రవితేజ మార్క్‌ ఫన్‌ మిస్‌ కాకుండా... | Director Kishore Tirumala about Bhartha Mahasayulaku Wignyapthi | Sakshi
Sakshi News home page

రవితేజ మార్క్‌ ఫన్‌ మిస్‌ కాకుండా...

Dec 21 2025 3:00 AM | Updated on Dec 21 2025 3:00 AM

Director Kishore Tirumala about Bhartha Mahasayulaku Wignyapthi

సుధాకర్, డింపుల్‌ హయతి, ఆషిక, కిశోర్‌ తిరుమల

‘‘రవితేజగారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ చేయాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ రాశాను. చక్కని వినోదంతోపాటు అద్భుతమైన సంగీతంతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమల తెలిపారు. రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ– ‘‘రవితేజగారి మార్క్‌ ఫన్‌ మిస్‌ అవ్వకుండా నా శైలిలో ఈ సినిమాని చాలా వినోదాత్మకంగా చేశాను. ఈ చిత్రంలో ఆయన పోషించిన రామ సత్యనారాయణపాత్ర ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నారు. సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో ఉంటుంది.

ఈ సంక్రాంతికి మాతోపాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా బాగా ఆడాలి... కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి... అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఈ చిత్రంలో నాపాత్ర పేరు బాలామణి. ఇది నా ఫస్ట్‌ సంక్రాంతి సినిమా కాబట్టి చాలా ప్రత్యేకం’’ అన్నారు డింపుల్‌ హయతి. ‘‘ఈ మూవీలో మోడ్రన్, కాన్ఫిడెంట్, బోల్డ్‌గా ఉండే మానసా శెట్టిపాత్రలో కనిపిస్తాను’’ అని ఆషికా రంగనాథ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement