్రిటన్ ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోగలదా అన్నది వేచిచూడాలి. -
గూఢచారి డేట్ ఫిక్స్
‘జీ2’ అంటూ అడివి శేష్ మళ్లీ గూఢచారిగా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందిన ‘గూఢచారి’కి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం ‘జీ2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా 2027 ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఏజెంట్ 116గా వామికా గబ్బి నటిస్తోన్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
అంకుర్ నుంచి ఫాల్కే వరకు...
ఆయన కళ్లల్లో ఒక తెలియని తీక్షణత ఉంటుంది... ఆయన నటనలో అతిశయోక్తులు లేని సహజత్వం ఉట్టిపడుతుంది. కమర్షియల్ సినిమాల్లో నవ్వులు పూయించాలన్నా, క్లాసిక్ ఆర్ట్ సినిమాల్లో గుండెల్ని పిండేసే అభినయం పండించాలన్నా అది కేవలం ఆయనకే సాధ్యం. ఆయనే కన్నడ చలనచిత్ర అరుదైన నవరత్నం,భారతీయ సినీ యవనికపై ఐదు దశాబ్దాలుగా వెలుగుతున్న నటుడు అనంత్ నాగ్. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటించడం దక్షిణ భారతానికి దక్కిన మరో సమున్నత గౌరవం.శ్యామ్ బెనగళ్ తెలంగాణ ప్రాంతపు కథతో సినిమా మొదలెట్టాడు. అనంత్ నాగ్, షబానా ఆజ్మీలు ముఖ్యపాత్రలు. దానికి వర్కింగ్ టైటిల్గా ‘సీడ్లింగ్’ (మొలక) అని పేరు పెట్టుకున్నాడు. కాని తీస్తున్నది హిందీలో. మంచి టైటిల్ ఏం పెట్టాలో తోచడం లేదు. సీడ్లింగ్కు సరిపోలిన టైటిల్ చెప్పిన వారికి వెయ్యి రూపాయల నజరానా ప్రకటించాడు. అనంత్ నాగ్ ఆయనతో ఒకరోజు బెరుగ్గానే చెప్పాడు... ‘సార్ సీడ్లింగ్కు సరైన హిందీ మాట అంకుర్’... భారతీయ సినిమాలో ‘అంకుర్’ ఎంత పెద్ద ప్రభావపూరిత సినిమాయో ఆ సినిమాలో నటించిన అనంత్ నాగ్ కాలక్రమంలో అంతే ప్రభావపూరిత నటుడిగా అవతరించాడు. నట మహావృక్షమై దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఎదిగాడు. అనంత్ నాగ్కు మొదటి నుంచి పాత్రే ముఖ్యం. ‘అంకుర్’లో లీడ్ రోల్లో నటించిన అనంత్ నాగ్ ఆ వెంటనే ‘నిశాంత్’కు వచ్చేసరికి పనికిమాలిన పోరంబోకు పాత్రలో కనిపిస్తాడు. భూస్వామి కొడుకుగా అకృత్యాలు చేసే పాత్ర అది. ఆ తర్వాత బెనగళ్ తీసిన ‘మంథన్’లో గ్రామీణ అమ్మాయిని వల్లో వేసుకునే పాత్ర. ఇవన్నీ అందరూ అంగీకరించేవి కావు. 1978లో శ్యామ్ బెనగళ్ తీసిన ‘అనుగ్రహం’లో వాణిశ్రీ భర్తగా దారీ తెన్నూ లేని పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమలేఖలు’లో విలన్గా నటించాడు. ‘ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి’... జయసుధతో డ్యూయెట్ పాడాడు. అనంత్ నాగ్, గిరీష్ కర్నాడ్ ఇద్దరూ ఒకే సాంస్కృతిక మూలాల నుంచి వచ్చారు. అనంత్ నాగ్ మొదటి కన్నడ నాటకం గిరీష్ కర్నాడ్ రాసిన క్లాసిక్ ‘యయాతి’. ముంబైలో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు యయాతికి తన యవ్వనం ఇచ్చి వృద్ధుడిగా మారే కొడుకు పాత్రలో అనంత్ నాగ్ అద్భుతంగా నటించాడు. ఆ నటనను చూసి ముగ్ధుడైన గిరీష్ కర్నాడ్, ప్రముఖ దర్శకుడు జి.వి. అయ్యర్కు సిఫార్సు చేస్తే అనంత్ నాగ్కు లభించిన మొదటి కన్నడ సినిమా ‘సంకల్ప’ (1973). హిందీలో ఎంత బిజీగా ఉన్నా అనంత్ నాగ్ తన మాతృ పరిశ్రమ శాండల్వుడ్ను వదల్లేదు. వైవిధ్యమైన పాత్రలతో ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును, ఆరుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకోవడం కన్నడ సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రభావానికి నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మి (‘మిథునం’ ఫేమ్), అనంత్ నాగ్ల కాంబినేషన్ సౌత్ సినిమాలోనే అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. కన్నడలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చందనద గొంబె’ వంటి చిత్రాలు బ్లాక్బస్టర్స్ అయ్యాయి. స్క్రీన్ వెలుపల కూడా వీరు మంచి స్నేహితులు. దూరదర్శన్ లో సంచలనం సృష్టించిన ‘మాల్గుడి డేస్’ (1987) క్లాసిక్ సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ పనుల్లో తమ్ముడు శంకర్ నాగ్కు అనంత్ నాగ్ వెన్నెముకగా నిలిచాడు. నేటి తరం ప్రేక్షకులకు ఆయన ‘కెజీఎఫ్ చాప్టర్1’ లోని కథ చెప్పే జర్నలిస్ట్ పాత్రతో పూనకాలు తెప్పించాడు. అలాగే నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీ హెడ్గా, ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో అల్జీమర్స్ పేషెంట్గా చూపిన నట విశ్వరూపం నేటి యూత్ని ఫిదా చేసింది. అనంత్ నాగ్ సమాజం పట్ల అవగాహన ఉన్న మేధావి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో కర్ణాటక క్యాబినెట్ మంత్రిగా (బెంగళూరు నగర అభివృద్ధి శాఖ) కూడా ఆయన సేవలందించాడు. వెండితెరపై ఎందరో హీరోయిన్లతో రొమాన్స్ పండించి చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న అనంత్ నాగ్ది రియల్ లైఫ్లోనూ లవ్ మ్యారేజే. తన సహ నటి గాయత్రిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అదితి అనే కుమార్తె ఉంది. లైమ్లైట్కు, వెండితెరకు దూరంగా పెరిగిన అదితి పెళ్లి చేసుకుని, భర్త వివేక్తో కలిసి బెంగళూరులోనే సెటిల్ అయ్యారు. ‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది సమాజానికి అద్దం పట్టే మాధ్యమం’ అని నమ్మిన అతికొద్ది మంది నటుల్లో అనంత్ నాగ్ ఒకరు. 1973లో థియేటర్ ఆర్టిస్ట్గా మొదలైన ఆయన ప్రయాణం, ఇవాళ భారతీయ సినిమా అత్యున్నత శిఖరమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వద్దకు చేరింది. ఏనాడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పర్సనల్ లైఫ్ను ఎంతో హుందాగా నడిపించిన అనంత్ నాగ్ ఎగరేసిన నట బావుటా రాబోయే తరాల నటులకు చుక్కాని. అనంత్ నాగ్ పూర్తి పేరు అనంత్ నాగర్కట్టె. తండ్రి సదానంద్, తల్లి ఆనంది. వీరిది కొంకణ కుటుంబం. అనంత్ నాగ్ బాల్యమంతా సంస్కృత భజనల, భక్తి పాటల మధ్య సాగింది. ఉడుపిలో 7వ తరగతి పూర్తయ్యాక తండ్రి అనంత్ నాగ్ని బాంబేకి చదువుకోవడానికి పంపాడు. అయితే అక్కడి ఇంగ్లిష్ మీడియంతో అనంత్ నాగ్ అవస్థ పడి పదితో చదువు ఆపేశాడు. కొన్నాళ్లు యూనియన్ బ్యాంక్లో టెంపరరీ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే బాంబేలోని ప్రభాకర్ ముదూర్, వెంకట్రావు తలేగేరి, సత్యదేవ్ దూబె వంటి నాటకరంగ దిగ్గజాలు ఆయన్ను గుర్తించి నాటకాల్లో అవకాశం ఇచ్చారు. అనంత్ నాగ్ వేసిన మొదటి పాత్ర చైతన్య మహాప్రభు పాత్ర. ఆ నాటకం సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు 8 ఏళ్ల పాటు కొంకణి, కన్నడ, మరాఠీ, హిందీ నాటకాల్లో స్టేజ్ ఆర్టిస్ట్గా రాటుదేలాడు.– కె -
భాష మార్చిన రాత!
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్... ఈ ముగ్గురు మహానేతలు బ్రిక్స్ సమ్మిట్లో ఒక చోట ఉంటే మధ్యలో నిలుచున్న ‘నాల్గవ వ్యక్తి’ మన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ బాబు. ఒకే ఒక్క విదేశీభాషపై పట్టు సాధించి...ఇవాళ గ్లోబల్ లీడర్ల పక్కన దౌత్యం నెరిపే స్థాయికి ఎదిగాడు. విదేశీ భాషలు నేర్చుకుంటే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చెప్పే సూపర్ సక్సెస్ స్టోరీ ఇది! యువతా... మీకెన్ని భాషలు వచ్చు?‘చైనాను భారతీయులు, భారత్ను చైనీయులు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ రెండు వేర్వేరు సంస్కృతుల మధ్య భాషే వారధి. ఆ భాషతోనే మనం సంబంధాలు నెరపగలం’ అంటారు సిద్ధార్థ్ బాబు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఈస్ట్ ఏషియా డివిజన్’లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న సిద్దార్థ్ బాబు చైనా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, మంగోలియా తదితర దేశాలతో భారత్కు ఉన్న దౌత్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాదు, ఆ రాజ్యాధినేతలు వచ్చినప్పుడు ప్రధానికి అనువాదకునిగా కీలకమైన బాధ్యతను పోషిస్తుంటారు. ఆయన మాండరిన్ ఎక్స్పర్ట్. అందుకే బ్రిక్స్లో చైనా అధ్యక్షునికీ మన ప్రధానికీ మధ్య జరిగే సంభాషణల్లో కీలకంగా మారి ఇవాళ వార్తల్లో నిలిచారు.ఎవరీ సిద్ధార్థ్ బాబు? కేరళకు చెందిన సిద్ధార్థ్ బాబుది మామూలు మధ్యతరగతి కథే. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఒక ఈ–కామర్స్ కంపెనీలో రెండేళ్లు జాబ్ చేశారు. కానీ సంతృప్తి కలగలేదు. లైఫ్లో పెద్దగా సెటిల్ అవ్వాలనే కసితో సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2017లో ఆలిండియా 15వ ర్యాంక్ కొట్టి, ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఆప్షన్ ఎంచుకున్నారు. అయితే వృత్తిరీత్యా ఆయన నేర్చుకున్న ‘ఒక్క భాష’ ఆయన కెరీర్ను రాకెట్లా దూసుకెళ్లేలా చేసింది.స్మార్ట్గా కొత్త భాషకొత్త భాష నేర్చుకోవడం కష్టమనే అపోహ వద్దు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్గా ప్లాన్ చేస్తే కేవలం కొన్ని నెలల్లోనే కొత్త భాషపై పట్టు సాధించవచ్చు. భాషలు నేర్పించే డ్యుయోలింగో లాంటి యాప్స్ అనేకం ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 15 నిమిషాలు కేటాయించి బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఇక నేర్చుకోవాలనుకునే భాషలోని సినిమాలు, వెబ్ సిరీస్లను మొదట సబ్టైటిల్స్తో, ఆ తర్వాత సబ్టైటిల్స్ లేకుండా చూడటం ద్వారా ఉచ్చారణ సులువుగా అర్థమవుతుంది. స్థానిక యూనివర్సిటీలు ఆఫర్ చేసే డిప్లొమా కోర్సుల్లో చేరడం ద్వారా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పొందవచ్చు. ‘ఒక మనిషితో అతడికి తెలిసిన భాషలో మాట్లాడితే అది అతడి మెదడుకు చేరుతుంది. అదే అతడి మాతృభాషలో మాట్లాడితే నేరుగా అతడి గుండెకు చేరుతుంది’ అంటాడు నెల్సన్ మండేలా. సిద్ధార్థ్ బాబు సరిగ్గా ఆ పని చేయడం ద్వారా ఎదిగారు. గ్లోబల్ సిటిజన్ గా ఎదగాలనుకునే యువత అదనంగా ఒక అంతర్జాతీయ భాషను నేర్చుకోవడం రెజ్యూమెకి బ్రహ్మాస్త్రాన్ని జోడించడమే. రీల్స్లో టైమ్ వృథా చేయకుండా ఇవాళే ఒక కొత్త భాష నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ‘మాండరిన్’ మంత్రంఐఎఫ్ఎస్ ట్రైనింగ్లో భాగంగా ఒక విదేశీ భాష నేర్చుకోవాలనేది రూల్. చాలామంది ఈజీగా ఉండేవి ఎంచుకుంటే సిద్ధార్థ్ మాత్రం ప్రపంచంలోనే కష్టమైన భాషల్లో ఒకటైన చైనీస్ ‘మాండరిన్’ ఎంచుకున్నారు. ‘చైనాను అర్థం చేసుకోవాలంటే ఆ దేశ భాష నేర్చుకోవడమే దారి’ అని గ్రహించి ఆ దారిలో వెళ్లారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో నాలుగేళ్లపాటు (2018–2022) పని చేస్తూ చైనా చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై లోతైన అధ్యయనం చేశారు. అయితే ఆయన అక్కడ ఉన్న కాలంలోనే కోవిడ్ చెలరేగింది. ఆ మృత్యుఘోషలో లాక్డౌన్లో నాలుగు గోడల మధ్య ఆయన మాండరిన్ భాషలో మునిగి పోయి ఆరితేరారు. ఆ తర్వాత అమెరికాలో ట్రాన్స్ లేషన్ అండ్ ఇంటర్ప్రెటేషన్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇవన్నీ ఆయనను ప్రధానికి వెన్నెముకగా మార్చాయి. రిపబ్లిక్ డే పరేడ్స్ నుంచి బ్రిక్స్ సమ్మిట్ వరకు... మోదీ వెనుక నీడలా ఉంటూ దేశ దౌత్యవిధానంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఒక భాషపై కమాండ్తో దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే స్థాయికి చేరాడాయన. ‘అయితే ఈ పని అంత సులువు కాదు. నేతలు మాట్లాడే సమయంలో వాటి గాంభీర్యం, లోతు తెలుసుకుని మనం అనువాదం చేయాల్సి వస్తుంది’ అంటారు సిద్ధార్థ్ బాబు.గ్లోబల్ కెరీర్కు భాష కీలకంమార్కులు, ర్యాంకుల పిచ్చిలో ఉన్న మన విద్యార్థులు, తల్లిదండ్రులు విదేశీ భాషలు నేర్చడం ఎంత ముఖ్యమో గ్రహించడం లేదు. గ్లోబలైజేషన్ పెరిగాక మాండరిన్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్... ఈ ఐదు భాషల్లో ఏదో ఒకటీ లేదా రెండు తెలిసిన వాళ్లకు ఇంటర్నేషనల్ కంపెనీలు, ఎంబసీలు, గ్లోబల్ ఆర్గనైజేషన్లు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. లక్షల్లో జీతాలు మాత్రమే కాదు, సిద్ధార్థ్ లాగా గ్లోబల్ స్టేజ్ మీద దేశ ప్రతినిధిగా నిలబడే అరుదైన గౌరవమూ దక్కుతుంది. -
లండన్లో తెలంగాణ వ్యక్తి చారిత్రాత్మక ఘనత!
