యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి - ఆలేరు రైలుమార్గంలో విషాదానికి సంబంధించి కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తూ రైల్లోంచి జారిపడి నవదంపతులు మృతి చెందారని తొలుత అందరూ భావించారు. అయితే దీనికి సంబంధించి ఒకవీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
ఈ వీడియో ప్రకారం రైలు నుంచి పడి నవ దంపతులు మరణించదలేని, ఈ ఘటనకు ముందు ఈ జంట రైల్లో ఘర్షణపడ్డట్టు తెలుస్తోంది. దీంతో భర్తతో గొడవ పడి క్షణికావేశంలో ముందుగా రన్నింగ్ ట్రైన్ నుండి దూకేంది భార్య. దీంతో హతాశుడైన భర్త కూడా డా ట్రైన్ నుండి దుకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


