breaking news
-
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
టాలీవుడ్లో 'థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే డైలాగ్తో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్... కెరీర్ ప్రారంభంలో విలన్ తరహా పాత్రలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కమెడియన్గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇతడు దర్శకుడిగా మారి తన కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశాడు. గతేడాది ఇది థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. అలాంటి చిత్రం ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)పృథ్వీరాజ్ దర్శకుడిగా తీసిన సినిమా 'కొత్త రంగుల ప్రపంచం'. ఇతడి కూతురు శ్రీలు హీరోయిన్. క్రాంతి కృష్ణ హీరోగా నటించాడు. హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. గతేడాది జనవరి 20న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు దీన్ని కనీసం పట్టించుకోలేదు. తర్వాత అందరూ ఈ మూవీ గురించి పూర్తిగా మరిచిపోయారు. అలాంటిది దాదాపు ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. అయితే అద్దె విధానంలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.'కొత్త రంగుల ప్రపంచం' విషయానికొస్తే.. షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్కు డైరెక్టర్ పృథ్వీ తన బృందంతో వెళ్తాడు. ఈయన తీసే సినిమాలో శ్రీలు, క్రాంతి కృష్ణ హీరోహీరోయిన్లు. ఫామ్ హౌస్కి గురువయ్య అనే మేనేజర్ ఉంటాడు. అయితే షూటింగ్ టైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. హీరోయిన్ శ్రీలు నటించేటపుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది గమనించిన పృథ్వీ.. ఓ గురువు దగ్గరకు వెళ్తే శ్రీలుని ఓ ఆత్మ ఆవహించిందని చెబుతాడు. అసలు ఆత్మ ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే) -
ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్'
హను-మాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేయగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. 100 Crores⚔️🔥Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025 చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్ -
మోదీ వీడియో.. కాంగ్రెస్కు ఝలక్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్ను ఆదేశించింది.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి తొలగించాలని ఆదేశించారు.Bihar Congress posted this AI Generated Video about Narendra Modi and his mother.These people were screaming only a couple of weeks ago that they had nothing to do with abuse hurled at the Prime Minister's mother.Now they do this.Shocking behaviour. pic.twitter.com/rTsrZtpRFA— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 11, 2025బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
ఇళయరాజా ఫిర్యాదు.. నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ మూవీ తొలగింపు
సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తొలగించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్ చేయకుండా వదిలేస్తారో చూడాలి.కాగా,ఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు,హిందీ,తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కోర్డు ఆదేశాలతో సడెన్గా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు. -
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం(చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
బీజేపీకి చరిత్రే లేదు.. కవిత ఎక్కడ పుట్టారు?: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. కవిత ఎపిసోడ్పై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలో సెప్టెంబర్ 17పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం?. రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా?. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి. నెహ్రు సూచనల మేరకే పటేల్ సైన్యాన్ని పట్టుకొని వచ్చాడు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్రనే లేదు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.. సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు.కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది?. బీజేపీ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఇది. గుజరాత్లోని జునాఘడ్ కూడా సెప్టెంబర్ 17న ఇండియాలో విలీనం అయింది. జునాఘడ్ గురించి ఒక్క మాట మాట్లాడని బీజేపీ హైదరాబాద్ గురించి మాట్లాడడం రాజకీయం కాదా?. మోదీ వచ్చిన తర్వాత జరిగిన అనేక ఘటనలు ఎన్నికల ముందే జరిగాయి. ఎన్నికల ముందు జరిగిన ఘటనలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలే ముఖ్యం అన్నట్టు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక వచ్చిన ఘటనలపై చర్చ జరిగి నిజాలు నివృత్తి కావాలి. పహల్గాం వద్ద మిలిటరీ ఫోర్స్ ఎందుకు తొలగించారు. పహల్గాం ఘటనలో మోదీ, అమిత్ షా ఫెయిల్యూర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పందిస్తూ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ బోల్డ్గా మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై నాకు కూడా ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. కవిత ఎప్పుడు పుట్టారు?. కవిత పుట్టిన తేదీ ఎప్పుడు?. కవిత పార్టీ ఎప్పుడు పుట్టింది. జరిగింది విలీనం కాబట్టే కవిత విలీన దినోత్సవం చేస్తోంది. కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టి ఆ లైన్లో కవిత ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
వెంకయ్యా.. వెన్నుపోటు బాబును వెనుకేసుకు రావొద్దు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది. ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు లేదు. తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె. -
‘ఉపవాసంతో చురుకుదనం’.. ప్రధాని మోదీ హెల్త్ సీక్రెట్
ఈరోజు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే 75 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ ఏం తింటుంటారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. కాగా ప్రధాని మోదీ రాబోయే నవరాత్రి రోజుల్లో కఠినమైన ఉపవాస దీక్షను అనుసరిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకుండా, గోరువెచ్చని నీటిని మాత్రమే తాగుతారు.ఈ ఏడాది మొదట్లో లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ తన దినచర్యను తెలిపారు. ఉపవాసంతో తనకు కలిగిన అనుభవాలను ఆయన వివరించారు. ఆహారం మానేయడం, ఎక్కువసేపు నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల ఇంద్రియ జ్ఞానం ఏ విధంగా పెరుగుతుందో ప్రధాని తెలియజెప్పారు. ఉపవాసం అందించే మానసిక స్పష్టత, పదునుపెట్లే ఆలోచన ప్రక్రియలను ఆయన వివరించారు. ఉపవాసం అనేది వినూత్న ఆలోచనలతోపాటు ప్రత్యేకమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందని అన్నారు.ఉపవాసం అంటే కేవలం ఒక క్రమశిక్షణ మాత్రమే కాదని, అది పంచేంద్రియాలను మరింత చురుకుగా మారుస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉపవాసం చేసే సమయంలో మన ఇంద్రియాలైన వాసన, స్పర్శ, రుచి వంటివి చాలా సున్నితంగా మారతాయి. అప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ అనుభవంలోని రాని వాసనను అనుభవించగలుగుతారు. ఒకరు టీ కప్పుతో వెళ్తున్నా దాని సువాసనను పసిగట్టగలుగుమని ప్రధాని మోదీ తెలిపారు.ఉపవాసం వల్ల ఆలోచనల్లో స్పష్టత, కొత్తదనం వస్తుందని, అది వినూత్నంగా ఆలోచించడానికి, భిన్నమైన కోణంలో విషయాలను చూడటానికి సహాయపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. సంవత్సరమంతా పలు రకాల ఉపవాస దీక్షలను మోదీ పాటిస్తారు.పురాతన భారతీయుల సంప్రదాయమైన 'చాతుర్మాస దీక్ష' ను ప్రధాని మోదీ పాటిస్తారు. మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే కాలంగా దీనిని భావిస్తారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో తాను 24 గంటల్లో ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటానని మోదీ తెలిపారు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుందని, అందుకే ఈ పద్ధతి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తారన్నారు. ప్రధాని మోదీ సంవత్సరానికి రెండు సార్లు వచ్చే నవరాత్రులను చాలా కఠినంగా పాటిస్తారు.ఈ తొమ్మిది రోజులలో రోజుకు ఒకసారి, అదికూడా ఒకే రకం పండును మాత్రమే తింటానని మోదీ తెలిపారు. ఒకవేళ తాను బొప్పాయిని ఎంచుకుంటే, ఆ తొమ్మిది రోజులు బొప్పాయి తప్ప మరేమీ ముట్టుకోనని మోదీ తెలిపారు. శారదా నవరాత్రులలో ప్రధాని మోదీ పూర్తిగా ఆహారాన్ని నిలిపివేసి, 9 రోజుల పాటు కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతారు. వేడి నీళ్లు తాగడం తన దినచర్యలో ఎప్పటి నుంచో భాగమని, కాలక్రమేణా తన జీవనశైలి కి అది అలవాటు అయిపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్స్టాస్, ఫిలిప్.. ఆసీస్ భారీ స్కోరు
భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. సెంచరీతో కదంతొక్కిన కొన్స్టాస్టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్ కొన్స్టాస్ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్బెల్ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్లు), కూపర్ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.తొలి వికెట్కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్ అవుట్ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (1), ఒలీవర్ పీక్ (2)ను వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్ కనొల్లీ, లియామ్ స్కాట్ (79 బంతుల్లో 47 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పట్టుదల కనబర్చారు.దూబే... ఒక్కడే ఈ జంట ఐదో వికెట్కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్ కృష్ణ (0/47), ఖలీల్ అహ్మద్ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.జోష్ ఫిలిప్ అజేయ సెంచరీఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్ స్కాట్తో పాటు జోష్ ఫిలిప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్ స్కాట్ (81) అదరగొట్టగా.. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్ జేవియర్ బార్ట్లెట్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 2, నారాయణ్ జగదీశన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో..ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు -
దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్
యూట్యూబర్, మీమర్ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా సినిజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.సెలబ్రిటీల ప్రశంసలు సినిమా బాగుందంటూ గోపీచంద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ మహేశ్కు పెద్ద ఫ్యాన్స్. ముఖ్యంగా సినిజిత్.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్బాబు లిటిల్ హార్ట్స్ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. దయచేసి ఎక్కడికీ వెళ్లకు'లిటిల్ హార్ట్స్ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్బాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్ చూడగానే సినిజిత్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు. NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025 చదవండి: మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు -
మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన బయోపిక్ని ప్రకటించారు. 'మా వందే' పేరుతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. ఈ సినిమాలో మోదీగా పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు సీహెచ్.క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు.ప్రస్తుతానికైతే ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో 'ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది' అని రాసుకొచ్చారు. అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ తీయబోతున్నారా అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని బహుశా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అయితే 2019లోనే 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్ అనమాట.(ఇదీ చదవండి: పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు: మంచు లక్ష్మీ) -
నేపాల్లో ఉద్యమానికి ‘డిస్కార్డ్’ సహకరించిందా?
నేపాల్లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్జీ యువతకు కమ్యునికేషన్ సాధనంగా ‘డిస్కార్డ్’ యాప్ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్ యాప్లో ఇంటర్నల్ కమ్యునికేషన్ టూల్గా వాడే డిస్కార్డ్ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్నేవిస్క్ 2015లో డిస్కార్డ్ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్ఫామ్. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్ కమ్యునికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంతృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్ టూల్స్లో ఉన్న డిస్కార్డ్ యాప్ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్లోడ్ల పరంగా డిస్కార్డ్ నాలుగో అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇది మొత్తం ఇన్స్టాల్స్లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే -
చార్లీ కిర్క్ కేసులో విస్తుపోయే వాస్తవాలు!
కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైలర్ రాబిన్సన్(22).. ఎందుకు చంపాడన్నదానిపై దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే కిర్క్ భావజాలమే ఆయన హత్యకు కారణమైందన్న చర్చ ఇప్పుడు అక్కడ నడుస్తోంది. చార్లీ కిర్క్ హత్య కేసులో నిందితుడు టైలర్ రాబిన్సన్(Tyler Rabinson)ను తాజాగా కోర్టులో ప్రవేశపెట్టారు. మాసిన గడ్డంతో.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో అతను విచారణకు హాజరయ్యాడు. నేర తీవ్రత దృష్ట్యా అతనికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తన భాగస్వామికి చేసిన సందేశాలను నేరాంగీకరంగా పరిగణించాలని కోరుతున్నారు. కోర్టు పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం.. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వ్యవస్థాపకుడైన కిర్క్ సెప్టెంబర్ 10వ తేదీన ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన అమెరికన్ కమ్బ్యాక్ కార్యక్రమంలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్న క్రమంలో.. ఓ తూటా దూసుకొచ్చి ఆయన గొంతులో దిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించి.. కాల్పుల తర్వాత గనతో ఓ వ్యక్తి ఓ భవనం మీద నుంచి దూకి పారిపోతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఏజెన్సీలు ఆ మరుసటి రోజే 22 ఏళ్ల రాబిన్సన్ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఆ సమయంలో తన రూమ్మేట్.. ట్రాన్స్జెండర్ భాగస్వామితో అతను జరిపిన చాటింగ్లో హత్యకు కారణాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతనిపై(చార్లీ కిర్క్) ద్వేషాన్ని ఇంక భరించలేకపోతున్నా. కొన్ని ద్వేషాలు ఏరకంగానూ తొలగిపోలేవు అని ఓ సందేశాన్ని తన భాగస్వామికి పంపాడతను. అంతేకాదు.. ఘటనకు సరిగ్గా వారం కిందటి నుంచి ప్రణాళిక వేసుకున్నాడని, కిర్కీని ఎందుకు చంపాలనుకునే విషయాలను గతన గదిలో ఓ పేపర్పై రాసుకున్నాడు. అంతేకాదు.. గదిలోని కంప్యూటర్ కీ బోర్డు కింద‘‘ అవకాశం దొరికితే చార్లీ కిర్క్ను అంతమొందిస్తా’’ అంటూ రాసిన ఓ నోట్ కూడా దొరికింది. అయితే ఆ నోట్ను అతని భాగస్వామి తొలుత ప్రాంక్గా భావించిందట.కానీ కాల్పుల ఘటన తర్వాత తన పార్ట్నర్కు మెసేజ్ పంపి.. అది జోక్ కాదనే విషయాన్ని రాబిన్సన్ ధృవీకరించాడు. ‘‘ఈ విషయాన్ని ఎప్పటికీ నీకు చెప్పకూడదనుకన్నా. నేను ఇప్పటివరకైతే బాగానే ఉన్నా. హత్య జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయా. దాచిన నా రైఫిల్ను తీసుకోవాలసి ఉంది. త్వరలో ఇంటికి వస్తానేమో. ఇందులోకి నిన్ను ఇందులో లాగినందుకు నన్ను క్షమించు. నీ కోసమే నా బాధంతా’’ అంటూ మెసేజ్లు పెట్టాడు. ఒకవేళ తాను దొరికిపోతే.. అధికారులు నీ దాకా వస్తారని, ఆ సమయంలో నోరు మెదపొద్దని ఆ భాగస్వామికి సూచించాడు. ఆ తర్వాత ఆ మెసేజ్లను డిలీట్ చేశాడు. ఇక.. ఘటన తర్వాత దొరికిన క్లూస్ ఆధారంగా పోలీసులు సెయింట్ జార్జ్లోని రాబిన్సన్ నివాసంలో సోదాలు జరిపారు(ఈ ప్రాంతం కిర్క్ హత్య జరిగిన ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది). ఆ తనిఖీల్లో దొరికిన ఆధారాలతో చార్లీ కిర్క్కు చంపింది అతనేనని నిర్ధారించుకున్నారు. అరెస్ట్ చేసి వాషింగ్టన్ కౌంటీ జైలుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన రైఫిల్ను ఘటనా స్థలంలోని పొదల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో విచారణకు అతను సహకరించకపోయినా.. అతని కుటుంబ, స్నేహితులు కీలక విషయాలనే వెల్లడించారు. తన కొడుకు కొంతకాలంగా ఓ ట్రాన్స్జెండర్తో రిలేషన్షిప్లో ఉన్నాడని, అప్పటి నుంచి అతని ఆలోచన ధోరణి మారిందని, రాజకీయంగానూ వామపక్ష భావజాలం వైపు అడుగులేశాడని రాబినసన్ తల్లి అంటోంది. ప్రస్తుతానికి రాబిన్సన్పై ఏడు కేసులు నమోదు అయ్యాయి. దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ కేసు దర్యాప్తుపై స్పందించారు. డిస్కార్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో రాబిన్సన్తో కొందరు చాటింగులు చేశారని, వాళ్ల వివరాలు సేకరించి విచారణ జరపుతామని ప్రకటించారాయన. కన్జర్వేటివ్ భావజాలం, దీనికి తోడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీపై చార్లీ కిర్క్ వెల్లగక్కిన ద్వేషమే.. అతని పాలిట శాపమైంది. ఈ ధోరణిని భరించలేకనే టేలర్ రాబిన్సన్ ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడనే విషయం కోర్టు డాక్యుమెంట్ల ద్వారా ఇప్పుడు బయటకొచ్చింది. -
తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్గా జనరల్గా వీణాకుమారి
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్గా డాక్టర్ వీణా కుమారి డెర్మల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఆమె పదోన్నతితో తెలంగాణ సర్కిల్కు బదిలీ అయ్యారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1998 బ్యాచ్ అధికారి అయిన వీణాకుమారి ఆ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. తపాలా శాఖ ఇటీవలే ప్రారంభించిన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 తయారీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేసి ఆ శాఖలో పలు సంస్కరణలు ప్రారంభించటంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు సెంట్రల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్గా, ఢిల్లీ ఢాక్ భవన్ పీఎంయూ డైరెక్టర్గా, మైసూరు పోస్టల్ శిక్షణ కేంద్రం డైరెక్టర్గా, ధార్వాడ్ రీజియన్ డైరెక్టర్గా కూడా ఆమె విధులు నిర్వర్తించారు. (చదవండి: ‘రండి.. ఫొటో దిగుదాం’) -
తెలంగాణ విమోచన వేడుకలు.. అమరవీరులకు రాజ్నాథ్ నివాళులు
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనిక అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఇదే సందర్భంలో కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని కూడా రాజ్నాథ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ రోజు మూడు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటున్న శుభదినమన్నారు. ఈ రోజున మోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం జరుపుకుంటున్నామన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించారని, తెలంగాణలో ఎన్నో జలియన్ వాలా బాగ్ లు జరిగాయన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి విముక్తి కల్పించడంతోనే మనం భారత్ లో ఏకమయ్యామన్నారు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ కు స్వేచ్ఛను ఇచ్చిన మహనీయునిగా గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. తెలంగాణ వీరులను రాష్ట్ర ప్రభుత్వం అవమనిస్తున్నదని బండి సంజయ్ ఆరోపించారు.బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రను తొక్కి పెట్టాలని ఇక్కడి రాష్ట్ర పాలకులు చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఇక్కడి ప్రభుత్వానికి ఎం వచ్చిందని నిలదీశారు. హైదరాబాద్ లిబరేషన్ డే జరగకుండా ఉండటానికి కారణం ఎంఐఎం పార్టీ అని, ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాడవాడలా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, మోదీ నేతృత్వంలో దేశం మరింత పురోగమిస్తున్నదన్నారు. -
బుద్దా భవన్ వద్ద ఉద్రిక్తత.. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: బుద్ధా భవన్ హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని బుద్ధా భవన్ వద్ద డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ఆందోళనలకు దిగారు. రాత్రి, పగలు తమతో పనులు చేయించుకుని.. జీతంలో ఐదు వేలు కట్ చేశారని నిరసన చేపట్టారు. అయితే, గతంలో జీహెచ్ఎంసీ అండర్లోని ఈవీడీఎంలో పనిచేసిన 1100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది.. ప్రస్తుతం హైడ్రాలోని డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది.ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం.. అందరికీ ఒకేలా జీతాలు అందాల్సి ఉన్నప్పటికీ తమకు మాత్రం 5000 కట్ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం కట్ అయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు జీతంలో కోత విధించారో చెప్పాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతం ఇచ్చే వరకు ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనల్లో పాల్గొంటామన్నారు. -
కాగ్నిజెంట్ సమాచారాన్ని ఇన్ఫోసిస్ దుర్వినియోగం?
ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఇన్ఫోసిస్-కాగ్నిజెంట్ మధ్య నెలకొన్న యాంటీట్రస్ట్ వివాదాన్ని యూఎస్ ఫెడరల్ కోర్టు అధికారికంగా ఫిబ్రవరి 1, 2027న ఉన్నత స్థాయి జ్యూరీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ (డల్లాస్ డివిజన్) కోర్టు ఇటీవల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ ప్రారంభానికి ముందు జనవరి 25, 2027న ప్రీ-ట్రయల్ కాన్ఫరెన్స్ను షెడ్యూల్ చేసినట్లు కోర్టు పేర్కొంది.అసలు వివాదం ఏంటి?బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అయిన ట్రైజెట్టోకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. హెల్త్కేర్ ఐటీ స్పేస్లో పోటీని బలహీనపరుస్తూ, ప్రత్యర్థి ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ ఈ సమాచారాన్ని ఉపయోగించిందని దావాలో పేర్కొంది.ఇన్ఫోసిస్ వాదన..ఇన్ఫోసిస్ దీనిపై స్పందిస్తూ ఈ వాదనలను ఖండించింది. హెల్త్కేర్ ప్లాట్ఫామ్ మార్కెట్లోకి ఇతర కంపెనీలు ప్రవేశించకుండా నిరోధించడానికి కాగ్నిజెంట్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుందని ఆరోపించింది. మేధో సంపత్తిని రక్షించడం కంటే పోటీని అణచివేసే లక్ష్యంతోనే కాగ్నిజెంట్ ముందుకెళ్లిందని కౌంటర్ క్లెయిమ్లో పేర్కొంది. 2024లో ప్రారంభమైన ఈ చట్టపరమైన వివాదంపై 2027లో విచారణ జరగనుంది.మధ్యవర్తిత్వం అవసరం..యాంటీట్రస్ట్ చట్టాలు, ధరల వ్యూహాలు, క్లయింట్ కాంట్రాక్ట్ నిర్మాణాలు, పోటీ మార్కెట్ డైనమిక్స్ సంక్లిష్ట స్వభావాన్ని బట్టి ఈ కేసు నిపుణుల సాక్ష్యంపై ఎక్కువగా ఆధారపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు విచారణకు చేరుకునే ముందే ఇరు వర్గాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అందుకు జులై 9, 2026 నాటికి మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసింది. రెండు పార్టీలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాలని లేదా జులై 16, 2026 నాటికి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పింది.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే -
భార్య చేతులు కట్టేసి బెల్టుతో చితకబాదిన భర్త
ప్రకాశం జిల్లా: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచూ తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. శనివారం రాత్రి కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ.. స్థానికంగా ఉండే బేకరీలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న భార్య భాగ్యలక్ష్మిని అటకాయించాడు.మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన అక్క రమణ, మేనల్లుడు విష్ణు, బాలాజీ మరో భార్య కలిసి భాగ్యలక్ష్మిని బైకుపై బలవంతంగా ఎక్కించుకొని.. అక్క ఇంటికి తీసుకువెళ్లి తాళ్లతో నిర్బంధించాడు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు చిత్రహింసలకు గురిచేసి విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి చిత్రహింసలు పెట్టేందుకు బాలాజీ యత్నించగా ఆమె తప్పించుకొని ఎస్సీ కాలనీలోకి పరుగెత్తింది. స్థానిక చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు బాలాజీని, అతని మేనల్లుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక యువకులు 112కు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన పోలీసులు బాధిత మహిళను ఫొటో తీసుకుని బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్పై ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసినట్లు సమాచారం. శనివారం చేసిన చిత్రహింసను బాలాజీ రెండో భార్య వీడియో తీయగా అది మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కాగా మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై విలేకరులతో తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో ప్రచురితం కావడంతో దర్శి సీఐ, తర్లపాడు ఎస్సై కలుజువ్వలపాడు గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ప్రకాశం తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం భార్యను కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నిన భర్త#prakasham #tharlupadu #husbandkickswife #andhrapradesh #uanow pic.twitter.com/vqiLth1eOd— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 16, 2025 -
‘రండి.. ఫొటో దిగుదాం’
అది తెలంగాణ రాష్ట్రంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లోని మొదటి అంతస్తు.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతం.. అమీర్పేట నుంచి అక్కడకు రీలోకేట్ అయిన పాస్పోర్టు సేవా కేంద్రం (పీఎస్కే) ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలో (ఎంఈఏ) సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న చీఫ్ పాస్పోర్టు ఆఫీసర్ డాక్టర్ కేజే శ్రీనివాస ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫొటో సెషన్ నడిచింది. పాస్పోర్టు కార్యాలయం, పీఎస్కే ఉద్యోగులు, అతిథులు ఆయనతో ఫొటోలు దిగారు. టోలిచౌకి నుంచి రాయదుర్గానికి రీలోకేట్ అయిన పీఎస్కేను ప్రారంభించాల్సి ఉంది. అందరూ అక్కడకు వెళ్లే హడావుడిలో ఉండగా.. ‘రండి ఫొటో దిగుదాం’ అనే మాట శ్రీనివాస నోటి వెంట వచి్చంది. అక్కడ ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహా్వనించిన ఆయన రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ స్నేహజ జోన్నలగడ్డతో కలిసి ఫొటోలు దిగారు. ‘మా కేంద్రాలు సజావుగా నిర్వహించడానికి మీరూ కీలకమే’ అంటూ ఆ పారిశుద్ధ్య, సెక్యూరిటీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు.ఎవరీ శ్రీనివాస? బెంగళూరుకు చెందిన కోటేహాల్ జయదేవప్ప శ్రీనివాస మైసూర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించారు. 2002 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. బెంగళూరులోని రీజనల్ పాస్పోర్టు కార్యాలయం నుంచి పాస్పోర్టు పొందడానికి శ్రీనివాస 1997లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో దాని కోసం ఉదయం 5 గంటలకే ఆర్పీఓ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అన్ని వెరిఫికేషన్లు పూర్తయి, పాస్పోర్టు పొందడానికి 60 రోజులు వేచి ఉన్నారు.ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న శ్రీనివాస తాను ఐఎఫ్ఎస్ అధికారి అయిన తర్వాత పాస్పోర్టు జారీలో సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకీ మొబైల్ పాస్పోర్టు సేవా వ్యాన్లు మొదలు చిఫ్ బేస్ట్ ఈ–పాస్పోర్టుకు రూపం ఇవ్వడంలోనూ పాత్ర కీలక పాత్ర వహించారు.. (చదవండి: ఓవైపు అసిస్టెంట్ కమిషనర్గా..మరోవైపు కళాకారిణిగా..) -
ఆల్టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆసియా కప్ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఫాస్ట్బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉన్న ఆల్టైమ్ ఆసియా కప్ టీ20 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.రెండు వికెట్లు పడగొట్టిన రషీద్బంగ్లాదేశ్తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో తలపడింది. అబుదాబిలో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఓపెనర్లు సైఫ్ హసన్ (30), తాంజిద్ హసన్ (52)లతో పాటు తౌహీద్ హృదోయ్ (26) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు స్కోరు చేసింది. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో అఫ్గన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో 26 పరుగులు ఇచ్చి.. సైఫ్ హసన్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోవడంతో పాటు షమీమ్ హొసేన్ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రషీద్ ఖాన్ అవతరించాడు.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది వీరే👉రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 10 మ్యాచ్లలో కలిపి 14 వికెట్లు👉భువనేశ్వర్ కుమార్ (భారత్)- 6 మ్యాచ్లలో కలిపి 13 వికెట్లు👉అమ్జద్ జావేద్ (యూఏఈ)- 7 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు👉వనిందు హసరంగ (శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు👉హార్దిక్ పాండ్యా (భారత్)- 10 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు.ఆఖరి వరకు పోరాడినా..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గనిస్తాన్ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.అఫ్గన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్ (30) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో చెలరేగగా.. సనూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక అఫ్గన్కు సూపర్-4 ఆశలు సజీవంగా ఉండాలంటే.. తదుపరి మ్యాచ్లో శ్రీలంకను తప్పక ఓడించాలి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!Rashid Khan proves his genius, even in a loss 🌟 Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/voUMwhtD2g— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే.. మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...నిజానికి ఈ స్టోరీని సాద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్ రోనిన్ మోటర్ సైకిల్ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్ తన ఎక్స్ ఖాతాలో ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్, ట్విట్టర్, ఎఫ్బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్ అనేది అందుకే మరి!. టెక్ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్కు జై అనాల్సిందే! -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
జాతీయ అవార్డుగ్రహీత నుంచి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’
‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాలోని ప్రతి పాత్ర పురాణాల నుంచి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. మనుషుల వ్యక్తిత్వాలు, ఇతర ఆలోచనలన్నింటినీ మా చిత్రంలోని పాత్రలు ప్రతిబింబిస్తాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనే ట్యాగ్లైన్ పెట్టాం. నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ నరసింహా నంది చెప్పారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేశ్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహనా సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. జాతీయ అవార్డుగ్రహీత నరసింహా నంది రచన, దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్పై దైవ నరేశ్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరసింహా నంది మాట్లాడుతూ– ‘‘గ్రామీణ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో మా చిత్రంలో సరికొత్తగా చూపించాం’’ అని తెలిపారు. ‘‘తొలి ప్రాజెక్ట్గా ఇటువంటి మంచి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరో మూడు సినిమాలు రానున్నాయి’’ అన్నారు దైవ నరేశ్ గౌడ. ‘‘ఒక గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు మహిళా శక్తిని జోడించి, తీసిన సినిమా ఇది’’ అని పరిగి స్రవంతి మల్లిక్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సిద్ధార్థ్, నటీనటులు శ్రీలు, మోహనా సిద్ధి, విక్రమ్ జిత్ పేర్కొన్నారు. -
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు -
ఓవైపు అసిస్టెంట్ కమిషనర్గా..మరోవైపు కళాకారిణిగా..
నృత్యం ఓ తపస్సు.. ఇందులో రాణించాలంటే.. ఏదో నేర్చుకున్నామంటే సరిపోదు.. ఓ యజ్ఞంలా నిత్యం సాధన చేయాలి.. అలాంటి ఓ గొప్ప కళపై ఆమె ప్రాణం పెట్టేశారు. ఎంతలా అంటే.. ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యసించేంతలా. ఆమె ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న వెంట్రప్రగడ వాణి భవాని. ఓ వైపు అధికారిగా, మరోవైపు కళాకారిణిగా, గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తన అడుగుజాడలనే అనుసరిస్తూ చిన్న వయసులోనే నృత్యంలో ప్రతిభ చూపుతున్న తన కుమార్తెకు కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు.. వివిధ కళారూపాల సమాహారం నృత్యం. సంగీతం, సాహిత్యం, మానసిక శాస్త్రం ఇలా అనేక కళలు కలిస్తేనే నృత్యం. అలాంటి కళతో నాకు బాల్యంలోనే పరిచయం ఏర్పడింది. క్రమంగా నా జీవితంతో పెనవేసుకుపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాభ్యాసం సమయంలో డాన్స్ క్లాస్ ఉండేది. టీచర్లు కూడా ప్రోత్సహించేవారు. అప్పటినుంచే నృత్యం పట్ల మక్కువ ఏర్పడింది. భక్తి శ్రద్ధలతో ఎలాగైనా ఈ కళలో మాస్టర్ కావాలని సంకల్పించా. దీనికి కళాతపస్వి కె.విశ్వనాథ్ ‘స్వర్ణ కమలం’ మరింత స్ఫూర్తినిచ్చింది. చివరికి ఆయన సమక్షంలోనే అరంగేట్రం పూర్తిచేశా.ఆరంభం ఇలా.. ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చాం. నల్లకుంటలోని అమ్మమ్మ ఇంట్లో ఉండే వాళ్లం. అక్కడ సుప్రసిద్ధ నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గర చేరాను. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నాన్నగారు హఠాత్తుగా మరణించారు. దీంతో కారుణ్య నియామకంలో ఆయన ఉద్యోగం ఇచ్చారు. కరీంనగర్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో నృత్యాభ్యాసం ఆగిపోయే పరిస్థితి. ఎలాగైనా కొనసాగించాలన్న నా సంకల్పానికి అమ్మ, సోదరి అండగా నిలిచారు. నాట్య గురువు ప్రోత్సాహంతో వారంతాల్లో 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యాసం పూర్తిచేశా. ఇప్పటి వరకూ 75 కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందా. నా భర్త భరణి, అత్తగారింటి సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. నా కుమార్తె అనన్య సైతం నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గరే శిక్షణ పొందుతోంది.ఏకాగ్రత పెరుగుతుంది..ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణ, నాట్యం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నా. నృత్యం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ఇది కదలికల ద్వారా చేసే ధ్యానం లాంటిది. అర్థంతో, లయతో కదలికలను సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో భంగిమలను సరిగ్గా ప్రదర్శించగలగాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. సంప్రదాయ నృత్యం రూపకల్పనలో కుడివైపు, ఎడమవైపు కదలికలు ఉంటాయి. దీనివల్ల మెదడులోని ఇరు భాగాలనూ సమానంగా ఉపయోగించే సామర్థ్యం కలుగుతుంది. దుస్తులు, ఆభరణాలు, మేకప్, రంగాలంకరణతో సహా నృత్యంలో అనేక అంశాలుంటాయి. దీనికి ఎంతో ఓపిక అవకసం. నేటి తరం పిలల్లోని అసహనాన్ని నృత్యాభ్యాసం నివారిస్తుంది. గురువులకు ఇచ్చే గౌరవం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని, పక్షులను కాపాడటం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా. (చదవండి: మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..) -
నేపాల్ బాలిక అదృశ్యం
లక్ష్మీపురం: నేపాల్కు చెందిన బాలిక అదృశ్యమైన ఘటనపై అరండల్పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన గోవింద్ తాప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడ హోటల్లో పని చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం గోవింద్ తాప కుమార్తె సరిత కుమారి మరి కొంత మందితో కలిసి గుంటూరుకు వచ్చి, గుంటూరులోని రైల్వే కోచ్ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈనెల 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న తండ్రి గోవింద్ తాప గుంటూరు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధుమిత్రుల వద్ద ఎంత వెతుకులాడినా ఆచూకీ తెలియక పోవడంతో దిక్కు తోచక అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అరండల్పేట పోలీసు స్టేషన్ 0863–2231955, సీఐ ఆరోగ్య రాజు 8688831332, ఎస్ఐ రోజాలత, 8688831334, నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా సూచించారు. -
సంక్షేమ రాజ్యం కోసం పోరు తప్పదు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణ భవన్లో జరిగిన సెప్టెంబర్ 17 వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ బిడ్డలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజని అన్నారు. ఈ రోజును విమోచనమని అన్నా, విలీనమని అన్నా ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన దినం అన్నది వాస్తవమని చెప్పారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్ఎస్ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా కేటీఆర్..‘తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసింది’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని గ్రూప్-1 విద్యార్థులు తమ ఆకాంక్షను వ్యక్తం చేసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో దాడి చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని, సెప్టెంబరు 17వ తేదీని సమైక్య దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తున్నారట!
తూర్పు గోదావరి జిల్లా: జనసేన నాయకుల ప్రచార ఆర్భాటానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. మమ్మల్ని ఎవర్రా అడిగేది అంటూ నిసిగ్గుగా ప్రభుత్వం అమలు చేయని పథకాన్ని కూడా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిడదవోలులోని ఓవర్ బ్రిడ్జిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, రాష్ట్ర మంత్రి దుర్గేష్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలలో ప్రభుత్వ అమలు చేయని పథకాన్ని కూడా ముద్రించారు. సూపర్ సిక్స్, సూపర్ హిట్ అంటూ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటూ ఫ్లెక్సీలో ప్రచారం చేసుకుంటున్నారు. వీటిని చూసి పట్టణ ప్రజలు, ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి నాయకులు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కానీ ఈ పథకం అమలు చేస్తున్నట్టు ఫ్లెక్సీలో ముద్రించడం హాస్యాస్పదంగా మారింది. మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ఈ వీటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. -
యూకేలో ముంబై కంటెంట్ సృష్టికర్త బైక్ చోరీ.. అంతలోనే ఊహించని కానుక
ముంబై: బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరిన ముంబై కంటెంట్ సృష్టికర్త యోగేశ్ అలెకరికి యూకేలో చేదు అనుభవం ఎదురైంది. నాటింగ్ హామ్ లోని ఓ పార్క్ లో పెట్టిన అతని బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై యోగేష్ ఒక వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. దీనికి స్పందిస్తూ ఒక బైక్ కంపెనీ యోగేశ్ అలెకరికి ఊహించని కానుక ఇచ్చింది. దీంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.తన బైక్ చోరీకి గురైన సందర్భంలో యోగేష్.. తాను స్థానికంగా ఉంటున్న ఓ స్నేహితుడిని కలిసి, బ్రేక్ ఫాస్ట్ చేసి, తిరిగొచ్చేసరికి బైక్ మాయమైందని తెలిపాడు. నలుగురు యువకులు తన బైక్ ను ఎత్తుకెళ్లారన్నాడు. పాస్ పోర్ట్, వీసా తదితర డాక్యుమెంట్లతో పాటు డబ్బు కూడా అందులోనే ఉందన్నాడు. తాను కట్టుబట్టలతో మిగిలానని ఆవేదన వ్యక్తం చేశాడు. 2025 మే 1న ముంబై నుంచి బైక్ పై ప్రపంచయాత్రకు బయలుదేరినట్లు యోగేశ్ చెప్పారు. యోగేష్ ఇప్పటి వరకు.. 118 రోజుల్లో 17 దేశాలను చుట్టాడు. మొత్తంగా 24 వేల కిలోమీటర్లు తిరిగానని యోగేశ్ తెలిపాడు. బైక్ చోరీ కారణంగా యాత్ర కొనసాగించడం సాధ్యం కాదని యోగేష్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.ఈ వీడియోను చూసిన యూకేకి చెందిన ది ఆఫ్ రోడ్ సెంటర్ అనే మాన్స్ఫీల్డ్ వుడ్హౌస్ మోటార్సైకిల్ డీలర్షిప్.. కంటెట్ సృష్టికర్త యోగేష్ అలెకరికి తమ సంస్థ అప్గ్రేడ్ వెర్షన్ బైక్ను కానుకగా ఇచ్చింది. దీని సాయంతో అలెకరి ఆఫ్రికాలో తన చివరి దశ పర్యటనను కొనసాగించాడు. ఊహించని విధంగా బైక్ను కానుకగా అందుకున్న అలెకరి మాట్లాడుతూ 10 రోజుల తర్వాత, తాను ఆనందంగా నవ్వగలుగుతున్నానని, తాను ఇలాంటి మద్దతును ఎప్పుడూ ఊహించలేదన్నాడు. ది ఆఫ్ రోడ్ సెంటర్ యజమాని డేనియల్ వాట్స్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో యోగేష్ అలెకరి పోస్ట్లను చూసి, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. -
పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య
మూసాపేట: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూసాపేట యాదవ బస్తీలో నివాసముండే సూరవరపు రమ్య (18)కు మూడు నెలల క్రితం అశోక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూతురు, అల్లుడు అత్తింట్లోనే ఉంటున్నారు. సోమవారం రాత్రి అందరు కలిసి భోజనం చేసిన అనంతరం..రమ్య ముందుగా తన రూమ్కు వెళ్లి ఫ్యాన్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త భోజనం ముగించి రూముకు వెళ్లగా డోర్ తెరుచుకోలేదు. దీంతో అందరూ కలిసి తలుపులు తెరవగా రమ్య ఫ్యాన్కు వేలాడుతూ కని్పంచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..
ఓ మైపు మాన్సూన్ సీజన్ ముగింపు దశకు చేరుకొంది. దీంతో పాటు ట్రెక్కింగ్ సీజన్ మొదలవుతోంది.. ప్రస్తుత వాతావరణం ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉండడంతో నగరంలోని ఔత్సాహికుల్లో జోష్ నెలకొంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యువత ట్రెక్ పాయింట్లలో, పలు పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో కనువిందు చేసే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్వతాలు, లోయలు, జలపాతాలకు బ్యాక్ప్యాక్తో పయనమవుతున్నారు. రుతుపవనాలు ముగింపు సీజన్లో ట్రెక్కింగ్ ట్రెండ్ పీక్స్కు చేరుతుంది. దీంతో నగరం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ట్రెక్ పాయింట్లకు నగర పర్యాటకుల సందడి మొదలైంది. వర్షాలు పర్వతాలపై అద్భుతమైన పచ్చదనాన్ని పరుస్తాయి. మరోవైపు పర్వతాలపై నుంచి ఎగసిపడే జలపాతాలు ప్రకృతి సోయగాన్ని రెట్టింపు చేస్తాయి. పచ్చని లోయలు, కొండ ఉపరితలాలపై పొగమంచు దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. పచి్చకబయళ్ళు, పూలతో నిండిన గుట్టలు ట్రెక్కింగ్కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వీటన్నింటి మధ్య నడుస్తూ చిరు చినుకుల్లో తడుస్తూ మధురానుభూతులను పోగు చేసుకోడానికి ట్రెక్కర్స్ ఉత్సాహం చూపుతుంటారు. మన సిటీకి.. ‘మహా’ ఇష్టం.. మహారాష్ట్రలోని పలు ట్రెక్ పాయింట్స్ నగరవాసులకు ఇష్టమైన జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా లోనావాలాలోని రాజ్మాచీ ట్రెక్ ఒకటి. మబ్బులు, లోయలు, జలపాతాలతో ఈ ట్రెక్ ఆద్యంతం అలరిస్తుంది. అలాగే అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర ఘడ్ ట్రెక్ కూడా నగర ట్రెక్ కమ్యూనిటీలో బాగా పాపులర్. పశ్చిమ కనుమల్లోని పురాతన కొండపై కోటకు నడకమార్గం ప్రకృతి ప్రేమికులతో పాటు సాహసికులకు కూడా ఇష్టమైన రూట్. గుహలు, కోట అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యం కూడా దీని సొంతం. ప్రారంభకులకు అనుకూలమైనది. అదే విధంగా టోర్నా.. ఫోర్ట్ ట్రెక్ కూడా మరో క్రేజీ ట్రెక్. టోర్నా ఫోర్ట్ ట్రెక్ లేదా ప్రచండగడ్, పుణె సమీపంలో ఒక రోజు ట్రెక్, ఇది 4,603 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరానికి 2–3 కి.మీ (ఒక వైపు) ట్రైల్తో సవాలుతో కూడుకున్న ట్రెక్. ఛత్రపతి శివాజీ మహరాజ్ మొదటి కోటగా చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ సీజన్లో ఫ్లవర్ బెడ్స్తో చక్కని దృశ్యాలను అందిస్తుంది. ట్రెక్ చకచకా..గో కర్ణాటక.. ట్రెక్కర్స్కు కలల ప్రదేశం కర్నాటకలోని చిక్ మగళూరులోని కుద్రేముఖ్ ట్రెక్. సుమారుగా 19–21 కి.మీ (రౌండ్ ట్రిప్) దూరం ఉండే ఈ ట్రెక్, కాస్తంత అనుభవం ఉన్న ట్రెక్కర్స్కు బెస్ట్. ఈ ట్రెక్ 1,892 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం దట్టమైన గడ్డి భూములు, షోలా అడవులకు ప్రసిద్ధి. ఈ ట్రెక్లో ప్రవాహాలను దాటుతూ, ‘ఒంటరి చెట్టు‘ (ఒంటిమార) వంటి ప్రదేశాల గుండా ప్రయాణించి, శిఖరాన్ని చేరుకోవాలి. ఈ ట్రెక్కు రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే ట్రెక్కర్స్కు అనుమతిస్తారు. సాధారణంగా జూలై నుంచి నవంబర్ వరకు సీజన్. దీనికి సమీపంలోనే నేత్రావతి ట్రెక్ కూడా ఉంది. స్కందగిరి హిల్స్ : బెంగళూరు నుంచి 60–65 కి.మీ దూరంలో ఉన్న స్కందగిరి హిల్స్ కూడా కాసింత కఠినమైన సవాలుతో కూడిన ట్రెక్ పాయింట్. కర్ణాటక అటవీ శాఖ పోర్టల్ ద్వారా ట్రెక్ను ముందస్తు బుక్ చేసుకోవాలి. ముల్లయనగిరి ట్రెక్ కర్ణాటకలోని ఎత్తయిన శిఖరం వరకూ హైకింగ్. ఇది కూడా కాస్తంత కఠినమైనదే. ఈ కాలిబాట సర్పధారి నుంచి ప్రారంభమవుతుంది. ఒక వైపు ట్రెక్కి దాదాపు గంటన్నర నుంచి రెండున్నర గంటలు పడుతుంది. ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, చిన్న గుహలను కలిగి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం సందర్శకులు సెపె్టంబర్ నుంచి మార్చి వరకు ఎంచుకోవచ్చు. ఇవే కాక మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతాలైన కూర్గ్, మున్నార్, వాయనాడ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా ట్రెక్స్ నిర్వహిస్తున్నారు. తమిళనాట.. ట్రెక్ బాట.. అందరికీ తెలిసిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కోడైకెనాల్, ఊటీ ట్రెక్కింగ్కు పేరొందాయి. ముఖ్యంగా ఊటీలోని దొడ్డబెట్ట పీక్స్ ట్రెక్ బాగా ఫేమస్. అలాగే యెలగిరి హిల్స్లోని స్వామి మలాయ్ హిల్స్ ట్రెక్ సైతం మాన్సూన్లో సిటీ ట్రెక్కర్స్ను ఆకట్టుకుంటోంది.మార్గదర్శకాలు తప్పనిసరి.. మాన్సూన్ ట్రెక్కింగ్ అనేది సాహసాలను ఇష్టపడుతూ.. ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే అరుదైన అవకాశం. వర్షపు వాతావరణంలో ఇది మరిచిపోలేని అనుభవంగా నిలుస్తుంది. ట్రెక్కింగ్లో సాధారణంగా రాత్రిపూట బసలు ఉంటాయి. స్థానిక నిర్వాహకుల ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా స్వతంత్రంగానూ నిర్వహించవచ్చు. నగరం నుంచి అనేక సంస్థలు ఈ ట్రెక్స్ నిర్వహిస్తున్నాయి. రూ.3వేల నుంచి మొదలుకుని ట్రెక్స్ ఏర్పాటు చేస్తున్నాయి. సరైన సంస్థను, పర్యవేక్షణలో నిపుణులైన ట్రెక్కర్స్ మార్గదర్శకత్వంలో మాత్రమే ట్రెక్కింగ్ సురక్షితం. -
కృష్ణా, గోదావరి జలాలు, మూసీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు అని స్పష్టం చేశారు.హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం.బతెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం. స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్ మోడల్గా ఉంది. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం. విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్ఆర్బీఎం నుంచి తొలగించాలి.అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటున్నాం. వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజికన్యాయ సాధన ప్రక్రియకు మీరు అడ్డుపడొద్దు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు. మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.హైదరాబాదే మన బలం.. హైదరాబాద్ను గేట్ ఆఫ్ వరల్డ్గా తీర్చి దిద్దుతాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చుతాం. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చి దిద్దుతాం. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్కు గోదావరి నీళ్లు. మూసీ నదిని ప్రక్షాళన చేసి.. హైదరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దుతాం. మూసీ చుట్టూ బ్రతుకుతున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తాం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మార్చుతాం. మూసీకి ఇరువైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం. ఈ ఏడాది డిసెంబర్లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫోర్తు సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి’ అని కోరారు. -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?! -
జేఎల్ఆర్పై సైబర్ దాడి.. సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తి నిలిపివేత
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తన ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ అటాక్తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును కొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ‘మేము మా ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 బుధవారం వరకు పొడిగించాం. సైబర్ అటాక్ సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. దాంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం. కంపెనీ ప్రపంచ కార్యకలాపాల నియంత్రిత వ్యవస్థలపై వివిధ దశలను పరిశీలిస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ నిరంతర అంతరాయానికి చింతిస్తున్నాం. దర్యాప్తు పురోగతి వివరాలను అప్డేట్ చేస్తాం’ అని కంపెనీ తెలిపింది.మూడు ప్లాంట్లపై ప్రభావం..టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్వుడ్, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్ అటాక్ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే రెండు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్ఆర్, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.33 వేల మంది ఉద్యోగులు..ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్వేర్ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’ -
మూడోసారి ఆడపిల్ల.. కడుపులోనే మరణశాసనం రాసిన కుటుంబం
శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో కుటుంబ పెద్దల లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నాయుడు పేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.సాక్షి ప్రతినిధి తిరుపతి : అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్ చేయించి రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు, జిల్లాలో పడిపోతున్న బాలికల జనన రేటు జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి 916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. లేకుంటే పిండ దశలోనే చిదిమేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మొద్దునిద్రలో వైద్యాధికారులు జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.వంశోద్ధారకుడు కావాలనే మూఢ నమ్మకం.. ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే.. ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గర్భస్రావాలకు ప్రత్యేక ధర లింగ నిర్ధారణ స్కానింగ్ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాలి్చన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేసులు నమోదు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమరి్పస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతిరూ.కోట్లలో వ్యాపారం లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతో పాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు. విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు!
సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యం లేదని, ఇక్కడివారికి పెద్దగా అవకాశాలివ్వరనేది ఎప్పటినుంచో ఉన్న వాదన! అయితే అదే నిజమంటోంది ప్రముఖ నటుడు మోహన్బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను నటిస్తానంటే తెలుగులో బోలెడుమంది దర్శకనిర్మాతలు నాకు ఛాన్సిచ్చేందుకు రెడీగా ఉన్నారని అందరూ అనుకుంటారు. తెలుగువారిని తీసుకోరెందుకో?కానీ, అది నిజం కాదు. చాలామంది కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి నటీమణుల్ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో నేనైతే బాగుండేదాన్నేమో అనిపించేది. వెంటనే దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి నన్నెందుకు పెట్టుకోలేదు? అని తిట్టేదాన్ని. తెలుగువాళ్లతో పని చేయించుకోవడం తెలుగువాళ్లకే ఇష్టం లేదు. ఇక్కడివారిని సెలక్ట్ చేసుకోవడానికి తెగ బాధపడుతుంటారు. అదెందుకో నాకూ అర్థం కావడం లేదు. నేను సమయానికి సెట్కి వచ్చి బుద్ధిగా పని చేస్తాను. ఎవరినీ, ఏమీ ఇబ్బంది పెట్టను.చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిపైగా ఇప్పటివరకు ప్రతి నిర్మాత నాకు డబ్బులెగ్గొట్టాడే తప్ప నేనెవరికీ డబ్బులెగ్గొట్టలేదు. నా చివరి సినిమా డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వనేలేదు. అడిగితే సినిమా కష్టాలు చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అని షూటింగ్ పూర్తి చేస్తాం. తీరా చూస్తే పిల్లలపై ఒట్లు వేస్తారు, కానీ, డబ్బు మాత్రం ఇవ్వరు. ఇవన్నీ చూసి నిరాశచెందాను. మరో విషయం నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడూ దీని గురించి అంతగా ఆలోచించలేదు. నేను సంపాదించిందంతా టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక సేవకే ఉపయోగించాను.చెప్పుడుమాటలు విని బతికాకానీ, నాకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. మనల్ని మనమే చూసుకోవాలి.. ఎవరూ వచ్చి ఏదీ చేయరు. నా జీవితమంతా చెప్పుడుమాటలు విని బతికేశాను. ఇందులో ఎవర్నీ తప్పుపెట్టడం లేదు. సినిమాల్లేనప్పుడు నేనూ ఇంకో దారి చూసుకోవాలి. అందుకే చీరల బిజినెస్ ప్రారంభించాను. దక్షిణాది స్పెషల్ చీరలను నార్త్కు పరిచయం చేస్తున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.చదవండి: రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్ -
జితాంక్ జీత్ గయా!
మొన్నటి వరకు...‘జితాంక్ సింగ్ గుర్జార్ పేరు విన్నారా?’ అనే ప్రశ్నకు వెంటనే వచ్చే జవాబు... ‘సారీ... తెలియదు’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పరిచయం అయింది. ‘ఎవరీ జితాంక్ సింగ్ గుజ్జార్?’ అని సెర్చ్ ఇంజిన్లను అడిగేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సింగ్. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (టిఐఎఫ్ఎఫ్)లో జితాంక్ సింగ్ గుర్జార్ తీసిన విముక్త్ (ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై) ప్రతిష్ఠాత్మమైన నెట్పాక్ (నెట్వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియా సినిమా) అవార్డ్ గెలుచుకుంది.పక్కా పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల జితాంక్ ప్రకృతి ప్రపంచానికి చేరువయ్యే అవకాశం దొరికింది. రణగొణ ధ్వనులు లేని ఆ ప్రశాంతత బాగా ఇష్టంగా ఉండేది. తనకు ఆశ్చర్యంగా అనిపించేవాటిని, అద్భుతంగా అనిపించేవాటిని అందమైన కథలుగా చెబుతుండేవాడు. ఆ కథలు చెప్పే అలవాటే జితాంక్సింగ్ను సినిమా ప్రపంచంలోకి తీసుకువచ్చింది.గ్రామీణ ప్రపంచం... కథల చలమగ్రామీణ ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పడం అంటే జితాంక్కు ఇష్టం.‘ది మోస్ట్ పర్సనల్ ఈజ్ ది మోస్ట్ క్రియేటివ్’ అనే విలువైన మాట అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘విముక్త్’ కథకు స్క్రీన్ప్లే సమకూర్చి సినిమాగా మలిచాడు. ఇది నిర్మాత పూజా విశాల్ శర్మ రాసిన కథ. నటులు, సాంకేతిక వర్గం ఫైనల్ అయ్యాక... ‘ఇదీ కథ’ అని వారికి చె΄్పాడు. ప్రతి క్యారెక్టర్ గురించి విశ్లేషించి వివరంగా చె΄్పాడు. నటులు తమ క్యారెక్టర్లలో పూర్తిగా మమేకం కావడానికి ఎన్నో వర్క్షాప్లు నిర్వహించాడు.కుంభమేళాలో షూటింగ్జనసముద్రంలో మహా కుంభమేళాలో షూటింగ్ అంటే మాటలు కాదు. తమది చిన్న యూనిట్ కావడంతో ప్రతి సీన్ గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాడు. ఏ దృశ్యాన్ని ఎక్కడ చిత్రించాలనేదాని కోసం ఎన్నో స్థలాలను పరిశీలించాడు. సరిౖయెన లొకేషన్లను ఎంపిక చేసుకోవడం ఒక సవాలు అయితే, జనమూహాలలో సహజ చిత్రీకరణ అనేది మరో సవాలు. ఎలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా షూటింగ్ పూర్తిచేశాడు జితాంక్.‘మహాకుంభమేళా సన్నివేశాలు లేక΄ోతే ఈ సినిమాయే లేదు. కాబట్టి కుంభమేళాలోని సన్నివేశాలనే మొదట చిత్రీకరించాం. ఆ తరువాత మధ్యప్రదేశ్లోని బరై, పద్వా గ్రామాలలో షూటింగ్ చేశాం’ అంటాడు జితాంగ్ సింగ్. ‘గ్రామీణ ప్రాంత కథలు మాత్రమే కాదు పట్ణణాలలోని ఎన్నో సంక్లిష్ట జీవితాలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటున్నాడు జితాంక్ సింగ్ గుర్జార్.ప్రాంతీయ భాషలో తీసిన చిత్రాన్ని ప్రపంచం మెచ్చిందిఆ దంపతులకు వయసు పైబడుతోంది. జీవనాధారమైన తమ పొలాన్ని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఒక్కగానొక్క కొడుకు నారన్కు మేథో సామర్థ్యాలు లేవు. మానసికంగా అస్థిరంగా ఉంటాడు. ఒకవైపు నారన్ను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. మరో వైపు ఆర్థిక కష్టాలు. ఎన్నో సమస్యల మధ్య ఒక పరిష్కారాన్ని ఆశిస్తూ మహాకుంభమేళాకు వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే తమ కష్టాలు తీరుతాయని వారు ఆశిస్తారు. గ్రామీణ భారత జీవితం, నమ్మకాలు, అపనమ్మకాలకు, అదృష్ట దురదృష్టాలకు అద్దం పట్టిన సినిమాగా ‘విముక్త్’ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బ్రజ్ భాషలో తీశారు. కేవలం పదకొండురోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సెంటర్ పీస్ సెక్షన్లో ప్రదర్శించారు. (చదవండి: Weight Loss Story: బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..) -
మిస్టరీ వీడేదెన్నడు?
శ్రీ సత్యసాయి జిల్లా: రెండు వేర్వేరు కీలక హత్య కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో పోలీసులు చతికిల పడ్డారు. ఆ రెండు కేసులను లోతుగా దర్యాప్తు చేస్తే ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హత్యలు జరిగి మూడు, నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సతీష్ కుమార్ ఈ రెండు కేసుల దర్యాప్తు సవాల్గా నిలిచాయి. ప్రత్యేక చొరవ చూపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.గదిలోనే కిరణ్ దారుణ హత్యమహారాష్ట్రకు చెందిన కిరణ్(23) కొన్నేళ్లుగా కదిరి పట్టణంలోని ఎంజీ రోడ్డులో మేడపై ఓ గదిని అద్దెకు తీసుకొని బంగారు నగలు తయారీతో జీవనం సాగించేవాడు. సకాలంలో నగలు సిద్దం చేసి ఇస్తుండడంతో నగల వ్యాపారులందరూ అతనికే పని ఇచ్చేవారు. దీంతో రోజంతా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అతని వద్ద కిలోకు పైగా బంగారం, 10 కిలోలకు పైగా వెండి ఉండేదని కొందరు నగల వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 12న రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కిరణ్ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో పోలీసులు కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఉన్నఫళంగా దర్యాప్తు ఆగిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఓ పోలీసు అధికారి తన చేతి వాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపైనే సదరు పోలీసు అధికారిని వీఆర్కు అప్పట్లో ఉన్నతాధికారులు పంపినట్లుగా సమాచారం.ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లుకదిరిలోని కాలేజీ రోడ్డులో కిరాణా కొట్టు నిర్వహించే రంగారెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత అతని భార్య ప్రమీల(24) ఇంట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహించేది. 2022, మార్చి 21న అర్రధరాత్రి తన కిరాణా కొట్టులోనే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. తన సమీప బంధువులతో ఆస్తి తగాదా విషయంలో అప్పట్లో తరచూ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళుతున్న ఆమె అమాయకత్వాన్ని అప్పటి ఒక పోలీసు అధికారి ‘క్యాష్’ చేసుకోవడంతో పాటు వివాహేతర సంబంధం కూడా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమీల సెల్ఫోన్కు అందిన కాల్స్ ఆధారంగా సదరు పోలీసు అధికారి తరచూ ఆమెతో మాట్లాడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాల సమాచారం. కాగా, సదరు పోలీసు అధికారి అప్పట్లో స్థానిక సబ్జైలు ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్హౌస్లోనే ఉండేవారు. ఆయనకు ప్రమీల తన ఇంటి నుంచి క్యారియర్ తీసుకెళ్లి ఇస్తుండడం తాము కళ్లారా చూశామని కొందరు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అలాంటి మహిళ రాత్రికి రాత్రి హత్యకు గురి కావడం నమ్మలేక పోతున్నామని వారంటున్నారు. ఆమె సమీప బంధువులు సైతం ఇదే అంశాన్ని బలపరుస్తున్నారు. ఈ హత్య జరిగి మూడేళ్లకు పైగా కావస్తున్నా నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ కొందరు ఖాకీల పాత్ర ఉన్నందునే విచారణ పక్కదారి పట్టినట్లుగా బలమైన విమర్శలున్నాయి. -
ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ ఇన్స్టిట్యూట్ల్లో ఐఎస్బీకి చోటు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లింక్డ్ఇన్ 2025 టాప్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత సంవత్సరం ఆరో స్థానం నుంచి పుంజుకుంది. టాప్ 100 గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్ల జాబితాలో ప్రతిష్టాత్మకంగా టాప్ 20లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు చోటు సంపాదించాయి. అందులో ఐఐఎం-కలకత్తా (16వ స్థానం), ఐఐఎం-అహ్మదాబాద్ (17), ఐఐఎం-బెంగళూరు (20) ఉన్నాయి.ఈ సందర్భంగా లింక్డ్ఇన్ ఇండియా, సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ నిపుణులు నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ..‘విద్యార్థులు ఎంబీఏను ఎంచుకోవడం తమ కెరియర్లో కీలకంగా ఉంటుంది. ఎంబీఏ ద్వారా వచ్చే విశ్వాసం, అవకాశాలు దశాబ్దాలపాటు తమ కెరియర్ వృద్ధికి ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, ప్రొఫెసర్ మదన్ పిలుట్ల మాట్లాడుతూ..‘ఐఎస్బీలో పీజీపీ నైపుణ్యాలను అందించడమే కాకుండా, మారుతున్న ప్రపంచంలో వృద్ధి చెందడానికి అవసరమైన మెలకువలు నేర్పుతున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’లింక్డ్ఇన్ టాప్ ఎంబీఏ 2025 ర్యాంకింగ్స్ జాబితా కింది విధంగా ఉంది.స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంహార్వర్డ్ విశ్వవిద్యాలయంఇన్ సీడ్పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)డార్ట్ మౌత్ కాలేజ్కొలంబియా విశ్వవిద్యాలయంలండన్ విశ్వవిద్యాలయంచికాగో విశ్వవిద్యాలయంఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయండ్యూక్ విశ్వవిద్యాలయంయేల్ విశ్వవిద్యాలయంకాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కలకత్తాఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహ్మదాబాద్వర్జీనియా విశ్వవిద్యాలయంకార్నెల్ విశ్వవిద్యాలయంఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - బెంగళూరు -
పోలీసుల అరాచకం.. జోగి రమేష్ అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రశ్నిస్తే అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం మరో చర్యకు దిగింది. బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయించింది. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది. -
IND vs WI: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు
టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. వారిపై వేటుఇక ఈ టూర్లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్వెట్పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్లను కూడా జట్టు నుంచి తప్పించింది.వికెట్ల వీరుడికి చోటుఅదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్షిప్లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్పాల్కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.చందర్పాల్ రాకతో టాపార్డర్లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆడాడు. సీమర్ల కోటాలో వీరేఅయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్లు జరుగనున్నాయి.టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ జట్టురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్బెల్, తగెనరైన్ చందర్పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.చదవండి: మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం -
తిరిగి ప్రారంభమైన వైష్ణోదేవి యాత్ర.. 22 రోజుల విరామానికి తెర
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని త్రికూట కొండలపై కొలువైన మాతా వైష్ణో దేవి మందిరానికి తీర్థయాత్ర బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఆగస్టు 26న కొండచరియల విరిగిపడి, 34 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 20 మంది గాయపడిన దరిమిలా యాత్రను 22ను రోజుల పాటు నిలిపివేశారు. VIDEO | Katra, Jammu and Kashmir: Devotees chant 'Jai Mata Di' as Vaishno Devi pilgrimage resumes after a suspension of 22 days due to a devastating landslide that claimed 34 lives and injured 20. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/Dn55AFl6jW— Press Trust of India (@PTI_News) September 17, 2025శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది బేస్ క్యాంప్లో వేచి ఉన్న భక్తులకు ఉపశమనాన్ని కలిగించింది. బుధవారం తెల్లవారుజామున వందలాది మంది భక్తులు యాత్రకు ఉపక్రమించారు. కొండపైనున్న పుణ్యక్షేత్రానికి దారితీసే రెండు మార్గాల నుండి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైందని పుణ్యక్షేత్ర బోర్డు అధికారులు తెలిపారు. యాత్రికులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని, ఆన్-గ్రౌండ్ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.‘యాత్ర పునఃప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము రెండు రోజుల క్రితం పూణే నుండి బేస్ క్యాంప్కు చేరుకున్నాం. మాతా వైష్ణోదేవి దర్శనం కోసం నిరీక్షిస్తున్నామని మహారాష్ట్రకు చెందిన ఒక బృందంలోని ఒక మహిళా యాత్రికురాలు అన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక వరం. దీనిని సాధ్యం చేసినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ ఒకటి వరకూ జరిగే నవరాత్రి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. -
25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,307కు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు పుంజుకొని 82,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’
జీవితంలో ఎదగాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో కాలేజీ రోజుల్లో నుంచే కోడింగ్పై ఆసక్తి పెంచుకొని, ఓవైపు పగటిపూట ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాత్రిళ్లు డిజిటల్ యాప్స్ తయారు చేశాడు ఓ యువకుడు. ఆ యాప్స్కు నెటిజన్లు నుంచి ఆదరణ లభించడంతో రెండేళ్లలోనే ఏకంగా రూ.1 కోటి సంపాదించాడు. ఈమేరకు ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.రెడ్డిట్లో ఇండియన్ ఫ్లెక్స్ హ్యాండిల్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను 2015లో కాలేజీలో చేరాను. మొదటి నుంచే నాకు కోడింగ్పై ఆసక్తి పెరిగింది. అందులోని మెలకువలు నేర్చుకున్నాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ఓ రిటైల్ కంపెనీలో పగలు ఉద్యోగం చేసేవాడిని. కోడింగ్ నైపుణ్యాలతో రాత్రిళ్లు పనిచేస్తూ కొన్ని యాప్స్ డెవలప్ చేశాను. మొత్తంగా 5 డిజిటల్స్ యాప్స్ ఆవిష్కరించాను. వీటి అభివృద్ధికి ఎవరి సాయం తీసుకోలేదు. నేనే కోడింగ్, డిజైనింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్.. వంటివి చేసుకున్నాను. దాంతో రెండేళ్లలో రూ.1 కోటి సంపాదించాను’ అని రాసుకొచ్చారు.మనం చేసే పనిలో ఆసక్తి, పట్టుదల, నైపుణ్యాలు పెంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాంతో క్రమంగా ఆర్థిక భరోసా ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ చిప్లపై పరిశోధన -
4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ను చంపేసినట్లుంది కథ! హౌస్లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్లో ఎవరున్నారో చూసేద్దాం..తలతిక్క సమాధానాలునాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నాపై ముద్ర వేశారునేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.దమ్ముంటే బిగ్బాస్ను అడగండితర్వాత శ్రీజ కూడా హరీశ్ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్బాస్ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.సుమన్ను బలి చేసిన కెప్టెన్ సంజనాదీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. మరోవైపు లైవ్లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్! -
15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1950, సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో జన్మించిన మోదీ.. ప్రధాని పదవిని అలంకరించక ముందు 2001 నుండి 2014 వరకు వరుసగా మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘సేవా పఖ్వారా’పేరుతో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిర్వహిస్తోంది.#WATCH | Uttar Pradesh: Ganga Aarti performed in Varanasi on the 75th birthday of Prime Minister Narendra Modi. pic.twitter.com/6YDtAY4IPV— ANI (@ANI) September 17, 2025రాజస్థాన్ బీజేపీ ప్రధాని మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టింది. రాజస్థాన బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి జైపూర్లోని ఐకానిక్ హవా మహల్లో పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు.#WATCH | Ahmedabad | On the occasion of PM Narendra Modi's birthday, Gujarat Home Minister Harsh Sanghavi says, "On the occassion of PM Modi's birthday, everyone is performing one or the other act of service. This may be the first time that for the birthday celebration of a… pic.twitter.com/kk1uTBtT6U— ANI (@ANI) September 17, 2025రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ అసాధారణ నాయకత్వంతో దేశంలో గొప్ప లక్ష్యాలను సాధించే సంస్కృతిని పెంపొందించారని ఆమె కొనియాడారు.#WATCH | Delhi CM Rekha Gupta donates blood under the Seva Pakhwada campaign, a 15-day program beginning today on the occassion of PM Modi's birthday pic.twitter.com/fiVUDVJPXL— ANI (@ANI) September 17, 2025మధ్యప్రదేశ్లోని ధార్లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్’ ప్రచారాలను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు.VIDEO | Delhi Minister Kapil Mishra (@KapilMishra_IND) extends birthday greetings to Prime Minister Narendra Modi.He says, "On the occasion of the Prime Minister’s birthday, we have come to Marghat Wale Hanuman Mandir to pray to Lord Hanuman for his long life and protection."… pic.twitter.com/zgybmW0nRE— Press Trust of India (@PTI_News) September 17, 2025ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున ఢిల్లీ అగ్నిమాపక దళం 24 క్విక్ రెస్పాన్స్ వాహనాలను (క్యూఆర్వీ) ప్రవేశపెట్టనుంది.VIDEO | Jaipur: Rajasthan BJP president Madan Rathore (@madanrrathore) along with other party workers participates in cleanliness drive at Hawa Mahal on the occasion of PM Modi's 75th birthday. He says, "We are celebrating our PM Narendra Modi's 75th birthday today. We pray for… pic.twitter.com/nhvAK9jVFF— Press Trust of India (@PTI_News) September 17, 2025ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల హృదయాలను శాసించే ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.भारत के प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। परिश्रम की पराकाष्ठा का उदाहरण प्रस्तुत करते हुए अपने असाधारण नेतृत्व से आपने देश में बड़े लक्ष्यों को प्राप्त करने की संस्कृति का संचार किया है। आज विश्व समुदाय भी आपके मार्गदर्शन में अपना…— President of India (@rashtrapatibhvn) September 17, 2025భారతదేశంలోని రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజ్కోట్ విద్యార్థులు 75 రంగోలీలను రూపొందించారు.కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధాని నాయకత్వాన్ని అభినందించారు.VIDEO | Delhi CM Rekha Gupta (@gupta_rekha) extends birthday greetings to Prime Minister Narendra Modi.She says, "The Prime Minister of India, Narendra Modi, who rules the hearts of so many Indians, I, along with the people of Delhi, wish you a very happy birthday. May your… pic.twitter.com/YP0bOUdxl4— Press Trust of India (@PTI_News) September 17, 2025సూరత్వాసులు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా, అహ్మదాబాద్లోని మణినగర్లో వేడుకలు జరిగాయి, పూలతో భారతదేశ మ్యాప్ను రూపొందించారు.भारत के माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को उनके जन्मदिन पर हार्दिक बधाइयाँ और शुभकामनाएँ!रूस-भारत की दशकों पुरानी मैत्री को नई ऊँचाइयों तक ले जाने में उनके अमूल्य योगदान के लिए हम आभारी हैं।कामना है कि देश और दुनिया की भलाई करने वाले हर काम में उनको सफलता मिलती रहे।— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) September 16, 2025మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో బీజేపీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి బీచ్ ఒడ్డున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.#WATCH | Surat, Gujarat | On the occasion of 75th birthday of Prime Minister Narendra Modi, people waved the biggest tricolor and made a huge poster of Prime Minister with a special fabricTricolor and poster maker Praveen Gupta says, "the Tiranga along with PM Modi's poster is… pic.twitter.com/EuWaxDPgSC— ANI (@ANI) September 16, 2025పీయూష్ గోయల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.#WATCH | Gujarat | Eve of Prime Minister Narendra Modi's 75th birthday celebrated by making a map of India with flowers and playing Garba in Maninagar, Ahmedabad.BJP MLA Amul Bhatt and Councillor Karan Bhatt also participated in the event.BJP Amul Bhatt says, "We are… pic.twitter.com/zgJ7NzBYTH— ANI (@ANI) September 17, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Puri, Odisha: Sand artist Sudarshan Patnaik creates sand art to mark PM Narendra Modi's 75th birthday. (16.09) pic.twitter.com/YoYgJQxzQm— ANI (@ANI) September 16, 2025 -
ఖలిస్థానీల హెచ్చరిక.. భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామంటూ..
ఒట్టావా: కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ను టార్గెట్ చేసి వాంకోవర్లోని భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామని తాజాగా బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఖలిస్థానీ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ హెచ్చరించింది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.వివరాల ప్రకారం.. భారత్, కెనడా మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ కెనడాలోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్.. వాంకోవర్లోని భారత కాన్సులేట్ను ముట్టడిస్తామని పేర్కొంది. ఈనెల 18న (గురువారం) దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో కాన్సులేట్కు వచ్చే వారు తన సందర్శనను వాయిదా వేసుకోవాలని సూచించింది.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. అంతటితో ఆగకుండా.. భారత కాన్సులేట్లు గూఢచారి నెట్వర్క్ను నడుపుతున్నాయని, ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టాయని ఆ బృందం ఆరోపించింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది. ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2023న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర దర్యాప్తులో ఉందని అప్పటి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, నాటి నుంచి భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా విభేదాలు వచ్చాయి. -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్ల వరకైనా ఆండీ క్రాఫ్ట్ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్ల నుంచి పైక్రాఫ్ట్ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ చిప్లపై పరిశోధన
దేశీయంగా సురక్షితమైన చిప్లను డిజైన్ చేసే దిశగా ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్ (ఎల్టీఎస్సీటీ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్), ఐఐటీ గాందీనగర్ జట్టు కట్టాయి. ప్రాథమికంగా ఎలక్ట్రానిక్ పాస్పోర్టుల కోసం చిప్లపై (ఐసీ) పరిశోధనలు జరపడం, వాటిని అభివృద్ధి, తయారు చేయడంపై ఈ మూడూ కలిసి పని చేస్తాయి.ఇందుకోసం ప్రత్యేకంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ప్రోడక్ట్ డెవలప్మెంట్, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు నిర్దిష్టంగా ఇన్వెస్ట్ చేయనున్నాయి. సున్నితమైన విభాగాల్లో విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. కొత్త తరం క్రిప్టో ప్రోడక్టులకు కూడా సెక్యూర్ ఐసీ సొల్యూషన్ పునాదులు వేస్తుందని ఎల్టీఎస్సీటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్ తెలిపారు.ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్.. 10 లక్షల మైలురాయి -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త ఆస్తిలో వాటా వస్తుందా?
నా భర్త చనిపోయిన తరువాత భార్యను కోల్పోయిన ఒకతన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను. మొదటి భర్తతో నాకు పదేళ్ల పాప, ఏడేళ్ల బాబూ ఉన్నారు. నా రెండవ భర్తకు కూడా 12 సంవత్సరాల పాప ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు రెండవ భర్తకు సహజ సంతానంగా లేదా దత్తత సంతానం అయిపోతారా? నా మొదటి భర్త ఆస్తిలో నాకు, నా ఇద్దరు పిల్లలకు వాటా వస్తుందా? నా మొదటి భర్తకి వారసత్వపు ఆస్తితోపాటు – స్వార్జితం ద్వారా కూడా ఆస్తులు ఉన్నాయి. రెండవ భర్త ఆస్తిలో నా సంతానానికి హక్కు ఉంటుందా? నా మొదటి భర్త అమ్మగారు అంటే మా అత్తయ్యగారు బతికే ఉన్నారు. ఆవిడది కూడా మా మామయ్యగారితో రెండవ వివాహమే! కానీ ఆమెకి మొదటి భర్తతో పిల్లలు లేరు. రెండవ వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా రాదు అని చట్టం ఉంది కాబట్టే ఆవిడకి కూడా తన మొదటి భర్త నుంచి ఆస్తి రాలేదని, నాకు కూడా అలాగే రాదని చెబుతోంది. అది నిజమేనా?– ఒక సోదరి, ఖమ్మం జిల్లాబహుశా మీ అత్తయ్యగారి మొదటి భర్త చనిపోయిన కాలంలో అది నిజం కావచ్చు. పూర్వం ’హిందూ వితంతు వివాహ చట్టం, 1856’ అని ఉండేది. అప్పట్లో అది చాలా విప్లవాత్మక చట్టం అయినప్పటికీ ఆ చట్టం ప్రకారం రెండవ పెళ్లి చేసుకున్న వితంతు మహిళకు మొదటి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు. కానీ ఈ చట్టం 1983లో రద్దు అయింది. ప్రస్తుత చట్టంలో వితంతు వివాహం/లేదా పునర్వివాహం చేసుకున్న స్త్రీకి మొదటి భర్త ఆస్తిపై ఉన్న హక్కులు తొలగిపోవు! అలా తొలగిస్తే అది రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం. కాబట్టి మీకు మాత్రం మీ మొదటి భర్త ఆస్తిలో ఒక భాగం వాటా ఉంటుంది. ఇక మీ పిల్లల విషయానికి వస్తే... మీరు రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం రెండవ భర్తకు చెందరు. ఒకవేళ రెండవ భర్త నిజమైన తండ్రిగా వ్యవహరించాలి అని మీరు అనుకుంటే, మీరు మీ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వవలసి వస్తుంది. అయితే దత్తత ఇచ్చేసిన తర్వాత సాధారణ పరిస్థితిలో అయితే దత్తత ఇవ్వబడ్డ పిల్లలకు వారి సహజ తల్లిదండ్రుల ఆస్తులలో (పూర్వీకుల ఆస్తిలోనైనా లేక స్వార్జితంలో అయినా) ఎటువంటి హక్కు ఉండదు. కానీ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రం దత్తపుత్రులకు/దత్త పుత్రికకు వారి సహజ సంతానంతో సమానంగా హక్కు ఉంటుంది. అంటే మీ రెండవ భర్తకి మీరు దత్తత ఇస్తే ఆయన తదనంతరం (వీలునామా రాయకుండా మరణిస్తే) ఆస్తిలో తన సొంత కూతురితో సమానంగా మీ పిల్లలకు కూడా చెరొక వాటా వస్తుంది. దత్తత ఇచ్చే సమయానికి ఒకవేళ మీ మొదటి భర్త ఆస్తిలో పంపకాలు జరిగి మీ పిల్లలకి ఆ ఆస్తి ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే, వారిని దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా వారి ఆస్తి వారి వద్దనే ఉంటుంది. అంటే మీరు ముందుగా మీ మొదటి భర్త నుండి సంక్రమించే ఆస్తిని పంచుకుని తర్వాత పిల్లల్ని దత్తత ఇస్తే పిల్లలకి నష్టం వుండదు. ఎందుకంటే మీ రెండవ భర్త తన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీ పిల్లలకి ఇవ్వకపోతే వారు చేయని తప్పుకి పిల్లలు బలయ్యే అవకాశం ఉంది కదా! ఈ విషయాలు అన్నింటిని మీ మొదటి భర్త తల్లిగారికి వివరించండి. ఒప్పుకోని పక్షంలో మీరు పార్టిషన్ సూట్ ద్వారా మీ హక్కును అలాగే మీ పిల్లల హక్కును కూడా కాపాడుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే పైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులలో పూర్తి పత్రాలతో, సమాచారంతో దగ్గరలోని లాయర్ని కలవడం అవసరం. -
రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ భామ టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత సినీ రంగప్రవేశం చేసింది. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించి ఆపై హిందీ చిత్రాల్లో నటిస్తుండగా టాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది. అలా సీతారామం అనే తెలుగు చిత్రంలో దుల్కర్ సల్మాన్కు జంటగా నటించి పాపులర్ అయింది. హాయ్ నాన్నతో మరింత స్టార్డమ్ అందుకుంది. కానీ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని పెద్దగా ఆదరణ పొందలేవు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో లక్కీచాన్స్ వరించినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీలో..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో మృణాల్ఠాకూర్ ఒక కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు శివకార్తికేయన్కు జంటగా మదరాశి చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని ఆమె చేజార్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఈ అమ్మడికి రాలేదు. ఇకపోతే హీరోయిన్గా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ చేతినిండా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్న ఈ బ్యూటీ ఖర్చు చేయడంలో మాత్రం మహా పొదుపరి!అంతకంటే ఎక్కువ పెట్టనుదీనిపై మృణాల్ ఇటీవల చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తనకు ఖరీదైన దుస్తులు కొనడం ఇష్టం ఉండదని, ఎంతో డబ్బులు పోసిన కొన్నప్పటికీ అవి బీరువా అరల్లో మూలుగుతుంటాయంది. తాను కొనుగోలు చేసిన దుస్తుల ఖరీదు అత్యధికంగా రూ.2వేలు దాటి ఉండవన్నారు. అయితే సినీ కార్యక్రమాలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం లక్షల ఖరీదైన దుస్తులు ధరిస్తానని, అయితే అవన్ని సొంతం కాదని, అద్దెకు తెచ్చుకునేవేనని మృణాల్ తెలిపింది.చదవండి: కథ నచ్చి ఓజీ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్ -
ఓలా ఎలక్ట్రిక్.. 10 లక్షల మైలురాయి
ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు కృష్ణగిరిలో ఉన్న ఫ్యూచర్ఫ్యాక్టరీలో 10 లక్షల వాహనాలను(ఒక మిలియన్) ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. 2021 ఈ ప్లాంటులో తయారీ ప్రారంభించినప్పట్టి నుంచి నాలుగేళ్లలో ఈ మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూట్లర్లు ఎస్1 పోర్ట్ఫోలియోకు, ఇటీవల విడుదల చేసిన రోడ్స్టర్ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు ఆదరణ లభించడంతో తయారీలో వృద్ధి సాధించగలిగామని వివరించింది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ‘రోడ్స్టర్ ఎక్స్ప్లస్’ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. మిడ్నైట్ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. ‘‘మాపై నమ్మకం, మా లక్ష్యంపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడు గర్వంచదగిన క్షణాలు ఇవి. నాలుగేళ్ల క్రితం ఒక ఆలోచనతో మొదలై నేడు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తి పలికి ప్రపంచస్థాయిలో భారత్ను ఈవీ హబ్గా నిలపడం మా ధ్యేయం’’ అని ఓలా అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
తయారీలో సంస్కరణలు రావాలి
దీర్ఘకాలిక కోణంలో భారత్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని అపోలో హెల్త్కో చైర్పర్సన్, పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ శోభనా కామినేని తెలిపారు. వీటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా తయారీ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అమెరికా విధించిన విపరీతమైన టారిఫ్ల వల్ల అనిశ్చితులు తలెత్తాయని ఆమె తెలిపారు. మరింత మెరుగ్గా రాణించేందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచించేందుకు ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలని వివరించారు. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో నెలకొందని మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. మనం 4 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగినా, జీడీపీ మూడింతలు పెరిగినా, అందరికీ ఉద్యోగాలు దొరక్కపోతే సామాన్యుడికి ఏం ప్రయోజనం దక్కుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని శోభన చెప్పారు.ఉద్యోగాలు కల్పించడమనేది ప్రతి చిన్న, పెద్ద వ్యాపారాల బాధ్యత అని తెలిపారు. భారత్లో ప్రతిభావంతులకు కొదవలేదని, ఏఐ సొల్యూషన్స్ను రూపొందించడంలో మన దేశం ప్రపంచానికి సారథ్యం వహించాలని పేర్కొన్నారు. మరోవైపు, తమ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ తర్వాత మరో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా కంట్రీ హెడ్ (ఇండియా) అరుణ్ శ్రీనివాస్ తెలిపారు. -
తల్లి కళ్లల్లో ఆనందం.. ఈ విజయం ఎంతో ప్రత్యేకం!
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): క్లిష్టంగా గడుస్తున్న ఈ సంవత్సరంలో తాజా ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు తెలిపింది. తాను మరింత మెరుగయ్యేందుకు, రాణించేందుకు ఇది ఔషధంలా పనిచేస్తుందని చెప్పింది. మహిళల ఎలైట్ ఈవెంట్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత వహించింది. 24 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్మాస్టర్ వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి సైతం అర్హత సాధించిన సంగతి తెలిసిందే. నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి‘గత విజయంతో పోల్చుకుంటే ఇది ముమ్మాటికి కఠినమైంది. 2023లో నేను ఫామ్లో ఉన్నాను. నిలకడగా విజయాలు సాధిస్తున్న సమయంలో గ్రాండ్ స్విస్ టైటిల్ గెలవడం ఏమంత కష్టం కాలేదు. కానీ ఇప్పుడు అంతా సులువుగా రాలేదు. నేను ఎప్పట్లాగే కష్టపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో లభించిన టైటిల్ నన్ను మార్చింది. చాలా టోర్నీలలో ఆడటం ద్వారా గత రెండేళ్లుగా ఎంతో అనుభవాన్ని గడించా. అయితే గతేడాది క్యాండిడేట్స్ టోర్నీలో వరుసగా నాలుగు గేమ్లు ఓడిపోవడం, ఆ తర్వాత మింగుడుపడని ఫలితాలు నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి. నేనొక ప్లేయర్గా మరింత బాగా ఆడేందుకు, ఓ వ్యక్తిగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేశాయి’ అని వైశాలి పేర్కొంది. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్ల పాటు వరుస వైఫల్యాలతో కేవలం 1.5 పాయింట్లే సాధించడం, మహిళల ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్లో తన్ జొంగ్జీ (చైనా) చేతిలో ఓడిపోవడం వైశాలిని కుంగుదీసింది. తల్లి కళ్లల్లో ఆనందం‘చెన్నై టోర్నీలో ఏకంగా ఏడు గేముల్లో ఓడాను. ఇంకా చెప్పాలంటే ఓ వారమంతా ఓటములతోనే గడిచిపోయింది. అప్పుడు ఏదోలా అనిపించింది. మంచో చెడో కూడా అర్థమయ్యేది కాదు. కానీ గెలిస్తే నన్ను ఎవరు ఆపలేరనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అదే ఇప్పుడు జరిగింది’ అని వైశాలి వివరించింది. ఇక ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ గెలిచిన తర్వాత తల్లి నాగలక్ష్మి, తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి వైశాలి సంబరాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Pride, love, and a mother’s touch ❤️🇮🇳 Vaishali Rameshbabu, her mother Nagalakshmi, and her brother Praggnanandhaa R.#FIDEGrandSwiss @chessvaishali pic.twitter.com/NIYX5I3fs8— International Chess Federation (@FIDE_chess) September 16, 2025 -
నథింగ్లో ‘జెరోధా’ కామత్ పెట్టుబడులు
ఏఐ ఆధారిత ప్లాట్ఫాంను రూపొందించే దిశగా 20 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1,762 కోట్లు) సమీకరించినట్లు కన్జూమర్ టెక్నాలజీ సంస్థ నథింగ్ తెలిపింది. 1.3 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నట్లు వివరించింది. టైగర్ గ్లోబల్ సారథ్యంలో ప్రస్తుత షేర్హోల్డర్లు జీవీ, హైల్యాండ్ యూరప్, ఈక్యూటీ మొదలైనవి పెట్టుబడులు పెట్టగా, జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, క్వాల్కామ్ వెంచర్స్ కొత్తగా ఇన్వెస్ట్ చేసినట్లు నథింగ్ తెలిపింది.కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలకు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మరింతగా విస్తరించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు వివరించింది. ఈ ఏడాది ప్రారంభంలో మొత్తం 1 బిలియన్ డాలర్ల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు నథింగ్ తెలిపింది. వచ్చే ఏడాది ప్రాథమికంగా ఏఐ సాంకేతికతతో పనిచేసే డివైజ్లను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. లండన్ ప్రధాన కేంద్రంగా పని చేసే నథింగ్ తమ తొలి ఫ్లాగ్షిప్ స్టోర్ను ఈ ఏడాది భారత్లో ప్రారంభించనుంది.ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
Hyderabad: బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం..!
రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్పూర్ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ పార్క్ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్రెడ్డిని మేడ్చల్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పోస్టు చేశారు. Happy Birthday to Hon. PM Shri @narendramodi ji! Wishing you a long, healthy, and blessed life in service to the Nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2025 -
25న బతుకమ్మకుంటలో బతుకమ్మ
సాక్షి, హైదరబాద్: అంబర్పేటలోని బతుకమ్మకుంట ఈసారి బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఇక్కడ నిర్వహించనున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. హైడ్రా అ«దీనంలో పునరుజ్జీనం పొందిన ఈ కుంటను అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ కుంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు జరగాలని వేంనరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగి అటువైపు వెళ్లాలంటే కాదు.. కనీసం చూడాలంటే భయపడే విధంగా బతుకమ్మ కుంట మారిపోయింది. కబ్జాల చెర నుంచి దీనికి విముక్తి కలి్పంచి సర్వాంగ సుందరంగా తీర్చడంలో హైడ్రా కృషి అభినందనీయం’ అని మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. -
మరో 5 చోట్ల.. జంక్షన్ ఫ్రీ
సాక్షి,హైదరబాద్: ఇప్పటికే గ్రేటర్లోని పలు జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం ఫ్లై ఓవర్లు వచ్చాయి. కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల కోసం టెండర్ల దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని టెండర్లు పూర్తయ్యాయి. అవి అలా ఉండగానే.. నాగార్జునసాగర్ రింగ్ రోడ్ –శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకపోకలు సాగించే వారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో ఐదు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, ఆర్యూబీ (రోడ్ అండర్బ్రిడ్జి)ల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇవన్నీ కూడా భవిష్యత్లో రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో రైలు మార్గంలో ఉండటంతో మెట్రో వర్గాలతో సమన్వయంతో సదరు ప్రాజెక్టుల డిజైన్లు తదితరాలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. దాదాపు మూడునెలల్లో ఇవి పూర్తయ్యాక టెండర్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు. పనులు ఇవీ.. 1. టీకేఆర్ కాలేజీ జంక్షన్ ఫ్లై ఓవర్: టీకేర్ కాలేజీ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లతో ఫ్లై ఓవర్. 2. ఒమర్ హోటల్ జంక్షన్ ఫ్లై ఓవర్: హఫీజ్బాబానగర్ జంక్షన్– బాలాపూర్– చర్చిరోడ్ జంక్షన్ (ఒమర్ హోటల్ నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా షోయబ్ హోటల్) వరకు ఆరులేన్ల ఫ్లై ఓవర్. 3. బండ్లగూడ జంక్షన్ ఫ్లై ఓవర్: బండ్లగూడ–ఎర్రకుంట జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్. 4. మైలార్దేవ్పల్లి జంక్షన్ ఫ్లై ఓవర్: మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్. 5. ఆరాంఘర్ జంక్షన్ ఆర్యూబీలు: ఆరాంఘర్ జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ఆర్యూబీకి రెండు వైపులా రెండు లేన్లతో మరో రెండు ఆర్యూబీలు. ఈ పనులను వేటికవి విడివిడిగానే చేయనున్నారు. పనులు పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్ సహా వివిధ మార్గాల నుంచి ఎయిర్పోర్ట్కు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణంతో ఎంతో సమయం కలిసి వస్తుందని, వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్లో భాగంగా టోపోగ్రాఫికల్ సర్వే, ట్రాఫిక్ సర్వే నిర్వహించడంతో పాటు రద్దీ సమయాల్లో సదరు మార్గాల్లో ప్రయాణించే వాహనాలు, కారిడార్లో రానున్న మెట్రోరైలు, సీటీఎస్ (కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్స్టడీ) మాస్టర్ప్లాన్, బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో రాబోయే ప్రాజెక్టులు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోనున్నారు. హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ప్రాజెక్ట్ కింద ఎల్బీనగర్–ఆరాంఘర్ కారిడార్ పనుల్లో భాగంగా వీటిని చేపట్టనున్నారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూర్, చెన్నైల కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పెద్దది కావడం, టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్) వరకు నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యల్లేకుండా చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉన్నందున ఈ ఫ్లై ఓవర్లు ఎంతో అవసరమని భావిస్తున్నారు. అదే మార్గంలో డీఆర్డీఎల్, డీర్డీఓ, మిధాని వంటి పరిశోధన సంస్థలు, లే»ొరేటరీలు ఉండటం తెలిసిందే. ఇప్పటికే గ్రేటర్ జనాభా కోటికి పైగా ఉండటమే కాక భవిష్యత్లో మరింత పెరగనుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరగకుండే ఉండేందుకు ఇవి అవసరం కానున్నాయి. -
నిద్దరోయిన నిఘా నేత్రం!
సాక్షి,హైదరాబాద్: దొంగలను గుర్తించాలన్నా, దోపిడీ ముఠాల ఆటకట్టించాలన్నా.. ఏమూలలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్నా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం. కానీ.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సీసీ కెమెరాల నిర్వహణ డొల్లతనంగా మారింది. రోడ్ల విస్తరణ, అక్రమ కేబుల్ వైర్ల తొలగింపు సమయంలో కెమెరాల వైర్లూ తొలగించడం, వార్షిక నిర్వహణ సరిగా లేకపోవడం తదితర కారణాలలో నిఘా నేత్రాలు నిద్దరోయాయి. సైబరాబాద్లో అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్లో ఏకంగా 644 సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. రోడ్ల విస్తీర్ణం, వైర్ల కత్తిరింపు.. రోడ్డు ప్రమాదాలు, చెయిన్ స్నాచింగ్లు, దాడులు, హత్యోదంతాలు ఇతరత్రా కేసుల్లో నేరస్తులను పట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాలు కీలకం. కేసుల దర్యాప్తు, పోలీసుల పరిశోధనకు ఆయువుపట్టు లాంటి కెమెరాల నిర్వహణపై నిర్లక్ష్యం అలుముకుంటోంది. వార్షిక నిర్వహణ సరిగా లేక, విద్యుత్ స్తంభాలపై ఉన్న అక్రమ తీగలను తొలగించే సమయంలో సీసీటీవీ కెమెరాల వైర్ల తొలగింపు తదితర కారణాలతో కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు నేరాల దర్యాప్తులో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.14 లక్షల సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో ‘నేను సైతం’ కింద 1.87 లక్షల కెమెరాలు, ‘నిర్భయ, సేఫ్ సిటీ’ ప్రాజెక్ట్ల కింద 27 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 41 శాతం కెమెరాలు పని చేయడం లేదని అధికారులు గుర్తించారు. ప్రత్యేక వ్యవస్థే లేదు.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థే లేకుండాపోయింది. అంతేకాకుండా ప్రత్యేకంగా నిధుల కేటాయింపులూ లేవు. హైవేలతో పాటు నగరాలు పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే విరాళాలు, నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా ప్రపంచదేశాలతో పోటీ పడుతున్న సైబరాబాద్లో కెమెరాలు పని చేయకపోవడం విచారకరం. నిర్వహణ చేయకపోయినా బిల్లుల చెల్లింపు మాదాపూర్ జోన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. సదరు సంస్థ కెమెరాల నిర్వహణ పేలవంగా ఉన్నట్లు గుర్తించిన ఓ ఉన్నతాధికారి ఆ సంస్థ యజమానిని కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ సమయంలో సుమారు 300 కెమెరాలు ఎటో పోయాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఒప్పందంలో కెమెరాలు పోయినా కూడా కొత్తవి ఏర్పాటు చేసే బాధ్యత నిర్వహణ సంస్థదే కదా అని సదరు అధికారి ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. పైగా సదరు అధికారి తనను వేధిస్తున్నాడంటూ ఆపై ఉన్నతాధికారులకు, పలుకుబడి ఉన్న వాళ్లతో చెప్పడంతో సదరు అధికారి షాక్కు గురయ్యారు. అయితే 2020 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ అదే నిర్వహణ సంస్థకు కెమెరాల నిర్వహణ బిల్లులు పేరిట రూ.5.75 కోట్లు ప్రభుత్వం నుంచి చెల్లించడం గమనార్హం. నిర్లక్ష్యం, నిర్వహణ చేయకపోవడంపై సదరు ఏఎంసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారి లేఖ రాసినట్లు సమాచారం. -
PM Modi Birthday: సన్యాసం కోసం ఇల్లు వదిలిన ‘నారియా’..
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 1950, సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాడ్ నగర్లో జన్మించారు. తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ. తల్లి పేరు హీరాబెన్. ప్రధాని మోదీకి ఐదుగురు తోబుట్టువులు. మోదీ జీవితం చాలా ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో నరేంద్ర మోదీని ‘నారియా’ అని పిలిచేవారు. చిన్నప్పుడే ఆయన సన్యాసం స్వీకరించే ఉద్దేశంతో ఇంటిని విడిచిపెట్టారు. ప్రధాని మోదీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు.స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన మొదటి ప్రధానిదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకు జన్మించిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ఆయన తొలిసారి ప్రధాని అయ్యారు.ప్రధాని చిన్నప్పటి పేరునరేంద్ర మోదీ తన ప్రాథమిక విద్యను వాద్నగర్లోని బీఎన్ హై స్కూల్ నుంచి పూర్తి చేశారు. ప్రధాని మోదీకి సంస్కృతం బోధించిన ఉపాధ్యాయుడు ప్రహ్లాద్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను నరేంద్రుడిని ‘నారియా’ అని పిలిచేవాడిని. అతను నాతో మాట్లాడటానికి అతను ఎప్పుడూ భయపడలేదు. అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను కూడా గౌరవించేవాడు’ అని అన్నారు.సన్యాసిగా మారాలని..పాఠశాల విద్య ముగియగానే మోదీ సన్యాసిగా మారేందుకు ఇంటి నుండి వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్లోని రామకృష్ణ ఆశ్రమంతో సహా దేశంలోని అనేక ప్రదేశాల్లో తిరిగారు. హిమాలయాలలో ఋషులు, సాధువులతో గడిపారు. నాడు సాధువులు ఆయనతో సన్యాసిగా మారకుండానికి బదులు దేశానికి సేవ చేయాలని సూచించారు. దీంతో మోదీ సన్యాసిగా మారాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు.సైన్యంలో చేరాలనుకుని..నరేంద్ర మోదీ బాల్యంలో సన్యాసంలో చేరాలనుకున్నారు. నరేంద్ర మోదీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఆయన తన బాల్యంలో జామ్నగర్లోని సైనిక్ స్కూల్లో చదువుకోవాలనుకున్నారు. కానీ డబ్బు లేకపోవడం వల్ల అది జరగలేదు. ఎనిమిదేళ్ల వయసులో, మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.నటన అంటే ఇష్టంప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా బాల్యంలో నటన అంటే ఎంతో ఇష్టం ఉండేది. 2013లో మోదీపై రాసిన ‘ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్: నరేంద్ర మోడీ’ పుస్తకం ప్రకారం, ఆయన తన 13-14 ఏళ్ల వయసులో పాఠశాల కోసం నిధులు సేకరించేందుకు పిల్లలతో కలిసి గుజరాతీ నాటకంలో పాల్గొన్నారు. దాని పేరు పిలు ఫూల్..అంటే పసుపు పువ్వు .అత్యవసర పరిస్థితుల్లో సర్దార్ అవతారందేశంలో 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు, మోదీ సంఘ్ వాలంటీర్గా ఉన్నారు. ఆ సమయంలో, పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆయన సర్దార్ వేషాన్ని ధరించారు. రెండున్నరేళ్ల పాటు ఆయన పోలీసుల కన్నుగప్పి మెలిగారని చెబుతారు. -
టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రూ.6,400 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచింది. దీంతో వేలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు. ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్æ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని కారణం చూపి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్ కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
HYD: గోల్డ్ షాపుల ఓనర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యాజమానుల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో, 15 బృందాలు రంగంలోకి దిగి.. సోదాలు చేస్తున్నారు.హైదరాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ నగరాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున క్యాప్స్ గోల్డ్ కంపెనీ బంగారం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే, బంగారం కొనుగోలు చేసి క్యాప్స్ గోల్డ్ కంపెనీ.. రిటైల్ గోల్డ్ దుకాణాలకు బంగారం అమ్ముతున్నారు. ఈ క్రమంలో సదరు కంపెనీకి అనుబంధంగా ఉన్న హెల్సేల్ సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బంజారాహిల్స్లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, సదరు కంపెనీ.. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. -
యూపీలో మాయావతి ‘రాజకీయం’.. బీఎస్పీలోకి భారీగా చేరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఉత్తరప్రదేశ్లో తిరిగి తన బలాన్ని నిరూపించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సిద్ధమయ్యారు. 2027లో జరిగే ఎన్నికలకు తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఆమె, వచ్చే నెల 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణ వర్గాల్లో తనకున్న పాత ఇమేజ్ను తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. పాత ఛరిష్మా కోసం పాట్లు... బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగు మార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గాను 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 22 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టుంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకు పోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓడినప్పటికీ ఆమె గెలుచుకున్న 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు.2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్పీ 13 శాతం ఓట్లు పడినా కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది. ఈ పరిణామాలన్నీ బీఎస్పీ ఉనికిలో లేవన్న సందేశాన్ని పంపడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో 2027 ఎన్నికలకు ముందే పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని, అక్టోబర్ 9న ఐదు లక్షల మందితో నిర్వహించే సభ ద్వారా తన బలాన్ని చూపించాలని మాయావతి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి సన్నాహాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి. వార్డు స్థాయి సమావేశాలు జరిగాయి. మొత్తం కేడర్ను ఉత్తేజపరిచేలా నేతలు పర్యటనలు సాగుతున్నాయి.అక్టోబర్ 8 నుంచే లక్నోలోని రమాబాయి మైదాన్కు సుదూర జిల్లాల నుంచి మద్దతుదారులు రావడం ప్రారంభిస్తారని, చాలా ఏళ్ల తర్వాత మాయావతి ఈ సభలో ప్రసంగించబోతున్నారని బీఎస్పీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంíపీ గిరీష్ చంద్ తెలిపారు. తమకు పట్టున్న ఎస్సీ వర్గాలతో పాటు ముస్లిం, బ్రాహ్మణ, ఓబీసీ వర్గాలను ఏకం చేసేలా ఈ సభ ఉంటుందన్నారు. పార్టీలోకి తిరిగి తీసుకొని జాతీయ సమన్వయకర్తగా నియమితులైన ఆకాష్ ఆనంద్ సైతం ఈ సభను హిట్ చేయడం ద్వారా పారీ్టకి కొత్త జవసత్వాలను అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఆయన ఇప్పటికే యూపీ అంతా తిరుగుతూ బూత్ స్థాయి కమిటీల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే 95 శాతం కమిటీలు పూర్తి చేశారు. ఈ సభలోనే సమాజ్వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, నిషాద్ పార్టీతో సహా అనేక పార్టీల సీనియర్ నాయకులు బీఎస్పీలో చేరవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ నేత ఆజం ఖాన్, బీజేపీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య రాజ్భర్ వర్గానికి చెందిన ఓం ప్రకాష్ రాజ్భర్, సంజయ్ నిషాద్, నసీముద్దీన్ సిద్ధిఖీ వంటి నాయకులు బీఎస్పీ శిబిరంలో చేరుతారనే చర్చ జరుగుతోంది. -
బీహార్లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రధాని మోదీకి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మాదిరిగానే తానూ భారత్-అమెరికా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో.. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోనులో మాట్లాడాను. ఆయనకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.PM Modi posts, "Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH— Press Trust of India (@PTI_News) September 16, 2025దీనికి బదులుగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ‘అధ్యక్షుడు ట్రంప్ నా 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందుకు నా మిత్రునికి ధన్యవాదాలు. మీ మాదిరిగానే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేపట్టిన చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 17 తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్ స్వల్ప ధరలకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే భారత్పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. అలాగే భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ పలుమార్లు ఖండించింది. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్ విజ్ఞప్తి చేసినా.. సేవల నిలిపివేతకే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో గత ఆగస్టు నుంచి ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో సేవలు నిలిపి వేయడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్థిక సమస్యలతో పాటు ఆసుపత్రుల్లో సేవలకు సంబంధించి కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 470 వరకు ఆసుపత్రులు ఉండగా వీటికి సంబంధించి రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు అసోసియేషన్ చెబుతోంది.తెల్లరేషన్కార్డు ఇవ్వగానే ఆస్పత్రుల్లో చేర్చుకునే ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో పేదలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.బిల్లుల బకాయిలను రాబట్టుకోవడం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులు సేవలను బంద్ చేయడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. 2024 డిసెంబర్ నాటికి బకాయిలు రూ.1,000 కోట్లు దాటాయని పేర్కొంటూ జనవరి 10 నుంచి ఐదారు రోజులపాటు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారు. -
జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖ పాత్ర నాదే
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖ పాత్ర తనదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ‘జీఎస్టీ రేట్ల సవరణ కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవడంలో నేను ప్రముఖ పాత్ర పోషిస్తున్నా’అని ఆయన వెల్లడించారు. జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, అయినా పేద, మధ్య తరగతి ప్రజలు, రైతుల శ్రేయస్సుకు ఆ నష్టాన్ని భరిస్తున్నామని స్పష్టం చేశారు. జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో వ్యాపార వర్గాలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల మేలు కోసం జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ జరగాలని సీఎం రేవంత్రెడ్డితోపాటు కేబినెట్ మొత్తం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువుల ధరలు తగ్గుతున్నాయని, ఈ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వ్యాపారులందరిపై ఉందని చెప్పారు. రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల వివరాలు ప్రజలకు వ్యాపారులు తెలియజేయాలని,15 రోజుల్లో ఆదాయ పెంపు మార్గాలపై నివేదిక ఇవ్వండిరాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడంలో భాగంగా అన్ని శాఖలను సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్గా తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమా వేశమైంది. భట్టి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు తోపాటు ఆర్థిక, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఇతర ఆదాయార్జిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయ పెంపుదలకు గల మార్గాలను అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి సర్కిల్వారీగా పన్నుల శాఖ ఆదాయాన్ని సమీక్షించాలని, రవాణా శాఖలో ఆదాయ లక్ష్యాలు చేరుకునేందుకు అవసరమైన ప్రత్యేక పాలసీని రూపొందించాలని భట్టి చెప్పారు. -
పిల్లల బతుకులు ఆగం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘యువత జీవితాలతో రాజకీయాలు చేయొద్దు. రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నా రంటున్నారు. అమ్ముకున్న వారెవరు? కొనుక్కున్నవారెవరు ? ఇలా మాట్లాడే వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపించాలి. మీరు రాజకీయాలు చేసుకోండి. లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల బతుకులు ఆగం చేయొద్దు. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఇబ్బందులు లే కుండా నియామక పత్రాలు ఇస్తారని ఆశి స్తున్నాం. ఏది ఏమైనా విచారణకు మేము కూడా సహకరిస్తాం. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలీదు. అంత సొమ్ముంటే ఏ వ్యాపారమో చేసుకు నే వాళ్లం. రూ.3 కోట్లు కాదు.. బ్యాంకులో రూ.3 లక్షలుంటే చూ పండి. మావి పేద కుటుంబాలు, కాయ కష్టం చేసి పిల్లల్ని చది వించాం. పిల్లలు కూడా రాత్రి పగలు తేడా లేకుండా, పండుగలు, ఇతర శుభ కార్యాలకు దూరమై, ఒక దీక్ష చేసినట్లు చదువుకుని, ర్యాంకులు సాధిస్తే అసత్య ఆరోపణలతో వారిని అవమానిస్తున్నారు. ర్యాంకర్లు ఎవరైనా, ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలకు న్యాయం చేయాలి. ఇప్పటికే మూడు దఫాలు రద్దు చేశారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగాలపై భవిష్యత్తరాలకు నమ్మకం పోతుంది..’ అంటూ నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న పలువురు గ్ర–1 ర్యాంకర్ల తల్లిదండ్రులు వాపోయారు. మంగళవారం సోమాజీ గూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందిగ్రూప్–1 ఉద్యోగాలు అమ్ముకున్నారంటున్నారు. రూ.3 కోట్లు అని ప్రారంభించి రూ.1,700 కోట్ల స్కాం అంటున్నారు. అభియోగం మోపితే సరిపోదు. దాన్ని నిరూపించగలగాలి. ఇక్కడున్న తల్లిదండ్రులకు రూ.3 కోట్లు ఇవ్వగలిగే స్థోమత ఉందా.? లక్షల్లో అప్పులు చేసి పిల్లల్ని చదివించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి.– దాదా సలాం, గోదావరిఖని, 46వ ర్యాంకర్ తండ్రిఎప్పటికీ అశోక్నగర్లోనే ఉండాలా?రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. ఆరోపణలు విని మేము చాలా బాధపడుతున్నాం. 563 మంది రూ.3 కోట్లు చొప్పున ఇస్తే సుమారు రూ.1,700 కోట్లు అవుతుంది. అంత సొమ్ముఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరిందనేది నిరూపించాలి. రూ.లక్షలు ఫీజులు కడుతూ ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా? – పావని, ర్యాంకర్ తల్లిరాజకీయం పార్టీలు చూసుకోవాలివారం రోజులుగా జరుగుతున్న వ్యవహారం మొత్తం చూస్తు న్నాం. రూ.3 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. అందరూ సహకరించాలి. రాజకీయం ఉంటే ఆయా పార్టీలు చూసుకోవాలి. – జంగారెడ్డి, 159వ ర్యాంకర్ తండ్రినిందలు భరించలేకపోతున్నాం..నా కొడుకు మూడు దసరాల నుంచి ఇప్పటివరకు ఒక్క దఫా కూడా మాతో లేడు. గతంలో ప్రిలిమ్స్లో అవకతవకలు జరిగాయన్నారు. ఈసారి మెయిన్స్ రాసి ర్యాంకు వచ్చినప్పుడు ఏమీ అనలేదు. తీరా జాబ్లో చేరే సమయంలో రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదెంతవరకు సమంజసం? ఏమైనా సరే నిందలు వేయకండి. భరించలేకపోతున్నాం. – లలిత, 67వ ర్యాంకర్ ఉదయ్కిరణ్ తల్లి -
గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ఇచ్చినా మిమ్మల్ని తొలగించం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. వేతనాలు పెంచుతాం.. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తాం..’ ఇవీ కూటమి ప్రభుత్వం గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు ఇచ్చిన హామీలు. వీటిని సైతం కూటమి సర్కార్ చెత్త బుట్టలో పడేసి.. గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల బతుకులకు భరోసా లేకుండా చేసింది. అడవి బిడ్డలకు అక్షర వెలుగులు పంచుతున్న వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వారిని బయటకు పంపేస్తోంది. కూటమి ప్రభుత్వ దగాతో 1,143 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారబోతోంది. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది ఔట్సోర్సింగ్ విధానంలో 10 నుంచి 18 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా మార్చి.. ఉద్యోగ భద్రతకల్పించాలని కోరగా.. వాటిని నెరవేరుస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. దీంతో గతేడాది నవంబర్లో 45 రోజులపాటు ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో 1,143 గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్ల పోస్టులు చూపించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తాము అన్యాయమైపోతామంటూ ధర్నాలు చేశారు.ఈ నేపథ్యంలో వారితో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తామని నమ్మబలికి సమ్మె విరమింపజేశారు. అవే విషయాలను అసెంబ్లీలో సైతం మంత్రి సంధ్యారాణి స్పష్టంగా ప్రకటించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. వారిని తొలగించవద్దని ఆదేశాలివ్వగా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2026 వరకు వారిని కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది. మీరంతా బయటకు వెళ్లిపోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.మరీ ఇంత దారుణమా?డీఎస్సీలో పోస్టులు పేర్కొన్నప్పటికీ.. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తాన్న హామీ ఏమైందని గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు, లెక్చరర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు. మీ ఉద్యోగాలు తొలగించబోమని పదే పదే చెప్పిన ప్రభుత్వం.. 1,143 మందిని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో పోస్టులు భర్తీ అవుతున్నాయని.. ఇక మీరు బయటకు వెళ్లిపోవాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారని వాపోయారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శనఫీజు బకాయి చెల్లించకపోతే టీసీఇవ్వలేమన్న ఎస్వీ ఆర్ట్ కాలేజ్ అధికారులుతిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, హాస్టల్ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువీకరణపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్íÙప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
రేటే 'బంగార'మాయెనే..
సాక్షి, విశాఖపట్నం : పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర పైపైకి ఎగబాకుతూ.. ఆల్టైమ్ హై రేట్ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గేదేలే అంటున్న పుత్తడి గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది. పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం. బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చెలామణి అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని సంస్థలు, గృహస్తులు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. భారత్లో మొత్తం ఇళ్లల్లోనూ, ఇతర అవసరాలకు ఈ బంగారం వివిధ రూపాల్లో నిల్వ ఉంది. ఇందులో విశాఖ నగర జనాభా ప్రకారం 80 నుంచి 100 టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సగటున విశాఖ నగరంలో ప్రతి ఇంటిలోనూ 15 నుంచి 25 గ్రాములు వరకూ బంగారం ఉంటుదని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది టెక్స్టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్ -
మావోయిస్టుల కాల్పుల విరమణ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీవ్ర నిర్బంధ పరిస్థితుల నేపథ్యంలో బేషరతుగా కాల్పుల విరమణకు మావోయిస్టులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగు చూసినట్లు మంగళవారం అర్ధరాత్రి జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. హిందీలో విడుదలైన ఈ లేఖలో.. తమ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు అభయ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, హోంమంత్రి అమిత్షా మొదలు ప్రధాని నరేంద్ర మోదీ వరకు అనేకమంది ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలంటూ చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఈ అంశంపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇతర మావోయిస్టు నేతలతో చర్చించుకుని తుది నిర్ణయానికి వచ్చేందుకు కనీసం నెల పాటు ప్రభుత్వం తరఫున కూడా కాల్పుల విరమణ కావాలని కోరారు. కొన్ని కారణాల వల్ల లేఖ విడుదల జాప్యమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రేడియో లాంటి ప్రభుత్వ వార్తా సంస్థల ద్వారా గానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ తెలిజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే మావోయిస్టుల లేఖను పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. అయితే లేఖలోని వాస్తవికతను పరిశీలించాల్సి ఉందని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ చెప్పారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ కూడా..మావోయిస్టుల లేఖలోని వాస్తవికతను, అందులోని అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. -
దేవుడి భూమిలో ఎగ్జిబిషన్, గోల్ఫ్కోర్స్ ఏమిటి?
‘‘దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూములను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయదలచిన 35 ఎకరాలను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించే ప్రతిపాదనల విషయంలో ముందుకెళ్లొద్దు’’ ‘‘ధారి్మక, ఆధ్యాతి్మక కార్యకలాపాలకు తప్ప దేవస్థానం భూములను ఇతర ఏ అవసరాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్కు లేదు. దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు. ఆలయ ఆస్తులను కోర్టులు ఎల్లప్పుడూ పరిరక్షిస్తుంటాయి’’ – రాష్ట్ర హైకోర్టుసాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 35 ఎకరాల్లో ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, 5 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో వేర్వేరుగా దాఖలైన రెండు కేసులను న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ విచారించారు. ఎగ్జిబిషన్, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ భూమి కేటాయించాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఈ ఏడాది జూలై 22న రాసిన లేఖ విషయంలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎగ్జిబిషన్ కోసం భూమిని చదును చేసేందుకు పోసిన గ్రావెల్ను తొలగించాలని, అంతేగాక ఆ భూమిని వ్యవసాయానికి అనుగుణంగా పూర్వస్థితికి తీసుకురావాలని నిర్దేశించారు. 35 ఎకరాలు వ్యవసాయ భూమి అని, వాణిజ్య కార్యకలాపాలకు వాడకూడదని తేల్చి చెప్పారు. మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబరు 6కు వాయిదా వేశారు. » శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాలను ఎగ్జిబిషన్, గోల్ఫ్ కోర్సుకు కేటాయించాలంటూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ రాసిన లేఖను సవాల్ చేస్తూ మచిలీపటా్ననికి చెందిన బూరగడ్డ సుజయ్కుమార్, మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు. దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎగ్జిబిషన్ కోసం ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారని... అందుకు సంబంధించిన ఫొటోలను కోర్టు ముందు ఉంచారు. పచ్చని పంట పొలాల్లో ఎగ్జిబిషన్ కోసం మైనింగ్ వ్యర్థాలను నింపి చదును చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆ భూమి ఎప్పటికీ వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు. భూమిని లీజుకివ్వడంలో ఎలాంటి వేలం నిర్వహించలేదన్నారు. » రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, అది వ్యవసాయ భూమి కాదని అన్నారు. గతంలోనే వ్యవసాయేతర భూమిగా మార్చారని, వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించవచ్చని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రూ.45 లక్షలు చెల్లించారని, వాటిని దేవస్థానం అభివృద్ధికి వెచి్చస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ కేవలం 56 రోజులే ఉంటుందన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని.. ఇదేమీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు.కేవలం ప్రతిపాదనే.. నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గోల్ఫ్ కోర్స్ కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దేవస్థానం భూములను ధార్మికేతర కార్యకలాపాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్కు లేదని తేల్చి చెప్పారు. గోల్ఫ్కోర్స్ ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు.ఆ అధికారం కలెక్టర్కు లేదు ఇదే దేవస్థానం భూమిలో గోల్ఫ్కోర్స్ ఏర్పాటు చేయడంపైనా న్యాయమూర్తి స్పష్టమైన ఉత్తర్వులిచ్చారు. ‘‘దేవుడి భూమిలో గోల్ఫ్ కోర్స్కు సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దు. దేవుడి ఆస్తులను కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక, మతపర కార్యకలాపాలకే ఉపయోగించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేస్తూ జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.గొల్లపూడిలోని 5 ఎకరాలలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 16కి వాయిదా వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదిస్తూ... చట్ట ప్రకారం దేవస్థానానికి చెందిన భూములను ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తప్ప మరే ఇతర కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీల్లేదన్నారు. కానీ, 5 ఎకరాల దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇది వాణిజ్య కార్యకలాపాల కిందకు వస్తుందని, దేవస్థానం భూముల్లో ఇలా చేయడానికి చట్టం ఒప్పుకోదని, ప్రభుత్వానికి ఆ అధికారం లేదని అన్నారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు. దేవస్థానం భూముల విషయంలో జోక్యం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్కు లేదని తెలిపారు. -
ఆది నుంచి దగా
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్ను పట్టించుకోకుండా అన్యాయం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధాన్యం మెలిక పెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్ 12న తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా, ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. రెండు రోజుల క్రితం ఫలితాలు ప్రకటించే దాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి.తప్పుడు లెక్కలు.. భర్తీ ప్రక్రియలో సాగదీతలు⇒ ‘మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యా శాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్లో 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు.⇒ గతేడాది డిసెంబర్ నాటికే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో ఆందోళన⇒ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. ఇలా కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.⇒ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది.ప్రశ్నల్లో తప్పులున్నాసరిచేయకుండానే ఎంపిక⇒ డీఎస్సీ ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యా శాఖ సరిచేయలేదు. అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించినా రెస్పాన్స్ షీట్లలో జవాబులు గుర్తించినట్టు లేకపోవడంతో ఖంగుతిన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 60 నుంచి 20 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా నమోదైంది.⇒ అభ్యర్థులు గుర్తించిన జవాబుకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్)తో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రకటించిన ఫైనల్ ‘కీ’లో అనేక లోపాలను అభ్యర్థులు గుర్తించారు. వాటికి ఆధారాలను సైతం విద్యా శాఖకు పంపించారు. కానీ ఆయా అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియలేదు.⇒ ఆపై మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సరి్టఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం.కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’⇒ ఒకే కేటగిరీకి చెందిన వారిలో వెనక ఉన్న వారికి తొలుత లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం.⇒ ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అంటున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు⇒ డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సరి్టఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు.⇒ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు.⇒ దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కల్పోయారు. ఇలా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అడుగడుగునా కుట్ర పూరితంగానే వ్యవహరించింది.⇒ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీపై 104 వరకు కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నప్పటికీ, అర్హత సాధించాక నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సోమవారం హడావుడిగా తుది ఫలితాలను ప్రకటించేసింది. ఆపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లగా చుక్కెదురైంది. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రతి దశలోనూ కుట్ర పూరితంగానే వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
ముద్దబంతి తోటలో మూగ రోదన!
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధర లేక ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంది. అరటి, చినీ, టమాటా ధరలు కర్షకుల ఆశలు విరిచేస్తున్నాయి. తాజాగా బంతి పూల ధరలూ పతనం కావడం రైతులను మరింతగా కుంగదీస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక అప్పుల ఉబిలో కూరుకకుపోయి సీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు. పూల ఉత్పత్తి అంతా.. సీమ నుంచే.. రాష్ట్రంలో అన్ని పూలు కలిపి ఉత్పత్తి 10.88 లక్షల టన్నులు కాగా, ఒక్క రాయలసీమలోనే 7 లక్షల టన్నుల (64.39శాతం)కు పైగా ఉత్పత్తి అవుతుంది. బంతిపూల ఉత్పత్తిలోనూ రాయలసీమదే అగ్రస్థానం. ఏటా 1.12 లక్షల టన్నుల బంతిపూలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుండగా, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 77 వేల టన్నులు ఉత్పత్తి అవుతాయి. బంతిపూల సాగు, ఉత్పత్తిలో టాప్–10 జిల్లాల్లో 8 జిల్లాలు రాయలసీమలోనే ఉన్నాయి. సాగులో వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఉత్పత్తి పరంగా చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. ఎకరాకు రూ.లక్షా 25వేలు పెట్టుబడి సాధారణంగా ఎకరాకు రూ.16–18 వేల వరకూ బంతి మొక్కలు నాటతారు.. ఒక్కొక్క మొక్క ధర రూ.2–2.5కు తక్కువ ఉండదు. ఎకరాకు కేవలం మొక్కలకే రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఇక కోయడానికి కిలోకు రూ.6–7 చొప్పున ఖర్చు చేస్తారు. ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే ఎకరాకు పెట్టుబడి రూ.లక్షా 25వేల వరకు అవుతుందని కర్షకులు చెబుతున్నారు. సాధారణంగా దిగుబడి ఎకరాకు ఐదు టన్నుల వరకు వస్తుంది. అయితే ఈ ఏడాది వర్షాల వల్ల దిగుబడి మూడు టన్నులే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దసరా ఆరంభ సీజన్లోనూ ధర లేక సాధారణంగా పండగ సీజన్లో బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దసరా పండగ సీజన్లో అయితే నవరాత్రుల తొమ్మిది రోజులూ ఆలయాల్లో అమ్మవారిని అలంకరించేందుకు బంతిపూలను ఎక్కువగా వాడతారు. దీంతో దసరా సీజన్ ప్రారంభమవుతుందంటే ఏటా బంతిపూలకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. రైతులు కూడా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. పండగ సీజన్కు దిగుబడి వచ్చేలా సాగు చేస్తారు. ఈ సీజన్లోనే మంచి ధర పలుకుతుందని, నాలుగు డబ్బులు వెనకేసువచ్చని ఆశతో ఉంటారు. అలాంటిది ఈ ఏడాది దసరా సీజన్ ప్రారంభమయ్యే తరుణంలో బంతి పూల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.10–12కు మించి కొనే పరిస్థితి లేకుండా పోయింది. వినాయకచవితి పండగ రోజుల్లో రెండు రోజులు మాత్రమే కిలో రూ.50–60 ధర లభించగా, ఆ తర్వాత ధరలు పతనమవుతూ వచ్చాయి. కనీసం కిలోకు రూ.35–40 వస్తే కానీ రైతులకు పెట్టుబడులు దక్కవు. ప్రస్తుత ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధర వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బంతిపూల ధరలు రికార్డుస్థాయిలో పలికాయి. కిలో రూ.80–120 మధ్య ధర లభించింది. 2019–24 మధ్యలో ఒక్క బంతిపూలే కాదు. రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పూలకు ఏటా గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు మంచి లాభాలనే ఆర్జించారు. సంక్షోభంలో సీమ రైతులు కూటమి ప్రభుత్వం వచి్చనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పండ్లు, కూరగాయలతోపాటు పూల ధరల పతనంతో సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఉల్లి, అరటి, చినీ, టమాటా ధరలు పతనమైపోయాయి. తాజాగా ఈ బాటలో బంతిపూల రైతులు చేరారు.వరుసగా ధరల పతనంతో సీమలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో 19శాతం చిత్తూరు 24శాతం, వైఎస్సార్ కడప 35శాతం, సత్య సాయి జిల్లాలో 42శాతం నామమాత్రపు విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. ఇక్కడ ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పూర్తిగా తగ్గిపోయింది. సాగు జరిగిన చోట కూడా వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే
సాక్షి, అమరావతి: ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరుసగా కేసులు బనాయించడం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలపై వార్తను ప్రచురించినందుకు ‘సాక్షి’పై కేసులు నమోదు చేయడం, అదే వార్తను ప్రచురించిన మిగతా పత్రికలు, చానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ‘సాక్షి’కి అండగా నిలబడతామని ప్రకటించారు. అది ప్రాథమిక హక్కు..రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ రాజ్దీప్ సర్దేశాయ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ వరి్ధల్లితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విశ్వసిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ఆరి్టకల్ 19(1)ఏ ద్వారా ప్రాథమిక హక్కుగా కల్పించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి పత్రికా రంగం అవిరళ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ‘సాక్షి’ నిలదీస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నారు. ‘సాక్షి’ ప్రచురించే వార్తా కథనాలపై ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఖండిస్తూ వివరణ ఇవ్వాలని, అప్పటికీ సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుల్లో పరువు నష్టం దావా వేయవచ్చన్నారు. అంతేగానీ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో ఆయన ఇంట్లో సోదాలు చేయడం, పోలీసు స్టేషన్లకు రప్పించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా ఈ రీతిలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తే క్రిమినల్ చట్టాలను పోలీసులు దురి్వనియోగం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమ బాధ్యతకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం, పత్రికా స్వేచ్ఛ వికాసానికి ‘సాక్షి’కి అండగా నిలుస్తామని ప్రకటించారు. -
మూడు శాఖలు..ముప్పు తిప్పలు!
సాక్షి, అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టినా ఇప్పటికీ కొన్ని శాఖలు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నాయని ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలకు రేటింగ్ ఇస్తున్నామని, ఇప్పటికీ ఈ మూడు శాఖలు పనులు కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు కావాలనే ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారని, అమెరికా నుంచి 750కిపైగా తప్పుడు పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రెండో రోజు మంగళవారం క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. సీనియర్ అధికారులు కూడా పని విధానం మార్చుకోవాలని, ఇకపై టెస్టుల్లో పాసైన వారినే కీలక పదవుల్లో కూర్చోబెడతానని సీఎం అన్నారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న యువ ఐఏఎస్ అధికారులను కీలక పదవుల్లో కూర్చోబెట్టినట్లు చెప్పారు. టీచర్ల దగ్గర నుంచి ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఐటీపై అవగాహన పెంచుకోవాల్సిందేనన్నారు. కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి క్షేత్ర స్థాయి సమాచారం కోసం కలెక్టర్లను నివేదికలు అడగకూడదని, కావాల్సిన వివరాలన్నీ ఆర్టీజీఎస్ నుంచే తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైల్స్ ఆడిటింగ్ చేస్తాం రెండు నెలల్లో ఫైళ్లన్నీ 100 శాతం ఆన్లైన్ చేయాల్సిందేనని, మానిప్యులేషన్కు తావు లేకుండా ఫైళ్లపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే క్షణాల్లో పట్టుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేలా బ్రాడ్ కాస్ట్ సిస్టమ్ను అన్ని కీలకప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే రివర్ఫ్రంట్ క్వాంటమ్ వ్యాలీ భవనాల డిజైన్లపై అభిప్రాయాలు చెప్పాలని కలెక్టర్లను కోరారు. 2027లోపు రీ సర్వే పూర్తవ్వాలి.. 2027 లోపు భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం ఆర్ఓఆర్కు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. గత ప్రభుత్వం భూములను కాజేయడానికి 22ఏ జాబితాలో పెట్టిందని విమర్శించారు. కుల ధ్రువీకరణ పత్రాలను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందో 22 నుంచి అక్టోబరు 22 వరకూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ ఆదాయం కొన్ని జిల్లాల్లో గణనీయంగా పడిపోవటానికి కారణాలను విశ్లేషించాలన్నారు. నేటి నుంచి 2 వరకూ స్వచ్ఛతాహీ సేవ జనవరి నుంచి వేస్ట్ (చెత్త) ఎక్కడా కనిపించకూడదని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు రాష్ట్రమంతా వర్తింప చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదని, ప్రజల ఆలోచనా విధానం కూడా మారేలా చూడాలన్నారు. స్వచ్ఛతాహీ సేవ సెపె్టంబరు 17 నుంచి అక్టోబరు 2 తేదీ వరకూ చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో ఘన వ్యర్ధాల షెడ్లు నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలన్నారు. 2029కి పచ్చదనం 39 శాతానికి పెరగాలన్నారు. యూరియాపై దుష్ప్రచారం.. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తేవాలని యత్నించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో విశ్లేషించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాలు 16 శాతం పెరిగాయని చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సైబర్ నేరాలతో ప్రజలు నెలకు రూ.30 కోట్లు నష్టపోతున్నారన్నారు. పోలీసులు మరింత అడ్వాన్స్గా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతి భద్రతలపై రహస్య సమీక్ష కలెక్టర్ల సదస్సుకు డుమ్మా కొట్టిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత నియోజకవర్గం ఆత్మకూరులో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన లేకుండానే దేవదాయ శాఖపై సమీక్షను చంద్రబాబు నిర్వహించడం గమనార్హం. ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ లండన్ పర్యటనలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిరోజు సదస్సుకు గైర్హాజరైన విషయం తెలిసిందే. కలెక్టర్ల సదస్సును లైవ్ టెలికాస్ట్ చేసిన ప్రభుత్వం శాంతి భద్రతలపై సమీక్షను మాత్రం రహస్యంగా నిర్వహించింది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోషల్ మీడియాలో తటస్థులు పెడుతున్న పోస్టులపై కేసులు పెట్టాలని ఈ రహస్య సమావేశంలో ఎస్పీలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎలాంటి వారిపైనైనా కేసులు మోపి జైల్లో పెట్టాలని, ఇతర మీడియాను పూర్తిగా అణగదొక్కాలని పరోక్షంగా సంకేతాలు ఇచి్చనట్లు సమాచారం. -
ఈ ఒక్కదానిలో విఫలమయ్యామంటే.. మిగతా అన్నింట్లో సఫలమయ్యాం అనుకుంటారని..!