లండన్కు సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాల్లో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) అవార్డును తెలంగాణకు చెందిన గణేశ్ కుప్పాల స్వీకరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గణేశ్ కుప్పాల ఉద్యోగరీత్యా లండన్లో స్థిరపడ్డారు. కాగా సెప్టెంబర్ 16న గణేష్ కుప్పాల ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్” గౌరవాన్ని అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా, చట్టప్రకారం అవసరమైన ప్రతిజ్ఞ చేసి, డామే సూసన్ కరోల్, కరోలిన్ లూసి సమక్షంలో ఆయనను Freedom of the Cityలో అధికారికంగా చేర్చారు. ఫ్రీమెన్ హక్కుల కొనుగోలు, వారి అధికారిక ప్రవేశాలకు సంబంధించిన I అక్షరంతో గుర్తించబడిన అధికారిక రిజిస్టర్ పుస్తకంలో, కింగ్ చార్లెస్ III పాలనలోని 6వ సంవత్సరంలో నమోదు చేయబడింది. లండన్ నగర చరిత్రలో ఎంతో విశిష్టమైన ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో కింగ్ చార్లెస్ III, క్వీన్ ఎలిజబెత్ II, ఫ్లోరెన్స్ నైటింగేల్, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తాజాగా ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా గణేష్ కుప్పాల నిలిచారు. అంతేకాదు తెలంగాణకు చెందిన తొలి వ్యక్తిగా లండన్లో అరుదైన గౌరవం పొందిన వ్యక్తిగా నిలిచారు ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి ఎంతో గర్వకారణం. గణేష్, ఒక గొప్ప గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, తెలంగాణ మరియు తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మక గుర్తింపును తీసుకువచ్చారు.ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ ఫ్రీడమ్ (Freedom of the City of London) గౌరవాన్ని అందుకున్న గణేష్ కుప్పాలను పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ ఎంపీ అభినందించారు. గణేశ్ను అభినందించిన వారిలో ఎంపీ సీమా మల్హోత్రా, ఎంపీ జస్ అథ్వాల్, ఎంపీ వెస్ స్ట్రీటింగ్, మాజీ యూకే ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు. ఇదీ చదవండి: వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ -
అంచులే కేంద్రంగా మారుతున్న కాలం
మోదీ శకంలో చిరకాలం నిలిచిపోయే గొప్ప విజయం ఏదైనా ఒక రహదారి, పథకం, సంస్కరణ లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కనిపించకపోవచ్చు. అంతకంటే లోతైన అంశంలో అది ఉంది. భారత ప్రధాన స్రవంతి విస్తరించటమే ఆ విజయం. నేను భారత రాష్ట్రపతిగా ఉన్న కాలంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఆయనను ప్రధానమంత్రిగా దగ్గరగా గమనించాను. ఆ అనుభవంతో పాటు ప్రజా జీవితంలో ఆయనతో నాకున్న అనుబంధం ఆధారంగా, ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. 2001 అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై, 2014 నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఎన్నికైన ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు నాయకత్వం వహించిన ప్రధాని మోదీ... ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సరళమైన, పరివర్తనాత్మక ఆలోచనను నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. ఆయన సమ్మిళిత రాజకీయాలకు నిర్వచనంగా మారిన మరో భావన దీనికి కేంద్రం: ‘జిస్కో కిసీ నే నహీ పూఛా, ఉస్కో మోదీ నే పూజా’. అంటే ఎవరూ పట్టించుకోని వారికి మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. చివరి అంచె వరకు అభివృద్ధిని తీసుకెళ్లటమే కాకుండా, ఆ అంచుల్లో ఉన్నవారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావటం మోదీ శకంలో అత్యంత ప్రభావవంతమైన మార్పు కావచ్చు.మారిన ఈశాన్య కథస్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలపాటు భారత అభివృద్ధి ఆలోచనలో ఒక కేంద్రం, దానికి వెలుపల పరిధి ఉన్నట్లు భావించేవారు. కొన్ని ఆకాంక్షలకు జాతీయ చర్చలో అసలు చోటే దక్కలేదు. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. దాని ప్రయోజనం పొందే అవకాశం చివరి వ్యక్తికి నిజంగా చేరిందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్పును ఈశాన్య ప్రాంతం కంటే మెరుగ్గా వివరించే ఉదాహరణలు చాలా తక్కువ. దశాబ్దాలపాటు ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశానికి దూరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంగానే ఎక్కువగా భావించారు. మోదీ నాయకత్వంలో అది భారత్ ముఖంగా, ఆగ్నేయాసియాకు ప్రవేశ ద్వారంగా క్రమంగా గుర్తింపు పొందింది. 2014 నవంబర్ నుంచి ప్రధాని మోదీ 83 సార్లకు పైగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో 12 ప్రధాన శాంతి ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు దశాబ్దంలో దాదాపు రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా, 2014–15 నుంచి 2025–26 మధ్య అభివృద్ధికి రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. బోగీబీల్ వంతెన, సెలా సొరంగం... కఠినమైన భౌగోళిక అడ్డంకులను అధిగమించాయి. బైరాబీ–సైరాంగ్ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాంకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో తొలిసారి నేరుగా రైలు అనుసంధానం లభించింది. స్వాతంత్య్రం తర్వాత నాగాలాండ్కు తొలి రైల్వే స్టేషన్ వచ్చింది. గువాహటి ఎయిమ్స్ ఈశాన్య ప్రాంతంలో తొలి ఎయిమ్స్గా నిలిచింది. అసోంలోని సెమీకండక్టర్ కేంద్రం పూర్తిగా భిన్నమైన ఆకాంక్షకు ప్రతీక. ఒకప్పుడు ప్రధానంగా భౌగోళికంగా మారుమూల ప్రాంతంగా భావించిన చోట భారత్లోని అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో ఒకటి ఆవిర్భవించగలదన్న ఆలోచనకు ఇది రూపమిస్తోంది.‘చివరి గ్రామాల’ నుంచి ‘తొలి గ్రామాల’ వరకుఇదే మార్పు భారత సరిహద్దుల వెంబడి కూడా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి మారుమూల జనావాసాలను సాధారణంగా దేశంలోని ‘చివరి గ్రామాలు’గా పేర్కొన్నారు. కానీ వైబ్రెంట్ విలేజెస్ కార్య క్రమం మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, అనుసంధానం, పర్యాటకం, జీవనోపాధి, అత్యవసర సేవల ద్వారా ఈ ఆలోచనకు సంస్థాగత రూపం ఇస్తోంది. ఆకాంక్షిత జిల్లాల కార్య క్రమం ద్వారా ఇదే సూత్రం దేశ అంతర్భాగానికీ విస్తరించింది. చరిత్రాత్మకంగా వెనుకబడిన 112 జిల్లాలు శాశ్వతంగా వెనుకంజ లోనే ఉంటాయని అంగీకరించకుండా... ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిలో పురోగతిని వేగవంతం చేసేందుకు స్పష్టమైన ఫలితాలు, పథకాల సమన్వయం, పోటీతత్వ అభివృద్ధిని ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. 2023లో 329 జిల్లాల్లోని 500 బ్లాకు లను ‘ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం’ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఈ విధానాన్ని మరింత లోతుగా తీసుకెళ్లారు. గత దశాబ్దంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ 243 శాతం పెరిగింది. మొత్తం 75 ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాలను పీఎం–జన్ మన్ పరిధిలోకి తీసుకొచ్చారు. గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలు, పీవీటీజీ ఆవాసాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సమన్వయ ప్రభుత్వ చర్యల ద్వారా పరిష్కరిస్తూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 59 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న కుటుంబాలను అందులో భాగం చేశాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు నేరుగా చేరుతోంది. లీకేజీలను అరికట్టడం ద్వారా రూ. 5.14 లక్షల కోట్లకు పైగా మొత్తం ఆదాకు ఇది దోహదం చేసింది. సౌభాగ్య పథకం గ్రామీణ విద్యుదీకరణలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఉజ్వల పథకం 10 కోట్లకు పైగా కుటుంబా లకు స్వచ్ఛ వంట ఇంధనాన్ని అందించింది. జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను విస్తరించింది.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంటే...మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న అంశాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ పరిష్కరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో పాల్గొనేందుకు ‘ముద్ర’ పథకం వీలు కల్పించింది. మొత్తం ముద్ర రుణాల్లో మహిళల వాటా 68 శాతం. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లోనూ మహిళలు 46 శాతం ఉన్నారు. గ్రామీణ పరివర్తనలో మహిళల ఆర్థిక సాధికారతకు లఖ్పతి దీదీ కార్యక్రమం కేంద్ర స్థానం కల్పిస్తోంది. విడివిడిగా చూస్తే ఈశాన్య ప్రాంతం, గిరిజన సమాజాలు, సరిహద్దు గ్రామాలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న పౌరులు వేర్వేరు సవాళ్లుగా కనిపిస్తారు. అన్నింటినీ కలిపి చూస్తే మోదీ ప్రభుత్వ పాలనా తత్వంలోని విస్తృత నిర్మాణం స్పష్టమవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న వేళ కేవలం పెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ లేదా మరింత సమర్థమైన ప్రభుత్వ వ్యవస్థను నిర్మించటమే ఆకాంక్ష కాదు. భారత అభివృద్ధి గాథలో ఒకప్పుడు అతి తక్కువగా కనిపించిన వారికి కూడా సమాన భాగస్వామ్యం ఉండేలా చూడటం లక్ష్యం.రామ్నాథ్ కోవింద్వ్యాసకర్త భారత మాజీ రాష్ట్రపతి -
వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
అమెరికాలోని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచింది. తాజా పెంపుతో వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి పెరిగినట్లయింది. మూడేళ్ల కాలంలో ఫెడ్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం టార్గెట్ 2 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. -
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో జేసన్ సంజయ్ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలు తన ఆల్టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు.నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు ‘‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్న జేసన్ సంజయ్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా అందర్నీ వినోదపరుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా లైకాప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ తెలుగు–తమిళ భాషల్లో నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్లో రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జేసన్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘నేను కాలేజీలో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ చదువుకున్నాను. సినిమా ప్రయాణంలో 24 క్రాఫ్ట్స్తో కలిసి పని చేశాను. ఈ ప్రయాణంలో మా నాన్న (విజయ్), నా కుటుంబం, అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన నచ్చడంతోనే ‘సిగ్మా’ కోసం ఆయనను హీరోగా ఎంపిక చేశాను. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘సిగ్మా’ నా తొలి తమిళ చిత్రం అయినప్పటికీ డబ్బింగ్ చెప్పాను’’ అని ఫరియా పేర్కొన్నారు. ‘‘సిగ్మా’తో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరో పెద్ద విజయం సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు మైత్రీ శశిధర్ రెడ్డి. -
కేంద్ర సెన్సార్ బోర్డులో సుప్రియ, ప్రీతి జింటా.. CBFCలో కీలక మార్పులు
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో చోటు దక్కింది. CBFCని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ప్రకటించింది.ఛైర్మన్గా శశి శేఖర్ వేంపటి కొనసాగనుండగా, సుప్రియతో పాటు బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, రిక్కీ కేజ్ తదితర సినీ, కళారంగ ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. -
జీబ్రా క్రాసింగ్ ఉపయోగించకుంటే పదివేలు జరిమానా!
రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అబుదాబి పోలీసులు వాహదారులకు, పాదాచారులకు హెచ్చరించారు. రహదారి భద్రతను నిర్ధారించే చర్యల్లో భాగంగా, సోషల్ మీడియాలో పోలీసులు అవగాహన సందేశాన్ని విడుదల చేశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో ఉండే జీబ్రా క్రాసింగ్లను పాదాచారులను ఉపయోగించకుంటే వారికి ఇకనుంచి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించని లేదా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లు దాటే పాదచారులకు 400 దిర్హమ్ల(భారత కరెన్సీలో రూ. 10వేలు) జరిమానా విధించబడుతుంది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టి, సురక్షితమైన వాటిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్లోని అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.రోడ్లపై నడిచే పాదచారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సిగ్నళ్లు కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాదాచారులను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ.. నిర్దేశించిన క్రాస్వాక్లు, వంతెనలు, సొరంగాలను ఉపయోగించాలి. ముఖ్యంగా పాదాచారులు ట్రాఫిక్ లైట్ సంకేతాలను అనుసరించండి.#فيديو | دعت #شرطة_أبوظبي السائقين والمشاة على أهمية الالتزام بقواعد السلامة المرورية، محذرة من مخاطر عبور الطرق من الأماكن غير المخصصة لما قد يسببه من حوادث دهس، وناشدت السائقين إلى توخي الحيطة والانتباه للمشاة وخفض السرعة بالقرب من مناطق العبور، فيما حثّت المشاة على استخدام… pic.twitter.com/B4Dalb7Fae— شرطة أبوظبي (@ADPoliceHQ) September 16, 2026 -
అమెరికా పౌరులే టార్గెట్.. కాల్సెంటర్లపై ఈడీ మెరుపు దాడులు
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)- 2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సెప్టెంబర్ 15న పటియాలా, పుణె, చండీగఢ్లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల ముఠా గుట్టు రట్టయింది.సోదాల సమయంలో ఈడీ అధికారులు పటియాలాలో రెండు, పుణెలో ఒకటి చొప్పున మొత్తం మూడు ప్రత్యక్ష (లైవ్) కాల్ సెంటర్లను గుర్తించారు. అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఈ సెంటర్లలో సుమారు 220 మంది ఉద్యోగులు విధుల్లో ఉండటం గమనార్హం. వర్క్ స్టేషన్లు, క్యూబికల్స్, కంప్యూటర్లు, హెడ్సెట్లు, వీఓఐపీ ఆధారిత సిస్టమ్లతో ఇవి నడుస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తింపు, వారికి అప్పగించిన బాధ్యతలు, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాన సూత్రధారుల వివరాలను అధికారులు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.పటియాలా, పుణె కేంద్రాలుగా సాగుతున్న ఈ నకిలీ కాల్ సెంటర్ల ప్రతినిధులు అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, వివిధ తప్పుడు కారణాలు చెబుతూ భయభ్రాంతులకు గురిచేసేవారు. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులను చెల్లించేలా ప్రేరేపించి మోసాలకు పాల్పడేవారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలా అమెరికన్ డాలర్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన నిధులను భారతీయ కరెన్సీగా మార్చే ప్రక్రియను ఒక ముఠా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.చండీగఢ్లోని ఒక నివాస ప్రాంగణంలో జరిగిన సోదాల్లో ఈ మొత్తం దందాకు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థ బయటపడింది. పటియాలాలోని కాల్ సెంటర్ల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, అమెరికా నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని స్థానిక కరెన్సీలోకి మార్చే ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ప్రధాన సూత్రధారి ఈ చండీగఢ్ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ నిధుల పంపిణీకి సంబంధించిన అనేక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి.ఇదీ చదవండి: మోదీ ‘శ్రీకృష్ణుడు’, నేను సుధామ.. ప్రధాని ఫ్రెండ్ భావోద్వేగ లేఖ -
జపాన్లో మంచు ఫ్యామిలీ సందడి.. అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో..!
జపాన్లో మంచువారి ఫ్యామిలీ చిల్..టాలీవుడ్ నటి అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్..వినాయక నిమజ్జనంలో నటి బిందు మాధవి..శారీలో హెబ్బా పటేల్ అందాలు..గ్రీన్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ సావిత్రి.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
కోలాహలంగా అంబానీ ఇంట్లో గణపతి పూజ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ నివాసమైన యాంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా గణనాథుడిని కొలువుదీర్చి, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.యాంటిలియాలో ఆధ్యాత్మిక శోభగణపతి బాప్పా రాకను పురస్కరించుకుని యాంటిలియా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. అంబానీ కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులతో పాటు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. View this post on Instagram A post shared by Peepingmoonofficial (@peepingmoonofficial) -
జూనియర్ ఎన్టీఆర్ దేవర బ్యూటీ.. ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా దేవర-2 కూడా ఉందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.దేవర భార్యగా శృతి..అయితే దేవరలో ఎన్టీఆర్ భార్యగా మెప్పించిన బ్యూటీ శృతి మరాఠే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. ఇందులో కేవలం నటనతో మాత్రమే కాదు.. తన గ్లామర్తో సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా శృతి పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇప్పుడు ఉన్నట్లుండి శృతి మరాఠే నెట్టింట వైరల్గా మారింది. ట్విటర్లో ఆమె పేరు ఏకంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. అసలు శృతి ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుందో మనం కూడా తెలుసుకుందాం.స్పెషల్ అట్రాక్షన్గా శృతి..దేవరలో ఎన్టీఆర్ భార్యగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో సందడి చేసింది. ముంబయిలో గణేశ్ ఆగమన్ సందర్భంగా హీరోయిన్ శృతి మరాఠే బ్యాండ్ వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇందులో శృతి డోలు వాయిస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆమెను చూసిన నెటిజన్స్ దేవరలో హీరోయిన్గా శృతినే తీసుకోవాల్సిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. వినాయక చవితి వేడుకల్లో #ShrutiMarathe#Devara ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్! ✨#NTR #JrNTR pic.twitter.com/tEkWjgnWe2— Bollam Suresh (@bollamsuresh11) September 15, 2026 -
గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే.. కవిత
సాక్షి,హైదరాబాద్ : ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. అసెంబ్లీలో 22ఏపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టుగా ప్రస్తావించిన అంశంపై ‘‘ఎక్స్’’ వేదికగా కవిత స్పందించారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం ఎవరెవరి పేర్లు ప్రస్తావించి వారికి ఎక్కువ భూములు ఉన్నట్టుగా చెప్పారో వారందరిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.సీఎం అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు చెప్పారో వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. అసెంబ్లీలో ఈ రోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమె ఎక్స్ లో "సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ గారి ఫాం హౌస్ లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి" అని డిమాండ్ చేశారు.తాను ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా గుంపు మేస్త్రీ - గుంటనక్క కలిసే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి తనకు గజం భూమి ఎక్కువగా ఉన్నా.. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూమి కన్నా గజం అదనంగా ఉన్నట్టు తేలినా ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని కవిత కుండబద్దలు కొట్టారు. -
మోదీ ‘శ్రీకృష్ణుడు’, నేను సుధామ.. ప్రధాని ఫ్రెండ్ భావోద్వేగ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యమిత్రుడు శామళ్దాస్ మోదీ ప్రత్యేక లేఖ రాశారు. గుజరాత్లోని మెహసాణా జిల్లా వడనగర్కు చెందిన శామళ్దాస్.. చిన్ననాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ మోదీని ‘శ్రీకృష్ణుడు’గా, తనను ‘సుదాముడు’గా పేర్కొన్నారు. ప్రధాని జన్మదినం సెప్టెంబర్ 17న జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ రాశారు.చిన్ననాటి నుంచి కొనసాగుతున్న తమ స్నేహాన్ని గుర్తుచేసుకున్న శామళ్దాస్.. నరేంద్ర మోదీ జీవితంలో ఏది సాధించాలని నిర్ణయించుకున్నా దాన్ని పూర్తి చేసి చూపించారని లేఖలో పేర్కొన్నారు. తన మిత్రుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని తెలిపారు. మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం, వడనగర్ అభివృద్ధి, ఆ నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకు జరిగిన పనులను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు.‘మీరు శ్రీకృష్ణుడు.. నేను మీ సుదాముడిని’లేఖలో శామళ్దాస్ ప్రత్యేకంగా తమ బాల్య స్నేహాన్ని ప్రస్తావించారు. వడనగర్లో కలిసి గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ.. నరేంద్ర మోదీని తన ‘శ్రీకృష్ణుడు’గా, తనను ‘సుదాముడు’గా అభివర్ణించారు. కాలం మారినా చిన్ననాటి స్నేహం తనకు ఇప్పటికీ అంతే ప్రత్యేకమని పేర్కొన్నారు.‘ఏది అనుకుంటే అది పూర్తి చేస్తారు’మోదీ పని తీరును కూడా శామళ్దాస్ ప్రశంసించారు. ఆయన ఏదైనా సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసి చూపిస్తారని లేఖలో రాశారు. 25 ఏళ్ల ప్రజాజీవితాన్ని ప్రస్తావిస్తూ మోదీని ‘నూతన భారత శిల్పి’గా అభివర్ణించారు. ఒకప్పుడు తనతో కలిసి ఉన్న బాల్యమిత్రుడు ఇప్పుడు దేశ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొంటూ.. ఆయన ప్రయాణాన్ని చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.వడనగర్ అభివృద్ధితో పాటు నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేయడంపై కూడా లేఖలో ప్రస్తావన ఉంది. వడనగర్ గుజరాత్లోని మెహసాణా జిల్లాలో ఉంది. మోదీ బాల్యం అక్కడే గడిచింది.భారత్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కూడా శామళ్దాస్ తన లేఖలో పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భారత్, నరేంద్ర మోదీ గురించి చర్చ జరుగుతోందని రాశారు. చివరగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. -
హనుమాన్ అంశ్ తెలుగు వర్షన్ వాయిదా.. అసలు కారణమిదే
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియుల్లో ఈ మూవీ రిలీజ్పై సందిగ్ధత నెలకొంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తెలుగు రిలీజ్ ఈ నెల 18న కావడం లేదని ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. అందుకు గల కారణాన్ని సైతం వెల్లడించింది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాలేదని తెలిపింది. అందువల్లే హనుమాన్ అంశ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.కాగా.. త్రివిక్రమ్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఈ డీల్ నుంచి తప్పుకోవడం వల్లే విడుదల ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా డబ్బింగ్ పనుల వల్లే రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. దీంతో తెలుగు రిలీజ్పై ఉన్న సస్పెన్స్కు తెరపడింది. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. HANUMAN ANSH TELUGU Version Postponed Due To A Delay In Dubbing Works. A New Release Date Will Be Announced Soon.#HanumanAnsh North America By @PrathyangiraUS@Swambhumedia @filmervishal #ShobhinawSatyaa #VihaanShedge @chandananand #PurnimaTiwari @AKRastogi #GulshanPandey… pic.twitter.com/jESSRArxtP— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 16, 2026 -
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అనూహ్యమైన మార్పు వైపు ప్రయాణిస్తోంది. బంగారానికి ఉన్న డిమాండ్ను, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ టి.కియోసాకి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం పరుగు ఇంకా పూర్తికాలేదని, అసలు ఘట్టం ఇప్పుడే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేస్తున్నారు.మానిటరీ పారిటీ ఫార్ములా విశ్లేషణఆర్థిక నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘మానిటరీ పారిటీ ఫార్ములా’ను వివరిస్తూ.. బంగారం భవిష్యత్తు ధరపై అంచనాలను విశ్లేషించారు. తాను చెప్పిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఇదివరకెన్నడూ లేని విధంగా తమ మునుపటి రికార్డు కంటే మూడింతల వేగంతో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త పసిడి గనులు లేదా నిల్వలు కనుగొనలేదు. ఒకవైపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే సరఫరా మాత్రం స్తంభించిపోయింది.ప్రపంచ ద్రవ్య సరఫరా, వివిధ దేశాల వద్ద ఉన్న భౌతిక పసిడి నిల్వలను లెక్కించి అందులో కనీసం 40 శాతం ద్రవ్యానికి బంగారం మద్దతు ఇస్తే.. గణాంకాల ప్రకారం ఔన్స్(సుమారు 30 గ్రాములు) బంగారం అసలు విలువ రూ.25,89,000 (27,000 డాలర్లు)కు చేరాల్సి ఉంటుందని ఈ ఫార్ములా తేల్చిచెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ధరల సవరణ కేవలం ప్రారంభ దశలోనే ఉందని, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమేనని జిమ్ రిక్కార్డ్స్ పేర్కొన్నారు.పెట్టుబడిదారుల అపోహలు.. అవకాశాలుసాధారణ పెట్టుబడిదారులు బంగారం ధరలు తగ్గుతాయని వేచి చూడటం పెద్ద పొరపాటని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2010లో టెస్లా షేర్లు లేదా 2013లో బిట్కాయిన్ ధరలు తగ్గుతాయని వేచి చూసిన వారితో ప్రస్తుత పసిడి ఇన్వెస్టర్లను పోలుస్తున్నారు. వేచి చూసే ధోరణితో చివరకు మిగిలిన దాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
కెప్టెన్గా రిషబ్ పంత్ ఎంపిక
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇవాళ వెస్టిండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటనతో పాటు ఇరానీ కప్ 2026 కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా రిషబ్ పంత్ను ఎంపిక చేసింది. పంత్కు విండీస్తో వన్డే, టీ20 సిరీస్లకు ఎంపిక చేసిన జట్లలో చోటు దక్కలేదు.రంజీ ట్రోఫీ 2025-26 విజేత జమ్మూ కశ్మీర్తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్లో తలపడనుంది. ఈ వన్-ఆఫ్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది.ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), సనత్ సాంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్ (వైస్ కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుతార్, సరాన్ష్ జైన్, ఆకాశ్ దీప్ (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి), ముఖేష్ కుమార్, ముకేష్ చౌదరి, ఆర్యన్ జుయల్ (వికెట్కీపర్), ఆర్యన్ పాండే, అనుకూల్ రాయ్, ఆయుష్ దోసెజాఇదీ చదవండి: విండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటన.. రోహిత్, కోహ్లి కొనసాగింపు -
రేపు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 17, 2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత కరువు పరిస్థితులు, తీవ్రమైన నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షించనున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని స్థానిక పరిణామాలు, సమస్యలపై సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అండగా ఉండేలా పార్టీ కార్యక్రమాలపై ఆయన నాయకులతో మాట్లాడనున్నారు. -
విండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటన.. రోహిత్, కోహ్లి కొనసాగింపు
ఈ నెలాఖరులో వెస్టిండీస్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్, టీ20 జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కొనసాగారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ వన్డే, టీ20 జట్లకు ఉప నాయకులుగా వ్యవహరించనున్నారు. స్టార్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులో కొనసాగగా.. రిషబ్ పంత్కు అవకాశం దక్కలేదు. ఆకిబ్ నబీ, నమన్ ధిర్కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం దక్కింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెండు జట్లలో అతడికి చోటు దక్కలేదు.వన్డే సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధిర్టీ20 సిరీస్కు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), సంజు శాంసన్ (వికెట్కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: ఆదివారం, సెప్టెంబర్ 27 - మధ్యాహ్నం 2:00 గంటలకు - గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంరెండో వన్డే: బుధవారం, సెప్టెంబర్ 30 - మధ్యాహ్నం 2:00 గంటలకు - బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతిమూడో వన్డే: శనివారం, అక్టోబర్ 3 - మధ్యాహ్నం 2:00 గంటలకు - మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, న్యూ చండీగఢ్టీ20 సిరీస్ షెడ్యూల్తొలిటీ20: మంగళవారం, అక్టోబర్ 6 - సాయంత్రం 7:00 గంటలకు - భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నోరెండో టీ20: శుక్రవారం, అక్టోబర్ 9 - సాయంత్రం 7:00 గంటలకు - జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీమూడో టీ20: ఆదివారం, అక్టోబర్ 11 - సాయంత్రం 7:00 గంటలకు - హోల్కర్ స్టేడియం, ఇండోర్నాలుగో టీ20: బుధవారం, అక్టోబర్ 14 - సాయంత్రం 7:00 గంటలకు - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ఐదో టీ20: శనివారం, అక్టోబర్ 17 - సాయంత్రం 7:00 గంటలకు - ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరుఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
తండ్రి ఆస్తిలో వాటా ఎవరికి? కూతురికా? కొడుక్కా?
భారతీయ కుటుంబాల్లో తండ్రికి చెందిన ఆస్తిలో కుమారుడు లేదా కుమార్తెకు చట్టబద్ధంగా ఎంతవరకు వాటా దక్కుతుందనే అంశంపై తరచూ సందేహాలు తలెత్తుతుంటాయి. కుటుంబ ఆస్తి వ్యవహారాల్లో వారసత్వ చట్టాలపై సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, తండ్రి ఆస్తిపై పిల్లల హక్కులు అనేది పూర్తిగా ఆ ఆస్తి స్వభావంపైనే ఆధారపడి ఉంటాయి.పిత్రార్జిత ఆస్తినాలుగు తరాలుగా విభజించబడకుండా వస్తున్న పిత్రార్జిత ఆస్తి (యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ) విషయానికి వస్తే సంతానానికి పుట్టుకతోనే అందులో హక్కు లభిస్తుంది. 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం, పిత్రార్జిత ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా సమానమైన హక్కులను కల్పించారు. తండ్రి జీవించి ఉన్న సమయంలోనే పిల్లలు ఈ ఆస్తిలో తమ చట్టబద్ధమైన వాటాను కోరే అధికారం కూడా కలిగి ఉంటారు.సొంత సంపాదనతో ఆస్తి ఉంటే..మరోవైపు, తండ్రి తన సొంత సంపాదనతో కొనుగోలు చేసిన స్వార్జిత ఆస్తి (సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ) విషయంలో నిబంధనలు పూర్తిగా వేరుగా ఉంటాయి. తండ్రి జీవించి ఉన్నంతవరకు ఈ ఆస్తిపై ఆయనకే సర్వాధికారాలు ఉంటాయి. తన ఇష్టానుసారం ఈ ఆస్తిని ఎవరికైనా విక్రయించడానికి, బహుమతిగా ఇవ్వడానికి లేదా విల్లు ద్వారా రాసి ఇవ్వడానికి ఆయనకు పూర్తి స్వతంత్రత ఉంటుంది. తండ్రి జీవించి ఉండగా పిల్లలు ఈ ఆస్తిలో వాటా కావాలని న్యాయపరంగా కోరలేరు.తండ్రి మరణిస్తే..అయితే, తండ్రి ఎటువంటి విల్లు రాయకుండా మరణిస్తే ఆయన స్వార్జిత ఆస్తి క్లాస్-1 చట్టబద్ధ వారసులైన భార్య, కుమారులు, కుమార్తెలకు సమానంగా పంపిణీ అవుతుంది. కుటుంబాల్లో ఆస్తి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి ఆస్తి స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా చట్టబద్ధమైన విల్లు లేదా విభజన పత్రాలను సిద్ధం చేసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
ఎల్నినో ప్రభావం.. తగ్గుతున్న టీ ఉత్పత్తి
తిరువనంతపురం: కేరళలో వర్షపాతం తగ్గడంతో టీ పరిశ్రమపై ప్రభావం పడుతోంది. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, కరవును తలపించే పరిస్థితులు కొనసాగితే టీ దిగుబడులు మరింత తగ్గే అవకాశం ఉందని తోటల నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్ర టీ రంగంలో ఉత్పత్తి ఇప్పటికే క్షీణించింది.దక్షిణ భారత యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ (యూపీఏఎస్ఐ) టీ పరిశోధన ఫౌండేషన్ సేకరించిన గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు కేరళలో టీ ఉత్పత్తి 2 శాతం తగ్గింది. 2025 ఇదే కాలంలో 3.1274 కోట్ల కిలోల టీ ఉత్పత్తి కాగా.. ఈ ఏడాది 3.0624 కోట్ల కిలోలకు పడిపోయింది.వర్షాభావ పరిస్థితులతో అత్యధికంగా ప్రభావితమైన జిల్లాగా వయనాడ్ నిలిచింది. సెప్టెంబర్ మధ్య వరకు ఆ జిల్లాలో సాధారణం కంటే 53 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జనవరి-ఆగస్టు మధ్య టీ ఉత్పత్తి 8.11 శాతం తగ్గింది. హెక్టారుకు సగటు దిగుబడి 2025లో 1,233 కిలోలు ఉండగా.. 2026లో 1,133 కిలోలకు తగ్గింది. అంటే హెక్టారుకు 100 కిలోల మేర తగ్గుదల నమోదైంది.ఇతర ప్రాంతాల్లోనూ ఇంతే.. మున్నార్లో మాత్రం హెక్టారుకు సగటు దిగుబడి స్వల్పంగా పెరిగింది. 2025లో 1,558 కిలోలు ఉండగా.. ఈ ఏడాది 1,578 కిలోలకు చేరింది. పీరుమేడ్ కొండల్లో దిగుబడి 1,091 కిలోల నుంచి 1,069 కిలోలకు తగ్గింది. సెంట్రల్ ట్రావన్కోర్లో సగటు ఉత్పత్తి 3.8 శాతం తగ్గి, హెక్టారుకు 1,008 కిలోల నుంచి 970 కిలోలకు పడిపోయింది.వాగమన్లోని పెన్హర్స్ట్ ఎస్టేట్ మాత్రం ఈ ధోరణికి భిన్నంగా 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎస్టేట్ మేనేజర్ జోషిబా జోసెఫ్ ప్రకారం.. హెక్టారుకు ఉత్పాదకత 2025లో 2,149 కిలోల నుంచి 2026లో 2,243 కిలోలకు పెరిగింది. అంటే 94 కిలోల పెరుగుదల నమోదైంది.టీ రంగంపై ఆధారపడే వేలాది మంది ప్రజల ఆదాయంపై వాతావరణ పరిస్థితుల ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. “వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా టీ రంగం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉన్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉత్పత్తి మరింత తగ్గితే, ఎస్టేట్ల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుంది” అని స్థానిక పరిశ్రమ వర్గానికి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు.ఇదే సమయంలో తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలోనూ కరవు పరిస్థితుల కారణంగా దిగుబడి 11.8 శాతం తగ్గినట్లు యూపీఏఎస్ఐ నివేదిక పేర్కొంది. అక్కడ హెక్టారుకు సగటు ఉత్పత్తి 2023లో 2,315 కిలోలు ఉండగా.. 2025లో 2,042 కిలోలకు తగ్గింది. కేరళలో తక్కువ వర్షపాతం కొనసాగుతుందా, టీ దిగుబడులపై దాని ప్రభావం మరింత పెరుగుతుందా అనేది రానున్న కాలంలో కీలకంగా మారనుంది. -
క్రెడిట్ కార్డ్ చోరీకి గురైందా? నష్టానికి బాధ్యులెవరు?
షాపింగ్, చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్ వినియోగం ఎంతగా పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు, కార్డుల దుర్వినియోగం సవాళ్లుగా మారుతున్నాయి. క్రెడిట్ కార్డ్ పోయినా లేదా చోరీకి గురై దాని ద్వారా మోసగాళ్లు లావాదేవీలు నిర్వహిస్తే ఆ ఆర్థిక నష్టాన్ని ఎవరు భరించాలి? వినియోగదారుడికి ఆ సొమ్ము తిరిగి వస్తుందా? దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది.సమయమే ప్రధానంఆర్బీఐ నిబంధనల ప్రకారం, అనధికారిక లావాదేవీ జరిగినప్పుడు మీరు ఎంత వేగంగా నివేదిస్తారనే దానిపైనే మీ ఆర్థిక రక్షణ ఆధారపడి ఉంటుంది. సమాచారం అందుకున్న మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే వినియోగదారుడిపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. మొత్తం నష్టాన్ని బ్యాంకే భరిస్తుంది. బ్యాంకు లోపం లేదా థర్డ్ పార్టీ వ్యవస్థల్లో భద్రతా వైఫల్యం వల్ల జరిగే మోసాలకు కూడా ఇది వర్తిస్తుంది.ఫిర్యాదు చేయడంలో నాలుగు నుంచి 7 పనిదినాల ఆలస్యమైతే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు (కార్డ్ పరిమితి ఆధారంగా) వినియోగదారుడే భరించాల్సి రావచ్చు.ఏడు రోజులు దాటిన తర్వాత ఫిర్యాదు చేస్తే సదరు బ్యాంకు బోర్డు ఆమోదించిన నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుంది. అలాగే, పిన్ లేదా ఓటీపీ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మోసం జరిగితే ఫిర్యాదు చేసేవరకు జరిగిన నష్టానికి కార్డ్హోల్డరే పూర్తి బాధ్యత వహించాలి.10 రోజుల్లో డబ్బులు వెనక్కివినియోగదారుడు అనధికార లావాదేవీపై అధికారికంగా ఫిర్యాదు చేసిన పది పనిదినాల్లోపు సదరు మొత్తాన్ని (ప్రొవిజనల్ క్రెడిట్) తాత్కాలికంగా ఖాతాలో జమ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.వెంటనే చేయాల్సిన పనులుకార్డ్ పోయినట్లు గుర్తించిన వెంటనే బ్యాంక్ యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా కార్డ్ను బ్లాక్ చేయాలి. ఫిర్యాదు సమయం సక్రమంగా నమోదయ్యేలా ఈమెయిల్ లేదా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చి ట్రాకింగ్ నంబర్ను భద్రపరుచుకోవాలి. సమయస్ఫూర్తితో స్పందిస్తేనే క్రెడిట్ కార్డ్ మోసాల వల్ల కలిగే ఆర్థిక నష్టం నుంచి కాపాడుకోవచ్చు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
ఇరాన్పై అమెరికా యుద్ధం.. పాకిస్థాన్ ప్రధాని సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అల్లకల్లోలం దెబ్బకు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రధాని షెహబాద్ షరీష్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. చమురు వినియోగాన్ని, ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా ‘స్మార్ట్ లాక్డౌన్’,పొదుపు చర్యల ప్రణాళికను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సౌదీ అరేబియాలోని ఇంధన స్థావరాలపై దాడులు జరగడం, గల్ఫ్ దేశాలలోని కీలక జలమార్గాల్లో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావంతో పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 4.10 పెంచగా, హై స్పీడ్ డీజిల్ ధరను రూ. 6.41 పెంచింది. దీంతో పాక్లో పెట్రోల్ ధర రూ. 384.34కి, డీజిల్ ధర రూ. 415.83కి చేరింది. ఈ భారీ భారాన్ని పూర్తిగా భరించే స్థితిలో ఆర్థిక వ్యవస్థ లేకపోవడంతో, వినియోగాన్ని తగ్గించుకోవడమే ఏకైక మార్గంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ సర్కార్ భావిస్తోంది.ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కీలక ప్రతిపాదనలు ఇంధన వినియోగానికి కళ్లెం వేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించి పలు కీలక ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.గత సంక్షోభాల సమయంలో అమలు చేసినట్లుగానే, మార్కెట్లను త్వరగా మూసివేయడం,పని దినాలను తగ్గించడం (ఉదాహరణకు 4 రోజుల పని విధానం) వంటి నిబంధనలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పొదుపు చర్యలను కఠినతరం చేయనున్నారు.ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ప్రధాని ‘ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్’ కింద ద్విచక్ర వాహనదారులకు, కార్ల యజమానులకు కొంతమేర రాయితీలు ఇస్తున్నప్పటికీ, అవి సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా తలెత్తిన ఈ ఆయిల్ క్రైసిస్ను తట్టుకునేందుకు పాకిస్థాన్ కేవలం ధరల పెంపుకే పరిమితం కాకుండా, డిమాండ్ను నియంత్రించేలా ‘స్మార్ట్ లాక్డౌన్’మార్గాన్ని ఎంచుకోవడం ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. ఈ చర్యలు గనుక అమల్లోకి వస్తే, అక్కడి వ్యాపార రంగంపై మరోసారి తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. -
తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా వస్తోన్న లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ ది వాన్. ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది వాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ గ్రామ సమీపంలోని ఫారెస్ట్లో ఈ కథను రూపొందించారు. ట్రైలర్లో అడవిలోని సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు. -
వినాయక నిమజ్జనం కోసం చెరువులో దిగి ఆరుగురు విద్యార్థుల మృతి
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం చెరువులో దిగి, ఈత రాకపోవడంతో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పెద కాంజర్ల గ్రామంలోని నేరేడు చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పండుగ వాతావరణంలో జరిగిన ఈ దుర్ఘటన ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఆ చిన్నారులు అందరూ శిరీష ట్రస్ట్లో చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది. అయితే పద్నాలుగేళ్ల లోపు పిల్లలు నిమజ్జనం కోసం నీళ్లలో దిగుతుంటే అటు పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎందుకు ఆపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు నీళ్లలో దిగి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అక్కడున్న వారు ఆరోపిస్తున్నారు. ఈ తరహా ప్రమాదాల నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: పెద్దల నిరంతర పర్యవేక్షణ: పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ఒడ్డుకు లేదా నిమజ్జన ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లనివ్వకూడదు.నీటి లోతుపై అప్రమత్తత: నీటి ఉధృతి లేదా లోతు తెలియని చెరువులు, కాలువల్లోకి పిల్లలు దిగకుండా కట్టడి చేయాలి.స్థానిక యంత్రాంగం ముందస్తు చర్యలు: ప్రమాదకరమైన ఘాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, ఈతగాళ్లను (లైఫ్గార్డ్స్) అందుబాటులో ఉంచాలి.సురక్షిత ప్రాంతాల ఎంపిక: అధికారులు అనుమతించిన, క్రమబద్ధీకరించిన సురక్షితమైన నిమజ్జన ప్రాంతాలలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలి. -
గణేశుడిలాగే.. ఓ ప్రజాపతికి మేక తలను అమర్చిన కథ తెలుసా?
