-
అమెరికా అది చేస్తే మద్దతు ఆపేస్తాం.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు. అయితే ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్కు సహకరిస్తుందని అమెరికా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. -
'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. టైటిల్ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. రజిత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్లో పాల్గోంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలలో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. "గత రెండు, మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తాచాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంలో కోహ్లిది కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లోనూ ఆర్సీబీ విరాట్ కీలకం కానున్నాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే -
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్తో వీడియో మొదలయింది. ఎమోషనల్గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
బీఆర్ఎస్లో కలకలం.. కౌశిక్రెడ్డిపై తిరుగుబాటు?
సాక్షి, కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ బీఆర్ఎస్లో కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్లో రహస్య సమావేశం సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామాలు చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకే భేటీ అంటూ ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది.సీనియర్ నాయకులు, మండల స్థాయి నేతలతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదనే చర్చ సాగుతోంది. పార్టీ మార్పా? బీఆర్ఎస్లోనే ఉంటూ ఎమ్మెల్యే కౌశిక్పై పోరాటమా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్లు, ఇతర నాయకులంతా వందమంది దాకా రహస్య భేటీకి హాజరయినట్లు తెలుస్తోంది. -
‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’
మదనపల్లె టౌన్ : ‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పటి వరకు పిల్లల ఆటపాటలతో మురిసిపోయిన వారికి రోడ్డు ప్రమాదం కడుపుకోత మిగిల్చింది. లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఘటనపై మృతుల కుటుంబీకులు, తాలుకా పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చీకిలబైలుకు చెందిన శివారెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలను అక్కడే చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉగాది పండుగ కోసం గురువారం చీకిలబైలుకు శివారెడ్డి భార్యా పిల్లలతో వచ్చాడు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు సమీపంలోని బల్తమూరులో ఉంటున్న తన తమ్ముడు శ్రీనివాసులురెడ్డిని చూడటానికి కొడుకు కుశల్రెడ్డి(10)ని వెంట తీసుకుని బైకులో వెళ్లాడు. తమ్ముడిని పలకరించి తిరిగి ఇంటికి తన కుమారుడు కుశల్రెడ్డితోపాటు తమ్ముడు శ్రీనివాసులురెడ్డి కుమారుడు భువనేశ్వర్రెడ్డి(6)ని వెంట తీసుకుని తిరిగి చీకిలబైలుకు బయలుదేరాడు. స్కూటర్ చీకిలబైలుకు రాగానే తన ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న స్పీడు బ్రేకరు వద్ద స్లో చేయడంతో వెనకనే వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివారెడ్డి ఒక వైపు, పిల్లలు మరో వైపు కింద పడడంతో.. పిల్లలపైకి లారీ దూసుకెళ్లి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక 50 మీటర్ల దూరం వెళ్లి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకునే వారని, లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే తాలుకా ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
సౌదీపై ఇరాన్ దాడుల్లో.. తెలంగాణ వాసి మృతి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన దాడుల్లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో, పశి్చమాసియా సంక్షోభం కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోగా మరొకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ శుక్రవారం చెప్పారు. తాజా మరణానికి దారి తీసిన కారణాలను మాత్రం ఆయన వివరించలేదు.భారత్లోని మృతుడి కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి రియాద్లోని లక్ష్యాలపై ఇరాన్ నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు కూలి్చవేశాయి. రియాద్లోని ఓ రిఫైనరీ సమీపంలో ఈ క్షిపణుల శకలాలు పడ్డాయి. శకలాలు తగలడంతోనే భారతీయుడు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.కాగా మృతిచెందిన వ్యక్తి తెలంగాణకు మహాబూబాబాద్కు చెందిన రవిగోపాల్గా సమాచారం. దీనిపై వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ " 18 వతారీఖు రాత్రి. 9.30 గంటలకు చివరి సారిగా రవితో మాట్లాడాము 20 నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్ కట్ అయ్యింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడే ఉన్న వేరేవారితోనూ మాట్లాడానికి ప్రయత్నించాము వారు సైతం కాల్లోకి రాలేదు" అని వారి కుటుంబసభ్యులు తెలిపారు.అయితే సౌదీపై జరిగిన దాడుల్లో రవి మరణించినట్లు మరుసటి రోజు రామ్ నివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కాగా కుటుంబంలో రవి ఒక్కరే ఉద్యోగం చేస్తారని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి నాలుగేళ్ల కుమారుడని పేర్కొన్నారు. దయచేసి అతని మృతదేహాన్ని తమకు అప్పగించాలని తమకు పరిహారం ఇప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భావన రైతుల్లో బలంగా ఉంది. కానీ, ఆ పిక్కకు అనుబంధంగా ఉండే ‘జీడిపండు’ రైతు ఆర్థిక స్థితిగతులను మార్చేయగల అద్భుత శక్తి అని వ్యవసాయ రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షలాది టన్నుల జీడిపండు వృథాగా నేలపాలవుతోందని, దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుత్తూరులోని ఐకార్-జీడి పరిశోధన డైరెక్టరేట్ (డీసీఆర్) నిర్వహించిన పరిశ్రమల ముఖాముఖి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.గణాంకాలు ఇలా..డీసీఆర్ డైరెక్టర్ జె.దినకర అడిగా సమర్పించిన వివరాల ప్రకారం, దేశంలో జీడిపండు వినియోగం అత్యల్పంగా ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 60 లక్షల టన్నుల జీడిపండు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వాడుతున్నారు. ఒక హెక్టారు జీడి తోటలో సగటున 1 టన్ను జీడిపిక్కలు లభిస్తే ఏకంగా 8 టన్నుల జీడిపండు లభిస్తుంది. అంటే మనం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న పిక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన, సాంకేతికత లేక వాటిని వృథా చేస్తున్నాం. జీడిపండు నుంచి రసం తీసిన తర్వాత మిగిలే పిప్పితోనూ ఆదాయం పొందే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో జీడిపండు పిప్పి పొడితో చేపల మేతను తయారు చేసే సాంకేతికతను డీసీఆర్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛమైన జీడిపండు రసం, పాశ్చరైజ్డ్ జ్యూస్, లిక్విడ్ స్వీటెనర్, జీడిపండు పిప్పి టీ వంటి వినూత్న ఉత్పత్తుల సాంకేతికతను డైరెక్టరేట్ సిద్ధం చేసింది.బ్రెజిల్ ఆదర్శంబ్రెజిల్ వంటి దేశాల్లో జీడిపండును అత్యధికంగా వినియోగించుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న స్థాయిలోనైనా ఈ ప్రయత్నం మొదలుపెడితే భవిష్యత్తులో ఇది పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వ సంస్థలు తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చేసేటప్పుడు వసూలు చేసే రాయల్టీలు స్టార్టప్లను నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. నామమాత్రపు ధరలకే సాంకేతికతను అందిస్తే యువత ఈ రంగంలోకి వస్తారు’ అని చెబుతున్నారు.కేవలం జీడిపిక్కల అమ్మకానికే పరిమితం కాకుండా జీడిపండును కూడా ఒక వాణిజ్య పంటగా గుర్తిస్తే రైతులకు ఇది బోనస్ ఆదాయం అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోయడం ఖాయం.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
గుడ్న్యూస్.. బంగారం బాగా తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
విడాకుల కేసు: అడ్వకేట్తో ఆమె సన్నిహితంగా..!
శంషాబాద్ రూరల్: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మహిళకు పరిచమైన ఓ అడ్వకేట్ ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు.. ఇది తెలుసుకున్న భర్త.. వారిద్దరూ కారులో వెళ్తుండగా బైక్పై వెంబడించాడు. ఈ క్రమంలో భర్తతో పాటు మరో వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అడ్వకేట్తోపాటు మహిళను పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్, ఝాన్సీ దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో భార్య దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది. ఝాన్సీ ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ నాగోల్లోని హాస్టల్లో నివాసముంటుంది. ఈ క్రమంలో మాధవరావు అనే అడ్వకేట్తో పరిచయమైంది. అతనితో సన్నిహితంగా ఉంటోందని నాగోలులో టీషాపు నిర్వహించే శివప్రసాద్ స్నేహితుడు కోడి నరేష్ గమనించి చెప్పాడు. దీంతో భార్య కదలికలను గమనించసాగారు. ఈ నెల 19న ఝాన్సీ ఉప్పల్ బస్స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా చూశారు. శివప్రసాద్, నరేష్ బైక్పై బస్సును వెంబడించారు. ఆరాంఘర్ చౌరస్తాలో బస్సు దిగిన ఝాన్సీ అక్కడ ఓ కారులో ఎక్కింది. వీరు కారును వెంబడిస్తూ మండలంలోని మేకలబండతండా శివారులో పీ–వన్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ కారును నిలపడంతో శివప్రసాద్ దగ్గరకు వెళ్లి మాట్లాడేప్రయత్నం చేశారు. అయితే కారును కొద్దిగా ముందుకు కదిలించి వేగంగా వెనక్కు వచ్చి ఇద్దరినీ ఢీకొట్టారు. ఈ ఘటనలో శివప్రసాద్, నరేష్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలో ఉన్న జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు మాధవరావు, ఝాన్సీని హత్యాయత్నం కేసులో శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా.. ముహూర్తం ఫిక్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని కోరుతున్నట్టు తెలిసింది. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.మరోవైపు.. జగిత్యాలలో జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. ఆయన మాతో చర్చించినవి అధిష్ఠానం ముందు ఉంచుతాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్తోనే కొనసాగుతారనే నమ్మకం మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇక, జగిత్యాలలో మంత్రులతో జీవన్ రెడ్డి భేటీ తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఈనెల మార్చి 25న జరిగే సమావేశం యథావిధిగా ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు.. నేను అనుసరిస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్యకర్తలంతా రెడీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు లాంఛనంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిర్ణయంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. -
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు మ్యాచ్లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో లేదు.ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది.జూలై 1- 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ ఈ పర్యటనను ఖరారు చేసింది. ఆ తర్వాత భారత జట్టు అక్కడ నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనుంది. భారత్, ఐర్లాండ్ జట్లు చివరిసారిగా టీ20 ప్రపంచకప్లో తలపడ్డాయి.చదవండి: IPl 2026: 'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు' -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారుల తొలగింపు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ వేటు వేసింది. ఎన్నారై (NRI) క్లయింట్లకు 'క్రెడిట్ సూయిస్ AT-1' బాండ్లను తప్పుదోవ పట్టించి విక్రయించినట్లు తేలడంతో బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు 2.4% మేర పతనమయ్యాయి.వేటు పడిన అధికారులు వీరే..దుబాయ్ బ్రాంచ్ ద్వారా జరిగిన ఈ బాండ్ల విక్రయ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు ఉన్నతాధికారులను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, ఈవీపీ (మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా & ఎన్నారై బిజినెస్) హర్ష్ గుప్తా, ఎస్వీపీ స్థాయి అధికారి పాయల్ మంధ్యాన్ ఉన్నారు.అసలేం జరిగింది?జనవరి 2025లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై బ్యాంక్ అంతర్గత విచారణ చేపట్టింది. దుబాయ్, బహ్రెయిన్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, భారత ఎన్నారై క్లయింట్లను తప్పుదోవ పట్టించి అధిక రిస్క్ ఉన్న AT-1 బాండ్లను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.క్లయింట్ల వద్ద ఉన్న ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లను ఈ బాండ్లలోకి మళ్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఈ బాండ్లను సురక్షితమైన 'ఫిక్స్డ్ మెచ్యూరిటీ' ఉత్పత్తులుగా ప్రచారం చేశారు. పెట్టుబడిదారుల నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, బాండ్లలోని రిస్క్ అంశాలను వారికి వివరించకుండా దాచిపెట్టారని విచారణలో తేలింది.రెగ్యులేటరీ చర్యలు - భారీ నష్టంక్రెడిట్ సూయిస్ బ్యాంక్ పతనం తర్వాత, యూబీఎస్ (UBS) నేతృత్వంలో జరిగిన బెయిలౌట్ సమయంలో ఈ AT-1 బాండ్ల విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. ఎన్నారైల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది.బ్యాంక్ వివరణ"మా యూఏఈ బ్రాంచ్లో క్లయింట్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలను గుర్తించాం. అంతర్గత విచారణ అనంతరం నిబంధనల ప్రకారం బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం" అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.ఏమిటీ AT-1 బాండ్లు?ఇవి ఈక్విటీ లక్షణాలున్న రుణ సాధనాలు. ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే లేదా దివాలా తీస్తే, ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన అవసరం బ్యాంకులకు ఉండదు. -
సాగుకు ముందస్తు భరోసా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యతదేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.ఎల్పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలుజూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)ఎరువు రకంప్రస్తుత నిల్వలు (2026)గతేడాది నిల్వలు (2025)యూరియా61.1455.22డీఏపీ24.2411.85కాంప్లెక్స్57.2134.44ఎస్ఎస్పీ24.823.15ఎంఓపీ12.6514.13 వ్యూహాత్మక అడుగులుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మికుంట మండలం సీతంపేటలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య మృతి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ.. అత్తగారి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపుతోంది. దివ్య మృతిపై అనుమానాలు తలెత్తడంతో చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.కాగా, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యకు 2016లో ఎస్ఐ చంద్రశేఖర్తో కాగా.. భర్త రోజుమాదిరిగా మంగళవారం(మార్చి, 17) ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో అదేరోజు ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగిన దివ్య.. తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పింది. దివ్యను ఆమె భర్త.. వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.అయితే, దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమంటూ మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇవాళ(మార్చి 21, శనివారం) ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గదిలో నుండి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. -
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో కూడా!
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్లైన్లో తెలుగు వెర్షన్కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. ప్రీమియర్స్ కోసం ముందే బుక్ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయ్యింది. కన్నడలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ధురంధర్ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిద్యధర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
నిందితుడిని కాపాడుతున్నారా?.. ఎస్పీ ఆగ్రహం
తాండూరు రూరల్: మహిళ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వడ్డీ వ్యాపారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఎస్పీ స్నేహ మెహ్ర కరన్కోట్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమో దు చేసి ఏడు రోజులు అవుతున్నా పురోగతి లేకపోవడంపై మండిపడ్డారు. శుక్రవారం బాధిత కుటుంబసభ్యులు వికారాబాద్లో ఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం సిరిగిరిపేట్కు చెందిన అగ్గనూర్ వీరప్ప, లక్ష్మి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి హన్మంత్రెడ్డి వద్ద వీరప్ప ఏడాది క్రితం వ్యవసాయ పనుల కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నారు. పంట దెబ్బతినడంతో తీర్చలేదు. ఈ నెల 13న వడ్డీ వ్యాపారి హన్మంత్రెడ్డి.. వీరప్ప ఇంటికి వెళ్లి అతని భార్య లక్ష్మితో దురుసుగా ప్రవర్తించాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు మృతురాలి భర్త వీరప్ప కరన్కోట్పీఎస్లో హన్మంత్రెడ్డి, ఉమాదేవిపై ఫిర్యాదు చేశాడు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె కరన్కోట్ పోలీసులకు ఫోన్ చేసి నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మంత్రెడ్డి ఇంటికి తాళం వేసి వెళ్లాడని, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని ఎస్ఐ వినోథ్ రాథోడ్ వివరణ ఇచ్చారు. అధికార పారీ్టకి చెందిన ఓ నేత నిందితులను కాపాడుతున్నట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. -
యుద్ధంపై వెనక్కి తగ్గిన ట్రంప్..?
పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మెుదలై 20 రోజులు దాటుతున్నా ఇరువర్గాలు శాంతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం ఆపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ చేసిన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల దాడులను తిప్పికొడుతూ ఇరాన్ పెద్దఎత్తున ప్రతిదాడులు చేయడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ సంక్షోభ పరిస్థితులకు ట్రంప్ కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. చమురు సంక్షోభాన్ని తెరదించడానికి IEA అత్యవసర చమురు నిల్వల విడుదలకు అనుమతిచ్చినా ప్రస్తుతం ఏర్పడ్డ చమురు కొరతకు అది ఏ విధంగానూ సరిపోదు. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.తన సోషల్ మీడియా పోస్ట్లో " ఇరాన్లో మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరవుతున్నాం. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ప్రయత్నాలను ముగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ పోస్ట్ చేశారు.. అయితే ఇది వరకే పలు మార్లు ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతిందని దాని పనైపోయిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా వ్యాఖ్యానించారు.కాగా ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా విఫలమైంది. టెహ్రాన్ని చాలా సులువుగా ఓడించవచ్చు అని ట్రంప్ భావించారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకవడుతుంది. హర్మూజ్ క్లోజ్ చేసి చమురు సప్లైని బ్రేక్ చేసింది. అంతేకాకుండా అమెరికా ఫైటర్ జెట్ F-35 పై అటాక్ చేసింది. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోని అతి పెద్దదైన ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడి చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే టెహ్రాన్ ఎక్కడా తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్ట్ ఆసక్తిగా మారింది."We are getting very close to meeting our objectives as we consider winding down our great Military efforts in the Middle East with respect to the Terrorist Regime of Iran..." - President Donald J. Trump pic.twitter.com/YBG9l492Kf— The White House (@WhiteHouse) March 20, 2026 -
త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టు సమాచారం. రానున్న పది, పదిహేను రోజుల్లో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మోదీ పర్యటన, జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.వివరాల మేరకు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ.. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీ తెలంగాణలో కూడా పర్యటించేలా స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కోసం పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక, ఇప్పటికే స్థానిక నేతలకు మోదీ టూర్పై రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే నేడు సికింద్రాబాద్ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటర్నల్ సమావేశం ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగే అవకాశం ఉంది. -
ఆరు నెలలు అక్కడ సూర్యుడే రాడు
రోజులో పగలు, రాత్రి ఉంటాయి తెలుసు కదా. అయితే సంవత్సరంలో సగం కాలం చీకటి మాత్రమే ఉండే ఒక ప్రదేశం ఉందని తెలుసా? ఆర్కిటిక్ మహాసముద్రంలోని ద్వీపసమూహమైన స్వాల్బార్డ్ ప్రాంతంలో ఈ వింత కనపడుతుంది. ఇక్కడ వరుసగా ఆరు నెలలపాటు సూర్యుడు రాడు. ఈ వింత చూడటానికి ఈప్రాంతాన్ని సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తుంటారు. దగ్గరి భూభాగమైన నార్వేకూ, ఉత్తర ధ్రువానికి దాదాపు మధ్యలో ఉంది స్వాల్బార్డ్ ద్వీపం. దాని హై ల్యాటిట్యూడ్ కారణంగా పగటి వెలుగులో తీవ్రమైన వైవిధ్యాలు ఉంటాయి. అక్టోబర్ చివరి నుండి ఫిబ్రవరి మధ్య వరకు సూర్యుడు రాకపోవడంతో ఈ ద్వీపసమూహం చీకటిలో మునిగి΄ోతుంది. స్వాల్బార్డ్లో ఈ సీజన్లో నిత్యం సాయంత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఆకాశం ముదురు నీలం, ఊదా రంగుల మధ్య మారుతూ ఉంటుంది. మంచుతో నిండిన ప్రకృతి మీద దివ్యమైన కాంతి పడుతుంటుంది.ఇక్కడ పగటి వెలుగు లేనప్పటికీ స్వాల్బార్డ్లో ప్రజల జీవితం నిరాటంకంగా కొనసాగుతుంది. సాహసయాత్రలు చేసే ప్రయాణికులు ఈప్రాంతపు విశిష్టమైన అందాన్ని, వన్య్ర΄ాణులను చూడటానికి వస్తుంటారు. స్వచ్ఛమైన తెల్లని విశాల ప్రదేశాలలో చేసే స్నోమొబైల్ సఫారీలు, కఠినమైన భూభాగాలను అన్వేషించడానికి, మంచుతో నిండిన ఫ్యోర్డ్లు, గడ్డకట్టిన సముద్రాలలో సంచరించే ఆర్కిటిక్ నక్కలు, రెయిన్ డీర్లు, బహుశా అంత సులభంగా కనపడని ధ్రువపు ఎలుగుబంటిని కూడా చూసేందుకు ఒక అవకాశాన్ని అందిస్తాయి. -
ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్సింగ్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. గబ్బర్ సింగ్ మాదిరి పవన్ కెరీర్లోనే గుర్తుండిపోయేలా మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తే.. వారి లెక్కలు తారుమారు అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద రెండురోజుల కలెక్షన్స్ చూస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవని తెలుస్తోంది. తొలిరోజు కాస్త పర్వాలేదనిపించిన కలెక్షన్స్ రెండోరోజు 80శాతం పడిపోయాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇప్పటికీ అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది.ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ 34.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. అయితే, రెండోరోజు కేవలం రూ. 9.25 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో రెండురోజుల్లో మొత్తంగా రూ. 44 కోట్ల నెట్ రాబట్టింది. మొదటి రోజుతో పోల్చి చూస్తే.. దాదాపు 80 శాతం వసూళ్లు మరుసటి రోజుకు పడిపోయాయి. ఉగాది, రంజాన్ పండుగలతో లాంగ్ వీకెండ్లోనే ఇలా ఉంటే.. సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఆపై నేడు (మార్చి 21) ధురంధర్-2 తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆదివారం వరకు బుకింగ్స్ 95శాతం పైగానే పూర్తి అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఉస్తాద్ భగత్సింగ్ను తొలగించి ధురంధర్-2 చిత్రాన్ని వేయనున్నారు. ఉదయం ఆటలతో పాటు ఏపీలో టికెట్ రేట్ల పెంచి భారీ సంఖ్యలో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ .. కలెక్షన్స్ పరంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నడంతో ట్రేడ్ వర్గాలను కూడా కలవరపెడుతుంది. -
విదేశీ ఇన్వెస్టర్లకు ఇదో అద్భుత అవకాశం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటుచేసుకున్న ఇటీవలి మార్పులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా మారాయని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్నే పేర్కొన్నారు. ప్రస్తుత కరెక్షన్ వల్ల షేర్ల విలువ ఆకర్షణీయంగా మారాయని, ఇది భారత్లో పెట్టుబడులు పెంచుకోవడానికి సరైన సమయమని విశ్లేషించారు.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా జరిగిన ‘రష్యా-ఇండియా క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రేషన్’ ఫోరంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వర్ష్నే తెలిపారు. అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా ఉన్నారు. కేవలం మార్చి మొదటి 15 రోజుల్లోనే సుమారు రూ.77,000 కోట్ల నిధులు బయటకు వెళ్లడం గమనార్హం. రష్యా ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న సాంకేతిక, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి సెబీ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.‘భారతీయ మార్కెట్లలోని అనుబంధ సంస్థల విలువ, విదేశాల్లోని వారి మాతృ సంస్థల కంటే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రష్యా కంపెనీలు భారత మార్కెట్లలో లిస్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు’ అని తెలిపారు. భారతీయ మార్కెట్లు కేవలం పెట్టుబడితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానానికి వేదికగా మారుతున్నాయని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం కొత్త వ్యూహాలతో యూ టర్న్ తీసుకుంటోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ దూకుడు పెంచింది. తాజాగా ఇరాన్.. హిందూ మహాసముద్రంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే,ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారనే విషయం తెలియాల్సి ఉంది.వివరాల మేరకు.. ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను తాకలేదని తెలుస్తోంది. అయితే, ఒకటి మాత్రం మార్గ మధ్యలోనే విఫలమైందని, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఈ దాడులపై ఇరాన్ కూడా స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే, క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
అభిమాని అభ్యర్థణకు మోదీ రిప్లై.. చెక్కెర తగ్గించండి..!
సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి, తన వీరాభిమాని కుమారునికి మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి ప్రధాని మోదీకి వీరాభిమాని అని ఆయన చెబితే తను చెక్కెర తినడం మానేస్తాడని ఒక సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ ప్రధానిని ఇన్స్ట్రాలో వీడియో చేస్తూ అభ్యర్థించారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది.యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రధాని మోదీని అభ్యర్థించారు. "ప్రధాని మోదీ గారు మా తండ్రి గారు మీకు వీరాభిమాని ఆయన చెక్కెర అధికంగా తింటాడు. దయచేసి మీరు అతనిని షుగర్ తినడం మానిపించాలి. మీరు చెబితే ఆయన వింటారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్యా దయచేసి ఆయనను చెక్కెర తినడం మానిపించండి" అని ఇన్స్ట్రా రీల్ చేశారు.ఈ వీడియో కాస్త వైరల్గా మారి ప్రధాని దృష్టికి చేరింది. దీంతో మోదీ తన అధికారిక ఇన్స్ట్రా అకౌంట్లో దీనికి రిప్లై ఇచ్చారు. " యువరాజ్ అభ్యర్థన మేరకు నేను తన తండ్రిని షుగర్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనతో పాటు ఇతరులు కూడా అలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెక్కెర అధికంగా తీసుకోవడం అనేక వ్యాధులకు, ఉభకాయానికి కారణం అవుతుంది. యోగా మీ జీవితంలో భాగం చేసుకొవడం ద్వారా ఆరోగ్యంగా ఫిట్గా ఉండవచ్చు. అని మోదీ ఇన్స్ట్రాలో రిప్లై ఇచ్చారు. అనంతరం అతని వీడియో రీషేర్ చేశారు.అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రధాని మీ వీడియో షేర్ చేశారని తెలిస్తే మీ తండ్రి చాలా గర్వంగా ఫీలవుతారని ఒకరు కామెంట్ చేశారు. ఇలా ఇన్స్ట్రాలో చాలా మంది యువరాజ్ దువాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే భారత ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్ట్రాగ్రామ్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 10 కోట్లు దాటింది. -
'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు'
ఐపీఎల్-2026 సీజన్లో సత్తా చాటేందుకు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సిద్దమవుతున్నాడు. గత సీజన్లో తన అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని అకర్షించిన ఈ బిహార్ ఆటగాడు.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.ఇప్పటికే రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరిన 14 ఏళ్ల సూర్యవంశీ .. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది వైభవ్పై భారీ అంచనాలతో పాటు ఒత్తడి కూడా ఉంటుందని పరాగ్ తెలిపాడు.వైభవ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అతడిపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కెప్టెన్గా ఒక్క విషయం అతడికి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒత్తిడిని యశస్వి జైస్వాల్కు వదిలేయమని చెబుతా. ఎందుకంటే జైశ్వాల్కు అనుభవం ఎక్కువగా ఉంది. ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా జైశూ వద్ద ఉంది. కాబట్టి వైభవ్ క్రీజులోకి వెళ్లి తన సహజ సిద్ధమైన ఆటను ఆడితే చాలు. బయట విషయాలను అతడు పట్టించుకోకూడదు. అతడి దృష్టింతా కేవలం ఆటపైనే ఉండాలి. అందుకే అతడిని మీడియా దృష్టికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరుకావద్దని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడవద్దని చెబుతాను అని పరాగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్లో వైభవ్ దుమ్ములేపాడు. కేవలం 7 మ్యాచ్లలో 206.56 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు.చదవండి: IPL 2026: లైంగిక ఆరోపణలు.. స్టార్ ప్లేయర్పై వేటు వేసిన ఆర్సీబీ!? -
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేయగా.. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నారు. రోహిత్కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్ సింగ్సెల్ఫోన్ డేటాను సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది.కాగా, డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
లైంగిక ఆరోపణలు.. స్టార్ ప్లేయర్పై వేటు వేసిన ఆర్సీబీ!?
ఐపీఎల్-2026 సీజన్కు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న దయాల్ను ఆర్సీబీ మేనెజ్మెంట్ పక్కన పెట్టినట్లు సమాచారం. బెంగళూరు జట్టు ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేసింది.అయితే ఈ శిక్షణా శిబిరానికి దయాల్ గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఆర్సీబీ టీమ్ బస్పై కూడా దయాల్ ఫోటో లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఆర్సీబీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంలో దయాల్ది కీలక పాత్ర. మొత్తం 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే గతేడాది జూలైలో దయాల్పై రెండు వేర్వేరు రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అతడిని అరెస్టు చేయొద్దంటూ అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే రాజస్తాన్లో నమోదైన కేసులో మాత్రం అతడు బెయిల్పై ఉన్నాడు. రాజస్థాన్ హైకోర్టు యశ్ దయాల్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. గత నెలలో యశ్ దయాల్ సీక్రెట్గా పెళ్లిచేసుకున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్తో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే -
బహ్రెయిన్ రాజుకు మోదీ ఫోన్..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. చమురు, గ్యాస్ ఉత్పత్తి, నిల్వ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడం అర్థరహితం అని తేల్చిచెప్పారు. ఆయన శుక్రవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడారు.పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయని మోదీ ప్రస్తావించారు. షిప్పింగ్ మార్గాలకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగేలా పశ్చిమాసియా దేశాలు చొరవ తీసుకోవాలని సూచించారు. నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి వీలుగా సముద్ర మార్గాలను తెరవాలన్నారు. బహ్రెయిన్ రాజుతో ఫలవంతమైన చర్చ జరిగిందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాజుకు, బహ్రెయిన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్నారు.ఇంధన, పౌర మౌలిక వసతులపై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువులు భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని తేలి్చచెప్పారు. బహ్రెయిన్లోని భారతీయుల రక్షణకు తగిన చర్యలు చేపట్టినందుకు రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరాన్పై యొద్ధం మొదలైన తర్వాత బహ్రెయిన్ రాజుతో మోదీ ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. ఆయన సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ తదితర దేశాల పాలకులతో ఇప్పటికే మాట్లాడారు. -
రూమర్స్కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల
అక్కినేని కుటుంబంలో వారసుడు రాబోతున్నాడు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ కొద్దిరోజుల క్రితం సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్ రావడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో ఎలాంటి వేడుక జరిగినా సతీసమేతంగా నాగచైతన్య వెళ్తాడు. శోభితా ధూళిపాళ్లతో పెళ్లయిన తర్వాత దాదాపు అన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. కానీ, రీసెంట్గా జరిగిన అల్లు శిరీశ్ పెళ్లితో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్లో చైతూ ఒక్కడే కనిపించడంతో శోభిత తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి.శోభిత ప్రెగ్నెన్సీ రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఉగాది నాడు జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకకు భర్తతో కలిసి శోభిత హాజరైంది. అయితే, రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలకు మరో ఛాన్స్ ఇవ్వకుండా పల్చటి చీరతో కనిపించింది. అలా డ్రెస్ సెన్స్తో శోభిత క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో ప్రెగ్నెన్సీ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. 2024 డిసెంబర్లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరిగింది. ఆ తర్వాత చైతూ నటించిన తండేల్ సూపర్ హిట్ కావడం ఇప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోవడంతో శోభితతో పాటు లక్ కూడా తన జీవితంలోకి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒక ఈవెంట్లో నాగార్జున కూడా ఇలాంటి వార్తలపై రియాక్ట్ అయ్యారు తమ కుటుంబంలో ఏవైనా శుభవార్తలు ఉంటే.. తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. -
అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్పై జనసేన వేసిన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదు.. కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు శ్రీధర్ ఎలా హాజరవుతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘అరవ శ్రీధర్కు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా?. లేదంటే ఇంటర్నెల్గా శ్రీధర్కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా?. ఒక వేళ కమిటీ రిపోర్టు ఇస్తే మాకు చెప్పండి. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు.’’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.కమిటీ నివేదిక ఇవ్వకుండానే కండువాతో అరవ శ్రీధర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు పలుదఫాలు గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశిస్తున్నట్లు జనసేన అధినాయకత్వం ప్రకటించడం తెలిసిందే.అయితే ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోగా.. ఎమ్మెల్యే శ్రీధర్ శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో జనసేన కండువా కప్పుకొని పాల్గొనడం గమనార్హం. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కమిటీ పేరుతో జనసేన నాయకత్వం కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఇంతవరకు ఎమ్మెల్యే నిర్వాకాలను కనీసం ఖండించకపోవటాన్ని తప్పుబడుతున్నారు. రెండు రోజుల కిందట అరవ శ్రీధర్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించే నెపంతో పొలాల్లో పర్యటించి ప్రజలకు ముఖం చూపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. -
ఇంధన భద్రతలో భారత్ ముందున్న సవాలు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు భారత్ వంటి భారీ వినియోగ క్రూడ్ దేశాలకు హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలవాల్సిన వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు భారత్లో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.వ్యూహాత్మక నిల్వలు ఎందుకు కీలకం?ఇంధన నిల్వలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు నిర్వహించే వాణిజ్య నిల్వలు. వీటి ప్రాముఖ్యత ఆర్థిక పరంగానే కాకుండా దేశ రక్షణకు కూడా సంబంధించింది కావడం గమనార్హం.భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరంతర ఇంధన సరఫరాకు ఇవి అండగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఈ నిల్వలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఇంధనాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే దేశాల ముందు భారత్ తలవంచకుండా ఉండేందుకు ఈ బఫర్ స్టాక్ రక్షణ కవచంగా పనిచేస్తుంది.ఆందోళనకరంగా ఎల్పీజీ నిల్వలుభారత్ వంటగ్యాస్ పంపిణీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. విశాఖపట్నం కేవర్న్(హెచ్పీసీఎల్, టోటల్ఎనర్జీస్ జేవీ) సామర్థ్యం 60,000 టన్నులు, మంగళూరు కేవర్న్(హెచ్పీసీఎల్) 80,000 టన్నులతో మొత్తం సామర్థ్యం 1,40,000 టన్నులుగా ఉంది.దేశవ్యాప్తంగా రోజువారీ ఎల్పీజీ డిమాండ్ సుమారు 90,000 టన్నులు అని అంచనా. అంటే మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవు. ప్రస్తుతం మన మౌలిక సదుపాయాలన్నీ గ్యాస్ను పోర్టుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరవేసే ‘ఆపరేషనల్ ఫ్లో’ మోడల్లోనే ఉన్నాయి తప్ప దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించినవి కావని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎందుకీ పరిస్థితి?ముడి చమురు నిల్వల విషయంలో భారత్ ఇప్పటికే భారీ వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకుంది. కానీ గ్యాస్ విషయంలో మాత్రం ఆ పురోగతి కనిపించలేదు. దీనికి కొన్ని కారణాలున్నాయి.గతంలో గ్యాస్ సరఫరా సులభంగా, తక్కువ ధరకే లభించడంతో నిల్వల కంటే సరఫరా వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.గ్యాస్ను భూగర్భంలో నిల్వ చేయడానికి తగిన సహజ కేవర్లు గుర్తించడం సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ.గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది.కొత్త వ్యూహం: ప్రభుత్వం ఏం చేస్తోంది?పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ భద్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్ఎన్జీ/ఎల్పీజీ టెర్మినల్స్లో అదనంగా 10 శాతం నిల్వ సామర్థ్యాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సమీక్షిస్తున్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఆరు కొత్త ప్రాంతాల్లో నిల్వ కేంద్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఉన్న ‘సాల్ట్ కేవర్లు’ గ్యాస్ నిల్వకు అత్యంత అనువైనవిగా భావిస్తున్నారు.అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవాలంటే భారత్ కేవలం సరఫరాపైనే కాకుండా నిల్వపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విధానపరమైన వేగం, సాంకేతిక తోడ్పాటు తోడైతేనే ఇంధన భద్రతలో భారత్ స్వయంసమృద్ధి సాధించగలదు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే
ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్కతా నైట్రైడర్స్ తమ ప్రాక్టీస్ జోరు పెంచింది. శుక్రవారం కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు.అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు, ఎంపీ పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్ విధ్వంసం సృష్టించాడు. తన పవర్ ఫుల్ బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గోల్డెన్ నైట్స్' జట్టు తరపున ఆడిన సార్థక్.. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు. వైభవ్ ఆరోరా వేసిన మూడో ఓవర్లో అతడు ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఆఖరికి బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్లో థర్డ్ మ్యాన్ దిశగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్కు సార్థక్ రంజన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్తో పాటు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి ఈ అవకాశం దక్కింది. డొమాస్టిక్ క్రికెట్లో దుమ్ములేపిన సార్థక్.. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు.ఐపీఎల్-2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, ఎఫ్ గ్రీన్ అరోరా, వరుణ్ చకరన్, ఎఫ్. పతిరణ, తేజస్వి సింగ్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.చదవండి: ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ -
రూపీ.. ‘లో’బీపీ
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు పెరిగిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోతోంది. డాలర్తో పోలిస్తే శుక్రవారం 64 పైసలు క్షీణించి కొత్త ఆల్టైమ్ కనిష్టం 93.53 వద్ద క్లోజయ్యింది. రిస్కు తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవడం, ముడిచమురు ధరలు ఎగియడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ అనిశ్చితి రిసు్కల వల్ల ఇంధన రేట్లు పెరుగుతుండటంతో వాణిజ్య లోటు, ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎగిసే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ 92.92 వద్ద ప్రారంభమైంది. తర్వాత తొలిసారిగా 93 మార్కు దిగువకు పడిపోయింది. చివరికి 64 పైసల నష్టంతో ముగిసింది. రాబోయే రోజుల్లో రూపాయి మారకం 93.75–92.90 శ్రేణిలో తిరుగాడొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఇరాన్తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు.వైట్హౌస్ నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదు. ఆ మార్గం ద్వారా ప్రయోజనం పొందే దేశాలు కొంతైనా చొరవ చూపాలి. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలి. మాకు హార్ముజ్ జలసంధితో పనిలేదు లేదు. కానీ యూరప్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఇది చాలా అవసరం. చైనా తన ఇంధన అవసరాల్లో 90 శాతం, జపాన్ 95 శాతం ఈ మార్గం ద్వారానే లబ్ధి పొందుతున్నాయి. ఆ దేశాలే కొంచెం శ్రమించి, ఈ మార్గం రక్షణలో భాగం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.#WATCH | On the US-Israel vs Iran conflict, US President Donald Trump says, "We can have dialogue, but I don't want to do a ceasefire. You don't do a ceasefire when you're literally obliterating the other side... we're not looking to do that."(Source: US Network Pool Via… pic.twitter.com/4Y5AUK4jG0— ANI (@ANI) March 20, 2026యుద్ధం ఆగదు.. మరోవైపు.. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ విజయం వైపు దూసుకుపోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇరాన్ వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే తమ అంతిమ ధ్యేయమని చెప్పారు. అలాగే, యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కాల్పుల విరమణ మాత్రం చేయబోం. శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలుఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారమ్లో ఆయన నాటోను "పేపర్ టైగర్" అని విమర్శించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల ముప్పును అడ్డుకోవడంలో వారు పిరికితనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు జలసంధి తెరిపించేందుకు నాటో దేశాలను ట్రంప్ సైనిక సహాయం కోరారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను నాటో దేశాలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్నేక్ డ్యాన్స్ కోసం నిహారిక మాస్ ఎంట్రీ
'రాకాస' సినిమా నుంచి తాజాగా స్నేక్ డ్యాన్స్ సాంగ్ను విడుదల చేశారు. అయితే పాట చివర్లో నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. సంగీత్ శోభన్- నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మానస శర్మ తెరకెక్కించగా.. నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. టీజర్తోనే మెప్పించిన మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే సాంగ్ను విడుదల చేసి అలరించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ
బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్ ఆఫర్ను ఇచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్ కోడ్ సైతం లభించనుంది. టికెట్ కొనుగోలు ఎలా? ఈసారి ఆర్సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్సైట్ లేదా, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్సైట్లకు గాని వ్యక్తులకు కాని టికెట్ అమ్మకాల హక్కులు లేవు. ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడు? 2026వ సంవత్సర ఐపీఎల్ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైసర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది. తొలి దశలో ఆర్సీబీ తలపడే మ్యాచ్లు: -
జపాన్ స్టార్కు షాకిచ్చిన తాన్వి శర్మ
ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్లో శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–14, 21–14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా (జపాన్)పై సంచలన విజయం సాధించింది.43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ తన్వీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఇషారాణి 21–9, 15–7తో భారత్కే చెందిన మాళవిక బన్సోద్పై గెలిచింది. రెండో గేమ్ మధ్యలో గాయం కారణంగా మాళవిక వైదొలిగింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 12–21, 20–22తో లియో కార్నాండో–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
చరిత్ర సృష్టించిన అనామక ప్లేయర్
రువాండాకు చెందిన టీనేజ్ క్రికెటర్ ఫ్యానీ ఉతగుషుమనిందే అరంగేట్రంలోనే సెంచరీతో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మహిళల టి20ల్లో ‘శత’క్కొట్టిన అతిపిన్న వయష్కరాలిగా ఫ్యానీ (15 ఏళ్ల 223 రోజులు) రికార్డు నెలకొల్పింది. ఉగాండా ప్లేయర్ ప్రొస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు; 2019లో మాలి జట్టుపై) పేరిట ఉన్న రికార్డును ఫ్యానీ బద్దలు కొట్టింది.నైజీరియాలో జరుగుతున్న ఇంటర్ననేషనల్ టి20 టోర్నీలో భాగంగా ఘనాతో జరిగిన మ్యాచ్లో ఫ్యానీ 65 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే శతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మహిళా బ్యాటర్గా ఘనతకెక్కింది. ఆమె మెరుపు శతకం 21 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 2005లో అప్పుడే మొదలైన మహిళల అంతర్జాతీయ టి20లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ తన అరంగేట్రం మ్యాచ్లో కరెన్ రోల్టన్ (96 నాటౌట్) ఇంగ్లండ్పై రికార్డు సృష్టించింది. ఫ్యానీ ధనాధన్ షోతో రువాండా 20 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం ఘనా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 88 పరుగులే చేసింది. -
విజయనగరం: బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తారాపురం సమీపంలో ప్రైవేటు బస్సు వెనుక టైర్ పేలడంతో మంటలు చెలరేగాయి. భువనేశ్వర్ నుంచి మల్కన్ గిరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టైర్ పేలగానే అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులను దించేశారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది.ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఒడిశాకు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఇరుముడిలో అయ్యప్ప భక్తులకు ఇష్టమైన పాట రీమిక్స్
భక్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మెప్పించిన మాస్ మహారాజా రవితేజ తర్వాతి సినిమా సెట్స్లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడారు.జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ విడుదల కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమా గురించి ప్రశ్నించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన “ఎక్కినాడు పల్లకి” (అయ్యప్ప స్వామిని కీర్తించే గీతం) పాటను రీమిక్స్ చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఈ పాటను రీమిక్స్ చేయమని ఇప్పటికే చాలామంది తనను అడిగినట్లు జీవీ ప్రకాశ్ తెలిపారు. దీంతో తాను కూడా పలుమార్లు ఆ సాంగ్ విన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం దర్శకుడు, నిర్మాతలదేనని జీవీ ప్రకాష్ తెలిపారు.ఈ చిత్రంలో రవి తేజ అయ్యప్ప స్వామి భక్తునిగా కనిపించనున్నారు. ఇది భక్తి చిత్రం కాదు, బేబీ నక్షత్ర పోషించిన తన కుమార్తెతో అతనికున్న సంబంధం చుట్టూ అల్లుకున్న ఒక ఎమోషనల్ డ్రామా. ఫస్ట్లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. -
భర్తను శ్మశానవాటికలో వదిలేసిన భార్య
జగిత్యాల క్రైం: అనారోగ్యంతో ఇంటిపెద్ద మంచానపడగా.. అతడు బతికుండగానే శ్మశానవాటికలో వది లేసిన దీనగాథ పలువురిని కన్నీరు పెట్టించింది. పోషణ భారమవుతోందని సొంతింటి వారే శ్మశానవాటిక లో వదిలివెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాం«దీనగర్కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ది నిరుపేద కుటుంబం. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీధర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి మూడు నెలల కిందటే అనారోగ్యం బారిన పడి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. దీంతో భార్య కిరాణం షాపులో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లతో పాటు భర్తను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి శ్రీధర్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ శివారులోని శ్మశానవాటికలో వదిలేసి వెళ్లారు. శ్మశానవాటికలో ఒంటరిగా ఉన్న శ్రీధర్ను గమనించిన స్థానిక కౌన్సిలర్ భర్త రాము 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. కనికరం లేకుండా ప్రాణం ఉండగానే శ్మశానవాటికలో వదిలేసి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకుని మానవతా దృక్పథంతో శ్రీధర్ను కుటుంబ సభ్యులే పోషించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఒక వ్యక్తిని 'కరిష్మాటిక్' అని ఎప్పుడు పిలుస్తారంటే..
చాలామంది కరిష్మా (Charisma) పుట్టుకతో వచ్చే వరం అనుకుంటారు, లేదా కేవలం సినిమా స్టార్లకు మాత్రమే ఉంటుందని భ్రమిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, కరిష్మా అనేది నేర్చుకోగలిగే ఒక Behavioral Skill.కరిష్మా అంటే అందంగా ఉండటం కాదు, ఎదుటివారిని 'అందంగా' ఫీలయ్యేలా చేయడం. మీరు ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం మీ రాకతో పాజిటివ్గా మారితే... అదే కరిష్మా. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన ఉంటే మనకు తెలియని ఒక ఉత్సాహం, నమ్మకం కలుగుతాయి. దీనికి వెనుక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని డీకోడ్ చేద్దాం.The Charisma Trifectaఒక వ్యక్తిని మనం 'కరిష్మాటిక్' అని ఎప్పుడు అంటామంటే, వారిలో ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు:1. Presence: మీరు ఎవరితో ఉన్నారో, ఆ క్షణంలో పూర్తిగా వారితోనే ఉండటం. మీ మనసు ఎక్కడో ఉండి, మీరు అక్కడ ఉన్నట్లు నటిస్తే కరిష్మా మాయమైపోతుంది. మీ ఏకాగ్రతే మీ ఆకర్షణ.2. Power: ఇది ఎదుటివారిని భయపెట్టే శక్తి కాదు. మీ జ్ఞానం, మీ హోదా, మీ ఆత్మవిశ్వాసం లేదా మీ శారీరక దృఢత్వం ద్వారా వచ్చే 'ప్రభావం'. లోకానికి మీరు ఏదో ఒకటి సాధించగలరనే నమ్మకం కలిగించడం.3. Warmth: మీ శక్తిని ఎదుటివారి మేలు కోసం వాడతారనే భరోసా. మీరు ఎంత పవర్ఫుల్ అయినా, మీలో ఆత్మీయత లేకపోతే మిమ్మల్ని 'అహంకారి' అంటారు. శక్తికి ఆత్మీయత తోడైనప్పుడే అది 'కరిష్మా' అవుతుంది.The Halo Effectసైకాలజీలో Halo Effect అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉంటే, మన మెదడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తెలివైనవాడు, నమ్మదగ్గవాడు అని భావిస్తుంది. ఉదాహరణకు, మంచి డ్రెస్సింగ్ లేదా మంచి నవ్వు. కరిష్మాటిక్ వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ బాడీ లాంగ్వేజ్ని, ప్రెజెన్స్ని అద్భుతంగా మెయింటైన్ చేస్తారు.రియల్ కరిష్మామోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "ఎప్పుడూ నవ్వుతూ ఉండు, బిగ్గరగా మాట్లాడు, అందరినీ పొగుడు" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి Fake గా అనిపిస్తుంది. కానీ కరిష్మా అనేది లోపలి నుండి రావాలి. మీరు మీ గురించి మీరు గొప్పగా ఫీలైనప్పుడు, ఎదుటివారిలో మంచిని చూడగలిగినప్పుడు మీ కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. అదే అసలైన ఆకర్షణ.మీ చరిష్మా కోడ్ని అన్లాక్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీరు ఒక ఆకర్షణీయమైన లీడర్గా మారే మార్గం ఇది.Step 1: అభద్రతా భావం, పరధ్యానం బ్రేక్ చేయండిమీరు మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం లేదా మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోవడం వంటి పాత అలవాట్లను 'Break' చేయండి. అభద్రతా భావం (Insecurity) ఉన్న చోట కరిష్మా ఉండదు.Step 2: యాక్టివ్ ఎంగేజ్మెంట్ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వారిని ఎంత గౌరవిస్తారో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా బిల్డ్ చేయండి. మీ నడకలో, నిలబడే తీరులో ఒక 'గ్రేస్' ఉండాలి.Step 3: ప్రభావితం చేసే శక్తిమీరు ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ అవసరం అక్కడ ఉండాలి. మీ జ్ఞానంతో, మీ వినయంతో అందరినీ ఆకట్టుకోండి. మీరు లేని సమయంలో కూడా మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ కరిష్మా చెకప్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి మీరు ఇస్తున్న 'అటెన్షన్' ఎంత?2. మీలో Power and Warmth బ్యాలెన్స్డ్గా ఉన్నాయా?3. మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా ఫీలవుతున్నాడా లేక ఇబ్బందిగా ఫీలవుతున్నాడా?కరిష్మా అంటే ఎదుటివారిని గెలవడం!బ్రో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటే కేవలం అందంగా కనిపించడం కాదు, అద్భుతంగా ప్రవర్తించడం. మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎంతగా ప్రోత్సహిస్తారో, వారిని ఎంతగా అర్థం చేసుకుంటారో.. అదే మీ కరిష్మాను పెంచుతుంది. ఇది మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి ఒక రాకెట్ ఇంజిన్ లాంటిది."Charisma is the ability to influence without logic."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?) -
ఇరాన్పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు. -
సిలిండర్ దొరికినోళ్లే ధురంధర్
హైదరాబాద్: నగరంలో గ్యాస్ కష్టాలు సాధారణంగా మారాయి. హోటళ్లు, పీజీలు ఇప్పటికే మూతపడుతుండగా.. మరోవైపు సాధారణ ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్లు కాకపోవడంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. గృహిణులు అయితే చంటి పిల్లలతోనూ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు కొందరు ఓపెన్ కిచెన్ లో వంట చేస్తున్నారు. సీఎన్జీతో నడిచే ఆటోలకూ కటకట ఏర్పడింది. దీంతో గ్యాస్ బంకుల వద్ద వాహనాలతో డ్రైవర్లు బారులు తీరుతున్నారు. -
హీరో పేరు చెప్పకుండానే తాప్సి విమర్శలు
నటి తాప్సి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉత్తరాది భామ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా నటిస్తూ టాప్ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీలో పలు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉన్నారు. కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నటించడానికి పలువురు హీరోలు సంశయిస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా తనకు జరిగిన ఒక విషయం గుర్తు చేస్తూ తనకు ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడిని నిర్మాత సంప్రదించారని, అయితే కథ విన్న ఆయన ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పి నటించడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఈ అమ్మడు తాను నటించిన చిత్రాన్ని ఏ హీరో నిరాకరించారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైర ల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ 38 ఏళ్ల భామ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. -
హార్వర్డ్ వర్సిటీపై ట్రంప్ సర్కార్ దావా
వాషింగ్టన్: అమెరికాలో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. వర్సిటీ క్యాంపస్లో యూదు వ్యతిరేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అణచివేయడంలో హార్వర్డ్ యాజమాన్యం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. వర్సిటీ యాజమాన్యాన్ని కోర్టుకు లాగడం చర్చనీయాంశంగా మారింది. హార్వర్డ్కు ఇచ్చే నిధులను నిలిపివేయడం, ఇప్పటిదాకా ఇచి్చన సొమ్మును తిరిగి వసూలు చేసుకోవడం ట్రంప్ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా న్యాయ శాఖ శుక్రవారం మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో లాసూట్ దాఖలు చేసింది. విద్యాసంస్థల ప్రాంగణాల్లో జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించే ప్రసక్తే లేదని దావాలో తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోకతప్పదని పేర్కొ ంది. పన్నుచెల్లింపుదారుల సొమ్మును హార్వర్డ్కు కట్టబెట్టామని పేర్కొంది. యూనివర్సిటీ నిర్వహణ కోసం బిలియన్ల డాలర్ల ధనం ఇచి్చనట్లు గుర్తుచేసింది. ఉద్రిక్తతలకు కారణమైన హార్వర్డ్ నుంచి ఆ సొమ్మును తిరిగి రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఈ దావాపై హార్వర్డ్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. -
ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వైదొలిగారు. పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ఆరంభంలోనే ‘ఈ కేసులో నేను విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనా(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)లున్నాయి’అని వ్యాఖ్యానించారు. విచారణ నుంచి తప్పుకోవడం సబబని భావిస్తున్నట్లు తెలిపారు. తదుపరి సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలని సూచించారు. సీజేఐ అభిప్రాయంతో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఏకీభవించారు. దీంతో, ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీన మరో ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని సీజేఐ తెలిపారు. సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని జడ్జీలతో నూతన ధర్మాసనం ఏర్పాటవుతుందని ప్రకటించారు. తీర్పు వెలువడే వరకు ప్రస్తుత చట్టం యథాతథంగా అమల్లో ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నెలల్లోనే 2023 డిసెంబర్లో పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు కమిషనర్ల నియామకానికి ఏర్పాటయ్యే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతోపాటు హోం శాఖ సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు. సీజేఐను మినహాయిస్తూ తీసుకు వచ్చిన కొత్త చట్టంతో ఈసీ నియామక ప్రక్రియ నిష్పాక్షికతను కోల్పోయిందంటూ సుప్రీంలో కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరులు పిటిషన్లు వేశారు. అయితే, ఈసీ ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రతినిధి ఉండటం వల్ల నియామక ప్రక్రియలో నిష్పాక్షికత వచ్చినట్లు కాదని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం నిబంధనల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే సుమారు 10 శాతం నిధులు పెంచింది. 2025–26లో ఆరోగ్యశాఖకు రూ. 12,393 కోట్లు ప్రతిపాదించగా తాజా బడ్జెట్లో రూ. 13,679 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 6,985 కోట్లు, ప్రగతి పద్దు కోసం రూ. 6,695 కోట్లను ప్రతిపాదించింది. నిర్వహణ పద్దులో పరిపాలన, ఉద్యోగుల జీతభత్యాలు మొదలైన వాటికి నిధులు కేటాయించింది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ కోసం రూ. 1,143 కోట్ల మేర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అంటే నెలకు సుమారు రూ. 100 కోట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు కేటాయించనుంది.ప్రగతి పద్దులో నిధుల కేటాయింపు ఇలా...వైద్య, ఆరోగ్యశాఖలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్వహణతోపాటు ఇతర వైద్య సంబంధమైన అంశాలకు బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దు కింద కేటాయించిన రూ. 6,695 కోట్లను ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలు, పథకాల అమలుకు వినియోగించనుంది. ఈ బడ్జెట్లో మాతాశిశు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, మానసిక ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీకి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల స్థాయి పెంపుతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే మూడు ‘టిమ్స్’, వరంగల్ ఆసుపత్రి కోసం నిధులు వెచ్చించనుంది. -
పన్ను రాబడులే‘పునాదిగా’
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే పునాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడులు 3,24,134 కోట్లు ప్రతిపాదించగా, అందులో రాష్ట్ర సొంత పన్ను రాబడులు రూ.1,48,165.75 వస్తాయని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద వస్తుందని అంచనా వేసిన రూ.33,181.64 కోట్లు కలిపితే అది రూ.1,81,347.39 కోట్లకు చేరనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రాబడుల్లో పన్ను ఆదాయం రూపంలోనే 56 శాతం నిధులు సమకూరుతున్నాయన్న మాట. ఈ రాబడులను శాఖల వారీగా పరిశీలిస్తే ఈసారి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.52,310 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 38,105 కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ. 8,814 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, 2025–26లో పన్ను రాబడులను పరిశీలిస్తే రూ.1,63,490 కోట్లు సమకూరింది.ఇందులో సొంత పన్నుల ఆదాయం రూ.1.34 కోట్లు కాగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,471 కోట్లు సమకేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్ను రాబడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర పన్నుల్లో వాటాను మినహాయించి 2024–25లో వచ్చింది రూ.1.09 లక్షల కోట్లు కాగా, 2025–26లో రూ.1.34 లక్షల కోట్లు వచ్చాయి. అంటే రూ.25వేల కోట్ల మేర పన్ను రాబడులు పెరిగాయన్న మాట. ఈ నేపథ్యంలోనే రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ మేరకు పన్ను ఆదాయంలో వృద్ధి ఉంటుందనిఅంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర పన్నుల్లో వాటాను కలిపి 1.81 లక్షల కోట్లు పన్ను ఆదాయాన్ని ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయం తగ్గినాబడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే గత రెండేళ్లుగా ఆశించిన మేరకు పన్నేతర ఆదాయం రావడం లేదు. 2024–25లో రూ.35 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ. 25,807 కోట్లు వచి్చంది. అంటే బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడికి రూ.10వేల కోట్లు తేడా ఉంది. ఇక, 2025–26లో రూ.31,611.47 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ఆశించినా రూ.29,318 కోట్లు మాత్రమే సమకూరింది. అయినా పన్నేతర ఆదాయంపై ఆశలతో 2026–27 బడ్జెట్లోనూ రూ. 35,730.20 కోట్లను పన్నేతర ఆదాయం పద్దు కింద ప్రతిపాదించారు. గత ఏడాది ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్ల మేర పన్నేతర ఆదాయం పెంచడం గమనార్హం.సగానికి సగం తక్కువకేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు సగానికి సగం తగ్గాయని 2025–26 సవరించిన అంచనాలు చెబుతున్నాయి. 2024–25లో రూ.21,636.15 కోట్లు ఈ పద్దు కింద వస్తుందని అంచనా వేయగా, అందులో రూ.19,836 కోట్లు వచి్చనట్టు చూపెట్టారు. కానీ, 2025–26లో రూ. 22,782.50 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును చూపెట్టగా, అందులో కేవలం రూ.11,161.49 కోట్లు మాత్రమే వచి్చంది. అయినా ఈసారి కేంద్రంపై భారీ ఆశలతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును పెంచి రూ.24,166 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మద్యం,రిజిస్ట్రేషన్ల ఆదాయంపైనే ఆశ మద్యం, రిజిస్ట్రేషన్లు.. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి 2025–26లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.19,087 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ, ప్రతిపాదిత బడ్జెట్ కంటే దాదాపు రూ.3 వేల కోట్లు తక్కువగా రూ.16,087 కోట్ల ఆదాయం వచ్చింది. అయినా 2026–27 బడ్జెట్లో ఈ శాఖ ద్వారా రూ.19,540 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించడం గమనార్హం. దీనిని బట్టి ఈసారి భూముల విలువల సవరణ తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2024–25లో ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరగా, ఏ4 (వైన్) షాపులకు టెండర్లు íపిలవడం ద్వారా రూ.2వేల కోట్లు ఎక్కువగా వస్తుందన్న అంచనాల మేరకు రూ.27 వేల కోట్లు ప్రతిపాదించారు. అయితే, వైన్షాపుల టెండర్ల ద్వారా సమకూరిన మొత్తంతో కలిపి కూడా ఎక్సైజ్ ఆదాయం రూ.23,623 కోట్లు మాత్రమే వచి్చంది. అంటే దాదాపు రూ.4 వేల కోట్లు తగ్గింది. ఈ బడ్జెట్లో కూడా ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.27,668 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. -
అప్పులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే అప్పుల పద్దు ఈసారి బడ్జెట్లో కూడా పెరిగింది. అనివార్య ఖర్చులు, రెవెన్యూ వ్యయం సజావుగా సాగేందుకు వీలుగా వివిధ రూపాల్లో తీసుకునే రుణాలు 2026–27 బడ్జెట్లో రూ.80 వేల కోట్లు దాటాయి. 2025–26లో రూ.74,645 కోట్లను ప్రతిపాదించగా, ఈసారి అంతకంటే దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కువగా రూ.82,870.42 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలే రూ.73,383 కోట్లు ఉన్నాయి. అలాగే కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు, డిపాజిట్ లావాదేవీలు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.4 వేల కోట్ల వరకు అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు.సగం వరకు చెల్లింపులకే..ఏటా తీసుకునే అప్పులతో పాటు పద్దులో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. కాలపరిమితి తీరిన గత అప్పులు, అన్ని అప్పులకు వడ్డీలు ఏయేటికాయేడు చెల్లించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేస్తారు. ఈ మేరకు అప్పుల్లో అసలుతో పాటు వడ్డీల చెల్లింపు కింద రూ.41 వేల కోట్లు చూపెట్టారు. ఇందులో అసలు కంటే వడ్డీలే ఎక్కువ ఉండడం గమనార్హం. 2026–27లో అసలు కింద రూ. 19,785 కోట్లు చెల్లించనుండగా, వడ్డీల కింద రూ.21,304 కోట్లు కట్టనున్నారు. ఇవి పోను మిగతా రూ.41 వేల కోట్లు ఇతర ఖర్చుల కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.బడ్జెట్ కంటే ఎక్కువ సేకరణగత రెండు బడ్జెట్లను పరిశీలిస్తే ప్రతిపాదించిన వాటి కంటే ఎక్కువే అప్పులు సేకరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రూపాల్లో కలిపి 2024–25లో రూ.62 వేల కోట్లు తీసుకోవాల్సి ఉండగా, రూ.63,786 కోట్లను సేకరించింది. 2025–26లో రూ.74,645 కోట్ల మేర రుణాలు తీసుకోవాలని బడ్జెట్లో పెట్టగా రూ.77,359 కోట్లను సేకరించారు.మూడేళ్లలో రూ.20 వేల కోట్లు పెరిగిన రుణాలురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 2024–25లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ ఏడాది పద్దు రూ. 62,440 కోట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాది రూ.74 వేల కోట్లకు పెరిగింది. ఈసారి రూ.82 వేల కోట్లకు చేరడంతో మూడేళ్ల కాలంలో ఒక్క అప్పుల పద్దే ఏకంగా రూ.20 వేల కోట్లు పెరిగినట్టయింది. అదేవిధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోలిస్తే అప్పులు 32.5 శాతానికి చేరినట్టు బడ్జెట్ గణాంకాల్లో వెల్లడించారు. 2025–26లో కూడా ఇదే రీతిలో అప్పుల ప్రతిపాదనలుండడం గమనార్హం. -
అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు - సుప్రీంకోర్టు
అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు- సుప్రీంకోర్టు -
సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం శుక్రవారం రాత్రి బదిలీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సౌరభ్ గౌర్ను రిలీవ్ చేశారు. కాగా పాఠశాల విద్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టుతో పాటు ఆయుష్ డైరెక్టర్ పోస్టుకు అవసరమైన ఎఫ్ఏసీ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. -