ఈ ఒక్కదానిలో విఫలమయ్యామంటే.. మిగతా అన్నింట్లో సఫలమయ్యాం అనుకుంటారని..! -
విద్యుత్ ఉద్యోగులను వదిలేశారు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. డిమాండ్లను పరిష్కరించాల్సి వచ్చినపుడు ప్రత్యేక సంస్థ అంటూ వేరు చేసి, అనుకూలంగా పనిచేయాల్సి వచ్చినపుడు మాత్రం చాకిరీ చేయించుకుంటోంది. ఏడాది గడిచినా వారి కనీస డిమాండ్లను పరిష్కరించకుండా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 15 నుంచి దశలవారీ ఆందోళనకు దిగారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొదలైన ఈ ఉద్యమం...23వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రధాన డిమాండ్లు విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం, యాజమాన్యం ఎదుట పలు డిమాండ్లను ఉంచినా, వాటిలో ప్రధానంగా నాలుగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం డీఏ బకాయిలు పెట్టకుండా ఐదేళ్లూ క్లియర్ చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కూటమి సర్కారు వచ్చాక ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదు. దీంతో నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. తద్వారా శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని, డీఏలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఏడాది కాలంలో చనిపోయిన 800 మంది ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కారుణ్య నియామకాలు ఒక్కటీ పూర్తి చేయలేదు. ఇంటి పెద్దను కోల్పోయి, కుటుంబ పోషణ కష్టమై 800 కుటుంబాలు అల్లాడుతున్నాయి. కారుణ్య నియామకాల కమిటీ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 7,686 మంది నిరుద్యోగులకు ఎనర్జీ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించింది. వారిని ఐదేళ్ల తరువాత జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) కేడర్లో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో విలీనం చేయాలి. అయితే, కూటమి సర్కారు పట్టించుకోవడంలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అమల్లోకి వచి్చన 2004 నుంచి కాకుండా 1999 నుంచే పాత పెన్షన్ విధానాన్ని ఎత్తివేసి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) స్కీమ్ను విద్యుత్తు సంస్థల్లో అమలు చేస్తున్నారు. దీంతో 5,311 మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. వారికి న్యాయం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విసిగిపోయి ఉద్యమ బాట పట్టారు. స్పందించకుంటే తీవ్ర ఉద్యమం ఏపీ ట్రాన్స్కో, ఇంధన శాఖ, డిస్కంల యాజమాన్యాలతో పలుసార్లు చర్చలు జరిపినా, మినిట్స్ రూపంలో అంగీకరించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. డిస్కంలు... కార్మిక చట్టాలు, విద్యుత్తు బోర్డు విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా 60 ఏళ్లుగా అమల్లో ఉన్న సర్వీస్ నిబంధనల్లో ఏకపక్షంగా మార్పులు చేస్తున్నాయి. దీంతో విసుగు చెంది తప్పని పరిస్థితుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాం. మా సమస్యలు పరిష్కరించకుంటే 23 తర్వాత ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం.అవసరమైతే నిరవధిక సమ్మె చేపడతాం. –ఎస్.కృష్ణయ్య, చైర్మన్, రాష్ట్ర జేఏసీ కాంట్రాక్టుకు ఇవ్వొద్దు.. ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్స్ రూపొందించాలి. మాస్టర్ స్కేలు గరిష్ఠ పరిమితితో నిమిత్తం లేకుండా వార్షిక, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించాలి. ఎంతోకాలంగా డిపార్ట్మెంట్ ఉద్యోగులతో నిర్వహిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఆపాలి – తురగా రామకృష్ణ, జేఏసీ కో చైర్మన్ వారి ఆశలు నెరవేర్చాలి విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబసభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో అమల్లో ఉన్న జీపీఎఫ్తో కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలి. కాంట్రాక్ట్ లేబర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. లేదంటే మా ఉద్యమం ఉధృతం అవుతుంది. తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – రాఘవరెడ్డి, జేఏసీ కన్వినర్ ఎనర్జీ అసిస్టెంట్లకు న్యాయం జరగాలి దీర్ఘకాలిక సర్వీసున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ విద్యుత్ సంస్థలలో విలీనం చేయాలి. కారుణ్య నియామకాలు కల్పించడంలో పాత పద్ధతినే కొనసాగించాలి. 2019లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్ఎం (గ్రేడ్–2)లను రెగ్యులర్ జేఎల్ఎంలుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలి.’’ – కె.శేషారెడ్డి, జేఏసీ కో కన్వినర్ -
రేపు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలు తదితరాలపై వారితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసు
తిరుపతి క్రైమ్,తిరుపతి మంగళం: టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. హిందూ మత మనోభావాలు దెబ్బతీయడానికి, టీటీడీని కించపరచడానికి, ప్రజల్లో అల్లర్లు రేపడానికి దు్రష్పచార వీడియోలు పోస్ట్ చేశారంటూ ఆయనపై టీటీడీ డిప్యూటీ ఇంజనీర్ గోవిందరాజులు అలిపిరి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 196(1)(ఎ), 197(1), 299, 352, 353(3), 356(2), రెడ్ విత్ 356(1) బిఎంఎస్ చట్టం కింద భూమనపై కేసు నమోదు చేశారు. తిరుపతి అలిపిరి బస్టాండు సమీపంలో చెత్త, మద్యం సీసాలు, మూత్ర విసర్జన జరిగే ప్రదేశాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వదిలిపెట్టినట్లుగా భూమన కరుణాకరరెడ్డి చూపించారని గోవిందరాజులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయన్నారు. రాయల్ చెరువుకు చెందిన దివంగత పట్టా కన్నాచారి సుమారు 20 ఏళ్ల క్రితం ఈ శిల్పాన్ని పూర్తిచేయకుండా వదిలేశారని తెలిపారు. ఆ సమయంలో చాలా రాళ్లతో పాటు శనీశ్వర విగ్రహాన్ని భూదేవి కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పడేశారన్నారు. ఈ విగ్రహానికి, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచి రాజకీయ లబ్ధి కోసమే భూమన ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. శనీశ్వరుడికి శంఖు, చక్రాలు ఉంటాయా? భూమన మండిపాటు రాజకీయాల కంటే హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాలచెంత మహావిష్ణువు విగ్రహాన్ని మద్యం బాటిళ్ల మధ్య పడేశారని చూపించి ప్రశ్నిస్తే టీటీడీ అధికారులు తనపై కేసులు పెట్టడం వారి నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. టీటీడీలో జరుగుతున్న తప్పిదాలు, అపచారాలు, ఘోరాలను సరిదిద్దుకోవాల్సిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు. మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని చూపితే అసలు ఆ విగ్రహం మహావిష్ణువుదే కాదు.. శనీశ్వర స్వామిదని చెప్పడం ఏంటని మండిపడ్డారు. శనీశ్వరస్వామి విగ్రహానికి శంఖు, చక్రాలు ఉంటాయా అని నిలదీశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
మెరిట్ను ఎలా విస్మరిస్తారు?
ఎస్జీటీకి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచి్చ.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను ఎలా విస్మరిస్తారు? మెరిట్ను కాదని ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటి? ఇది ఎంత మాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేం. – హైకోర్టు ధర్మాసనంమెరిట్ లిస్ట్లో ఉన్నా ఎంపిక చేయలేదు నేను ఎస్టీ కేటగిరి మహిళను. మెరిట్ లిస్ట్లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), ఎస్జీటీ విభాగాల్లో నా పేరు ఉంది. ఎస్జీటీలో 61.63.. ఎస్ఏలో 61.00 స్కోర్ వచ్చింది. మూడో విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు. అధికారులు నా సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. – కమ్మిడి లత, డుంబ్రిగుడ, అల్లూరి సీతారామరాజు జిల్లాసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కింద సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులను అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వారిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలను తీసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయ పడింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతలను కోరి ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది. పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని, ఆ తర్వాత రాత పరీక్షలో వారు ఎస్ఏ పోస్టులో అత్యుత్తమ ర్యాంకు సాధించినప్పటికీ, ప్రాధాన్యత కింద ఎస్జీటీ పోస్టును ఎంపిక చేసుకున్నారు కాబట్టి, ఎస్ఏ పోస్టు ఇవ్వమని చెప్పడం దారుణమంది. ఎస్జీటీ నుంచి పదోన్నతిపై ఎస్ఏగా నియమితులవుతారని, కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏగా కాకుండా ఎస్జీటీగా నియమిస్తామనడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించింది. అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి, మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలంది. ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. ఎస్జీటీ, ఎస్ఏ పోస్టులకు పరీక్షలు రాసి, రెండింటిలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్ఏ పోస్టుకు అర్హులేనని, పోస్టుల భర్తీలో మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాలు లేక, వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉంటారని, అలాంటి వారి విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్, మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సింగిల్ జడ్జి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు. మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషనర్లను ఎస్ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని, వారిని ఎస్ఏ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు.సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్లు వేసిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై మంగళవారం జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ను పిటిషనర్లు సవాలు చేయలేరన్నారు. దరఖాస్తుల సమయంలోనే ప్రాధాన్యతలు ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు. దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కోర్టుకొచ్చారని తెలిపారు. ఎస్జీటీ పోస్టులు ఎక్కువ ఉండటంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలను ఇచ్చారన్నారు. దాని ప్రకారమే వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులిస్తే, మరింత మంది అభ్యర్థులు వేర్వేరు అభ్యర్థనలతో కోర్టుకొస్తారని, దీని వల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందన్నారు.ఎస్జీటీ నుంచి ఎస్ఏ కావాలంటే 20 ఏళ్లు పడుతుంది పిటిషనర్ల తరఫున జీవీఎస్ కిషోర్ కుమార్, గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. పిటిషనర్లు రాత పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని, అందువల్ల వారు ఎస్ఏ పోస్టులకు అర్హులవుతున్నారని తెలిపారు. అయితే దరఖాస్తు సమయంలో వీరు ఎస్జీటీకి తమ ప్రాధాన్యతను ఇచ్చారని, ఎక్కువ పోస్టులు ఉండటంతోనే అలా చేశారని వివరించారు. ఎస్జీటీ నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్లాలంటే 20 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు. మెరిట్ను కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు.ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు? ర్యాంకులెందుకు?ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే, ఇక మెరిట్ ఎందుకని, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఎస్జీటీకి, ఎస్ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచ్చి.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరు పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను కాకుండా ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని నిలదీసింది. మెరిట్ను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే నివేదించి.. తుది విచారణ జరిపి పిటిషన్లపై నిర్ణయం వెలువరించేలా చూడాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను పరిష్కరించింది.ఆ విభాగంలో నేనొక్కడినే.. అయినా పోస్టు రాలేదుడీఎస్సీ నిర్వహణ తొలి నుంచి లోపభూయిష్టంగా ఉంది. కనిగిరి మండలంలో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో డీఎస్సీ ఫిజికల్ సైన్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో మెన్కు ఒకపోస్టు, ఉమెన్కు ఒక పోస్టు ఉన్నాయి. డీఎస్సీలో నాకు 34.55 శాతం మార్కులు వచ్చాయి. ఆ పోస్టుకు ఒక్కడినే ఉండడంతో కాల్ లెటర్ పంపించారు. ఈ నెల 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. హియరింగ్ ఇంపెయిర్డ్ నిర్ధారణ కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. తీరా సోమవారం ప్రకటించిన డీఎస్సీ జాబితాలో నా పేరు లేదు. మరోవైపు హియరింగ్ ఇంపెయిర్డ్ కోటా కింద ఉన్న ఒక పోస్టును క్యారీ ఫార్వార్డ్లో పెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. – వెంకటనారాయణ, కనిగిరి, ప్రకాశం జిల్లా‘అనంత’లో తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగాలుడీఎస్సీ–25 తుది ఎంపిక జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ మెరిట్ ఉన్నవారి పేర్లు ఉండడంతో అర్హులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఏ ఇంగ్లిష్లో ఎ.ఆంజనేయులు 48వ ర్యాంకులో ఉన్నాడు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బీసీ–ఏ కేటగిరీకి చెందిన ఈ అభ్యర్థి కంటే వెనకున్న 49వ ర్యాంకు అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఉన్నాడు. బీసీ–ఏ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి. ఈయన కంటే వెనుకున్న 8 మంది ఎంపిక జాబితాలో ఉన్నా, ఎ.ఆంజనేయులు పేరు లేకపోవడంతో డీఈఓను కలిసి విన్నవించాడు. చంద్రిక అనే అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ రెండు పోస్టులకూ ఎంపికైంది. ఈమె కేజీబీవీలో పని చేస్తోంది. కేజీబీవీలో పని చేస్తూ బీపీఈడీ కోర్సు చేసిందనే ఫిర్యాదు రావడంతో ఆ పోస్టుకు అనర్హురాలిగా తేల్చారు. యూజీపీడీ ఉన్న కారణంగా పీఈటీ పోస్టుకు ఎంపికైంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంపిక జాబితాలో మాత్రం ఈమె పేరు లేదు. తన కేటగిరీలో తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయంటూ ఆమె అధికారులను కలిసి వాపోయారు. మెంటల్లీ ఇన్హెల్త్ కేటగిరీ కింద కె.శ్రీనివాసులు అనే అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉన్నాడు. ఈయనకు ‘0’ శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినా.. ఆ సర్టిఫికెట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు. ఫలితంగా ఆయన అర్హత లేకపోయినా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. – సాక్షి నెట్వర్క్డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి : కేవీపీఎస్సాక్షి, అమరావతి: డీఎస్సీలో మెరిట్ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, సామాజిక న్యాయానికి తూట్లు పొడవద్దని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరిట్లో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే చూపించే ప్రతిపాదన సరికాదన్నారు.నిరుద్యోగులతో చెలగాటం : డీవైఎఫ్ఐసాక్షి, అమరావతి: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, డీఎస్సీ–2025లో జరిగిన గందరగోళం ఏ డీఎస్సీలోనూ జరగలేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట నిరసన తెలిపారు. -
చార్జిషీట్లు వేసిన తర్వాత మళ్లీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలన్న వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చార్జిషీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏమిటంటూ ఆమెను ప్రశ్నించింది. ఒకదానివెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేదెప్పుడని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తయ్యాకే కదా చార్జిషీట్లు వేసిందని ప్రశ్నించింది.మీరు ఇపుడు చేస్తున్న వాదనలను విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని నిలదీసింది. ఇదే సమయంలో వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి తదితరులకిచి్చన బెయిల్ను రద్దు చేసే విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ సతీష్చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రద్దు, తదుపరి దర్యాప్తు కోసం సునీత పిటిషన్లు... వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్రెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులకు హైకోర్టు ఇచి్చన ముందస్తు బెయిల్, బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీతరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. తదుపరి దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి. రాజు స్పందిస్తూ, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు. కోర్టు ఆదేశిస్తేనే తప్ప తదుపరి దర్యాప్తు చేయపట్టబోమన్నారు. 13 లక్షల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచింది... వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్రెడ్డి, భాస్కర్రెడ్డి తదితరుల తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, నాగముత్తు వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిందని తెలిపారు. భారీ స్థాయిలో చార్జిషీట్లు కూడా దాఖలు చేసిందన్నారు. 13 లక్షల పేజీల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచిందని తెలిపారు. ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింది కోర్టు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉండదన్నారు. ఇలా అయితే దశాబ్ద కాలం పడుతుంది... ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, చార్జిషీట్లు దాఖలైన తరువాత ఈ కేసును తాము పర్యవేక్షించడం ఏమిటంటూ ప్రశ్నించింది. ఇలా ఒక దాని వెంట మరొక పిటిషన్ దాఖలు చేసుకుంటూ వెళుతుంటే అసలు ట్రయల్ పూర్తి కావడానికే దశాబ్ద›కాలం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మీరు చెబుతున్న వాదనను దర్యాప్తు సమయంలోనే సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. నిందితులపై ఇప్పటికే సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసిందని గుర్తు చేసింది. ఇంతకన్నా చేసేది ఏముంటుందని ప్రశ్నించింది. ‘దర్యాప్తు పూర్తి చేసిన తరువాతనే కదా చార్జిషీట్లు వేసేది. మరి అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరడం ద్వారా మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు’ అంటూ సునీతను ప్రశ్నించింది. తదుపరి దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసి దానిని ఓ తార్కిక ముగింపునివ్వాలంది. తదుపరి దర్యాప్తు విషయాన్ని సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. అలాగే నిందితుల బెయిల్ రద్దు విషయంలో కూడా జోక్యం చేసుకునేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రర్బ్ చేయబోమంది. తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ కోర్టునే ఆశ్రయించాలని సునీతను ధర్మాసనం ఆదేశించింది. రెండువారాల్లోగా తాజా పిటిషన్ దాఖరు చేసుకోవచ్చని, ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే దానిని 8 వారాల్లోపు తేల్చాలని సీబీఐ కోర్టుకు తేల్చిచెప్పింది. సీబీఐ తనంతట తానుగా కాకుండా సీబీఐ కోర్టు ఆదేశాలు ఇస్తేనే తదుపరి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. -
న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ పరువు నష్టం దావా
వాషింగ్టన్: ‘ద న్యూయార్క్ టైమ్’ పత్రిక తనను అవమానించడమే పనిగా పెట్టుకుందని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాకుండా విపక్ష డెమెక్రటిక్ పార్టీకి కరపత్రికగా మారిపోయిందని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి, వ్యాపారానికి వ్యతిరేకంగా తప్పుడు సేŠట్ట్మెంట్లు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పత్రికపై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తనకు జరిగిన నష్టానికి గాను ఆ పత్రిక 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్లు) పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ ఈ మేరకు సోమవారం రాత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ట్రంప్ డిమాండ్ చేస్తున్న సొమ్ము ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక మార్కెట్ విలువ కంటే అధికం కావడం గమనార్హం. పాత్రికేయ రంగంలో ప్రమాణాలను పునరుద్ధరించడం, సమగ్రతను కాపాడడం తన ఉద్దేశమని ట్రంప్ చెబుతుండడం విశేషం. అయితే, నిపుణుల వాదన మరోలా ఉంది.న్యూయార్క్ టైమ్స్పై పరువు నష్టం దావా వేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించాలని, వ్యతిరేక గళాలను అణచివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపడితే కోర్టుకు లాగడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ వేసిన పరువు నష్టం దావాలో పుస్తక ప్రచురణ సంస్థ పెంర్విన్ రాండమ్ హౌస్తోపాటు న్యూయార్క్ టైమ్స్లో పనిచేసే నలుగురు జర్నలిస్టుల పేర్లు కూడా చేర్చారు. వీరిలో ఇద్దరు ట్రంప్పై ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని పెంర్విన్ ప్రచురించింది.ఆ దావాలో పస లేదుకోర్టులో ట్రంప్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక యాజమాన్యం స్పందించింది. ఆ దావాలో ఏమాత్రం పస లేదని, అది చెల్లదని, న్యాయ పరీక్షకు నిలవదని తేల్చిచెప్పింది. మీడియా స్వతంత్రను దెబ్బతీయడమే ట్రంప్ ఉద్దేశమని విమర్శించింది. ప్రసార మాధ్యమాలను అణచివేయడం మానుకోవాలని సూచించింది. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాము లొంగబోమని స్పష్టంచేసింది. నిజాలు నిర్భయంగా బహిర్గతం చేస్తూనే ఉంటామని, తమను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. న్యాయం తమవైపే ఉందని ఉద్ఘాటించింది. -
ధరల పతనంలో బాబు ‘రికార్డు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? » క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. -
యూపీలో ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల జాబితాలో భారీ మొత్తంలో అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం ఆరోపించారు. మహోబా జిల్లాలోని ఒకే ఒక ఇంటి నంబర్తో 4,271 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. లక్నోలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహోబా జిల్లాలోని రెండు ఇళ్లలో 243, 185 ఉన్నట్లు కనుగొని షాకయ్యా.తాజాగా, ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లున్నారు. అంటే ఆ కుటుంబంలోని మొత్తం సభ్యులు కనీసం 12 వేల మంది ఉండి ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే గ్రామంలో మొత్తం ఓటర్లు సుమారు 16 వేలు కావడం మరింత తీవ్రమైన అంశమన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి యూపీలో ఓట్ల చోరీ మొదలుపెట్టాయన్నారు. అదేవిధంగా, బిహార్లో బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రంలోని భాగల్పూర్లో పారిశ్రా మికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్కు ఎకరా కేవలం రూ.1కే ఏకంగా వెయ్యి ఎకరాల భూమిని పవర్ ప్లాంట్ కోసం 25 ఏళ్లకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఈప్లాంట్ విద్యుత్ను యూనిట్ రూ.7 చొప్పున 25 ఏళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. -
అస్సాం సివిల్ సర్వీసు అధికారిణి నూపుర్ బోరా అరెస్టు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. -
అతివకు.. 'పాష్ప'తాస్త్రం!
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో టాప్–30 సంస్థలలో.. గతేడాది లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మహిళా ఉద్యోగులు తమ సమస్యల గురించి గొంతు విప్పేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారనడానికి ఇది సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క సంస్థలు కూడా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. 2023–24లో వచ్చిన ఫిర్యాదుల్లో 88 శాతం పరిష్కారం కావడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్బీఎస్ఈలోని టాప్–30 కంపెనీలకు.. తమ మహిళా ఉద్యోగుల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 958 ఫిర్యాదులు అందాయి. 2023–24లో వీటి సంఖ్య 902. అంటే ఏడాదిలో ఫిర్యాదుల సంఖ్య 6.2 శాతం పెరిగింది. ఫిర్యాదుల్లో పెరుగుదలకు ‘పాష్’ చట్టమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.ఏమిటీ పాష్ చట్టం?ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ (పాష్) యాక్ట్ను అధికారికంగా ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013’ అని పిలుస్తారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకారానికి వ్యవస్థలను ఏర్పాటుచేసి కంపెనీలు ఊరుకోవడం లేదు. ఫిర్యాదుల పట్ల కూడా సీరియస్గానే వ్యవహరిస్తున్నాయి. వాటి పరిష్కారం కోసమూ చర్యలు చేపడుతున్నాయి. 2023–24లో టాప్–30 బీఎస్ఈ కంపెనీలలో పాష్ కింద నమోదైన 902 కేసుల్లో 88% పరిష్కారం అయ్యాయని లైంగిక వేధింపుల నివారణపై కంపెనీలకు సలహాలు ఇస్తున్న ‘కంప్లైకరో’ అనే సంస్థ తెలిపింది. ‘ఇది గొప్ప మార్పునకు సూచిక’ అని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు.ప్రభుత్వ పర్యవేక్షణభారత ప్రభుత్వ షీ–బాక్స్ పోర్టల్లో అన్ని కంపెనీలు (పెద్దవి లేదా చిన్నవి) తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అలాగే నిబంధనల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో కార్మిక కమిషనర్లు సర్వేలు చేయాలని ఆదేశించింది. అన్ని కంపెనీలు ఒకేచోట నమోదు కావడంతో షీ–బాక్స్ పోర్టల్లో బాధితులు తమ పాష్ ఫిర్యాదును దాఖలు చేయడం సులభతరమైంది. విచారణ ప్రక్రియను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందనే విషయం ఉద్యోగికి మరింత ధైర్యం, ఊరటనిస్తుందని నిపుణులు అంటున్నారు. పాష్ ఫిర్యాదులు, నిబంధనల అమలులో ప్రస్తుత సంవత్సరం ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్టు కంప్లైకరో వెల్లడించింది. పాష్ చట్టాన్ని పాటించడానికి పెద్ద కంపెనీలే కాదు, ఎంఎస్ఎంఈలు కూడా ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల నుంచి రోజుకు సగటున 7–8 ఫిర్యాదులు వస్తున్నాయని వివరించింది.అవగాహన పెరిగిందిపాష్ ఫిర్యాదులు పెరగడం అంటే.. పని ప్రదేశాల్లో సమస్యల పట్ల బాధితులు తమ గొంతు వినిపించడానికి ధైర్యంగా ముందుకు రావడమేనని హెచ్ఆర్ నిపుణులు అంటున్నారు. ‘సంవత్సరాలుగా బాధితులు నిశ్శబ్దంగానే ఉన్నారు. పాష్ పట్ల మహిళల్లో అవగాహన పెరిగింది. తాము ఎదుర్కొంటున్న వేధింపులకు పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం పెరుగుతోంది. అందుకే ధైర్యంగా ఎక్కువ మంది ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు’ అని వారు చెబుతున్నారు. బ్యాంకుల నుంచే ఎక్కువఆసక్తికర విషయం ఏమంటే బీఎస్ఈ టాప్–30 కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఫిర్యాదులలో బ్యాంకు ఉద్యోగుల నుంచి 34% ఫిర్యాదులు వస్తే, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి 31.5% వచ్చాయి. మూడింట రెండు వంతులు లేదా 627 ఫిర్యాదులు ఈ రెండు రంగాల నుంచే అందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గరిష్టంగా 125 ఫిర్యాదులను అందుకుంది. 2023–24లో ఈ సంస్థలో 110 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 117 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఫిర్యాదుల పరంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
విజయనగరం ఐసిస్ కేసులో కదలిక
సాక్షి హైదరాబాద్/కొత్తగూడెం టౌన్: ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)ల ద్వారా విధ్వంసాలకు పాల్పడడానికి కుట్రపన్నిన విజయనగరం ఐసిస్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని 16 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయనగరం కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాది సిరాజ్–ఉర్–రెహమాన్ను జులైలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఐఈడీల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను సిరాజ్ కలిగి ఉండటంతో ఉగ్రవాద నెట్వర్క్పై ఎన్ఐఏ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 27న సౌదీ అరేబియాలోని రియాద్కు పారిపోవడానికి ప్రయత్నించిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ను అరెస్ట్ చేసింది. సిరాజ్తో కలిసి నేపాల్ సరిహద్దు ద్వారా ఆయుధాల సరఫరాకు ఏర్పాట్లు చేయడానికి కుట్ర చేసినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించాడు. దీని ఫలితంగా మరో నిందితుడు సయ్యద్ సమీర్ను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ వివైజులు, డాక్యుమెంట్లు, నగదు సహా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ఉగ్రవాదం వైపు యువత రిక్రూట్మెంటుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం పెట్టిన మతపరమైన పోస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు లైక్ కొట్టిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సమీపాన మధురబస్తీలోని ఓ ఇంటికి తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు పది వాహనాలతో వచ్చిన అధికారులు ఉదయం 6 గంటల వరకు సోదాలు నిర్వహించి వివరాలు సేకరించారు. అనంతరం కొత్తగూడెం పాలకేంద్రం సమీపాన మరొకరి ఇంట్లోనూ చేపట్టిన తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. -
గాజాపై భీకర దాడులు
జెరూసలేం: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ సైనిక వనరుల నాశనమే లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించింది. ‘ప్రమాదకరమైన యుద్ధ జోన్’గా మారిన నగరాన్ని వీడి దక్షిణప్రాంతంలోని అల్ మువాసిలో ఏర్పాటు చేసిన మానవీయ జోన్కు తరలివెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో మరో 68 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెగని దాడులతో భీతిల్లిన జనం నగరాన్ని వీడి పెద్ద సంఖ్యలో వెళ్లిపోతున్నారు.తీరం వెంబడి రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ మంగళవారం ఉదయం ‘గాజా తగులబడుతోంది’అంటూ వ్యాఖ్యానించారు. హమాస్ సాయుధ వనరులను ధ్వంసం చేసి, బందీలను విడిపించుకుంటామన్నారు. లక్ష్యం నెరవేరేదాకా వెనక్కి తగ్గేది లేదన్నారు. దీంతో, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్థం తీవ్రరూపం దాల్చగా, కాల్పుల విరమణ కోసం ఇప్పటి వరకు కొనసాగిన దౌత్యప్రయత్నాలకు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు.ఆగని మారణకాండగాజా నగర జనాభా దాదాపు 10 లక్షలు కాగా ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటి వరకు 2.20లక్షల మంది దక్షిణాదికి వలస వెళ్లినట్లు ఐరాస అంచనా వేసింది. మంగళవారం ఈ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఉధృతం చేసింది. ఈ దాడుల్లో కనీసం 68 మంది చనిపోయినట్లు అల్ జజీరా తెలిపింది. సోమవారం రాత్రంతా శతఘ్నులు, హెలికాప్టర్లు, క్షిపణులు, డ్రోన్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతోవిరామం లేకుండా బాంబింగ్ కొనసాగిందని షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియాహ్ వ్యాఖ్యానించారు. తమ ఆస్పత్రికి పదుల సంఖ్యలో మృతదేహాలు వచ్చాయన్నారు. కనీసం 90 మంది క్షతగాత్రులకు చికిత్స చేశామన్నారు. భవనాల శిథిలాల కింద చాలామందే చిక్కుకుని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ శత్రువు: ఈజిప్టుఅమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో సోమవారం ఇజ్రాయెల్ చేరుకుని, ప్రధాని నెతన్యాహూతో చర్చలు జరిపారు. గాజాలో క్షేత్రస్థాయి ఆపరేషన్ ప్రారంభమైనందున, ఒప్పందం కుదుర్చుకునేందుకు తగు సమయం లేదంటూ వ్యాఖ్యానించారు. ఎంతో ముఖ్యమైన ఈ ఆపరేషన్ కొన్ని వారాల్లోనే ముగియనుందన్నారు. అనంతరం ఆయన ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నారు. దోహాలో జరుగుతున్న అరబ్, ముస్లిం దేశాల నేతల సమావేశం ఖతార్పై ఇజ్రాయెల్ గత వారం చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది.ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి దౌత్యప రమైన ఒత్తిడుల ద్వారా ముగింపునకు తేవాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ను శత్రువంటూ దోహాలో జరిగిన సమావేశంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి అభివర్ణించారు. 1979లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాక ఇజ్రాయెల్ను ఆ దేశం ఇంత తీవ్రంగా నిందించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం తమ అసంతృప్తి తీవ్రతను వ్యక్తం చేసేందుకే తప్ప, ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకునేందుకు కాదని అంటున్నారు.జన హననానికి ఆధారాలుఇజ్రాయెల్ ఆర్మీ గాజా ప్రాంతంలో జనహననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ పేర్కొంది. మారణహోమానికి ముగింపు పలికి, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ కమిటీ 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడులు, మానవహక్కుల ఉల్లంఘన పర్యవసానాలను రికార్డు చేసింది. -
ఫీజు రీయింబర్స్మెంట్ ప్లానింగ్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ హేతుబద్ధీకరణపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ దిశగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సంక్షేమ, విద్యాశాఖ అధికారులతోపాటు కాలేజీ యాజమాన్య ప్రతినిధులను ఇందులో చేర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హేతుబద్ధీకరణపై దృష్టి పెట్టారు. విద్యాశాఖ అధికారులతో ఆయన సంప్రదింపులు చేపట్టారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్ల మేర పేరుకుపోయాయి. ఇక నుంచి ఫీజు రీయింబర్స్మెంట్కు కొత్త మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. డేటా సేకరణఫీజు రీయింబర్స్మెంట్పై సమగ్ర సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కార్యా లయం విద్య, సంక్షేమ శాఖలను ఆదేశించింది. దీంతో పాటే కాలేజీల నాణ్యత ప్రమాణాలపైనా నివేదిక కోరుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పొందే కాలేజీల్లో హాజరు శాతం ఎలా ఉంది? కొన్నేళ్లుగా ఆయా కాలేజీల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగాలు పొందారు? ఆ కాలేజీలు ఎన్నిసార్లు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందాయి? ఇలాంటి అనేక వివరాలను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. నాణ్యత లేని కాలేజీలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాలేజీలో కనీస స్థాయి ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ఉద్యోగ అవకాశాలను కొలమానంగా తీసుకునే వీలుంది. దీంతో పాటు యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ, లేబొరేటరీలు ఉన్న కాలేజీలకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందనే నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. నేరుగా ఇస్తే సమస్యలేంటి?విద్యార్థికి వారి బ్యాంకు ఖాతాలోనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారుల ద్వారా వాకబు చేసినట్టు తెలిసింది. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావడం ఆలస్యమైతే, కాలేజీల నుంచి విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుందనే భావన విద్యార్థి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు వేసినా, అవి వాడుకుంటే సమస్యలు వస్తాయనే ఆలోచన కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజ మాన్యాలు మాత్రం ప్రత్యేక బ్యాంకు ఖాతా పెట్టాలని, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని, కాలేజీ నిర్వహణ వ్యయాన్ని ఈ ఖాతాలో ఉంచాలన్న ప్రతిపాదన తీసుకొచ్చాయి. దీనికి బ్యాంకులు ఏమేర ముందుకొస్తాయనేది ఉన్నతాధికారులు పరిశీలించే పనిలో ఉన్నారు. -
‘మర్రి’కి అటూ ఇటూ రోడ్డు!