అందరూ వినాయక చవితి జోష్లో ఉన్నారు కదా..? వినాయకుడికి గజముఖం వచ్చిన కథ మీ అందరికీ తెలిసిందే..! అయితే.. వినాయకుడికి ఏనుగు తలను అతికించడానికి ముందే.. ఇలాంటి తల మార్పిడి గురించి శివ మహాపురాణంలో ఉందనే విషయం మీకు తెలుసా..? ఒక్క శివపురాణమే కాదు.. వాయు పురాణం, పద్మ పురాణంతోపాటు.. రుద్ర సంహితలో కూడా ఈ వృత్తాంతం ఉంది. దక్ష ప్రజాపతి గురించి మీకు తెలియంది కాదు. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. ప్రజాపతి కూడా. దక్ష యజ్ఞం సమయంలో వీరభద్రుడు తన గణాలతో కలిసి వెళ్లి, దక్షుడిపై విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో.. దక్షుడి శిరస్సును ఖండించాడు. ఆ దెబ్బకు దక్షుడి తల యజ్ఞగుండంలో పడి భస్మమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి కంటే ముందే.. మన భారతావనిలో మరో తలమార్పిడి శస్త్రచికిత్స ఎలా జరిగింది? ఈ కింది వీడియోలో చూడండి.. -
ఇక వాటిపై ఫోకస్: తుకారాం ముండే
ముంబై: నిన్న, మొన్నటి వరకు వివిధ హోటళ్లు, తినుబండరాలు, ఆహార పదార్ధాలు, స్వీట్లు, పాలు, పాలతో తయారయ్యే ఉత్పత్తులపై దాడులుచేసిన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్డీఏ) శాఖ అధికారులు ఇప్పుడు తమ పంథా మార్చుకున్నారు. ప్రజల ఆధ్వర్యంలో జరిగే వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. ఈమేరకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు, మహాప్రసాదాల పంపిణీ, లంగర్లు, పెళ్లి విందులపై నిఘా వేయనున్నట్లు మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే (Tukaram Mundhe) తెలిపారు.ఇకపై అన్ని కులాల, మతాల వారు నిర్వహించే సామూహిక అన్నదానం, ఇఫ్తార్ విందులు, లంగర్లు, వివాహ భోజనాలకు సంబంధించి ఏడు రోజుల ముందే ఎఫ్డీఏ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కఠినచర్యలు తప్పవని ముండే హెచ్చరించారు. తుకారం ముండే ఎఫ్డీఏ కమీషనర్గా పదవీ బాధ్యతలు స్వీరించిన తరువాత కల్తీలపై దాడులు మరింత ఉధృతం చేశారు. ముంబైలో పేరుగాంచిన హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, బ్రాండెడ్ కంపెనీలపై దాడిచేసి వాటిని సీజ్ చేశారు. యజమానులపై చర్యలు తీసుకోవడమేగాకుండా లైసెన్స్, పర్మిట్లు రద్దు చేశారు. దీంతో అక్రమ, కల్తీ వ్యాపారుల్లో దడ మొదలైంది. మఫ్టీలో హాజరు..రహస్యంగా తనిఖీలు పండుగలు, ఉత్సవాల సమయంలో వివిధ కుల, మతాలవారు తమ నివాస సొసైటీలలో, టవర్ల, చాల్స్, భవనాల ఆవరణలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. దీంతోపాటు ముస్లిం సామాజిక వర్గంలో ఇఫ్తార్ విందులు, సిక్కులకు లంగర్లు, పెళ్లి భోజనాలు కూడా సాధారణం. త్వరలో గణేశోత్సవాలు, ఆ తరువాత నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళి, క్రిస్మస్ తదితర ప్రధాన పండుగల నేపథ్యంలో వివిధ సంస్దలు అన్నదాన, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ముందస్తు సమాచారం మేరకు ఎఫ్డీఏ అధికారులు మఫ్టీలో ఆయా కార్యక్రమాలకు హాజరై రహస్యంగా తనిఖీలు నిర్వహిస్తారు. ఎఫ్డీఏ నియమాలను సరిగా అమలుచేస్తున్నారా..? లేదా..? అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తారని ముండే స్పష్టం చేశారు. గోదాములు, ఫ్యాక్టరీలపై నిఘా.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే అధికారం ఎవరికి లేదు. ఆహర పదార్ధాలలో ఎలాంటి కల్తీ ఉండకూడదు. ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం లభించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిబంధనకు రూపకల్పన చేసినట్లు తుకారాం ముండే తెలిపారు. ఇందులో భాగంగా గోదాముల్లో నిల్వచేసిన సరుకులు, వాటిని ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలపై కూడా నిఘా వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే రోడ్లు, ఫుట్పాత్లపై ఆహార పదార్ధాలు విక్రయించే చిన్న క్యాంటీన్లు, తోపుడు బళ్లను కూడా తనిఖీ చేస్తారు. పాలు, పాలతో తయారయ్యే పనీర్, ఇతర ఉత్పత్తులు, ఐస్, మాంసాహారం, తాగు నీరు, స్వీట్లు, వంట నూనె, బేకరీ పదార్ధాల్లో కల్తీని గుర్తిస్తే సంబంధిత నిర్వాహకులు లేదా క్యాటరింగ్ యజమానులపై చర్యలు తప్పవని ముండే హెచ్చరించారు. బడా వ్యాపారులతోపాటు సార్వజనిక కార్యక్రమాల నిర్వాహకులను కూడా వదిలీ పెట్టేది లేదని తేల్చిచెప్పారు.ఇదీ చదవండి: మరో బాంబు పేల్చిన తుకారం ముండే గ్రేడ్ల వారీగా ఉత్సవాల విభజన ఇలా.. గ్రేడ్ 1–గణేశోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళీ, ఈడ్, క్రిస్మస్, నూతన సంవత్సరం. గ్రేడ్ 2– మకర సంక్రాంతి, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, ఆషాడ ఏకాదశి శ్రావణ మాసం, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్టి ఉత్సవాలు, కోజాగిరి పూర్ణిమ, గురునానక్ జయంతి, గ్రేడ్ 3–స్ధానిక జాతరలు, సంతలు, పల్లకీ పాద యాత్రలు, ఉర్సులు -
మహ్మద్ నబీ అరుదైన రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2500 పరుగులు, 100 ప్లస్ వికెట్లు తీసిన నాలుగో ఆల్రౌండర్గా నిలిచాడు. భారత్తో నిన్న జరిగిన రెండో టీ20లో నబీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన నబీ, 2500 పరుగులు పూర్తి చేశాడు.నబీకి (2501, 111) ముందు బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు, 149 వికెట్లు), జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా (3244, 114), మలేషియా ఆల్రౌండర్ విరన్దీప్ సింగ్ (3402, 126) ఈ ఘనత సాధించారు.ఈ మ్యాచ్తో నబీ మరో ఘనత కూడా సాధించాడు. భారత గడ్డపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో అత్యంత వయసైన (41 సంవత్సరాల 257 రోజులు) క్రికెటర్గా నిలిచాడు. ఈ రికార్డుకు సంబంధించి హాంకాంగ్కు చెందిన ర్యాన్ క్యాంప్బెల్ (44 సంవత్సరాల 34 రోజుల వయసులో) అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీకి చెందిన వేన్ మాడ్సెన్ (42 సంవత్సరాల 38 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరగులు చేయగా.. భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
జీరాం వ్యాలీ మావోయిస్టు దాడి.. 10 మందికి మరణశిక్ష
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పది మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన జిరాంఘాటీ దాడి కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2013 మే 25న కాంగ్రెస్ నేతలు భారీ కాన్వాయ్తో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా దర్భ లోయలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. జిరామ్ ఘాటీలో ఈ కాన్వాయ్పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 మంది చనిపోగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కాంగ్రెస్ అగ్రనేతలైన పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మతో పాటు పోలీసులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. ఏళ్ల విచారణ జిరామ్ ఘాటీ ఘటనపై ఐపీసీ, సాయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఉపా చట్టాల్లోని 24 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణను ఎన్ఐఏ చేపట్టింది. వెనువెంటనే సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కిందిస్థాయి దళ సభ్యులు, కార్యకర్తలను పదుల సంఖ్యలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొంటూ తొలి చార్జ్ïÙట్ను 2014 సెప్టెంబర్ 25న దాఖలు చేసింది. దీనికి అదనంగా మరో 30 మందిని చేరుస్తూ మలి చార్జ్షిట్ను 2015 సెపె్టంబర్ 28న దాఖలు చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. మొత్తంగా 101 మంది సాక్షులను విచారించి, 11 మందిని ఈనెల 5న కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించిన శిక్ష వివరాలను జగ్దల్పూర్లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం వెల్లడించింది. మరణశిక్షపై 30 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని తెలిపింది. మరణశిక్ష పడ్డ మావోయిస్టులు జిరామ్ ఘాటీ కేసులో మొడియం ప్రమీల, చైతూ లేకం అలియాస్ మున్నా, సుమితా, ముక్కా మడ్వి, కోసా కవాసీ, ఆయటామక్రం, మడకం దేవా, జోగా మడ్కమీ, బంజామి సన్నా, మహదేవ్ ఉన్నారు. కోర్టు దోషులుగా తేలి్చన మరో మావోయిస్టు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు మరణించాడు. విభిన్న స్పందనలు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్, హోంమంత్రి విజయ్శర్మ న్యాయం గెలిచినట్టుగా అభివరి్ణంచారు. జిరామ్ఘాటీ లాంటి అనేక దారుణమైన హింసాత్మక ఘటనలకు గతంలో మావోయి స్టులు పాల్పడ్డారని, ఆ చేదు జ్ఞాపకాలు ఇప్ప టికీ వెంటాడుతున్నాయన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచిందన్నారు. ఇదే సమయాన కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. మావో అగ్రనేతల సూచనలు లేకు ండా జిరామ్ఘాటీ లాంటి ఘటనలు చోటు చేసుకోవని, పైస్థాయి మావోయిస్టులను వదిలేసి కేవలం కింది స్థాయి వారిని అరెస్ట్ చేసి, వారికే మరణ శిక్ష విధించారని పేర్కొంది. తద్వారా ఘటనలో చనిపోయిన వారి ఆత్మలు శాంతించవంది. తమ యాత్రకు సరైన భద్రత కలి్పంచలేని అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించింది. దీనికితోడు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న కీలక నేతల పేర్లను తర్వాత ఎందుకు తొలగించారని కాంగ్రెస్ మాజీ సీఎం భూపేష్ బగేల్ ప్రశ్నించా రు. ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు.టార్గెట్ మహేంద్ర కర్మ.. ప్లాన్ చేసింది బస్వరాజు దేశంలో ఉన్న ప్రధాన సాయుధ కమ్యూనిస్టు గ్రూపులు 2004 సెపె్టంబరు 21న సీపీఐ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. వీరికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే స్థానిక ఆదివాసీ నేత మహేంద్రకర్మ (మహేంద్ర కల్మా) నేతృత్వంలో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం (శాంతి దళం) 2005లో ఏర్పాటు చేశారు. సరైన శిక్షణ లేకుండానే వీరి చేతికి ఆయుధాలు ఇచ్చి మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పంపారు. దీంతో 2005 నుంచి 2011 వరకు మావోయిస్టులు వారి సానుభూతిపరులు, సల్వాజుడుం, మద్దతుగా ఉన్న ప్రభుత్వ విభాగాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. గ్రామాలను తగలబెట్టారు. మహిళలు, బాలలపై విపరీతమైన హింస చోటు చేసుకుంది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సల్వాజుడుం 2011లో రద్దయింది. ఈ సల్వాజుడుం సృష్టికర్తగా పేరున్న మహేంద్ర కర్మ మావోయిస్టుల ప్రధాన టార్గెట్ అయ్యారు. దీంతో అప్పటి మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ నేతృత్వంలో దాడికి వ్యూహ రచన జరిగింది. 200 మందికి పైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారు. జిరామ్ ఘాటీలో ఇరుకైన మూలమలుపు దగ్గరకు రాగానే ముందుగా ల్యాండ్మైన్ పేల్చారు. కాన్వాయ్ ఆగిపోగానే ఒక్కసారిగా నలువైపుల నుంచి తూటాల వర్షం కురిపించారు. మహేంద్ర కర్మను వాహనం నుంచి బయటకు లాగి గొడ్డళ్లతో నరికారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయాన ఛత్తీస్గఢ్ పీసీసీ చీఫ్తోపాటు మాజీ కేంద్ర మంత్రి చనిపోవడంతో కేసు సంచలనంగా మారింది. ఎఫ్ఐఆర్లో ఇటీవల కాలంలో లొంగిపోయిన, ఎన్కౌంటర్లలో చనిపోయిన కొందరు అగ్రనేతల పేర్లు ఉన్నాయి. తర్వాత కాలంలో ఆ పేర్లు లేకుండా పోయాయి. బస్తర్లో మారిన పరిస్థితులకు ఈ కేసు ఓ ఉదాహరణగా నిలిచింది. -
రూ.200 కోట్ల ఇరుముడి.. మా ఇంటి బంగారాన్ని దాటలేదు..!
ఇటీవలే రిలీజైన రవితేజ ఇరుముడి సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. తండ్రి, కూతురి సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అలా సామ్ లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సైతం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఓవర్సీస్లో రివర్స్..రవితేజ ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మైలురాయి అందుకున్నప్పటీ.. సమంత మూవీ కంటే వెనకే ఉంది. ఓవర్సీస్ వసూళ్లపరంగా చూస్తే సమంత మా ఇంటి బంగారం ముందుంది. ఈ లిస్ట్లో రామ్ చరణ్ పెద్ది తొలిస్థానంలో(రూ.53 కోట్లు) ఉండగా.. రెండోస్థానంలో మనశంకరవరప్రసాద్గారు(రూ.43 కోట్లు).. మూడోస్థానంలో ది రాజాసాబ్(రూ.34 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో సమంత మా ఇంటి బంగారం(రూ.28 కోట్లు) నాలుగోస్థానంలో ఉండగా.. రవితేజ ఇరుముడి(రూ.22 కోట్లు) ఐదోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా చూస్తే రూ.200 కోట్లు దాటేసిన ఇరుముడి.. ఓవర్సీస్లో మాత్రం వెనకపడిపోయింది. -
సంపదలో అదానీని దాటేసిన టిక్టాక్ వ్యవస్థాపకుడు
ఆసియా కుబేరుల జాబితాలో పెద్ద మార్పు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ ‘టిక్టాక్’ మాతృ సంస్థ బైట్డాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొత్త రికార్డు సృష్టించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెలువరించిన నివేదిక ప్రకారం, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీని అధిగమించి యిమింగ్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.105 బిలియన్ డాలర్ల మైలురాయి43 ఏళ్ల ఝాంగ్ యిమింగ్ నికర సంపద ఒక్కసారిగా 105 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.7 లక్షల కోట్లు) మార్కును దాటింది. ఇటీవల బ్లాక్రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ వ్యాల్యుయేషన్ సంస్థలు బైట్డాన్స్ షేర్ల విలువను గణనీయంగా పెంచడంతో యిమింగ్ సంపద కేవలం ఒక్క నెలలోనే 12 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. 2019 మార్చిలో యిమింగ్ సంపద కేవలం 13 బిలియన్ డాలర్లగా ఉండగా, ఇప్పుడు అది ఎనిమిది రెట్లకు పైగా పెరగడం గమనార్హం.ఏఐ సాంకేతికతతో వృద్ధికేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతోనే కాకుండా బైట్డాన్స్ సంస్థ ఏఐ విభాగంలోకి అడుగుపెట్టడం యిమింగ్ సంపద పెంపునకు ప్రధాన చోదక శక్తిగా మారింది. బైట్డాన్స్ అభివృద్ధి చేసిన ‘దౌబావో’ ఏఐ చాట్బాట్, సీడాన్స్ వంటి ఏఐ వీడియో జనరేషన్ టూల్స్ మార్కెట్లో ఊహించని రీతిలో విజయం సాధించాయి.భారత బిలియనీర్లుమరోవైపు, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద మార్కెట్ స్థిరత్వం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో కాస్త క్షీణించి రెండో స్థానానికి చేరారు. ముకేశ్ అంబానీ కూడా తదుపరి స్థానాల్లోనే ఉన్నారు. ఆసియాలో ఇప్పటివరకు ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు వంటి సాంప్రదాయ రంగాల నుంచి బిలియనీర్లు అగ్రస్థానంలో నిలవగా ఇప్పుడు సాంకేతికత, ఏఐ-ఆధారిత రంగాలకు చెందిన టెక్ యజమానులు సంపన్నులుగా ఎదగడం గమనార్హం.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
గని కూలి 60 మంది మృతి.. శిథిలాల కిందే మరికొందరు
సూడాన్లోని వెస్ట్ కొర్డోఫాన్ రాష్ట్రంలో బంగారు గని కూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. భూగర్భంలో మరికొందరు కార్మికులు ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని స్థానిక హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది.అల్-జారా గని వద్ద వరుసగా ఉన్న పలు గని మార్గాలు కూలిపోయినట్లు కొర్డోఫాన్ అబ్జర్వేటరీ తెలిపింది. ఫౌజా ప్రాంతంలో, అల్-నుహుద్కు వాయవ్య దిశలో ఈ గని ఉంది. ఈ ఘటనలో 70 మందికి పైగా చేతివృత్తి ఆధారిత గని కార్మికులు మృతి చెంది ఉండొచ్చని లేదా గల్లంతయ్యారని ఆ సంస్థ బుధవారం తెలిపింది.ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం మంగళవారం ఒక కార్మికుడు గని నుంచి బయటకు వచ్చి, ఇంకా కొందరు లోపల ప్రాణాలతో ఉన్నారని చెప్పినట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రత్యేక శిక్షణ పొందిన సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేదని తెలిపింది. ఇసుకతో కూడిన బలహీనమైన నేల కారణంగా స్థానికులు సాధారణ పనిముట్లతో సహాయక చర్యలు చేపట్టడం, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారిందని పేర్కొంది.గని ప్రాంతంలో భద్రతా చర్యలు, సహాయక పరికరాలు లేకపోవడమే అధిక మరణాలకు కారణమై ఉండొచ్చు. సూడాన్ ఆఫ్రికాలోని ప్రధాన బంగారం ఉత్పత్తిదారుల్లో ఒకటి. అయితే అక్కడి బంగారంలో అధిక భాగం ప్రమాదకరమైన చిన్నస్థాయి, చేతివృత్తి ఆధారిత గనుల ద్వారా వెలికితీస్తారు. గని ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం అవుతాయా, భూగర్భంలో చిక్కుకున్న వారిని రక్షించగలరా? అనేది ఇప్పుడు కీలకం. -
అమెరికా నుంచి ఇజ్రాయెల్కు 60 వేల భారీ బాంబులు? ఏం జరుగుతోంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు సుమారు 2,000 పౌండ్ల (907 కిలోల) బరువున్న 60 వేల భారీ బాంబులను విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 2.8 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఆయుధ ప్యాకేజీకి అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు కూడా ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఈ విక్రయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.ఈ ప్యాకేజీలో 20 వేల ఎంకే-84, 20 వేల బీఎల్యూ-117, 20 వేల ఐ-2000 పెనిట్రేటర్ బాంబులు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో ఎంకే-84, బీఎల్యూ-117లు 2,000 పౌండ్ల సాధారణ బాంబులు కాగా, ఐ-2000ను బంకర్ బస్టర్గా పిలుస్తారు. గట్టి నిర్మాణాలను ఛేదించి లోపల పేలేలా దీన్ని రూపొందించారు.ఈ ప్రతిపాదిత విక్రయం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలపై కూడా చర్చ మొదలైంది. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయని, సరఫరా వ్యవస్థలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయని సోమవారం విడుదలైన పెంటగాన్ పర్యవేక్షణ నివేదిక పేర్కొన్నట్లు అల్జజీరా తెలిపింది. 2024లో జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు కొన్ని 2,000 పౌండ్ల బాంబుల సరఫరాను నిలిపివేసింది.అనంతరం ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. గతంలోనూ ఇజ్రాయెల్కు భారీ బాంబుల సరఫరాపై అమెరికాలో రాజకీయ నేతల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఇక ఈ కొత్త ఆయుధ ప్యాకేజీ అధికారికంగా ఆమోదం పొందుతుందా, కాంగ్రెస్కు ఎప్పుడు అధికారికంగా తెలియజేస్తారు, ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాపై అమెరికా విధానం ఎలా మారుతుంది? అనేది కీలకంగా మారింది. -
దేశంలోనే తొలి స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు
భారత రైల్వే సరుకు రవాణా విభాగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. గుజరాత్లోని కచ్ జిల్లా శివలాఖా నుంచి మిఠాపూర్ మధ్య నడిచే దేశంలోనే మొదటి ‘స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్గా ప్రారంభించారు. సాధారణ వ్యాగన్లలో ఉప్పును రవాణా చేసే సమయంలో తేమను పీల్చుకోవడం, వ్యాగన్లు త్వరగా తుప్పు పట్టడం, సరుకు కంటే వ్యాగన్ బరువే ఎక్కువగా ఉండటం వంటి ప్రధాన సమస్యలను ఈ కొత్త సాంకేతికత పరిష్కరిస్తుంది.తుప్పు పట్టని డిజైన్ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్, గాలిలోని తేమ కలిసి సాధారణ ఇనుము లేదా ఉక్కు వ్యాగన్లను వేగంగా తుప్పు పట్టేలా చేస్తాయి. అందుకే ఈ కొత్త కంటెయినర్లను అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. సాధారణ వ్యాగన్లు కొన్ని సంవత్సరాల్లోనే పాడైపోగా స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం వల్ల వ్యాగన్ల జీవితకాలం భారీగా పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గిపోతుంది.బరువు సమతుల్యతఉప్పు బరువుగా ఉండటం వల్ల పాత మోడల్ వ్యాగన్లలో వ్యాగన్ సొంత బరువు (టేర్ వెయిట్) కంటే మోసే సరుకు నిష్పత్తి సమర్థవంతంగా ఉండేది కాదు. తేలికైన, బలమైన స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించడం ద్వారా కంటెయినర్ బరువు తగ్గి, ఎక్కువ పరిమాణంలో ఉప్పును లోడ్ చేసే వెసులుబాటు లభించింది.వినూత్న లోడింగ్ - అన్లోడ్ విధానంకంటెయినర్ పైభాగం నుంచి నేరుగా ఉప్పును నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కంటెయినర్ను పక్కకు వంచే (టిల్ట్) సదుపాయం ఉంది. దీనివల్ల మానవ శ్రమ లేకుండా వేగంగా సరుకును ఖాళీ చేయవచ్చు.తేమ నిరోధకతరవాణా సమయంలో ఉప్పు వాతావరణంలోని తేమను పీల్చుకుని గడ్డకట్టడం లేదా తడిసిపోవడం జరుగుతుంది. ఈ సీల్డ్ కంటెయినర్ల వల్ల వర్షం లేదా గాలిలోని తేమ లోపలికి చేరకుండా ఉప్పు దాని సహజ స్థితిలోనే ఉంటుంది.सॉल्ट को देश के कोने-कोने तक ले जाने के लिए बनाया गया स्पेशल कंटेनर!#RailInfra4Gujarat#FreightFriendlyRailways pic.twitter.com/QBuIqeWFvd— Ministry of Railways (@RailMinIndia) September 16, 2026మౌలిక వసతుల విస్తరణఈ సందర్భంగా గుజరాత్లోని భీమాసర్, దేవిలియా, చండీసార్, శివలాఖాలలో పూర్తయిన నాలుగు కార్గో టెర్మినల్స్ను కేంద్రమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు, మెహసానాలోని లించ్ వద్ద నూతన గతిశక్తి కార్గో టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. 2021లో తీసుకొచ్చిన గతిశక్తి విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 కార్గో టెర్మినళ్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ప్రారంభించిన గోపాల్పూర్ రైల్వే స్టేషన్ సేవలతో అహ్మదాబాద్-భుజ్ మార్గంలో నడిచే రైళ్లకు గాంధీధామ్ వద్ద ఇంజిన్ రివర్సల్ చేయాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా కానుందని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
పేరు మార్చి ప్రేమ నాటకం.. నిలదీస్తే కారు ఎక్కించిన ప్రియుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దారుణ ఘటన జరిగింది. తనను మోసం చేశాడని అడ్డుకున్న ప్రియురాలిపై ప్రియుడు ఏకంగా కారు ఎక్కించాడు. లక్నోలోని ప్రఖ్యాత జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడిని నిలదీసిన యువతిపై, నిందితుడు రాక్షసంగా వ్యవహరించిన తీరు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తోంది.వివరాల్లోకి వెళితే.. అనామిక అనే యువతి, షహన్వాజ్ కొంతకాలంగా పరిచయంలో ఉన్నారు. అయితే, మరో యువతితో షహన్వాజ్ కారులో తిరుగుతుండగా అనామిక రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో గొడవకు దిగింది. వివాదం ముదిరడంతో షహన్వాజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, యువతి అడ్డుకునే యత్నం చేసింది. అయితే ఆ సమయంలోనూ తన ప్రియుడు ఏమాత్రం కనికరం చూపకుండా కారుతో వేగంగా కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా కిందపడిపోయిన ఆమెపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లక్నో పోలీసులు, ప్రధాన నిందితుడు షహన్వాజ్ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు యువతిని పేరు మార్చి (యష్ ఠాకూర్) పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. Lucknow - A woman was struck by a car and carried on its bonnet for some distance during a dispute near Janeshwar Mishra Park on Wednesday morning, according to police. A video of the incident has circulated widely on social media. Preliminary police accounts said the woman saw… pic.twitter.com/9setQbAQYs— NextMinute News (@nextminutenews7) September 16, 2026 -
చంద్రబాబూ.. మీ పాలనలో పోలీసింగ్ అంటే ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ పోలీసులు ఎఫ్బీఐ పేరును వాడటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. చంద్రబాబు పాలనలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు.‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ఎఫ్బిఐ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ.. మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను ‘ఎఫ్బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య.ఆ మెయిల్స్ అన్నీ ఏపీ పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచే వచ్చాయని ‘ఎక్స్’ ధృవీకరించింది.ఆ మెయిల్ పంపిన ఇన్స్పెక్టర్ తాను ‘ఎఫ్బీఐ’ అధికారినని ఎలా చెప్పుకున్నారు?.అసలు ఆ మెయిల్ పంపాలని ఆదేశించింది ఎవరు?‘ఎఫ్బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు?. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు..‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా?అమలు చేయని సూపర్ సిక్స్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై పోస్టులు పెడితే ఎందుకు తొలగిస్తున్నారు?. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదు.రాజకీయ ప్రయోజనాల ఏకంగా ఎఫ్బీఐ పేరును వాడటం ఏపీకి అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తిన్నది.విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని,గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువుతో నష్టపోయిన రెతులను ఆదుకోవటానికి వాడండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. అలా నిజమైన అభివృద్ధి చేసి చూపండి. ఇకనైనా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. ప్రజలకు మంచి చేసే విషయంలో మీ పనితీరును చూపండి.ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్షిప్, వేధింపులతో కాదు’’అని వైఎస్ జగన్ ఎక్స్లో తెలిపారు. .@ncbn గారి పాలనలో రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.చంద్రబాబు గారూ, మీ పాలనలో ఇదేనా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2026 ఇదీ చదవండి : చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలు -
కీలక టోర్నీ నుంచి సీఎస్కే స్టార్ ఔట్..!
చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే మరో కీలక దేశవాళీ టోర్నీకి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో జరిగే ఇరానీ కప్కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రకారం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఆయుష్కు ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్రంజీ ట్రోఫీ 2025-26 విజేత జమ్మూ కశ్మీర్తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్లో తలపడనుంది. ఈ వన్-ఆఫ్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది. బీసీసీఐ త్వరలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్ లేకపోవడంతో ఆయుష్ మాత్రే పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.ఐపీఎల్ 2026లో ఆరు మ్యాచ్లే..!ఆయుష్ మాత్రేకు గాయం సమస్యలు ఐపీఎల్ 2026లోనే మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతడు టోర్నీ మధ్యలో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీంతో ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026లో ఆయుష్ ఆరు మ్యాచ్ల్లో 201 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 33.50 కాగా, స్ట్రైక్రేట్ 177.87గా ఉంది.ముంబై టీ20 లీగ్కు కూడా దూరంఐపీఎల్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆయుష్కు మరో గాయమైంది. ముంబై టీ20 లీగ్ 2026కు ముందు అతడికి మణికట్టు గాయం కావడంతో ఆ టోర్నీకి కూడా దూరమయ్యాడు.ప్రస్తుతం ఆయుష్ ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, పోటీ క్రికెట్లోకి తిరిగి రావాలంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది.ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్స్ -
చర్చకు పొంగులేటి వస్తారా?.. లేక సీఎం రేవంత్ వస్తారా?: హరీష్ సవాల్
హైదరాబాద్: తమ హయాంలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగాయని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు సవాల్ విసిరారు. తనతో చర్చకు మంత్రి పొంగులేటి వస్తారా?, లేక సీఎం రేవంతే వస్తారో? తేల్చుకోవాలని చాలెంజ్ చేశారు. తాము ప్రభుత్వం అవినీతి మీద ప్రశ్సిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు హరీష్రావు. ఈరోజు(బుదవారం, సెప్టెంబర్ 16వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్రావు.. ఎన్నికల అఫడవిట్లో చూపించనవే సభలో రేవంత్రెడ్డి చెప్పారని హరీష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్లు ఆగాయంటే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. భూభారతిలో 9, 200 మంది భూములు మరొకరికి మారాయని ఆరోపించారు హరీష్, భూభారతి స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించరు? అని ప్రశ్నించిన హరీష్,, భూభారతి కాదు.. భూహారితి అంటూ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం -
మడతపెట్టే ఫోన్పై మీమ్స్.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఐఫోన్ ప్రియుల కోసం టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల మడతపెట్టే ఫోన్ ‘డ్యువో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ను దక్కించుకునేందుకు ఎప్పటిలాగే టెక్ లవర్స్ ఆసక్తి కనబరిచారు. యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరి మరీ మడతపెట్టే ఫోన్లు కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొంత మంది నెటిజనులు సరదా కామెంట్లు పెట్టారు.ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ హై ఎండ్ మోడల్ ధర నాలుగున్నర లక్షల రూపాయలు ఉంది. ఈ ధరలపై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ రేటుకి కారు లేదా బైకు వచ్చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా పలు రకాల వీడియోలతో నెటిజనులు నవ్వులు పూయిస్తున్నారు. ఐఫోన్ ధరల మాట ఎలా ఉన్నా ఈ మీమ్స్ మాత్రం తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. వీటిని చూసినవారంతా భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు.. ఎందుకో తెలుసా? #Iphone18 ProMax #Effect .....😂😂 pic.twitter.com/GM1QM6zVwD— హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature) September 15, 2026 4L ki inko 1L kalipisthey Alto vachesthadi🫡#IPhone18 #IPhone17 #AppleEvent pic.twitter.com/ByMYOi8Kl5— Fukkard (@Fukkard) September 10, 2026 ₹4,50,000 for Foldable iPhone? 😳 -#iPhoneDuo #Apple #iPhone18 #iphone pic.twitter.com/d6KHsF26Pt— Ankit Uttam (@ankituttam) September 10, 2026 Rammurthy Avre and friends react to the recent #apple launch and how expensive things are getting. pic.twitter.com/4D5JOYFK3N— Danish Sait (@DanishSait) September 11, 2026 Thank you #apple pic.twitter.com/97gi9hGHbM— Pushpendra Singh (@pushpendrakum) September 11, 2026 सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek— Sanket (@BTechComedian) September 10, 2026Me trying to justify buying iPhone 18 to my parents: 😭#iphone #Apple pic.twitter.com/e4wc92nnrU— escape.1 (@xescape18) September 10, 2026 -
యూపీఐ వాడితే ఎవరిపై ఎంత ఛార్జీ?
భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు సాధారణ ప్రజలకు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అన్ని యూపీఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులో ఎవరికి ఎంతమేర ఛార్జీలు వసూలు చేస్తారో తెలియజేస్తూ, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత నిచ్చింది.పూర్తిగా ఉచితంస్నేహితులు, బంధువులకు డబ్బులు పంపడం: ఎంత మొత్తం పంపినా (పీ2పీ) రూపాయి కూడా ఛార్జీ ఉండదు.చిన్న దుకాణాల్లో చెల్లింపులు: నెలకు రూ.1 లక్ష వరకు వ్యాపారం చేసే చిన్న దుకాణదారులకు ఎలాంటి రుసుములు ఉండవు.రోజువారీ చిన్న చెల్లింపులు: రూ.2,000 లోపు చేసే 95 శాతం పైగా వ్యాపార చెల్లింపులు పూర్తి ఉచితం.అదనపు ఛార్జీలు ఉండవు: యాప్లు ప్లాట్ఫారమ్ రుసుము వసూలు చేయకూడదు. వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులపై మోపడానికి వీల్లేదు.రూ.2,000 లావాదేవీ దాటితే ఛార్జీలు ఎవరిపై..సాధారణ పెద్ద వ్యాపారాలు: రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది.నిత్యావసర సేవలు: రైల్వే, పెట్రోల్, టెలికాం, కరెంట్ బిల్లు, బీమా వంటి వాటికి రూ.2,000 దాటితే లావాదేవీకి గరిష్టంగా రూ.5 మాత్రమే.మ్యూచువల్ ఫండ్స్, షేర్లు: మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ చెల్లింపులకు కేవలం 0.02% (గరిష్టంగా రూ.300).🔰 UPI Remains Free for ConsumersUPI continues to be free for customers. Sending money to friends, paying at shops, or scanning a QR code — all remain without charges.Key Facts:✅ No charges on P2P: Person-to-Person transfers are always free, regardless of amount.✅ Small… pic.twitter.com/PyQ7hotNMN— Ministry of Finance (@FinMinIndia) September 16, 2026ప్రభుత్వ వివరణ ప్రకారం.. నిజాలు, ప్రయోజనాలుఇది పూర్తిగా ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం. విదేశీ ఒత్తిళ్ల వల్ల ఛార్జీలు వచ్చాయనే ఆరోపణల్లో నిజం లేదు. పెద్ద వ్యాపారుల నుంచి వచ్చే ఛార్జీలను సైబర్ సెక్యూరిటీ పెంచడానికి, బ్యాంకింగ్ సర్వర్లను బలోపేతం చేయడానికి, పల్లెల్లో డిజిటల్ చెల్లింపులను విస్తరించడానికి ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అత్యున్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గాను కేంద్రం అనంత్ నాగ్ను ఎంపిక చేసింది. ఈ నెల 22న గుజరాత్లోని కేవడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అనంత నాగ్కు ఈ అవార్డును ప్రధానం చేయనుంది కన్నడతో పాటు పలు భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించిన అనంత్ నాగ్కు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, ఆర్ట్ సినిమాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ‘అంకుర్’ చిత్రంతో ఆర్ట్ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆయన బైలు దారి,నా నిన్న బిడలారే,గణేశాన మదువె, ఇటీవల వచ్చిన కేజీఎఫ్తో పాటు ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.శంకర్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘మాల్గుడి డేస్’ లో ఆయన నటన దేశవ్యాప్తంగా అప్పట్లో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’తో గౌరవించింది. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. Congratulations to the legendary Anant Nag Ji on being conferred the Dadasaheb Phalke Award.For several decades, his effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema, particularly Kannada cinema. In whichever role he…— Narendra Modi (@narendramodi) September 16, 2026 -
సిగరెట్ ప్రియులకు భారీ షాక్ : ఏకంగా 13 శాతం పెంపు
ధూమపాన ప్రియులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఎంపిక చేసిన సిగరెట్ బ్రాండ్ల రిటైల్ ధరలను మరోసారి పెంచింది. ముఖ్యంగా 'క్లాసిక్ కనెక్ట్' (Classic Connect), 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' (Gold Flake Super Star) ప్యాక్ల ధరలను 12.66శాతం వరకు పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులు, సుంకాలను పెంచిన తర్వాత ఈ పెంపులు మొదలయ్యాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఐటీసీ రెండోసారి ధరలను పెంచింది. కొత్త ధరలతో కూడిన సిగరెట్ ప్యాక్లు ఇప్పటికే మార్కెట్లోకి, డిస్ట్రిబ్యూషన్ ఛైన్లోకి రావడం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల వల్ల కంపెనీలు పన్నుల భారాన్ని తగ్గించుకోగలిగినప్పటికీ, వినియోగదారులపై అదనపు భారం పడనుంది.పెరిగిన ధరల వివరాలుడీలర్ల సమాచారం ప్రకారం, 10 సిగరెట్లు ఉండే 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' ప్యాక్ ధర రూ. 79 నుండి రూ. 89కి (రూ. 10 పెరిగింది) చేరుకుంది. 20 సిగరెట్ల క్లాసిక్ కనెక్ట్ సిగరెట్ ప్యాక్ ధర గతంలో రూ.390గా ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.428కి చేరింది. సుమారు 9.7 శాతం పెరిగింది.ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ (GST) రేటు 40శాతం కి పెరగడంతో పాటు కొత్త ఎక్సైజ్ డ్యూటీ విధానం అమలవుతోంది. ఈ పన్నుల భారాన్ని తట్టుకునేందుకు ITC సంస్థ గతంలో ఫిబ్రవరి, మే నెలల్లో కూడా పలుమార్లు ధరలను పెంచిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!ఐటీసీ షేర్ల లాభాలుసిగరెట్ ధరల పెంపుపై వార్తలు వెలువడిన తర్వాత ఐటీసీ షేర్లలో కదలిక కనిపించింది. బుధవారం ఉదయం ట్రేడింగ్లో ఐటీసీ షేరు 2.13 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాదిలో రెండోసారి సిగరెట్ల ధరలను పెంచిన నేపథ్యంలో బుధవారం ITC లిమిటెడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి.ఇదీ చదవండి: మహువాకు మరోసారి చేదు అనుభవం : జస్టిస్ దీపాంకర్కు కౌంటర్ -
వంట గదిలో కుప్పకూలి భారతీయ వైద్యురాలు మృతి
షార్జాలో ఇంట్లో వంటగదిలో అకస్మాత్తుగా కుప్పకూలి కేరళకు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ అఫీనా రహీమ్ (32) మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల తల్లైన ఆమె తన భర్త యాసర్ టీ, పిల్లలతో కలిసి అల్ ఖాసిమియా ప్రాంతంలో నివసిస్తున్నారు.అఫీనా గతంలో దంత వైద్యురాలిగా పనిచేసినా, పిల్లల సంరక్షణ కోసం కొంతకాలంగా వృత్తికి దూరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యుడు తెలిపారు. ఆమె భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన విధుల్లో ఉన్నారు.అఫీనా తన కుమారుడిని పాఠశాలకు పంపిన తర్వాత తిరిగి నిద్రకు వెళ్లినట్లు ఆమె బావ హకీమ్ తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 9 గంటలకు అఫీనాతో తాను మాట్లాడినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత అఫీనా పిల్లల్లో ఒకరు ఏడుస్తున్న శబ్దం విని ఆమె వదిన రమ్షీనా నిద్రలేచారు. వంటగదిలో అఫీనా కుప్పకూలి ఉండటాన్ని గుర్తించి వెంటనే ఆమెకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్కు సమాచారం అందించారు.అఫీనాను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమెను రక్షించలేకపోయారు. ఆమె మృతికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.అఫీనా ఆరోగ్యంగా ఉండేవారని, ఆమెకు ఎలాంటి తెలిసిన అంతర్గత అనారోగ్య సమస్యలు లేవని భర్త తెలిపారు. ఆమె మృతిపై అధికారిక ధ్రువీకరణ పత్రం, ఇతర ప్రక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని కేరళలోని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. -
నీతా అంబానీ ధరించి నెక్లెస్లో స్పెషాల్టీ ఇదే..! డిజైనింగ్కే మూడున్నర ఏళ్లు..
ఆభరణాల విషయంలో నీతా అంబానీకి సరిరారెవ్వరూ. ఆమె పండుగకు, ఈవెంట్లకు అనుగుణంగా ధరించి ఆభరణాలు మన భారతీయ కళాకారుల నైపుణ్యం, చారిత్రక వైభవాన్ని చాటి చెబుతాయి. ఆమె ధరించే ప్రతి ఆభరణం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ దాగుంటుంది. తరతరాలు తెలసుకునేందుకు దారితీయడమే గాక..మన హస్తకళా వైభవం, నైపుణ్యం గురించి అవగాహన కల్పించడానికి దోహదపడుతుండటం విశేషం. ఈసారి కూడా అంతే విలక్షణమైన ఆభరణంతో గణేశ్ చతుర్థి వేడుకల్లో మేరిసింది. అంబానీ ఇంట గణపతి నవరాత్రులు ఈసారి కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సినతారలంతా కదిలి వచ్చారు. ఆమె ఈ వేడుక కోసం తన రూపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఆమె నారింజ రంగు పట్టు చీరలో దేవతలా మెరిసింది. ముఖ్యంగా మెడకు ఓ భారీ కళఖండాన్ని పోలిన నెక్లెస్ని ధరించారు. ఆ నగ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తూ..కట్టిపడేసింది. ఈ నెక్లెస్ మెడ నుంచి భుజాల వరకు ఆవరించి ఉండటమే కాదు..మొత్తం ఆమె లుక్లో హైలెట్గా ఉండటం విశేషం. ఈ నెక్లెస్ని ‘అమ్రపాలి భరతం’ అని పిలుస్తారట. దీని తయారీకి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అత్యుత్తమ వారసత్వ వింటేజ్ ఆభరణాలను పొందుపర్చి.. డిజైన్ చేసిన వస్త్రం మాదిరి ఆభరణం. ఆ ఆభరణం వివరణాత్మకమైన ఒక పురాతన కళాఖండ. మధ్యభాగం కేరళ నెక్లెస్ని పోలి ఉంటుంది. దీన్ని సుమారు 14 మంది కళకారులు తీర్చిదిద్దారట. దీనిలో ఝూమర్లు, దక్షిణ భారత నాథ్లు, పాసా, షాండిలియర్ లాంటి చెవిపోగులు, బిల్లాలు, చాంద్బాలీలు తదితరాలని ఉపయోగించారు. దీని తయారీకి మూడున్నరేళ్లు పైనే పట్టిందట. అలాగే దీనికి మంచి రాయల్ లుక్ని అందివ్వడానికి మరో ఆరు నెలల వ్యవధి తీసుకుందట. దీనిలో కుందన్ పనితనం, ముత్యాల దండలే, పోల్కీ అమరికలు, మీనాకారి అంకరణ అత్యంత ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కాగా, నీతా ఇంతకుమునుపు కూడా అత్యంత విలక్షణమైన విలాసవంతమైన ఆభరణాలతో మెరిసింది. ఈ సారి ధరించిన ఆభరణం మాత్రం మెడకు ధరించిన బంగారు వస్త్రంలా ఆమె శరీరానికి అల్లుకుపోయింది. View this post on Instagram A post shared by Vini Bawa | Fashion & Style Decoder (@embrace.your.elegance) (చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!) -
మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్కు (2027) సంబంధించి బిగ్ అప్డేట్స్ వచ్చాయి. అక్టోబర్ 28న కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో వేలం జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 మధ్యలో టోర్నీ జరుగనున్నట్లు వెల్లడించింది. రిటెన్షన్ ప్రక్రియకు సెప్టెంబర్ 28 చివరి తేదీగా పేర్కొంది. టోర్నీకి సంబంధించిన వేదికలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ముంబై, వడోదరలో మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో కూడా ఈ రెండు నగరాల్లోనే మ్యాచ్లు జరిగాయి. సీజన్-4 ఫైనల్ను ఫిబ్రవరి 5న వడోదరలో నిర్వహించారు.సెప్టెంబర్ 28లోగా రిటెన్షన్లుఐదు జట్లకు ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్పై నిర్ణయం తీసుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు గడువు ఇచ్చారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లు ఉండవచ్చు. ఇందులో గరిష్ఠంగా ఆరుగురు విదేశీ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సైకిల్కు సంబంధించిన జట్టు శాలరీ క్యాప్ రూ.15 కోట్లుగా ఉంది.కాగా, గత WPL సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ రెండో టైటిల్ను కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ను కిందకు తోసిన అభిషేక్ -
సింగర్తో పెళ్లి.. అన్ని విధాల మోసపోయా: ప్రముఖ నటి
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్ షా ఈ ఏడాది మార్చిలో నటి ఇషా రిఖీని పెళ్లాడారు. అంతకుముందే జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ర్యాపర్.. ఆమెతో విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈ జంటకి ఓ కూతురు కూడా ఉంది. ఆ తర్వాత నటి ఇషా రిఖితో డేటింగ్ చేసిన బాద్షా ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.అయితే నటి ఇషా రిఖితో రెండో పెళ్లి కూడా ఆర్నెళ్లకే పెటాకులైంది. ఇటీవలే ఈ జంట విడిపోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. ఈ సందర్భంగా నటి ఇషా రిఖి.. తన పెళ్లి జీవితానికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు పంచుకుంది. బాద్షాతో పెళ్లయ్యాక తీవ్రమైన వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. తాను శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా మోసపోయానని తెలిపింది. బాద్షా తనను అన్ని రకాలుగా మోసం చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం బిగ్బాస్ షోలో ఉన్న ఇషా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది.ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేది తాను నమ్మనని స్పష్టం చేసింది. తాను స్వయంగా చూసేంత వరకు నమ్మనని పేర్కొంది. కానీ కొన్ని నెలలకే తనను మోసం చేశారని గ్రహించానని చెప్పింది. బాద్షా తనను కేవలం కొద్దిమందికి మాత్రమే పరిచయం చేశారని..వాస్తవానికి దూరంగా తనలోని వికృత రూపాన్నిచూపించారని వాపోయింది. ఈ రిలేషన్లో తనకు అనుమానాలు కలిగినప్పటికీ.. అన్ని విషయాలను స్వయంగా చూసేంత వరకు నమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు ఇషా వెల్లడించింది. -
AP: రాష్ట్రంలో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్
సాక్షి, ఆంధ్రప్రదేశ్: వాతావారణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈదురుగాలుల నేపథ్యంలో చెట్లకింద, ఎలక్ట్రిక్ వైర్ల వద్ద నిల్చోవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. -
నాపైనే ఫిర్యాదు చేస్తారా?: టీడీపీ ఎమ్మెల్యే చిందులు
రంపచోడవరం(పోలవరం జిల్లా): అడ్డ తీగలలో టీడీపీ సమావేశంలో కార్యకర్తలపై ఆ పార్టీకే చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాటతీస్తానంటూ కార్యకర్తలను హెచ్చరించారు. ‘పనిచేయరు... ఓట్లు వేయించలేరు..... తిరిగి తమపై హైకమండ్ కు ఫిర్యాదు చేస్తారా’ అంటూ కార్యకర్తలపై చిందులు తొక్కారు. ఏమైనా కార్యక్రమం జరిగితే ఒక్కడైనా ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడా ఆగ్రహం వ్యక్తం చేశారు శిరీష. ఎమ్మెల్యే శిరీష్. ఎమ్మెల్యే శిరీష వ్యాఖ్యలతో రంపచోడవరం టీడీపీ క్యాడర్లో కలకలం మొదలైంది. తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సీనియర్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు అవమానకరంగా ఉందంటూ కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి షాక్? -
క్యాష్ ఉంటేనే పెట్రోల్? యూపీఐ ఛార్జీల ఎఫెక్ట్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) నిబంధనలు దేశవ్యాప్తంగా ఇంధన రిటైల్ రంగంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం, రూ.2,000 దాటిన యూపీఐ వర్తక లావాదేవీలపై ఎండీఆర్ వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు, రైల్వేలు, ఇన్సూరెన్స్ వంటి నిత్యవసర రంగాల్లోని రూ.2,000 పైబడిన చెల్లింపులపై ఫ్లాట్గా రూ.5 ఎండీఆర్ విధించనున్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదని, ఈ భారాన్ని కేవలం వర్తకులే భరించాలని ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి.పడిపోతున్న లాభాలు.. పెరుగుతున్న భారంప్రభుత్వ నిర్ణయంపై పెట్రోల్ బంక్ డీలర్ల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన విక్రయ వ్యాపారం స్వల్ప లాభ శాతంతో నడుస్తుందని, 2017 తర్వాత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్జిన్ల పెంపు లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో నమోదయ్యే మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 20 శాతం వరకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైనవే. కొత్త ఎండీఆర్ నిబంధనల వల్ల రోజూ దేశంలోని పెట్రోల్ పంపు నిర్వాహకులపై రూ.2.4 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడుతుందని డీలర్లు అంచనా వేస్తున్నారు.‘క్యాష్ ఓన్లీ’ నిరసన హెచ్చరికఈ అదనపు చార్జీని భరించడం సాధ్యం కాదని, తమకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ వినతిని పరిగణనలోకి తీసుకోకపోతే రూ.2,000 దాటిన లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదు ద్వారా మాత్రమే ఇంధన విక్రయాలు జరుపుతామని స్పష్టం చేస్తున్నారు. 2016 డీమోనిటైజేషన్ సమయంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎండీఆర్ సబ్సిడీలను అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు కూడా అలాంటి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.వినియోగదారులపై ప్రభావం ఎంత?సాధారణ ప్రజలకు పీ2పీ లావాదేవీలు ఉచితమే అయినప్పటికీ బంకు నిర్వాహకులు నగదు విధానానికి మారితే సామాన్య వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చమురు సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని డీలర్లకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
మహువాకు మరోసారి చేదు అనుభవం : జస్టిస్ దీపాంకర్కు కౌంటర్
తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నదియాలోని తెహట్టా పోలీస్ స్టేషన్ వద్ద ఒక సమావేశానికి హాజరైన ఆమెను బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు దారుణంగా అవమానించారు. నల్ల జెండాలతో ఆమెను చుట్టుముట్టి, ' గో బ్యాక్' అని నినాదాలతో హోరెత్తించారు. దీంతో హౌలియా పార్క్ కూడలి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఈ సందర్బంగా మహువా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మహువాపై కోటిగుడ్లతో దాడిచేశారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారు. ఈ దాడిపై మహువా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసుల అనుమతితో తన నియోజకవర్గానికి సమావేశానికి వచ్చిన తనను అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసుల సమక్షంలో BJP కార్యకర్తలు తనపై కోడిగుడ్లు విసిరారని మండిపడ్డారు.అంతేకాదు మీ సలహా ప్రకారం, ఒక స్వాతంత్ర్య సమరయోధుడు తూటాలను ఎదుర్కొన్నట్లే నేను వారిని ఎదుర్కొన్నాను అంటూ కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టున్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తానుద్దేశించి ట్వీట్ చేశారు. ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!Big shout out to Hon’ble Justice Dipankar Datta ! MiLord - I came to my constituency for a mtng informing @WBPolice & BJP workers with their help pelted eggs on me. True to your advice I faced them as a freedom fighter faced bullets. pic.twitter.com/CxO3ApzjPL— Mahua Moitra (@MahuaMoitra) September 16, 2026 ఇదీ చదవండి: ఒరాకిల్ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారంకాగా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్, మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనే ఆరోపణలపై మహువా మొయిత్రిపై పశ్చిమ బెంగాల్లో కేసు నమోదైంది. అయితే వ్యక్తిగతంగా హాజరైతే తన భద్రతకు ముప్పు అని,ఈ గుడ్లతో దాడి చేసే అవకాశం ఉందంటూ వర్చువల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు తూటాలను ఎదుర్కొన్నారు, మీరేమో గుడ్లకే భయపడుతున్నారా? అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. అంతేకాదు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది కూడా. ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
మీరు ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా?
మీరు ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా? దేశంలో ఇళ్లు లేవని కాదు.. మీ ఆదాయానికి అందుబాటులో ఉండే ఇళ్లు తగ్గిపోతున్నాయి. డెవలపర్లు అధిక ధరల ఇళ్ల నిర్మాణంపై ఎక్కువగా దృష్టి పెడుతుండగా, భూమి, నిర్మాణ సామగ్రి, కార్మిక వ్యయాలు పెరగడం వల్ల తక్కువ ధరలో ఇళ్లు నిర్మించడం వారికి కష్టంగా మారుతోంది. ఫలితంగా ఒకవైపు లక్షల ఇళ్లు అమ్ముడుకాక మిగిలిపోతుండగా, మరోవైపు సామాన్యులు కొనగలిగే ధరలో ఇల్లు దొరకడం కష్టమవుతోంది.భారత్లోని ఏడు ప్రధాన గృహ మార్కెట్లలో 6 లక్షలకు పైగా ఇళ్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో అందుబాటు ధరలో ఇల్లు కొనడం యువతకు సవాలుగా మారింది. ఇళ్ల కొరతతో పాటు విక్రయించని ఇళ్లు ఒకేసారి కనిపించడానికి ప్రధాన కారణం అవసరమైన ఇళ్లకు, నిర్మిస్తున్న ఇళ్ల రకాలకు మధ్య పెరుగుతున్న అంతరమే.ఎన్రాక్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలోని ఏడు ప్రధాన గృహ మార్కెట్లలో సుమారు 97,000 ఇళ్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో డెవలపర్లు సుమారు 1.06 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గగా, కొత్త ఇళ్ల ప్రారంభాలు 7 శాతం పెరిగాయి. జూన్ చివరికి ఈ ఏడు నగరాల్లో 6.16 లక్షలకు పైగా ఇళ్లు విక్రయానికి మిగిలాయి. ప్రస్తుతం జరుగుతున్న విక్రయాల వేగాన్ని చూస్తే ఈ పూర్తయిన కొత్త కొత్త ఇళ్లను పూర్తిగా విక్రయించడానికి సుమారు 19 నెలలు పడుతుందని అంచనా.అయితే అన్ని నగరాల్లో పరిస్థితి ఒకేలా లేదు. బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మహానగర ప్రాంతాల్లో త్రైమాసికంలో అమ్మిన ఇళ్ల కంటే కొత్తగా నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్, చెన్నైలో మాత్రం కొత్తగా నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు అమ్ముడయ్యాయి.ఎన్రాక్ ఏడు టాప్ నగరాల గణాంకాల ప్రకారం.. రూ.2.5 కోట్లకు పైబడిన ఇళ్లు 22 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.40 లక్షల కంటే తక్కువ ధర గల ఇళ్ల వాటా కేవలం 6 శాతంగా ఉంది. అంటే ఇల్లు కావాలనుకునే వారి అవసరాలకు, డెవలపర్లు నిర్మిస్తున్న ఇళ్లకు మధ్య ధర పరంగా పెద్ద అంతరం ఉంది.గృహ నిర్మాణ వ్యయాలు పెరిగాయ్ గృహ నిర్మాణ వ్యయాలు పెరగడం దీనికి ఒక కారణంగా కనిపిస్తోంది. భూమి, ఉక్కు, సిమెంట్, కార్మిక వ్యయాలు అధికమయ్యాయి. అనుమతుల్లో ఆలస్యం అయితే ఆర్థిక వ్యయాలు మరింత పెరుగుతున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం అందుబాటు గృహ ప్రాజెక్టుల్లో డెవలపర్ల లాభ మార్జిన్ సుమారు 10-12 శాతం ఉండగా, ప్రీమియం, విలాసవంతమైన ప్రాజెక్టుల్లో అది 25-30 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు.అధికారికంగా అందుబాటు గృహం ధర రూ.45 లక్షలకు మించకూడదనే పరిమితి ఉంది. అయితే ముంబైలో రూ.45 లక్షలకు లభించే ఇల్లు, ఇండోర్, లక్నో నగరాల్లో అదే మొత్తానికి లభించే ఇంటితో సమానం కాదు. ఇల్లు నిజంగా అందుబాటులో ఉందా అనేది ధరతో పాటు ప్రారంభ చెల్లింపు, నెలవారీ ఈఎంఐ, రుణ కాలం, పని ప్రదేశానికి ప్రయాణ ఖర్చులపై కూడా ఆధారపడి ఉంటుంది.ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 ద్వారా ఐదేళ్లలో మరో కోటి అర్హత కలిగిన పట్టణ కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో వివిధ ప్రాజెక్టుల్లో 1.25 కోట్లకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని, కోటికి పైగా పూర్తై లబ్ధిదారులకు అందించామని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వ పథకాలు మాత్రమే పట్టణ గృహ మార్కెట్ సమస్యను పరిష్కరించలేవు.అందుబాటు గృహాల నిర్వచనాన్ని స్థానిక భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, ఆదాయాలకు అనుగుణంగా మార్చడం, నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం, వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక వసతులు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు వంటి చర్యలు అవసరం. అదే సమయంలో అద్దె గృహ మార్కెట్ను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. చివరికి గృహ మార్కెట్ విజయాన్ని ఎన్ని ఇళ్లు నిర్మించారన్నదానికంటే, ఇల్లు అవసరమైన ప్రజలు వాటిలో నిజంగా నివసించగలిగే స్తోమత కలిగి ఉన్నారా అన్నదే నిర్ణయించనుంది. -
పాక్ కేంద్రంగా ఉగ్ర కుట్రలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఈ ముఠా సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్లో పాలుపంచుకోవడంతో పాటు, యువతను, చిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సిండికేట్ విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్ను కూడాప్రచురించింది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను నిషేధించినట్లు తెలిపారు.షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN) అమాయక యువతను, స్థానిక నేరస్థులను ఉపయోగించుకుని సరిహద్దుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మత సామరస్యానికి, అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితా ఉన్న చట్టంలోని మొదటి షెడ్యూల్లో షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను చేర్చేందుకుUAPAలోని సెక్షన్ 35(1)(a)ను కేంద్రం ఉపయోగించింది. ఎస్బీఎన్ ‘ఉగ్రవాదంలో’ పాలుపంచుకుందని, భారతదేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడిందని కేంద్రం భావిస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. -
బిగ్బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్బాస్ ఇచ్చే టాస్క్లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. దీంతో బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ హాట్హాట్గా సాగుతోంది.తాజాగా పదో రోజుకు సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బ్యాగ్ కోసం పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. ఈ గేమ్లో రెండు టీమ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!
