సాక్షి, అమరావతి: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఇవాళ(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొత్తం 54.08 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 98.99 లక్షల డోస్లు సిద్ధం చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు.
ఈనెల 21 నుంచి 23 వరకు ట్రాన్సిట్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయని చెప్పారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 38,267 బూత్లలో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. పలు కారణాలతో వేయించుకోలేని చిన్నారులను 22, 23 తేదీల్లో ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తారన్నారు.