2017లో రూ.10 వేలు పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ. 3.28 లక్షలొచ్చాయి
సూరత్: ఏటీఎంలో విత్డ్రా చేసినప్పుడు కొన్నిసార్లు డబ్బులు రావు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. కానీ మన అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది. అలాంటప్పుడు ఐదారు రోజుల్లో రీఫండ్ అవుతుందని బ్యాంకులు చెబుతాయి. రీఫండ్ అవుతాయి కూడా. కానీ గుజరాత్కు చెందిన ఈ వ్యక్తి అకౌంట్లోకి అమౌంట్ రీఫండ్ రాలేదు. బ్యాంకుల చుట్టూ తిరిగి, చివరకు న్యాయ పోరాటానికి దిగాడు. తొమ్మిదేళ్ల తరువాత.. అతడు కోల్పోయిన రూ.10వేలకుగాను రూ.3.28 లక్షలు వసూలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే సూరత్కు చెందిన ఓ వ్యక్తి 2017, ఫ్రిబవరి 18న సూరత్లోని ఉద్నా ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎమ్కు వెళ్లాడు. రూ.10 వేలు విత్డ్రా చేసేందుకు ప్రయతి్నంచాడు. నగదు రాలేదు.. కానీ కాసేపటికి డబ్బులు కట్ అయినట్లు ఫోన్కు మెసేజ్ వచి్చంది. అదే నెల 21న దుంభాల్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని బ్యాంకుకు మెయిల్స్ కూడా పెట్టాడు. చివరకు ఆర్బీఐని ఆశ్రయించాడు. ఏటీఎమ్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించాలని కోరాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 2017 డిసెంబర్ 20న వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించాడు. ఆ ఏటీఎమ్ ఎస్బీఐకి చెందినదని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) వాదించింది. ఆ బ్యాంకుదే బాధ్యతని కోర్టుకు తెలిపింది. వినియోగదారుల ఫోరమ్ బీఓబీ వాదనను తోసిపుచి్చంది. లావాదేవీకి సంబంధించి బ్యాంకు ఆధారాలను చూపించాలని పేర్కొంది. అంతేకాదు, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా రీఫండ్ చేయాల్సి ఉండగా.. బీఓబీ చేయలేదని ఫోరమ్ గుర్తించింది. బ్యాంక్పై ఆగ్రహం వ్యక్తం చేసి.. రూ.10వేలపై 9శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైనందుకుగానూ.. రోజుకు రూ.100 చొప్పున ఫైన్ వేసింది. డబ్బు పోగొట్టుకుని అతడు పడ్డ మానసిక వేదనకు రూ.3,000, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.2,000.. ఈ పరిహారం మొత్తం రూ. 3,28,800గా నిర్ణయించింది. వినియోగదారునికి చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. -
9 కొత్తగా పథకాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి లెక్కల పద్దుతోపాటు కొన్ని కొత్త పథకాలకూ బడ్జెట్ వేదికైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు నిధుల కేటాయింపును ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కొత్తగా 9 పథకాలనూ ప్రకటించారు. వాటి వివరాలను శుక్రవారం బడ్టెట్లో ప్రస్తావించారు. వీటిల్లో కొన్ని పూర్తి కొత్త పథకాలు కాగా, కొన్ని అమలులో ఉన్న వాటి పరిధి పెంచారు. వీటికి నిధులను ప్రతిపాదించారు.‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకుటుంబానికి జీవనధారమైన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా బీమా సౌకర్యాన్ని క ల్పించాలని నిర్ణయించారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’అని నామకరణం చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల కుటుంబాలు ఉన్నాయని సామాజిక, ఆర్థిక తారతమ్యాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం వర్తిస్తుందని భట్టి ప్రకటించారు. బడ్జెట్లో ఈ పథకానికి రూ. 4వేల కోట్లు కేటాయించారు. చేయూత కింద...చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన 2 లక్షల పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 43 లక్షల మందికి చేయూత అందిస్తున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రాష్ట్ర విద్యా కమిషన్ సూచన మేరకు మొత్తం 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎంపిక చేసిన ఈ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థ, ఇతర అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదించారు.ఆరోగ్య భద్రత పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించాలని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందడానికి వీలుంటుంది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం ఉద్యోగుల భద్రత కోసం దేశంలో తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం ద్వారా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ 2 కోట్ల అదనపు కవరేజీ లభిస్తుంది. ఇది 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మి డియెట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతీ విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావ అందిస్తారు. దీనికి బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మి డియెట్ అభ్యసిస్తున్న విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకం ఇంటర్ విద్యార్థులకూ దక్కనుంది. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంవిదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. యువతకు వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ, ఉపాధికి అవకాశం ఉన్న వివిధ దేశాల భాషల్లో అవగాహన క ల్పించటం, వారికి వీసా పొందటంలో మార్గనిర్దేశం చేయటం, విదేశీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు, ఆయా దేశాల్లో ఆరోగ్య సేవలు కల్పించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఇందుకోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లుబడ్జెట్లో వెల్లడించారు. దీనికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్షిప్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెలా రూ. 2 వేలు స్కాలర్íÙప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించారు. -
కాసుల పాన్పుపై కత్తెర కాన్పు
విశాఖ నగరం దొండపర్తికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల తర్వాత ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తొమ్మిది నెలలుగా అంతా బాగుందన్న వైద్యులు.. ఒక్కసారిగా మాట మార్చారు. ‘బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే సిజేరియన్ చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకే ప్రమాదం’అంటూ కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. గత్యంతరం లేక వారు ఆపరేషన్కు అంగీకరించారు. తీరా డిశ్చార్జి సమయంలో అన్ని ఖర్చులు కలిపి రూ.1.20 లక్షల బిల్లు చేతిలో పెట్టడంతో ఆ కుటుంబం కంగుతింది. అప్పులు చేసి మరీ బిల్లు చెల్లించాల్సి వచ్చిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఇది కేవలం ఒక్క మహిళ పరిస్థితే కాదు.. నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న తంతే!మహారాణిపేట : నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి వెళితే చాలు.. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు కాసుల గలగలే. బిడ్డ అడ్డం తిరిగింది.. ఉమ్మనీరు తగ్గిపోయింది.. తక్షణం ఆపరేషన్ చేయకపోతే ముప్పు పొంచి ఉంది అంటూ అప్పటికప్పుడు భయపెట్టి ఆపరేషన్ థియేటర్కు తరలిస్తున్నారు. మరోవైపు ఫలానా ముహూర్తానికే మా వంశోద్ధారకుడు పుట్టాలి అంటూ కొందరు మూఢనమ్మకాలతో కత్తెర కాన్పులను కోరుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో సిజేరియన్లు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. విశాఖ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 271 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 102 వరకు మాతాశిశు, ప్రసూతి ఆస్పత్రులే ఉన్నాయి. గతంలో గీతం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సిజేరియన్లు జరుగుతున్నాయని గుర్తించిన అప్పటి కలెక్టర్ మల్లికార్జున భారీ జరిమానా విధించారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రుల తీరులో మార్పు రాలేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు నమోదైన డేటా ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,518 సిజేరియన్లు(39.84శాతం) జరగ్గా, 4,309 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏకంగా 6,820 సిజేరియన్లు(60.15 శాతం) జరగ్గా, 4,263 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సక్రమంగా అందడం లేదన్న అపోహలతో ఎక్కువ మంది ప్రైవేట్ను ఆశ్రయిస్తుండటమే ఈ దోపిడీకి ప్రధాన కారణం. ముహూర్తాల మోజులోవైద్యుల కాసుల కక్కుర్తి ఒక వైపైతే.. ప్రజల మూఢనమ్మకాలు మరోవైపు సిజేరియన్లకు కారణమవుతున్నాయి. శుభ ఘడియాలు, నక్షత్రాలు, తిథుల ప్రకారం ఫలానా రోజు, ఫలానా సమయానికే బిడ్డ పుట్టాలంటూ పురోహితుల సూచనలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ముహూర్తాలకు వైద్యులు అంగీకరించరు కాబట్టి, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా, కత్తి కోతలతో తల్లి ఆరోగ్యానికి భవిష్యత్తులో హాని అని తెలిసినా.. ముహూర్తాలకే మొగ్గుచూపుతున్నారు. అమాయక ప్రజల ఈ సెంటిమెంట్ను ప్రైవేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. అంతా కాసుల కోసమే.. సాధారణ కాన్పు జరిగితే రెండు, మూడు రోజుల్లోనే తల్లీబిడ్డను డిశ్చార్జి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆస్పత్రికి వచ్చే ఆదాయం తక్కువ. అదే సిజేరియన్ అయితే కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుకోవచ్చు. గది అద్దెలు, వివిధ ల్యాబ్ పరీక్షలు, మందులు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు.. ఇలా అన్ని రకాలుగా కలిపి రూ.30 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేయవచ్చు. ఈ కక్కుర్తితోనే కొన్ని ఆస్పత్రులు దాదాపు తొమ్మిది నెలల పాటు నార్మల్ డెలివరీ అని నమ్మబలికి, చివరి నిమిషంలో భయపెట్టి సిజేరియన్ల వైపు మళ్లిస్తున్నాయి. దీనిపై ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అనవసర సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు సిజేరియన్ ఎప్పుడు చేయాలి? నిజానికి సిజేరియన్ అనేది అత్యవసర పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలు నిలపడానికి మాత్రమే చేసే ప్రక్రియ. వైద్య నిబంధనల ప్రకారం బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు, శిశువు బరువు అసాధారణంగా పెరిగినా, కడుపులో అడ్డం తిరిగినా, ఉమ్మనీరు బాగా తగ్గిపోయినా, లేదా శిశువు ఉమ్మనీరు తాగేసినా, తల్లికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు, కవలలు (ఇద్దరు లేదా ముగ్గురు) జన్మించే సమయంలో ఆపరేషన్ చేయాలి. -
కుమార్తెతో కలిసి కిమ్ సైనిక స్థావరాల సందర్శన
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏతో కలిసి మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. ఒక ఆధునిక యుద్ధ ట్యాంక్ను నడిపారు. నల్లటి తోలు జాకెట్లు ధరించిన తండ్రీకూతుళ్లు, ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. తన కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకుని శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రోన్లు లక్ష్యాలను ఛేదించడం, సైనికులు రైఫిల్ షూటింగ్ చేయడం వంటి ప్రత్యక్ష సైనిక వ్యాయామాలను దగ్గరుండి పర్యవేక్షించారు. 420 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను కూడా గురిపెట్టే లక్ష్యంతో ఈ డ్రిల్ జరిగినట్లు సమాచారం. ట్యాంక్ యూనిట్లు, పదాతి దళాలతో కూడిన కాల్పులు, ఇతర విన్యాసాలను కిమ్ పర్యవేక్షించారని, యుద్ధ సన్నాహాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. కిమ్ జు–ఏ 2022 నుంచే తన తండ్రితో కలిసి హై–ప్రొఫైల్ సైనిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. గత వారమే తండ్రీకూతుళ్లిద్దరూ ఒక తేలికపాటి ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. పిస్టల్స్తో కాల్పులు జరిపారు. పలు రాకెట్ ప్రయోగ వ్యవస్థల ప్రత్యక్ష కాల్పుల పరీక్షను వీక్షించారు. అంతేకాదు కిమ్ జు–ఏ గత సెపె్టంబర్లో తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లింది. నూతన సంవత్సర వేడుకల్లోనూ పాల్గొంది. ఈ వరుస చర్యల నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ఆమెను త్వరలోనే తన వారసురాలిగా ప్రకటించనున్నారని దక్షిణ కొరియా గూఢచార సంస్థ కూడా అంచనా వేసింది. ఇది తదుపరి వారసురాలు ఆమె కావచ్చనే ఊహలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ సైనిక విన్యాసాలు కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, అమెరికా, ఇతర దేశాలకు యుద్ధానికి సిద్ధమనే హెచ్చరికగా భావిస్తున్నారు. -
ముస్లింలకు తోఫా కాదు.. ధోకా
సాక్షి, అమరావతి : ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మరోసారి ధోకా ఇచ్చారు. గత ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండానే, ఇటీవల ఇఫ్తార్ విందులో అన్నీ చేసేసినట్టు అబద్ధాలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ముస్లింలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలను కూడా తానే చేసినట్టు బాబు క్రెడిట్ చోరీకి పాల్పడిన తీరును ముస్లిం నేతలు తప్పు పడుతున్నారు. ఇమామ్కు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచింది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించి, ముస్లింల పక్షాన ఉన్న వైఎస్ జగన్ తన హయాంలో వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్వహించి, అన్యాక్రాంతమైన వాటిని కాపాడి, వేలాది వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేయించారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు వివిధ పథకాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.20,863.40 కోట్ల లబ్ధి చేకూర్చారు. తద్వారా ముస్లింలను రాజకీయంగా, ఆరి్థకంగా, సామాజికంగా ముందుకు నడిపించారని ముస్లిం సమాజం చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన దగాను గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మోసాలివీ» మసీదులకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇస్తామన్న హామీ ఊసేలేదు. » ఇమామ్, మౌజన్లకు నెలల తరబడి గౌరవ వేతనాలు పెండింగ్. బక్రీద్, రంజాన్ ముందు హడావుడిగా అరకొరగా విడుదల. » 22 నెలలుగా 1,500 మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం దరఖాస్తులు పెండింగ్. » గత ప్రభుత్వ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డు రద్దు. నూతన వక్ఫ్ బోర్డులో మతపరమైన సాహితీ వేత్తలకు ఇవ్వాల్సిన డైరెక్టర్ పోస్టులను టీడీపీ నేతలకు కట్టబెట్టిన వైనం. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రాజమహేంద్రవరానికి చెందిన ముస్లిం ప్రతినిధి. » కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు పలికిన చంద్రబాబు సర్కారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా అన్యాక్రాంతం చేసేందుకు ఆస్కారం కల్పిస్తూ.. మరోవైపు వాటిని రక్షిస్తున్నట్టు బిల్డప్. » అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి.. ఏడాది తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదం. మరో ఆరు నెలలకు తీరుబడిగా జీఓ ఇచ్చి.. ఇస్తామన్న రూ.100 కోట్లు ఇప్పటి వరకు కేటాయించలేదు. » రాష్ట్రంలో ఈద్గాలు, ఖబర్స్తాన్లకు భూములు కేటాయింపు, ముస్లింలకు ఆటోనగర్ల ఏర్పాటు హుళక్కే. » 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు సైతం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చెల్లించలేదు. » హజ్ యాత్రకు వెళ్లిన వారికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చి.. 2025లో వెళ్లిన వారందరికీ కాకుండా విజయవాడ నుంచి వెళ్లిన వారికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. » మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. » చంద్రన్న పెళ్లి కానుక, ఇస్లామిక్ బ్యాంక్, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్, విదేశీ విద్య పథకం తదితర హామీలు అమలు చేయకుండా మరో సారి మోసం చేశారు. -
వేడి.. ఒత్తి‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్: ఆరుబయట శరీరాన్ని ఒక మోస్తరుగా కదిలించే చిన్నా చితకా పనులు చెయ్యడం, నడక వంటి వ్యాపకాలు ఆరోగ్యదాయకమని అందరికీ తెలిసిందే. ఈ జీవనయోగ్యతకు అధిక వేడి విఘాతం కలిగిస్తోంది. ఎంత సమయం మేరకు ఇలా హరించుకుపోతోందో అమెరికా పరిశోధకులు తాజాగా లెక్కగట్టారు. వృద్ధులే కాకుండా యువత కూడా బోల్డన్ని ‘జీవనయోగ్యమైన గంటల’సమయాన్ని కోల్పోతున్నారో శాస్త్రీయంగా పరిశోధించారు. మిగతా దేశాల్లో కన్నా మన దేశంలోనే జీవనయోగ్యత తగ్గిపోతోందంటున్నారు. భూమి వేడెక్కుతున్న కొద్దీ, తీవ్రమైన వేడి మానవ ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధులకు, పేద ప్రజలకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న వేడితో జీవన సౌలభ్యం తగ్గిపోతోంది. మానవుల పనుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల జీవనానందాన్ని హరిస్తున్నాయి. అమెరికా నిపుణుల తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ ల్యూక్ అలెగ్జాండర్ పార్సన్స్ నేతృత్వంలో పలు అమెరికా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ‘ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్:హెల్త్ జర్నల్’లో ఇటీవల ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. నడవడం లేదా రోజువారీ తేలికపాటి ఇంటి పనులను సురక్షితంగా చేసుకునే సామర్థ్యాన్ని వేడి ఎలా ప్రభావితం చేస్తున్నదో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గంటల వారీ ఉష్ణోగ్రత, తేమకు సంబంధించిన డేటాను (1950–2024) విశ్లేషించారు. ఆరోగ్యవంతులైన యువకులు (18–40 సంవత్సరాలు), వృద్ధుల(65 ఏళ్లు పైబడినవారు) పై దృష్టి కేంద్రీకరించారు. ‘జీవనయోగ్యత’అంటే?ప్రజలు వేడి వలన శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరగకుండా.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు శారీరక శ్రమను కలిగించే రోజువారీ (కూర్చోవడం, నడవడం, తేలికపాటి ఇంటిపనులు) పనులను సురక్షితంగా, సౌకర్యవంతంగా చెయ్యగలిగే సానుకూల వాతావరణ పరిస్థితులను ‘జీవనయోగ్యమైన’(లివబుల్) కాలంగా చెప్పుకోవచ్చు. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ సౌలభ్యం తగ్గిపోతోంది. అనుదినం విలువైన ‘జీవనయోగ్యమైన సమయం’అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నానాటికీ ఇది కుంచించుకోపోతోందని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్గారాలు తగ్గించాల్సిందే..జనసాంద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో, ప్రజలకు వేడి బాధలు ఎక్కువని కూడా ఈ అధ్యయనం తేల్చింది. భారతీయ యువత 10 వేల కోట్ల గంటలు, వృద్ధులు లక్ష కోట్ల గంటలకు పైగా హాయిగా గడిపే ‘జీవనయోగ్యమైన’సమయాన్ని కోల్పోయారని చెబుతోంది. వేడి ఒత్తిడిని తట్టుకోవటంలో వృద్ధులకు తక్కువ సామర్థ్యం ఉంటుంది కాబట్టి వీరికి ఎక్కువ గంటలు అసౌకర్యం కలుగుతోందని గుర్తించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, వేడిని తట్టుకోవటానికి మరింత గట్టి చర్యలు తీసుకోకపోతే, ఈ ముప్పు మరింతగా పెరుగుతూనే ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.వృద్ధుల్లో 78%,యువతలో 35% బాధితులుగత 75 సంవత్సరాలుగా వేడి ప్రాంతాలలో ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఆరుబయట గడపగలిగే గంటల సంఖ్య తగ్గిపోయిందని, తద్వారా జీవనయోగ్యత కూడా తగ్గిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, అల్పాదాయ ప్రాంతాల్లో ప్రజలు చాలా వేడి సమయాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి సంవత్సరం వందల నుంచి వేల గంటలను వేడి వాతావరణంలో గడుపుతున్నారు. వృద్ధులు ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నారు. కొన్ని నివాస ప్రాంతాల్లో సంవత్సరానికి 3,000 గంటల వరకు సురక్షితం కాని స్థాయిలో వేడి ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కలిగిన కుటుంబాల్లోని వృద్ధులు నీడ పట్టున లేదా ఏసీ గదుల్లో గడుపుతుంటే.. పేద వృద్ధులు బయట పనులు ఎక్కువ సేపు చెయ్యలేక తక్కువ సంపాదనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.వృద్ధులకే ఎక్కువ ఇబ్బంది వృద్ధులకు వేడి వలన కలిగే ఇబ్బంది యువతతో పోల్చితే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏటా సగటున 900 గంటల పాటు వీరు వేడి వల్ల తీవ్ర అసౌకర్యంగా జీవిస్తున్నారు. 1950లలో ఇది సంవత్సరానికి 600 గంటలే. దీని అర్థం ఏమంటే, సంవత్సరంలో సుమారు 10 శాతం కాలం పాటు, తీవ్రమైన వేడి కారణంగా వృద్ధులు ఆరుబయట తేలికపాటి పనులు చేయటం కూడా సురక్షితం కాదు. ఆ మేరకు వారు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుంది. ఒకే రకమైన పరిసర ఉష్ణోగ్రత, తేమ ఉన్నప్పటికీ యుక్తవయసు్కల శరీరాలు చెమటను విడుదల చేయడం ద్వారా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడం లేదా చల్లబరచుకోవడం జరుగుతుంది. అయితే, వృద్ధుల శరీరాలు ఈ పనిని అంత సమర్థవంతంగా చేయలేవని పరిశోధకులు వివరించారు. -
నన్ను చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది: రష్యన్ జర్నలిస్ట్
బీరుట్: ఇజ్రాయెల్ తనను చంపడానికి ప్రయత్నించిందని రష్యన్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ ఆరోపించారు. ఆ దేశం చేస్తున్న యుద్ధ నేరాలు బయటికి రావొద్దని ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందన్నారు. గురువారం లెబనాన్లోని అల్–ఖస్మియా వంతెన సమీపంలో చిత్రీకరణ చేస్తుండగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిదా గాయపడ్డారు. అనంతరం ఇద్దరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు స్వీనీ చేతి నుంచి శకలాలను తొలగిస్తున్న వీడియోను రిదా పంచుకున్నారు. అనంతరం, స్వీనీ శుక్రవారం ఇజ్రాయెల్పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘వంతెనలను లక్ష్యంగా చేసుకోవడం, 10 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించడం, నక్బా కంటే పెద్ద ఎత్తున జరుగుతున్న జాతి ప్రక్షాళన చర్యపై దక్షిణ లెబనాన్లో నేను రిపోరి్టంగ్ చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి నన్ను చంపడానికి ప్రయతి్నంచింది’అని రష్యన్ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీలో కరస్పాండెంట్గా పనిచేస్తున్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. చిత్రీకరణకు లెబనీస్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా దాడి చేసిందని మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను నమోదు చేస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నమని స్వీనీ ఆరోపించారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ దాడిని ఖండించారు. గాజాలో 200 మంది జర్నలిస్టుల హత్య తరహాలోనే ఇది జరిగిందని, ప్రెస్ జాకెట్లు ధరించిన జర్నలిస్టులపై దాడిని ప్రమాదవశాత్తుగా జరిగిందని చెప్పలేమని అన్నారు. రాకెట్ ముఖ్యమైన వ్యూహాత్మక సైనిక స్థావరంపై కాకుండా, రిపోర్ట్ చిత్రీకరిస్తున్న ప్రదేశంపై పడిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన కోసం రష్యా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు. అయితే, దాడి జరిగిన ప్రాంతం నుంచి పౌరులు వెళ్లిపోవాలని తాము పదేపదే హెచ్చరికలు జారీ చేశామని, తగినంత సమయం ఇచి్చన తర్వాతే క్షిపణిని ప్రయోగించామని ఇజ్రాయెల్ తెలిపింది. -
మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అట్టుడికి పోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్రా మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ప్రభుత్వం అండ చూసుకుని మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన గ్రామ పెద్దలను తాళ్లతో నిర్బంధించి ఆరా తీయడంతో సర్కారు ద్రోహం బయటపడింది.ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకువచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే.. ఆంధ్రా, తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా, ఆంధ్రా మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లు (500 సీసీ) జిల్లాలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతోపాటు పలువురు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. కానీ ఆ నాలుగు బోట్లను మాత్రం వదిలి పెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఐదు నెలలుగా మత్స్యకార యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒకమాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాలుపంచుకున్నారు. తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీ డీల్ » ఇటీవల బోగోలు మండలం జువ్వలదిన్నెకు ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావడం.. ఆ తర్వాత నాలుగు రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న నాలుగు బోట్లను రహస్యంగా వదిలేయడం జరిగిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగి్నతో రగిలిపోతున్నారు. » టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం పెద్దలకు భారీ మొత్తం చేతిలో పెట్టి, మత్స్యకారుల నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను విడిపించినట్లు తెలుస్తోంది. ఇదంతా టీడీపీ పెద్దల కుట్ర కోణంతోనే జరిగిందని తీర ప్రాంతంలో ఉన్న దాదాపు 114 గ్రామాల మత్స్యకార ప్రజలు మండిపడుతున్నారు. బోట్లు వదిలేసిన వారిని నిర్బంధించిన మత్స్యకారులు » అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెంకు చెందిన గ్రామ పెద్ద కాపు, ఆయన ఇద్దరు కుమారులతోపాటు బోగోలు మండలం బంగారుపాళెంకు చెందిన మరో కాపును మత్స్యకారులు, ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.» మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచి్చనట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసు అధికారులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని ఆ గ్రామాల మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.తరచూ జరిగేది ఇదేతీరంలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మత్స్యకారులు తరచూ తమిళ జాలర్లతో బతుకు పోరాటం చేస్తున్నారు. వీరు వేటాడిన మత్స్య సంపదను రెప్పపాటులో తమిళ మత్స్య దొంగలు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి దోచుకుపోతున్నారు. తమిళనాడులోని వ్యాపారులు కొందరు అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు. నిబంధనల ప్రకారం తీరానికి 12 నాటికల్ మైళ్ల అవతల కాకుండా కేవలం 5 నాటికల్ మైళ్లలోపు వేట సాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ నుంచి ప్రకాశం జిల్లా కొత్త పట్నం వరకు తమిళ మత్స్యకారులు దూసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతం గోవిందరావు పట్టపుపాళెం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో తమిళ మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు. -
ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అవినాశ్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు.. » ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు. » ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. » ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. » దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణించి ఊరట కల్పించాలి.ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది. -
పక్కాగా పాత వాహనాల రీసైక్లింగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పాత, పనికిరాని వాహనాల (ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్–ఈల్వీఎస్) రీసైక్లింగ్ను పర్యావరణానికి అనుకూలంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకమైన పటిష్ట వ్యవస్థను రూపొందించినట్లు ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో చెప్పారు. అనధికార రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి మార్పులో భాగంగా దేశంలో పాత వాహనాల స్క్రాపింగ్ ఇప్పటివరకు ప్రధానంగా అనధికార రంగంలో జరుగుతోందన్నారు. దీనిని నియంత్రిత వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ‘వాహన స్క్రాపింగ్ పాలసీ’(వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరైజేషన్ ప్రొగ్రాం–వీ–వీఎంపీ) అమలు చేస్తోందన్నారు. దీనికి అనుగుణంగా 2021లో మోటార్ వాహనాల (వాహన స్క్రాపింగ్ సౌకర్యాల నమోదు మరియు విధులు) నిబంధనలు రూపొందించి, అనంతరం పలు సవరణలు చేసిందన్నారు. 2026 మార్చి 10 నాటికి దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 134 రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఏటా ఆడిటింగ్ అనధికారికంగా వాహనాల విభజన వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై ప్రత్యేక అధ్యయనం జరగనప్పటికీ, ఆర్వీఎస్ఎఫ్ఎస్లో పర్యావరణ భద్రతకు కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ‘కలుíÙతాలు లీక్ కాకుండా ప్రత్యేక డీ–పాల్యూషన్ పరికరాలు, ఆయిల్, బ్యాటరీలు, గ్యాస్ వంటి హానికర పదార్థాల వేరు నిల్వ, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నీటి రీసైక్లింగ్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, శబ్ద కాలుష్య నియంత్రణ వంటివి ఉన్నాయన్నారు. అదనంగా ఏటా ఆడిట్తో స్క్రాపింగ్ కేంద్రాల పనితీరును అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం స్క్రాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కలి్పంచినట్లు పేర్కొన్నారు. అలాగే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన ‘వీ్రస్కాప్’మాడ్యూల్ ద్వారా వాహనాల స్క్రాపింగ్ ప్రక్రియను ఆన్లైన్ చేసినట్లు వెల్లడించారు. పాత ప్రభుత్వ వాహనాల వేలం కోసం ‘ఎంఎస్టీసీ’, ‘జీఈఎం’పోర్టల్స్ ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలకు ప్రోత్సాహంగా 2025–26లో ప్రత్యేక సహాయం పథకం కింద రూ.2వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పలు రాయితీలు స్క్రాపింగ్ కేంద్రాల్లో వాహనాలను సమర్పించే వారికి ప్రభుత్వం రాయితీలు అందిస్తోంందన్నారు. ప్రధానంగా.. ‘కొత్త వాహన నమోదు ఫీజు మినహాయింపు, మోటార్ వాహన పన్నులో 15శాతం నుంచి 25శాతం వరకు రాయితీ, పాత బీఎస్–1, బీఎస్–2 వాహనాల మారి్పడిపై 50శాతం వరకు పన్ను తగ్గింపు’అని వివరించారు. ప్రస్తుతం ఉన్న 134 ఆర్వీఎస్ఎఫ్ఎస్ ద్వారా సంవత్సరానికి సగటున 10వేల నుంచి 12వేల వాహనాలను స్క్రాప్ చేసే సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటివరకు 4,60,979 వాహనాలు స్క్రాప్ చేయగా, ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,79,792 వాహనాలు స్క్రాప్ చేసినట్లు తెలిపారు. ఈపీఆర్ విధానం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 2025లో ‘ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ రూల్స్’కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించిందన్నారు. ఇందులో వాహన తయారీదారులకు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, కాలుష్య నియంత్రణ మండలి– 2023 మార్గదర్శకాల ద్వారా పాత వాహనాల విభజన, రీసైక్లింగ్ ప్రక్రియను సురక్షితంగా నిర్వహించే విధానాలను నిర్దేశించిందన్నారు. దేశంలో పాత వాహనాల రీసైక్లింగ్ను పర్యావరణ అనుకూల, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్కారీ స్పష్టం చేశారు. -
అది నేనే.. ఇదీ నేనే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమలలో స్వామివారి ప్రసాదంలో వాడే ముడిపదార్థాలు, భక్తులకు పెట్టే అన్నప్రసాదాల్లో నాణ్యతను పెంపొందించేందుకు శనివారం ప్రారంభం కానున్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకుంటూ, స్వయంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రత్యేకంగా తిరుమలకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేస్తే అది తన ఘనతగా చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. » 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరుపతిలో నిర్వహించింది. సమావేశానికి హాజరైన సీఈవో కమలవర్ధన్రావు ఈ సందర్భంగా తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనాన్ని, శ్రీవారి లడ్డూ పోటును స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు.» అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం... తిరుమలకు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేయాలని సీఈవోను కోరింది.» దీంతో భక్తులకు వడ్డించే ఆహారం, లడ్డూ తయారీలో వాడే నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి టీటీడీకి సొంతంగా అధునాతన ల్యాబ్ను ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపున మంజూరు చేస్తున్నట్లు మీడియా సాక్షిగా కమలవర్ధన్రావు ప్రకటించారు.» వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు రావడంతో, ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు. » ల్యాబ్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐకు ప్రతిపాదనలు కూడా పంపారు.» గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా రూ.20 కోట్లతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటయ్యింది. » అదంతా తన గొప్పేనంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. -
పెంపుడు పిల్లి కోసం ప్రాణం తీసుకుంది
అల్వాల్: పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రిసాలా బజార్ పరిధిలోని శివ్మన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్ చదువుతోంది.కాగా ఇంట్లో పెంపుడు పిల్లి విషయమై తల్లి, కుమార్తెల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందింది. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు సమాచా రం అందించగా.. శ్రేష్ట అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్వాల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కనీసం 53 మంది గాయపడ్డారు. వారిలో 24 మంది పరిస్థితి విషయంగా మారింది. డెడ్యోక్ జిల్లాలోని డెజియోన్ నగరంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో 14 మంది జాడ గల్లంతయ్యింది. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1.17 గంటలకు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. మంటల తీవ్రతకు ఫ్యాక్టరీ నేలమట్టమైంది. కొందరు ఫ్యాక్టరీ పై నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. లోపలున్న వారు పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలో రసాయనాల నిల్వలుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. -
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
రెచ్చిపోయిన పిచ్చికుక్క
దుబ్బాక: పిచ్చికుక్క దాడిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పట్టణంలోని 16వ వార్డులో పోలీస్స్టేషన్ సమీపంలో పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. కాగా వీరిలో పర్స బాలయ్యకు తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.మిగతా 14 మంది దుబ్బాక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క కనిపించిన వారందరిపై దాడి చేసి.. కరవడంతో తీవ్ర రక్త స్రావాలయ్యాయి. పట్టణంలోని 16 వార్డుకు చెందిన 12 మంది, 1, 20 వార్డులకు చెందిన ముగ్గురిపై దాడి చేసింది. అనంతరం ప్రజలు పిచ్చికుక్కను చంపారు. కౌన్సిలర్ రాజు, నాయకులు శ్రీరాం రవీందర్, సాయితేజగౌడ్ గాయపడిన వారికి చికిత్స చేయించారు. -
అస్సాంలో బీజేపీ దూకుడు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ నడుమ మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవి్వళ్లూరుతోంది. కాషాయ పార్టీ ఆశలను వమ్ము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పారీ్టలూ భాగస్వాములతో పొత్తుల ప్రక్రియను పూర్తి చేసుకుని పోటాపోటీగా అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రాష్ట్రమంతటా ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కూడా. అయితే సీఎం హిమంత సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... చొరబాట్లు, అస్తిత్వ, హిందూత్వ–ముస్లిం రాజకీయాలు. ఇవే అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చేలా కని్పస్తున్న ప్రధానాంశాలు. అస్సామీల అస్తిత్వం, భూముల పరిరక్షకునిగా ముఖ్యమంత్రి సాధించిన హిమంత బిశ్వశర్మ ఇమేజీ బీజేపీకి పెద్ద సానుకూలతగా కనిపిస్తోంది. అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన సర్కారు ఉక్కుపాదం మోపింది. భూమి లేని స్థానికులకు, తేయాకు కారి్మక కుటుంబాలకు భూ పట్టాలిచి్చంది. వీటికితోడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం రూ.5,000 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన అస్సాం గణ పరిషద్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), రభా హసోంగ్ జతా మంచ్ వంటివాటితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా సాగిపోయింది. ఏజీపీకి 26, బీపీఎఫ్కు 11 స్థానాలు కేటాయించింది. మోదీ కరిష్మాకు సీఎం హిమత జనాదరణ కూడా తోడవనుంది. ఇక కాంగ్రెస్ మరోసారి వామపక్షాలు, రాయ్జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషద్ వంటి పార్టీలతో జట్టు కట్టింది. కానీ నేతల వలసలు కాంగ్రెస్ను కుంగదీస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ భూపేన్ బోరా, మాజీ ఎంపీ ప్రద్యోత్ బోర్డోలోయ్ ఇటీవల పార్టీని వీడారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఏకంగా పాకిస్తానీ ఏజెంట్ అంటూ సీఎం హిమంత చేస్తున్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. హిందూ నేతలకు కూడా కాంగ్రెస్లో కనీస గౌరవం లేదంటూ ర్యాలీల్లో ఆయన పదేపదే చేస్తున్న విమర్శలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వీటికి తోడు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా కాంగ్రెస్ను బాగానే దెబ్బ తీసింది. ఆ పార్టీ సులువుగా గెలవగలిగిన ముస్లిం ప్రాబల్య స్థానాల సంఖ్యకు గండి పడింది. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పండుగ వేళ.. తీరని విషాదం
భద్రాచలం అర్బన్/ఉయ్యూరు రూరల్/కుక్కునూరు/మంగళగిరి టౌన్/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్ఆర్ఎమ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్.దీపక్, గడ్డం హర్షవర్ధన్ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.సాయం అందలేదు వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.గజ ఈతగాళ్లతో గాలింపుస్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్ గుప్తా తండ్రికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్ మృతదేహాలు బయటపడగా.. సతీష్కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.మృతులు, గల్లంతైన వారి వివరాలు 01) చారుగుళ్ల శ్రీకర్ గుప్తా(21), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 02) దగ్గుబాటి నవదీప్(19), విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 03) పొడిచేటి అభిరామ్(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 04) పాశం సతీష్ కుమార్(19), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ సెకండ్ ఇయర్ స్వస్థలం: ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా మృతుల కుటుంబాలకు సానుభూతి సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
ఎక్కడున్నా వదలం!