సాక్షి, హైదరాబాద్: హెదరాబాద్ – బీజా పూర్ జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 916 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పర్యావరణ ప్రేమి కులు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించటంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.మర్రి వృక్షాల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక సమ ర్పించాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ఎన్హెచ్ఏఐ సరికొత్త ఆలోచనతో మధ్యేమార్గాన్ని రూపొందించింది. గతంలో రూపొందించిన డిజైన్ను సవరించి రూపొందించిన కొత్త డిజైన్ను తాజాగా ట్రిబ్యునల్కు ఎన్హెచ్ఏఐ సమర్పించింది. మరోవైపు కేసు దాఖలు చేసిన పర్యావరణ ప్రేమికులు, ఆ డిజైన్ ప్రకారం వృక్షాల భద్రతపై ఈ వారంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్రిబ్యునల్ ముందు తమ వాదనను వినిపించనున్నారు. ఇదీ చిక్కు...హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46.405 కి.మీ. సర్వీసు రోడ్లతోపాటు నాలుగు వరసలుగా విస్తరించే బాధ్యతను ఎన్హెచ్ఏఐకి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అప్పగించింది. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్హెచ్ విభాగానికి అప్పగించింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా 60 నుంచి 85 ఏళ్ల వయసు ఉన్న 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావటంతో పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం తెలిపారు. ఆ రోడ్డును అలాగే ఉంచి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేశారు. తాజా పరిష్కారం ఇలా: రోడ్డును రెండు వైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. దీంతో అక్కడ ఉన్న అన్ని మర్రి వృక్షాలను తొలగించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు ఆ డిజైన్ను మార్చారు. తొలుత 5 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. దీంతో కలిసి వచ్చే మూడున్నర మీటర్ల భాగాన్ని ప్రధాన కారేజ్వేలో కలిపేయటం ద్వారా వృక్షాలకు చేరువ వరకు మాత్రమే రోడ్డును విస్తరిస్తారు. వృక్షాల ఆవల సర్వీసు రోడ్డును నిర్మిస్తారు. అంటే.. సర్వీసు రోడ్డుకు, ప్రధాన క్యారేజ్ వేకు మధ్యలో ఆ వృక్షాలుంటాయి. రోడ్డు మీదకు వచ్చి వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 వృక్షాలు మాత్రం ఈ డిజైన్కు అనుకూలంగా లేవు. దీంతో వాటిని ఉన్న చోట నుంచి ట్రాన్స్లొకేట్ పద్ధతిలో కాస్త పక్కకు మార్చి తిరిగి నాటుతారు. ఆ 150 వృక్షాలకు ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. అయితే, ఈ డిజైన్ ప్రకారం మర్రి వృక్షాల కొమ్మలు తొలగించనుండటంతో పర్యావరణ ప్రేమి కులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
నేడు పరేడ్గ్రౌండ్స్లో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో బుధవారం ‘హైదరాబాద్ లిబరేషన్ డే’జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్కు ఆయన చేరుకుంటారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. సీఆర్పీఎఫ్, ఇతర బలగాలు నిర్వహించే పరేడ్ను వీక్షిస్తారు. పారామిలటరీ దళాల ప్రత్యేక పరేడ్ కూడా ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక (పూర్వ హైదరాబాద్ స్టేట్)లకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన, థీమ్ ఆధారిత బ్యాలె, దేశభక్తితో కూడిన ప్రదర్శనలు ఉంటాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్ధేశించి రాజ్నాథ్సింగ్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర చౌహాన్, జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక జూబ్లీ బస్టాండ్కు సమీపంలోని కంటోన్మెంట్ పార్క్లో ఏర్పాటు చేసిన భారతరత్న, మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి విగ్రహాన్ని రాజ్నాథ్సింగ్ ఆవిష్కరి స్తారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళతారు. హైదరాబాద్ లిబరేషన్డేను పురస్కరించుకొని ఉదయం 6.30 గంటలకు అసెంబ్లీ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. -
చర్చలు సానుకూలం
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ)పై భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య మంగళవారం ఢిల్లీలో చర్చలు జరిగాయి. సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. పరస్పరం ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పందం ఉండాలని తీర్మానించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు పూర్తి సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చర్చలను త్వరగా ముగించడానికి ప్రయత్నాలు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.భారత్తో వాణిజ్య చర్చల కోసం అమెరికా నుంచి వచి్చన బృందానికి బ్రెండాన్ లించ్ నేతృత్వం వహించారు. ఆయన దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధిగా పని చేస్తున్నారు. చర్చల కోసం తన బృందంతో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రోజంతా చర్చలు జరిగాయి. భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకోవడం విశేషం. 50 శాతం టారిఫ్లు విధించిన తర్వాత అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధ -
మోసమే కాంగ్రెస్ నైజం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ నైజమని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాత రోజులను తిరిగి తెచ్చి పాలనా సామర్థ్యం లేక గత ప్రభుత్వంపై నెపం నెడుతోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణభవన్లో మంగళవారం జరిగిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై ఈ సమావేశంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లుగా మారారని, కాంగ్రెస్కు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి లక్కీలాటరీలో మంత్రి పదవి దక్కించుకొని అహంకారంతో మాట్లాడుతున్నారు..పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రల ను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బలంగా నిలబడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తమ పార్టీ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి దేహాలను మూడు రోజులైనా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. -
హిమాచల్, ఉత్తరాఖండ్లలో మళ్లీ క్లౌడ్ బరస్ట్
డెహ్రాడూన్/సిమ్లా: హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. సోమవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఘటనల్లో ఉత్తరాఖండ్లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్లో ముగ్గురు చనిపోయారు. వీరిలో యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు ట్రాక్టర్ ట్రాలీలో డెహ్రాడూన్లో టాన్స్ నదిని దాడుతుండగా వచ్చిన వరదలో కొట్టుకు పోయినవారున్నారు. ఉత్తరాఖండ్లో గల్లంతైన 16 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఫైర్ సిబ్బంది రంగంలోకి అన్వేషణ చేపట్టారు.వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జఝ్రా ప్రాంతంలో చిక్కుకుపోయిన మరో ఎనిమిది మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొండప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరదల్లో కార్లు కొట్టుకుపోగా, ఇళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. గంగ, యమున నదులు ప్రమాద స్థాయికి దగ్గర్లో ప్రవహిస్తున్నాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. టామ్సా నది ప్రమాద స్థాయికి చేరుకుంది.దీంతో–ముస్సోరి రోడ్డుపై పలు ప్రాంతాల్లో వరద చేరడంతో పర్యాటకులు, సందర్శకులు ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోనూ పరిస్థితి దాదాపు ఇంతే తీవ్రంగా ఉంది. సిమ్లాలో 12 గంటల వ్యవధిలో 14.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అతిభారీ వర్షం కురియడంతో మండి జిల్లాలోని ధరంపూర్లో ప్రధాన బస్స్టాండ్ వరదలో మునిగిపోయింది. ఒక వర్క్షాప్, పంప్ హౌస్తోపాటు దుకాణాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 20 బస్సులు నీట మునిగిపోయాయి. ఒక వ్యక్తి గల్లంతైనట్లు చెబుతున్నారు. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.మండి జిల్లా బ్రాగ్టా గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. సిమ్లాలోని హిమ్ల్యాండ్ సమీపంలో మట్టి చరియలు విరిగి ప్రధాన రహదారి మూసుకుపోయింది. పలు వాహనాలను మట్టి, బురద కప్పేశాయి. ధరంపూర్లో వరద కారణంగా ఆర్టీసీ బస్సులకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్ని హోత్రి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొనసాగు తున్న ప్రకృతి బీభత్సం వె -
నిజాం రాజు.. తలొగ్గిన రోజు
సాక్షి, హైదరాబాద్ : అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రో జు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు. కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది. జనం జేజేలు.. నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది. ఐదు రోజుల పోలీసుచర్య... హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. ఇదీ హైదరాబాద్ సంస్థానం..» ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు. » చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అ«దీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. » 1921 నవంబర్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు. » గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది. -
నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లా త్రికూట పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్ర ఈ నెల17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే, వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర మొదలవుతుందని ఆలయ బోర్డు మంగళవారం తెలిపింది. ఆగస్ట్ 26వ తేదీన ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి పడి 34 మంది యాత్రికులు చనిపోవడం తెల్సిందే.ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యాత్రను నిలిపివేశారు. ఈ నెల 14వ తేదీన యాత్ర పునఃప్రారంభం అవు తుందని ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే, ఎడతెరిపి లేని వానలతో వాయిదా వేస్తున్నట్లు తెలి పింది. అయితే, రెండు రోజుల క్రితం కొందరు యాత్రికులు కాట్రా బేస్ క్యాంప్ వద్ద ఆందోళనకు దిగడంతో యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. -
ఒకటి కాదు.. మల్టిపుల్ రిటైర్మెంట్స్ కావాలి
ఉద్యోగ విరమణ అనేది సాధారణంగా రిటైర్మెంట్ వయసు వచ్చినపుడు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, రిటైర్మెంట్ అనేది ఉద్యోగ, వృత్తిగత జీవితానికి ముగింపు కాదని ఓ విరామం మాత్రమేనని నవ యువతరం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో, ఇతరత్రా పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారతీయులు మల్టీ రిటైర్మెంట్లకు మొగ్గుచూపుతున్న ధోరణి క్రమంగా పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్బహుళ–పదవీ విరమణలు తీసుకోవాలనే ధోరణి వివిధ తరాలకు చెందిన వారిలో పెరుగుతుండగా.. యువ, మధ్య వయసు్కల్లో అధికంగా ఉంటోంది. హెచ్ఎస్బీసీ సంస్థ తాజాగా నిర్వహించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్–అఫ్లూయెన్స్ ఇన్వెస్టర్ స్నాప్షాట్–2025’అధ్యయనంలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ సహా 12 దేశాల్లో 10 వేల మందికి పైగా సంపన్న వయోజనుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఇందులో జెన్జెడ్–మిల్లీనియల్స్ తరానికి చెందిన వారు రిటైర్మెంట్ను ఉద్యోగ అంతం లేదా విరమణగా చూడకుండా... విరామాలతో మళ్లీ కొనసాగించే పనిగా సూత్రీకరిస్తుండటం గమనార్హం. ఇలా తీసుకునే రిటైర్మెంట్లు మూడునెలల నుంచి ఏడాది దాకా ఉంటున్నాయి. ముందు వరుసలో భారతీయులుప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ధోరణిలో భారతీయులు ముందువరుసలో ఉండటం విశేషం. అయితే సంపన్న వర్గాల వారే మల్టీ–రిటైర్మెంట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా పని చేసేవారు 55–60 ఏళ్ల వయసు వచ్చే దాకా ఆగకుండా నలభైల్లోనే ఈ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ కల్చర్కే జెన్–జెడ్ (1997–2012 మధ్య జన్మించిన వారు), మిల్లీనియల్స్ (1981–96 మధ్య పుట్టిన వారు) ఓటు వేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ప్రభావాల మధ్య పుట్టి పెరిగిన వారు కాబట్టి జెన్–జెడ్ను డిజిటల్ నేటివ్స్గానూ పరిగణిస్తున్నారు. జీవనశైలి, అభిరుచులు, అలవాట్లకు తగ్గట్టుగా మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్మెంట్ తీసుకుంటున్న వారే అధికంగా ఉంటున్నారు. ఇలా కెరీర్లో బ్రేక్ తీసుకోవడం ద్వారా తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేలా రీచార్జ్ కావడంతోపాటు తమ అభిరుచులను మరింత గాఢంగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. ఇలాంటి బ్రేక్ల వల్ల తమ వృత్తిగత జీవితం, కెరీర్, లైఫ్స్టైల్ మరింత మెరుగవుతుందనే భావనలో వారున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ అంటే... మొదట కొన్నేళ్లపాటు ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాలు చేసి 40–45 ఏళ్ల మధ్యవయసులో రిటైర్మెంట్ తీసుకుంటారు. విరామం అనేది అది కొన్ని నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి మరేదైనా ఉద్యోగం, వ్యాపారం వంటి దాన్ని ఎంచుకుంటారు. కొత్త బాటలో.. బహుళ పదవీ విరమణలను జీవనశైలి మెరుగు కోసం తీసుకుంటున్న వాటిగానే భావించాలి తప్ప సంప్రదాయ కెరీర్ విరామంగా కాదు. బహుళ–పదవీ విరమణలతో కొంతమంది తమ సంపదను కూడబెట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కొత్త దిశలను ఎంచుకుంటున్నారు. –హెచ్ఎస్బీసీ అధ్యయనకర్తలు సర్వేలోని ముఖ్యాంశాలు..» సగటున 44 ఏళ్ల వయసులో తొలి మినీ రిటైర్మెంట్ తీసుకోవాలనే భావనలో భారతీయులు ఉంటే.. ప్రపంచస్థాయి సగటు 47 ఏళ్లుగా ఉంది. » తమ జీవిత కాలంలో ఇలాంటి రిటైర్మెంట్ కనీసం ఒకటి తీసుకోవాలని భావిస్తున్న సంపన్న భారతీయులు 48శాతం. » ఇలాంటి విరామాలు 2, 3 తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న భారతీయులు 44 శాతం. వీరిలో కొందరు ఆరేళ్లకోసారి బ్రేక్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. » మొత్తంగా 85 శాతం మంది మల్టీ రిటైర్మెంట్లకు సై అంటున్నారు. మల్టీ రిటైర్మెంట్తో తమ జీవనశైలిలో మంచి మార్పును గమనించినట్టు చెబుతున్నారు.» కనీసం ఒక చిన్న పదవీ విరమణ తీసుకున్న వారిలో 87% మంది తమ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. » పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబసభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి 34 శాతం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. » బహుళ రిటైర్మెంట్లతో శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నవారు 31 శాతం. నిర్దేశిత సెలవుల పరిమితులు లేకుండా ప్రయాణించడం, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేíÙంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటామన్న వారు 30 శాతం. » ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్న వారు 28 శాతం. » కెరీర్ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి పని నుంచి విరామం తీసుకోవడం కొత్త అవకాశాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్న వారు 25 శాతం. -
థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చిచెప్పారు. అంటే ట్రంప్ చెప్పినదంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేశారు. తాజాగా అల్జజీరా మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.కీలకం అంశాలపై పొరుగుదేశంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, తమతో చర్చలపై భారత్ స్పందించడం లేదని చెప్పారు. భారత్తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇషాక్ దార్ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని అన్నారు. రెండు దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు.భారత్–పాక్ల నడుమ మధ్యవర్తిత్వం వహించానని, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరామని ఇషాక్ దార్ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోవడం లేదంటూ ఆయన తమతో చెప్పారని వివరించారు.భారత్ను అడుక్కోలేం కదా!‘‘కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ ఆమెరికా నుంచి మే 10వ తేదీన ఆఫర్ వచి్చంది. ఒక తటస్థ వేదికపై అతిత్వరలో చర్చలు ప్రారంభిద్దామని మార్కో రూబియో మాకు చెప్పారు. కానీ, ఆ చర్చలేవీ జరగలేదు. జూలై 25వ తేదీన వాషింగ్టన్లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్ తేల్చిచెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు.భారత్, పాక్ల సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్ చెబుతుండగా ఇక మేము ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్ను అడుక్కోలేం కదా! శాంతిని కోరుకొనే దేశం పాకిస్తాన్. చర్చల ద్వారాపై సమస్యలు పరిష్కారం అవుతాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకు రెండు దేశాలూ ముందుకు రావాలి. చర్చలకు భారత్ ఒప్పుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థికం, జమ్మూకశీ్మర్ తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దాం. థర్డ్ పార్టీని అనుమతించాలని మేము కూడా పట్టుబట్టడం లేదు’’ అని ఇషాక్ దార్ సూచించారు.ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించిన భారత్ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఆపరేషన్ ముగిసింది. భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ రెండు దేశాల ప్రభుత్వాల కంటే ముందే ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. దీనిపై విమర్శలు వచి్చనప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.భారత్, పాక్లపై వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆగేలా చేశానని, ఆ క్రెడిట్ తనకే దక్కాలని, అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై భారత్ స్పందిస్తూ ట్రంప్ వాదనను పలుమార్లు తిప్పికొట్టింది. రెండు దేశాలతో సంబంధం లేని మూడో వ్యక్తి చెబితే కాల్పుల విరమణకు తామెందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించింది. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశామని స్పష్టంచేసింది. నోబెల్ శాంతి బహుమతికి తన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని ట్రంప్ విజ్ఞప్తి చేయగా, భారత్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. -
వారియర్స్ విక్టరీ
జైపూర్: వైఫల్యాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్ బెంగాల్ వారియర్స్... ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. మంగళవారం జరిగిన పోరులో 41–37తో యూపీ యోధాస్పై గెలుపొందింది. 2019 సీజన్ చాంపియన్ వారియర్స్ నాలుగు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. ఆరు మ్యాచ్లాడిన బెంగాల్కు ఇది రెండో విజయం మాత్రమే! ఈ మ్యాచ్లో వారియర్స్ కెపె్టన్ దేవాంక్ (17 పాయింట్లు) తనదైన శైలిలో రాణించాడు. మిగతా వారిలో ఆశిష్ (6), మన్ప్రీత్ (5), పార్థిక్ (3) మెరుగ్గా ఆడారు. యూపీ తరఫున రెయిడర్లు గగన్ గౌడ (7), గుమన్ సింగ్ (5), డిఫెండర్లు అçశు సింగ్, హితేశ్ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. రెండో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35–29తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. తమిళ్ తరఫున అర్జున్ (13), నరేందర్ (5), రోనక్ (4) బాగా ఆడారు. నేడు జరిగే పోటీల్లో తెలుగు టైటాన్స్తో దబంగ్ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
'స్ప్రింట్ క్వీన్' పరుగు ఆగింది
3 ఒలింపిక్ స్వర్ణాలు... 10 ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు... డైమండ్ లీగ్ ఫైనల్స్లో 5 సార్లు విజేత... ‘పాకెట్ రాకెట్’ అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ అసాధారణ ఘనతల్లో ఇవి కొన్ని... సుదీర్ఘ కాలం మహిళల స్ప్రింట్స్లో మెరుపులా వెలిగిన షెల్లీ వరల్డ్ చాంపియన్షిప్తో ఆట నుంచి తప్పుకుంది... రెండు దశాబ్దాల అసాధారణ అథ్లెటిక్స్ కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించి ‘ఆల్టైమ్ గ్రేట్’గా నిలిచిన ఆమె టోక్యోలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్షిప్లో చివరిసారి బరిలోకి దిగి ట్రాక్కు గుడ్బై చెప్పింది... గత పారిస్ ఒలింపిక్స్లో గాయం తర్వాతే ట్రాక్కు దూరమవ్వాలని భావించినా... అభిమానుల కోసం ఆగిన షెల్లీ చివరకు వీడ్కోలు పలికింది. – సాక్షి క్రీడా విభాగంసరిగ్గా 18 ఏళ్ల క్రితం జపాన్లోనే షెల్లీ ఆన్ విజయ ప్రస్థానం మొదలైంది. ఒసాకాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో జమైకా 4–100 మీటర్ల రిలే టీమ్ సభ్యురాలిగా రజతం సాధించడంతో ఆమె కెరీర్లో తొలి పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత శిఖరాలకు చేరిన షెల్లీ ఇప్పుడు తన కెరీర్లో ఆఖరి రేసులో పాల్గొని జపాన్లోనే ముగించడం విశేషం. తన ప్రధాన ఈవెంట్, ట్రాక్ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపునిచ్చిన 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఆమె ఆరో స్థానంతో ముగించింది. అయితే 38 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయమేమీ కాదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచంలో రెండు అత్యుత్తమ వేదికలు ఒలింపిక్స్ (మొత్తం 8 పతకాలు), వరల్డ్ చాంపియన్షిప్ (మొత్తం 16 పతకాలు) కలిపి ఓవరాల్గా 24 పతకాలతో షెల్లీ తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకుంది. బోల్ట్కు దీటుగా... దశాబ్ద కాలం పాటు మహిళల విభాగంలో ట్రాక్ను షెల్లీ శాసించింది. కరీబియన్ దేశాల తరఫున ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి మహిళగా నిలిచిన ఆమె, ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు పొందిన 276 రేస్లలో పాల్గొని అథ్లెటిక్స్ అభిమానులకు చేరువైంది. కెరీర్లో రంగురంగుల హెయిర్ స్టయిల్లతో బరిలోకి దిగుతూ ఆటతో పాటు ఇతరత్రా కూడా అనేక ఆకర్షణలు ప్రదర్శించిన ఆమె టోక్యోలో తన ఆఖరి రేసులో కూడా జమైకా జాతీయ రంగులు ఆకుపచ్చ, పసుపు కలగలిపిన జుట్టు, నెయిల్ పాలిష్తో బరిలోకి దిగి అలరించింది. అద్భుతమైన ప్రదర్శనల తర్వాత కొన్నిసార్లు వెనుకబడినా... కోలుకొని షెల్లీ మళ్లీ పైకెగసిన తీరు, తాను అనుకున్న విధంగా కెరీర్ను ముగించడం యువ మహిళా అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. జమైకాకే చెందిన అథ్లెటిక్స్ దిగ్గజం బోల్ట్ తన పరుగుతో ప్రపంచాన్ని ఊపేస్తున్న సమయంలోనే షెల్లీ అంతర్జాతీయ ప్రస్థానం కూడా సాగింది. బోల్ట్కు సమాంతరంగా పత కాలు గెలవడంతో పాటు తనకంటూ జమైకా స్టార్గా ప్రత్యేక అధ్యాయాన్ని రచించుకోవడంలో సఫలమైంది. మూడు సార్లూ పతకాలతో... కనీస సౌకర్యాలు కూడా కరువైన పేద కుటుంబంతో పుట్టిన షెల్లీ చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. ఇద్దరు సోదరులతో పాటు ఆమె తల్లి వీధిలో చిన్న చిన్న వస్తువులు అమ్మేది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం షెల్లీ ఘనతకు తార్కాణం. కోచ్ల మాటల చెప్పాలంటే అథ్లెటిక్స్లో సహజ ప్రతిభతో ఆమె దూసుకుపోగలిగింది. పాఠశాల స్థాయిలోనే ఆమె పరుగు అందరి దృష్టినీ ఆకర్షించిన తర్వాత వేర్వేరు దశల్లో వరుసగా సత్తా చాటుతూ తనను తాను రుజువు చేసుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో పాల్గొన్నప్పుడు ఫైనల్కు చేరితే చాలని అనుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోవడమే ఆమెకు మేలు చేసింది. ఎదురు లేకుండా దూసుకుపోయి స్వర్ణం సాధించడంతో షెల్లీ పేరు మారుమ్రోగిపోయింది. 2012 లండన్ ఒలింపిక్స్ వచ్చేసరికి ఆమె అప్పటికే స్టార్గా మారిపోయింది. గత కాలపు దిగ్గజం ఫ్లారెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ సరసన ఆమెను చేర్చి అంతా ఆమె ప్రదర్శన కోసం ఎదురు చూశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ షెల్లీ మరో పసిడిని గెలుచుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో సెమీఫైనల్ తర్వాతే కాలి గాయం ఇబ్బంది పెట్టడంతో చివరకు కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రిలేలో జమైకా జట్టుకు రజతం అందిచింది. పునరాగమనం ఘనంగా... రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్ మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా బిజీ అయింది. 2017లో కొడుకు పుట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు మారిపోయాయని ఆమె చెప్పుకుంది. ఆమె ఆటకు గుడ్బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే ‘మామీ రాకెట్’గా కొత్త గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ట్రాక్పై షెల్లీ జోరు సాగింది. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత మూడు నెలల పాటు ప్రత్యేకంగా ఫిట్నెస్పై దృష్టి పెట్టి ఫ్రేజర్ పునరాగమనం చేసింది. అమ్మగా మారిన తర్వాత కూడా వరల్డ్ చాంపియన్షిప్లో ఏకంగా 3 స్వర్ణాలు, 3 రజతాలు, మరో కాంస్యం గెలవడం ఆమె సత్తాకు నిదర్శనం. 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా 100 మీటర్ల పరుగులో రజతాన్ని సాధించి తనలో పదును తగ్గలేదని నిరూపించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో 200 మీటర్లకు దూరంగా ఉంటానని ముందే చెప్పిన ఆమె... 100 మీటర్లలలో పతకం గెలిచి తప్పుకోవాలని భావించింది. అయితే అనూహ్యంగా గాయంతో సెమీస్కు ముందు తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో రిటైర్మెంట్ను ఏడాది పాటు వాయిదా వేసి షెల్లీ ఇప్పుడు నిష్క్రమించింది. తాను సంతృప్తిగా తప్పుకుంటున్నానని, ఇన్ని ఘనతల తర్వాత ఎలాంటి చింతా లేదని ఈ జమైకా స్టార్ వ్యాఖ్యానించింది.‘అమ్మ’గా గెలిచి...కొన్నాళ్ల క్రితం షెల్లీ కొడుకు, ఎనిమిదేళ్ల జ్యోన్ ఆమె వద్దకు వచ్చి... ‘అమ్మా...మా స్కూల్లో స్టూడెంట్స్ తల్లుల కోసం పరుగు పందెం పెడుతున్నారు. నువ్వు తప్పనిసరిగా పాల్గొనాల్సిందే’ అని కోరాడు. తాను ఇందులో పాల్గొనడం ఏమిటి అని సందేహించినా కొడుకు మీద ప్రేమతో కాదనలేకపోయింది. వరల్డ్ చాంపియన్ పోటీలో ఉంటే తిరుగేముంది! రేసు మొదలు కాగానే సహజంగానే ఎవరికీ అందనంత వేగంతో షెల్లీ దూసుకుపోయి విజేతగా నిలిచింది. ఆ గెలుపులో బిడ్డ ఆనందం చూసి మురిసిపోయింది. ‘వాళ్లు నన్ను అనుమతిస్తారనే అసలు అనుకోలేదు. అయినా వారికీ అవకాశం ఉందని ఇతర పిల్లలు తల్లులు భావించడమే నాకు అమితాశ్చర్యం కలిగించింది’ అని ఆమె చెప్పింది. -
మూడు కేటగిరీలుగా పేమెంట్ అగ్రిగేటర్లు
ముంబై: చెల్లింపుల సేవలకు మధ్యవర్తులుగా వ్యవహరించే అగ్రిగేటర్లను (పేమెంట్ అగ్రిగేటర్లు) మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇందులో భౌతికంగా సేవలు అందించే (పీవోఎస్ మెషీన్ల ద్వారా) వాటిని పీఏ–పీగా, సీమాంతర చెల్లింపుల్లోని వాటిని పీఏ–సీబీలుగా, ఆన్లైన్ చెల్లింపుల సేవల అగ్రిగేటర్లను ఆన్లైన్ పీఏలుగా వర్గీకరించింది.పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపార నిర్వహణ విషయమై బ్యాంక్లకు ఎలాంటి అనుమతి అక్కర్లేదు. నాన్ బ్యాంక్లకు మాత్రం నిర్ణీత మూలధనం అవసరమని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపారం ప్రారంభించాలనుకునే సంస్థ దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం రూ.15 కోట్ల నెట్వర్త్ (నికర విలువ) కలిగి ఉండాలి. అనుమతి పొందిన మూడో ఏడాదికి రూ.25 కోట్ల నెట్వర్త్ను సాధించాల్సి ఉంటుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. -
రెండు నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 25,239 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి సూచీలకి రెండు నెలల గరిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలు, పండుగ డిమాండ్ రికవరీపై ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమవ్వొచ్చనే ఆశలతో ఐటీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 658 పాయింట్లు బలపడి 82,443 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 25,261 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ అధిక వెయిటేజీ ఎల్అండ్టీ(2%), కోటక్ మహీంద్రా(2.50%), మహీంద్రా (2.2%), మారుతీ (2%), టీసీఎస్ (1%) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 352 పాయింట్లు కావడ విశేషం. -
27 నిమిషాల్లోనే...
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–5, 21–10తో ప్రపంచ 44వ ర్యాంకర్ జూలీ దవాల్ జేకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో సింధు చెలరేగి వరుసగా 12 పాయింట్లు నెగ్గడం విశేషం. ఈ గెలుపుతో ఈ సీజన్లో స్విస్ ఓపెన్ తొలి రౌండ్లో జూలీ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–5తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో ఆయుశ్ 19–21, 21–12, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ టియెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 17–21, 11–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. కెరీర్ బెస్ట్ ర్యాంక్లో... గతవారం హాంకాంగ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆయుశ్ మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన ఆయుశ్ 27వ ర్యాంక్లో నిలిచాడు. హాంకాంగ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన లక్ష్య సేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
గృహ నిర్మాణ పరిశ్రమ @ రూ. 31 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: గృహ నిర్మాణ పరిశ్రమ 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.31 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఒక్క బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలోని వినియోగించే ముడి పదార్థాలు) విభాగమే ప్రస్తుతమున్న 105 బిలియన్ డాలర్ల నుంచి ఏటా 9.6 శాతం వృద్ధితో 2030 నాటికి 166 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని పేర్కొంది. ఆదాయం పెరుగుతుండడం, పట్టణీకర వేగాన్ని అందుకోవడం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. భారత దేశ నిర్మాణరంగం, నిర్మాణ రంగ మెటీరియల్స్ పరిశ్రమ కీలక మలుపు వద్ద ఉన్నట్టు డెలాయిట్ నివేదిక పేర్కొంది.కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ 18.5 బిలియన్ డాలర్లు‘‘వైర్లు, కేబుళ్లు, ఫ్యాన్లు, లైట్లు, స్విచ్లు, ఫ్యూజ్లు, స్విచ్గేర్లతో కూడిన కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ పరిశ్రమ పరిమాణం 2030 మార్చి నాటికి 18.5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణీకరణ అనుకూలిస్తుంది. ఇంధన ఆదా ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండడం, విధాన పరమైన మద్దతు ఈ విభాగాన్ని ముందుకు నడిపిస్తాయి. 2023 నాటికి కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ అమ్మకాల్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా 76 శాతంగా ఉండగా, 2027 నాటికి 82 శాతానికి చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది.62 బిలియన్ డాలర్లకు హోమ్ ఫర్నిచర్ఇళ్లలో వినియోగించే ఫరి్నచర్, డెకరేటివ్స్ మార్కెట్ విలువ ప్రస్తుతమున్న 38 బిలియన్ డాలర్ల నుంచి 62 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనేది డెలాయిట్ ఇండియా అంచనా. ‘‘ఈ విభాగం బలమైన వృద్ధి క్రమంలో ఉంది. పట్టణీకరణకు తోడు ఆదాయాలు పెరుగుతుండడంతో ఆధునికత, వినూత్నతకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని డెలాయిట్ తెలిపింది.గృహ రక్షణ ఉత్పత్తులకూ డిమాండ్సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్లు, డోర్ ఫోన్లు, డోర్బెల్ కెమెరాలు, మోషన్ సెన్సార్లు, ప్రమాదాలను నివారించే డివైజ్లతో కూడిన హోమ్ సెక్యూరిటీ మార్కెట్ ఏటా 18 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇక పెయింట్స్, కన్స్ట్రక్షన్ కెమికల్స్ పరిశ్రమ 2030 మార్చి నాటికి 15.3 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని తెలిపింది. ఫ్లోరింగ్ మార్కెట్ (సిరామిక్ టైల్స్, వినైల్ ఫ్లోరింగ్, మార్బుల్ తదితర) పరిమాణం ప్రస్తుతమున్న 10.7 బిలియన్ డాలర్ల నుంచి 2030 మార్చి నాటికి 16.2 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని డెలాయిట్ తెలిపింది. -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
సరికొత్త శిఖరాలకు పసిడి
న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి రూ.1,15,100 స్థాయికి చేరింది. ఇదొక సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి. డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడంతో ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం కొత్త గరిష్టానికి చేరింది.కిలోకి రూ.570 పెరిగి రూ.1,32,870 స్థాయిని నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్ భేటీలో భారీ రేట్ల కోత దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తీసుకురావడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ డాలర్ బలహీనతకు తోడు, ఫెడ్ ఒకటికి మించిన రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలతో మంగళవారం బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరినట్టు చెప్పారు.పది వారాల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ బలహీనపడినట్టు తెలిపారు. రేట్ల కోత దిశగా ఫెడ్ సానుకూల వైఖరి, భారత్, చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన పరిణామాలతో ట్రేడర్లు బంగారంలో లాంగ్ పొజిషన్లను కొనసాగిస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం లాభాలతో కొనసాగుతూ 3,739 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది. -
సర్వేశ్కు ఆరో స్థానం
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత హైజంపర్ సర్వేశ్ కుశారే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో 30 ఏళ్ల సర్వేశ్ ఆరో ప్రయత్నంలో 2.28 మీటర్ల ఎత్తును అధిగమించాడు. ఈ క్రమంలో 2.27 మీటర్లతో 2022లో నమోదు చేసిన తన అత్యుత్తమ ప్రదర్శనను సవరించాడు. అనంతరం 2.31 మీటర్ల ఎత్తును అధిగమించేందుకు సర్వేశ్ మూడుసార్లు యత్నించి విఫలమవ్వడంతో అతనికి ఆరో స్థానం దక్కింది. హమీష్ కెర్ (న్యూజిలాండ్; 2.36 మీటర్లు)... సాంగ్హైక్ వూ (దక్షిణ కొరియా; 2.34 మీటర్లు), జాన్ స్టెఫెలా (చెక్ రిపబ్లిక్; 2.31 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. భారత అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో ఈరోజు క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా (భారత్), సచిన్ యాదవ్ (భారత్) ... గ్రూప్ ‘బి’లో భారత్ నుంచి మరో ఇద్దరు (రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్) జావెలిన్ త్రోయర్లు బరిలో ఉన్నారు. ఫైనల్లో చోటు సంపాదించేందుకు 84.50 మీటర్లను కనీస అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. -
పవన్ హీరో అని కాదు.. అందుకే ‘ఓజీ’ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధానపాత్ర చేశారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ– ‘‘1980–1990లలో జరిగే కథ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరపాత్రలో పవన్గారు, కణ్మణిగా నేను నటించాం. గంభీర జీవితాన్ని మలుపు తిప్పేపాత్ర కణ్మణిది. కథ, అందులోని నాపాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాను. ఈ సినిమా కథ, కణ్మణిపాత్ర నచ్చినందుకే ఒప్పుకున్నాను... పవన్కల్యాణ్గారు హీరో అని కాదు. ఇమ్రాన్ హష్మితో నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఇక ధనుష్గారి డైరెక్షన్లోని ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’లో ‘గోల్డెన్ స్పారో’ అనే స్పెషల్ సాంగ్ చేశాను. జస్ట్ ఒక్క రోజులో ఈపాట పూర్తయింది. తెలుగులో కథలు వింటున్నాను.ఇతర భాషల్లో కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. రజనీకాంత్గారి ‘జైలర్ 2’ సినిమాలో నటించలేదు. అవకాశం వస్తే చేయాలని ఉంది. ఈ మధ్య కొంతమంది దర్శక–నిర్మాతలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీస్తున్నారు. ఇందుకు హ్యాపీగా ఉంది. నాకు కామెడీపాత్రలూ చేయాలని ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సోషల్ మీడియాలో నా హ్యాండిల్స్ను నా టీమ్ చూసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. నా ఫొటోలు షేర్ చేయడానికి సోషల్ మీడియాను వినియోగించుకుంటాను... అంతే. పెయిడ్ నెగటివ్ క్యాంపైన్స్ ఉంటాయని విన్నాను.ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాక్సాఫీస్ నంబర్స్ను పట్టించుకోను. ఒకప్పుడు సినిమా బాగుందా? లేదా అని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఫలానా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఫలానా సినిమా అంత కలెక్ట్ చేసిందని చెప్పుకుంటున్నాం. కొందరు ఫేక్ కలెక్షన్స్ చూపించి, సినిమా సూపర్ హిట్ అని చెబుతుంటారు. కానీ సినిమాలో సరైన కంటెంట్, క్వాలిటీ ఉండవు. మనీ గురించి మాట్లాడుతూ సినిమా సోల్ను మర్చిపోతున్నాం’’ అన్నారు. -
టీఐఎఫ్ఎఫ్లో హోమ్ బౌండ్కు అవార్డు
టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్) గోల్డెన్ ఎడిషన్ (50వ ఎడిషన్) అవార్డ్స్ వేడుకలో భారతీయ చిత్రాలు ‘హోమ్ బౌండ్, ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’లకు అవార్డులు దక్కాయి. హైదరాబాదీ ఫిల్మ్మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, విశాల్ జైత్యా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘హోమ్ బౌండ్’. కరణ్ జోహార్, అదార్ పూనా వాలా, అపూర్వా మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న థియేటర్స్లో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ పీపుల్ చాయిస్ రెండో అవార్డు లభించింది. సౌత్ కొరియన్ సెటైరికల్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘నో అదర్ చాయిస్’ సినిమాకు ‘ఇంటర్నేషనల్ పీపుల్ చాయిస్’ మొదటి అవార్డు దక్కింది. మరో భారతీయ చిత్రం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’కి జ్యూరీకి చెందిన ఎన్ఈటీపీఏసీ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి జితాంగ్ సింగ్ గుర్జార్ దర్శకత్వం వహించగా మేఘనా అగర్వాల్, రాఘవేంద్ర భడోరియా, నిఖిల్ ఎస్. యాద్ ప్రధానపాత్రల్లో నటించారు.ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన అవార్డుగా భావించే ‘పీపుల్ చాయిస్ అవార్డు’ హిస్టారికల్ డ్రామా ‘హామ్నెట్’ చిత్రానికి దక్కింది. ఈ బ్రిటిష్ అమెరికన్ చిత్రానికి క్లోయ్ జావో దర్శకత్వం వహించగా, జెస్సీ బక్లీ,పాల్ మెస్కల్, ఎమిలీ వాట్సన్ ప్రధానపాత్రల్లో నటించారు. అలాగో ఈ ఫెస్టివల్లో మరో ప్రతిష్ఠాత్మకమైన ప్లాట్ఫామ్ ప్రైజ్ అవార్డు ఉక్రెయిన్స్ ఫిల్మ్ ‘టు ది విక్టరీ’కి దక్కింది. ఈ చిత్రంలో వాలెంటైన్స్ వాస్యనోవిచ్ ప్రధానపాత్రలో నటించి, దర్శకత్వం వహించారు. -
ఇక నటనపైనే ఫోకస్: శాండీ
‘‘లియో, లోక, కిష్కింధపురి’... ఇలా వరుసగా నేను నటించిన చిత్రాలు హిట్ అయినందుకు హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు అందరూ నా కళ్లను చూసి, ‘డెత్ గోట్ ఐస్’ అని ఆటపట్టించేవారు. ఆ కళ్లు నచ్చే ‘లియో’కు లోకేశ్గారు నన్ను నటుడిగా ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు కొరియోగ్రాఫర్–యాక్టర్ శాండీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, శాండీ మాస్టర్ విలన్గా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శాండీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘కిష్కింధపురి’ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఫైనల్గా దివ్యాంగుడు లుక్ను ఓకే చేశాం. ఓ సీన్లో డమ్మీ సిలిండర్తో హీరో నన్ను కొట్టాలి. కానీ అనుకోకుండా నిజమైన సిలిండర్తో కొట్టడంతో నా తలకు దెబ్బతగిలింది.ఎమ్ఆర్ఐ స్కానింగ్ తీశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ‘కూలీ’లోని ‘మోనికా..పాట, ‘విక్రమ్’లోని పాతల...పాతల’, ‘ఓజీ’ సినిమాలోని ఓ ప్రమోషనల్ సాంగ్కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే. ప్రస్తుతంపా. రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా, మలయాళ ‘కథనార్’లో విలన్ రోల్ చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘కిష్కింధపురిని’ అందరూ చూడాలి: చిరంజీవి ‘కిష్కింధపురి’ని హీరో చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించి, ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ నిర్మాత సాహు గారపాటిగారు నిర్మించిన ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించింది. హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ దెయ్యం కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమాలో హారర్తోపాటు మంచి సైకలాజికల్పాయింట్ని యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమని చెప్పారు డైరెక్టర్ కౌశిక్. ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్, అనుపమ మంచి హిట్ని తమ ఖాతాలో వేసుకున్నారు. చేతన్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాని అందరూ చూడాల్సిన అవసరం ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. -
అమ్మ ఆటో
‘ఒంటరితనం అనేది బాధను వందరెట్లు చేస్తుంది’ అంటారు. భర్త చనిపోయిన తరువాత బాధపడుతూ ఒంటరితనంలో కూరుకుపోయింది సత్యవతి. ‘ఎప్పుడూ ఇంట్లో ఉండడం కంటే నలుగురిలో కలిస్తే అమ్మ కాస్త చురుగ్గా ఉంటుంది’ అని ఆలోచించాడు సత్యవతి కుమారుడు, ఆటోడ్రైవర్ గోపి. ఆ ఆలోచన ఫలితంగానే కుమారుడి ఆటోలో రోజూ అనేక ఊళ్లకు వెళుతుంటుంది సత్యవతి. పన్నెండేళ్ల కాలంలో ఆమెకు ఎంతోమంది ప్రయాణికులు పరిచయం అయ్యారు. బంధువులయ్యారు. అవును...ఇప్పుడు 84 ఏళ్ల సత్యవతి హుషారుగా ఉంటోంది. గోపి నడిపే ఆటోకు ‘అమ్మ ఆటో’ అని పేరు!తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడేనికి చెందిన మాసగాని సత్యవతి కుమారుడు గోపి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి మరణంతో తల్లి బెంగగా ఉండడంతో ఆమెను తనతోపాటు ఆటోలో తీసుకు వెళ్లి కబుర్లు చెబుతూ తిప్పేవాడు. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు కొడుకుతోపాటు సత్యవతి ఆటోలోనే తిరుగుతుంది. తల్లి లేకుండా ఆటో స్టార్ట్ చేయడు గోపీ. ‘అసలే రోజులు బాగోలేవు. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే. ఇంట్లో ఉన్నప్పుడు గోపి గురించి భయంగా ఉండేది. ఇప్పుడు వాడి వెంటే ఉంటున్నాను కాబట్టి ఎలాంటి భయం లేదు. రోజూ ఆటోలో వెళ్లడం వల్ల ఎంతోమంది నాకు పరిచయం అయ్యారు. బంధువులు అయ్యారు’ సంతోషంగా అంటుంది సత్యవతి.‘ఇంట్లో అమ్మ ఎప్పుడూ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది అనే బెంగ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అమ్మ నాతోపాటే ఉండడం వల్ల ఎలాంటి బెంగా లేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా వెనక అమ్మ ఉంది అనే ధైర్యం ఉంది’ అంటున్నాడు 52 ఏళ్ల గోపి. – కాసాని వెంకటేశ్వర్లు, సాక్షి, దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా -
విల్ ఉంటేనే పవర్ సాధ్యం
విల్ పవర్తోనే అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చు‘ ఇంటి వద్ద ఉంటూ కూడా మన కలలను సాధించుకోవచ్చు అంటున్నారు హైదరాబాద్ వాసి నీలిమా సీపాని. ఆన్లైన్స్ మ్యాథ్స్ ట్యూటర్గా ఇంటినుంచే వర్క్ చేస్తూ ఇటీవల ఢిల్లీలో జరిగినపోటీలలో మిసెస్ యూనిటీ టైటిల్ను గెలుచుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ జీవనం కొనసాగిస్తూనే విద్యార్థులను తీర్చిదిద్దే ట్యూటర్గా బిజీగా ఉంటూ రన్వే వేదికలపైనా తన టాలెంట్ను నిరూపించుకుంటున్నారు నీలిమ. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే.. తనప్లానింగ్ను ఇలా మన ముందుంచారు.‘‘బీఎస్సీ మ్యాథ్స్ తర్వాత ఎంబీయే చేశాను. పెళ్లయ్యాక మావారు నందకుమార్ యతిరాజులు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాను. ఇద్దరు కూతుళ్లు. ఆరేళ్లక్రితం ఇండియాకి వచ్చేశాం. పిల్లల బాగోగులు, వారి చదువులు, కుటుంబం అంటూ చాలా పనులను పక్కన పెట్టక తప్పలేదు. ఇండియా వచ్చాక క్యూ మ్యాథ్ ఆన్లైన్లో ట్యూటర్గా చేరాను. విదేశాలలో ఉండే పిల్లలు నాకు స్టూడెంట్స్గా ఉన్నారు. అందుకని, సాయంకాలం నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆన్లైన్లోనే పిల్లలకు క్లాసులు తీసుకుంటూ ఉంటాను. పేద విద్యార్థులకు ఉచితంగా చెబుతుంటాను.నైట్ షిఫ్ట్స్.. బిజీ షెడ్యూల్పగలు పడుకొని, రాత్రిళ్లు డ్యూటీ చేస్తే మన అన్ని అలవాట్లలోనూ, ఆరోగ్యంలోనూ చాలా మార్పులు వస్తాయి. అందుకని, రోజూ జిమ్కి వెళ్లడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడంపై దృష్టి పెట్టాను. ఏడాదిక్రితం ఆన్లైన్లోనే ముంబయ్లోని మిథాలీ మోడలింగ్ అండ్ మోర్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఢిల్లీలో కిందటి నెలలో జరిగిన మిసెస్ యూనిటీ వరల్డ్ ఆసియా– 2025లో టైటిల్ రావడం నిజంగా చాలా ఆనందాన్నిచ్చింది.టాలెంట్ రౌండ్, ఫ్యాషన్ రౌండ్, ఈవెనింగ్ గౌన్ రౌండ్.. ఇలా ఆరు రౌండ్లలో ఎంపిక చేశారు. ఈ ఫ్యాషన్ షోలోపాల్గొనడం, టైటిల్ గెలుచుకోవడం దాదాపు ఏడు నెలలుగా నా బిజీ షెడ్యూల్ మధ్యేప్లాన్ చేసుకున్నాను. మొత్తం హైదరాబాద్లోనే ఉంటూ ప్రిపేర్ అయ్యాను. రోజూ గంటసేపు జిమ్, తక్కువ కార్బోస్, ఎక్కువ ్ర΄÷టీన్లు ఉండే ఆహారం రోజుకు 6–7 సార్లు తీసుకునేలాప్లాన్ చేసుకున్నాను. ఇంటిపని, ట్యూషన్, హెల్త్ప్లానింగ్, నిద్ర.. వీటన్నింటికీ టైమ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. నాలుగు రోజులు మాత్రం ముంబయ్లో ఉండి.. రన్వే పైన వాక్,పోజెస్, జడ్జీలు అడిగిన ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాలు... శిక్షణ తీసుకున్నాను.స్వయంగా ఎంపికమాకు కలర్ కోడ్ ఇచ్చారు. లాంగ్ గౌన్స్ చెప్పారు. దీంతో కాస్టూమ్స్ అన్నీ నేనేప్లాన్ చేసుకున్నాను. నాకు ఇష్టమైన పీకాక్ థీమ్తో ఈవెనింగ్ గౌన్లను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి, ప్రిపేర్ చేయించుకున్నాను. హై ఫ్యాషన్ తోపాటు ధోతీ–కుర్తా వంటి ఇండో వెస్ట్రన్ లుక్స్ కూడా క్రియేట్ చేశాను. నా స్కూల్ రోజుల్లో భరతనాట్యం నేర్చుకున్నాను. ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్లలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటాను. ఆ అనుభవంతో కాంతారా సినిమా సాంగ్ని రెండున్నర నిమిషాలు కంపోజ్ చేసి, దానిని ప్రదర్శించాను. అందుకు తగిన కాస్ట్యూమ్, జ్యువెలరీని నేనే ఎంచుకున్నాను. ్రపోగ్రామ్ మొత్తం ఆరు రోజులపాటు జరిగింది. ప్రతిరోజూ ఉదయం టీ టైమ్ ఉంటుంది. టీమ్ అందరితో ఎలా కలుస్తాం, మనతో మనమే ఉంటున్నామా.. అనేది కూడా పరిశీలనలో ఉంటుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వారున్నారు కాబట్టి, అందరితో మన ర్యాపో ఎలా ఉందో కూడా చూస్తారు. ఇలాంటప్పుడు మన డ్రెస్సింగ్, మేకప్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. సెల్ఫ్మేకప్ కూడా వచ్చి ఉండాలి. నన్ను నేను ఇలా రూ పొందించుకోవడానికి మా అత్తగారి సపోర్ట్ చాలా ఎక్కువ. బాగా ఎంకరేజ్ చేస్తారు. నవంబర్లో మరొక ఫ్యాషన్ షో ఉంది. దానికిప్లాన్ చేస్తున్నాను. రాబోయే మిసెస్ యూనిటీ ఫ్యాషన్ షోకు జడ్జ్గా ఉండబోతున్నాను’’ అని వివరించారు ఈ మల్టీ టాలెంటెడ్ టీచర్ అండ్ మిస్ యూనిటీ టైటిల్ విన్నర్. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధియూనిటీ షో అంటే...ఒక కాజ్ గురించి ఈ షో రన్ చేస్తున్నారు. నేను చేస్తున్న వర్క్ పైనే జడ్జీలు ప్రశ్నలు వేశారు. నా బిజీ షెడ్యూల్ప్లానింగ్ గురించి అడిగినప్పుడు ‘విల్ పవర్ ఉన్నప్పుడే టైమ్ క్రియేట్ చేసుకుంటాం’ అని చెప్పాను. ‘టీచింగ్లో ఉన్నాను. యాక్టివిటీస్ చేస్తున్నాను. ఈ టైటిల్ వల్ల ఇంటా, బయటా పేరు వస్తుంది, ఆర్థికపరంగానూ మంచి మార్పులు వస్తాయి’ అని చెప్పాను. మేం తీసుకుంటున్నది ఆన్లైన్ క్లాస్లు. పక్కన కూర్చోబెట్టుకొని చెప్పలేం. ఆన్లైన్లోనే వాళ్లని మోటివేట్ చేయాలి. అది ఎలా చేస్తానో.. వివరించాను. పేరెంట్స్తోనూ, పిల్లలతోనూ రిలేషన్షిప్ ను ఎలా డెవలప్ చేస్తానో చెప్పాను. మా పెద్దమ్మాయి ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్. చిన్నమ్మాయి 8వ తరగతి చదువుతోంది. -
ప్రాణధారలో చాంపియన్
గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ చాంపియన్గా అందరికీ తెలుసు. కాని నవజాత శిశువులకు ప్రాణాధారమైన తల్లిపాలను డొనేట్ చేయడంలో కూడా చాంపియన్గా నిలిచి దేశం మన్ననలు పొందుతోంది. పాలు పడని తల్లులు జబ్బుతో ఉన్న పిల్లలు, నవజాత శిశువులకు పాలు ఇవ్వలేనప్పుడు దానం ఇచ్చినపాలు ఎంతో మేలు చేస్తాయి అంటున్న ఆమె 30 లీటర్ల తల్లిపాలు డొనేట్ చేసింది. వివరాలు...‘నాపాపకుపాలు పట్టించాక ఇంకా చాలాపాలు మిగులుతున్నాయనిపించింది. వాటిని ఏం చేయాలా... అనుకున్నాను. మా చెల్లెలికి ప్రిమెచ్యూర్ బేబీ పుట్టినప్పుడు మొదటి వారం వేరే వాళ్ల దగ్గర నుంచి చనుబాలు తీసుకున్నట్టు తను చెప్పింది. అలా చాలామంది చంటి పిల్లలకు చనుబాలు అవసరమని గుర్తుకొచ్చింది. హైదరాబాద్లోని నిలోఫర్లో ప్రతిరోజూ కనీసం 80 మంది పిల్లలకు బయటి నుంచి చనుబాలు కావాలని ఎవరో చెప్పారు. నా దగ్గర అదనంగా ఉన్నపాలు ఎంతమంది పిల్లలకు అందితే అంత మంచిదని చనుబాల దానం చేశాను’ అంటున్నారు గుత్తా జ్వాల.మొన్నటి ఏప్రిల్లో ఆమెకు ఐవీఎఫ్ ద్వారాపాప పుట్టింది. ఆమెకు మీరా అనే పేరు పెట్టారు గుత్తా జ్వాల ఆమె భర్త విష్ణు విశాల్.పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ గుత్తా జ్వాల తన చనుబాలు 30 లీటర్లు దానం చేశారు. ఈ సంగతిని తాజాగా ఆమె వెల్లడించి ‘ఇది అదనపు చనుబాలు ఉన్న తల్లులందరికీ స్ఫూర్తినివ్వాలి.పాలు వృధాపోయే బదులు అవసరం ఉన్న చంటి పిల్లలకు అందితే ఎంతో మేలు. ప్రతి తల్లీ మిల్క్ బ్యాంక్ల గురించి తెలుసుకోవాలి. చనుబాలు దానం చేయాలి’ అందామె.పాలకై ఎదురుచూపులునిత్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద, బీద వర్గాల్లోని తల్లులకు ప్రిమెచ్యూర్ బేబీలు పుడుతుంటారు. కాన్పు తర్వాత అనారోగ్యంపాలైన తల్లులుపాలు ఇవ్వలేరు. కొందరికిపాలు పడవు. కొందరికి పౌష్టికాహార లోపం వల్ల తగినన్నిపాలు రావు. చంటి పిల్లలకు తల్లిపాలకు మించి అమృతం లేదు. అది ఏ విధంగా అందినా గొప్పే. అందుకే గుత్తా జ్వాల అలాంటి పిల్లలను తన చనుబాలు దక్కాలని అనుకుని నీలోఫర్లో దానం చేశారు.‘నా చనుబాలు దానం చేసే ముందు మా డాక్టర్ని అడిగి సలహా తీసుకున్నాను. ఒకటి రెండు రక్త పరీక్షలు చేసి నేను దానం ఇవ్వొచ్చో కూడదో చెప్పారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ పంప్ సహాయంతో చనుబాలు తీసి కవర్లలో ఫ్రీజ్ చేసి నిల్వ చేయవచ్చు. సరైన ఫ్రీజర్లలో నిల్వ చేసిన చనుబాలను ఆరు నెలల వరకూ వాడొచ్చని డాక్టర్లు చెప్పారు. నేను చనుబాలు ఇస్తానని ఇన్ఫార్మ్ చేస్తే నిలోఫర్ వాళ్లే వచ్చి తీసుకెళ్లారు’ అని చెప్పింది జ్వాల.పిల్లలే ముఖ్యం‘తల్లులు రకరకాల కారణాల వల్ల పిల్లలకు చనుబాలు ఇవ్వడం లేదు. నేనేమీ తప్పు పట్టను. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఇవి తప్పవు. కొందరిపాలు రావు. కాని బిడ్డతో అనుబంధం ఏర్పడాలన్నా, వారితో ఉద్వేగాలు పంచుకోవాలన్నా తల్లిపాలు ఇవ్వడం మంచిదని నా అభి ప్రాయం. మన సమస్యలు ఎన్ని ఉన్నా బిడ్డ ఆరోగ్యమే తల్లులకు ప్రథమం కావాలి’ అంటున్నారు జ్వాల. ఆరోగ్యంగా ఉన్న తల్లులు అపోహలు వీడి, మూఢ విశ్వాసాలకుపోకుండా తమ దగ్గర అదనంగా ఉన్నపాలు దానం చేయాలని పిలుపిస్తున్నారామె.ఆరోగ్యమేపాలుఅథ్లెట్గా మొదటి ఇరవై ఏళ్లు నేను జంక్ ఫుడ్ తినలేదు. వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటూ జీవితం గడిపాను. అందుకే నాకుపాలు సమృద్ధిగా ఉన్నాయి.పాప కడుపు నిండుగా తాగాక రోజులు అర లీటరుగా పైగాపాలు నాలో పొంగుతున్నాయి. అవన్నీ సేకరించి దానం చేస్తున్నాను. అవి కొందరు పసిపిల్లలకు అందుతున్నాయన్న భావన నాకెంతో సంతోషం ఇస్తోంది. – గుత్తా జ్వాల -
కొత్త డిస్కమ్కు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ అధికారులు రూపొందించిన ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆర్థికపరమైన అంశాలపై మరింత అధ్యయనం చేయాలని సూచించారు. ఏయే సంస్థల నుంచి రుణాలు పొందే వీలుంది? ఎంత మేర రుణాలు తీసుకోవచ్చన్న దానిపై నిర్దిష్ట సమాచారం అందించాలని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, జెన్కో ఎండీ హరీశ్రావు, సింగరేణి సీఎండీ బలరాం, డిస్కమ్ల సీఎండీలు ముషారఫ్, వరుణ్రెడ్డి, రెడ్కో చైర్మన్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఉచితాలన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి..: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ కొత్త డిస్కమ్ పరిధి పర్యవేక్షణలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలోని తాగునీటి సరఫరాను కొత్త డిస్కమ్ పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా రూపొందించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్లు కమర్షియల్ ఆపరేషన్ విధులు నిర్వర్తిస్తాయని, కొత్త డిస్కమ్ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ డిస్కమ్కు కావాల్సిన మానవ వనరులను రెండు డిస్కమ్ల పరిధి నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చని, కొంతమందిని తాత్కాలికంగా నియమించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో డిస్కమ్ ఏర్పాటుకు కావాల్సిన నిధుల సమీకరణపై ప్రభుత్వం చర్చించాల్సి ఉందని, కేబినెట్ ఆమోదం తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని సీఎం అన్నట్టు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని అన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబుల్ రాష్ట్ర రాజధానితో పాటు, పరిసర జిల్లాల్లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న వైనాన్ని అధికారులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో స్మార్ట్ టెక్నాలజీతో నడిచే ట్రాన్స్ఫార్మర్లు, కేబులింగ్ వ్యవస్థ అవసరాన్ని తెలియజేశారు. ఇతర దేశాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం అమలులో ఉందంటూ.. దీన్ని రాజధానిలోనూ తీసుకొచ్చేందుకు రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా సబ్ స్టేషన్ల ఏర్పాటు విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆన్లైన్ విధానంలో సబ్ స్టేషన్లు, ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటి పనితీరును గుర్తించే వ్యవస్థ గురించి వివరించారు. సబ్ స్టేషన్ సామర్థ్యానికి మించి విద్యుత్ కనెక్షన్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయాలను అదుపు చేయాలని సీఎం ఆదేశించారు. అవినీతిపై ఓ కన్నేయండి విద్యుత్ శాఖ అవినీతిమయమైందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నట్టు తెలిసింది. తాజాగా ఓ అధికారి ఏసీబీకి చిక్కడంపై ఆయన ఆరా తీశారు. విద్యుత్ సంస్థల్లో కీలకమైన అధికారులపైనా ఆరోపణలున్నాయని, ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శితో సీఎం అన్నట్టు తెలిసింది. ఏసీబీతో సమన్వయం చేసుకుని, అక్రమ ఆస్తులున్న వారి జాబితాను రూపొందించాలని ఆయన సూచించినట్లు సమాచారం. జెన్కోలో ఓ డైరెక్టర్ స్థాయి అధికారి అవినీతి వ్యవహారంపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. -
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్లైన్లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్లైన్లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. -
..రద్దు చేస్తారేమోననిపిస్తోంది సార్!
