breaking news
Bhartha Mahasayulaku Wignyapthi Movie
-
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)
-
సీనియర్ హీరోలతో జోడీ.. అది మ్యాటరే కాదంటున్న బ్యూటీ
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్లో భాగంగా చిట్చాట్ నిర్వహించింది.సీనియర్ హీరోలతో జోడీ..ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను. ఏజ్ గ్యాప్పై ఓపెనైన బ్యూటీభర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య -
రవితేజ మార్క్ ఫన్ మిస్ కాకుండా...
‘‘రవితేజగారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ రాశాను. చక్కని వినోదంతోపాటు అద్భుతమైన సంగీతంతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ కిశోర్ తిరుమల తెలిపారు. రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘రవితేజగారి మార్క్ ఫన్ మిస్ అవ్వకుండా నా శైలిలో ఈ సినిమాని చాలా వినోదాత్మకంగా చేశాను. ఈ చిత్రంలో ఆయన పోషించిన రామ సత్యనారాయణపాత్ర ఫ్రెష్గా ఉంటుంది’’ అన్నారు. సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది.ఈ సంక్రాంతికి మాతోపాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా బాగా ఆడాలి... కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి... అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఈ చిత్రంలో నాపాత్ర పేరు బాలామణి. ఇది నా ఫస్ట్ సంక్రాంతి సినిమా కాబట్టి చాలా ప్రత్యేకం’’ అన్నారు డింపుల్ హయతి. ‘‘ఈ మూవీలో మోడ్రన్, కాన్ఫిడెంట్, బోల్డ్గా ఉండే మానసా శెట్టిపాత్రలో కనిపిస్తాను’’ అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు. -
'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు
హీరో రవితేజ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే అనేలా పరిస్థితి తయారైంది. గత మూడు నాలుగేళ్లలో 'క్రాక్', 'ధమాకా' లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాప్ అవడంతో పాటు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ చేతిలో ఉంది. దీనికోసం రవితేజ భారీ త్యాగాలే చేశాడు. తాజాగా ఆ విషయాల్ని దర్శకనిర్మాత బయటపెట్టారు.దర్శకుడు కిశోర్ తిరుమల తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్.. ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపించేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాలో నటించడంతో పాటు కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి త్యాగాలని రవితేజ చేశాడు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ గానీ రెమ్యునరేషన్ గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో బయటపెట్టారు. ఇదే చిత్రం కోసం రవితేజ.. తన 'మాస్ మహారాజా' ట్యాగ్ కూడా పక్కనబెట్టేశారని దర్శకుడు చెప్పాడు.ఇదంతా చూస్తుంటే రవితేజకు కూడా తన పరిస్థితి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుకే ఇలా త్యాగాలు చేస్తున్నాడా అని సందేహం వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రేక్షకుడు, కంటెంట్ చూసే థియేటర్కి వెళ్తున్నాడు. చిన్న సినిమానా పెద్ద సినిమానా.. చిన్న హీరోనా పెద్ద హీరోనా అని అస్సలు ఆలోచించట్లేదు. వరస ఫ్లాప్స్ వల్ల రవితేజ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బతింది. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయమని నిర్మాతని కోరాడు. అందుకు తగ్గట్లే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈసారి హిట్ పడితేనే రవితేజకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. -
ఈ సంక్రాంతికి రవితేజ మార్క్ మూవీ
-
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ కామెడీగా టీజర్
మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ రిలీజ్కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
అబద్ధం చెప్పలేనే...
‘‘హోయ్.. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి... నిజం దాచలేనే...’ అంటూ సాగే ఈపాట ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనిది. రవితేజ హీరోగా, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘అద్దం ముందు..’పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.ఈపాట పూర్తి లిరికల్ వీడియో ఈ నెల 10న విడుదల కానుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. జీ స్టూడియోస్ సమర్పణలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా పాట రిలీజ్ (ఫొటోలు)
-
రవితేజ-ఆషిక కొత్త పాట రిలీజ్.. క్యూట్ డ్యాన్స్
రవితేజ కొత్త సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉన్న దృష్ట్యా ప్రమోషన్లు మొదలుపెట్టారు. 'బెల్లా బెల్లా' అంటూ సాగే తొలి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. రవితేజ ఎప్పటిలానే డ్యాన్స్తో ఆకట్టుకోగా, ఇతడి పక్కన ఆషికా రంగనాథ్ క్యూట్గా కనిపించింది. స్పెయిన్లో ఈ పాట చిత్రీకరించారు.(ఇదీ చదవండి: అయ్యర్తో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన మృణాల్)ఈ సినిమాలో రవితేజ సరసన ఆషిక, డింపుల్ హయతి నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. భీమ్స్ సంగీతమందించాడు. ఇదివరకే గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. రవితేజ ఈసారి హిట్ కొడతాడేమోనని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్ని చిత్రాలతో దారుణమైన ఫలితాలని అందుకున్న ఈ హీరో మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది. కాబట్టి ఈసారి సక్సెస్ చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?) -
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్కు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్
గత కొన్నేళ్లుగా హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది లేకుండా పోయింది. వారం పదిరోజుల క్రితం 'మాస్ జాతర' అంటూ వచ్చాడు. యధావిధిగా ఇది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో కొత్త మూవీని సిద్ధం చేశాడు. దీనికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల.. రవితేజ కొత్త చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్ చూస్తుంటే కామెడీగా బాగానే ఉంది. రామసత్యనారాయణ (రవితేజ)ని అతడి జీవితంలోని ఇద్దరు ఆడోళ్లు రెండు ప్రశ్నలు అడుగుతారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి? వాటికి ఎవరూ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారనేదే స్టోరీలా అనిపిస్తుంది.'నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో' అని రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. భీమ్స్ సంగీతమందించాడు. వచ్చే సంక్రాంతికి మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)