అమెరికాలోని న్యూహాంప్షైర్ లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాలు తిరిగి వస్తాయనే ఉద్దేశ్యంతో జరిమానాను మినహాయించింది. ఈ ప్రకటనతో ఎన్నో పుస్తకాలు మళ్లీ లైబ్రరీ అరల్లోకి వస్తాయని ఆత్రుతగా చూసింది. అలాంటిది ఏం జరగకపోగా ఊహించనిది ఎదురైంది. గడుపు దాటిన ఎన్నో పుస్తకాలు తిరిగి వస్తాయనుకుంటే..ఒకే ఒక్క పుస్తకం తిరిగి వచ్చింది. పోనీ అది కూడా మూడు లేదా నాలుగేళ్ల నాటిది కూడా కాదు ఏకంగా 132 ఏళ్ల నాటి మ్యాగజైన్ తిరిగి రావడంతో లైబ్రరీ నిర్వాహాకులు ఒక్కసారగా కంగుతిన్నారు. అది కూడా 84 ఏళ్ల జాన్ హాన్సన్ వృద్ధుడు తీసుకురావడంతో మరింత విస్తుపోతారు. జాన్ 19వ శతాబ్దాం నాటి మ్యాగజైన్ని లైబ్రరీకి తిరిగి ఇచ్చాడు. అంటే సుమరు 48,220 రోజులు గడుపు దాటిపోయిన ఏళ్ల నాటి మ్యాగజైన్ అది. అంటే 1894లో ప్రచురితమైన మ్యాగజైన తిరిగి రావడం లైబ్రరీ నిర్వాహకులు ఒకింత ఆశ్చర్యానికి లోను చేసింది. నిజానికి జరిమానా మినహాయిస్తే ఓ పదేళ్ల క్రితం నాటి ఎన్నో పుస్తకాలు వస్తాయని భావించాం, కానీ 19వ శతాబ్దపు చివరలో వచ్చిన మ్యాగజైన్ తిరిగి వస్తుందని అస్సలు ఊహించలేదంటూ ఆ అమెరికా లైబ్రరీ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొనడంతో ఈ విషయం వైరల్గా మారింది. ఇక ఆ తాతగారు తిరిగి లైబ్రరీకి ఇచ్చిన మ్యాగజైన్ పేరు ది సెంచరీ ఇల్లస్ట్రేటెడ్ అనే మంత్లీ మ్యాగజైన్. అది కూడా సెప్టెంబర్ నెలదట అది. దశాబ్దాలుగా ఆయన ఇంట్లోనే ఉండిపోయింది. అది తన వద్దకు ఎలా వచ్చిందో తెలియదని, తనకసలు గుర్తు కూడా లేదని చెప్పడం గమనార్హం. సదరు లైబ్రరీ జరిమానాను మినహాయించిందన్న ప్రకటన చూసి.. ఆ మ్యాగజైన్ని తిరిగి ఇచ్చేసే సమయం ఆసన్నమైందని భావించి లైబ్రరీకి ఇచ్చేశానని అన్నారు. 1966లో బోస్కావెన్ నుంచి బారింగ్టన్కు మారే సమయంలో ఆ మ్యాగజైన్ తనకు దొరికిందని చెప్పారు. అయితే తన దివంగత భార్య కరోల్ పుస్తకాలను అమితంగా ఇష్టపడుతుండేదని, పబ్లిక్ లైబ్రరీలకు వెళ్తుండేదని చెప్పారు. అయితే లైబ్రరీ నుంచి పుస్తకాన్ని గానీ, పత్రికను గానీ అన్నేళ్లపాటు ఇంట్లో ఉంచుకోవడానికి ఆమె అస్సలు ఇష్టపడదని పేర్కొనడం విశేషం. విచిత్రంగా జాన్ వద్దకు చేరిన ఆ మ్యాగజైన్ అంతే చిత్రంగా లైబ్రరీకి తిరిగి వచ్చింది కదూ..!.ఇదీ చదవండి: పేద కుటుంబం నుంచి ఐదు మెడికల్ సీట్లు..!తల్లిదండ్రులు దినసరి కూలీలు..) -
రూ.4 కోట్లు : 108 కిలోల వెండి గణపతి
ముంబై: దేశమంతటా లక్షలాది విగ్రహాలతో గణేశ ఉత్సవాలు సోమవారం నుంచి సందడిగా మొదలయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని జల్నా నగరంలో, బంగారంతో పూత పూసిన, సుమారు రూ. 4 కోట్ల విలువైన 108 కిలోల వెండి గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఈ విగ్రహాన్ని ఏకంగా 108 కిలోల వెండితో తయారు చేయడంతోపాటు ఆపై బంగారు పూత పూయడం విశేషం. ఈ విగ్రహం విలువ రూ.4 కోట్లుంటుందని అనోఖా గణేశ్ మండల్ వ్యవస్థాపకుడు అజయ్ భారతీయ చెప్పారు.‘వాస్తవానికి విగ్రహానిన 2023లో 107 కిలోల వెండితో తయారు చేయించారు. అయితే ఈ నాలుగేళ్లలో వెండి విలువ బాగా పెరిగింది. ఇటీవల ఈ విగ్రహానికి 50 తులాల బంగారంతో పూత వేయించడంతో దీని ప్రస్తుత బరువు 108 కిలోలకు చేరింది. ఈ ఏడాది వేడుకల్లో భక్తులు, కుటుంబాల కోసం అలంకరించిన శకటాలు, ఇతర ఆకర్షణలు ఉంటాయని మండల్ అధ్యక్షుడు రితేష్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: ‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతంవిగ్రహాన్ని ఏడాది పొడవునా సురక్షిత మైన ప్రదేశంలో ఉంచుతారని, గణేష్ ఉత్సవాల సమయంలో దానిని బయటకు తీసి మండప ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారని తెలిపారు. 12 రోజుల పండుగ గణేష్ చతుర్థి ఉత్సవాలు సోమవారం ప్రారంభమైనాయి.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి! -
AP : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్ మాల్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర బట్టబయలైంది. డీఎస్సీ తరహాలోనే తమకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగాదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాత పరీక్ష రద్దు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ఈ నిబంధనలను మార్చడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా, పంజాబ్, తమిళనాడు, మిజోరాం, జమ్ము కశ్మీర్, తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ట్రాలన్నింటిలోనూ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా రాత పరీక్ష నిర్వహించే భర్తీ చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం రాత పరీక్ష లేకుండా నియామకాల్ని చేపట్టేలా జీవోలు జారీ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వ బండారం బయటపడింది.24 గంటల్లోనే రెండు జీవోలు.. ఈ నియామకాల విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈనెల 13న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఒక్క రోజు తిరిగేసరికి (ఈనెల 14న), ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఏపీపీఎస్సీని ఈ ప్రక్రియ నుండి పూర్తిగా తప్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు వెలువరించింది.ఏపీపీఎస్సీని పక్కన పెట్టి, కేవలం పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంటల్ కమిటీ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడం గోల్మాల్కు నిదర్శనమని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ ఒక్కసారికే పరీక్ష లేకుండా పోస్టులు భర్తీ చేస్తాం అంటూ ప్రకటించడం అభ్యర్థుల్లో మరింత ఆందోళనను, అనుమానాలను రేకెత్తిస్తోంది. అర్హులైన నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, పారదర్శకతకు తిలోదకాలిచ్చి అడ్డదారిలో నియామకాలు చేపట్టాలని చూస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. -
రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్మ్యాన్ రోహిత్ శర్మను అధిగమించి రెండో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో పాక్ ప్లేయర్ బాబర్ ఆజం టాప్ ప్లేస్లో ఉండగా.. విరాట్ కోహ్లి, పాల్ స్టిర్లింగ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుబాబర్ ఆజం- 4596జోస్ బట్లర్- 4292రోహిత్ శర్మ- 4231విరాట్ కోహ్లి- 4188పాల్ స్టిర్లింగ్- 3895ఈ ఇన్నింగ్స్తో బట్లర్ యావత్ టీ20 ఫార్మాట్లో తన పరుగుల సంఖ్యను 14970 పరుగులకు పెంచుకొని, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రపీఠం దిశగా మరో అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉన్న కీరన్ పోలార్డ్ (14999)కు బట్లర్కు ఇక మిగిలింది కేవలం 29 పరుగుల వ్యత్యాసమే. బట్లర్ మరో 30 పరుగులు చేస్తే, పోలార్డ్ రికార్డును బద్దలు కొట్టి పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు. ఈ జాబితాలో పోలార్డ్, బట్లర్ తర్వాతి స్థానాల్లో అలెక్స్ హేల్స్ (14581), క్రిస్ గేల్ (14562), డేవిడ్ వార్నర్ (14284) ఉన్నారు.ఈ ఇన్నింగ్స్తో బట్లర్ మరో రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన వికెట్కీపర్ల జాబితాలో పాక్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరు తలో 28 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో బట్లర్, రిజ్వాన్ తర్వాతి స్థానంలో క్వింటన్ డికాక్ ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బట్లర్తో పాటు బ్రూక్ శతక్కొట్టుడుతో శ్రీలంకపై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగా.. శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సోనీ బేకర్ (4-1-12-3), లియామ్ డాసన్ (2-23), ఓవర్టన్ (2-20) అద్భుతంగ బౌలింగ్ చేసి లంక పతనాన్ని శాశించారు. ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం -
ర్యాలీ బాటలో దలాల్ స్ట్రీట్
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. రోజంతా హెచ్చుతగ్గుల నడుమ సాగిన ట్రేడింగ్లో చివరికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 23,217 పాయింట్ల వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 74,336 పాయింట్ల మార్కును చేరుకుంది.ఆసియా, యూరప్ మార్కెట్లు స్థిరంగా సాగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే సమావేశంలో వడ్డీ రేట్ల సవరణపై సరళతర వైఖరిని అవలంబించవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఇదికాస్త మార్కెట్కు నెగెటివ్ అంశామే అయినా, ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. నేటి ట్రేడింగ్లో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీలతో పాటు లాభాల బాట పట్టాయి. ఆటో, మెటల్, ఫార్మా రంగాలు లాభాల్లో దూసుకెళ్లగా, మీడియా, రియాల్టీ రంగాల షేర్లు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.సూచీలు తాత్కాలికంగా లాభపడినప్పటికీ అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల ద్రవ్యపతనం వంటి ఆర్థిక మార్పుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వల్పకాలిక లాభాల కంటే నాణ్యమైన ఫండమెంటల్స్ ఉన్న షేర్లలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టడమే సురక్షితమైన మార్గమని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
రమా నందన కేసులో అసలేం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టయిన యూట్యూబర్, నందూస్ వరల్డ్ చానల్ నిర్వాహకురాలు రమా నందన పోలీసుల ఎదుట నోరు విప్పడం లేదు. రెండుసార్లు విచారించినా పురోగతి కనిపించలేదు. ఈ నెల 8న తొలిసారి ఇబ్రహీంపట్నం పీఎస్లో విచారణ జరిపారు.నిన్న(మంగళవారం) మరోమారు అర్ధగంట పాటు మాత్రమే విచారణకు రమానందన హాజరయ్యారు. రమానందన నుంచి పోలీసులు వాస్తవాలను రాబట్టలేకపోయారు. తూతూమంత్రంగానే పోలీసులు రమానందనను విచారిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. రమా నందన మంగళవారం గుట్టుచప్పుడు కాకుండా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.వీసా స్కామ్లో ఈ నెల ఎనిమిదో తేదీన ఆమె విచారణకు హాజరైన సమయంలో ఈ నెల 16న మరో సారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఆమె ఒకరోజు ముందుగానే వచ్చి వెళ్లిపోయింది. ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులు ఇబ్రహీంపట్నం వచ్చేందుకు సిద్ధమవడంతో ఒకరోజు ముందుగానే ఆమె హాజరైనట్లు తెలుస్తోంది. మీడియా, బాధితుల కంట పడకుండా పోలీసులు ఆమెకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ‘రమానందన తన భర్తను దాచేసేది’ -
"యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు".. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలోని మొత్తం ప్రజలపై ప్రభావం చూపుతుందని, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని రాష్ట్రీయ సమాజ్ పక్ష ఎంపీ ఎన్.కె.ప్రేమచంద్రన్ పేర్కొన్నారు.పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశంలో కొందరు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఆ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు. వచ్చే సమావేశంలో దీనిని చర్చకు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.స్థాయీ సంఘం సభ్యుడు ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. వ్యాపారులకు రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫీజు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం దేశ ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందని అన్నారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 15) మార్పు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు యూపీఐ ద్వారా చేసే రూ.2,000కు మించిన బదిలీలపై 0.4 శాతం ఫీజు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు, చిన్న మొత్తాల చెల్లింపులకు ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేసింది.ఎవరు ఏమన్నారు?యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే రూ.2,000కు మించిన చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలన్న నిర్ణయంపై రాజకీయంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.రాహుల్ గాంధీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. వ్యాపారులపై విధించే ఫీజు చివరికి వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆరోపించారు. దుకాణదారులు ఈ వ్యయాన్ని వస్తువుల ధరల్లో కలిపితే సాధారణ ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతోందని కూడా ఆయన ఆరోపించారు.మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర నిర్ణయాన్ని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే సామాన్యులపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆయన ఆరోపించారు.పవన్ ఖేరా: కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా.. కొత్త 0.4 శాతం ఎండీఆర్ను “మోదీ ట్యాక్స్”గా పిలవాలని అన్నారు. యూపీఐని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తర్వాత దాని వినియోగంపై పన్ను విధిస్తున్నారని ఆయన విమర్శించారు.హారిస్ బీరన్: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాజ్యసభ సభ్యుడు హారిస్ బీరన్.. ప్రభుత్వం సాధారణ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఎండీఆర్ భారం వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయవచ్చని, దీంతో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వ వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఎండీఆర్ వినియోగదారులపై విధించే ఛార్జీ కాదని స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని, రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకు కూడా ఎండీఆర్ ఉండదని తెలిపింది. చిన్న వ్యాపారులకు సంబంధించిన జీరో-ఎండీఆర్ నిబంధనలు కొనసాగుతాయని, మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కాకుండా ఉంటాయని పేర్కొంది.బీజేపీ వాదన: ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ ఎండీఆర్ పన్ను కాదు. దీనివల్ల వచ్చే ఆదాయం బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంచబడుతుంది. యూపీఐ మౌలిక వసతులు, భద్రత, విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడమే కొత్త విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులు ఎండీఆర్ భారాన్ని ఎలా నిర్వహిస్తారు, వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉంటుందా, డిజిటల్ చెల్లింపుల వినియోగంలో ఏమైనా మార్పు వస్తుందా అనేది తదుపరి పరిశీలించాల్సిన అంశాలుగా మారాయి. -
బస్సుపై డ్రోన్ దాడి.. ఐదుగురి మృతి
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నికోపోల్ నగరం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడ్డారని ద్నిప్రొపెట్రోవ్స్క్ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ హాంజా తెలిపారు.దాడికి గురైన బస్సు కిటికీలు ధ్వంసమైన దృశ్యాలను ప్రాంతీయ గవర్నర్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. బస్సు వెలుపల రక్తం కారుతున్నట్లు కనిపించిన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. అయితే ఆ చిత్రాన్ని అంతర్జాతీయ మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఈ దాడిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యుద్ధంలో పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలను రష్యా, ఉక్రెయిన్ రెండూ ఖండిస్తున్నాయి.రైళ్లపైనా దాడులుఇదే సమయంలో ఉక్రెయిన్లోని మైకోలైవ్ ప్రాంతంలో ప్రయాణికుల రైలుపైనా రష్యా డ్రోన్ దాడి జరిగినట్లు తాత్కాలిక ప్రాంతీయ గవర్నర్ హెఓర్హీ రెషెటిలోవ్ తెలిపారు. రైలులో ఉన్న మొత్తం 168 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు, ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. తొలి దాడి తర్వాత రైలుపై మరో రెండు సార్లు దాడి జరిగినట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకారం, పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని కోవెల్లో ఓ రైలు ఇంజిన్పైనా దాడి జరిగింది.ఉక్రెయిన్ గగనతలం 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి మూసివేయడంతో, దేశంలో సాధారణ ప్రజలు, వ్యాపారాలకు బస్సులు, రైళ్లు కీలక రవాణా మార్గాలుగా మారాయి. ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం రవాణా వ్యవస్థలు, మౌలిక వసతులపై దాడులను పెంచాయి. ఉక్రెయిన్ రైల్వే సంస్థ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 120 ప్రయాణికుల బోగీలు, 304 రైలు ఇంజిన్లు, 43 రైల్వే స్టేషన్లు దెబ్బతిన్నాయి. మొత్తం 1,700 రైల్వే సదుపాయాలపై దాడులు జరిగినట్లు సంస్థ తెలిపింది.ఈ దాడుల నేపథ్యంలో రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ అమెరికా, ఐరోపా దేశాలను కోరారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలపై దాడులు, పౌరుల భద్రత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాల తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి. -
దానం నాగేందర్ అనర్హత పిటిషన్ తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంపై విచారణ చేపట్టిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో).. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. -