దుబాయ్: పశి్చమాసియా యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇజ్రాయెల్–అమెరికా రాజేసిన యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటికీ విస్తరించేందుకు ఇరాన్ ప్రయతి్నస్తోంది. శుక్రవారం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిచి్చంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలన్నింటినీ ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ‘‘పార్కులు, విడిది, పర్యాటక కేంద్రాల వంటివేవీ మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ లక్ష్యాలుగా చేసుకుంటాం’’ అని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ షెకార్చీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా ఇరాన్ నెమ్మదించలేదు. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. కువైట్లో రెండు రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసే మినా అల్ అహ్మదీ రిఫైనరీలో పలు యూనిట్లు మంటల్లో చిక్కాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ రెండు క్షేత్రాలపై గురువారం కూడా ఇరాన్ దాడులు చేయడం తెలిసిందే. సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్ల్లో కూడా భారీ బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్న ఇరాన్ సంస్థలన్నింటినీ మూసేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్లో హైఫాలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి.బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. గురువారం తన గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానంపై చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ను కూడా విడుదల చేసింది. ఈ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు దాడికి గురికావడం వాటి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఇరాన్పై బాంబుల వర్షం పర్షియా నూతన సంవత్సరం ‘నౌరోజ్’ నాడు ఇరాన్పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపైనా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై ఇక దాడులు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్కు మరో మూడు యుద్ధ నౌకలను తరలించాలని అమెరికా నిర్ణయించింది. సిరియాపైనా దాడులు ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్తో పాటు సిరియాకూ విస్తరించింది. స్వెయ్డాతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనారిటీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.వారి భ్రమలు వీడాయి: మొజ్తబా ఇరాన్ నాయకత్వాన్ని, అగ్ర నేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటిప్పుడు భ్రమలు వీడాయన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై మూడు వారాలైనా వాళ్లు గొప్ప ధైర్యస్థైర్యాలు చూపుతున్నారంటూ కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా మొజ్తబాను ఉటంకిస్తూ ఇరాన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధలు చేస్తూ కని్పస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొజ్తబా ఇప్పటిదాకా బహిరంగంగా కని్పంచకపోవడం తెలిసిందే. తండ్రి అయతొల్లా ఖమేనీ తదితరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలొస్తూనే ఉన్నాయి.నాటో దేశాలు పిరికిపందలు: ట్రంప్ వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికిపందలుగా అభివరి్ణంచారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్నాయంటూ నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారమయ్యే చిన్న సమస్య అది. పైగా వాటికి పెద్దగా రిస్కు కూడా లేని వ్యవహారం. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నాయి. నాటో దేశాల ఈ పిరికిపంద చర్యను గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్కు సర్ప్రైజ్ ఇస్తామంటూ ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైనీ ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు.హార్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై బాంబులు హార్మూజ్ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. దాని సమీపంలోని పలు ఇరాన్ నావికా దళ లక్ష్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. ఇరాన్ నావికా, సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్ లాంచర్ వ్యవస్థలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. హార్మూజ్ సుంకం! రూ.18 కోట్లు చెల్లించిన ఓ నౌక ముందుగా ప్రకటించినట్టుగానే హార్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఇరాన్ సుంకం వసూళ్లు ప్రారంభించింది. ఇందుకోసం ఒక చమురు నౌక రూ.18 కోట్ల పై చిలుకు మొత్తం చెల్లించినట్టు లాయిడ్స్ లిస్ట్ శుక్రవారం వెల్లడించింది. అంతేగాక హార్మూజ్ గుండా తాను అనుమతించిన నౌకల రవాణాకు పకడ్బందీగా నమోదు వ్యవస్థను కూడా రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. -
వడగళ్ల వానతో 250 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న
జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో శుక్రవా రం కురిసిన భారీ వడగళ్ల వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మండలంలోని జక్రాన్ పల్లి, అర్గుల్, తొర్లికొండ గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. సుమారు 250 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం జరిగింది.అలాగే కల్లాలలో ఆరబెట్టిన పసుపు పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించాలని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
అల్లాహ్ దీవెనలతో మానవాళికి సకల శుభాలు కలగాలి
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలిపారు. ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ చేయడం వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ పర్వదినం ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తుచేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తన సందేశంలో తెలిపారు.‘‘రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidMubarak— YS Jagan Mohan Reddy (@ysjagan) March 21, 2026 -
మందుల కొనుగోళ్లలో మాయాజాలం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ప్రజాధనం దోపిడీతో అవినీతికి కేంద్ర బిందువుగా మారిపోయింది. సంస్థ కేంద్రంగా సాగుతున్న దోపిడీ వెనుక వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మార్కెట్లో రూ.1.50 లక్షల కంటే ఎక్కువ విలువ చేయని వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్ట్ పరికరాన్ని ఏకంగా రూ.3.13 లక్షలకు కొనుగోలు చేసిన దోపిడీ ఉదంతం ఇటీవలే వెలుగు చూసింది.ఇప్పుడు మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలు బయటపడ్డాయి. అజిత్రోమైసిన్ 500 ఎంజీ వంద మాత్రలను రూ.177కు సరఫరా చేసేలా యూనిక్యూర్ ఇండియా సంస్థ గతంలో రేట్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఆ సంస్థ మందులు సరఫరా చేయలేదన్న సాకుతో స్ట్రైడ్ ఆర్గానిక్ సంస్థతో ఏకంగా రూ.869 చొప్పున చెల్లించి మాత్రల కొనుగోళ్లు చేపడుతోంది. అంటే రూ. 692 ఎక్కువ చెల్లిస్తున్నారు. కనీసం ప్రయత్నించకుండా నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎల్–1 సంస్థ మందులు సరఫరా చేయకపోతే.. వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి పెనాల్టీ విధించాలి. ఆ సంస్థ సరఫరా చేసే ధరకే మందుల కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎల్–1 సంస్థ ధరకు ఎల్2, ఎల్3 సంస్థలు మందులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటే అదే ధరకు కొనుగోలుచేయాలి. లేనిపక్షంలో అదే ధరకు కార్పొరేషన్లోని ఇతర సరఫరా సంస్థలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వంపై అదనపు భారం పడితే ఆ మొత్తాన్ని కూడా ఎల్–1 సంస్థ నుంచే రాబట్టాలి. ప్రస్తుత ఘటనలో ఈ ప్రయత్నాలేమీ చేయకుండా.. నేరుగా ఎల్–2 సంస్థను కూడా పక్కనపెట్టి ఎల్–3 అయిన స్ట్రైడ్ ఆర్గానిక్ సంస్థకు వంద మాత్రలకు రూ.869 చెల్లించేలా ఆర్డర్లు ఇచ్చేశారు. ఎల్–1 యూనిక్యూర్ ధర కంటే రూ.692 అధిక మొత్తంతో స్ట్రైడ్ ఆర్గానిక్ నుంచి మందులు కొనుగోలు చేయడం వెనుక డ్రగ్స్ విభాగంలోని కీలక అధికారి పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఎంఎస్ఐడీసీ ప్రభుత్వాస్పత్రుల కోసం లక్షల సంఖ్యలో మాత్రలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో హోల్సేల్ ధరల కంటే అత్యంత తక్కువ ధరకు మందులు సరఫరా చేయడానికి ఫార్మా సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలో అజిత్రోమైసిన్ వంద మాత్రలకు రూ.869 చెల్లించడం చూసి మందుల సరఫరా సంస్థలే ఆశ్చర్యపోతున్నాయి. -
కొనసాగుతున్న సిట్ విచారణ
మొయినాబాద్/శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. నాలుగో రోజు శుక్రవారం శంషాబాద్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారులు నిందితులను విచారించారు. స్టేషన్ బెయిల్ పొందినవారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు అర్జున్రెడ్డి, కౌశిక్ రవి, శరత్కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు.సిట్ అధికారులు ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించి వారి నుంచి డ్రగ్స్కు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ లోక్సభ సమావేశాలు ఉన్నందున వచ్చే నెల 4 వరకు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు తీసుకున్నారు. ఎంపీతోపాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో అసలు విషయాలు బయటకొస్తాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. శంషాబాద్కు సీపీ సు«దీర్బాబుడ్రగ్స్ కేసు విచారణను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంషాబాద్ పీఎస్కు చేరుకొని సిట్ అధికారులతో చర్చించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది. పెడ్లర్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలను రాబట్టాలని సూచించారు. ఈ వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి వాయిదా.. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేసి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, అతని తమ్ముడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 17న రాజేంద్రనగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై 18న కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 20కి వాయిదా వేసింది. 20న శుక్రవారం కోర్టుకు సెలవు ఉండటంతో తీర్పు సోమవారానికి వాయిదా పడింది.పాత రికార్డుల పరిశీలనవివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రోహిత్రెడ్డి ఫామ్హౌస్ను సీజ్ చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఫాంహౌస్ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు సైతం ఫాంహౌస్ భూమికి సంబంధించిన రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. అజీజ్నగర్ సర్వేనంబర్ 177/33లోని 2.20 ఎకరాల్లో రోహిత్రెడ్డి ఫామ్హౌస్ ఉంది. 2006లో రోహిత్రెడ్డి తండ్రి విఠల్రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది అసైన్డ్ భూమి కావడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అసైని అంతంగారి జంగయ్య పేరే వస్తోంది.అసైన్డ్ భూమి ఎలా రిజి్రస్టేషన్ జరిగింది ? అసలు పాత రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులు పాత దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఫామ్హౌస్ను సీజ్ చేయాల్సి వస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత రికార్డులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఫామ్హౌస్ను సీజ్ చేయాల్సి వస్తే అసైన్డ్ భూముల్లో ఉన్న మిగతా ఫామ్హౌస్లు, కబ్జాదారులపైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూముల్లో ఉన్న ఫామ్హౌస్లు, నిర్మాణాలు, కబ్జాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు... మళ్లీ రూ.3,900 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,900 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. 17 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో రూ.900 కోట్ల అప్పును ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 22 నెలల్లోనే రూ.3,33,321 కోట్ల అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేయనున్న అప్పుతో కలిపితే మొత్తం రూ.3,37,221 కోట్లకు చేరనుంది. దీంతో నెలకు రూ.15,328.22 కోట్లు, రోజుకు రూ.511 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.3,000 కోట్లు అప్పు సేకరించి ఇచ్చింది. -
వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆదివారం కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
గుప్పిట్లో ‘ఫ్రీహోల్డ్’
సాక్షి, అమరావతి: పేద రైతులకు గత ప్రభుత్వంలో హక్కులు దక్కిన ఫ్రీహోల్డ్ భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినా ఇప్పటివరకూ ఉత్తర్వులు వెలువడకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై ఏడాదిన్నర పాటు నాన్చి ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రీహోల్డ్ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) మొత్తం 13.59 లక్షల ఎకరాల భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే రెండు వారాలు దాటిపోయినా ఇంతవరకూ దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. దీంతో దీని వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు వెంటనే అమలు జరిగిపోతాయి. రాజధాని పనులు, ఇతర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉపసంఘాలు చేసిన సిఫారసులను ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి తెస్తూ జీవోలు ఇస్తోంది. కానీ పేద అసైన్డ్ రైతులకు సంబంధించిన భూములను రెండేళ్లు గాల్లో పెట్టి చివరికి వారి ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నా అమలుకు వెనుకాడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉప సంఘం సిఫారసులు అందిన తర్వాత 2, 3 రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవోలు వెలువడాలి. రెవెన్యూ శాఖ మంత్రి అదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే జీవో వస్తుందని చెబుతున్నా ఇప్పటివరకూ రాకపోవడంపై అధికారవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముసుగులో టీడీపీ నేతలు సర్దేస్తున్నారా..! ఎలాగూ సగం ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు కనుక సందట్లో సడేమియా మాదిరిగా అసైన్డ్ భూములను నొక్కేయడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ అవకుండా మిగిలిపోయిన కొన్ని భూములను తాజాగా ఫ్రీహోల్డ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అసైనీలు ఉంటే వారి ద్వారా.. లేదంటే ఆదీనంలో ఉన్న రైతులతో మాట్లాడి నయానో భయానో లొంగదీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తృణమో పణమో ముట్టజెప్పి వారి భూముల్ని స్వాదీనం చేసుకుంటున్నారని సమాచారం. గతంలోనే ఫ్రీహోల్డ్ అయిన భూములతో కలిపి వాటిని ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేస్తూ వెంటనే ఇవ్వాల్సిన జీవో ఇంతవరకూ వెలువడలేదని తెలుస్తోంది. టీడీపీ నేతలు అనుకున్న భూములన్నీ వారి చేతుల్లోకి వచ్చాక జీవో జారీ చేస్తారని చెబుతున్నారు. తద్వారా గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో కొన్నింటిని ఇప్పుడు 22ఏ జాబితా నుంచి తీసివేశామని పైకి చెప్పుకుంటూ తాజాగా వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ హక్కులిస్తే.. బాబు ఆంక్షలు పెట్టి వేధించారు అనేక దశాబ్దాలపాటు తమ భూములపై ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేద అసైన్డ్ రైతులకు ఊరటనిస్తూ వారి భూములపై వైఎస్ జగన్ హయాంలో హక్కులు కల్పించారు. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చారు. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేయగా, దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. అయితే వైఎస్ జగన్ హయాంలోనే హక్కులు రావడంతో.. ఆ భూములపై కత్తి కట్టిన చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని 22 ఏ జాబితాలో పెట్టింది. రెండేళ్ల నుంచి ఆ భూములపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఆ రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. అసైన్డ్ రైతుల ఒత్తిడితో ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో సగం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని రెండేళ్ల తర్వాత నిర్ణయించింది. అయినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తెర వెనుక భూములు కొట్టేయడానికి సన్నాహాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
గ్యాంబ్లింగ్ సైట్లపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 పైగా వెబ్సైట్లు, యాప్లను బ్లాక్ చేసింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫాంలు, ఆన్లైన్ కేసినోలకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సట్టా, మట్కా గ్యాంబ్లింగ్ నెట్వర్క్లు, రియల్ మనీ కేసినో గేమ్ యాప్స్పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి 8,400 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు వివరించాయి. ఇందులో అత్యధిక భాగం (సుమారు 4,900) ఆన్లైన్ గేమింగ్ చట్టం వచ్చాక చర్యలు తీసుకున్నవేనని వివరించాయి. -
గ్యారంటీలకు ఘోరీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. 20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. ‘బడ్జెట్ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్లోనే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్రావు విమర్శించారు. మూడు ముక్కలు చేయడం తప్ప.. ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ పేరిట, హైదరాబాద్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. బడ్జెట్ అంతా బోగస్. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు. మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ అమలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టించారు. కేసీఆర్ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు.. కరప్షన్ హబ్గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో ఫెయిల్ మీరు పాలనలో ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్కుమార్రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు. -
గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. కంపెనీకి 188 కోట్ల జరిమానా
నిండు గర్భిణి అయిన ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్కు నిరాకరించిన ఓ కార్పొరేట్ కంపెనీకి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గల హామిల్టన్ కౌంటీ కోర్డు భారీ జరిమానా విధించింది. ఆఫీస్కు రావాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లిన సదరు ఉద్యోగి.. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. హై రిస్క్తో జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించడంతో సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్డు.. ఉద్యోగికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. చెల్సీ వాల్ష్ అనే మహిళ ఓహియో రాష్ట్రంలోని Total Quality Logistics అనే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 2021లో ఆమె గర్భధారణ సమయంలో హై రిస్క్ ఉంటుందని డాక్టర్లు ముందే చెప్పారు. కదలికలు తగ్గించుకొని, తప్పనిసరి అనుకుంటే ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. దీంతో వాల్ష్, కంపెనీని వర్క్ ఫ్రం హోమ్ అనుమతి కోరింది. కానీ అందుకు వారు తిరస్కరించారు. ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారు. ఆప్షన్ లేక లీవ్ పెట్టాలని వెళ్లిన ఆమె.. అదే రోజు సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి, 20 వారాల 6 రోజుల వయసున్న శిశువుకు జన్మనిచ్చింది. హై రిస్క్పై జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించింది. కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించడం వల్లే ఈ విషాదం జరిగిందని వాల్ష్ కోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. శిశువు మరణానికి సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్టు.. ఉద్యోగికి 22.5 మిలియన్ డాలర్ల (రూ. 188 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుతో ఏకీభవించని కంపెనీ యాజమాన్యం.. పై కోర్టుకు వెళ్లింది. -
పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు విరోధులుకాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సక్రమ పన్ను చెల్లింపుదారులకు నిబంధనలు భారంకాకుండా ఆదాయపన్ను శాఖ అధికారులు వ్యవహరించవలసి ఉన్నదని సలహా ఇచ్చారు. అయితే టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని సూచించారు. 2025 ఆదాయపన్ను శాఖ చట్టంపై జాతీయస్థాయి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన 2026 ప్రారంభ్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టం ద్వారా భారత్ స్నేహపూర్వక పన్ను దేశంగా అవతరించనున్నట్లు పేర్కొన్నారు. -
రేషన్కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్జోన్లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్రావు చెబుతుండడం తప్పు. చక్రధర్గౌడ్ పంజగుట్ట పీఎస్లో తనను హరీశ్రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్రావు బెదిరించినట్టు చక్రధర్గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
కొత్త ఐటీ చట్టం రెడీ!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ఇక కొత్త ఆదాయపన్ను (ఐటీ) చట్టం అమల్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం–2025 నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం నోటిఫై చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు–2026గా వ్యవహరించే ఈ కొత్త రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పాన్ విషయంలో భారీ ఊరటతో పాటు హెచ్ ఆర్ఏ క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని మధ్య సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించడం వరకు అనేక మార్పులు కొత్త చట్టంలో చోటు చేసుకోనున్నాయి. అనవసర సెక్షన్లు తొలగింపు... పాత ఆదాయపన్ను చట్టం–1961 స్థానంలో తీసుకొస్తున్న కొత్త చట్టానికి 2025 ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను రేట్ల ప్రతిపాదనల వంటివేవీ ఇందులో లేనప్పటికీ ఆరు దశాబ్దాల నాటి సంక్లిష్టమైన పాత చట్టాన్ని మరింత సరళమైన, అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. 1961 నాటి ఐటీ చట్టంలో ఉన్న 819 సెక్షన్లను ఇప్పుడు 536కు కుదించడంతో పాటు చాప్టర్ల సంఖ్యను కూడా 47 నుంచి 23కు తగ్గించారు. అలాగే చట్టంలోని మొత్తం పదాలను 5.12 లక్షల నుంచి సగానికి అంటే 2.6 లక్షల పదాలకు తగ్గించడం గమనార్హం. అంతేకాకుండా మరింత మెరుగైన స్పష్టత కోసం 39 కొత్త టేబుల్స్, 40 కొత్త ఫార్ములాలను కూడా కొత్త చట్టంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాన్ వెసులుబాటు.. బ్యాంకుల్లో నగదు డిపాజిట్/ఉపసంహరణ నుంచి కొత్త వాహనాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు, హోటల్ బిల్స్ చెల్లింపు దాకా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వెల్లడికి సంబంధించి లావాదేవీల పరిమితి భారీగా పెరుగుతుంది. బ్యాంకుల్లో ఇప్పుడు రూ.50,000కు మించి నగదు డిపాజిట్కు పాన్ కాపీ తప్పనిసరి నిబంధన ఉంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే (ఒకటి లేదా మరిన్ని ఖాతాలకు) పాన్ ఇస్తే సరిపోతుంది. ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే (ప్రస్తుతం రూ.10 లక్షలు) పాన్ సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుంది. అలాగే, ఏ వాహన కొనుగోలుకైనా విలువ రూ.5 లక్షలకు మించితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు రూ. లక్షకు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు మించితేనే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.ఇతర ముఖ్యాంశాలివీ..→ ఇంటి అద్దెపై ఐటీ మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని సంబంధాన్ని వెల్ల డించాల్సి ఉంటుంది. ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. → ఇకపై ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు.. ఈ ఎనిమిది నగరాలు 50% హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి జాబితాలోకి రానున్నాయి. మిగతా చోట్ల 40% పరిమితి కొనసాగుతుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నైలో వేతన జీవులకు మాత్రమే 50% నిబంధన వర్తిస్తోంది. → షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్ సర్టిఫికెట్ల వంటి కన్వర్టెడ్ సెక్యూరిటీలకు సంబంధించి నిర్దిష్ట కేసుల్లో మూలధన లాభాలు స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది నిర్ణయించడానికి హోల్డింగ్ వ్యవధి లెక్కింపుపై మరింత స్పష్టత. మార్పిడికి ముందు అవి ఎంత కాలం పాటు ఉన్నాయనే దాన్ని కూడా హోల్డింగ్ పీరియడ్లో చేర్చుతారు. → పన్ను రిటర్నుల దాఖలు మరింత సులభతరం కానుంది. సులభతర పత్రాలు, ఆదాయపన్ను శాఖ వద్దకు చేరిన సమాచారం ముందుగానే ఆయా పత్రాల్లో నింపి ఉంటుంది. → యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే ప్రో త్సాహకాల విషయంలోనూ పన్ను మినహాయింపు పరిమితులు పెరగనున్నాయి. → క్రిప్టో ఎక్సే్చంజీలు ఐటీ శాఖతో సమాచారం పంచుకోవడం ఇకపై తప్పనిసరి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) సైతం ఆమోదనీయమైన ఎల్రక్టానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. -
నిధుల మూట.. ప్రగతి బాట
సాక్షి హైదరాబాద్: ‘ధీరోదాత్తుడు ఎన్నడూ అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగుతాడు. ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రగతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్పై నమ్మకం కలిగించాం. ఇక పురోగతిలో మా మార్కు చూపుతాం. గత రెండున్నరేళ్లుగా ఈ బాటలోనే సాగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటికి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెడుతున్నాం.ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచి్చన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే మా లక్ష్యం. మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించేదిగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రూపొందించాం..’ అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల బడ్జెట్ను డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఉప ముఖ్యమంత్రి మాటల్లోనే.. పన్నుల సొమ్ము ప్రజల అభ్యున్నతికే.. ⇒ వరసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. మేం ప్రజలిక్చిన హామీలను, ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను ఈ రెండున్నరేళ్ల పాలనలో సంతృప్తి్కరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. పన్నుల రూపంలో వచి్చన సొమ్మును, తిరిగి ప్రజల అభ్యున్నతి కోసమే వెచి్చస్తున్నాం. ప్రతి పైసకు మేం కాపలాదారుగా ఉంటున్నాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం.రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్ట ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు. ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. దేశానికి బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ ⇒ 2025–6 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లుగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ 5 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ నిలుస్తోంది. గణనీయంగా పెరిగిన తలసరి ఆదాయం ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. అదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం æ1.9 రెట్లు ఎక్కువ. ⇒ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. మరిన్ని కేంద్ర నిధులకు కృషి ⇒ 2014–15 నుంచి 2023–24 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి ఉన్న రూ.3 వేల కోట్లను విడుదల చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకార, సమాఖ్య వాద స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. 2021–22లో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.4,826 కోట్లు రాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ.7.72 వేల కోట్లను సాధించింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. గత ప్రభుత్వ అప్పులతో తీవ్ర భారం ⇒ గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20–39 సంవత్సరాలకు పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025–26 నుంచి 2031–32 దాకా చెల్లించాల్సిన రూ.34.58 వేల కోట్ల రుణం రూ.11.915 వేల కోట్లకు తగ్గింది. లక్షల కోట్ల పెట్టుబడులు ⇒ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ముఖ్య వేదికగా నిలిచింది. దీని ద్వారా దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దావోస్ వేదికగా ఆవిష్కరించిన ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 వల్ల రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. సింగపూర్, వియత్నాంకు చెందిన సంస్థల నుంచి మొత్తం రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వ్యవసాయానికి ప్రాధాన్యం... ⇒ దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడులలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు ప్రతిపాదించాం. రూ.కోట్లలో మహిళలకు ఆదా ⇒ ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా రూ.752 కోట్ల మేర మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటివరకు 10.97 కోట్ల సున్నా బిల్లులు జారీ అయ్యాయి. ఫలితంగా రూ.3,954 కోట్లను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. హైదరాబాద్ సమ్మిళిత, సమాన అభివృద్ధి ⇒ హైదరాబాద్ అభివృ·ద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ అవతల, లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ 3 కార్పొరేషన్లుగా మార్చి సమ్మిళిత, సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నాం. 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి దానిని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో 67,763 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే మా విధానం ⇒ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా సమతుల్యంగా బడ్జెట్ను రూపొందించాం. పన్నులతో సామాన్యుడిపై భారం మోపకుండా, ఉన్న వనరులను సది్వనియోగం చేస్తూ, కొత్త సంపదను సష్టించి, దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం.‘పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి..’ అన్న మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పునాది ఈ బడ్జెట్. ఈ పునాది ఆధారంగా ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణను నిర్మించేందుకు ఇది బ్లూ ప్రింట్. డిజిటల్ జనగణనకు ముమ్మర ఏర్పాట్లు ⇒ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. తెలంగాణ ప్రజల ఆశాదీపం ⇒ బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం. మన భవిష్యత్తు ⇒ కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం ⇒ ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం ⇒ నీడలేని వారికి నీడ కల్పించడం ⇒ పంట పొలాలకు నీళ్లు పారించడం.. ఫలసాయం పెంచడం ⇒ కష్టపడే వారికి పని కల్పించడం..ఇష్టపడేలా పాలన అందించడం ⇒ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. ⇒ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. -
ముంబై మురిపించేనా!
ఎనిమిదేళ్ల వ్యవధిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి సంచలనం సృష్టించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతోంది. గత ఐదు సీజన్లలో కనీసం ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయిన హార్దిక్ పాండ్యా బృందం... ఆరో టైటిల్ వేటకు సిద్ధమైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, డికాక్, సాంట్నర్, బౌల్ట్, బుమ్రా ఇలా జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉండగా... వీరంతా కలిసికట్టుగా కదంతొక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇటీవల టీమిండియా టి20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ ఫుల్ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాబలాలను పరిశీలిస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండు జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తోంది. క్షణాల్లో మ్యాచ్ను మలుపు తిప్పగల స్టార్లు... బంతిని అదే పనిగా బౌండరీకి తరలించగల హిట్టర్లు... రెప్పపాటులో వికెట్లను పడగొట్టగల బౌలర్లు... ఇలా జట్టులో అన్నీ ఉన్నా ఆరో టైటిల్ మాత్రం దరిచేరడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ జట్లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సాంట్నర్ ఇలా నాయకులతో నిండి ఉన్న జట్టును ఈ సీజన్లో హార్దిక్ ఎలా నడిపిస్తాడనేది కీలకం. లీగ్ ఆరంభం నుంచే సచిన్, పాంటింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ 2013లో తొలిసారి ట్రోఫీ అందించాడు... ఆ తర్వాత అతడి సారథ్యంలోనే 2015, 2017, 2019, 2020లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన ముంబై... ఈ సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ప్లేయర్లను తీర్చిదిద్దడంలో మంచి అనుభవమున్న ముంబై ఫ్రాంచైజీ... 2026 వేలంలో దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ డికాక్, విండీస్ హిట్టర్ రూథర్ఫర్డ్ను అతి తక్కువ ధరకే దక్కించుకుంది. హెడ్ కోచ్ జయవర్ధనే ఈ ఇద్దరి సేవలను ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం. రోహిత్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గానే... ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హిట్మ్యాన్’ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... తిలక్వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, నమన్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్క డికాక్ మినహా మిగిలిన వాళ్లంతా భారత ఆటగాళ్లే కావడంతో... విదేశీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే విషయంలో ఫ్రాంచైజీకి మంచి వెసులుబాటు ఉంది. ఈ కోటాలో డికాక్, రికెల్టన్, రూథర్ఫర్డ్, సాంట్నర్, విల్ జాక్స్, బాష్, ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్ అందుబాటులో ఉండగా... డికాక్, జాక్స్, సాంట్నర్, బౌల్ట్ తుదిజట్టులో ఉండటం ఖాయమే. పరిస్థితులను బట్టి రూథర్ఫర్డ్, ఘజన్ఫర్ను పరిశీలించవచ్చు. బుమ్రాపైనే భారం... టీమిండియా వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రాపైనే ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్గా మన్ననలు అందుకుంటున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. బౌల్ట్, దీపక్ చాహర్ నుంచి అతడికి సహకారం అందితే ముంబైను ఆపడం ప్రత్యర్థులకు కష్టతరమే. తాజా టి20 ప్రపంచకప్లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్తో పాటు న్యూజిలాండ్ కెపె్టన్ సాంట్నర్ స్పిన్ భారం మోయనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్లో అవసరమైతే మయాంక్ మార్కండే, అశ్వని కుమార్, శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నారు. గత 13 సీజన్లను ముంబై జట్టు పరాజయంతో ప్రారంభించింది. ఈసారి ఓటమితో కాకుండా గెలుపుతో బోణీ కొడుతుందో లేదో చూడాలి. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెపె్టన్), రోహిత్, సూర్యకుమార్, రాబిన్ మిన్జ్, రూథర్ఫర్డ్, రికెల్టన్, డికాక్, దానిశ్, తిలక్, నమన్ ధీర్, సాంట్నర్, రాజ్ బావా, అథర్వ, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దుల్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్వని కుమార్, రఘుశర్మ, ఇజహార్, ఘజన్ఫర్, బుమ్రా.ముంబై ఇండియన్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 277 గెలిచినవి 153 ఓడినవి 124 అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2013, 2015, 2017, 2019, 2020), రన్నరప్ (2010). -
ఖురాన్ ప్రస్తావన: ఆరోగ్యానికి ఆలంబన
ఖురాన్లో పలు సందర్భాల్లో మొక్కల ప్రస్తావన వస్తుంది. ఆయా మొక్కల నుంచి లభించే ఫలాలు, పత్రాలు, పుష్పాలు మానవాళికి ఎలా ఉపయోగపడుతాయో దైవగ్రంథం, హదీసులు వివరించాయి. అలాంటి వాటిలో ఆలివ్, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, అరటి, నల్ల జీలకర్ర, గుమ్మడి వంటివి ముఖ్యమైనవి.ఆలివ్ : దీని శాస్త్రీయనామం– ఓలియా యురోపియా. ఇది ఓలియేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్ లో జైతున్ అని పిలుస్తారు. ఈ మొక్క గురించి ఖురాన్లో ఆరు చోట్ల ప్రస్తావించారు. ఆలివ్ నూనెలో, ఆలివ్ పండ్లలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి.ఖర్జూరం : దీని శాస్త్రీయనామం– ఫోనిక్స్ డెక్టైలిఫెరా. ఇది అరికేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో నఖ్ల్ అని పిలుస్తారు. ఖర్జూరం లో ఉండే ΄పొటాషియం రక్తపోటును నియంత్రించడంలోనూ, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధక నివారణకు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికీ తోడ్పడుతుంది.దానిమ్మ : దీని శాస్త్రీయనామం– ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసి కుటుంబానికి చెందినది. అరబిక్లో రూమ్మన్ అని పిలుస్తారు. దానిమ్మలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధా΄్యాన్ని, చర్మంపై ఏర్పడే ముడతలనూ దూరం చేస్తాయి. అల్జీమర్స్, చర్మక్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఆస్టియో ఆర్థ్రయిటిస్తో బాధపడేవారికిది అద్భుత ఔషధం.అంజూర : దీని శాస్త్రీయనామం– ఫైకస్ కెరిక. ఇది మొరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో తీన్ అని పిలుస్తారు. దీని పండ్లను, వేర్లను, ఆకులను సాంప్రదాయ వైద్యంలో జీర్ణకోశ, శ్వాసకోశ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.తులసి : దీని శాస్త్రీయ నామం– ఆసిమం టెన్యూ ఫ్లోరమ్. దీనిని అరబిక్లో రైహాన్ అంటారు. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. తులసి ఆకులు నాడులకు టానిక్లా పని చేసి, జ్ఞాపకశక్తిని పెం΄పొందిస్తాయి. తులసి కషాయంతో గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసితో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తులసి కొలెస్ట్రాల్ను తగ్గించడంతోపాటు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.ద్రాక్ష : దీని శాస్త్రీయనామం – వైటిస్ వెనిఫెరా. ఇది వైటేసి కుటుంబానికి చెందినది. దీనిని అరబిక్లో ఇనబ్ అంటారు. ద్రాక్షగింజల రసం గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, చర్మక్యాన్సర్ను నివారించడంలో, ఇన్ ఫెక్షన్ తో పోరాడడంలో సహాయ పడుతుంది.ఉల్లి : దీని శాస్త్రీయనామం – ఆలియమ్ సెపా. ఇది లిలియేసి కుటుంబానికి చెందినది. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, విటమిన్ ఎ, బి6 , సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిని వాడితే శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకున్నట్లే. మధుమేహం ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు గట్టిపడతాయి.ఆవాలు : దీని శాస్త్రీయనామం– బ్రాసిక నైగ్ర. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందింది. వీటిని అరబిక్లో ఖర్దల్ అంటారు. ఆవాలనుంచి తయారు చేసిన ఆవనూనెని కొన్ని సంప్రదాయ చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.మిస్వాక్ : దీని శాస్త్రీయనామం– సాల్వో డోరా పెర్సికా. ఇది సాల్వో డేరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో అల్ అరక్ అని పిలుస్తారు. దీని పుల్లలతో దంత ధావనం చేసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. వీటివేర్లను ఊపిరితిత్తుల సమస్యలకు, ఆకులను దగ్గు, ఉబ్బసం, స్కర్వి వ్యాధి నివారణకూ వాడతారు. బెరడును వెన్నుపోటు, తలపోటు, కడుపునొప్పి నివారణలో ఉపయోగిస్తారు.అరటి : దీని శాస్త్రీయ నామం– మ్యూసా పారడైసియాక. ఇది మ్యూసేసి కుటుంబానికి చెందినది. అరటిని అరబిక్లో తల్హ్ అంటారు. అరటిలో ΄పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు హైబీపీ, షుగర్, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి వంటి సమస్యలను నిరోధిస్తాయి. అరటి పండ్లలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు, ఫ్యాటీ యాసిడ్స్ను ఉత్పత్తి చేసేందుకు ఇది తోడ్పడుతుంది.నల్ల జీలకర్ర : దీని శాస్త్రీయనామం – నైగెల్ల సటివ. దీనిని అరబిక్ లో హబ్బతుస్ సౌదా అంటారు. ఇది రానన్కులేసి కుటుంబానికి చెందినది. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను అదుపులో వుంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.డాక్టర్ ఎల్. నాగిరెడ్డి సహాయ ఆచార్యులుశ్రీ కృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురంచాంద్ బాషా, ఉపాధ్యాయులు, తాడిపత్రి -
ఐపీఎల్ నుంచి హర్షిత్ రాణా అవుట్
కోల్కతా: భారత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా ఇదివరకే గాయంతో టి20 ప్రపంచకప్ ఆడలేకపోయాడు. ఇప్పుడు మెరుపుల లీగ్ ఐపీఎల్కు సైతం దూరమయ్యాడు. అతను ఆడటంపై మొదటి నుంచి సందేహం ఉన్నప్పటికీ శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. రాణా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిపింది. ‘మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. కొన్నేళ్లుగా హర్షిత్ మా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా గతేడాది కాలంగా మరింత రాటుదేలాడు. అలాంటి ఆటగాడు సీజన్ అసాంతం దూరమవడం మాకు చాలా ఇబ్బందికరం. ఉన్నపళంగా అతని స్థానాన్ని భర్తీ చేయడం కూడా కష్టమే’ అని కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ పతిరణ గాయంతో లంక పేసర్ సేవల్ని సైతం కోల్పోయింది. ఇంతకీ అతనికేమైంది? టీమిండియా జట్టులో సీనియర్ల గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన హర్షిత్ సీమ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో భారీ షాట్లతో అలరించాడు. దీంతో టి20 ప్రపంచకప్లో పాల్గొనే జట్టుకూ అతన్ని కొనసాగించారు. కానీ దురదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా అతని కుడి మోకాలికి గాయమైంది. దీంతో జట్టుకు దూరమైన రాణా టీమిండియా జగజ్జేత బృందంలో భాగం కాలేకపోయాడు. అనంతరం హర్షిత్ మోకాలికి సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం పునరావాస శిబిరంలో ఉన్నప్పటికీ అతను పూర్తిగా కోలుకునేందుకు రీహాబిలిటేషన్ ప్రక్రియ ఇంకొంత కాలం కొనసాగించాల్సి ఉండటంతో ఇప్పుడప్పుడే అతను బరిలోకి దిగే అవకాశమైతే లేదు. -
సన్రైజర్స్కు మరో దెబ్బ... ఐపీఎల్కు జాక్ ఎడ్వర్డ్స్ దూరం
హైదరాబాద్: ఆరంభానికి ముందే ఐపీఎల్ను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెపె్టన్ కమిన్స్ తొలి దశ మ్యాచ్లకు దూరం కాగా, తాజాగా మరో సహచరుడు జాక్ ఎడ్వర్డ్స్ ఏకంగా సీజన్ మొత్తానికే అందుబాటులో లేకుండా పోయాడు. ఆ్రస్టేలియాకే చెందిన 25 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎడ్వర్డ్స్ను వేలంలో రూ. 3 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేయాల్సిన ఈ ఆసీస్ ఆల్రౌండర్ ఇప్పుడు మరో సీజన్ దాకా వేచి ఉండక తప్పదు. అతడు కాలిపాదం గాయంతో సతమతమవుతున్నాడు. బిగ్బాష్ లీగ్లో విశేషంగా రాణించిన జాక్ (19 వికెట్లు; 133 పరుగులు) పెర్త్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. మొత్తమ్మీద ఆ్రస్టేలియన్ బౌలింగ్ దళాన్నే గాయాలు పట్టిపీడిస్తున్నాయి. ఎందుకంటే కమిన్స్, హాజల్వుడ్, స్టార్క్, ఎలిస్లు ఇదివరకే గాయాలతో ఆటకు దూరంగా ఉంటున్నారు. -
కాంబినేషన్ ఫిక్స్
విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. ఈ ఇద్దరూ జోడీగా నటించనున్న సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రోడక్షన్స్, మద్రాస్ టాకీస్, ఇండియా టాకీస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.సోని మ్యూజిక్ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను పొందింది. ఇక ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. కాగా, మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘చెక్క చివంద వానమ్’లో (తెలుగులో ‘నవాబ్’ టైటిల్తో విడుదలైంది) విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఐపీఎల్పై సెలెక్టర్ల నజర్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ టి20 టోర్నీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ సెలక్టర్ల బృందం తాము ఎంపిక చేసిన ప్రపంచకప్ ప్రాబబుల్స్ సైన్యం ఆటతీరు కోసం ఎలా ఉంటుందోనని పర్యవేక్షించనుంది. పది ఫ్రాంచైజీలు 2026–ఐపీఎల్ ట్రోఫీపై కన్నేస్తే... ఐదుగురు జాతీయ సెలక్టర్లు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్కు దీటైన జట్టును ఎంపిక చేసే పనిలో పడింది. ఐపీఎల్ టోర్నీ ఫార్మాట్... వరల్డ్కప్ ఫార్మాట్ వేరైనా... ఇప్పటికే సిద్ధం చేసుకున్న 20 మంది భారత ప్రపంచకప్ ప్రాబబుల్స్పై సెలక్షన్ కమిటీ కన్నేసింది. ఇందుకోసం వారం రోజుల్లో మొదలయ్యే మెరుపుల లీగ్పై ప్రతీ సెలక్టర్ ఉమ్మడి బాధ్యత తీసుకున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా సెలక్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ ప్రాబబుల్స్ జాబితాలోని ఆటగాడు ఆడే ఐపీఎల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి వెళ్లనున్నారు. ఇలా ఐదుగురు సెలక్టర్లు వారంలో ఐదు రోజులు ఇదేపనిపై ఉంటారు. వంతుల వారీగా ఒకరైతే తప్పనిసరిగా స్టేడియానికి వెళితే... మిగతా నలుగురు టీవీల్లో ప్రాబబుల్స్ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించనున్నారు. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ మొదలవుతుంది. పూర్తిస్థాయి జట్టుతో... ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా లేదు. డబ్ల్యూటీసీలో లేకపోయినా... ప్రత్యర్థి బలహీనమైన జట్టే అయినా సెలక్టర్లు పూర్తిస్థాయి టీమిండియానే బరిలోకి దించాలని భావిస్తున్నారు. సీనియర్లు, కీలకమైన ఆటగాళ్లెవరికీ విశ్రాంతి ఇవ్వకుండా అందరిని మైదానంలో ఆడించేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్కు ఇంకా 9 టెస్టులు మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో మేటి జట్లను ఎదుర్కొనేందుకు దీటుగా ప్రతీ మ్యాచ్ను సీరియస్గా తీసుకోవాలని సెలక్షన్ కమిటీ చూస్తోంది. దీంతో ప్రీమియం సీమర్ బుమ్రాతో పాటు టెస్టుల్లో రెగ్యులర్ బౌలరైనా హైదరాబాదీ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను అఫ్గాన్తో టెస్టుకు ఎంపిక చేయనుంది. అగార్కర్ పొడిగింపు కోరలేదు సీనియర్ సెలక్షన్ కమిటీకి మాజీ సీమర్ అజిత్ అగార్కర్ చైర్మన్గా ఉన్నాడు. 2023, జూలైలో చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టిన అతని పదవీ కాలం ఈ సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు టి20 ప్రపంచకప్లకు విజయవంతమైన జట్లను ఎంపిక చేసిన అగార్కర్ పదవీ కాలం పొడిగింపు కోరినట్లు వార్తలు ఊపందుకున్నాయి. కానీ బోర్డు సీనియర్ అధికారి ఒకరు ఈ ఊహాగానాలను తొసిపుచ్చారు. అతని పదవీ కాలం ముగియలేదని, అప్పటి వరకు అతనే చీఫ్ సెలక్టర్ అని ఆ తర్వాతే అగార్కర్, బోర్డు కార్యదర్శి కలిసి ఓ నిర్ణయానికి వస్తారని ఆయన చెప్పారు. -
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్ -
ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి...
మయామి: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాడు. విఖ్యాత నేషనల్ బాస్కెల్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఈ ఆదివారం 41 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించనున్నాడు. 79 ఏళ్ల ఎన్బీఏ చరిత్రలో వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్గా గుర్తింపు పొందిన లెబ్రాన్ మయామి హీట్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఎన్బీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా 1997 నుంచి రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును లెబ్రాన్ సమం చేశాడు. మయామి హీట్తో జరిగిన మ్యాచ్లో లెబ్రాన్ 19 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ మ్యాచ్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు 134–126తో గెలిచి ఈ సీజన్లో వరుసగా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు తదుపరి మ్యాచ్ను రేపు ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో లెబ్రాన్ బరిలోకి దిగితే ఎన్బీఏ చరిత్రలోనే అత్యధికంగా 1612 మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఘనత వహిస్తాడు. -
చండీగఢ్లో జైలర్
చండీగఢ్లో ల్యాండ్ అయ్యారట ముత్తువేల్ పాండ్యన్ . రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్ 2’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్జే సూర్య, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివరాజ్కుమార్, విజయ్సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. జైలర్ ముత్తువేల్ పాండ్యన్గా నటిస్తున్నారు రజనీకాంత్.ఇందులోని మరో కీలకమైన పోలీస్ పాత్రలో హీరో షారుక్ఖాన్ నటించనున్నారని సమాచారం. ‘జైలర్ 2’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం చండీగఢ్లో జరుగుతోందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్లో రజనీకాంత్, షారుక్ఖాన్ లపై ఓ యాక్షన్ సీక్వెన్స్ను తీస్తున్నారట నెల్సన్ అండ్ టీమ్. కార్ క్రషింగ్ ఫ్యాక్టరీలో ఈ యాక్షన్ సీక్వెన్స్ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్తో ‘జైలర్ 2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
ప్రమాదకర పోకడలు
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ల మధ్య సాగుతున్న యుద్ధంలో రోజూ వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో గత రెండు రోజుల పరిణామాలతో మేల్కొన్నట్టు కనబడుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపై పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో అయిదు దేశాల్లోని ఆరు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతినటమే అందుకు కారణం. దక్షిణ ఇరాన్లోని సహజ వాయు క్షేత్రం పార్స్ను ఇజ్రాయెల్ గురిచూసి కొట్టిన వెంటనే ప్రపంచంలోనే అతి పెద్ద ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్పైనా, దాంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్ చమురుశుద్ధి కర్మాగారాలపైనా ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల వల్ల ఒక్క ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్లోని 17 శాతం నిక్షేపాలు ఆవిరయ్యాయి. యుద్ధం పరిసమాప్తమయ్యేవరకూ దాన్ని చక్కదిద్దటం అసాధ్యం. ఆ పనులకు దాదాపు అయిదేళ్లు పడుతుందంటున్నారు. అంటే అయిదేళ్ల ఖతార్ ఆదాయం 10,000 కోట్ల డాలర్లు మాయమైనట్టు! దీనివల్ల మన దేశంతో సహా ఆసియా, యూరప్ దేశాలు తీవ్రసంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 116 డాలర్లను దాటింది. అది 130కి చేరిందంటే అమెరికాతోపాటు అందరికీ కష్టాలు మొదలవుతాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలవుతున్నారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఇక దాడి చేయబోదని ఆ దేశం తరఫున ఆయన హామీ ఇచ్చారు. మరికొన్ని గంటలకే హార్మూజ్ దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్కు చెందిన ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే పథక రచన సాగిస్తున్నట్టు లీకులిచ్చారు. అసలు ఇజ్రాయెల్ తన ఆదేశం పాటిస్తుందని నిజంగా ట్రంప్ భావిస్తున్నారా? అది ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ శక్తిమంతమైన సేవకుడిగా మారితే, అమెరికా బలహీనమైన యజమానిగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆవిర్భవించటానికి వీలుగా చుట్టూవున్న ముస్లిం దేశాల్ని పాదాక్రాంతం చేసుకోవాలని 1996లోనే ఇజ్రాయెల్ పథక రచన చేసింది. గత అమెరికా అధినేతల దగ్గర దాని ఎత్తులు పారలేదు. తెలిసీ తెలియని ట్రంప్ ఆ కొరతను తీర్చారు. తమకు క్షిపణులకు కొరతేమీ లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనిపై ఇజ్రాయెల్ దాడిచేసి హతమార్చింది. ఇలాంటి చర్యలు యుద్ధ విరమణను జటిలం చేస్తాయి తప్ప సాధించేదేమీ ఉండదు. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన దశలో కూడా ఆ రెండు దేశాలూ అతిగా అంచనా వేసుకుంటూ, ఇరాన్పై తప్పుడు లెక్కలు కడుతున్నాయి. చట్టవిరుద్ధ మైన ఈ యుద్ధానికి మరో 20,000 కోట్ల డాలర్లు కావాలంటూ అమెరికన్ కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికన్ కుబేరులకు కోట్లాది డాలర్ల పన్ను రాయితీలిచ్చిన ప్రభుత్వం, సాధారణ ప్రజానీకానికి అందే అరకొర సదుపాయాలకు సైతం కోత పెడితే తప్ప ఈ నిధులు సమకూర్చుకోలేదు. ఈ అకారణ యుద్ధానికి ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేయటం అవసరమా?వీటి సంగతలా ఉంచి అత్యంత అమానవీయ పద్ధతుల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యల పర్యవసానాలేమిటో కనబడుతూనే ఉన్నాయి. ఓపెన్ ఏఐ, పాలంటీర్ కలిసి ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ ఆసరాతో మారణహోమానికి తోడ్పడుతున్నాయి. పదేళ్లుగా పాఠశాల నడుస్తున్న ఒక ఆవరణను ఏఐ ఇరాన్ సైనిక స్థావరంగా అర్థం చేసుకుని చూపితే, దాని ఆధారంగా అమెరికా క్షిపణి దాడికి పాల్పడి ఒకేసారి 170 మంది బాలబాలికల ప్రాణాలు తీసింది. సైనిక దాడులకోసం తమ సాఫ్ట్వేర్ ఇచ్చేది లేదని ట్రంప్కు చెప్పిన ఆంత్రోపిక్ అయినా, ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుని లాభపడిన ఓపెన్ ఏఐ అయినా సారాంశంలో ఈ ప్రాణాంతక దాడులకు వ్యతిరేకం కాదు. ఆంత్రోపిక్ అభ్యంతరమల్లా ఆ సాఫ్ట్వేర్మరింత పదునుదేరాలన్నదే. ఆ తర్వాతే అందుబాటులోకి తీసుకురావాలని దానిఉద్దేశం. ప్రపంచ మనుగడ ఎంత ప్రమాదకరంగా మారిందో దీన్నిబట్టే గ్రహించవచ్చు. -
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్లు ఇరాన్ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో బాటుగా, లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ రా.2.22 వరకు, తదుపరి చవితి,నక్షత్రం: అశ్విని రా.3.03 వరకు, తదుపరి భరణి,వర్జ్యం: రా.11.16 నుండి 12.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.22 నుండి 7.48 వరకు, అమృత ఘడియలు: రా.8.06 నుండి 9.38 వరకు.సూర్యోదయం : 6.07సూర్యాస్తమయం : 6.07రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. మిత్రులతో వివాదాలు తీరతాయి. భూములు,వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. బంధువుల కలయిక. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ తప్పదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలో కొత్త హోదాలు.కర్కాటకం: సోదరుల కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.సింహం: కొన్ని పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.కన్య: ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యవహారాలలో అవాంతరాలు. బంధువిరోధాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.తుల: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.వృశ్చికం: కొన్ని వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూలం. వాహనయోగం.ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.మకరం: రుణఒత్తిడులు. ఆలయ దర్శనాలు.పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాల లో చికాకులు.విద్యార్థుల యత్నాలు ఫలించవు.కుంభం: పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.మీనం.. నూతన ఉద్యోగప్రాప్తి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. -
యుద్దంలోకి మరో దేశం.. అమెరికాకు మద్దతుగా..!
హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసేందుకు యూకే ప్రభుత్వం అమెరికాకు అనుమతిచ్చింది. ఇరాన్పై దాడులకు తమ సైనిక స్థావరాలను వినియోగించుకోవచ్చని యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటన విడుదల చేశారు.ఇరాన్పై యుద్దంలో యూకే మద్దతు తెలిపినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. యూకే తమ సాయాన్ని ప్రకటించడంతో ఆలస్యం చేసిందని పెదవి విరిచారు. తమకు మిత్ర రాజ్యమైన యూకే ఈ ప్రకటనను చాలా ముందే చేసుండాల్సిందని అన్నారు.యూకే అమెరికాకు మద్దతివ్వడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా స్పందించారు. అమెరికాకు మద్దతిచ్చి స్టార్మర్ బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని అన్నారు. బ్రిటిష్ ప్రజల్లోని చాలా మంది, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనాలని కోరుకోవడం లేదని తెలిపారు. అమెరికా ఎంతమంది మద్దతు కూడగట్టుకున్నా, ఇరాన్ తన స్వీయరక్షణ హక్కును వినియోగిస్తుందని స్పష్టం చేశారు.యూకే తాజా నిర్ణయంతో ఇరాన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ కూడా అమెరికాకు మద్దతు తెలిపింది. శత్రువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇరాన్ ఇంకెనాళ్లు యుద్దం కొనసాగించగలదో చూడాలి. -
ఎయిర్ ఇండియా భారీ తప్పిదం
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఓ ఫ్లైట్కు బదులు మరో ఫ్లైట్ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగానూ భారీ ఆర్దిక నష్టాన్ని మూటగట్టుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఉదయం 11:34 గంటలకు ఢిల్లీ నుంచి AI185 సర్వీస్ నంబర్తో బోయింగ్ 777-200LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్కు (కెనడా) బయల్దేరింది. అయితే నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు.వాస్తవానికి ఈ సర్వీస్లో బోయింగ్ 777-300ER మోడల్ విమానం వాంకోవకర్కు వెళ్లాలి. అయితే ఆపరేషనల్ తప్పిదం కారణంగా 777-300ER మోడల్కు బదులు 777-200LR విమానం వాంకోవర్కు టేకాఫ్ అయ్యింది.చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300ER మోడల్కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200LR మోడల్ అని నాలుక కరుచుకున్నారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. మొత్తం 7 గంటలు 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్ ఇండియాపై అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటివరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది.ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్ విమానానికి ఒక్క గంటలో 8–9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం వల్ల వందల టన్నుల ఇంధనం వృథా అయ్యింది. దీని వల్ల భారీ ఆర్దిక నష్టం చవిచూడటంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది. -
లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 20 మంది మృతి
లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందినట్లు, 57 మంది గాయపడినట్లు ఆ దేశ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. తాజా మారణహోమంతో మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన లెబనాన్ వాసుల సంఖ్య 1021కి చేరింది.కాగా, మార్చి 2న లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా.. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం మధ్యలోకి కాలు దూర్చింది. ఇరాన్కు మద్దతుగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్, లెబనాన్లోని అనేక ప్రాంతాలపై విస్తృత వైమానిక దాడులు ప్రారంభించింది. వాస్తవానికి 2024, నవంబర్ 27న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. -
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.మా తూర్పు దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక పాక్-ఆఫ్ఘన్ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది.అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే, సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి. -
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి. ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్-పాక్ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్-పాక్ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. -
జర్నలిస్టు పైకి మిసైల్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
లెబనాన్లో రష్యాకు చెందిన ఓ స్వీనీ అనే జర్నలిస్టు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఓ మిసైల్ అతని వైపుగా దూసుకొచ్చింది. ఇది గమనించిన జర్నలిస్టు అక్కడి నుంచి పక్కకు దూకారు. దీంతో ఆ రాకెట్ అక్కడే పేలింది.ఈ దుర్ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్కు గాయాలయ్యాయి. దీంతో వారు వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. ఈ మిసైల్ అటాక్ జరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన లైవ్లో రికార్డయ్యింది. లెబనాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో ప్రతిబింబిస్తుంది.Being a journalist in this modern day war is among hundred ways to die😰A missile strikes insanely close to him pic.twitter.com/ymUOhS5OEf— Cypher (@patocypher) March 19, 2026 -
టెక్నాలజీలో ముందుకు.. ఆలోచనల్లో వెనక్కి?
టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.➤న్యూ గ్లోబల్ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు. ➤భారతదేశంతో సహా గ్రేట్ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ➤నేటి యువకులు జెండర్ రోల్స్కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్ సర్వే.➤జెన్ జెడ్ యువకులు బేబీ బూమర్ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.➤కెరీర్లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్ జడ్ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది. ➤బేబీ బూమర్స్ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు. -
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్
ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్ రాయల్స్ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్ డాలర్ల) బిడ్డింగ్ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాజస్థాన్కు ఇప్పుడొచ్చిన బిడ్ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్ను కాదనుకొని రాజస్థాన్ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్ రాయల్స్ కోసం పెద్ద మొత్తంలో బిడ్ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్బర్డ్ క్యాపిటల్కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది. ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగానే బిడ్ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ గెలుచుకుంది. షేన్ వార్న్ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ ఆ తర్వాత 2015, 2018 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరింది. 2022లో శాంసన్ సారథ్యంలో రన్నరప్గా నిలిచింది. 2025 సీజన్లో రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచి లీగ్ దశకే పరిమితమైంది.చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’ -
సంయుక్త మీనన్ గ్లామరస్ పిక్స్.. మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్స్..బాలిలో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..రెడ్ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ అందాలు..శారీలో దిల్ రాజు సతీమణి తేజస్విని పోజులు..మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
ఒక ఛార్జ్తో 902 కిమీ రేంజ్!.. షియోమి కారు
షియోమి చైనాలో అప్డేటెడ్ SU7 సెడాన్ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ భద్రతా పరికరాలు, డ్రైవర్-అసిస్టెన్స్ హార్డ్వేర్, క్యాబిన్ ఫీచర్లు, ఛాసిస్ సెటప్లో చాలా మార్పులు పొందింది. దీని ధర 219,900 యువాన్ల (సుమారు రూ. 29.79 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.కొత్త SU7 ఎలక్ట్రిక్ కారు 73 kWh, 96.3 kWh LFP ప్యాక్లతో పాటు, 101.7 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ కూడా పొందుతుంది. వెర్షన్ను బట్టి CLTC రేంజ్ 720 కి.మీ, 902 కి.మీ, 835 కి.మీ ఉంటుందని షియోమి పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ 752V నుంచి 897V పరిధిలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో, షియోమీ అప్డేటెడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేస్ డిజైన్తో క్యాబిన్ను సవరించింది. ఇందులో 16.1-అంగుళాల సెంట్రల్ డిస్ప్లే, 7.1-అంగుళాల రొటేటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. ఇవన్నీ షియోమీ స్మార్ట్ కాక్పిట్ సిస్టమ్కు అనుసంధానమై ఉన్నాయి. ఈ సెటప్ వాయిస్ కంట్రోల్స్, మల్టీ-స్క్రీన్ ఇంటరాక్షన్కు సపోర్ట్ చేస్తుంది. -
ఇంత అన్యాయమా తల్లీ!
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్ను మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?మంగళవారం ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?జగన్ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.ఎన్సీఎల్టీ తీర్పు అర్థమేమిటి?న్యాయాన్యాయాలు తేల్చమని జగన్ ఎన్సీఎల్టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? మీరు ఒక సైడ్ తీసుకోవడం న్యాయమా?చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అటాక్ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? సరస్వతీ పవర్, ఈడీ అటాచ్మెంట్లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్తో షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది. చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్ బెయిల్ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్సైడ్ తీసుకున్నారనేగా తల్లీ. కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్ భరించారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. విజయవాడ యువరాజ్ సినిమా «థియేటర్ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్కు కూడా ఇచ్చారని చెప్పారు. మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు. 2019 ఆగస్టులో జగన్ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్ మెంట్ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?వైఎస్సార్గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. అవి జగన్ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్ దగ్గరే ఉన్న షేర్స్ సర్టిఫికెట్స్ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ షేర్స్ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్సైడ్ తీసుకున్నారు. షర్మిల సైడ్ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్ తప్పులు, బీఆర్ నాయుడు తప్పులు, పుట్టా మహేష్ డ్రగ్స్ విషయం నేపథ్యంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్ మీరు రిలీజ్ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్లోని వెబ్సైట్లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? -
‘మానసిక వేదన అనుభవిస్తున్నా’
పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ఓడిపోవడం తనను మానసిక వేదనకు గురి చేస్తోందని, ఓటములతో కోర్టులో ఆటపై పట్టు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. గురువారం ప్రారంభమైన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్వియాటెక్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 50వ ర్యాంకర్ మగ్డా లినెట్టె 6-1, 5-7, 6-3తో ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన స్వియాటెక్ను మూడు సెట్లలో చిత్తు చేసింది. ఒక డబ్ల్యూటీఏ టూర్లో భాగంగా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో 73 మ్యాచ్ల్లో వరుస విజయాల తర్వాత తొలి రౌండ్లో ఓడిపోవడం స్వియాటెక్కు ఇదే తొలిసారి. మ్యాచ్ ఓటమి అనంతరం స్వియాటెక్ మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే నమ్మబుద్ది కావడం లేదు. రాను రాను టెన్నిస్ ఆట కష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మానసికంగా మనం ఎలా ఉంటామనేది చాలా కీలకం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మళ్లీ నా పనిలో మునిగిపోతా. ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్గా ఆలోచిస్తూ.. నా ఆటను మెరుగుపరచుకుంటా’ అని స్వియాటెక్ పేర్కొంది. కాగా స్వియాటెక్ తన టెన్నిస్ కెరీర్లో ఇప్పటివరకు ఆరు గ్రాండ్స్లామ్లు సాధించగా ఇందులో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఒక్కోసారి నెగ్గడం విశేషం. ఒక దశలో స్వియాటెక్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో 125 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.చదవండి: ‘సంజూకు మామయ్యలాంటి వాడిని’‼️UPSET ALERT IN HARD ROCK STADIUM ‼️@MagdaLinette | #MiamiOpen pic.twitter.com/lUJtcc5jbW— wta (@WTA) March 20, 2026 -
పశ్చిమాసియా మరింత ఉద్రిక్తం
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలకు రక్షణగా ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. ఆ దేశానికి చెందిన 200 మందికి పైగా నిపుణుల బృందాన్ని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలకు పంపింది. త్వరలోనే మరికొంత మందిని అక్కడికి పంపుతామని జెలెన్ స్కీ ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ను ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈనేపథ్యంలో కీవ్ సాయం కోసం గల్ఫ్ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ" ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న యుద్ధం మాకు దూరమైందేమి కాదు. రష్యా, ఇరాన్కు సహకరిస్తున్నందున ఈ యుద్ధంలో ఉదాసీనంగా ఉండే హక్కు మాకుందని మేము భావించడం లేదు. అని కొద్దిరోజుల క్రితం లండన్ పార్లమెంటులో జెలెన్స్కీ మాట్లాడారు. కాగా అంతకు ముందే ఉక్రెయిన్పై ఇరాన్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. అయితే వీటిని జెలెన్స్కీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.షాహిద్ డ్రోన్ల ప్రత్యేకతషాహిద్ డ్రోన్లను ఇరాన్ తయారు చేస్తుంది. ఆ దేశానికి చెందిన 'షాహిద్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ,ఇరాన్ విమానయాన పరిశ్రమల సంస్థ (HESA) వీటిని సంయుక్తంగా వీటిని రూపొందిస్తాయి. 'సూసైడ్' డ్రోన్లుగా ఇవి ప్రసిద్ధి చెందిన ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక వాటంతట అవే పేలిపోతాయి.అయితే రష్యా సైతం ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఇదే తరహా డ్లోన్లను రూపొందించింది. దీంతో వీటిని అడ్డుకునేలా ఉక్రెయిన్ తన సాంకేతికతను ఏర్పాటు చేసుకుంది. ఇదివరకూ ఉక్రెయిన్ 44,700కు పైగా షాహెద్ తరహా డ్రోన్లను కూల్చివేసింది. కేవలం గత నెలలోనే దాదాపు 3,238 షాహెద్ తరహా డ్రోన్లను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రోన్ల దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ దేశాలని రక్షించడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంది. అయితే వీటికోసం జెలెన్స్కీ తగిన మెుత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
‘తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది’
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పెదవి విరిచారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ విమర్శించారు బండి సంజయ్. ‘ చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్ది. మనది బిచ్చపు బతుకులేనా...?, ఇప్పుడు తెలంగాణా సమాజం ఆలోచించాల్సిన సమయం.. ఇది ప్రజలను వంచించే బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేదేమీ లేదు. రైతుభరోసా విషయంలో రైతులు అమాయకులనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేటాయిస్తావా..?, ఆరు వాయిదాలకు నాల్గు వాయిదాలు మాత్రమే ఇస్తుండు. మిగిలిన రెండు వాయిదాలు ఎగ్గొట్టే ప్లాన్ వేసిండు. ఈ ఒక్కసారిచ్చి పాతదివ్వక, వచ్చేదివ్వక ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటుడు ఈ ముఖ్యమంత్రి. రైతుకూలీలకు 12 వేలిస్తామని చెప్పి ఏమైందిప్పుడు..?బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తామన్నవాడు.. ఇంకా అదే పాట పాడుతున్నాడు. ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిండు ఈ సీఎం. ఇంకా లక్ష కోట్ల అప్పు చేస్తానని చెబుతుండు.. బీఆర్ఎస్ ఏం ఇచ్చిందని గాడ్ది గుడ్డు చూపిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడ్ది గుడ్డు చూపించిండు’ అని ధ్వజమెత్తారు. -
మమతా మ్యానిఫెస్టో విడుదల.. గ్యారంటీలు ఇవే..!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీదీకే వచన్ పేరుతో ప్రజలకు పది హామీలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. దీదీకే వచన్ దువారో చికిత్స ( ప్రజలకు ఇంటి వద్దకే వైద్యసేవలు) నిరుద్యోగులకు ప్రతినెల రూ.1,500, మహిళలకు ప్రతినెల రూ. 1,500,ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 1,700 అందజేయనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరిన్ని సంక్షేమ ఫలితాలను ప్రకటించింది. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి.కాగా ఇటీవలే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు,కేరళ, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి.మెుత్తంగా ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. సీఎం మమతా బెనర్జీ పేచీలో ఉన్న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించి వారి స్థానంలో ఇతర అధికారులను నియమించింది. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సారి 226 కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా నాలుగవ సారి అధికారం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించింది. ఈ ఏడాది భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపింది. దీంతో బీజేపీ సైతం మమత పోటీ చేస్తున్న స్థానంలో తమ అభ్యర్థిగా సువేందు అధికారిని నిలపనుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. దీంతో భవానీపూర్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. 2021లో టీఎంసీ 213 స్థానాలు గెలుచుకొని హ్యాట్రిక్ విజయం సాధించింది. 2016లో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021లో 77 స్థానాలు చేజిక్కించుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్కింగ్స్కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
అమెరికా ఒత్తిడికి లొంగలేదు..: శ్రీలంక
అమెరికాకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా హోర్మూజ్ జలసంధి భద్రతకు సహకరించాలన్న అభ్యర్థనను ఇప్పటికే పలు దేశాలు తిరస్కరించగా, అమెరికా నుంచి వచ్చిన రెండు యుద్ధ విమానాలకు శ్రీలంక సైతం అనుమతి ఇవ్వలేదట. మార్చి 4, 8 తేదీల్లో ఎర్ర సముద్రం నుంచి రెండు అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతి ఇవ్వాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ తీవ్ర యుద్ధ పరిస్థితుల నడుమ తాము ఒత్తిడికి తలొగ్గకుండా అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతికి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గమనే విషయాన్ని దిసనాయకే ఈ సందర్భంగా తెలిపారు. ‘యుద్ధం విషయంలో మేము తటస్థ వైఖరితో ఉన్నాం. మాకు చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ వాటికి తలొగ్గలేదు. అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక మట్టల అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతించాలనే రిక్వస్ట్ అమెరికా నుంచి వచ్చింది. అయినా మేము వాటిని సున్నితంగా తిరస్కరించాం. ఈ యుద్ధంలో మా భాగస్వామ్యం లేదు. అందుకే అమెరికా యుద్ధ విమానాలను మా భూభాగంలో నిలుపుదల చేస్తామంటే వద్దని కచ్చితంగా చెప్పేశాం. జిబౌటి బేస్ నుండి ఎనిమిది యాంటీ-షిప్ క్షిపణులతో రెండు యుద్ధ విమానాలను మట్టల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేము అనుమతించలేదు’ అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో శ్రీలంకను లాగకుండా ఉండాలనే ఉద్దేశాన్ని అమెరికాకు స్సష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:ఇరాన్ ‘ఉండేలు’ దెబ్బ -
మాజీ క్రికెటర్ ’రిటైర్మెంట్’.. బీసీసీఐపై సంచలన ఆరోపణలు
భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కీలక ప్రకటన చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కామెంట్రీ ప్యానెల్ నుంచి వైదొలిగినట్లు తెలిపాడు. ఇకపై బీసీసీఐ కామెంట్రీలో తాను కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు.శరీర రంగు నల్లగా ఉన్న కారణంగాఈ సందర్భంగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. తన శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా వివక్ష చూపారని.. అందుకే తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆరోపించాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ 1980వ దశకంలో టీమిండియాకు ఆడాడు.సంచలన ప్రదర్శనలుఅంతర్జాతీయ క్రికెట్లో తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన లక్ష్మణ్ శివరామకృష్ణన్.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టు అరంగేట్రంలో ఒక్క వికెట్ కూడా తీయని ఈ స్పిన్ బౌలర్.. 1984లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఏకంగా 12 వికెట్లు తీసి జట్టును గెలిపించి వార్తల్లో నిలిచాడు.అంతేకాదు 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్ గావస్కర్ కెప్టెన్సీలో బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్షిప్ గెలవడంలోనూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్తో నాటి ఫైనల్లో ప్రత్యర్థిని 176 పరుగులకే కట్టడి చేయడంలో సహకరించి.. భారత్ విజయానికి కృషి చేశాడు.ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటేటర్గా కెరీర్ ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీలో ప్లేయర్ రిప్రజెంటేటివ్గానూ పనిచేశాడు. ఈ క్రమంలో శుక్రవారం కామెంట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేపాడు.శాస్త్రి కోచ్గా ఉన్న సమయంలోనూ‘‘బీసీసీఐ కామెంట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 23 ఏళ్ల కాలంలో టాస్లు వేయడానికి, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను పనికిరాలేదు. కానీ కొత్త వాళ్లు వచ్చి పిచ్ రిపోర్టులు ఇస్తూ. టాస్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. శాస్త్రి కోచ్గా ఉన్న సమయంలోనూ నాకు అవకాశం రాలేదు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?’’ అంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ వరుసగా ట్వీట్లు చేశాడు.వర్ణ వివక్షఇందుకు ఓ నెటిజన్.. ‘‘మీరు రంగు తక్కువ కాబట్టి’’ అని కామెంట్ చేయగా.. ‘‘సరిగ్గా చెప్పారు’’ అని శివరామకృష్ణన్ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా ఇలాగే కామెంట్ చేయగా.. ‘‘అవును.. మీరు చెప్పింది నిజం. వర్ణ వివక్ష’’ అని పేర్కొన్నాడు. అయితే, మరికొంత మంది మాత్రం ఉన్నన్ని రోజులు బోర్డును వాడుకుని.. ఇలా నిందించడం కొందరికి అలవాటేనంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ను విమర్శించారు.అవునా?ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్ పోస్ట్పై స్పందించాడు. ‘‘ఓహ్.. ఇలా ఎందుకు? ఈసారి ఐపీఎల్కు ముందే ఎందుకిలా?’’ అని కామెంట్ చేశాడు. అయితే, అశూ వ్యంగ్యంగానే ఇలా స్పందించాడని అభిమానులు అంటున్నారు. గతంలో అశూను లక్ష్మణ్ శివరామకృష్ణన్ విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు. అశ్విన్ భారత్లో మాత్రమే రాణించగలడని.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి బౌలింగ్ రికార్డు ఘోరంగా ఉందంటూ విమర్శించాడు.చదవండి: అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ -
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్తో చేసిన సిక్స్ ప్యాక్లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
జట్టులో చోటుకే దిక్కులేదు.. కెప్టెన్ను చేయాలా?