..రద్దు చేస్తారేమోననిపిస్తోంది సార్! -
ఇది విమోచనమే!
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిన సాహితీ యోధుడు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం ఇటీవలే జరుపుకొన్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రానుండటం కోట్లాది తెలంగాణ రతనాలతో దాశరథికి నివాళులు అర్పించడమే అవుతుంది. వీరులను స్మరించుకోవడానికి...1998 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భార తీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా ప్రకటించి, ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలనీ, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనీ డిమాండ్ చేశాం. అది మొదలు బీజేపీ ఈ అంశంపై నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్ 12న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘‘1947 ఆగస్ట్ 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన 13 నెలల వరకూ హైదరాబాద్కు స్వేచ్ఛ లభించలేదు. అది నిజాం పాలనలో ఉంది. ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీస్ చర్య తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. అయితే, సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినం’గా జరపాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను విముక్తి చేసిన మర వీరులను స్మరించుకోవడానికీ, యువత మనస్సులో దేశభక్తి జ్వాలను నింపడానికీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆ గెజిట్లో పేర్కొన్నారు. అసంబద్ధమైన పేర్లుగతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండి... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహా రాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలే కావడం విశేషం. తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్య మాలు చేసినా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి గత మూడు సంవత్సరాలుగా అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలనా దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావ రీత్యా సమాఖ్యగా ఉన్నా... ఆత్మ ఒక్కటే అని సాధారణంగా చెప్పుకొంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ‘రాష్ట్రాల సమాఖ్య’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించి సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే... దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హైదరాబాద్ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, బైరాన్పల్లిల్లో వెలుగు చూసిన దారుణ కృత్యాలు హైదరాబాద్ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి. తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణ దాయకం. ఒళ్లుగగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. అందుకే 1948 సెప్టెంబర్ 17 ‘హైదరాబాద్ విమోచన పొందిన రోజు’ తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంపేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.సీహెచ్. విద్యాసాగర్ రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
ఉన్నంతలో ఉపశమనం
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్ కుమార్ ఝూ(ఆర్జేడీ), జియావుర్ రహమాన్(కాంగ్రెస్) ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్ బై యూజర్) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి రా.1.17 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పునర్వసు ఉ.9.38 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.26 నుండి 7.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు, అమృత ఘడియలు: రా.2.46 నుండి 4.18 వరకు, మతత్రయ ఏకాదశి.సూర్యోదయం : 5.51సూర్యాస్తమయం : 6.00రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.కన్య....... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.తుల... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.ధనుస్సు.. కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.మకరం... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. -
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్చల్ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్,మధు ట్రబుల్ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్ కళాసాగర్ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది. -
సోలో వేకేషన్లో అనసూయ చిల్.. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అనన్య నాగళ్ల!
కలర్ ఫుల్ శారీలో బిగ్బాస్ దివి...దక్ష లుక్లో మంచు లక్ష్మీ..వేకేషన్లో చిల్ అవుతోన్న అనసూయ..రెడ్ శారీలో బ్యూటీ హీరోయిన్ నిలాఖి పాత్ర లేటేస్ట్ లుక్..ఆరెంజ్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..సాగర తీరాన శోభిత ధూలిపాళ్ల చిల్..మ్యాచ్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్లో భారత్-పాక్లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025 -
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
ఈ సంవత్సరం చివర్లో లా నినా పరిస్థితులు తిరిగి రావచ్చని, ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను నిర్ధేశ్యించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన శీతాకాలాన్ని సాధారణం కంటే చాలా చల్లగా మార్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. రానున్న అక్టోబర్ డిసెంబర్ 2025 మధ్య లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని సెప్టెంబర్ 11న నేషనల్ వెదర్ సర్వీస్కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఇది అలాగే కొనసాగి డిసెంబర్ 2025 నుంచి తగ్గడం మొదలవుతుందని ఫిబ్రవరి 2026 మధ్యకు వచ్చేసరికి 54%కి తగ్గుతుందని వెల్లడించింది. కానీ లా నినా వాచ్ అప్పటికీ ప్రభావం చూపుతూనే ఉంటుందంది.ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఇఎన్ఎస్ఓ) శీతలీకరణ దశ అయిన లా నినా, భూమధ్యరేఖ పసిఫిక్లో సముద్ర ఉష్ణోగ్రతలను మారుస్తుంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చాలా గాఢమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ప్రభావం భారతదేశంపైన ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, ఇది తరచుగా సాధారణం కంటే చల్లగా ఉండే శీతాకాలాలను మనం ఎదుర్కోవలసి రావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారత పౌరాణిక విభాగం (ఐఎమ్డి) తన ఇటీవలి తన ఇఎన్ఎస్ఓ బులెటిన్లో భూమధ్యరేఖ పసిఫిక్పై ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది అంటే ఎల్ నినో లేదా లా నినా పరిస్థితి లేదు). ఐఎమ్డి కి చెందిన మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (ఎమ్ఎమ్సిఎఫ్ఎస్) ఇతర అంచనాలు, ఈ తటస్థ పరిస్థితులు రుతుపవనాల సీజన్ మొత్తం కొనసాగుతాయని తేల్చాయి. అయితే రుతుపవనాల తర్వాత నెలల్లో లా నినా ఆవిర్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేశాయి.ఈ నమూనాలు ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ (50% కంటే ఎక్కువ) మధ్య లా నినా అభివద్ధి చెందే అవకాశాలను చూపిస్తున్నాయని ఐఎమ్డి శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వాతావరణ మార్పులు భూ ఉపరితలం వేడెక్కడం ప్రభావం కొంతవరకు దీనిని భర్తీ చేయగలదు, లా నినా ఉన్న శీతాకాలాలు అది లేని సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటాయని స్పష్టం చేశారు.ప్రైవేట్ ఫోర్కాస్టర్ స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జిపి శర్మ మాట్లాడుతూ స్వల్పకాలిక లా నినా ఎపిసోడ్ను తోసిపుచ్చలేమని అన్నారు. ‘పసిఫిక్ మహా సముద్రం ఇప్పటికే సాధారణం కంటే చల్లగా ఉంది, అయినప్పటికీ లా నినా పరిమితుల వద్దకు ఇంకా రాలేదు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు –0.5నిఇ కంటే తక్కువగా పడిపోయి అదే విధంగా కనీసం మూడు త్రైమాసికాల పాటు కొనసాగితే, దానిని లా నినాగా ప్రకటిస్తారు.2024 చివరిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నవంబర్ నుంచి జనవరి వరకూ లా నినా పరిస్థితులు కాస్త కనిపించి, మళ్ళీ తటస్థంగా మారిందన్నారు. కొనసాగుతున్న పసిఫిక్ శీతలీకరణ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శర్మ అన్నారు. ‘లా నినా ప్రారంభమైతే ఏర్పడే పొడి శీతాకాలాల కోసం అమెరికా ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. భారత దేశానికి, చల్లటి పసిఫిక్ జలాలు సాధారణంగా కఠినమైన శీతాకాలాలుగా మారతాయి.ముఖ్యంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలలో హిమపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది‘ అని ఆయన అంచనా వేస్తున్నారు. మొహాలి (పంజాబ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) బ్రెజిల్లోని నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేసిన 2024 అధ్యయనం ప్రకారం, ఉత్తర భారతదేశంపై తీవ్రమైన చలి తరంగాలను ప్రేరేపించడంలో లా నినా పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ‘లా నినా సమయంలో దేశంలోకి చల్లని గాలి ప్రవేశిస్తుంది. ‘ఎల్ నినో, తటస్థ సంవత్సరాలతో పోలిస్తే లా నినా సంవత్సరాల్లో శీతల తరంగ సంఘటనల ఫ్రీక్వెన్సీ వ్యవధి కూడా ఎక్కువగా ఉన్నాయి‘ అని అధ్యయనం తేల్చింది. -
'పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్'.. ఫుల్ ఎంటర్టైనింగ్గా టీజర్
మసూద ఫేమ్ తిరువీర్ నటించిన తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో(The Great Pre Wedding Show). ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్.ఈ సినిమా టీజర్ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్గా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఈ చిత్రంలో తిరువీర్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్కు ఫోటోలు, వీడియోలు తీస్తూ నవ్వులు పూయించారు. ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్పై ఫన్నీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.ఈ చిత్రంలో టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని 70ఎం ప్రొడక్షన్స్ బ్యానర్లో సందీప్ అగరం, అశ్మితా రెడ్డి బసాని నిర్మించారు. ఈ సినిమాకు సురేష్ బొబిల్లి సంగీతమందించారు. ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.I have known @iamThiruveeR from before the world knew me :) and I am so happy to see him live his dreams!Here is the teaser of #TheGreatPreWeddingShowA very interesting and relatable premise which Looks like a breezy ride! Best wishes to Thiruveer and the entire team 🤗 pic.twitter.com/oJQiPj8wbe— Vijay Deverakonda (@TheDeverakonda) September 16, 2025 -
సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే
స్వదేశంలో నమీబియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను జింబాబ్వే మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా జింబాబ్వేనే గెలుపొందింది. 33 పరుగుల తేడాతో పర్యాటక జట్టును ఓడించింది. నామమాత్రపు చివరి టీ20 సెప్టెంబర్ 18న బులవాయో వేదికగా జరుగనుంది.రాణించిన క్రుగర్, లాఫ్టీతొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. మలాన్ క్రుగర్ (45), లాఫ్టీ ఈటన్ (47) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (37), జాన్ ఫ్రైలింక్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చివరి ఓవర్లలో నమీబియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకుని పెద్ద స్కోర్ చేయలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, రిచర్డ్ నగరవ తలో 2 వికెట్లు తీయగా.. మపోసా, కెప్టెన్ సికందర్ రజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చెలరేగిన బెన్నెట్.. సత్తా చాటిన మరుమణి170 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆది నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (40), మరుమణి (50) పోటీపడి పరుగులు రాబట్టారు. అనంతరం బ్రెండన్ టేలర్ (29), ర్యాన్ బర్ల్ (24 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించడంతో జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో స్మిట్ 2, బెర్నాల్డ్ స్కోల్జ్, ట్రంపల్మన్ తలో వికెట్ తీశారు. ముసేకివా సిక్సర్ కొట్టి జింబాబ్వేను గెలిపించాడు. -
ఆగస్టులో వాహన అమ్మకాలు ఇలా..
దేశీయంగా ఈ ఆగస్టులో 3,21,840 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. తగ్గిన డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు డీలర్లకు సరఫరాను సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. 2024 ఇదే ఆగస్టులో అమ్ముడైన 3,52,921 వాహనాలతో పోలిస్తే ఈసారి 9% తగ్గాయి.‘‘జీఎస్టీ రేట్ల సవరణ కారణంగా ధరలు తగ్గే వీలుందని అంచనా వేసిన కస్టమర్లు వాహన కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా చేసుకున్నారు. దీంతో ఆగస్టులో డిమాండ్ తగ్గింది. అందుకు తగ్గట్లు కంపెనీలు సైతం డీలర్లకు సరఫరా సర్దుబాటు చేశాయి.’’ అని సియామ్ ప్రకటనలో తెలిపింది.👉అయితే ద్విచక్ర అమ్మకాల్లో 7% వృద్ది నమోదైంది. ఆగస్టులో మొత్తం 18,33,921 అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలు 17,11,662 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్ సైకిళ్ల విక్రయాలు 10,60,866 నుంచి 11,06,638కు; స్కూటర్ల అమ్మకాలు 6,43,169 నుంచి 6,83,397కు పెరిగాయి. అయితే మోపెడ్లు మాత్రం 44,546 నుంచి 43,886కు పరిమితమయ్యాయి.👉త్రి చక్ర వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 8% వృద్ధి నమోదైంది. ఆగస్టులో 69,962 నుంచి 75,759 యూనిట్లకు పెరిగాయి.👉‘‘కేంద్రం జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో అందుబాటు ధరల వాహనాలు కస్టమర్లను ఆకర్షిస్తాయి. అలాగే పండుగ ఉత్సాహానికి మరింత ఉపకరిస్తుంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో.. జిమ్లో యంగ్ టైగర్ను చూశారా!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ డైరెక్టర్తో మొదటిసారి జతకట్టడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ త్వరలోనే అమెరికాలో ప్రారంభం కానుంది. ఇవాళ ఎన్టీఆర్ యూఎస్ కాన్సులేట్కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్గా మారాయి.తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. జిమ్లో చెమడ్చోస్తున్న వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కోసమే జూనియర్ బరువు తగ్గుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ న్యూ లుక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. BEAST MODE ACTIVATED by Man of Masses @tarak9999 🐉💪🔥#JrNTR #NTRNeel #Dragon #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/cf44pPs0N3— Telugu FilmNagar (@telugufilmnagar) September 16, 2025 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్..!
దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సూత్రవాక్యం. ఈ మూవీ ఈ ఏడాది జూన్లో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజయ్యాక 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్కు పైగా దూసుకెళ్తోంది. థియేటర్లలో అంతగా రాణించకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి యూజీన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ నటించారు. ఈ సినిమాలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించారు. నిర్మాత శ్రీకాంత్ కండ్రాగుల నిర్మాత ఓ కీలక పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. -
ఎల్లుండి వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఎల్లుండి (సెప్టెంబర్ 18, గురువారం) ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష) భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
అంతర్జాతీయ క్రికెటర్పై నిషేధం
నెదర్లాండ్స్ జాతీయ జట్టు ఆటగాడు వివియన్ కింగ్మా నిషేధానికి గురయ్యాడు. 30 ఏళ్ల ఈ పేసర్ ఐసీసీ యాంటీ-డోపింగ్ కోడ్ను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. కింగ్మాకు ఈ ఏడాది మే 12న యూఏఈతో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2 వన్డే మ్యాచ్ తర్వాత డోపింగ్ పరీక్ష నిర్వహించగా.. అందులో అతను బెంజోయెల్కోగ్నిన్ (కోకైన్ మెటబోలైట్) అనే రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ డ్రగ్ ఐసీసీ నిషేధిత జాబితాలో ఉంది.కింగ్మా నిషేధ కాలం ఆగస్టు 15 నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, నిషేధకాలాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంది. ఐసీసీ యాంటి-డోపింగ్ కోడ్ ప్రకారం.. మే 12 నుంచి (డోపీగా దొరికిన రోజు) కింగ్మా ఆడిన మ్యాచ్లన్నీ డిస్క్వాలిఫై అవుతాయి. అంటే ఆ మ్యాచ్ల్లో కింగ్మా తీసిన వికెట్లు, పరుగులు, క్యాచ్లు పరిగణలోకి రావు. నాటి నుంచి కింగ్మా యూఏఈతో వన్డే, నేపాల్, స్కాట్లాండ్తో రెండు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఈ మ్యాచ్ల్లో కింగ్మా గణాంకాలన్నీ రికార్డుల్లో నుంచి తొలగించబడతాయి. మరోవైపు కింగ్మా తాను చేసిన తప్పును అంగీకరించాడు. నిషేధిత డ్రగ్స్ను పోటీకి బయట ఉపయోగించినట్లు ఒప్పుకున్నాడు. గత ఏడాది కాలంలో కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), డగ్ బ్రేస్వెల్ (న్యూజిలాండ్) కూడా కింగ్మా లాగే రిక్రియేషనల్ డ్రగ్ వాడకానికి సంబంధించి నిషేధాలు ఎదుర్కొన్నారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కింగ్మా నెదర్లాండ్స్ తరఫున 30 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో 40 వన్డే వికెట్లు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు. -
జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..
చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్ యాన్యువల్ ర్యాంకింగ్లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి నియమితులయ్యారు. అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుగా రెండేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్వెల్ఫైర్ డైరెక్టర్గా శ్రుతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి నియమితులయ్యారు. -
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడులు జరిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 809 మెడికల్ షాపులు,అనధికార వైద్యులకు సంబంధించిన ఆస్పత్రులలో డీసీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 234 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టాల్ వంటి మందులు లైసెన్స్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లుగా పలు ఆధారాల్ని సేకరించారు. దీంతో సదరు మెడికల్ షాపులను సీజ్ చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరు 234 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 165 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్ చేయడంతోపాటు ఏడు మెడికల్ షాపుల లైసెన్సులు పూర్తిగా రద్దు చేశారు. అక్రమంగా అబార్షన్ కిట్లు మహిళలకు ప్రమాదం. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు కొనసాగుతాయి అధికారులు తెలిపారు. అనధికార మెడికల్ షాపుల వద్ద అబార్షన్ కిట్లు, మందులు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి హానికరం. ప్రజలు నిబంధనల ప్రకారం మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
రూ.20.80 లక్షలు తగ్గిన కారు ధర: అంతా జీఎస్టీ ఎఫెక్ట్!
జీఎస్టీ సవరణల తరువాత దాదాపు అన్ని కంపెనీలు తగ్గిన తమ వాహనాల ధరలను ఇప్పటికే ప్రకటించాయి. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ తరుణంలో లెక్సస్ ఇండియా కూడా.. తగ్గిన ధరలను వెల్లడిందింది.లెక్సస్ ఇండియా దేశంలో విక్రయించే.. LX 500d ధర రూ.20.80 లక్షల వరకు తగ్గినట్లు పేర్కొంది(ఈ కారు అసలు ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువే). దేశంలో పండుగ సీజన్ ప్రారంభానికి ముందు తగ్గిన ఈ ధరలు అమ్మకాలను కూడా పెంచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.లెక్సస్ ES 300h ఎక్స్క్విజిట్ హైబ్రిడ్ సెడాన్ ఇప్పుడు రూ.64 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభించనుంది. దీని ధర రూ. 1.47 లక్షలు తగ్గింది. లెక్సస్ 350హెచ్, ఆర్ఎక్స్ 350హెచ్, ఆర్ఎక్స్ 500హెచ్, ఎల్ఎమ్ 350హెచ్, ఎల్ఎక్స్ 500డీ ధరలు కూడా చాలా వరకు తగ్గాయి.ఇదీ చదవండి: 2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనాదేశంలోని చాలా లెక్సస్ హైబ్రిడ్ మోడల్స్.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రోడ్ పన్నుకు అర్హత పొందుతాయి. కాబట్టి ఆన్ రోడ్ ధరలు కూడా కొంత తగ్గుతాయి. హైబ్రిడ్ మోడళ్లను ఎంచుకునే కొనుగోలుదారులు రాష్ట్ర పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి ప్రభావవంతమైన ఖర్చులు మరింత తగ్గుతాయని తెలుస్తోంది. -
చరిత్ర సృష్టించిన నిసాంక.. శ్రీలంక తొలి ప్లేయర్గా..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న లంక జట్టు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే, రెండో మ్యాచ్లో భాగంగా పసికూన హాంకాంగ్తో తలపడిన శ్రీలంక (SL vs HK).. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించింది.నిజాకత్ ఖాన్ మెరుపులుఓపెనర్లు జీషన్ అలీ (23), అన్షుమాన్ రథ్ (48) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ నిజాకత్ ఖాన్ అజేయ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 52)తో అలరించాడు. అయితే, హాంకాంగ్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది.హాంకాంగ్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 11, కమిల్ మిశారా 19, కుశాల్ పెరీరా 20 పరుగులు చేయగా.. కెప్టెన్ చరిత్ అసలంక (2), కమిందు మెండిస్ (5) పూర్తిగా విఫలమయ్యారు.పాతుమ్ నిసాంక హాఫ్ సెంచరీఅయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. నిసాంక అర్ధ శతకానికి తోడు ఆఖర్లో వనిందు హసరంగ (9 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లంక గట్టెక్కగలిగింది.శ్రీలంక తొలి ప్లేయర్గా..ఇక శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిసాంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ మ్యాచ్ సందర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.కాగా అంతకు ముందు ఈ రికార్డు కుశాల్ మెండిస్ పేరిట ఉండేది. అతడి ఖాతాలో 16 ఫిఫ్టీ ప్లస్ టీ20 స్కోర్లు ఉండగా.. నిసాంక (17) అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే కుశాల్ పెరీరా కూడా 16సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి కుశాల్ మెండిస్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ స్కోర్లు👉హాంకాంగ్:149/4 (20)👉శ్రీలంక: 153/6 (18.5)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హాంకాంగ్పై శ్రీలంక గెలుపు.చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. ఇంటర్నేషనల్ షూట్కు అంతా రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్కు వెళ్లారు. ప్రశాంత్ నీల్తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. యంగ్ టైగర్తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్కు విచ్చేసిన ఎన్టీఆర్ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025 -
‘బ్యూటీ’ చూసి అమ్మాయిలకు నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి : వీకే నరేశ్
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించిన సీనియర్ నటుడు వీకే నరేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ సినిమా సోల్, ఈ సినిమా థీమ్ మాత్రమే ఈ సినిమాకు బ్యూటీ. సుబ్బు రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. సింఫనీ ఆఫ్ క్రాఫ్ట్ ఈ సినిమా. అన్ని కుదిరాయి దీనికి. ఇటీవల ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమాలు తగ్గాయి. ఇందులో ఆ రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రేక్షకులకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే నచ్చట్లేదు. ఆర్గానిక్ గా ఉండాలి. అలా ఉంటేనే నచ్చుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్గానిక్ గా లేదు అని మీకు అనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని ఛాలెంజ్ చేశాను నేను.⇢ ఇవాళ మంచి సినిమా, చెడ్డ సినిమా అని కాదు వాళ్ళు పెట్టే డబ్బులకు సంతృప్తి చెందుతున్నారా లేదా చూస్తున్నారు ఆడియన్స్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూడొచ్చు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు. కానీ దీంట్లో ఏమి లేకుండా అంతగా వర్కౌట్ చేసారు. ఈ సినిమాలో ప్రస్తుత జనరేషన్ తమను తాము చూసుకుంటారు. ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అది ఒక కమిట్మెంట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, కలిసి ఎంజాయ్ చేసి విడిపోవడం అంతే. ఇప్పటి పిల్లలకు మనం ఏమి చెప్పలేము. ఫ్రెండ్ గా ఉండటమే చేయాలి. ఒక రియలిస్టిక్ కంటెంట్ ని అందంగా చూపించారు.⇢ నాకు కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. ఆ లోటు కాదు కానీ కూతురు ఉంటే ఇంత పెయిన్ పడేవాడినా అని ఈ సినిమాలో అనుభవించాను. ఇవాళ్టి పిల్లలు ఏదో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సినిమాలో ఆ అమ్మాయిని చూసి నేను ఆ పెయిన్ అనుభవించాను. ⇢ ఈ కథ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయ్యాను. నేను కథ విన్నాక మారుతీని ఈ సినిమా నేను చేయగలనా లేదా అని అడిగితే మీరు వంద శాతం పండిస్తారు అన్నారు. చిన్న అపార్ట్మెంట్ లో చాలా కష్టపడి షూట్ చేసాము. ఓల్డ్ సిరీస్ లో మట్టిలో తిరిగే సీన్స్ చేశాను. ఈ సినిమాలో కథ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకెళ్లారు. అది కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఏమన్నా తప్పులు ఉంటే నేను మీ ముందుకు వచ్చి నిలబడతాను.⇢ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. చిన్న చిన్న లొకేషన్స్ లో కూడా అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడు కెమెరామెన్. ఆర్ట్ డైరెక్టర్ ని కూడా మెచ్చుకోవాలి. ఈ కథని జర్నలిస్ట్ రాసాడు అంటే ఎంత రియాలిటీ ఉంటుందో చూడండి.⇢ చాలా సినిమాల్లో అమ్మ - కొడుకుల రిలేషన్ చూపించారు కానీ తండ్రి కూతుళ్ళ రిలేషన్ చాలా తక్కువ సినిమాల్లో చూపించారు. ఈ సినిమా చూసి అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి కంట్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి. ఇంట్లో అన్ని అమ్మ అయితే ఇంటికి కాంపౌండ్ వాల్ లాంటివాడు నాన్న. ఆ ఎమోషనే బ్యూటీ -
మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు చాలా ముందు నుంచే అతను దేశవాలీ వన్డేలు (లిస్ట్-ఏ, 50 ఓవర్ల ఫార్మాట్) కూడా ఆడటం లేదు. తాజాగా మ్యాక్సీ 50 ఓవర్ల ఫార్మాట్లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.దేశవాలీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరఫున బరిలోకి దిగనున్నాడు. మ్యాక్సీ 2022 తర్వాత ఒకే ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. త్వరలో న్యూజిలాండ్తో జరుగుబోయే టీ20 సిరీస్కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు మ్యాక్సీ డీన్ జోన్స్ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మ్యాక్సీ సెప్టెంబర్ 17న క్వీన్స్ల్యాండ్తో, సెప్టెంబర్ 19న టస్మానియాతో జరుగబోయే మ్యాచ్ల్లో ఆడతాడు.మ్యాక్స్వెల్ జట్టులో (విక్టోరియా) మ్యాట్ షార్ట్, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హ్యారిస్, విల్ సదర్ల్యాండ్ లాంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా ఈ టోర్నీ గత సీజన్లో ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. మ్యాక్స్వెల్ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్లో విక్టోరియా తరఫున బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఇటీవలికాలంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లు ఆడింది. వీటిలో విండీస్ సిరీస్ను 5-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో (0/15 (2), 62* (36)) ఆకట్టుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగుతాయి. -
కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స
హైదరాబాద్: ఏడు నెలలకే.. అంటే నెలలు నిండకముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అతడికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో, శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నియోనాటాజిస్ట్ డా. భవాని దీప్తి మరియు కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ తెలిపారు.“నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన దంపతులకు నెలలు నిండకముందే ఏడు నెలలకే ఒక బాబు పుట్టాడు. దీంతో అత్యవసర పరిస్థిత్తుల్లో 97 రోజుల పాటు బాబును ఎన్ఐసియూ లో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో ఊపిరితిత్తుల నుండి రక్తం రావడం మరియు గుండె సంబంధిచిన పీడిఏ సమస్య వల్ల వెంటి లేటర్ అవసరం పడింది.తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు, మిగిలిన శరీరానికి, రక్త సరఫరా చేసే రక్తనాళాలకు మధ్య ఒక గొట్టం లాంటిది ఉంటుంది. పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో అది మూసుకుపోతుంది. కానీ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అది మూసుకోవడం కష్టం అవుతుంది. దీనినే పీడిఏ అంటారు. ఈ సమస్య వల్ల ఊపిరితిత్తులకు రక్తం ఎక్కువగా వెళ్లి ఒత్తిడి పెరుగుతుంది. గుండె పనితీరు దెబ్బతింటుంది. నెలలు నిండని శిశువుల్లో 80% మందికి ఈ తరహా సమస్య ఉంటుంది. అప్పుడు ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, గుండె కూడా దెబ్బతినడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది.ఈ సమస్యకు ముందుగా మందులు వాడి చూస్తారు. వాటితో నయమైతే పర్వాలేదు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స గానీ, ఇలాంటి డివైస్ తో మూసేయడం గానీ చేయాలి. లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఇంతకాలం ఎదభాగానికి ఒక పక్క నుంచి శస్త్రచికిత్స చేసి ఆ రంధ్రాన్ని మూసేసేవారు. కానీ, ఈ కేసులో బాబు అతి తక్కువ బరువు ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో శస్త్రచికిత్స చేయడం అంత సురక్షితం కాదని భావించాం. అందుకే అత్యాధునిక పరికరంతో ఆ రంధ్రాన్ని మూసేయాలని నిర్ణయించాం. సర్జరీ చేసే సమయానికి అతడి బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే ఉన్నాడు.1.2 మిల్లీమీటర్లు చుట్టుకొలత ఉన్న పికోలో అనే అత్యాధునిక పరికరాన్ని కాలి నరం ద్వారా లోపలకు పంపి, దాని సాయంతో రంధ్రాన్ని మూసేశాం. ఈ డివైస్ అమర్చి కోలుకున్న శిశువుల్లో దేశంలోనే అతి తక్కువ బరువు గల చిన్నారిగా రికార్డు సృష్టించాడు. దీంతో రంధ్రం పూడుకుపోయి, బాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యాయి. ఈ ప్రొసీజర్ తర్వాత ఎన్ఐసీయూలో డాక్టర్ భవానీ దీప్తి, డాక్టర్ సింధు మారు బృందం బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నారు.శస్త్రచికిత్స అవసరం లేకుండానే పీడీఏ మూయడానికి ఈ పరికరం గేమ్ఛేంజర్ అవుతుంది. బాబుకు ఇక ఎలాంటి సమస్యలు లేకపోవడంతో పాలు కూడా తాగడం మొదలుపెట్టాడు. తర్వాత 2.45 కిలోలకు బరువు పెరగడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ భవనీ దీప్తి మరియు డా.సుదీప్ వర్మ వివరించారు. -
ఏసీబీకి ఏకంగా డైనోసార్ చిక్కింది.. ఏడీఈ అంబేద్కర్ ఆస్తులు 300కోట్లు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం కాదు.. ఏకంగా డైనోసార్ చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.గత కొంతకాలంగా ఏడీఈ అంబేద్కర్కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ఏడీఈ ఇల్లు,బంధువులు,కుటుంబసభ్యుల ఇళ్లతో పాటు గచ్చిబౌలి,మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. విద్యుత్శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అంబేద్కర్ రూ.300కోట్లకుపైగా ఆస్తిపాస్తులున్నట్లు గుర్తించారు.పదెకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో తేలింది. -
మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లలో 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా ప్రభుత్వం నియమించింది. మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసింది.ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల అభ్యున్నతి, వారు ఆత్మగౌరంతో జీవించాలన్నదే సీఎం సంకల్పమన్నారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్జెండర్లకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ట్రాన్స్జెండర్లు.. ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి. ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారు’’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఇండస్ టవర్స్, ఐఐటీ మద్రాస్ మధ్య భాగస్వామ్యం
ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం టవర్ కంపెనీలలో ఒకటైన ఇండస్ టవర్స్, గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ (GFRP)పై పరిశోధన చేయడానికి ఐఐటీ మద్రాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఉక్కుకు స్థిరమైన, మన్నికైన.. ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయనున్నారు.ఈ భాగస్వామ్యంలో ఐఐటీ మద్రాస్ మెకానికల్ స్ట్రెంత్, మన్నిక, లైఫ్ సైకిల్ వంటి వాటిని అధ్యనయం చేస్తుంది. అంతే కాకుండా టెలికాం, ఇతర పరిశ్రమల కోసం డిజైన్.. భద్రతా ప్రమాణాలను సృష్టిస్తుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో అనిల్ గుప్తా (ఇండస్ టవర్స్), ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు రవీంద్ర గెట్టు, అశ్విన్ మహాలింగం పాల్గొన్నారు. -
కర్నూలు: ఉల్లి రైతు కంట కన్నీరు
సాక్షి, కర్నూలు: జిల్లాలో రైతులకు ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. పత్తికొండ రూరల్లో పులికొండ రైతు పొలాన్ని దున్నేశారు. టమోటా, ఉల్లి పంటలు తమ కొంప ముంచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానికులు ఉల్లి దోపిడీ చేస్తున్నారు. మార్కెట్లోనే రైతులు ఉల్లినివదిలేసి వెళ్తున్నారు. రైతులు వదిలేసి వెళ్లిన ఉల్లిని స్థానికులు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. బైకులపై ఆటోలలో ఉల్లిగడ్డ మూటలను స్థానికులు ఎత్తుకెళ్తున్నారు.పత్తికొండ టమోటా మార్కెట్ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు టమోటాకు ధర లేక రైతులు బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని శ్రీదేవి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విత్తనం నుండి విక్రయం దాకా రైతాంగానికి అండగా జగనన్న ఉండేవారని.. రైతులు టమోటాలను రోడ్డుపై పారవేస్తున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గాని స్పందించిన దాఖలాలు లేవంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా టమోటాకు గిట్టు బాటుధర కల్పించాలని శ్రీదేవి డిమాండ్ చేశారు.రైతుల ఆవేదనను పట్టించుకోకుండా గిట్టుబాటు ధర ప్రకటించడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మితే కోత ఖర్చులు కూడా రావంటూ పొలాన్ని రైతులు దున్నేస్తున్నారు. 1200 గిట్టుబాటు ధర సరిపోదంటూ మరింత నష్టాల్లో కూరుకుపోకుండా పత్తికొండ రైతులు.. పంటను దున్నేస్తున్నారు. కనీసం 2500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని కొనుగోలు చేయాలని రైతలు డిమాండ్ చేస్తున్నారు. పొలంలో ఉల్లి పంటలు దున్నివేస్తున్న రైతులను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. కంగాటి శ్రీదేవితో రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు. -
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా
విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్గా వ్యవహరించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కొన్స్టాస్ శతకం.. శ్రేయస్ సేనపై ఆసీస్ బ్యాటర్ల పైచేయి
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వన్, టు డౌన్ బ్యాటర్లు నాథన్ మెక్స్వీని (1), ఒలివర్ పీక్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్ స్కాట్ 47, జోష్ ఫిలిప్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్ కన్నోల్లీ-లియామ్ స్కాట్ భారత్ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు. వీరిద్దరు ఐదో వికెట్కు 109 పరుగులు జోడించి ఆసీస్ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్ స్కాట్ బాధ్యతగా ఆడుతూ ఆసీస్ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్స్టాస్-కెల్లావే జోడీ తొలి వికెట్కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసింది.గుర్నూర్ బ్రార్ భారత్కు తొలి బ్రేక్ అందించారు. కెల్లావేను ఔట్ చేశాడు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మెక్స్వీనిని, సెంచరీ హీరో కొన్స్టాస్ను పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత ఖలీల్ అహ్మద్ ఒలివర్ పీక్ను ఔట్ చేశాడు. అనంతరం కన్నోల్లీ, లియామ్ స్కాట్ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్ భారత్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి. -
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్ -
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
'నిజమైన ప్రేమికులు అయితే ఆ తెలుగు సినిమా చూడండి'.. గరికపాటి కామెంట్స్
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు టాలీవుడ్ సినిమాను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే తెలుగు సినిమాను చూడాలని గరికపాటి సూచించారు. ఇటీవల విడుదలైన 8 వసంతాలు చూస్తే చాలు.. నిజమైన ప్రేమ అంటే మీకు తెలుస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని తాను చూశానని వెల్లడించారు. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుంది.. కలిసి ఉన్నా, విడిపోయినా వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది.తెలుగులో ఇటీవల విడుదలైన ప్రేమకథా చిత్రం 8 వసంతాలు. అందమైన ప్రేమకథగా ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో మలయాళ అమ్మాయి అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)8 వసంతాలు కథేంటంటే?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. Thank you Padma Shri #GarikipatiNarasimhaRao Garu for your great words about #8Vasantalu ✨An eminent personality like you talking about our film is an honour.Movie streaming on Netflix ❤🔥▶️ https://t.co/EmPxSwgx8mDirected by #PhanindraNarsettiProduced by… pic.twitter.com/F0P3pykwvV— Mythri Movie Makers (@MythriOfficial) September 16, 2025 -
చరిత్రలో భారత్కు తొలి స్వర్ణం
స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. చైనాలో జరుగుతున్న 2025 ఎడిషన్లో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువ స్కేటర్ ఆనంద్కుమార్ వేల్కుమార్ భారత్కు ఈ అపురూప గౌరవాన్ని అందించాడు. 1000 మీటర్ల సీనియర్ స్ప్రింట్లో ఆనంద్కుమార్ వేల్కుమార్ 1:24.924 సెకన్ల టైమింగ్తో రేసును పూర్తి చేసి స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్కు తొలి స్వర్ణ పతకం సాధించి పెట్టాడు.ఇదే టోర్నీలో ఆనంద్కుమార్ 500 మీటర్ల స్ప్రింట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్కుమార్ సాధించిన విజయాలు భారతదేశంలో స్పీడ్ స్కేటింగ్కు కొత్త దిశను చూపించాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడలో భారత్కు పెద్దగా గుర్తింపు లేదు.ఆనంద్కుమార్ స్వర్ణం సాధించిన అనంతరం ప్రపంచం దృష్టి భారత్పై పడింది. అతని విజయాలు యూరప్, లాటిన్ అమెరికా, ఈస్ట్ ఆసియా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ, భారత రోలర్ స్పోర్ట్స్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాయి.ఆనంద్కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అతని విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. ఆనంద్కుమార్ అంకితభావం, శ్రమ భారత యువతకు స్ఫూర్తిదాయకమని ఎక్స్ ద్వారా తెలిపారు.జూనియర్ విభాగంలో కృష్ శర్మకు స్వర్ణంస్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలోనూ భారత్కు స్వర్ణం దక్కింది. క్రిష్ శర్మ 1000 మీటర్ల స్ప్రింట్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్ అందించాడు. -
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్కు అస్వస్థత
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ సచివాయలయంలో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లారు. అయితే శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన మధుయాష్కీ స్పృహతప్పి కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధుయాష్కీకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్లో మాట్లాడుతూ.. తన పోర్ట్ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్కాయిన్ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్కాయిన్ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. -
లేని లిక్కర్ స్కాంలో సిట్ భేతాళ కథలు: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని.. ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్మీద ఉన్నారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీని అణచాలని చూడటం దుర్మార్గం. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు.. నవ్వుతున్నారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని అంబటి హితవు పలికారు.‘‘లేని లిక్కర్ స్కాంలో సిట్ ఇంకా భేతాళ కథలే అల్లుతోంది. వైఎస్ జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్టు చేయటమే లక్ష్యంగా సిట్ పని చేస్తోంది. ఒక దురుద్దేశంతో నడుపుతున్న కథే లిక్కర్ స్కాం. కట్టుకథల ఛార్జిషీట్ను కోర్టు కూడా వెనక్కు పంపినా సిట్కు బుద్ధి రాలేదు. జగన్ వెంట ఉంటున్నాడని చెవిరెడ్డి, ఆయన కుమారుడిని వేధిస్తున్నారు. చెవిరెడ్డి కుటుంబం విపరీతమైన దైవభక్తి ఉన్న కుటుంబం. ప్రభుత్వానికి టాక్స్లు కడుతూ వ్యాపారాలు చేసినా సిట్ తప్పుపడుతోంది..భూములు కొన్నా, అమ్మినా కూడా స్కాం అని ఎల్లోమీడియా రాస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలతోనే ఛార్జిషీట్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఉండటం లేదు. రూ.11 కోట్ల విషయంలో కోర్టుకు సిట్ దొరికిపోయారు. తప్పుడు కథలు చెప్తే కోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ నీళ్లు నమిలింది. ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పుడు ఇక మధ్యవర్తుల పాత్ర ఎలా ఉంటుంది?. అసలైన లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం..ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలపడతాం. ఎంత అణచివేయాలని చూస్తే అంతగా పైకి ఎదుగుతాం. సరైన ఆధారాలు చూపే శక్తి సిట్కు లేదు. అసలు స్కామే జరగనప్పుడు ఇక ఆధారాలు ఎలా ఉంటాయి?. ప్రజలను నమ్మించాలనుకుంటే అది జరగదు. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. పర్మినెంటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ని ఈ మూడేళ్లలో కట్టగలరా?. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతారా?. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అమ్మేస్తారా?. కులాల మధ్య చిచ్చు పెట్టటం జనసేనకే అలవాటు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తోంది?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. -
బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..
బొద్దుగా ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం కష్టమేమో అనుకుంటారు. కొందరి అధిక బరువు.. వామ్మో! ఇంత లావు అనేలా ఉంటుంది. అంతలా లావుగా ఉండి కూడా చాలా స్మార్ట్ లుక్లోకి మారిపోవడమే కాదు వెయిట్లాస్ అవ్వాలనుకునే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందంటే..హీరోని తలపించేలా అతడి ఆహార్యం అత్యంత అందంగా మారిపోయింది. తనకు ఇదెలా సాధ్యమైందో కూడా ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. మరి అంతలా బరువు తగ్గేందుకు అతడు ఏం ట్రిక్ ఫాలో అయ్యాడో సవివరంగా తెలుసుకుందాం..!ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తున్న అతడి స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..ఆ యువకుడే ఫిట్నెస్ ఔత్సాహికుడు నమన్ చౌదరి. బరువు తగ్గడం బోరింగ్గా, క్లిష్టంగా ఉండకూడదని చెబుతున్నాడు. కేవలం తెలివిగా తినడం ఎలాగో తెలుసుకుంటే చాలు వెయిట్లాస్ అవ్వడం చాలా సులభమని చెబుతున్నాడు. అందుకోసం తాను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ..నిబద్ధతో ఉండటం నేర్చుకోవాలని చెబుతున్నాడు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి, ఆకలిని నియంత్రించడమే కాకుండా కొవ్వు తగ్గడానికి మద్దతిస్తుందని చెబుతున్నాడు. ఆ విధంగానే తాను మూడేళ్లలో 150 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకున్నాని, అలా మొత్తం 76 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. అంతేగాదు బరువు తగ్గడానికి ఉపకరించిన తన ప్రోటీన్ భోజన ప్రణాళికను కూడా పంచుకున్నాడు.ప్రోటీన్ ఫుడ్ ప్లాన్..ఉదయం అల్పాహారం (400 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)ఎంపిక 1: 4 గుడ్డులోని తెల్లసొన + ఉల్లిపాయలు, టమోటాలతో గిలకొట్టిన ఆమ్లెట్, క్యాప్సికమ్ పాలకూరతో 50 గ్రా పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ టోస్ట్.ఎంపిక 2 (గుడ్లు లేకుండా): కూరగాయలతో 60 గ్రా సోయా ముక్కలు స్టైర్-ఫ్రై, 50 గ్రా తక్కువ కొవ్వు పనీర్ గ్రిల్, ఒక చిన్న మల్టీగ్రెయిన్ టోస్ట్.లంచ్ (350 కిలో కేలరీలు, 30 గ్రా ప్రోటీన్)లంచ్ కోసం, ఇది తేలికగా ఉంచడం గురించి కానీ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండాలి. అతను 100 గ్రాముల సోయా ముక్కలు కర్రీ, 100 గ్రాముల ఉడికించిన బ్రోకలీ, ఒక చిన్న రోటీని ఎంచుకున్నాడు.సాయంత్రం స్నాక్ (200 కిలో కేలరీలు, 20 గ్రా ప్రోటీన్)చిప్స్ లేదా స్వీట్లకు బదులుగా, నామన్ 150 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్ టిక్కాను ఎంచుకున్నాడు, పెరుగు, నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసిన లేదా వేయించినది.డిన్నర్ (350 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)నామన్ డిన్నర్ కోసం ఉడికించిన పప్పు (పప్పు), వేయించిన టోఫు లేదా పనీర్, కూరగాయలు దోసకాయ, టమోటా సలాడ్ ఒక చిన్న రోటీ తీసుకున్నట్లు తెలిపాడు.రోజువారీ మొత్తంకేలరీలు 1300–1400 కిలో కేలరీలు, దాదాపు 120 గ్రా ప్రోటీన్తో ఉంటాయి. ఇదే నమన్ కడుపు నిండి ఉండటానికి తోడ్పడింది. పైగా అతని వ్యాయామాలకు ఇంధనంగానూ, కండరాలను కోల్పోకుండా కొవ్వును కరిగించడానికి సహాయపడింది. నామన్ పంచుకున్న వాటిలాగే ప్రోటీన్ అధికంగా ఉండే తేలికైన భోజనం తినడం వల్ల కొవ్వు తగ్గడం వాస్తవికంగా స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా విపరీతమైన డైట్స్ అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ అధికంగా, సమతుల్య పద్ధతిలో తింటే బరువు అదుపులో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Naman Chaudhary (@sweat_with_nc) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..) -
Train Ticket: రైల్వే శాఖ కొత్త రిజర్వేషన్ విధానం
రైలు ప్రయాణికులకు అలర్ట్. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ కొత్త నిబంధన అమల్లోకి తెస్తుంది. న్యూఢిల్లీ: జనరల్ టిక్కెట్ల రిజర్వేషన్కు బుక్కింగ్స్ మొదలైన మొదటి 15 నిమిషాలను ఆధార్ ధ్రువీకరణ ఉన్న యూజర్లను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. రైలు ఏదైనా బుక్కింగ్స్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వేషన్ చేయించుకునే టిక్కెట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.‘ఉదాహరణకు ఒక రైలు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు బయలుదేరనుంది. ఆ రైలుకు రిజర్వేషన్లు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే, మొదటి 15 నిమిషాలు ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారికే రిజర్వేషన్ చేసుకునే అవకాశముంటుంది’అని వివరించింది. ఇప్పటి వరకు తత్కాల్ (Tatkal) రిజర్వేషన్లకు మాత్రమే ఈ నిబంధన ఉండేది.రిజర్వేషన్ విధానం ప్రయోజనాలు సాధారణ వినియోగదారునికి కూడా అందేందుకు, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ సోమవారం ఒక సర్క్యులర్లో వివరించింది. కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ఏజెంట్లకు ప్రస్తుతమున్న మొదటి 10 నిమిషాల నియంత్రణ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. చదవండి: జేఈఈ లేకుండానే.. ఐఐటీలో సీటు! -
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఒక్క పాటతో ఫేమస్ అయిన యువకుడు రాము రాథోడ్. ఆ ఒక్క సాంగ్ అతని జీవితాన్నే కాదు.. కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్.. రాను బొంబాయి రాను అంటూ ఫోక్ సాంగ్ ప్రియులను ఓ ఊపు ఊపేశాడు. ఈ పాటతో డబ్బులు సంపాదించడమే కాదు.. ఏకంగా బిగ్బాస్ ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ ఏడాది తెలుగు బిగ్బాస్ సీజన్-9లో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తమ కుమారుడికి దక్కిన ఘనతపై రాము రాథోడ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాము రాథోడ్ బిగ్బాస్కు వెళ్లిన తర్వాత రాము రాథోడ్ పేరేంట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా కష్టాలు చూసిన రాము.. ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. రాను బొంబాయికి రాను.. అనే పాట రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. పుణె, ముంబయిలో మేము పడిన కష్టాలను చూసిన రాము రాథోడ్కు.. ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.మేము పెంకుటిల్లులో ఉండేవాళ్లమని.. చాలా పేదరికంలో బతికామని వెల్లడించారు. సెలవుల్లో పుణె, ముంబయికి వచ్చి మాతో పాటు రాము కూడా పనులు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. ముంబయిలో కూడా హిందీ పాటకు డ్యాన్స్ చేస్తే కప్పు కూడా వచ్చిందన్నారు. అప్పటి నుంచి రాముకు మేమే టీవీ, టేప్ రికార్డర్, సౌండ్ బాక్స్ కొనిచ్చి ఇంటివద్దనే విడిచి ముంబయికి వెళ్లామని అన్నారు.లాక్ డౌన్లో రాము ఈ పాటలను రాయడం మొదలు పెట్టాడని పేరేంట్స్ తెలిపారు. నువ్వు వేరే పనిచేయలేవు.. నీకు నచ్చింది పని చేస్కో అన్నామని అతని తల్లి తెలిపింది. ఫస్ట్ సొమ్మసిల్లి అనే సాంగ్ రాశాడని వెల్లడించింది. ఆ తర్వాత చాలా పాటలు రాశాడని పేర్కొంది. అలా తన పాటలు మొదలెట్టిన రాము రాను బొంబాయికి రాను.. అంటూ సాంగ్తో ఫేమ్ తెచ్చుకోవడమే కాదు.. తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపాడు. కాగా.. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు. -
ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు మెరుపు వేగంతో పరిగెత్తి రికార్డులు కొల్లగొట్టిన ఈ అథ్లెట్.. ఇప్పుడు పట్టుమని పది మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతున్నాడట.తొమ్మిది స్వర్ణాలుఉసేన్ బోల్టే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. 100 మీ., 200 మీ.. 4*100 మీ రిలేలలో మూడు ఒలింపిక్స్లో మూడేసి చొప్పున తొమ్మిది స్వర్ణాలు గెలిచిన ఘనత ఉసేన్ బోల్ట్ది. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్లో బోల్ట్ ఈ మేరకు పతకాలు గెలుచుకున్నాడు.అయితే, అనూహ్య రీతిలో 2017లో బోల్ట్ అథ్లెటిక్ ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 4*100 మీ రిలేలో పాల్గొన్న బోల్ట్.. కండరాలు పట్టేయడంతో సగం దూరంలోనే కుప్పకూలిపోయాడు. అథ్లెటిక్స్ ట్రాక్పై బోల్ట్ అద్భుత ప్రయాణం చివరకు అలా ముగిసిపోయింది.నాకేమీ పనిలేదుఇక బోల్ట్ ఇప్పుడు తన కుటుంబంతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. ది గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పిల్లలు స్కూల్కు వెళ్లే సమయంలో.. వారిని చూసేందుకు నిద్రలేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా.నిజానికి చేయడానికి నాకేమీ పనిలేదు. అలా చిల్ అవుతూ ఉంటా అంతే!.. కొన్నిసార్లు వర్కౌట్లు చేస్తుంటా. మూడ్ బాగుంటే వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటా. పిల్లలు వచ్చేంత వరకు ఇలా టైమ్పాస్ చేస్తా.ఇంట్లోనే సినిమాలు చూస్తాఆ తర్వాత సమయమంతా వాళ్లతోనే.. నాపై విసుగు వచ్చేంత వరకు వారితో ఆడుతూనే ఉంటా. ఆ తర్వాత ఇంట్లోనే సినిమాలు చూస్తా. ఇక జిమ్లోనే ఎక్కువగా వర్కౌట్లు చేస్తా. కానీ అదైతే నాకు పెద్దగా ఇష్టం ఉండదు.ఆయాస పడుతున్నాకాకపోతే తప్పక వర్కౌట్లు చేస్తా. నిజానికి నేను రన్నింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. మెట్లు ఎక్కేటపుడు శ్వాస సరిపోవడం లేదు. ఆయాస పడుతున్నా. అందుకే ఇకపై మరింత శ్రద్ధగా వర్కౌట్లు చేసి నా బ్రీత్ను సరి చేసుకుంటా’’ అని ఉసేన్ బోల్ట్ చెప్పుకొచ్చాడు.కాగా జమైకన్ ఇన్ఫ్లూయెన్సర్ కాసీ బెనెట్తో చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు 39 ఏళ్ల బోల్ట్. ఆమె ద్వారా.. అతడికి కూతురు ఒలింపియా (2020), కవల కుమారులు థండర్- సెయింట్ (2021) కలిగారు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనా
నిర్దిష్ట వయసు దాటిన వాహనాలను ప్రజా రహదారులపై నడపడం నిషిద్ధం. ఇలాంటి వాహనాలను స్క్రాపేజ్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. దీనికోసం స్క్రాపేజ్ సెంటర్లు కూడా పుట్టాయి. ఈ సెంటర్లలో పాత వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేస్తారు.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన లైట్ వెయిట్ మోటర్ వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు పైబడినవి 34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) అంచనాల ప్రకారం.. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకు వాహనాల జీవితకాలం ముగియనుంది. వీటన్నింటిని అలాగే వదిలేస్తే.. అవి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. గాలి, నీరు, మట్టిని కూడా కాలుష్యం చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు.. 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్క్రాపింగ్ విధానం సవ్యంగా అమలు కావడానికి.. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. దీంతో స్క్రాప్ కొనుగోలు చేసే కంపెనీలు చెల్లించాల్సిన జీఎస్టీ తగ్గింది. ఇది రీప్లేస్మెంట్ వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణహితమైన విధానాలను ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్భారత్లోనే అతి పెద్ద రీసైక్లింగ్ వ్యవస్థఆసియాలోనే అగ్రగామి సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్ సంస్థ రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ఆర్ఈఎస్ఎల్) రీ కర్మ (Re Carma), భారత్లోనే అతి పెద్ద ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ వ్యవస్థగా ఆవిర్భవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ జాఝర్లోని రిలయన్స్ మోడల్ ఎకనమిక్ టౌన్షిప్లో గల రీ కార్మ ఫ్లాగ్షిప్ అధునాతన కేంద్రం ఏడాదికి 30,000 కంటే ఎక్కువ వాహనాలను (ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, ఎర్త్మూవింగ్ ఎక్విప్మెంట్ మొదలైనవి) తుక్కు చేస్తోంది. ఈ హబ్ కాకుండా, రీ కర్మ దేశవ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ, భాగస్వాముల నెట్వర్క్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. -
కేబుల్ వైర్ చాలు ముఖం పచ్చడే... ఖుష్బూ స్ట్రాంగ్ రిప్లై
బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ కుమార్తె, బాలీవుడ్ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు. తన ఇన్ స్ట్రాగామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది. బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్ వైర్ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్ చేశారు.మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.బాలీవుడ్ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్ లైన్లోని విల్లా నంబర్ 40 వెలుపల మోటారుబైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్పూర్లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్ సిందూర్తో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకునేందుకు పాక్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025 -
ఇంగ్లండ్లో భారత్–పాక్ మ్యాచ్లు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ప్రొ లీగ్ కొత్త సీజన్ ఈ డిసెంబర్లోనే మొదలవుతుంది. 2025–26కు సంబంధించిన ప్రొ లీగ్ డిసెంబర్ 9 నుంచి అర్జెంటీనా, ఐర్లాండ్లలో జరుగుతుందని హాకీ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో ఐర్లాండ్ మహిళల జట్టు, పాకిస్తాన్ పురుషుల జట్టు కొత్తగా చేరుతున్నాయి. ఈ రెండు జట్లు నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి అర్హత సాధించినట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. వచ్చే సీజన్ మొత్తం 10 దేశాల్లో జరుగనుంది. రికార్డుస్థాయిలో 144 మ్యాచ్లు నిర్వహించనున్నారు. భారత్లో ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ 23 నుంచి 28 మధ్య ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఈ లీగ్లో విజేతగా నిలిచిన జట్లు 2028 ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్ 9న జరిగే పురుషుల ఈవెంట్ తొలి మ్యాచ్లో జర్మనీతో బెల్జియం తలపడుతుంది. దీంతో పాటు ఇంగ్లండ్ ఆడే మ్యాచ్లు కూడా ఐర్లాండ్లోనే జరుగుతాయి. అదే రోజు అర్జెంటీనాలో జరిగే మ్యాచ్లో ప్రస్తుత చాంపియన్ నెదర్లాండ్స్తో పాకిస్తాన్ ఢీకొంటుంది. అనంతరం చైనా, స్పెయిన్, ఆ్రస్టేలియా, భారత్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో జూన్ 28 వరకు లీగ్ దశ మ్యాచ్లే జరుగుతాయి. -
‘విజయవాడ ఉత్సవ్’ స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,వియవాడ: ‘విజయవాడ ఉత్సవ్’ స్థలవివాదంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాలకు దేవాదాయ భూమి ఇవ్వొద్దని సూచించింది.గొల్లపూడిలోని 40 ఎకరాల ఆలయ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయ భూమిని వాణిజ్యంగా ఎలా ఉపయోగిస్తారంటూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.గొల్లపూడిలో దేవాదాయశాఖ భూమిని వినియోగించొద్దని, గోల్ఫ్ కోర్సుకు ఐదెకరాల కేటాయింపు ప్రతిపాదన పై స్టే విధించింది. దీంతోపాటు తాత్కాలిక ఉత్సవాలు కేటాయింపు పైనా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములను యధాతధంగా ఉంచాలని హైకోర్టు వెల్లడించించింది. -
నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..
జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్ని చూసి రతన్ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.ఈ నయా ట్రెండ్లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది. View this post on Instagram A post shared by झलक भावनानी ✨ (@jhalakbhawnani) ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్ దివంగత రతన్ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్ చేశారు. నిజానికి జెమిని యాప్లోని గూగుల్ డీప్మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్గా మార్చగల సాధనం. బాలీవుడ్ని తలపించేలా మన లుక్ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ క్రేజీ ట్రెండ్కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర. అలాంటి చీరలో తమ లుక్ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sock Talks (@socktalks.tv) (చదవండి: టేస్ట్ని మిస్ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!) -
టీమిండియా ‘బిగ్ లూజర్’?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్
టీమిండియా- పాకిస్తాన్ మధ్య ‘నో-షేక్హ్యాండ్ No- Shakehand)’ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాదులు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది. షేక్హ్యాండ్ లేకుండానే డ్రెసింగ్ రూమ్కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమను అవమానించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.మరోవైపు.. షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదని.. తమ ఆటగాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాను సమర్థిస్తూ భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ మాత్రం సూర్యకుమార్ సేనను విమర్శించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.టీమిండియా ‘బిగ్ లూజర్’?‘‘ఈ మ్యాచ్ ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఇండియా బిగ్ లూజర్గా మనకు గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వెళ్లిన పాకిస్తానీ జట్టు ప్రవర్తన జెంటిల్మేన్ గేమ్లో వాళ్లను అమరులుగా నిలిపితే.. భారత జట్టు మాత్రం పరాజితగా మిగిలిపోతుంది’’ అని పాంటింగ్ అన్నట్లుగా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదుఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్పై భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పాంటింగ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘సోషల్ మీడియాలో నా పేరు చెప్పి వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.నేను అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు. అసలు ఆసియా కప్ టోర్నమెంట్ గురించి నేను ఇంత వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు’’ అంటూ పాక్ నెటిజన్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా పాంటింగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.ఐపీఎల్తో విడదీయరాని అనుబంధంకాగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్గా పేరొందిన పాంటింగ్కు ఐపీఎల్తో విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు హెడ్కోచ్గా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. గతేడాది పంజాబ్ కింగ్స్కు మార్గనిర్దేశనం చేశాడు. అతడి గైడెన్స్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఫైనల్ చేరింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
నేను గుండంకుల్ అంటే.. మీరన్నది ఏంటి?.. మాస్క్ మ్యాన్కు స్ట్రాంగ్ కౌంటర్
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. అప్పుడే హౌస్లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు కాస్తా సైలెంట్గా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనగానే ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. అగ్రెసివ్గా ఉన్న కంటెస్టెంట్స్లో హౌస్లో మాస్క్ మ్యాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనొక్కడే అందరిపై నోరు పారేసుకుంటున్నారని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.అయితే రెండో వారంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్ను మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్కు కమెడియన్ ఇమ్మాన్యూయేల్ గట్టిగానే కౌంటరిచ్చాడు. నామినేషన్స్లో భాగంగా హరీశ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటని హరీశ్ను ఇమ్మాన్యుయేల్ నిలదీశాడు. ఇది విన్న మాస్క్ మ్యాన్ నేను మిమ్మల్ని అనలేదంటూ మాట్లాడారు. దీనికి ఇమ్మాన్యూయేల్ సైతం రెచ్చిపోయి ముందుకు దూసుకెళ్లారు. నేను కూడా అన్నది మిమ్మల్ని కాదని..నన్ను నేనే అనుకున్నానని అన్నారు.దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. మీరన్నదానికి ప్రూఫ్ ఉందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. లిమిట్స్లో ఉండాలంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా గట్టిగా కేకలు వేస్తూ ఇమ్మాన్యుయేల్ వైపు దూసుకెళ్లాడు హరీశ్. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హాట్హాట్గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.High voltage nominations! 🔥Real opinions revealed, #SumanShetty breaks his silence! 👁️💣Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/hzGJhuRkjL— JioHotstar Telugu (@JioHotstarTel_) September 16, 2025 -
అనురాగ్ యూనివర్శిటీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ మధ్య ఒప్పందం
అనురాగ్ యూనివర్సిటీ, ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా.. ఎంఎస్ఎన్ ఉద్యోగుల కోసం అనురాగ్ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన బ్రిడ్జ్ కోర్సు (MSN Labs Bridge Course) నిర్వహిస్తారు.ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, అతిథుల స్వాగతంతో ప్రారంభమైంది. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హెడ్, కార్యక్రమ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ సవితా బెల్వాల్, సెల్ఫ్-డైరెక్టెడ్ టీమ్స్ (SDT) బ్రిడ్జ్ కోర్సు గురించి వివరించారు. ఈ కోర్సును MSN ల్యాబ్స్తో కలిసి ఉద్యోగుల జ్ఞానం, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ధ్యేయంగా రూపొందించారు.ఈ సందర్భంగా డాక్టర్ సవితా బెల్వాల్ మాట్లాడుతూ.. "ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్తో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం పరిశ్రమ-విద్యాసంస్థల సహకారానికి ఒక బలమైన ఉదాహరణ. ఈ బ్రిడ్జ్ కోర్సు ద్వారా, మేము శిక్షణ పొందుతున్నవారికి సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు, ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా వారు పరిశ్రమ అవసరాలకు సిద్ధమయ్యేలా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఫార్మా రంగంలోని వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమ, విద్యాసంస్థలు నిరంతరం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకునే నమూనాను సృష్టించడమే మా లక్ష్యం" అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమకు సంబంధించిన శిక్షణా మాడ్యూళ్లను రూపొందించడం, లెక్చర్లు, ల్యాబొరేటరీ సెషన్లను నిర్వహించడం, శిక్షణ పొందుతున్నవారి పురోగతిని, మూల్యాంకనాలను పర్యవేక్షించడం వంటివి చేస్తుంది.ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ హెచ్ఆర్ (ఏపీఐ) హెడ్ అయిన కె. ఎల్. ఎన్. మూర్తి మాట్లాడుతూ.. "భారతదేశంలో ఫార్మా ప్రతిభను అభివృద్ధి చేయడానికి అనురాగ్ యూనివర్శిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థతో భాగస్వామ్యం అవసరం అని మేము బలంగా భావించాం. ఈ సహకారం మా నూతన ఉద్యోగులు సరైన సైంటిఫిక్ పరిజ్ఞానం, ఆచరణాత్మక శిక్షణ, సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలతో తమ వృత్తి జీవితంలో సులభంగా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని మనం కలిసి తయారు చేస్తున్నాం" అని పేర్కొన్నారు.అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్, పరీక్షల విభాగం, విద్యార్థి వ్యవహారాల డీన్స్తోపాటు ఎల్ అండ్ డీ (లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్) డైరెక్టర్ అయిన జావిద్ జమాల్ సమావేశంలో ప్రసంగించారు. పరిశ్రమకు సిద్ధంగా ఉండే నిపుణులను తయారు చేయడంలో విద్యాపరమైన తోడ్పాటు ఎంత ముఖ్యమో వారు తమ ప్రసంగంలో నొక్కి చెప్పారు.ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్తో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం ఫార్మా రంగంలో అనురాగ్ యూనివర్శిటీకి రెండో ముఖ్యమైన సహకారం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య దీర్ఘకాలిక సమన్వయాన్ని పెంపొందించడానికి యూనివర్శిటీ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి విద్యార్థులకు, శిక్షణ పొందుతున్నవారికి ఆచరణాత్మక నైపుణ్యాలు, అనుభవం, ఫార్మా కెరీర్లలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి. -
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా టీడీపీ నేతల బాగోతాన్ని ఎండగట్టారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సీఐడీతో విచారణ చేయించగలరా? అంటూ ప్రశ్నించారు‘‘2024 ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తుల విలువ రెండు కోట్లు. కొల్లు రవీంద్ర కోటి రూపాయలు చందా ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం కోటి చందా ఇచ్చే స్తోమత ఉందా మీకు. వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా?. వీకెండ్కు హైదరాబాద్, రెండు నెలలకోసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా?. దుబాయ్కి వెళ్లిన పాస్ పోర్టు, వీసా చూపించే దమ్ముందా?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘మచిలీపట్నంలో డిఫ్యాక్టో మంత్రి, ఎమ్మెల్యే.. టీడీపీ నేత గోపిచంద్. గొర్రిపాటి గోపీచంద్ తెర వెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నాడు. గొర్రిపాటి గోపీచంద్ బందర్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. బైపాస్లో దేవుడి ఆస్తి కాజేశానని నాపై విష ప్రచారం చేస్తున్నారు. 2006లో ఆక్షన్లో గోపీచంద్, అతని భార్య పాల్గొన్నారా? లేదా?. గోపీచంద్ భార్య రాజేశ్వరి పేరుతో చలానా కట్టారా.. లేదా?.’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 594.95 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో.. 82,380.69 వద్ద, నిఫ్టీ 169.90 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 25,239.10 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. కొఠారి ప్రొడక్షన్, రవీందర్ హైట్స్, రెడింగ్టన్, లక్ష్మీ డెంటల్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరాయి. శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, మాగ్నమ్ వెంచర్స్, థెమిస్ మెడికేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత గడ్డపై తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన ఆస్ట్రేలియా యువ సంచలనం
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్స్టాస్ భారత గడ్డపై తన తొలి మ్యాచ్లోనే మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. 19 ఏళ్ల ఈ ఆసీస్ యువ ఓపెనర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టులో భాగంగా భారత్లో పర్యటిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తనుశ్ కోటియన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది మూడంకెల మార్కును తాకాడు. మొత్తంగా 126 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్స్టాస్కు జతగా మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (88) కూడా సెంచరీని సమీపించాడు. కెల్లావే 73 పరుగుల వద్ద ఉండగా.. 56 పరుగుల వద్ద ఉండిన కొన్స్టాస్ వేగంగా సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆసీస్-ఏ స్కోర్ 198/0గా ఉంది. భారత బౌలర్లు 37 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ను కూడా పడగొట్టలేకపోయారు. టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తనుశ్ కోటియన్, హర్ష్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక్కడే ఆసీస్-ఏ ఓపెనర్లను కాస్త నిలువరించగలిగాడు.ఈ మ్యాచ్లో ఆసీస్-ఏ జట్టుకు నాథన్ మెక్స్వీని కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. కొన్స్టాస్, జోష్ ఫిలిప్, కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, టాడ్ మర్ఫీ లాంటి గుర్తించదగ్గ ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. భారత-ఏ జట్టు విషయానికొస్తే.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ఎన్ జగదీషన్, దేవ్దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ తుది జట్టులో ఉన్నారు.ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ల కోసం భారత-ఏ జట్లను ఇదివరకే ప్రకటించారు. బుమ్రాతో గొడవతో హైలైటైన కొన్స్టాస్కొన్స్టాస్ గతేడాది భారత్తో జరిగిన మెల్బోర్న్ టెస్ట్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనే అర్ద సెంచరీతో సత్తా చాటిన కొన్స్టాస్.. తన రెండో టెస్ట్లోనే (సిడ్నీ) టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవపడి మరింత హైలైట్ అయ్యాడు. -
రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఎస్యూవీ విక్టోరిస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్షోరూం). ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ తదితర 21 వేరియంట్స్లో లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 చొప్పున వస్తున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటివరకు 10,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు.సెప్టెంబర్ 22 నుంచి విక్టోరిస్ అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మిడ్–సైజ్ ఎస్యూవీ మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు -
శ్రీ మహావిష్ణు విగ్రహామే.. బెదిరిస్తే భయపడేటోన్ని కాదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని.. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిన పరిణామంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది. అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఆది శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది?. శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుంది. కాబట్టి.. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు?. వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులయ్యాం అని మీరు చెప్పుకుంటున్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యాను నేను. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా వాస్తవాలే చెబుతుంటాను నేను. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి నాపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు. రాజకీయాలు కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం. నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని భూమన ఉద్ఘాటించారు. -
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'ఓజీ'. పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే గ్లింప్స్, తొలి పాటతో హై తీసుకొచ్చారు గానీ తర్వాత వచ్చిన సాంగ్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్)రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేస్తున్నారు. అంతెందుకు పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు'కి కూడా రిలీజ్ ముందురోజు రాత్రి షోలు వేశారు. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటంతో మూవీ ఫలితం బెడిసికొట్టింది. దీంతో పోలిస్తే 'ఓజీ'పై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండొచ్చని కొన్నిరోజుల క్రితం టాక్ వినిపించింది. కానీ ఇప్పుడవి లేవని అంటున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువజామున 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్చొచని టాక్. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే గ్యాంగ్స్టర్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాత. (ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!) -
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్ టీమిండియా జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ‘డ్రీమ్ 11’తో కటీఫ్కాగా ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ ఇటీవలే భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ను అనుసరించి.. డ్రీమ్ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఒక్కో మ్యాచ్కు రూ. 4.5 కోట్లుఅయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్ 11 జెర్సీ స్పాన్సర్గా ఉండి.. ఒక్కో మ్యాచ్కు రూ. 4 కోట్లు చెల్లించింది.కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్, బిర్లా ఓప్టస్ పెయింట్స్ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్ తమ బిడ్ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. -
మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన టీమిండియా స్టార్ ప్లేయర్
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరింది. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన మంధన.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రాణించి (58 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) 7 అదనపు రేటింగ్ పాయింట్లను సాధించింది. తద్వారా తన పాయింట్ల సంఖ్యను 735కు పెంచుకుని టాప్ ర్యాంక్కు చేరింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ను కిందకు దించి, కెరీర్లో నాలుగో సారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 2019లో తొలిసారి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్న మంధన.. ఈ ఏడాది జూన్, జులైల్లో కూడా స్వల్ప కాలం నంబర్ వన్ వన్డే బ్యాటర్గా కొనసాగింది. ప్రస్తుతం మంధనకు రెండో స్థానంలో ఉన్న బ్రంట్కు కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ వారం ఆసీస్తో జరుగబోయే మరో రెండు వన్డేల్లో మంధన ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. మంధన కీలక సమయంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నెలాఖరు నుంచి (సెప్టెంబర్ 30) భారత్, శ్రీలంకల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకడం ఆమెకు మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది. తాజా ర్యాంకింగ్స్లో మంధనతో పాటు మరో ఇద్దరు భారత బ్యాటర్లు కూడా లబ్ది పొందారు. ప్రతీక రావల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానానికి.. హర్లీన్ డియోల్ 5 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకారు. మిగతా భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ 12వ స్ధానంలో.. జెమీమా రోడిగ్రెజ్ 15 స్థానంలో, దీప్తి శర్మ 24వ స్థానంలో, రిచా ఘోష్ 37 స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి ఎగబాకింది. మరో భారత బౌలర్ దీప్తి శర్మ 3 స్థానాలు దిగజారి 7వ ర్యాంక్ను పడిపోయింది. మిగతా భారత బౌలర్లలో రేణక సింగ్ ఠాకూర్ 26, క్రాంతి గౌడ్ 62, అరుంధతి రెడ్డి 65, పూజా వస్త్రాకర్ 77, శ్రీ చరణి 83, ప్రియా మిశ్రా 85, టైటాస్ సాధు 91, సైమా ఠాకోర్ 96 స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్నర్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకోగా.. హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో ఉన్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 4వ స్థానంలో ఉంది. -
‘ఒక్క క్లిక్తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.నానో బనానాగూగుల్ గత నెలలో జెమిని యాప్కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.సారీ ట్రెండ్..సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.నకిలీ వెబ్సైట్లు.. అనధికార యాప్లు..‘ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్సైట్లు లేదా అనధికార యాప్ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్తో చెప్పారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ -
మళ్లీ తెరపైకి పని గంటల వివాదం: నెటిజన్లు ఫైర్!
వారానికి 72 గంటల పని వాదనలు సద్దుమణిగాయి అనుకునేలోపే.. మళ్లీ ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఏఐ స్టార్టప్ మెర్కోర్లో పనిచేస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వారానికి 72 నుంచి100 గంటలు పనిచేసిన తన అనుభవాన్ని పంచుకున్న తర్వాత ఇది చర్చకు దారితీసింది.మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ప్రణవ్ మెహతా.. అన్ని కాలాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని అభివర్ణిస్తూ, వారానికి 72 గంటల పని అంటే మొదట్లో కొంత భయంగా అనిపించవచ్చు. అప్పుడప్పుడు ఇది 100 గంటలకు కూడా విస్తరిస్తుందని పేర్కొన్నాడు. వారానికి 40 గంటల పని, అనుకున్న లాభాలను అందించదని అన్నారు. మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ చేసిన పోస్ట్కు ప్రతిస్పందనగా మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ.. కంపెనీ ఆదాయం 17 నెలల్లోనే 1 నుంచి 500 మిలియన్లకు పెరిగింది. దీనిని ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని పేర్కొన్నాడు. కంపెనీ ఇప్పుడు 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానంవారానికి 72 గంటల పనిపై ప్రణవ్ మెహతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకతకు దారితీశాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అధిక పని గంటలను కీర్తించడాన్ని విమర్శించారు. ఇంత ఎక్కువ గంటలు పనిచేయడం వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఒకరు ప్రశ్నించగా.. ఎక్కువ పనిగంటలు వల్ల తలెత్తే ఇబ్బందులను గురించి పట్టించుకోరా, మీ ఉద్దేశం ఏమిటి? అని మరొకరు అన్నారు.Fastest growing company of all time.The 72-hour work week might sound daunting at first (occasionally stretches to 100)But the growth, the learning curve, the pace- is truly unmatched.A comfy 40-hour week won't offer the same upside. Not the same energy, not the same… https://t.co/m3K4xTWVBn— Pranav Mehta (@i_pranavmehta) September 15, 2025 -
కిమ్.. ‘క్రీమ్’.. బంద్
సంచలనాలకు నెలవైన ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐస్ క్రీం అనేది ఇక ఆ దేశంలో వినిపించకూడదని నిర్ణయించారు. ఈ తరహా నిర్ణయాలు కిమ్ గతంలోనూ తీసుకున్నాడని చదివే ఉంటారు. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా తెలిసే ఉండొచ్చు. మరి ఐస్ క్రీంపై కిమ్కు ఎందుకు కోపమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఐస్క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదమే. కానీ, ఇప్పుడది కొరియా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు ఆ పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్.డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య (Western) పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే.. టూర్ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ విధంగా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుండి దూరంగా కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్బర్గ్ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి. ఉల్లంఘిస్తే.. ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ-సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు. కొసమెరుపు..ఎస్కిమోలు.. ఈ పదం ఎక్కడైనా విన్నట్లు ఉందా?.. అలస్కా, కెనడా, గ్రీన్లాండ్, సైబీరియా.. అర్కిటిక్ రీజియన్లోని మంచు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు. అయితే.. ఇప్పుడా పదం అవుట్డేటెడ్ అయ్యింది. కొన్ని తెగలు ఆ పదాన్ని అభ్యంతరకరంగా కూడా భావిస్తున్నాయి. అందుకే ఈ పదం పెద్దగా వినియోగంలో కనిపించడం లేదు. అలాంటిది ఈ పదం ఇప్పుడు నార్త్ కొరియాలో ప్రముఖంగా వినిపిస్తుండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇంగ్లీష్ నుంచి నేరుగా పదాన్ని తీసుకోవద్దనే ప్రయత్నంగా కనిపిస్తోంది. కిమ్.. కొన్ని సంచలన నిర్ణయాలువిదేశీ వినోదం.. మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించారు.మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్వర్క్లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడం నిషేధంహాట్డాగ్లపై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం నిషేధించారు. ఇది "దేశద్రోహం"గా పరిగణించబడుతోంది.బుదాయ్-జిగే (Korean-American fusion dish) నిషేధం: దక్షిణ కొరియా నుండి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించబడుతోంది.ఆధ్యాత్మిక స్వేచ్ఛపై.. మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను పూర్తిగా నిషేధించారు.జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు కిమ్ గత పాలకులు కిమ్ ఇల్-సంగ్ , కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదుహెయిర్స్టైల్, లెదర్జాకెట్లపై నిషేధం: కిమ్ ప్రభుత్వానికి నచ్చని హెయిర్స్టైల్లు వేసుకోవడం నేరంగా మారింది. ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైల్లే అనుమతించబడ్డాయి. అలాగే కిమ్ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్ స్టయిల్ను ఫాలో అయినా సరే అది నేరమే. అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. పైనే చెప్పుకున్న నేరాలన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటికి పాల్పడినవారిని శ్రమ శిబిరాలకు పంపించడం సాధారణంగా మారింది. అక్కడ వారు జీతం లేకుండా, భద్రత లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ అదే నేరాన్ని కిమ్ తీవ్రంగా భావిస్తే మాత్రం.. అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకోవాల్సిందే!. -
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్గానే స్టార్ హీరోయిన్!
చిత్రపరిశ్రమలో ప్రేమ వివాహాలు ఎంత కామనో.. విడాకులు అంతే కామన్. జీవితాంతం కలిసి ఉంటామంటూ గ్రాండ్గా పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులకు అప్లై చేసిన జంటలు చాలానే ఉన్నాయి. ఇక లవ్ బ్రేకప్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ప్రేమలో పడి..అలా విడిపోయిన వారు పదుల సంఖ్యల్లో ఉన్నారు. ప్రేమ, పెళ్లిళ్లపై విరక్తి కలిగి ఒంటరి జీవితమే బెటర్ అనుకొనే‘స్టార్స్’ సైతం ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి సల్మా ఆఘా(Salma Agha) ఒకరు. నలుగురితో ప్రేమాయణం నడిపి..ముగ్గురిని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ నటి..పర్సనల్ లైఫ్ ఓ విషాద ప్రేమకథ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది.1982లో వచ్చిన ‘నికాహ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మా.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ‘దిల్ కే ఆర్మాన్’ అనే పాటను కూడా ఆలపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘బాబీ’, ‘కోబ్రా’, ‘ఫూలన్ దేవి’'పతీ పత్నీ ఔర్ తవైఫ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించింది.ఇలా కెరీర్ పరంగా వరుస విజయాలతో ‘స్టార్’ హీరోయిన్గా ఎదిగిన సల్మా..వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస పరాజయాలే అందుకుంది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పడు లండన్ వ్యాపారవేత్త అయ్యాజ్ సిప్రాతో ఆమె ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు రిలేషన్లో ఉన్నా.. అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ నటుడు జావేద్ షేక్ని పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తర్వాత స్క్వాచ్ ప్లేయర్ రెహ్మత్ ఖాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 2011లో దుబాయ్ వ్యాపారతవేత్త మంజర్ షాని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చింది. 67 ఏళ్ల వయసు ఉన్న సల్మా ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఉంటుంది. -
కీ చెయిన్ కెమెరా.. ధర ఎంతంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్ సైజ్లో ఉండే కంప్యూటర్ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్కేస్ సైజ్లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్’ సైజ్లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.కొడాక్ చార్మెరా ఫీచర్లు..ఇది ఒక మినీ కెమెరా.దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.దీన్ని ‘బ్లైండ్ బాక్స్’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.1.6 మెగా పిక్సెల్ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్లో ఫొటోలు (1440×1440) సేవ్ చేస్తుంది.30fps ఈవీఐ వీడియోఎస్సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్యూఎస్బీ టైప్-C ఛార్జింగ్.మైక్రో ఎస్డీ స్లాట్ (128GB వరకు)ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి.. ఆటోను తగులపెట్టిన వ్యక్తి
మహబూబ్ నగర్ క్రైం: తనకు వారసత్వంగా వచ్చిన భూమికి విరాసత్ చేయకుండా గత కొన్ని రోజుల నుంచి రెవెన్యూ అధికారులు వేధింపులకు గురి చేయడంతో విసిగిపోయిన ఓ ఆటో డ్రైవర్ మొదట ఆటోపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఆ తర్వాత భార్యాపిల్లలపై పెట్రోల్ పోయడానికి యత్నించే క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహన దారులు పెట్రోల్ బాటిల్ను తీసుకున్నారు. వివ రాల్లోకి వెళితే... దేవరకద్ర మండలం బస్వాయిప ల్లికి చెందిన మాల శంకర్కు తన తండ్రి నుంచి 1ఎకరం 3 గుంటల భూమి వారసత్వంగా వచ్చిం ది. ఈ భూమిని విరాసత్ చేయడానికి 5 ఏళ్ల కిందట నుంచి దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయినా అధికారులు నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది మార్చిలో భూమికి సంబంధించిన ఓఆర్సీ హక్కులు సైతం శంకర్కు వచ్చాయి. దీనిని ఆన్లైన్ నమోదు చేసి మ్యాన్వల్ గా ఓఆర్సీ సర్టిఫికెట్, పట్ట దారు పాస్పుస్తకం ఇవ్వాలని మూడు నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలతగలబడిన ఆటోసిపోయాడు. చివరకు సోమవారం సాయంత్రం తనకు సంబంధించిన ఆటోను పాలమూరు పట్ట ణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పెట్రోల్ పోసి తగ లబెట్టాడు. ఆ తర్వాత కొంత పెట్రోల్ను భార్య, ముగ్గురు అమ్మాయిలపై పోయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనదా రులు అడ్డుకున్నారు. మొదట ఆటోలో ఉన్న కుటుం బ సభ్యులను బయటకు దించి వెంట తెచ్చుకున్న పెట్రోలు ఆటో పై పోసి ఆ తర్వాత నిప్పు అంటిం చడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలా నికి టూటౌన్ పోలీసులు, మహబూబ్నగర్ రెవెన్యూ అధికారులు చేరుకుని వివరాలు సేకరిం చారు. మహబూబ్నగర్ ఆర్బన్ డీటీ దేవేందర్ఐదేళ్లుగా తిరుగుతున్నాడుమాల శంకరు వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయడం కోసం ఐదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఇటీవల ధరణిలో రావడంతో అప్పటి నుంచి పాసు పుస్తకంతో పాటు ఓఆర్సీ సర్టిఫికెట్ కోసం దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బులు ఖర్చు చేసుకు న్నాడు. ఇటీవల ధరణిలో నమోదు కావడం తో ఓఆర్సీ, పట్టాదారుపాస్ పుస్తకం మ్యాన్ వల్ గా ఇవ్వడానికి దేవరకద్ర తహసీల్దార్. కార్యాలయంలో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని విసిగిపోయాడు. ఈ ఘట సపై దేవరకద్ర ఆరని 'సాక్షి' వివరణ కోరగా మాల శంకర్ 45రోజుల కిందట భూ భారతిలో దరఖాస్తు చేసుకున్నాడని. దీనిపై విచారణచేసి ఫైల్ తహసీల్దారు ఇచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ సంత కాలు చేసి ఫైల్ ఆర్డీఓ కార్యాలయానికి పార్వర్డ్ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఫైల్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మహబూబ్ నగర్ ఆర్డీఓకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబా టులోకి రాలేదు.ఆధ్వర్యంలో రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందించారు. -
నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?.. ఆమెతో హార్దిక్ పాండ్యా డేటింగ్?
టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్తో బిజీగా ఉన్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆల్రౌండర్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.తొలుత యూఏఈతో మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన హార్దిక్.. పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. సయీమ్ ఆయుబ్ రూపంలో కీలక వికెట్ కూల్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన హార్దిక్.. సాహిబ్జదా ఫర్హాన్ (40), మొహమ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్లు అందుకుని ఫీల్డర్గా తన వంతు పాత్ర పూర్తి చేశాడు.ఇక పాక్ విధించిన 128 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ హార్దిక్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో రూ. 22 కోట్ల ధర కలిగిన వాచ్ ధరించి హాట్ టాపిక్ అయ్యాడు.మూడుసార్లు పెళ్లితాజాగా హార్దిక్ పాండ్యా రిలేషన్షిప్నకు సంబంధించి మరో వార్త తెరమీదకు వచ్చింది. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన హార్దిక్.. ఆమెను పెళ్లాడాడు. వీరికి కుమారుడు అగస్త్య సంతానం. అయితే, కోవిడ్ సమయంలో ఘనంగా పెళ్లి చేసుకోలేకపోయామన్న లోటు లేకుండా.. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో కుమారుడి ముందే ఈ జంట వివాహం చేసుకుంది.జాస్మిన్కు కూడా గుడ్బై?ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడాకులు తీసుకున్నామంటూ గతేడాది ప్రకటన విడుదల చేసి అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత నటాషా కొన్నాళ్లు సెర్బియా వెళ్లిపోగా.. ఇంతలో హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇవి నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, హార్దిక్ జాస్మిన్కు కూడా గుడ్బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అతడు మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహీక శర్మతో హార్దిక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పరస్పరం సోషల్ మీడియాలో ఫాలో కావడంతో పాటు.. మహీక ప్రతీసారి హార్దిక్కు సంబంధించిన హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?ఇక హార్దిక్ పాండ్యా తాజా ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న వేళ.. అతడి మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన సాంగ్ క్లిప్ వైరల్ అవుతోంది. ‘‘నీ గర్ల్ఫ్రెండ్ నాలా హాట్గా ఉండాలని కోరుకోవా.. నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఫ్రీక్గా ఉండాలని కోరుకోవా?’’ అంటూ సాగే లిరిక్స్కు పెదాలు కదుపుతూ నటాషా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది. View this post on Instagram A post shared by @angreziedaaru -
‘అల్లుడు’ నీ పరుగులేం అక్కర్లేదు.. పాక్ ప్లేయర్పై అఫ్రిది ఫైర్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం అంతా పాక్ చెత్త ప్రదర్శన గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంతరం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అఫ్రిది బౌలింగ్ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు."షాహీన్ బ్యాటింగ్లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ షాహీన్ నుంచి నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్ నుంచి నేను బౌలింగ్ను కోరుకోను.అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు -
'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్
సినిమాలు తీయడం అనేది జూదం లాంటిది. వస్తే భారీ లాభాలు. లేదంటే భారీ నష్టాలు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సక్సెస్, కోట్ల కొద్దీ కలెక్షన్ వస్తుంటాయి. తాజాగా రిలీజైన సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్' ఎంతలా సంచలనం సృష్టిస్తుందో చూస్తునే ఉన్నాం. దీని కంటే ముందు రిలీజైన ఓ మలయాళ చిత్రం కూడా ఊహించని వసూళ్లతో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ఈ మూవీ గురించి హీరో కమ్ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)'నిర్మాతగా 'లోక' కోసం పెట్టిందంతా నష్టపోతానని అనుకున్నాను. స్టోరీ బాగా నచ్చింది. మంచి సినిమా అవుతుందని తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. మలయాళంలో ఇంత బడ్జెట్ చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. థియేటర్లలో రిలీజ్ చేద్దామంటే డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. లోక ఫ్రాంచైజీ మొదలుపెడితే సీక్వెల్స్తో లాభాలొస్తాయని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే రిలీజ్ చేశాం. కానీ ఈ సక్సెస్ మాత్రం ఊహించలేదు. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్తో సెన్సేషన్ సృష్టిస్తోంది. మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది' అని దుల్కర్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో సినిమా ఇది. తెలుగులోనూ దీన్ని 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు గానీ ఇక్కడ ఓ మాదిరిగానే లాభపడింది. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు కాగా.. ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)"As Producer, we thought that we'll lose money on #Lokah😳. we know it's good film, but Budget is high & Buyers are not interested🙁. I thought if this franchise is established, we might do profit🤞. But this success was unimaginable🥶♥️"- #DulquerSalmaanpic.twitter.com/pmy1Bum8a1— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2025 -
విజయ్ ఎన్నికల బస్సుకు అదే నంబర్.. గుండెను కదిలించే స్టోరీ తెలుసా?
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరో 6 నెలల్లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యేకమైన ఒక బస్సును కొనుగోలు చేశారు. ఆ వాహనానికి తీసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ వైరల్గా మారింది. తన జీవితంలో ఎంతో సెంటిమెంట్గా మిగిలిపోయిన సంఘటన ఈ నంబర్ను సూచిస్తుంది.విజయ్ కొనుగోలు చేసే కారు ధర ఎంత ఉన్నా సరే నంబర్ మాత్రం మారదు.. తన వద్ద ఉన్న ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ ఉంటుంది. TN 14 అనేది సాధారణం. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నంబర్ ప్లేట్ కూడా TN 14 AS 0277 ఉండటం విశేషం. అతని వాహనాలపై 14-02-77 రూపంలో ఒక తేదీని ఎల్లప్పుడూ సూచిస్తుంది.ఈ నంబర్ వెనుక విజయ్ సెంటిమెంట్ స్టోరీ ఉంది. విజయ్ చెల్లెలు విద్య అదే 14-02-1977లో జన్మించింది. అయితే, 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే ఆమె మరణించింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. విజయ్ వద్ద ఇప్పటికే TN 14 AH 0277, TN 14 AL 0277, TN 14 AM 0277, TN 14 AS 0277 నంబర్ ప్లేట్లతో వాహానాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Nithin Barath SR (@theactorvijayteamoff) -
రుచికరంగా..ఆరోగ్యంగా తిందాం ఇలా..!
ఆరోగ్యంగా తినాలంటే ఉప్పు , గ్లూకోజ్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ మన నాలుక టేస్ట్ కావాలంటూ..పోషకాలు లేని ఆహారంవైపే పరుగులు తీస్తుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసి, అధికం సోడియంతో ఉండే వాటినే మనసు కోరుకుంటుంది. ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకూడదంటే చక్కెర, ఉప్పు తగ్గించడం తప్పనిసరి. మరి ఇలా నాలుకను కట్టేసేలా టేస్ట్ లెస్గా తినడం అందరి వల్ల కాదు. అలాంటప్పుడు ఇలా తెలివిగా రుచిని మిస్ కాకుంకా, పోషకాలు పోకుండా ఆరోగ్యంగా తినాంటే ఇలా ట్రై చేయండని చెబుతున్నారు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జమునా. మరి అదెలాగో తెలుసుకుందామా..!.రుచిని కోల్పోకుండా సంతృప్తికరంగా తినాలనకుంటే ఉమామి రుచి బెస్ట్ అంటున్నారామె. అదేం రుచి అంటే..ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్ని ఎలివేట్ చేసేలా రిచ్నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. అంటే ఉప్పు తక్కువగా ఉన్న మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే చప్పిడి భోజనం తిన్నామనే ఫీల్ రాదట. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకే తక్కువ సోడియం ఉన్న ఆహారాలకు ఉమామి రుచిని పెంచే పదార్థాలను జోడిస్తే..ఆహారం రుచికరంగా మారుతుంది, ఆరోగ్యకరంగా తినే అవకాశం ఉంటుందని జపన్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో అధికంగా ఉండే గ్లూటామేట్ సంతృప్తిని అందించి, స్నాక్స్ అవసరాన్ని తగ్గిస్తుందట. అందుకోసం..ఉమామి రుచి కోసం మోనోసిడియం గ్లూటామేజ్(ఎంఎస్జీ)ని ఉపయోగిస్తారట. ఇది సహజ పదార్థాల నుంచే తయారవతుంది. పెరుగు లేదా వెనిగర్ తయారీకి ఉపయోగించే పద్ధతిలో తయారు చేయడం లేదా చెరుకు లేదా టాపియోకా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారట. ఇందులో ఉప్పులోని సోడియం కంటెంట్ కంటే తక్కువగా, పైగా ఉప్పుకి ప్రత్యామ్నాయంగా ఉంటుందట. పైగా ఇది భోజనాన్ని మితంగా తినేలా చేస్తుంది. అదీగాక ఇంద్రియాలతో రుచిని అనుభవించే మనకు జిహ్వ చాపల్యం శాపంగా మారకుండా ఉమామి రుచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందట. ఫలితంగా రుచిని కోల్పోకుండా పోషకాహారాలను కచ్చితంగా తీసుకోగలుగుతారు.చివరగా ఉమామి రుచి కోసం గ్లూటామేట్ అధికంగా ఉండే కూరగాయలు ప్రతిసారి జోడించడం కుదరనప్పుడూ పైన చెప్పిన కృత్రిమ ఈ ఎంఎస్జీ రుచితో కూడిన మసాలా ఉప్పు ఉయోగపడుతుంది. పోషకాహరం పేరుతో పాక రుచిని కోల్పోకుండా తెలివిగా తినే విధానమే ఇది అని చెబుతున్నారు మాజీ ప్రోఫెసర్ జమునా.డాక్టర్ జమునా ప్రకాష్ ఫుడ్ కన్సల్టెంట్, మాజీ ప్రొఫెసర్, మైసూర్ విశ్వవిద్యాలయం(చదవండి: ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!) -
‘నా భార్య గర్భవతి.. ఇప్పుడు శవం దగ్గరకు పోవద్దంట’
ఒకప్పుడు మృతదేహాన్ని మోయడాన్ని పుణ్యంగా భావించేవారు. ఎవరైనా చనిపోయినపుడు బంధుమిత్రులే కాదు.. ముఖ పరిచయం ఉన్నవారు సైతం అంత్యక్రియల్లో పాల్గొనేవారు. కాసేపైనా పాడెను మోసేవారు. కనీసం ఓ చేయితో పాడెను పట్టుకుని నాలుగడుగులన్నా వేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి చాలామంది ఇష్టపడడం లేదు. శవాన్ని మోయడానికి దగ్గరి బంధువులూ ముందుకు రావడం లేదు. దీంతో ‘ఆ నలుగురి’ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెరిగిన సాంకేతికతతో ఓవైపు ప్రపంచమే కుగ్రామంగా మారిపోగా.. మరోవైపు మనుషుల మధ్య మాత్రం దూరం పెరిగిపోతోంది. గతంలో ఎవరో తెలిసిన వారు చనిపోతేనే తల్లడిల్లిపోయిన గుండెలు.. ఇప్పుడు దగ్గరి వారు దూరమైతే కనీసం అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. మనుషుల్లో పెరిగిన స్వార్థం కావచ్చు, మూఢ విశ్వాసాలు కావచ్చు.. చా వు దగ్గరకు వచ్చేసరికి దగ్గరి వాళ్లు సైతం దూరంగా ఉంటున్నారు. ఎంత బలగం ఉన్నా, ఎంతమంది ఆ త్మీయులు ఉన్నా అంత్యక్రియలకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. వచ్చిన వారు కూడా దూరం నుంచే చూసి వెళుతున్నారు. ఏదో కొద్దిమంది మా త్రమే అంత్యక్రియలు అయ్యేదాకా ఆగుతున్నారు. వారు కూడా దూరంగా ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తున్నారు.పెరిగిన మూఢత్వంఇప్పుడు మనుషుల్లో తెలియని మూఢత్వం పెరిగిపోయింది. చాలామంది శవం దగ్గరకే రావడం లేదు. దూరం నుంచి కుటుంబ సభ్యులకు ముఖం చూపించి వెళుతున్నారు. మరికొందరు వచ్చామా, వెళ్లామా అన్నట్టుగా ఉంటున్నారు. పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులు కరువవుతుండడంతో ప్రతిచోటా శవాలను తీసుకువెళ్లేందుకు వైకుంఠరథాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇంటి దగ్గరి నుంచి వైకుంఠరథం దగ్గర దాకై నా మోయాల్సిందే కదా.. అలాగే దింపుడుగల్లం నుంచి వైకుంఠధామం వరకు మోసుకు వెళ్లాల్సిందే కదా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురి అవసరం ఎంతో ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో శవం మోయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో నలుగురు జమయ్యే దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.పట్టణాలు, నగరాల్లో మరీ దయనీయం..గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు కొంతమందయినా హాజరవుతున్నారు. శవాన్ని మోయడానికి ఇబ్బందులు ఎదురవడం లేదు. అయితే పట్టణాలు, నగరాల్లో అయితే దయనీయమైన పరిస్థితి ఉంటోంది. ఎవరైనా చనిపోతే ఇంటి చుట్టుపక్కల వారు కూడా పట్టించుకోవడం లేదు. బంధువులు వచ్చేదాకా ఇంటి దగ్గర నలుగురు జమ కావడం లేదు. ఏర్పాట్లు చేయాలని ఎవరూ ముందుకు రావడం లేదు. బంధువులు, స్నేహితులు వచ్చినా, ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు ఇంట్లో నుంచి శవాన్ని పాడైపె పడుకోబెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.ఇంటికొకరు నిబంధన..అంత్యక్రియల సమయంలో ఎవరూ ఉండకపోవడంతో కొన్ని కుల సంఘాలు కట్టుబాట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని కాలనీలలో కుల సంఘాలు ఎక్కువగా చావుల కోసమే నిలబడుతున్నాయి. సంఘంలో సభ్యులుగా ఉన్న వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలన్న నిబంధనలు పెడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర, అంత్యక్రియలకు వెళుతుండగా మార్గమధ్యలో, అలాగే వైకుంఠధామం వద్ద.. ఇలా మూడు, నాలుగుసార్లు హాజరు తీసుకుంటున్నారు. అయితే శవాన్ని మోయాలన్న నిబంధన పెడితే రావడం కూడా తగ్గిపోతుందని ఆ ఒక్కటి మినహాయించినట్టు ఓ కుల సంఘం పెద్దమనిషి ‘సాక్షి’తో పేర్కొన్నారు.విచిత్రమైన కానణాలతో..దగ్గరి బంధువులు చనిపోయినా సరే కొందరు పాడె మోయడానికి ఏవో కారణాలు చెబుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఒక పెద్దాయన చనిపోగా దగ్గరి బంధువు ఒకరు దూరాన నిల్చుని చూస్తున్నాడు. పిలిచినా దగ్గరికి రాకపోవడంతో ఒకాయన అతడి వద్దకు వెళ్లి ‘మీ దగ్గరి వాళ్లు కదా.. శవం మోయడానికి ఎవరూ లేరు. నాలుగు అడుగులు మోయరాదే’ అని బతిమాలాడు. ‘నేను మొన్ననే ఇంటి నిర్మాణానికి గడప ఎక్కించిన. చావుకే వెళ్లొద్దని అందరు అంటున్నా ఇక్కడిదాకా వచ్చిన. శవం మోయద్దటా’ అని సమాధానం చెప్పి మెల్లిగా జారుకున్నాడు.మరో సంఘటనలో ఓ వ్యక్తి శవాన్ని మోయడానికి రావాలని అందరూ పిలుస్తుంటే ‘మొన్ననే నా బిడ్డ పెళ్లి అయ్యింది. కాళ్లు కడిగిన. శవం మోయద్దని అంటున్నరు. అందుకే దూరంగా ఉన్న’ అని మరణించినతని వంశానికి చెందిన వ్యక్తి సమాధానమిచ్చాడు.ఇంకోచోట ఓ వ్యక్తి చనిపోయాడు. రోజూ కలిసి తిరిగిన దోస్తు మాత్రం మృతదేహం దగ్గరికి వచ్చి దూరంగా నిల్చున్నాడు. దోస్తు అమ్మా, నాన్నను ఓదార్చడానికి కూడా వెళ్లలేదు. ఇద్దరు రోజూ కలిసి తిరిగేవారు కదా.. ఎందుకు రావడం లేదు అని అడగ్గా.. ‘నా భార్య గర్భవతి. ఇప్పుడు శవం దగ్గరకు పోవద్దంట. శవాన్ని మోయద్దంట. అందుకే దూరంగా ఉన్న’ అని చెప్పాడు.కొన్నాళ్ల క్రితం జిల్లాలో ఒకాయన చనిపోతే దగ్గరి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఒకాయన రాకపోవడంతో ఆయనకోసం ఎదురుచూడసాగారు. ఫోన్లు చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. చివరికి తేలింది ఏమంటే సదరు వ్యక్తి ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. మరో వారంలో గృహ ప్రవేశం ఉంది. అందుకే ఆయన అంత్యక్రియలకు రాలేదు. ఇలా ఏదో ఒక సాకుతో దగ్గరివారి అంత్యక్రియల్లోనూ చాలామంది పాల్గొనడం లేదు. చివరి చూపు కోసం వచ్చినా పాడె మోయడానికి ముందుకు రావడం లేదు. -
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. తాజాగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ మాజీ క్రికెటర్లను ఈడీ విచారించనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఈ నెల 22న ఉతప్ప, 23న యువరాజ్ సింగ్లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ దావన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. -
ఏ ప్రాంతం ఏ జోన్లోనో..?
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ వరకు భవన నిర్మాణాలు, లే అవుట్ల కోసం హెచ్ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. కానీ ఈ అనుమతులపైన నిర్మాణసంస్థలు, ‘రియల్’ వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.‘మాస్టర్ప్లాన్–2050 ’రూపొందించకుండానే ఇస్తున్న అనుమతుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటే ఆర్థికంగా భారీగా నష్టపోవలసి రావచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అందజేస్తున్న అనుమతులకు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని, కొత్తగా తయారుచేస్తున్న మాస్టర్ప్లాన్కు అనుగుణంగానే అనుమతులను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా జోన్ల మార్పుపైన వివిధ వర్గాల నుంచి ఆందోళన వెల్లువెత్తుతోంది. అప్పటి మాస్టర్ప్లాన్ అమల్లోకి రావడానికి ముందే కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా భావించి అపార్ట్మెంట్లు, భవన నిర్మాణ లే అవుట్లకు అనుమతులను ఇచ్చారు. కానీ ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని నివాసిత స్థలాలు కన్జర్వేషన్ జోన్లోకి మారాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి మాస్టర్ప్లాన్ ప్రకారం నివాసిత మండలాల జాబితా లోంచి కన్జర్వేషన్ జోన్లోకి మారిన ప్రాంతాలను తిరిగి నివాసిత జోన్లోకి మార్చేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చిందని,ప్రస్తుతం మాస్టర్ప్లాన్–2050 అమల్లోకి రాకుండానే ఇప్పుడు ఇచ్చే అనుమతుల వల్ల మరోసారి అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకీ సమస్య.. మాస్టర్ప్లాన్–2050కి అనుగుణంగానే ప్రస్తుతం అనుమతులను అందజేస్తున్నట్లు అధికారులు భరోసాను ఇస్తున్నారు. కానీ వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపైన కొంత గందరగోళం నెలకొంది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా పులిమామిడి ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఓ బడా నిర్మాణ సంస్థ వేసిన లే అవుట్లకు హెచ్ఎండీఏ అనుమతులను అందజేసింది. కానీ ఆ తరువాత అమల్లోకి వచ్చిన మాస్టర్ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతమంతా కన్జర్వేషన్ జోన్లోకి మారిపోయింది. దీంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కన్జర్వేషన్ నుంచి మరోసారి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చుకొనేందుకు స్థలాల కొనుగోలుదార్లు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చింది. ఒక్క పులిమామిడి ప్రాంతంలోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో అప్పటి మాస్టర్ప్లాన్లోని లోపాలపైన ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, తదితర జలవనరులకు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ జోన్లలోని స్థలాల మార్పు కోసం హెచ్ఎండీఏ అధికారులు దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల జలవనరులు ఉన్న ప్రాంతాలు కూడా నివాసిత మండలాల జాబితాలోకి మారిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్–2030 స్థానంలో కొత్తగా రానున్న మాస్టర్ప్లాన్–2050 నేపథ్యంలో హెచ్ఎండీఏ అనుమతులపైన గందరగోళం నెలకొంది. మాస్టర్ప్లాన్ లక్ష్యం ఏంటి.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రాబోయే ఇరువై ఐదు సంవత్సరాలను లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) కోసం మాస్టర్ప్లాన్–2050 ను రూపొందిస్తున్నారు. హైదరాబాద్నగరాన్ని ప్రపంచంలోని 10 అగ్రగామి గ్లోబల్నగరాల పక్కన నిలిపే లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధికి అనుగుణంగా మెగామాస్టర్ప్లాన్కు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలోనిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అభివృద్ధి ప్రణాళికల కోసం హెచ్ఎండీఏ ఈ కసరత్తు చేపట్టింది. ఈ మెగామాస్టర్ప్లాన్ మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటిది ఆర్థికమండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఆర్థికాభివృద్ధి ప్రణాళిక (ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్) కాగా, రెండోది హైదరాబాద్ మెట్రో ఏరియా వరకు రహదారులు, మౌలిక సదుపాయలు, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, జలనరులు, అర్బన్ఫారెస్ట్లు, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రణాళిక బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు వివిధ దశల్లో ఉన్నాయి. అనుమతులు తారుమారైతే ఎలా..‘వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కొత్త మాస్టర్ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అనుమతులను ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ అనుమతులు తారుమారైతే పరిష్కారమేంటనే దానిపైన మాత్రం స్పష్టత లేదు.’ అని షాద్నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు తెలిపారు. ఇటీవల తాము 10 ఎకరాల్లో లే అవుట్ అనుమతులు తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ జోన్లోకి మారుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రాంతం ఆర్ధిక మండలాల జాబితాలోకి, లేదా బ్లూగ్రీన్ జోన్లోకి మారినా తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నారు. అడవులు, జలవనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 3.5 కోట్లు దాటే అవకాశం ఉంటుందనే అంచనాలతో ఈ విస్తరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడిస్తోన్న నిర్మాణరంగ అనుమతులపైన మరింత స్పష్టత రావలసి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
పాద నమస్కారం కోసం విద్యార్థులకు దెబ్బలు.. టీచర్ సస్పెండ్
మయూర్భంజ్: విద్యార్థులకు మంచిచెడులు బోధించాల్సిన ఉపాధ్యాయులలోని ఒకరిద్దరు అప్పుడప్పుడు తప్పుడు పనులు చేస్తూ, వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు పాద నమస్కారం చేయలేదని 31 మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయురాలు కొట్టింది.మయూర్భంజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం ప్రార్థనల తర్వాత, ఆ ఉపాధ్యాయురాలు 6, 7, 8 తరగతుల విద్యార్థులను కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక విద్యా శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వారు విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయురాలిని దోషిగా తేల్చారు.మయూర్భంజ్ జిల్లాలోని బెట్నోటి బ్లాక్ పరిధిలోని ఖండదేయులా ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరగగా సదరు ఉపాధ్యాయురాలు అక్కడ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాని సమాచారం. గ్రామస్తుల కథనం ప్రకారం ఉదయం ప్రార్థనల తర్వాత 6, 7, 8 తరగతుల విద్యార్థులు తమ తరగతి గదులకు వెళ్లినప్పుడు వారు తనకు పాదనమస్కారం చేయనందుకు వారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయురాలిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టి, ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. -
‘బడాయి మాటలు తప్ప చంద్రబాబు చేసిందేమీలేదు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేంది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని వైఎస్సార్సీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 16) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శ్రీకాంత్రెడ్డి.. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదన్నారు. ‘ కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఎవరూ ప్రశాంతంగా బతకలేదు. చంద్రబాబు గత పాలనలో రాష్ట్రం మావోయిస్టులు, ఫ్యాక్షన్, హత్యలు, కరువుతో ఉండేది. వైఎస్ఆర్ సీఎం అయ్యాకనే మావోయిస్టులను కంట్రోల్ చేశారు. ఫ్యాక్షన్ వద్దని వ్యవసాయం వైపు జనాన్ని వైఎస్సారే మరల్చారు. ఐటీ తెచ్చానని బడాయి మాటలు చెప్పుకోవటం తప్ప చంద్రబాబు చేసిందేంటి?, రాష్ట్ర అభివృద్ధి, గ్రోత్ రేట్ చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయింది. కరోనా ఉన్నా జగన్ హయాంలో రాష్ట్ర గ్రోత్ రేట్ భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు ఆలోచించాలి. అది వదిలేసి 2047 విజన్ పేరుతో డ్రామాలు ఎందుకు?, జగన్ ప్రజల కోసం సచివాలయ వ్యవస్థ తెచ్చి పాలనను వారి ముంగిటకే తెచ్చారు. కానీ చంద్రబాబు వాట్సప్ పాలన అంటూ బిల్డప్ మాటలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.నాలుగు లక్షల పెన్షన్లు తొలగించి వృద్దులు, వికలాంగుల జీవితాలతో అనుకుంటున్నారు. విద్యా రంగంలో జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి రెండిటినీ పక్కన పెట్టేశారు. టమోటా, ఉల్లి సహా ప్రతి పంట సాగు చేసిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కనీసం యూరియా కూడా అందించలేని వ్యక్తి చంద్రబాబు. P4 అంటూ కిత్త కథ మొదలెట్టిన చంద్రబాబు ఎంతమంది జీవితాలను బాగు పర్చారు?, పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు, గ్రామీణ రోడ్ల మీద కూడా టోల్ పెట్టి డబ్బు వసూలు చేయబోతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా?. జగన్ మెడికల్ కాలేజీలను తెస్తే వాటిని ప్రయివేటు వారికి అమ్మేయటం చంద్రబాబుకే చెల్లింది. నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పే చంద్రబాబు విజనరీనా?, మెరుగైన విద్య, వైద్యం అందించిన జగన్ని విమర్శించే స్థాయి టీడీపీకి లేదు. ఎన్నీ అభివృద్ది కార్యక్రమాలు చేసినా జగన్ పబ్లిసిటీ చేసుకోలేదు. చంద్రబాబు ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి, యాభై ఏళ్ల మహిళలకు పెన్షన్లు, ఆడబిడ్డనిధి వంటివేవీ చేయకుండానే అన్నీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకోవటం చంద్రబాబుకే చెల్లింది. అమరావతిలో నీరు తోడే కార్యక్రమం తప్ప ఇంకేం జరుగుతోంది?, ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.2 వేల కోట్ల పైన బకాయి పెట్టారు. నెట్ వర్క్ ఆస్పత్రిల్లో వైద్యం అందక పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఇవేమీ చంద్రబాబు కంటికి కనడకపోవటం దారుణం’ అని శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్
భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని పాదుర్లో రూ.5,700 కోట్ల వ్యయంతో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (ఎస్పీఆర్) యూనిట్ను నిర్మించనున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రైవేట్ రంగ సంస్థ ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చొరవ సాంప్రదాయకంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్న ఇంధన భద్రతలో పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది.వ్యూహాత్మక ముందడుగుఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ఎస్పీఆర్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారతదేశం అత్యవసర ముడి చమురు నిల్వలకు గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 5.33 ఎంఎంటీ వ్యూహాత్మక నిల్వలను పెంచడానికి ఈ సదుపాయం తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిల్వల ద్వారా పూర్తి సామర్థ్యంతో 8-9 రోజుల జాతీయ ముడి చమురు డిమాండ్ను తీర్చవచ్చు. కొత్త స్టోరేజీ అందుబాటులోకి వస్తే మరిన్ని రోజులు ఇంధన భద్రత ఉంటుందని చెబుతున్నారు.ఇది అమలులోకి వస్తే ప్రపంచ సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఊహించని డిమాండ్ పెరిగినా దేశ ఇంధన బఫర్కు తోడ్పడుతుంది. ఈ రిజర్వ్ను నిర్మించడానికి ఎంఈఐఎల్కు ఐదేళ్ల సమయం అవసరం అవుతుందని తెలిపింది. 60 సంవత్సరాల పాటు కంపెనీ దీని నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుత ప్రపంచ చమురు ధరల ప్రకారం ఈ కెపాసిటీలో ముడి చమురు నింపే ఖర్చు 1.25 బిలియన్ డాలర్లు (రూ.11,020 కోట్లు)గా అంచనా వేశారు. దాంతో ఇది భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడిగా నిలిచింది. ఈ స్టోరేజ్ యూనిట్ను కంపెనీ నేరుగా నిర్వహించవచ్చు లేదా ఇతర చమురు నిర్వహణ సంస్థలకు లీజుకు ఇవ్వొచ్చు.ప్రత్యేకతలు..మొదటి ప్రైవేట్ ఎస్పీఆర్: ఇంధన నిల్వల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని వైవిధ్యం చేస్తుంది.పబ్లిక్-ప్రైవేట్ సినర్జీ: జాతీయ భద్రతతో అనుసంధానించిన మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా ప్రభుత్వ దృక్పథం మారడాన్ని ప్రతిబింబిస్తుంది.ఇంధన భద్రత: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశ చమురు నిల్వలకు కీలకంగా మారనుంది.వ్యూహాత్మక ప్రదేశం: పదుర్ ఇప్పటికే ఎస్పీఆర్ మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. ఇది లాజిస్టిక్, కార్యాచరణ సామర్థ్యాలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ప్రియురాలితో ఏకాంతంగా.. ఆ వీడియో భార్యకు పంపిన భర్త
అన్నానగర్: ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాళయం ప్రాంతానికి చెందిన సెంథిల్. అతని కుమార్తె కీర్తి మీనా(21). ఆమె తిరుప్పూర్కు చెందిన శివకుమార్ ను ప్రేమించి 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. తదనంతరం, శివకుమార్–కీర్తి మీనా దంపతులు తిరుప్పూర్ లోని ఇడువంపాళయంలోని శివశక్తి నగర్ 2వ రోడ్డు లో నివసించారు. వీరికి 2 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ స్థితిలో, శివకుమార్ మరొక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు. కీర్తి మీనా ఈ విషయంపై శివకుమార్ను ప్రశ్నించింది. తర్వాత ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ స్థితిలో కీర్తి శివకుమార్ వివాహేతర ప్రియురాలితో సరదాగా గడుపుతున్న వీడియోను మీనా సెల్ఫోన్ కు పంపాడు. ఆ వీడియో చూసి షాక్ అయిన కీర్తి మీనా తన బిడ్డను ఇంట్లో వదిలి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో వీరపాండి పోలీసులు శివకుమార్ను విచారిస్తున్నారు. -
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!
గుండె వ్యాధులు ఎక్కువగా పురుషులనే ప్రభావితం చేస్తాయని, అందులోనూ కరోనరి ఆర్టరీ డిసీజ్ వంటి గుండె సమస్యలు పురుషులకే అత్యంత ప్రమాదమని అనుకుంటారు అంతా. కానీ మహిళలకూ అంతే స్థాయిలో ప్రమాదం ఉంటుందట. వాళ్లు కూడా తరుచుగా ఆంజినా(ఛాతీనొప్పి) వంటి లక్షణాలను ఎదుర్కొంటారట. అయితే ఈ ఛాతీనొప్పిని మహిళలు తేలిగ్గా కొట్టిపారేయడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలపై కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీనొప్పిపై అవగాహన లేమి దీనంతటికి కారణమని అంటున్నారు. మరీ ఏంటి ఛాతీనొప్పి, దాని లక్షణాలు, ముందుస్తుగా ఎలా గుర్తించాలి తదితరాల గురించి వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.భారతదేశంలో చాలావరకు సంభవిస్తున్న మరణాల్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..2022లో భారతదేశంలో దాదాపు 4 మిలియన్లకు పైగా మరణాలు క్యాడ్ వల్లే సంభవించాయి. పైగా ఈ గణాంకాలు మహిళలకు ఈ వ్యాధిపై తక్షణ అవగాహన, సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం గురించి నొక్కి చెప్పాయి. అందువల్ల ఈ ఆంజినా పెక్టోరిస్ని(ఛాతీనొప్పి)ని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతంగా నిర్వహించడంపై మహిళలకి అవగాహన పెంచడం అనేది అత్యంత ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.ఆంజినా (ఛాతీనొప్పి) ఎలా ఉంటుందంటే..ఆంజినా అనేది క్యాడ్(CAD)కి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటారట. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. దీని వలన ధమనులు సంకోచించి, గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆంజినా లక్షణాలు ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలోకి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, చెమటలు పట్టడం వంటివి ఉండవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ కానప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న ఆ సమస్యల ఉత్పన్నమవ్వగానే సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోవడంతోనే ఈ ఆంజినా సవాలుగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ఈ సమస్య నిర్థారణలో చేస్తున్న జాప్యమే సమస్య తీవ్రతను పెంచి, అకాల మరణాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ నిర్లక్ష్యమే ఒక్కోసారి నిపుణులు సైతం అంతర్లీనంగా ఉన్నీ ఆంజినా సమస్యను పరిష్కరించకుండా ఇతరత్ర ఉపశమన పరిష్కారాలు అందించేలా చేసి, మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు. చికిత్స విధానం..OPTA(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) క్లినికల్ చెక్లిస్ట్, OPTA ప్రశ్నాపత్రం, OPTA విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా(ఛాతీనొప్పి) నిర్థారణకు కీలకమైనవి. ఇవి రోగ నిర్థారణకు, వైద్య నిర్వహణకు మద్దతిస్తాయి. పైగా వైద్యలకు సకాలంలో ఈ ఛాతీనొప్పిని నిర్థారించడంలో హెల్ప్ అవుతుంది. ఇది ఒకరకంగా ఆంజినా నిర్వహణపై తొలి అడుగుగా అభివర్ణించారు నిపుణులు.మహిళ్లలోనే ఈ వ్యాధిని గుర్తించలేకపోవడానికి రీజన్..మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏంటంటే..సహజంగా తాము తక్కువ ప్రమాదంలో ఉన్న అపోహనే ప్రధాన కారణమని చెబుతున్నారు అపోలా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సరితా రావు. అదీగాక గుండెజబ్బులు వంటి సమస్యలు తరుచుగా పురుషులే బారిన పడతారనేది నిజమే అయినప్పటికీ, పూర్తిగా మహిళలకు ఈ వ్యాధుల రావు అని అర్థం కాదని అంటున్నారు. అందువల్లే ఈ గుండె జబ్బుల ప్రమాదాలపై మహిళలకు అవగాహన కలిగించడం అత్యంత ప్రధానమని నొక్కి చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన హృదయ సంబంధ రోగుల్లో మహిళలే అధికమని చెప్పారు. ముఖ్యంగా ఆంజినా(ఛాతీనొప్పి)తో ముడిపడి ఉన్న గుండెజబ్బులు పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల మహిళలు ఈ వ్యాధిని తిప్పికొట్టేలా రోగ నిర్థారణ, సకాలంలో చికిత్స, నిర్వహణపై ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి మెరుగైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని అన్నారు.(చదవండి: Pain Relief Therapy: నొప్పిని పోగొట్టే ‘అయాన్’)