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో సర్ వివియన్ రిచర్ట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి.. స్టైలిష్గా షాట్లు బాదే ఈ ‘స్వాగర్’పై అప్పట్లో చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు.అలా పరిచయంఅందులో బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఒకరు. ఎనభైవ దశకంలో జైపూర్ మహారాణి ఇచ్చిన విందులో రిచర్డ్స్ను నేరుగా కలిసే అవకాశం వచ్చింది నీనాకు. అంతకుముందు రోజే అతడి మ్యాచ్ చూసిన ఆమెకు రిచర్డ్స్తో పరిచయం చెప్పలేని సంతోషాన్నిచ్చింది.ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, రిచర్డ్స్ వెస్టిండీస్కు తిరిగి వెళ్లిపోయిన తర్వాత కాంటాక్ట్ మిస్ అయింది. ఓ రోజు అనుకోకుండా ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకున్నారు. అప్పటి నుంచి స్నేహం పెరిగి ఇద్దరి మధ్య ‘బంధం’ మొదలైంది.అప్పటికే అతడికి పెళ్లి అయిపోయిందిఅలా ఇద్దరూ ఒక్కటి కాగా.. నీనా గుప్త గర్భం దాల్చింది. అయితే, అప్పటికే వివియర్ రిచర్డ్స్ వెస్టిండీస్కు వెళ్లిపోగా... ఆ తర్వాతే నీనాకు ఈ విషయం తెలిసింది. అయితే, అప్పటికే వివియన్ రిచర్డ్స్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇలాంటి తరుణంలో గర్భం కొనసాగించేందుకే నిర్ణయించుకున్న నీనా గుప్తా.. కూతురు మసాబా గుప్తాకు 1989లో జన్మనిచ్చింది. సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచి పెద్ద చేసి ఫ్యాషన్ డిజైనర్గా తీర్చిదిద్దింది. అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడుఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు గుర్తు చేసుకున్న నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్తో తనకున్న అనుబంధం గురించి వివరించింది. దీంతో వీరి రిలేషన్షిప్ మరోసారి తెరమీదకు వచ్చింది.ఇక తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూన్ తో’లోనూ నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్ గురించి ప్రస్తావించింది. ‘‘వివియన్కు, నాకు మధ్య అఫైర్ నడిచింది. అలా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తల్లిని కాబోతున్నానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.అయితే, తన బిడ్డను మోయాలా? లేదా? అనే విషయాన్ని వివియన్తో చర్చించాలని నిర్ణయించుకున్నా. నేను గర్భవతినన్న విషయం తెలిసేసరికే వివియన్ వెస్టిండీస్ చేరుకున్నాడు. ఎలాగోలా అతడి నంబర్ సంపాదించి ప్రెగ్నెంట్ అన్న విషయం చెబితే నాకు నచ్చినట్లే ముందుకు సాగమని చెప్పాడు. తన బిడ్డను నేను కనడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు’’ అని నీనా పేర్కొంది.అందుకే పెళ్లి చేసుకోలేదుఇక మరో ఇంటర్వ్యూలో వివియన్ రిచర్డ్స్ను నిజంగానే ప్రేమించి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న నీనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడిని ఇదే ప్రశ్న అడగడానికి చాలా మంది భయపడతారు. మరి నన్నెందుకు ఇంత సులువుగా అడిగేస్తున్నారు. మేము ప్రేమించుకున్నామనే నేను అనుకుంటున్నాను.కలిసి ఉన్న కొంతకాలంలోనే మాకు ఎన్నో మధురు జ్ఞాపకాలు మిగిలాయి. నటిగా ఉండటం నాకిష్టం. వివియన్ను పెళ్లి చేసుకుని నేను విండీస్కు వెళ్లలేను. అతడు కూడా నా కోసం తన కెరీర్ వదులుకుని ఇండియాకు రాలేడు. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’’ అని నీనా తెలిపింది. మసాబాకు సారీ చెప్తూనే ఉంటాఅదే విధంగా.. ‘‘ఏదేమైనా నేను పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాల్సి కాదు. ప్రతీ బిడ్డకు తల్లి.. తండ్రి.. ఇద్దరి ప్రేమా అవసరం. నేను నా కూతురు మసాబాకు ఈ విషయంలో రోజూ క్షమాపణలు చెబుతూ ఉంటా. తండ్రి లేకుండా పెరిగే క్రమంలో తను చాలా బాధ పడింది. కానీ నాపై మాత్రం ఆమెకు ప్రేమ తగ్గలేదు’’ అని నీనా గుప్తా ఉద్వేగానికి లోనైంది.కాగా మసాబాకు తండ్రి వివియన్ రిచర్డ్స్తో మంచి అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మసాబా తన తండ్రిని కలుసుకుంటూ ఉంటుంది. నీనా, ఆమె భర్త సైతం అతడితో స్నేహంగానే ఉంటారు. మసాబా పెళ్లిలో వీరు ముగ్గురు కలిసి కనిపించడం విశేషం.ఎవరి జీవితాల్లో వారు బిజీఇదిలా ఉంటే.. నీనా గుప్తా తనకు 49 ఏళ్ల వయసు ఉన్నపుడు 2008లో వివేక్ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. అమెరికాలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది. మరోవైపు.. వివియన్ రిచర్డ్స్- మిరియం రిచర్డ్స్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. నీనాతో రిలేషన్షిప్ తర్వాత వివియన్- మిరియం మధ్య విభేదాల కారణంగా కొన్నాళ్లు దూరంగా ఉన్నట్లు సమాచారం.కాగా 74 ఏళ్ల వివియన్ రిచర్డ్స్ 1974- 1991 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. వెస్టిండీస్ తరఫున 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తన అద్భుతమైన ఆట తీరుతో సర్ వివియన్ రిచర్డ్స్గా ఖ్యాతిగాంచాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. విలువ ఎంతంటే? -
రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మరో బాంబు పేల్చారు. రూ. 11 విలువైన IV సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడిపై ఈ రేంజ్లో భారాన్నిమోపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆసుపత్రుల్లో సాధారణంగా వాడే వైద్య సామాగ్రి ధరలను సమీక్షించాలనికోరారు. ఇప్పటికే ఆహార భద్రత, నిబంధనలపై విస్త్రృత దాడులు, జరిమానాలు, రద్దు లాంటి చర్యలతో పలు రెస్టారెంట్ల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తుకారం ముండే మరో సంచలనానికి తెరలేపారు.రిటైల్ అండ్ వాణిజ్య మార్కెట్లలో విక్రయించే వైద్య పరికరాల ధరల తీరును అంచనా వేసేందుకు మహారాష్ట్ర స్టేట్ ప్రైస్ మానిటరింగ్ రిసోర్స్ యూనిట్ (MSPMRU) , ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడైనాయి. ఆసుపత్రులలో వాడే వైద్య పరికరాలపై భారీ దోపిడీ జరుగుతున్నట్లు వెల్లడైంది. కొనుగోలు ధరకు, గరిష్ట దరకు, MRPకి మధ్య వందల, వేల శాతాల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.ఈ సర్వే ప్రకారం కేవలం రూ. 11 విలువ చేసే ఐవీ సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారు. అంటే దీనిపై లాభం ఏకంగా 2,841శాతం. రూ. 6.75 ఖరీదు చేసే 10 మి.లీ. సిరంజీని రూ. 57.20కి అమ్ముతున్నారు (747శాతం ఎక్కువ). రూ. 40-45 ఖరీదు చేసే నెబ్యులైజర్ మాస్క్ (Nebulizer Mask) ధర రూ. 652 నుంచి రూ. 715 వరకు బిల్లు వేస్తున్నారు (సుమారు 1,687 శాతం అదనం). అంతేకాదు రూ. 29.41 కొనుగోలు ధర గల క్యాథెటర్ దాని అసలు ధర కంటే 10 రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కలు వాణిజ్య స్థాయిలో అదుపులేని లాభార్జన జరుగుతోందని అధికారులు పేర్కొనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: ఒరాకిల్ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారంఈ భారీ ధరల పెరుగుదల అహేతుకమైనది, అన్యాయమైందీ అంటూ తుకారాం ముండే ఈ దోపిడీని తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు బేరాలాడే అవకాశం లేకపోవడంతో, ట్రేడింగ్ వర్గాలు దీనిని ఆసరాగా చేసుకుని విపరీతంగా లాభాలు గడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్స వినియోగ వస్తువులను (Surgical Consumables) డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ (DPCO), 2013 పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి! -
ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులకు బాటలు వేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. 2014 తర్వాత దాదాపు 12 ఏళ్లకు ఈ పరిమితి పెరగడంతో వేతనజీవుల్లో ఒకవైపు పొదుపు పెరుగుతుందనే ఆనందం ఉన్నప్పటికీ నెలవారీ చేతికి వచ్చే జీతం తగ్గుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.సగటు ఉద్యోగి వేతనంపై ప్రభావం ఎంతంటే..ఉద్యోగి కనీస వేతనం (బేసిక్పే+డియర్నెస్ అలవెన్స్) ఆధారంగా 12 శాతానికి తగ్గకుండా పీఎఫ్ మినహాయింపు ఉంటుంది.పాత నిబంధన (రూ.15,000 సీలింగ్): ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ చట్టబద్ధంగా గరిష్టంగా రూ.15,000 పరిమితి పైనే పీఎఫ్ను పరిగణించేవారు. దాంతో ఉద్యోగి వాటా నెలకు రూ.1,800 (12%) మాత్రమే కట్ అయ్యేది.కొత్త నిబంధన (రూ.25,000 సీలింగ్): ఇప్పుడు రూ.25,000 సీలింగ్ వర్తించడం వల్ల పూర్తి ప్రాథమిక వేతనం రూ.25,000 పై 12% లెక్కించి రూ.3,000 పీఎఫ్ వాటాగా జమ చేయాల్సి ఉంటుంది.ప్రధాన ప్రభావాలు.. ఉద్యోగికి కలిగే ప్రయోజనాలుతక్షణ నెట్ పే తగ్గింపు: ఫిక్స్డ్ సీటీసీ విధానం అనుసరించే కంపెనీల్లో పని చేసే సగటు ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.1,200 వరకు చేతికి వచ్చే నికర జీతం తగ్గుతుంది. ఇది స్వల్పకాలికంగా గృహ బడ్జెట్ లేదా ఈఎంఐ చెల్లింపులపై కొద్దిపాటి ఒత్తిడి తేవచ్చు.భారీ ప్రావిడెంట్ ఫండ్ నిధి: ఉద్యోగి వాటా రూ.1,800 నుంచి రూ.3,000 కి పెరగడం, అదే సమయంలో యజమాని వాటా కూడా పెరగడం వల్ల ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో రూ.3,600 కి(రూ.1800+రూ.1800) బదులుగా రూ.6,000 జమ అవుతుంది. చక్రవడ్డీ ప్రభావంతో 20-25 ఏళ్ల పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో అదనంగా లక్షల రూపాయిల కార్పస్ నిధి సమకూరుతుంది.పెన్షన్ (ఈపీఎస్), బీమా (ఈడీఎల్ఐ) సౌకర్యాల పెంపు: ప్రిన్సిపల్ సీలింగ్ పెరగడం ద్వారా ఉద్యోగుల పెన్షన్ నిధి (ఈపీఎస్) మినహాయింపు రూ.1,249.50 నుంచి రూ.2,082.50కి పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత లభించే నెలవారీ పెన్షన్ పరిమాణం కూడా పెరుగుతుంది.పన్ను ప్రయోజనం: ఉద్యోగి మినహాయించే అదనపు పీఎఫ్ మొత్తానికి పాత పన్ను విధానం కింద సెక్షన్ 80సీ పరిధిలో పన్ను మినహాయింపు లభిస్తుంది.ప్రస్తుత ఆర్థిక ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేస్తుందని కొందరు చెబుతున్నారు. స్వల్పకాలంలో చేతికి వచ్చే జీతంలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, పదవీ విరమణ సమయానికి ఆర్థికంగా స్థిరపడటానికి ఇది అవకాశంగా పరిణమిస్తుందంటున్నారు.ఇదీ చదవండి: టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్ -
కుప్పకూలిన భవనం.. నిద్రలోనే 16 మంది మృతి
గాజా సిటీలో బుధవారం తెల్లవారుజామున ఓ భవనం కూలిపోవడంతో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి జాహెర్ అల్ వహీది తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.కూలిపోయిన భవనంలో సుమారు 6 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా భవనం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిని, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలిసినా.. అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గాజా పౌర రక్షణ సిబ్బంది తెలిపారు. “ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది” అని సహాయక సిబ్బంది అబౌద్ మజ్దలావి పేర్కొన్నారు.భవనం కూలిన వెంటనే స్థానికులు తమ కుటుంబ సభ్యుల కోసం శిథిలాల్లో గాలించారు. కొందరు సహాయక సిబ్బందితో కలిసి శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ దుమ్ముతో నిండిన దుప్పట్లు, శిథిలాలు మాత్రమే కనిపించాయి.కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి దాదాపు ఏడాది అవుతున్నా గాజాలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గాజాలోని సుమారు 2 కోట్ల మంది జనాభా ప్రస్తుతం భూభాగంలో సగం కంటే తక్కువ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాల చుట్టుముట్టిన పరిస్థితుల్లో వారు సహాయ సామగ్రిపై ఆధారపడుతున్నారు. హమాస్ ఆయుధాలు విడిచే వరకు పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వబోమని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 73,789 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 1,375 మంది మరణించినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. -
హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సైఫాబాద్ పీఎస్లో కేటీఆర్ పీఏ, పీఆర్వో విచారణ సమయంలో దుండగులు చొరబడ్డారని మాస్క్లతో వచ్చి వారిని బెదిరించారని పిటిషన్లో తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు స్పందించింది. ఈ అంశమై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు రక్షణ కల్పించాలని తెలిపింది. -
టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్
తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత రవాణాకు ప్రోత్సాహం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపడుతున్న గ్రీన్ మొబిలిటీ ఉద్యమానికి మద్దతుగా రిలయన్స్ ఫౌండేషన్ 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని విరాళంగా అందజేసింది.బుధవారం తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తుల రవాణా అవసరాలను తీర్చేందుకు రిలయన్స్ ఈ సర్వీసులు అందించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.హామీ నెరవేర్చిన అనంత్ అంబానీగత జూన్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, కొండపై పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, స్వల్ప వ్యవధిలోనే రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ భాగస్వామ్యంతో ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ ఫౌండేషన్, జియో-బీపీ ఉమ్మడి కృషితో సాకారమైంది. రిలయన్స్ ఆర్ధిక సహకారాన్ని అందించగా, జియో-బీపీ సంస్థ అవసరమైన ఈవీ ఛార్జింగ్ వసతులను, సాంకేతిక మౌలిక సదుపాయాలను సమకూర్చింది.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ, ‘శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో భాగస్వామ్యం కావడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. తిరుమల కొండల్లోని గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే మా లక్ష్యం’ అని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాల వాడకాన్ని తగ్గించి, ఏటా తిరుమలను సందర్శించే కోట్లాది మంది భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
ఆస్పత్రిలో సెలైన్ బాటిల్తో శ్రీహరి భార్య.. ఫోటో వైరల్
దివంగత నటుడు, రియల్స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్పై సెలైన్ బాటిల్స్తో కనిపించింది. ఈ ఫోటోని స్వయంగా డిస్కో శాంతినే తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ తన హెల్త్ కండీషన్పై అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. ఆస్పత్రి నుంచి ఇంటికి కూడా చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. అయితే ఆస్పత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందనేది మాత్రం చెప్పలేదు. ఏదేమైనా ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుందని, అదే చాలని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా చేస్తున్న ఆస్మాన్ చిత్రం నుంచి ఈ రోజే టీజర్ రిలీజ్ అయింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కి డిస్కో శాంతి హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగానే ఆమె ఈవెంట్కి రానట్లు సమాచారం.(ఇదీ చదవండి: హాలీవుడ్లోకి ‘మహారాజా’.. తొలి చిత్రంగా రికార్డు!)డిస్కో శాంతి విషయానికి వస్తే.. హీరోయిన్ గా చేయకపోయిన్పటికీ అంతకు మించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 90’sలో సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా డిస్కో శాంతి ఉండాల్సిందే. బంగారు కోడి పెట్ట లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులేసిందీ శాంతి. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డిస్కో శాంతి. పెళ్లి తర్వాత సినిమాలను బాగా తగ్గించేశారామె. ఇక 2013లో శ్రీహరి మరణం తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలే జీవితంగా జీవనం గడుపుతున్నారామె. -
EPFOపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త!
సాక్షి,న్యూఢిల్లీ: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగ పెన్షన్ పథకం కింద తప్పనిసరిగా అమలు చేయాల్సిన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.25వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు దశాబ్ద కాలంగా (సెప్టెంబర్ 2014 నుండి) ఈ పరిమితి రూ.15వేల వద్దే నిలిచిపోగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న వేతనాల ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతవరకు ప్రాథమిక వేతనం రూ.15వేల వరకు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోకి రావడం తప్పనిసరిగా ఉండేది. తాజా పెంపుతో బేసిక్ వేతనం రూ.15వేల నుండి రూ.25వేలకు మధ్య ఉన్న ఉద్యోగులు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రత లభిస్తుంది.ఉద్యోగులపై ప్రభావం రూ. 15,000 కంటే ఎక్కువ వేతనం ఉండి ఇప్పటివరకు పీఎఫ్ మినహాయింపు తీసుకోని కొత్త ఉద్యోగులకు, ఇకపై ప్రతి నెలా పీఎఫ్ కింద కొంత మొత్తం కట్ అవుతుంది. దీనివల్ల వారి చేతికి అందే జీతం కొంత తగ్గినప్పటికీ,భవిష్యత్తు కోసం వారి పదవీ విరమణ నిధి పటిష్టంగా మారుతుంది.పెరిగే పెన్షన్ ప్రయోజనాలు ఈపీఎస్ పెన్షన్ లెక్కింపులో పరిగణించే గరిష్ట వేతన పరిమితి పెరగడం వల్ల, ఉద్యోగ విరమణ తర్వాత లభించే పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.యజమానులపై భారం కంపెనీలు, యాజమాన్యాలు తమ ఉద్యోగుల తరఫున పీఎఫ్,పెన్షన్కు చెల్లించాల్సిన వాటా ఎక్కువ మంది ఉద్యోగులకు వర్తిస్తుంది. దీనివల్ల కంపెనీల జీతాల నిర్వహణ వ్యయం పెరుగుతుంది. గతంలో చివరిసారిగా 2014 సెప్టెంబర్లో ఈ వేతన పరిమితిని రూ. 15,000కు పెంచారు. ఈ తాజా నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి : ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియులు సందిగ్ధంలో పడిపోయారు.ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందా? లేదా అనే డైలామాలో పడేశారు. తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడటంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొన్ని కారణాలతో త్రివిక్రమ్ ఈ సినిమా నుంచి వైదొలిగారని.. దీంతో సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. విడుదల తేదీ మార్పుపై కూడా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ 18న తెలుగు రిలీజ్ వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కేసీఆర్కు వెంటనే నోటీసులు ఇవ్వాలన్న సీఎం రేవంత్.. విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే దళితులకు పంచుతామన్నారు. కేసీఆర్ ఫాంహౌస్లో 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రేవంత్ పేర్కొన్నారు.‘‘కల్వకుంట్ల కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉంది. ఉద్యమాన్ని, ధరణిని అడ్డుపెట్టుకుని భూ దోపిడీ చేశారు. పాంహౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతా. 27 ఎకరాల ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉంది. హిమాన్షు పేరు మీద 44.6 ఎకరాల భూమి ఉంది...రామలింగరాజు కంపెనీల నుంచి కల్వకుంట్ల వారికి భూములు బదిలీ అయ్యాయి. ఫిరంగి కాల్వ భూములు ఎలా పొందారో కూడా చెబుతా. దాదాపు 700 ఎకరాలు ఫాంహౌస్ పరిధిలో ఉంది. 30 రోజుల్లో ఫాంహౌస్ భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం’’ అని రేవంత్ తెలిపారు.‘‘కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూ దోపిడీ చేసింది. కేసీఆర్ భూ దోపిడీపై విచారణ జరగాల్సిందే. విచారణకు సిట్కు అప్పగిస్తున్నాం. ఇప్పటివరకు పార్ట్-1 మాత్రమే చెప్పా. బడ్జెట్ సెషన్లో పార్ట్-2 ఉంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ‘ఐపీఎస్’ కోల్డ్వార్.. రేవంత్కు సంచలన నివేదిక -
పాక్ ప్లేయర్ను కిందకు తోసిన అభిషేక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. గత వారం మూడో స్థానంలో ఉన్న అతడు.. ఈ వారం పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను ఓ స్థానం కిందకు తోసి, రెండో స్థానానికి ఎగబాకాడు. మరో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. మరో టీమిండియా డాషింగ్ ఓపెనర్ సంజూ శాంసన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరు స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ భారత ప్లేయర్లు సత్తా చాటారు. వరుణ్ చక్రవర్తి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి.. మరో పేసర్ అర్షదీప్ సింగ్ 11 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్-3 ర్యాంక్లను కాపాడుకున్నారు.ఆల్రౌండర్ల విభాగానికొస్తే.. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, పాకిస్తాన్ సైమ్ అయూబ్, నేపాల్ దీపేంద్ర సింగ్ టాప-3లో కొనసాగుతున్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 2 స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ భారీగా మెరుగుపడ్డాయి. ఇదీ చదవండి: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!