పాకిస్తాన్ పేస్ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్గా బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 136 వికెట్లు కూల్చాడు.తద్వారా పాక్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షాహిన్ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.పదకొండేళ్ల తర్వాతఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో పాక్ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్ బంగ్లాకు వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సైతం షాహిన్ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.జట్టులో చోటుకే దిక్కులేదు‘‘పాకిస్తాన్ టీ20, వన్డే జట్ల కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.నిజానికి పాక్ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్ ఖతమైపోయింది’’ అని రషీద్ లతీఫ్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.మామ అలామరోవైపు.. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత షాహిన్ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్, బంగ్లా సిరీస్లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా?
భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్ను రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్ టీమ్తో హర్మన్ బృందం వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్కు ముందే టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ను భారత్ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్ (52), కెప్టెన్ అంజుమ్ చోప్రా (80), మిథాలీరాజ్ (55), హేమలతా కలా (64), మమతా మబెన్ (50) అర్థసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..డిసెంబర్ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్ జట్టుతో వార్మప్మ్యాచ్డిసెంబర్ 9: తొలి వన్డే, పోచెఫ్స్ట్రూమ్డిసెంబర్ 12: రెండో వన్డే, బ్లోమ్ఫోంటైన్డిసెంబర్ 15: మూడో వన్డే, కేప్టౌన్డిసెంబర్ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్, గెబెర్హాచదవండి: ‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’ -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ
ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.🚨 China is testing self-driving electric scooters with features like auto-balance. 🙏 pic.twitter.com/tL6Bz82cYi— Indian Tech & Infra (@IndianTechGuide) March 20, 2026 -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న సౌమ్యామిశ్రా
హైదరాబాద్ : జైల్భవన్లో ఈ రోజు (శుక్రవారం) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. జైళ్లశాఖ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో సత్కరించారు. ఈ అవార్డును డైరెక్టర్ జనరల్ విక్రమ్ త్రివేదీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సౌమ్యా మిశ్రాకు అందజేశారు.జైళ్ల శాఖలో సౌమ్యామిశ్రా చేసిన సంస్కరణలకు గానూ ఆమెకు ఈ అవార్డు అందజేసినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. జైళ్ల ఆధునీకరణ, సంక్షమే కార్యక్రమాలు, సంస్కరణాత్మక విధానాల ప్రోత్సాహం తదితర రంగాలలో ఆమె విశిష్ట సేవలు అందించినట్లు పేర్కొన్నారు.డిప్యూటీ సూపరిండెంట్ పోలీస్ వంశీ మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన, సామాజిక సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధులు డా. ఉలాజీ ఎలియాజర్ (కోఆర్డినేటర్), ఆకాంక్ష షా (ప్రతినిధి)తో పాటు ఇతరులు హాజరయ్యారు. -
మహిళల నీటి కష్టాలు మూడురెట్లు!
ప్రపంచంలో మన దేశానికి ఉన్నది 4% మంచినీరు మాత్రమే. కానీ, ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే నివశిస్తున్నారు. నీటి కొరత ఇప్పటికే మనకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలురు వెచ్చిస్తున్న దాని కంటే 3 రెట్లు ఎక్కువ. నీటి గణాంకాల గురించి సాధారణంగా క్యూబిక్ మీటర్లలో చెబుతూ ఉంటాం. కానీ ఈ ప్రతి సంఖ్య వెనుక ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖం, చాలా సార్లు, మహిళదే! ఇది కల్పన కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, యూఎన్ ఉమెన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాల సహితంగా నమోదు చేసిన వాస్తవం ఇదే. నీటి భద్రతే లింగ సమానత్వానికి భూమిక.ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 22న ‘ప్రపంచ నీటి దినోత్సవం’ నిర్వహిస్తూ మనలో నీటి చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం: ‘ప్రజలందరికీ నీరు: స్త్రీ పురుషులకు సమాన హక్కులు– సమాన అవకాశాలు’. నీటి దినోత్సవ ప్రచార నినాదం: ‘నీరు ప్రవహించే చోట, లింగ సమానత్వం వికసిస్తుంది’! అది సాగు నీరైనా, తాగు నీరైనా సరే.. నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అయినా మహిళల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు సముచితమైన చోటివ్వటం ద్వారా సమానత్వాన్ని వికసింపజేయాలని ఐరాస పిలుపునిస్తోంది! ఇది మనందరం ఆలకించాల్సిన మానవీయమైన పిలుపు!!వ్యవసాయానికి అవసరమైన శ్రమను, గృహ, ఉత్పాదక అవసరాలకు నీటిని అందించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అధికారిక నీటి నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుంచి వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నారు. వ్యవసాయ పనులను 37%–42% వరకు మహిళలే చేస్తున్నారు. ఒక పంట కాలంలో సగటున 3,300 గంటలు పనిచేస్తారు. పురుషుల 1,860 గంటలు మాత్రమే. కలుపు తీయటం, మొక్కలు నాటటం, నీరు పెట్టటం వంటి చేతులతో చేసే పనులు, ఎక్కువ నీరు అవసరమయ్యే పనులతో ΄ాటు, పశువులకు నీరు పెట్టటం వంటి పశు΄ోషణ పనుల్లో ఎక్కువ భాగాన్ని చక్కబెట్టే బాధ్యతలను మహిళలు నెరవేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీరే ‘వాస్తవ‘ నీటి నిర్వాహకులు అయినప్పటికీ, వారి ΄ాత్రను తక్కువగా చూస్తున్నారు. టైమ్ పావర్టీభూగర్భ జలమట్టాలు తగ్గి΄ోతున్నందున, మహిళలు నీటిని తెచ్చుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. మన దేశంలో మహిళలు కొన్నిసార్లు దీనికోసం రోజూ నాలుగు గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. బుందేల్ఖండ్, విదర్భ, రాయలసీమ వంటి కరువు పీడిత ప్రాంతాల్లో వేసవికాలంలో 15–20 లీటర్ల బిందెలను నెత్తిన పెట్టుకని రోజుకు 5–20 కిలోమీటర్ల దూరం నడచి మరీ కుటుంబాలకు మహిళలు, బాలికలు నీటిని సమకూర్చుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. గ్రామీణ భారతీయ మహిళ నీటి సేకరణ కోసం 210 గంటల (27 పూర్తి పనిదినాలకు సరిపడా) సమయాన్ని ప్రతి ఏటా కేటాయిస్తోంది. ఇంటì దగ్గరకే కుళాయి వస్తే ఈ సమయం అంతా మహిళలకు ఆదా అవుతుంది. ఈ శ్రమకు విలువ కడితే దేశం యావత్తూ ఒక రోజు ఆర్జించే ఆదాయానికి సమానం. ఈ పనుల వల్ల మహిళలు, బాలికలకు తీరిక దొరక్క (టైమ్ పావర్టీ) చదువు లేదా మరింత లాభదాయకమైన వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు. కేవలం 5% మంది మహిళలకు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సోలార్ పంపులు వంటి వాతావరణ మార్పుల్ని తట్టుకునే టెక్నాలజీలు అందుబాటులో లేవు. అందు వల్ల, మహిళా రైతులు ఎక్కువగా కరువు బాధితులుగా మారుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగల సేంద్రియ వ్యవసాయ నమూనాలకు మహిళా రైతులు పెద్దపీట వేస్తున్నారు. చిరుధాన్యాలను పండించటం, ఆహారంలో భాగం చేసుకోవటంలోనూ మహిళా రైతులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ ఆహార భద్రతను పెంచుతాయని, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయని అనేక సంస్థల అనుభవాలు నిరూపించాయి.పురుషులతో పోలిస్తే మహిళలు వాతావరణ మార్పుల పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారని చటర్జీ (2021) అధ్యయనంలో వెల్లడైంది. నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పశువుల సమస్యలు వంటి వివిధ రంగాలలో పురుషుల కంటే మహిళలే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తారని కూడా అధ్యయనాలు ఎత్తి చూపుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 55%–65% వాటా మహిళా రైతులదే. పురుష రైతులు వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి, వ్యవసాయేతర రంగాలలో కూలీలుగా మారుతున్న ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, భారతదేశంలో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది.లింగ సమానత్వానికి అడ్డంకులుమన దేశంలో నీటి హక్కులు సాధారణంగా భూ యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. సాగులో ఉన్న భూముల్లో కేవలం 13.5% మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నాయి. అధికారిక నీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా మిగిలిపోయింది.సమావేశాలకు హాజరు కావడానికి భర్త అనుమతి అవసరం కావడం, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ‘నీటిపారుదల పురుషుల పని’ అనే భావన వంటివి నీటి నిర్వహణలో లింగ సమానత్వానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. 2012లో ప్రభుత్వం ప్రకటించిన జాతీయ జల విధానం మహిళల అవసరాలను ప్రస్తావించింది. అయినప్పటికీ, జల పరిపాలనలో పురుషులతో సమానంగా మహిళలకు నిజంగా అవకాశాలు కల్పించడానికి ఇందులో నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు. మహిళల మహా శ్రమప్రతి రోజూ 20 కోట్ల మంది భారతీయులు నడిచి వెళ్లి దూరం నుంచి నీటిని తెచ్చుకుంటారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలు (భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ). భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 60 కోట్ల మంది, తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ 2018). ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ఫలితంగా ప్రతిరోజూ మహిళలు నీటిని తెచ్చేందుకు ఖర్చు చేసే 5.5 కోట్ల గంటల సమయం ఆదా అవుతోంది (జల్ శక్తి మంత్రిత్వ శాఖ, 2023).ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలుర కంటే 3 రెట్లు ఎక్కువ (యూఎన్ ఉమెన్, 2024).ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మహిళలు, అంటే మొత్తం మహిళల్లో 27 శాతానికి పైగా, సురక్షిత తాగునీటి సేవలను పొందలేకపోతున్నారు (యూఎన్ ఉమెన్/యూఎన్డిఈఎస్ఏ, 2023).సురక్షితమైన తాగునీరు అందక భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మరణిస్తున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ).మన దేశంలోని నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిలో 70 శాతం కలుషితమైంది. జల నాణ్యత సూచికలో 122 దేశాల్లోకెల్లా భారతదేశం 120వ స్థానంలో, చివరి నుంచి మూడో స్థానంలో, ఉంది (నీతి ఆయోగ్ / ప్రపంచ బ్యాంకు). ప్రపంచవ్యాప్తంగా 14% దేశాల్లో నీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడానికి ఇప్పటికీ ఎలాంటి యంత్రాంగాలు లేవు (యూఎఈ ఈపీ–డీహెచ్ఐ, జీడబ్ల్యూపీ, యూఎన్ ఉమెన్, 2025).నీటిపారుదల సామర్థ్యంవ్యవసాయరంగంలో నీటిపారుదల సామర్థ్యం ప్రపంచ సగటు 50–60%. మన దేశ వ్యవసాయ నీటిపారుదల సామర్థ్యం కేవలం 38% మాత్రమేనని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని 60%కి పెంచితే, ఏటా 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) పైగా నీరు అందుబాటులోకి వస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక అవసరాల కొరత మొత్తాన్ని తీర్చడానికి సరి΄ోతుందని నీతి ఆయోగ్ అంచనా.సమానమైన దిగుబడి కోసం అమెరికా, చైనా లేదా ఇజ్రాయెల్లోని రైతులతో ΄ోలిస్తే భారతీయ రైతులు (ఒక్కో పంట యూనిట్కు) 3–5 రెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇది రైతుల వైఫల్యం కాదు. ఇది విధానపరమైన మౌలిక సదుపాయాల వైఫల్యమని నీతి ఆయోగ్ / ఎఫ్ఏఓ తేటతెల్లం చేశాయి.ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను తోడే దేశం భారతదేశం. ఏటా 239–241 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తోడేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తోడుతున్న నీటిలో నాలుగో వంతు కంటే ఎక్కువ. 1,592 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని అధికంగా వినియోగిస్తున్నామని అంచనా.భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువల్లోని 70% నీరు కలుషితమయ్యాయి. జల నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. మనం కేవలం నీటిని కోల్పోవడమే కాదు, మిగిలి ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నామని నీతి ఆయోగ్/ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలకే గ్రామస్థాయి జల నాయకత్వం నీటి సేకరణకు అనుదినం మహిళలు, బాలికలు వెచ్చించే సమయం నుంచి ఆదా చేసే ప్రతి గంట సమయమూ.. మహిళాభివృద్ధిలో, విద్యలో, వాణిజ్యంలో, సమాజ పరివర్తనలో పెట్టుబడిగా పెట్టడానికి అదనంగా దొరికిన సమయమే. నీటి భద్రత, లింగ సమానత్వం అనేవి వేర్వేరు అంశాలు కావు. నీటి భద్రతతోనే లింగ సమానత్వం సాధ్యం. ఒకే సంక్షోభం, ఒకే అవకాశం. జల్ జీవన్ మిషన్ సహా ప్రభుత్వ నీటి పథకాలన్నిటికి సంబంధించి గ్రామ స్థాయిలో మహిళలను ప్రాథమిక జల పరిపాలన నాయకులు’గా అధికారికంగా గుర్తించాలి. నీటిని పరిపాలన బాధ్యతలు మహిళలకిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 5, 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్ భారత్ లక్ష్యం కూడా తద్వారా నెరవేరుతాయి. – మర్ది కరుణాకర్ రెడ్డి, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, జల సంరక్షణ ప్రచార కార్యకర్త– నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!) -
ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!
ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన జగదేకవీరుడు... ఇంటి ముందు మురుగు కాల్వలో పడి దిక్కుమాలిన చావు చచ్చినట్టుంది... ప్రస్తుతం ఎఫ్-35 యుద్ధవిమానం దుస్థితి! ఎఫ్-35ల చరిత్రలో ఇదే ఘోరాతి ఘోరం. ఇంత ఘోరం మునుపెన్నడూ లేదు. ఈ వార్త విన్నాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట మాట వచ్చి ఉండదు. ఎఫ్-35... అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధవిమానం. శత్రు రాడార్లకు సైతం చిక్కదు-దొరకదని అమెరికా ఘనంగా చెప్పే ఈ ‘స్టెల్త్’ ఫైటర్ జెట్ ఒక్కోదాని ధర వేరియంట్ ఆధారంగా రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది.యుద్ధవిమానాల పోరాట చరిత్రలో దీని సరిసాటి మరో విమానం నేటి వరకు లేదని చెబుతారు. ఎఫ్-35ను చూసుకుని అమెరికాకు మహా గర్వం. అమెరికా నుంచి ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేసిన ఇతర దేశాలు కూడా రక్షణ పరంగా ఎంతో భరోసాతో కనిపిస్తాయి. నిజమే గానీ... అదంతా నిన్నటిదాకా మాత్రమే. ఇరాన్ వైమానిక బలగాలను వెంటాడి, వేటాడి నిర్వీర్యం చేసినట్టు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ అదే దుర్బల ఇరాన్ రక్షణ దళాలు కొట్టిన ఉండేలు దెబ్బకు ‘ఎఫ్-35 లైట్నింగ్ 2’ అంతటి గండభేరుండం సైతం గతీదారి లేక పశ్చిమాసియాలోని ఓ స్థావరంలో అత్యవసరంగా కిందికి దిగాల్సొచ్చింది. పైలట్ క్షేమనేనని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అమెరికా ప్రకటించింది. కాదు కాదు... తమ ప్రతాపానికి ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోయిందనేది ఇరాన్ వాదన. ప్రపంచంలో ఎఫ్-35ను దెబ్బకొట్టిన తొలి దేశం తామేనని ఇరాన్ ప్రకటించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా క్షీణదశలో, పతనావస్థలో ఉన్న ఇరాన్ వైమానిక దళం అత్యంత అధునాతన ఎఫ్-35ను పిట్టను కొట్టినట్టు ఎలా కొట్టగలిగింది? ఇప్పుడిదే అందరిలో మెదులుతున్న సందేహం. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పనైపోయిందని భావించి అతి ధీమాతో సదరు ఎఫ్-35 ఫైటర్ జెట్ మధ్య ఇరాన్ మీదుగా ఎగురుతుండగా ఈ నెల 19న ఆ ఘటన చోటుచేసుకుంది. దీనిపై అమెరికా నుంచి ప్రకటన వెలువడేలోపే... పుండు మీద కారం చల్లినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెంటనే ప్రతిస్పందించింది. ఎఫ్-35ను తాము ఎలా ట్రాక్ చేసింది, ఎలా అడ్డుకున్నదీ తెలిపే ఫుటేజిని ప్రదర్శించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 15 దేశాలు ఎఫ్-35 యుద్ధ విమానానికి చెందిన పలు వేరియంట్లను వినియోగిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్వేతసౌధ సందర్శన సందర్భంగా... వీటిని మన దేశానికి కూడా విక్రయిస్తామని ట్రంప్ ప్రతిపాదించారు. దానిపై భారత్ ఇంతవరకు సుముఖత తెలుపలేదు.స్టెల్త్ ఆధునికతకు నాటు దెబ్బ!శత్రు దేశాల రాడార్లు పసిగట్టకుండా ప్రయాణించడానికంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసినవే స్టెల్త్ విమానాలు. ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఇరాన్ ఎలా ఢీకొట్టిందనే అంశంపై రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ స్పందించారు. ‘స్టెల్త్ సాంకేతికత’ను ఆ పేరుతో పిలవటమే సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాడారుకు స్టెల్త్ విమానం అస్సలు కనిపించదని కంపెనీ బ్రోచర్లు చెబుతాయి గానీ... ఆ విమానాన్ని గుర్తించడానికి ఇతర మార్గాలున్నాయని, గురువారం ఎఫ్-35 విషయంలో అదే జరిగిందని సందీప్ చెప్పారు. ఎఫ్-35 లక్ష్యంగా ఇరాన్ ఏ క్షిపణులు ప్రయోగించిందో కచ్చితంగా తెలియనప్పటికీ... అది ప్రత్యేకించి ‘358 విమాన విధ్వంసక క్షిపణి’ గానీ లేదా ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి గానీ అయివుండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘358 క్షిపణి’ని ‘ఎస్ఏ-67’గా కూడా వ్యవహరిస్తారు. ఇది పరారుణ సెన్సర్ అమర్చిన ఓ మిసైల్. తక్కువ ఎత్తులో నిదానంగా ప్రయాణించే డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే ఎఫ్-35 నిదానంగా ప్రయాణించే జెట్ కాదు. ఇరాన్ గతంలో అమెరికన్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని ‘358 క్షిపణి’ని ప్రయోగించింది. యెమెన్ హౌతీలకు కూడా ఇరాన్ ఈ క్షిపణులను సరఫరా చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన గత నెల 28 నుంచి ఇప్పటివరకు అమెరికా డజనుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. ‘358 క్షిపణి’లోని పరారుణ సెన్సర్... ఎఫ్-35 జెట్ వెలువరించే వేడిని గుర్తించి ఉంటుందని, తద్వారా దాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటుందని సందీప్ ఉన్నితన్ విశ్లేషించారు. రాడార్ కంటపడకపోయినా పరారుణ వర్ణపటం (ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్) రీత్యా ఎఫ్-35 తప్పించుకోలేదని అన్నారు. ఎఫ్-35 అనేది ఒకేఒక ఇంజిన్ ఉండే జెట్. ఎగిరేటప్పుడు అది అమిత వేడిని వెలువరిస్తుంది. రాడార్ వాడకుండానే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ) వ్యవస్థ సాయంతో వేడిని గుర్తించి దాని ఆధారంగా విమానాన్ని ట్రాక్ చేయవచ్చని వివరించారు. గురువారం బహుశా అదే జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. 20 రోజుల పోరాటం తర్వాత తాము ఇరాన్ వైమానిక బలగాల వెన్ను విరిచినట్టు అమెరికా, ఇజ్రాయెల్ చాటుకుంటున్నాయి. ఆ ప్రాతిపదికనే అమెరికా తమ బి-1, బి-2 బాంబర్లను మోహరించింది. ‘స్టెల్త్’ సామర్థ్యం లేని ఈ బాంబర్లను శత్రు దేశపు గగనతలంపై సంపూర్ణ ఆధిక్యం లభించినట్టు తెలిశాక మాత్రమే అమెరికా సహజంగా మోహరిస్తుంది. ఎఫ్-35ను సైతం దెబ్బ కొట్టగలిగాయంటే ఇరాన్ వైమానిక బలగాలు క్రియాశీలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. - జమ్ముల శ్రీకాంత్ -
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. మరో కోణం
విమానయాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఒక దేశ గగనతలంలో ప్రయాణించే ప్రతి విమానాన్నీ సమన్వయం చేయడం వారి బాధ్యత. ఒక్క చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదిగా గుర్తించాలి. అయినా విమానయాన సంస్థలు వీరికి తగిన వేతనాలు, పని గంటల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అనేక ఉద్యమాలు వచ్చాయి. అందులో 2026 మార్చి 7న ఇటలీ రాజధాని రోమ్లో 1,500 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నిర్వహించిన సమ్మె ఒకటి. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ సమ్మె ఇటలీ విమానయాన వ్యవస్థపై గణనీయమైన ప్రభావం కలిగించింది. ముఖ్యంగా రోమ్లోని ‘ఫ్యూమిచినో’ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ఈ సమ్మెతో స్తంభించాయి.ఇటలీ గగనతలం యూరప్లో ప్రధాన మార్గాలలో ఒకటి. యూరప్ నుండి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వైపు వెళ్లే అనేక విమానాలు ఇటలీ గగనతలాన్ని దాటుతాయి. అందువల్ల రోమ్లో జరిగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కేవలం స్థానిక సమస్యగా కాకుండా అంతర్జాతీయ విమాన రవాణాపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఉద్యోగులు తమ పని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.గత దశాబ్దంలో ప్రపంచ విమానయాన రంగం వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు పెరగడంతో విమానాల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ పెరుగుదలతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య తగినంతగా పెరగలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కో కంట్రోలర్పై పని ఒత్తిడి పెరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రంగంలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఇటలీలో కొన్ని కంట్రోల్ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల్లో కొత్త నియామకాలు లేవు. ఈ సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు అదనపు షిఫ్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!మరోపక్క ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు తగినంతగా పెరగడం లేదు. ఈ సమ్మెను యూరప్లో పెరుగుతున్న కార్మిక ఉద్యమాలలో భాగంగా చూడాలి. 2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు యూరప్లో రైల్వేలు, విమానయాన, ప్రజా రవాణా వంటి రంగాలలో కార్మిక అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో ఇదే సమయంలో రవాణా కార్మిక సమ్మెలు జరగడం గమనార్హం. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరగడం వంటి అంశాలు ఈ ఉద్యమాలకు కారణమయ్యాయి.– యాటల సోమన్నసీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు -
మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..
చర్మసంరక్షణకు సంబంధించిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వంటి ఎన్నో ఆయిల్స్ రాసి, అంతగా ప్రయోజనం పొందక విసిగిపోయినవాళ్లెందరో ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో నెట్టింట వైరల్గా మారింది నల్పమరాది తైలం. అసలేంటి తైలం అని అందరిలోనూ ఒకటే కుతుహలం రేకెత్తించింది. ఇంతకీ ఏంటి ఆయిల్..? చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతుందంటే..ఆ ఆయిల్ నల్పమరాది తైలం. ఇది భారతదేశంలోని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధ తైలం. కేరళ ఆయుర్వేదం నుంచి ఉద్భవించింది. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, ఛాయను మెరుగుపర్చడానికి, ఎండవల్ల వచ్చిన టాన్(నలుపుదనాన్ని)ని తొలగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో తరుచుగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. ఇటీవల గత కొన్ని రోజులుగా ఈ ఆయిల్ గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ తైలం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు తాము ఈ ఆయిల్ని వినియోగించి చూశాం అంటూ ఇస్తున్న రివ్యూలు కూడా ఈ క్రేజ్కి కొంత కారణం. దాంతో ఈ ప్రొడక్ట్ ప్రధాన ఆకర్షణగా మారడమే గాక, తరతరాలుగా విశ్వసిస్తున్న ఈ ఆయిల్ పట్ల ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు, చర్మ సంరక్షణ ప్రియులను నుంచి పెద్ద ఎత్తున్న సానుకూల స్పందన రావడం విశేషం. తయారీ..నల్పమరాది తైలం ప్రధానంగా మర్రి, రావి, గోమేధిక, అత్తి వంటి నాలుగు రకాల చెట్ల బెరడులతో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని స్వస్థపరిచి, కాంతివంతం చేస్తుంది. ఈ తైలానికి సాధారణంగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. ఇందులో పసుపు, వెటివర్, ఆమ్లా, వంటివి కూడా జోడిస్తారు. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఉపయోగపడతాయి.మూడువేల ఏళ్లకు పైగా చర్రిత కలిగిన పురాతన తైలం కేరళలో ఉద్భవించిందని చాలామంది ప్రజల గట్టి నమ్మకం. నాలుగు పవిత్రమైన చెట్ల బెరడు నుంచి వచ్చిన మిశ్రమం కావడంత దీన్ని "నల్పమరం" అని పిలస్తారు. దీన్ని గాయాలు మాన్పడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి ఎక్కువుగా వినియోగించేవారట. ఇది శిశువుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందట. మంత్రసానులు ఈ నూనెలోని పలుచని ద్రావణాన్ని శిశువుల మసాజ్ కోసం వినియోగిస్తారట. అంతేగాదు ప్రపంచ యుద్ధాల సమయంలో, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల మహిళలు సాంప్రదాయ నల్పమరాది తైలం మిశ్రమాలను పునరుద్ధరించి, వాటిని కొబ్బరి ఆకుల బుట్టలలో నిల్వ చేసేవారట. అంతటి విశిష్టత కలిగిని నూనెని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!. View this post on Instagram A post shared by Dr Midhila Reghunath (B.A.M.S) (@ayursutraabydrmidhila) (చదవండి: 9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!) -
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
తాడేపల్లి : రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా..అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తెలిపారు. -
టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ కామాఖ్య. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఓ మిస్టరీ కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధన్రాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జ్ఞాని సంగీతమందిస్తున్నారు. -
మాట నిలబెట్టుకున్న విజయ్.. చిన్నారిని ఇంటికి పిలిచి మరీ..
పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వైభవంగా పెళ్లిదేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్లో మార్చి 4న గ్రాండ్గా రిసెప్షన్ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. లడ్డూలు ఇవ్వొచ్చు కదా!నేను కూడా విజయ్కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! విప్రేమతో ముద్దుల వర్షంరోష్ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్, విరోష్ను కలిశావ్ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్ ఆన్సరిదే! -
నా పాత్రపైన 'పుష్ప 2' టీజర్.. తీరా సినిమా రిలీజయ్యేసరికి
సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నటీనటుల్ని తీసుకుంటారు. వాళ్లతో బోలెడన్ని రోజులు పనిచేయించుకుంటారు. కానీ చివరకొచ్చేసరికి ఏమైనా జరగొచ్చు. దర్శకుడు లేదా హీరో అనుకున్న ఔట్పుట్ బయటకొస్తుంది. సినిమా రిలీజైన తర్వాత కొందరు నటీనటుల.. ఇలా ఎడిటింగ్లో తన పాత్రని తగ్గించడం లేదా తీసేయడం గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తెలుగు బిగ్బాస్ ఫేమ్ దివి కూడా 'పుష్ప 2' విషయంలో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)'నాకు చెప్పినప్పుడు చాలా పెద్ద రోల్. నా క్యారెక్టర్పైనే టీజరే వచ్చింది. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుందని నేను అలానే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమా వచ్చే టైంకి అన్ని ఉండవు. నేను చాలా బ్యాడ్గా ఫీలయ్యాను. కానీ ఎవరు వింటారు? ఇప్పుడు మన బాధ ఎవరు పట్టించుకుంటారు? దాని నుంచి మూవ్ అయిపోవాల్సిందే. నా పది మంది ఫ్రెండ్స్ని థియేటర్కి తీసుకెళ్లా. షూటింగ్ 20 రోజులు చేస్తే డబ్బింగ్ 10 రోజులు చెప్పాను. చాలా బాగా చేశామని నాకు తెలుసు. కానీ సినిమా చూసిన తర్వాత షాకయ్యాను' అని నటి దివి చెప్పింది.ఈ సినిమా నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు అందులో దివి పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ టీజర్లో చూపించిన ఏ సీన్ కూడా సినిమాలో లేదు. కేవలం ఒకటి రెండు సన్నివేశాల్లో రిపోర్టింగ్ చెబుతున్నట్లు మాత్రమే దివి కనిపిస్తుంది. తనేం మోసపోయానని చెప్పలేదు గానీ ఇలా చేయడం మాత్రం తనని చాలా బాధపెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు) -
ఫ్లిప్కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా
పబ్లిక్ లిస్టింగ్కు ముందు, ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది. -
మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం..!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్ ఖారత్తో ఆ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది. మహిళా చైర్పర్సన్స్ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. చైర్పర్సన్ పదవికి చకాంకర్ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రుపాలి చకాంకర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు. మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే), అజిత్ పవార్ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉంచితే, ఆ రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్.. ఓ మహిళను ఆస్ట్రాలజీ పేరుతో మోసం అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె బెదిరించి, భయపెట్టి గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పెన్డ్రైవ్లో 58 వీడియోలు, అందులో కొన్ని అభ్యంతరకరమైన క్లిప్స్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా అతనిపై కేసులు పెట్టారు.అయితే ఇప్పుడు మహిళా చైర్పర్సన్ రూపాలి .. ‘కెప్టెన్’ అని చెప్పుకునే సదరు ఆస్ట్రాలజర్ అశోక్తో దిగిన ఫోటోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్కు జూన్లో టీమిండియాతో జరిగే సిరీస్తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకాలం అండర్-19 క్రికెట్లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ఇక ఐపీఎల్లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన రియాన్ పరాగ్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వైభవ్ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్ ఓపెనర్ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్లే అందుకు నిదర్శనం. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్గా వైభవ్కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం. జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు. కాగా గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన సంజూ శాంసన్ ట్రేడింగ్లో చెన్నై సూపర్కింగ్స్కు వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ నూతన కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్ స్థానంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్లు చెన్నై నుంచి రాజస్థాన్కు వచ్చారు.చదవండి: ఇరాన్కు షాకిచ్చిన ఫిఫా! -
'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్వీర్ సింగ్ దురంధర్-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.మొదటి పార్ట్లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది. మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని మేకర్స్ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దివ్య తన ట్వీట్లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026 -
కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో పడి ఐదుగురు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన విషాదకరమని.. ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుక్కునూరు మండలం వేలేరు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. గోక తేజ-ఉయ్యూరు (ఏపీ), నవదీప్-ఉయ్యూరు (ఏపీ), పాశం సతీష్ కుమార్, మదనపల్లి (ఏపీ), చారు గుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ), పొడిచేటి అభిరామ్ భద్రాచలం (తెలంగాణ) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వెడ్డింగ్ షూట్ కోసం.. నీటిలో తేలియాడుతూ..!
ట్రెండింగ్లో ఉండాలనే పిచ్చి ప్రజలను ఏ పనికైనా ఉసిగొలుపుతుంది. కొందరేమే సెన్షేషన్ పేరుతో రీల్స్ చేసి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరేమే కొత్తదనం కోరుకుంటూ నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాన్ని ముగించినట్లు ఫోటోషూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి చేసుకొని నూతన జీవితం ప్రారంభించాల్సిన జంట నీటిలో పడి తేలియాడతూ వీడియో తీశారు. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం కాలంలో సంప్రదాయాలు ఏ విధంగా మారుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఆధునికత పేరుతో తమకు నచ్చిన ట్రెండ్ను యువత ఫాలో అవుతున్నారు. సాధారణంగా ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఫేమస్ అయ్యాయి. రకారకాల లోకెషన్లలో ఫోటోలు దిగుతూ సాంగ్స్ షూట్ చేస్తూ మ్యారేజ్ని సెలబ్రేట్ మోడ్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక జంట తమ వెడ్డింగ్ షూట్ని వెరైటీగా ప్లాన్ చేసింది.తెల్లబట్టలు ధరించిన యువతీ యువకులు బురద గుంటలో నీటిలో తేలియాడుతూ నటించారు. దీనిని ఆ ఫోటో గ్రాపర్ సినిమాటిక్ రేంజ్లో షూట్ చేస్తున్నట్లు హంగామా చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు."వన్యప్రాణి ఫోటో గ్రాఫర్ను కాస్త పెళ్లళ్ల ఫోటో గ్రాఫర్ చేశారు" అని ఒకరు కామెంట్ చేస్తున్నారు. మరోకరు టైటానిక్ మరియు గంగమ్ స్టైల్ కలయిక అని కామెంట్ పెట్టారు. మరోకరు ఇది పెళ్లికి ముందు ఫోటో షూటా లేక పెళ్లి తర్వాతదా అని సరదాగా ప్రశ్నించారు.అయితే ఇటీవల కాలంలో ప్రజలు సెన్షెషన్ల కోసం తెగబడిపోయి ఇష్ఠారీతిన వ్యవహరిస్తున్నారు. కొందరేమే రీల్స్ మోజులో పడి ప్రాణాల పైకి తెచ్చుకుంటే మరి కొందరేమో ఇలా శుభకార్యం జరిగే ముందు సెన్షేషన్ కోసం ఇలా ఇబ్బందికర షూట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి కల్చర్ అసలు ఎటు వైపు వెళుతుందా అని ప్రశ్నిస్తున్నారు.Pre Wedding Shoots are getting too weird pic.twitter.com/xhVKjoZrVy— Rosy (@rose_k01) March 18, 2026 -
సాఫ్ట్వేర్ ఉద్యోగులను వణిస్తున్న సీఈవో వ్యాఖ్యలు
సాంకేతిక రంగంలో కొలువుల కోత భయాలు నిజమవుతున్నాయా? గతంలో కేవలం సాధారణ పనులకే పరిమితమైన కృత్రిమ మేధ (AI), ఇప్పుడు హై-టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) రంగాల్లో పనిచేసే వారి భవితవ్యంపై పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.'ప్రాపంచిక' పనులకు ఇక స్వస్తి..ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పెర్ప్లెక్సిటీ' సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ (X) వేదికగా టెక్ పరిశ్రమలో రాబోయే మార్పులపై కుండబద్దలు కొట్టారు. "సాఫ్ట్వేర్ ఉత్పత్తుల టెస్టింగ్, నాణ్యతను అంచనా వేయడం (QA) వంటి ప్రాపంచిక పనులు (Mundane Jobs) క్రమంగా కనుమరుగవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆ కోడ్ను తనిఖీ చేసే బాధ్యతను కూడా ఏఐ తన భుజాన వేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.రంగంలోకి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'పెర్ప్లెక్సిటీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' అప్డేట్ ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ సాధనం వెబ్ అప్లికేషన్లను నిర్మించడమే కాకుండా, వాటిని స్వయంగా పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఆటోమేటెడ్ టెస్టింగ్ : 'ప్లేరైట్' (Playwright) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా క్వాలిటీ చెకర్ అవసరం లేకుండానే అప్లికేషన్ను రన్ చేస్తుంది.మానవ ప్రమేయం అక్కర్లేదు: ఒక సాధారణ వినియోగదారు యాప్ను ఎలా ఉపయోగిస్తారో, ఈ AI సిస్టమ్ కూడా అలాగే యాప్ను తనిఖీ చేసి, లోపాలను (Bugs) గుర్తిస్తుంది.క్షణాల్లో పరిష్కారం: డెవలపర్లు జోక్యం చేసుకోకముందే సమస్యలను గుర్తించి, వాటిని బ్యాక్గ్రౌండ్లోనే పరిష్కరించేలా ఈ టూల్ను రూపొందించారు. -
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్చాట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు. -
ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. ఒక్కో ఆర్డర్కు ప్లాట్ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.చివరిసారిగా ప్లాట్ఫామ్ పీజుల పెంపును కంపెనీ సెప్టెంబర్ 2025లో చేపట్టింది. జొమాటో ఫుడ్ డెలివరీకి.. పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్కు 14.99 రూపాయలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందిఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త పోటీదారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో, ఇటీవల బెంగళూరులో 'ఓన్లీ' అనే తన ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించింది. డెలివరీ ఫీజు మినహా, కస్టమర్ల నుంచి గానీ, రెస్టారెంట్ల నుండి గానీ ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయబోమని ఆ కంపెనీ తెలిపింది.ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో రాపిడో తీసుకున్న ఈ చర్య ఇప్పటికే ఉన్న సంస్థలపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాగా.. ప్లాట్ఫామ్ ఫీజుల పెంపుకు సంబంధించిన ప్రకటన తరువాత.. ఎటర్నల్ షేర్లు దాదాపు 2% పెరిగి ఒక్కో షేరు రూ. 233 వద్ద ముగిశాయి. -
ఇరాన్కు షాకిచ్చిన ఫిఫా!
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్ వేదికలను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫిఫా (అంతర్జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ సమాఖ్య) తోసి పుచ్చింది. ఇప్పటికే మ్యాచ్ వేదికలను సిద్ధం చేశామని, ముందు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో తెలిపారు. ఇరాన్ అభ్యర్థన సహా పలు అంశాలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిఫా పాలకమండలి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గియాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా సభ్య సమాఖ్య చేసిన ఫిర్యాదులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘గత డిసెంబర్లోనే ఫిఫా మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేశాము. దీంతో మ్యాచ్ వేదికలను మెక్సికోకు మార్చాలన్న ఇరాన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇరాన్ మ్యాచ్ వేదికలను మార్చలేము. అందుకే షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లను నిర్వహించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ఫుట్బాల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పాలస్తీనా ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తున్నాం. భౌగోళిక రాజకీయాలను పరిష్కరించేందుకు ఫిఫా పనిచేయదు. కాకపోతే యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలనే విషయానికి ఫిఫా కట్టుబడి ఉంటుంది.’ అని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య మొదలైన యుద్ధం మూడు వారాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. అయితే సాకర్ ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ యుద్ధానికి రెండు నెలల ముందే విడుదలయ్యింది. అమెరికా, కెనెడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ జూన్ 11న ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం,న్యూజిలాండ్, ఈజిప్ట్లతో తమ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఇరాన్ తన మూడు మ్యాచ్లను అమెరికాలోనే ఆడాల్సి ఉండగా.. లాస్ఏంజిల్స్ వేదికగా రెండు, మరో మ్యాచ్ను సియాటెల్లో ఆడాల్సి ఉంది. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమ లీగ్ మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఫిఫాను విజ్ఞప్తి చేసింది. తాజాగా ఫిఫా నిర్ణయం ఇరాన్ను చిక్కుల్లో పడేసినట్లయింది. ఇప్పుడు ఇరాన్ ముందు రెండే ఆప్షన్లు.. ఆడడం లేదా టోర్నీ నుంచి వైదొలగడం. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ను బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం -
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
'నాన్న బ్రాండ్లోనే విచిత్రమైన నాన్న సార్'.. హ్యాపీరాజ్ ట్రైలర్ చూశారా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్పై జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్కప్-2027 వరకు తానే చీఫ్ సెలక్టర్గా ఉంటానని అగార్కర్ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.అతడికి ఆ అవసరం లేదుఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ ప్యానెల్లోని సబ్ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.అజిత్ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్ వన్డే వరల్డ్కప్-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్లో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు.సాహసోపేత నిర్ణయాలు సెలక్షన్ కమిటీ చైర్మన్గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్ అగార్కర్ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్కప్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఆసియా టీ20 కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను భారత్ గెలుచుకుంది.ఇక అజిత్ అగార్కర్కు తోడుగా హెడ్కోచ్గా మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్కప్ గెలిచాడు. సీనియర్ల రిటైర్మెంట్ఇక వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక 2024లో వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
వైష్ణవి సమాధి వద్దే నిద్రపోతూ..!
జగిత్యాల: అదొక అన్న ఆత్మ వేదన.. చెల్లెలు ఇక తిరిగిరాదని తెలిసినా ఆమె సమాధి వద్దే పడుకుని కన్నీళ్లు ఇంకిపోయేలా విలపిస్తున్న రోదన. ఇటీవల యూట్యూబర్ వైష్ణవి భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ హృదయ విదారక ఘటనను తలుచుకుని వైష్ణవి అన్న సంతోష్ కుమిలిపోతున్నాడు. చెల్లెలు సమాధి వద్దే నిద్రిస్తున్నాడు. తన చెల్లెలకు ఏమి ఇష్టమో దాన్ని తినిపించడానికి సమాధి వద్దే ఉంటున్నాడు. జీవితం ముగిసినా బంధం మాత్రం శాశ్వతం. నిద్రలోనూ చెల్లి జ్ఞాపకాలు.. అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చెల్లి సమాధి వద్ద అన్న నిద్రపోవడం అనేది కేవలం శరీర విశ్రాంతి కాదు, అది హృదయపు ఆవేదనకు ప్రతిరూపం. మట్టి కింద నిశ్శబ్దంగా ఉన్న చెల్లి జ్ఞాపకాలతో, అన్న కన్నీటి చుక్కలు రోదిస్తున్న తీరు వారి మధ్య అనురాగపు బంధానికి నిదర్శనం.చెల్లెలు ఇక రాదని తెలుసు. సమాధిలో ఉన్న చెల్లెలు పైకి లేచి రాదని తెలుసు. కానీ చెల్లెలు ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వైష్ణవి ఇష్టంగా తినే అహారం సమాధివద్ద పెడుతున్నాడు సంతోష్. ఈ హృదయ విదారక ఘటనను చూసి చుట్టపక్కల వారు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.వైష్ణవి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్కోరుట్ల మండలం మాదాపూర్లో మూడురోజుల క్రితం హత్యకు గురైన యూట్యూ బర్ వైష్ణవి ఘటనలో నిందితులైన హరిబాబు తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి ఆశో క్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధు వులు గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కు దిగారు. ఫ్లకార్డులతో మాదాపూర్ నుంచి తర లివచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు న్యా యం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్నెస్లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?
ప్రస్తుతం దేశంలో 'ధురంధర్ 2' గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది. సీక్వెల్ అయిన ఈ చిత్రం.. రెండు రోజుల క్రితం ప్రీమియర్లతో థియేటర్లోకి వచ్చింది. రిలీజ్కి ముందు బీభత్సమైన హైప్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య ధర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే రూమర్ కొన్నిరోజుల ముందు వరకు వినిపించింది. కానీ 'ధురంధర్ 2' రిలీజైన తర్వాత అలాంటిదేం లేదని అందరికీ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)అయితే 'ధురంధర్' ఫ్రాంచైజీని పూర్తి చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'అశ్వద్ధామ' గురించి అల్లు అర్జున్తో ఆదిత్య చర్చలు జరిపాడనే టాక్ బయటకొచ్చింది. తర్వాత దీని అప్డేట్ ఏం లేదు. అయితే 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్.. సినిమాని పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యని ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో కలిసి పనిచేస్తారా అనే సందేహం వస్తోంది.ఇందులో అల్లు అర్జున్ మెయిన్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్లో వచ్చే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియడానికైనా మరికొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే 2019లో 'ఉరి' రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత 'ధురంధర్' రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తర్వాత మూవీ ఎన్నేళ్లకు వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో చూసుకుంటే 'పుష్ప'తో బన్నీ, 'ఆర్ఆర్ఆర్' తారక్ రేంజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న ప్రాజెక్టుల స్పాన్ కూడా పెద్దదే. ఒకవేళ కాలం కలిసొచ్చి ఆదిత్య.. అల్లు అర్జున్-ఎన్టీఆర్తో మల్టీస్టారర్ తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
టికెట్ లేని ప్రయాణం.. రైల్వేకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డు సాధించింది. టికెట్ తనిఖీల్లో భాగంగా అక్రమంగా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి వారికి పెద్ద మెుత్తంలో జరిమానా విధించింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 223 కోట్లకు పైగా ఫైన్ల ద్వారా ఆదాయం పొంది ఇండియాలోనే మెుదటి స్థానంలో నిలిచింది.టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం అని అందరికి తెలుసు. అయినా కొంతమంది అత్యుత్సాహంతో టికెట్ లేకుండా ప్రయాణించి రైల్వేను బురిడి కొట్టిద్దామని చూస్తారు. అయితే అలా చేస్తూ ఇరకాటంలో పడతారు. దొరికిన అనంతరం పెద్ద మెుత్తంలో జరిమానా చెల్లించి లబోదిబోమంటారు. తాజా నివేదికలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దక్షిణమధ్య రైల్వేకు ఏకంగా రూ. 223 కోట్లకు పైగా టికెట్ లేకుండా ప్రయాణించడం ద్వారా వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 221.08 కోట్లు టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపుకు 14 రోజులు ఉండగానే రికార్డు స్థాయిలో రూ. 223.60 కోట్లు జరిమానాల ద్వారా రైల్వేకు వచ్చాయి. టికెట్ లేకుండా ప్రయాణించడం, అత్యధిక లగేజ్ కలిగి ఉండడం తదితర చట్టరీత్యా వ్యతిరేకమైన ప్రయాణాలకు జరిమానాలు వేయడం ద్వారా ఇంత పెద్ద మెుత్తంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా 2025 అక్టోబర్ 18 ఒక్కరోజే రూ. 1.85 కోట్లు జరిమానాల ద్వారా వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇండియాలో ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఇదే అత్యధిక జరిమానాల వసూలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ " గతంలో ఏ ఆర్థిక సంవత్సరం ఇంతపెద్ద మెుత్తంలో రైల్వేకు ఆదాయం రాలేదన్నారు. రైల్వేశాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేసి నేరపూరిత ప్రయాణాన్ని అరికట్టారని వారందరికీ అభినందనలని తెలిపారు. -
అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఓపెనర్ టామ్ లాథమ్ (55 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో టెయిలెండర్ కొబాని మొకినా (26 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా, జార్జ్ లిండే (23) పర్వాలేదనిపించాడు. అయితే సౌతాఫ్రికా టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో సఫారీలు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అయితే తొలి రెండు టీ20 మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఛేదనలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. కాన్వే, టామ్ లాథమ్లు తొలి వికెట్కు 96 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కాన్వే ఔటైనా లాథమ్ చివరి వరకు నిలిచి జట్టుకు స్పష్టమైన విజయాన్ని అందించాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన లోకీ ఫెర్గూసన్ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.చదవండి: IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ! -
ఓటీటీలో హనుమాన్ హీరో ఎంట్రీ.. ఏకంగా హోస్ట్గా ఛాన్స్..!
హనుమాన్ మూవీతో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించకున్న టాలీవుడ్ తేజ సజ్జా. ఆ తర్వాత మిరాయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్లో సక్సెస్ అయిన ఈ షోను తెలుగులోనూ తీసుకొస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఓటీటీలోనూ హనుమాన్ హీరో సందడి చేయనున్నాడు. ఇలాంటి ఇంటర్నేషనల్గా క్రేజ్ ఉన్న షోకి హోస్ట్గా వ్యవహరించడం వల్ల అతని క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్తో కలిసి తేజ సజ్జా వేదికపై సందడి చేశారు.ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. ఈ షోలో కేవలం చాలా ఇంటలిజెన్స్తో ఉన్నవాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వర్షన్ ప్రైమ్ వీడియోలో రానుంది రాబోతోంది. అయితే ఈ అప్ కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ హోస్ట్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గతేడాది హిందీలో వచ్చిన ఈ ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో ఈ రియాలిటీ షో జరగనుంది. -
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
భారత్లో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇక హైదరాబాద్లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేసింది.ఏమిటీ ప్రీమియం పెట్రోల్?ప్రీమియం పెట్రోల్ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.డీజిల్ ధర కూడా పెంపు హెపీసీఎల్ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర.. తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.రవాణా ఛార్జీలు పెరిగే అవకాశంబల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.వచ్చేవారం పెట్రోల్ మోత?పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే.. -
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక అప్డేట్ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.కొత్త ధరల వివరాలుప్రస్తుతం చలామణిలో ఉన్న వార్షిక పాస్ ధర రూ.3,000 ఉండగా దీన్ని రూ.3,075కు పెంచుతూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. అంటే నేరుగా రూ.75 భారం పడనుంది. నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ధారణ, వసూలు) నిబంధనలు, 2008 ప్రకారం ఈ వార్షిక ధరల సవరణ జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.వార్షిక పాస్ ప్రయోజనాలు.. నిబంధనలుఈ వార్షిక పాస్ ముఖ్యంగా తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్వేలు (ఉదాహరణకు యమునా ఎక్స్ప్రెస్వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే వంటివి) ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.పాస్ ఎలా పొందాలి?వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్కే ఈ వార్షిక పాస్ను లింక్ చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ వార్షిక పాస్ సేవలను వినియోగించుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’
తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్ సిక్స్తో సూపర్ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గులేని బీఆర్ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్.. బీఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్కే రోజా విమర్శించారు. -
IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లోని ఆయా జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి భారత్ చేరుకొని తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్ కోహ్లీ లెగ్స్టంప్ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్ తిన్న కోహ్లీ ‘వాట్ ఏ బాల్ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్ నవ్వుతోనే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్లో కోహ్లీ 15 ఇన్నింగ్స్ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్ 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్ యశ్ దయాల్ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్ సలామ్, మంగేశ్ యాదవ్లకు భువనేశ్వర్ మెంటార్గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు! -
క్లౌడ్ఫ్లేర్ సీఈఓ హెచ్చరిక!.. 2027 నాటికి..
ఆటోమేటెడ్ ఆన్లైన్ కార్యకలాపాలలో జనరేటివ్ ఏఐ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నందున, 2027 నాటికి ఏఐ-ఆధారిత బాట్ ట్రాఫిక్.. మానవ ఇంటర్నెట్ వినియోగాన్ని మించిపోయే అవకాశం ఉందని క్లౌడ్ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ హెచ్చరించారు. ఆస్టిన్లోని SXSW సదస్సులో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు.AI-ఆధారిత ఏజెంట్లు మనుషుల కంటే చాలా ఎక్కువ వెబ్సైట్లను సందర్శించగలవని మాథ్యూ వివరించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను తనిఖీ చేస్తారు. కానీ ఒక AI వ్యవస్థ సమాచారాన్ని సేకరించడానికి వేలాది పేజీలను స్కాన్ చేయగలదు. ఇది వెబ్ ట్రాఫిక్లో తీవ్రమైన పెరుగుదలకు దారితీస్తుంది. అంతే కాకుండా.. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.బాట్స్ అంటేబాట్స్ అనేవి స్వయంచాలకంగా పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల సహాయం లేకుండా వెబ్సైట్లు సందర్శించడం, డేటాను సేకరించడం వంటి పనులు చేస్తాయి. గతంలో కూడా బాట్స్ ఉండేవి, కానీ వాటిలో చాలా భాగం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లకు సంబంధించినవి. ఉదాహరణకు గూగుల్ ఉపయోగించే క్రాలర్లు వెబ్సైట్లను స్కాన్ చేసి సమాచారం సేకరించేవి. అలాగే కొన్ని బాట్స్ దుష్ట కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారు.కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేటివ్ AI రాకతో, బాట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను మాత్రమే చూస్తాడు. అయితే AI ఆధారిత బాట్ మాత్రం వేలాది వెబ్సైట్లను స్కాన్ చేసి, పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనూహ్యంగా పెరుగుతోంది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని డేటా సెంటర్లు, శక్తివంతమైన సర్వర్లు అవసరం అవుతున్నాయి. గతంలో COVID-19 సమయంలో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అప్పుడు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫార్మ్లను ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఆ పెరుగుదల తాత్కాలికం. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల మాత్రం నిరంతరంగా కొనసాగుతుందని మాథ్యూ చెప్పారు. -
మళ్లీ పెళ్లి చేసుకోలేదు, కానీ కలిసిపోయాం: స్టార్ డైరెక్టర్
మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, హీరోయిన్ లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ఓ పెళ్లిలో జంటగా కనిపించారు. దీంతో ప్రియదర్శన్-లిస్సీ కలిసిపోయారా? అన్న ప్రచారం మొదలైంది. అది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చెవిలో పడింది.సంతోషంలో మమ్ముట్టిమమ్ముట్టి.. ప్రియదర్శన్ డైరెక్షన్లో, అలాగే లిస్సీతో కలిసి సినిమాలు చేశాడు. అలా ఇద్దరూ తనకెంతో సన్నిహితులు. వారు కలిసిపోవడంతో మమ్ముట్టి చెన్నైలోని ప్రియదర్శన్ స్టూడియోకి ఇద్దర్ని రమ్మని పిలిచాడట! మీ ఇద్దరినీ ఇలా జంటగా చూడటం సంతోషంగా ఉందని వారితో చెప్పాడట! విడిపోయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ కలవడానికి వారి పిల్లలు కల్యాణి, సిద్దార్థ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. పెళ్లిఅయితే వారు కలిసిపోయారు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం చేయడం లేదు. మ్యారేజ్ అనేది కేవలం సర్టిఫికెట్ అని.. తమ మధ్య స్నేహం, అన్యోన్యత, ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారట! దీనిపై ప్రియదర్శన్ సైతం స్పందిస్తూ.. అవును, మేము కలిసే ఉంటున్నాం అని ధ్రువీకరించాడు.సినిమాకాగా ప్రియదర్శన్, లిస్సీ.. 1990 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్ సంతానం. కల్యాణి ప్రియదర్శన్ లోక సినిమాతో ఇటీవలే సెన్సేషన్ సృష్టించింది. ప్రియదర్శన్.. హిందీలో అక్షయ్కుమార్ హీరోగా భూత్ బంగ్లా సినిమా చేశాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: నడిరోడ్డుపై వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
చెన్నై: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు సభ్యులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. వీరితో పాటు మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.📍Salem, Tamil Nadu: A government bus traveling from Coimbatore to Salem lost control in the Ariyanur area and rammed into a bike and a tempo, resulting in a tragic accident that claimed 4 lives. Police are currently investigating the incident.pic.twitter.com/RwDAmRLc5F— Deadly Kalesh (@Deadlykalesh) March 20, 2026 -
బీజేపీ టికెట్ అడిగా: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నాకు అవకాశం కల్పిస్తే బెంగాల్లో తణమూల్ ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.కచ్చితంగా టికెట్ వస్తుందిబాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే తన భార్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని వెల్లడించారు. తమకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోందని చెప్పారు. 112 మందితో బెంగాల్లో బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శాసనసభలో పోటీచేసే 112 మంది అభ్యర్థులతో బీజేపీ తమ రెండో జాబితాను గురువారం విడుదలచేసింది. హింగాల్గంజ్లో రేఖా పాత్రాను, సోనార్పూర్ దక్షిణ్లో రూపా గంగూలీని బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇతాహర్లో సబితా బర్మన్, నబగ్రామ్లో దిలీప్ సాహా, ఖర్గ్రామ్లో మిథాలీ మాల్, కండీలో గర్గీదాస్ ఘోష్ను పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.భరత్పూర్ నుంచి అనామికా ఘోష్, బొంగావ్ దక్షిణ్ నుంచి స్వపన్ మజూందర్, కమర్హాతిమ్ నుంచి అరూప్ చౌదరీ, సందేశ్ఖాలీ నుంచి సనత్ సర్దార్, మందిర్బజార్ నుంచి మల్లికా పైక్, ఎంటలీ నుంచి ప్రియాంకా తిబేరేవాల్, బాలాగఢ్ నుంచి సుమనా సర్కార్ పోటీకి నిలబడుతున్నారు. చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026లలో చాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్కప్-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ వేచి ఉంది.షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.ప్రణాళికలు సిద్ధంచీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్ ఐపీఎల్లో వారానికి ఒక్క మ్యాచ్ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.తద్వారా వారానికి ఐదు మ్యాచ్లు కవర్ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.వారికి చోటు ఉందా?ఐపీఎల్లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది. గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
బడ్జెట్ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు. -
ముంచుకొస్తున్న నీటి గండం!
దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న వేళ భారత్ తీవ్రమైన జల సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో 40 శాతానికి పైగా రిజర్వాయర్లు వాటి పూర్తి సామర్థ్యంలో సగం కంటే తక్కువ నీటి నిల్వను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలోని అన్ని ఆనకట్టల సగటు నీటి మట్టం 51 శాతానికి పడిపోయింది.ప్రస్తుత పరిస్థితికేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం, ఈ 166 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 183.565 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా, ప్రస్తుతం కేవలం 94.063 బీసీఎం (51 శాతం) మాత్రమే నీరు నిల్వ ఉంది. వాటిలో..39 జలాశయాలు: 40 శాతం కంటే తక్కువ నిల్వ.33 జలాశయాలు: 50 శాతం కంటే తక్కువ నిల్వ.కేవలం 1 జలాశయం: ఝార్ఖండ్లోని జఖేత్ హిల్ రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం 100 శాతం నిండి ఉంది.18 జలాశయాలు: 80 శాతానికి పైగా నిల్వను కలిగి ఉన్నాయి.లోటు వర్షపాతంఈ జల సంక్షోభానికి ప్రధాన కారణం.. లోటు వర్షపాతమని నివేదికలు చెబుతున్నాయి. ఐఎండీ అందించిన 726 జిల్లాల డేటా ప్రకారం, మార్చి 1 నుంచి దేశంలోని 78 శాతం ప్రాంతాల్లో వర్షపాతం అసలు లేకపోవడం అధిక భారీ లోటు నమోదైంది. ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వర్షపాతంలో 70 శాతానికి పైగా లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఈ పరిణామాలకు దారితీసిన కారణాలురుతుపవనాల అనంతర కాలంలో, ఈ ఏడాది ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలోకి ఇన్-ఫ్లో నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడంతో బాష్పీభవనం పెరిగి నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. వేసవి పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు డిమాండ్ పెరగడంతో నిల్వలు వేగంగా ఖర్చవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపి వర్షపాతాన్ని తగ్గించాయి.ప్రాంతంజలాశయాల సంఖ్యప్రస్తుత నిల్వ శాతంస్థితిగతులుదక్షిణ భారతం4241%తెలంగాణ (35% దిగువకు), కర్ణాటక (40% కంటే తక్కువ) ఆందోళనకరంగా ఉన్నాయి.ఉత్తర భారతం1145.5%హిమాచల్ప్రదేశ్ 40% లోపు ఉండగా, పంజాబ్, రాజస్థాన్లలో 55% పైగా ఉంది.తూర్పు భారతం2750%అస్సాం (20%), పశ్చిమ బెంగాల్ (25%) కనిష్ట స్థాయిలో ఉన్నాయి.పశ్చిమ భారతం5362%గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.మధ్య భారతం2857%ఛత్తీస్గఢ్ (71%) మెరుగ్గా ఉండగా, ఉత్తరాఖండ్ (43%) తక్కువగా ఉంది. గడిచిన 10 ఏళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్త నీటి నిల్వలు సాంకేతికంగా కొంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ (గత ఏడాది కంటే 13.5 శాతం పాయింట్లు ఎక్కువ), లోటు వర్షపాతం రాబోయే రోజుల్లో సవాలుగా మారనుంది. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దాంతో రిజర్వాయర్ల మట్టం తగ్గే వేగం కొంత నిమ్మదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’!
తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్బీ ఉదయ్కుమార్ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్బీ ఉదయ్కుమార్ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్కుమార్కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు) -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
ఒక్క యాక్సిడెంట్.. 1.32 లక్షల కార్లు రీకాల్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పాపులర్ ఎస్యూవీ 'పాలిసేడ్' (2026 మోడల్) విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ (Stop-Sale) ఆదేశాలు జారీ చేసింది. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన సాంకేతిక లోపం వెలుగుచూడటంతో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.32 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.అసలేం జరిగింది?నివేదికల ప్రకారం.. పాలిసేడ్ కారులోని మూడవ వరుస (3rd Row) పవర్ సీటు మధ్యలో చిక్కుకుపోవడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కార్లలో 'యాంటీ-పించ్' (Anti-Pinch) ఫీచర్ ఉంటుంది. సీటు ఫోల్డ్ అవుతున్నప్పుడు లేదా జరుగుతున్నప్పుడు ఏదైనా అడ్డంకి (వ్యక్తులు లేదా వస్తువులు) తగిలితే ఈ సెన్సార్ వెంటనే గుర్తించి ఆగిపోవాలి. అయితే, ఈ మోడల్లో ఆ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ప్రభావితమైన వాహనాలుహ్యుందాయ్ స్వచ్ఛందంగా చేపట్టిన ఈ రీకాల్ పరిధిలోకి 2026 హ్యుందాయ్ పాలిసేడ్ 'లిమిటెడ్', 'కాలిగ్రఫీ' ట్రిమ్స్ వస్తాయి. ఉత్తర అమెరికా, కెనడాలలో 68,500 వాహనాలు, ప్రపంచవ్యాప్తంగా 1,32,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది.లోపం ఎక్కడ ఉంది?నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA)కు సమర్పించిన పత్రాల ప్రకారం.. రెండో, మూడో వరుస సీట్లను పవర్-ఫోల్డ్ చేసేటప్పుడు లేదా వన్-టచ్ టిల్ట్-అండ్-స్లైడ్ ఫీచర్ వాడుతున్నప్పుడు సెన్సార్లు ప్రయాణికులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు సీట్ల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ అంగీకరించింది.కంపెనీపై ఆర్థిక ప్రభావంఈ రీకాల్ ప్రక్రియ కోసం హ్యుందాయ్ సుమారు 100 బిలియన్ వాన్లు (66.8 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. 2026లో హ్యుందాయ్ అంచనా వేసిన వార్షిక లాభం 12.9 ట్రిలియన్ వాన్లు. రీకాల్ ఖర్చు కంపెనీ లాభంలో కేవలం 0.8% మాత్రమే. కాబట్టి, కంపెనీ ఆర్థిక స్థితిపై లేదా షేర్ ధరపై దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.కాగా తమ కారు వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబానికి హ్యుందాయ్ సంస్థ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతకే తాము పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. -
మహిళల కోసం ఎస్బీఐ సెక్యూరిటీస్ కొత్త ఫీచర్
భారతీయ మహిళలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ సంపద సృష్టిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్బీఐ సెక్యూరిటీస్ తన మొబైల్ అప్లికేషన్లో ‘ఉమెన్స్ మోడ్’ అనే సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మహిళా పెట్టుబడిదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్లాట్ఫారమ్ ఎకానమీ మార్కెట్లో వారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయనుంది.6,000 మంది మహిళల అభిప్రాయాలతో..ఏదో ఒక ఫీచర్ను మొక్కుబడిగా ప్రవేశపెట్టడం కాకుండా క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఎస్బీఐ సెక్యూరిటీస్ విస్తృతమైన కసరత్తు చేసిందని అధికారులు చెప్పారు. సుమారు 6,000 మందికి పైగా మహిళా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ ‘ఉమెన్స్ మోడ్’ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సంక్లిష్టంగా ఉండే పెట్టుబడి ప్రక్రియను సరళతరం చేయడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ఈ ఫీచర్ ప్రత్యేకతలుఈ ఫీచర్తో ఈక్విటీ మార్కెట్లో ఎడ్యుకేషన్, పదవీ విరమణ లేదా సొంత ఇల్లు వంటి వ్యక్తిగత ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్ జార్గన్ (క్లిష్ట పదజాలం) తగ్గించి సులభమైన రీతిలో సమాచారాన్ని అందిస్తుంది. ఇన్వెస్టర్ల అనుభవం, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగతీకరించిన పెట్టుబడి మార్గాలను సూచిస్తుంది.ఎస్బీఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఇప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళల ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారాలను రూపొందించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలపై ఉంది. మహిళలకు సాధికారత కల్పించి వారిలో నమ్మకాన్ని నింపే ఉమెన్స్ మోడ్ను ప్రారంభించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
జలుక్బరి నుంచి హిమంత బిశ్వ శర్మ పోటీ
న్యూఢిల్లీ: అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు కూడా ఉంది. జలుక్బరి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు.బుధవారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకుడు ప్రద్యుత్ బోర్డోలోయ్ను దిస్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన భూపేన్ కుమార్ బోరా, బిహ్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ తముల్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జోర్హాట్ స్థానంలో మాజీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, గౌరవ్ గోగోయ్తో తలపడనున్నారు. రాష్ట్ర మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లా బారుహ్, అశోక్ సింఘాల్, అజంతా నియోగ్, చంద్రమోహన్ పట్వారీ, రూపేష్ గోవాలా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. హఫ్లాంగ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందితా గర్లోసా ఈసారి అక్కడ నుంచి బరిలోకి దిగడం లేదు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సిద్ధార్థ భట్టాచార్యకు ఆయన ప్రస్తుత స్థానమైన గౌహతి తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమియా కుమార్ భూయాన్ (బిహ్పురియా), అతుల్ బోరా (దిస్పూర్)లకు మొండిచేయి చూపారు. ఈ రెండు స్థానాల నుంచి ఫిరాయింపుదారులు బోరా, బోర్డోలోయ్లకు టికెట్ ఇచ్చారు. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
అమెరికాకు పాకిస్థాన్ పెను సవాల్!
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాలు అమెరికాకు సవాలు విసురుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో అమెరికా ఆ దేశంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహా అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తన ఆత్మరక్షణ కోసం పెద్ద ఎత్తున క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం పలు అగ్రదేశాల నుంచి ఆర్థిక సహాయం పొందుతోందని సమాచారం. తయారీ పూర్తయిన తర్వాత ఆయా దేశాలకు క్షిపణులు, ఇతర అణ్వాయుధాలను అందజేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.యూఎస్ నిఘా సంస్థల ప్రకారం, పాకిస్థాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న షాహిన్-3 క్షిపణి 2750 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. అయితే ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కాదు. ఖండాంతర క్షిపణులు కనీసం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరగలగాలి. అణు నిరోధక శక్తిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి పాకిస్థాన్ దూరం సుమారు 12,000 కిలోమీటర్లు. అంతటి దూరాన్ని ఛేదించే క్షిపణులను పాకిస్థాన్ అభివృద్ధి చేస్తోందనే విషయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది.యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ - 2026 నివేదికలో అమెరికా, ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తున్నాయని పేర్కొంది. అందులో పాకిస్థాన్, రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమం అంతకంతకూ విస్తరిస్తోందని హైలైట్ చేసింది. -
బడ్జెట్.. విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్లో అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు కేటాయించింది.బడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించింది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీలకు నెలకు రూ. 2000 స్కాలర్ షిష్లు ఇవ్వాలని నిర్ణయించింది. -
పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు!
టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించడంతో.. భారత్లో జరిగే తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడమని బీసీబీ మొండికేసింది.భద్రతా కారణాలు సాకుగా..ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ వేదికను మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే, ఈ విషయంలో తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బాయ్కాట్ చేస్తామని నాటకాలాడిన పాక్.. తర్వాత భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది.బంగ్లాదేశ్ సహా ఇతర బోర్డుల నుంచి ఒత్తిడి, ఐసీసీ హెచ్చరికలతో పాక్ యూటర్న్ తీసుకుంది. భారత్తో కూడా మ్యాచ్ ఆడి.. అందులో ఓడి సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) షెడ్యూల్ను పాక్ బోర్డు ప్రకటించింది.ఎన్ఓసీ ఇచ్చినా..ఇక బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్ (లాహోర్ ఖలందర్స్), షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ (పెషావర్ జల్మీ) పీఎస్ఎల్ వేలంలో అమ్ముడుపోయారు. అయితే, వీరికి బంగ్లా బోర్డు పీఎస్ఎల్లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చినప్పటికీ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఇటీవల అఫ్గనిస్తాన్పై వైమానిక దాడులు చేయగా.. సుమారుగా 400 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీబీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ ప్లేయర్లను పాకిస్తాన్కు పంపాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.ప్రభుత్వం చెప్పినట్లే వింటాముఈ విషయం గురించి బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదిన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్కు ఆటగాళ్లను పంపే విషయంలో మేము ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు పూర్తిగా తెలియదు. అందుకే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాము’’ అని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యమని పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం పీఎస్ఎల్లో ఆడేందుకు వెళ్లే తమ ఆటగాళ్లను భద్రత విషయమై హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ విదేశీ ఆటగాళ్లు దూరమైతే పీఎస్ఎల్కు ఉన్న ఆ మాత్రం ఆదరణ కూడా కరువయ్యే అవకాశం ఉంది.చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు' -
తెలంగాణ బడ్జెట్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించినున్నట్టు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత ఆసుపత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్లరకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్లో ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇది తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు అత్యధిక కేటాయింపు కావడం విశేషం. అలాగే, ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయింపు చేశారు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా దక్కనుంది. ఇది కూడా చదవండి: తెలంగాణ బడ్జెట్ 2026-27.. హైలైట్స్ ఇవే.. -
విజయ్- సాయిపల్లవితో మణిరత్నం కొత్త మూవీ
సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.అదిరిన కాంబినేషన్లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు. రూమర్స్నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్ను తీసుకున్నారు.సినిమాకాగా విజయ్ సేతుపతి స్లమ్డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి! View this post on Instagram A post shared by Madras Talkies (@madrastalkies) -
సివిల్స్లో సత్తా చాటిన దినసరి కూలీ కొడుకు..! 'ధురంధర్ 2' మూవీ..
ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్ అవ్వాలనేది ఎందరో యువత డ్రీమ్. అత్యంత కఠినతరమైన ఎగ్జామ్లో గెలుపుని అందుకోవడమే తమ ధ్యేయంగా ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అంత కష్టమైన ఎగ్జామ్లో తొలిప్రయత్నంలోనే అవలీలగా విజయఢంకా మోగించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు ఈ యువకుడు. ఇతడి గెలుపు 'ధురందర్ 2'మూవీ నటుడిని సైతం ఆకట్టుకుంది. అతడు మాములు స్ఫూర్తి కాదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఖుషీ చేసే హీరో మాధవన్ ఈసారి కూడా అలానే మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో సత్తా చాటి సుబ్రమణ్య భారతి వీడియోని రీషేర్ చేస్తూ..ఆ యువకుడి అజేయమైన సక్సెస్ జర్నీని మెచ్చుకున్నారు. అందుకు సహకరించిన అతని తల్లిదండ్రులు, అతడికి లభించిన మద్దతు తదితరాలన్ని తనను ఎంతగానో కదిలించాయని, పైగా స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు. పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఎలా మార్పు తీసుకురాగలవో అనేందుకు ఆ యువకుడు సుబ్రమణ్య భారతినే ఉదాహరణ అంటూ పోస్ట్ని ముగించారు మాధవన్. హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోలో దినసరి కూలీ కుమారుడైన సుబ్రమణ్య భారతి ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వ 'నాన్ ముదల్వన్' పథకం సహాయంతో ఈ అధ్భుతమైన ఘనతను సాధించాడు. భారతి తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం విశేషం.తన సక్సెస్ జర్నీ అసాధారణమైనది అభివర్ణించాడు సుబ్రమణ్య భారతి. తాను క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సివిల్ సర్వీసెస్ను ఎంచుకున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడానికి, ఈ పథకం, కోచింగ్ వంటి మద్దతే కారణమని పేర్కొన్నారు. తాను కేవలం 18 ఏళ్ల వయసులో, ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా ఈ సివిల్స్ ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అందుకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని, ఎందుకంటే వాళ్లు దేశానికి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో సేవ చేసేలా వాళ్లు సదా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. కాగా, భారతి తండ్రి మరియప్పన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం పేద కుటుంబమని, ఇటుకల తయారీ యూనిట్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటానని చెప్పారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కుమారుడు ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్కు సన్నద్ధమయ్యాడని అన్నారు. అందులో విజయం సాధించడానికి తమిళనాడు ప్రభుత్వ నాన్ ముదల్వన్ పథకం ఎంతగానో సహాయపడిందని అన్నారు. నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం:తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి (Skill Development), ఉపాధి అవకాశాలను పెంచే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది 18-35 ఏళ్ల యువతకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ, భాషా నైపుణ్యాలు, ఇండస్ట్రీ-రెడీ కోర్సులలో శిక్షణ ఇస్తూ, ఉచిత కోచింగ్, స్కాలర్షిప్లను అందిస్తుంది. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)(చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఇరాన్ టార్గెట్ సక్సెస్
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు ఇరాన్ గట్టి షాకులే ఇస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా ఐదోతరం ఎఫ్-35 లైట్నింగ్2 యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇరాన్ ప్రకటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ దాడి నిజమేనని అంగీకరించారు. దీంతో, అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది.వివరాల మేరకు.. అమెరికాను టార్గెట్ను చేసిన ఇరాన్ గురువారం (మార్చి 19న) ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్పై ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)దాడులు చేసింది. తెల్లవారుజామున 2.50 గంటలకు సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా సదరు యుద్ధ విమానం కూలిపోయే అవకాశాలే చాలా ఎక్కువని, కానీ దాడి తర్వాత దానికి ఏం జరిగిందనే విషయం తమకు తెలియదని పేర్కొంది. ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఇక, ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్లను సైతం 125కుపైగా కూల్చామని చెప్పింది. ఈ వివరాలను ఐఆర్జీసీ తమ అధికారిక వెబ్సైట్ వేదికగా గురువారం విడుదల చేసింది.అమెరికా రియాక్షన్..ఇరాన్ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అంగీకరించారు. ఈ సందర్బంగా తమ ఎఫ్-35 యుద్ధ విమానం ఒకటి పశ్చిమాసియాలోని ఓ వైమానిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని వెల్లడించారు. అయితే యుద్ధ విమానంతో పాటు పైలట్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సైన్యం ఉపరితలం నుంచి గగనతలం దిశగా వరుస మిస్సైళ్లను సంధించాకే, ఎఫ్-35 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిర్ణయాత్మక శక్తి ఎఫ్-35 యుద్ధ విమానాలే అంటూ వైట్హౌస్ మార్చి 17న ఒక ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఒక ఎఫ్-35 ఫైటర్ జెట్పై ఇరాన్ దాడి చేయడం గమనార్హం. దీన్నిబట్టి ఇరాన్కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలలో కొత్త అప్గ్రేడ్లు జరిగి ఉండొచ్చని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు.ట్రంప్నకు వరుస షాక్లుపశ్చిమాసియా యుద్ధంలో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని కొన్ని ఇరాన్ వల్ల జరగుగా.. మరికొన్ని సాంకేతిక పొరపాట్లు కారణమయ్యాయి. కువైట్ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పొరపాటున జరిపిన ఫైరింగ్లో ఏకంగా మూడు ఎఫ్-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కానీ ఆ విమానాల్లోని ఆరుగురు అమెరికన్ సిబ్బంది సేఫ్గా బయటపడ్డారు. గత వారమే ఇరాక్లోని పశ్చిమ ప్రాంతంలో కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్ సిబ్బంది చనిపోయారు. అయితే, ట్యాంకర్ విమానం ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పటికీ గుర్తించలేకపోయారు. -
తండ్రైన ఆర్సీబీ కెప్టెన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటిదార్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య గుంజన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను పాటిదార్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.దీంతో పాటిదార్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా యాదృచ్చికంగా ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ కూడా గురువారమే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాకుండా డికే, పాటిదార్ బర్త్డేలు కూడా ఒకే రోజు కావడం విశేషం.ఇక మధ్యప్రదేశ్కు చెందిన పాటిదార్ను ఆర్సీబీ గతేడాది తమ జట్టు కెప్టెన్గా నియమించింది. అయితే కెప్టెన్గా తొలి సీజన్లోనే ట్రోఫీని అందించి.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న ఆర్సీబీని మరోసారి విజేతగా నిలపాలని పాటిదార్ ఉవ్విళ్లూరుతున్నాడు.బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ శిబరాన్ని నిర్వహిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి జట్టుతో చేరాడు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్కు ముందు ఆర్సీబీని గాయల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్లు జోష్ హాజిల్వుడ్, నువాన్ తుషారా అందుబాటుపై ఇంకా క్లారిటీ లేదు.చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు' -
కేరళ సీఎం విజయన్ ఆస్తులు కోటిపైనే..
కన్నూర్: కేరళలో శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థిరచరాస్తులకు సంబంధించిన అఫిడవిట్ను ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించారు. దీని ప్రకారం విజయన్ పేరిట పథిరియాద్ ఆమ్సమ్లో 78 సెంట్ల వ్యవసాయ భూమి, ఒక నివాస స్థలం సహా రూ.45 లక్షల విలువైన చరాస్తులున్నాయి.విజయన్ భార్య పేరిట 80 గ్రాముల బంగారం సహా రూ.60 లక్షలకుపైగా విలువైన చరాస్తులు ఉన్నాయి. ఈమె పేరిట రూ.36 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయి. ఈయన 2024–25లో రూ.5.33 లక్షల ఆదాయం సంపాదించారు. భార్య ఇదే కాలంలో రూ.5.77 లక్షల ఆదాయం సంపాదించారు. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.39 మందితో కేరళ బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆరన్ముళ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ను బరిలోకి దింపింది. ఈ సీనియర్ నాయకుడు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్తో తలపడనున్నారు. 2021లో నేమోం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం నేమో నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.ఇక గురువాయూర్ నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు బి. గోపాలకృష్ణన్ పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మడోం నుంచి బీజేపీ కె.రంజిత్ను కూడా బరిలోకి దింపింది. త్రిస్సూర్లోని ఎస్సీ–రిజర్వ్డ్ నట్టికా నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గీతా గోపికి సీటు నిరాకరించి, ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీని వీడిన సీసీ ముకుందన్ను బీజేపీ బరిలోకి దింపింది. 140 స్థానాలకు గాను పార్టీ తన తొలి జాబితాలో 47 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 86కు చేరింది.చదవండి: కేరళ కాంగ్రెస్ పార్టీలో కుంపటి? -
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్లోకి వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్లు (మార్చి 20)అమెజాన్ ప్రైమ్విష్ణు విన్యాసం - తెలుగు సినిమాడెడ్లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీమై లార్డ్ - తమిళ సినిమాద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీఅమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమాస్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీనెట్ఫ్లిక్స్బోర్డర్ 2 - హిందీ సినిమాపీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమాఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీహాట్స్టార్చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5కాసర్గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్ల్యాండ్ లార్డ్ - కన్నడఅగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమాసన్ నెక్స్ట్వలవార - కన్నడ చిత్రంసీతాపయనం - తెలుగు మూవీఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమాఆపిల్ టీవీ ప్లస్వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాఅమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమామనోరమ మ్యాక్స్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీసోనీ లివ్ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి) -
'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు'
ఐపీఎల్-2026 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామోరాన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గ్రీన్ను కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.25.5 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. దీంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఈ ఏడాది సీజన్లో గ్రీన్ ఎలా రాణిస్తాడో అని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్ను అంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు.కేవలం హైప్ వల్లే గ్రీన్ అంత భారీ ధరకు అమ్ముడయ్యాడని, అంతే తప్ప అతడేమి పెద్ద క్రికెటర్ కాదని ఈ సీఎస్కే మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. కాగా గ్రీన్ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. యాషెస్ సిరీస్తో పాటు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ నేపథ్యంలో బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "గ్రీన్ను వేలంలో రూ.25 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అతడేమో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా తరపున అతడు ఎలా ఆడాడో చూశాం.కేవలం అతడిపై ఉన్న హైప్ కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడయ్యాడు. వాస్తవానికి అతడు అంత విలువైన క్రికెటర్ కాదు. ఐపీఎల్లో అతడు ఒంటిచేత్తో గెలిపించిన మ్యాచ్ ఒక్కటైనా ఉందా? ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ప్రతీసారి అనవసరమైన హైప్ సృష్టిస్తారు. ఇప్పుడు గ్రీన్ విషయంలో కూడా అదే జరిగింది. కేకేఆర్ మాత్రం అతడిపై అంత భారీ మొత్తాన్ని వెచ్చించి తప్పు చేసింది అని పేర్కొన్నాడు. కాగా గ్రీన్ గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అయితే గాయం కారణంగా గత సీజన్కు గ్రీన్ దూరమయ్యాడు. తర్వాత తన పునరాగమనంలో గ్రీన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IPL 2026: 'సెహ్వాగ్ను చూసి నేర్చుకో'.. అభిషేక్కు కుంబ్లే వార్నింగ్ -
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. -
చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్.. సర్కార్ స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రి మండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దశలవారీగా టేకోవర్...మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది.దీంతో మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. -
దాపరికాలుంటే ఊరుకోం..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కలవరపెడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు వీలుగా స్థానికంగాఉన్న అన్ని చమురు, సహజ వాయువు కంపెనీలు తమ నిల్వలు, ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ డేటాను క్రమం తప్పకుండా అందించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఈ కొత్త నిబంధనల ద్వారా సమాచార సేకరణకు చట్టపరమైన బలాన్ని చేకూర్చామని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఓ సమావేశంలో వెల్లడించారు. ‘గతంలోనూ పీపీఏసీ సమాచారాన్ని సేకరించేది, కానీ తాజా నోటిఫికేషన్తో దీనికి పూర్తిస్థాయి చట్టపరమైన శక్తి లభించింది. ఇప్పుడు ప్రతి సంస్థ కచ్చితంగా సమాచారాన్ని వెల్లడించాల్సిందే. దీనివల్ల పర్యవేక్షణ మరింత పకడ్బందీగా అమలు అవుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.ఎవరు వివరాలు వెల్లడించాలి?ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ కింది కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలన్నీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.ముడి చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ సంస్థలు.సహజ వాయువు ప్రాసెసింగ్, రవాణా సంస్థలు.పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్, పంపిణీదారులు.దిగుమతిదారులు, టెర్మినల్ ఆపరేటర్లు.ఈ సంస్థలు తమ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం, కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రోజువారీ, వారం లేదా నెలవారీ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటమే ఈ తాజా ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.‘గోప్యత’ సాకు చెల్లదుచమురు సంస్థలు తాము కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు లేదా గోప్యతా నిబంధనలను సాకుగా చూపి సమాచారాన్ని దాచడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమాచారం ‘వాణిజ్యపరంగా సున్నితమైనది’ అనే కారణంతో ఏ సంస్థ కూడా నిరాకరించడానికి వీలులేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఇతర నిబంధనలకు అదనంగా ఈ కొత్త ఆదేశాలు అమలులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్పై చిరంజీవి, చరణ్ ట్వీట్
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్మీడియాలో స్పందించారు. ఉగాది నాడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై ఈ గౌరవాన్ని చిరు పొందారు. ఈ క్రమంలో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు లభించడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన పంచుకున్నారు.'చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే…N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…ఆయన పోషించిన కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.'మెగా హీరో రామ్చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డ్తో తన తండ్రిని గౌరవించడం తమ కుటుంబానికి అత్యంత గర్వకారణమైన క్షణమని అన్నారు. సినిమాపై ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రేమ, నిబద్ధత చాలామందికి స్ఫూర్తిదాయకమని చరణ్ అన్నారు. ఇండస్ట్రీలోని ప్రతిభను గుర్తించి అవార్డులతో గౌరవించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!
డాక్టర్ కె. (డాక్టర్ అలోక్ కనోజియా) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన మానసిక వైద్య నిపుణులు. నేటి డిజిటల్ తరానికి మానసికంగా అండగా నిలవడానికి ‘హెల్దీ గేమర్’ సంస్థను స్థాపించారు. సాధనేచ్ఛ వెనుక ఉన్న సైకాలజీని, మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మన మెదడు స్పందించే తీరును విశ్లేషించారు.విరిగిన ఇంజిన్తో విజయం!‘‘ఇలాంటివి నేను తరచు చూస్తుంటాను. చాలామందికి విజయం అనేది ఒక ‘కోపింగ్ మెకానిజం’ (ఒక బాధ నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం). నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు లేదా ‘నేను దేనికీ పనికిరాను’ అని నీకు అనిపించినప్పుడు, అది నిజం కాదని ప్రపంచానికి; లేదా నీకు నువ్వు నిరూపించుకోవటం కోసం వారానికి 100 గంటలు కష్టపడతావు. అంటే నీ మనసు లోని ఒక ‘విరిగిన’ (లోపమున్న) భాగాన్నే నువ్వు ఇంధనంగా వాడుకుంటావు. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే... నువ్వు అనుకున్న శిఖరాన్ని చేరుకున్న తర్వాత కూడా, నిన్ను అక్కడి వరకు నడిపించిన ఆ ఇంజిన్ను ఆపేయాలని నీకు తెలియదు. నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా, నువ్వు ఇంకా పరుగెడుతూనే ఉంటావు!పాజిటివ్గా ఉండటం కష్టం‘‘మనం ఎప్పుడూ ‘పాజిటివ్’గా ఉండాలి అనే మాట వింటుంటాం. నిజానికి ఎల్లవేళలా పాజిటివ్గా ఉండ లేం. మనలో పంతం పని చేస్తూ ఉంటుంది. వాస్తవానికి పంతం కూడా ఒక అద్భుతమైన ఇంధనమే. ‘నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు’ అని ఎవరైనా అన్నప్పుడు, నీకు వచ్చే కోపం వల్ల కలిగే పట్టుదల కేవలం పాజిటివ్గా ఉండటం వల్ల రాదు. అయినా, నీలోని ‘నెగెటివ్ కోణాన్ని’ పూర్తి పాజిటివిటీతో తొలగించాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా ఆ కోణాన్ని అర్థం చేసుకోవాలి. పంతంతో గెలవడంలో తప్పు లేదు కానీ, సమస్య ఎక్కడ వస్తుందంటే... ఆ గెలుపు అనే పందెం ముగిసిన తర్వాత కూడా, నువ్వు వేరే దానివైపు దృష్టి మరల్చకపోతే నీలోని అదే పంతం నీ ప్రత్యర్థులను కాకుండా నిన్నే దహించడం మొదలుపెడుతుంది.‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!‘‘మీరు ఒక భారీ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు బాధితుల మనో భావాలను పట్టించుకోకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు కొంచెం స్వార్థంగా లేదా కుటిలంగా (మాకియవెలి యన్) ఉండాల్సి రావచ్చు. తక్కువ కాలంలో విజయం సాధించడానికి ప్రపంచం ఇలాంటి ‘చీకటి లక్షణాలకే’ ప్రాధాన్యం ఇస్తుంది. మీరు మీలోని దయను లేదా సానుభూతిని పక్కన పెట్టగలిగితే, మీరు చాలా వేగంగా ఎదగగలరు. కానీ దీనికి ఒక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీరు చివరకు విజేతగా నిలుస్తారు కానీ పూర్తిగా ఒంటరి అయిపోతారు. ఒక కఠినమైన వ్యాపార వేత్తగా మారడానికి మీరు ఏ ‘స్విచ్’ని అయితే ఆఫ్ చేశారో, అదే స్విచ్ మీ కుటుంబంతో ప్రేమను లేదా అనుబంధాన్ని పొందకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది.డిజిటల్ పోషకాహార లోపం ‘‘సోషల్ మీడియా వ్యసనాన్ని నేను ‘డిజిటల్ పోషకాహార లోపం’ అంటాను. ఇది ఎలా ఉంటుందంటే... చాక్లెట్ రుచి ఉన్న ‘చెక్కపొట్టు’ను తినడం లాంటిది. అది తింటున్నప్పుడు మీ నాలుకకు రుచిగా ఉండి, సంతోషంగా అనిపించవచ్చు. కానీ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందక శరీరం కృశించి పోతుంటుంది. మీరు రోజుకు ఎనిమిది గంటలు ఆన్లైన్లో ఇతరులతో గడిపినా కూడా, మీ మనసు లోతుల్లో ఎక్కడో తెలియని ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే, మీ పక్కన నిజంగా ఎవరూ లేరనే విషయం మీ నాడీ వ్యవస్థకు తెలుసు. మనం ఎక్కువ మందిని చేరు కోవడానికి ప్రాధాన్యత ఇచ్చాం కానీ, బంధాలలోని లోతును కోల్పోయాం.- ఎడిటోరియల్ టీమ్ -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. మారుతున్న ఏటీఎం రూల్స్
మీకు బ్యాంకు ఖాతా ఉండి ఏటీఎంల ద్వారా తరచుగా నగదు విత్ డ్రా చేస్తుంటే ఈ వార్త మీకోసమే. వచ్చే ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేయనున్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.యూపీఐ (UPI) ఆధారిత నగదు ఉపసంహరణలు, రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్స్, ఉచిత లావాదేవీల సంఖ్యపై ఈ ప్రభావం ఉండనుంది. ఆ మార్పులేంటో ఒకసారి చూద్దాం..పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్పులుపంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గనుంది.అయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత ఛార్జీలుప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.బంధన్ బ్యాంక్ మారిన నిబంధనలుబంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది.సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నారు. పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను పలువురు అభినందించారు. -
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్కు చెందిన సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.వివాదం నేపథ్యం ఏమిటి?సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.తదుపరి కార్యాచరణఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అమీర్పేట్-రాయదుర్గం మార్గంలో అంతరాయం ఏర్పడింది. జూబ్లీచెక్ పోస్టు దగ్గర మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో రెండు వైపులా కూడా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ అంతరాయం కలగడంతో ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరించే పనిలో ఉందని.. కొద్దిసేపట్లో సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో అధికారులు తెలిపారు. -
కేరళ కాంగ్రెస్లో ‘కుంపటి’?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు. -
మా మాష్టారే పేషెంట్గా..!
మనల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గురువులు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి గౌరవప్రదమైన వ్యక్తులకు సేవ చేసే అవకాశం దొరకడం కూడా అత్యంత అరుదు. అలాంటి మహద్భాగ్యం ఈ డాక్డర్కి దొరికింది. అంతేగాదు ఆ క్షణాన్ని అత్యంత ప్రత్యేకం, అలాగే గర్వంగానూ ఉంది అంటూ సంబరపడిపోతాందా ఆ వైద్యురాలు.ఆ అదృష్టవంతురాలే డాక్టర్ ప్రతిభ నిఖార్ జునేజా. అందుకు సంబంధించిన వీడియోకు క్యాప్షన్గా డాక్టర్ జునేజా ఇలా రాశారు..ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం, భావోద్వేగభరితమైన రోజు అంటూ..తన కెదురైన మధురానుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన మాజీ గురువు డాక్టర్ బిడి గుప్తా తన క్లినిక్ని సందర్శించిన క్షణం గురించి పేర్కొంది. జామ్నగర్లోని ఎంపీ షా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ గుప్తా, డాక్టర్ జునేజాకు ఆమె మెడికల్ కాలేజీ రోజుల్లో బోధించారు. ఒకప్పుడూ తాను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకుందో ఆ వ్యక్తి ఈ రోజు తనని నమ్మి ఆయన ఆరోగ్యాన్ని తన చేతుల్లో పెట్టారని రాసుకొచ్చింది. డాక్టర్ అవ్వడం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది ఒక "బాధ్యత" అని ఇలాంటి క్షణాలు గుర్తు చేస్తాయని అంటోంది. మన ఉపాధ్యాయులు మనపై ఉంచే నమ్మకమే అన్నింటికన్న గొప్ప బహుమతి. అని భావోద్వేగంగా మాట్లాడింది. ఇన్నేళ్ల తర్వాత చికిత్స నిమిత్తం రావడం, ఆయన్ని కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం వంటివి అన్ని.. నిజంగా ఈ రోజుని మర్చిపోలేను అని అన్నారామె. అంతేగాదు తన ఉపాధ్యాయుడు తనపై ఉంచిన నమ్మకం పట్ల గర్వం, వినమ్రతను కలిగి ఉన్నానని అన్నారామె. నెటిజన్లు సైతం మన గురువులు డాక్టర్గా నమ్మే రోజుకి మించిన అనుభూతి మరోకటి లేదు అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!) -
ఢిల్లీ క్యాపిటల్స్కు ఊహించని షాక్
ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్ ఫస్ట్ హాఫ్కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడు సెకెండ్ హాఫ్లో ఢిల్లీ జట్టుతో చేరనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా రాబోయే 12 నెలల్లో దాదాపు 21 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ జరగనుంది.దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన పేసర్లను లీగ్ క్రికెట్లో ఎక్కువగా ఆడించి రిస్క్ తీసుకూడదని భావిస్తుందంట. ఈ కారణంతో అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది సీజన్కు ముందు స్టార్క్ను రూ.11.75 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.కానీ అతడు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే ఢిల్లీ జట్టులో లుంగి ఎంగిడీ, కైల్ జేమీసన్, దుష్మంత చమీర వంటి స్టార్ పేసర్లు ఉండడం కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా స్టార్క్ ఏప్రిల్ మూడో వారం నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ జట్టును నడిపించనున్నాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జోష్ హాజిల్వుడ్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: IPL 2026: 'సెహ్వాగ్ను చూసి నేర్చుకో'.. అభిషేక్కు కుంబ్లే వార్నింగ్ -
హర్మూజ్ను తెరిచేందుకు అమెరికా సంచలన నిర్ణయం!
వాషింగ్టన్: అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు తెచ్చుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ హర్మూజ్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా, ఇరాన్కు చెందిన ఆస్తులను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ప్రకటించారు.అమెరికా ఇప్పటికే ఏ-10 వార్హాగ్ దాడి విమానాలు, ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు, యూఎస్ఎస్ బాక్సర్ ఎఫ్-35 జెట్లను రంగంలోకి దించింది. వీటితో పాటు నాలుగు వేల మంది సైనికులను హర్మూజ్ జలసంధిలో మోహరించింది.ఇరాన్ ఏర్పాటు చేసిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, సీమైన్స్, పడవలు, మందుపాతరలను ధ్వంసం చేయడానికి అమెరికా చర్యలు ప్రారంభించింది. తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తోంది. సీమైన్స్ తొలగించడానికి వారం రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.జనరల్ కెయిన్ ప్రకారం, హర్మూజ్ జలసంధి అణువణువును అమెరికా జల్లెడ పట్టనుంది. ఇరాన్కు చెందిన 120కి పైగా నౌకలు, 44 మందుపాతర నౌకలు, ఇతర ఆయుధ కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్ను చూస్తున్నారు.పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్ను భారత్కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్లో ట్రెండింగ్లో నిలిచింది. -
యాక్టింగ్ రాదని ట్రోలింగ్.. : రష్మిక మందన్నా ఎమోషనల్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డ్స్ వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేశారు. 2025లో విడుదలైన సినిమాలకుగానూ అవార్డులు అందించారు. ది గర్ల్ఫ్రెండ్ సినిమాకుగానూ రష్మిక మందన్నా ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, హీరో రామ్చరణ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. రష్మిక మాట్లాడుతూ.. ఒకప్పుడు నాకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు. కానీ, ఈ రోజు నా పర్ఫామెన్స్ మెచ్చి రాష్ట్రస్థాయిలో అవార్డు ఇచ్చారు. అది నాకెంతో గర్వంగా ఉంది.తెలంగాణ కోడలిగా..గర్ల్ఫ్రెండ్ లాంటి సినిమాకు అవార్డు రావడం నిజంగా చాలా స్పెషల్. డైరెక్టర్ రాహుల్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు నేను తెలంగాణ కోడలిగా మీ ముందు నిల్చున్నాను. మీ ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞరాలిని. నా ఫ్యామిలీని బాగా చూసుకోండి అని చెప్పుకొఒచ్చింది. రష్మిక ప్రసంగం వింటూ విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనైంది.చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. ఒప్పుకోలేదు: నటుడు
