breaking news
Bhartha Mahasayulaku Wignyapthi Movie
-
'బెల్లా బెల్లా.. రసగుల్లా' వీడియో సాంగ్ వచ్చేసింది
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి! మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్వకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. వీడియో సాంగ్ రిలీజ్ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ జనవరి 13న విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'బెల్లా బెల్లా.. ఈసబెల్లా.. బాగున్నావే రసగుల్లా' వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, ఆషికా హుషారుగా స్టెప్పులేశారు. సురేశ్ గంగుల లిరిక్స్ సమకూర్చిన ఈ పాటను నకాశ్ అజీజ్, రోహిని ఆలపించారు. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ -
'వామ్మో.. వాయ్యో..' ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి
రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
'భర్త మహాశయులకు..' ఫేమ్ ఆషికా రంగనాథ్ సుకుమారంగా (ఫొటోలు)
-
అలాంటి సినిమా తీయాలనేది నా కల: సుధాకర్ చెరుకూరి
‘‘రెగ్యులర్ రవితేజగారి సినిమాల్లా కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని ప్రారంభించాం. ఈ సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి సంక్రాంతి సీజన్లో డిమాండ్ ఉంటుందని ఈ సంక్రాంతితో మరోసారి రుజువైంది. సెకండ్ వీక్ నుంచి మా మూవీ రన్ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది.ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది’’ అని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అయింది.ఈ సందర్భంగా సోమవారం సుధాకర్ చెరుకూరి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రావాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని మొదలుపెట్టాం. కేవలం 65 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్లో చిత్రీకరణ పూర్తి చేశాం. మా సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కూడా చాలా సంతోషంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతికి విడుదలైన ‘ది రాజా సాబ్, మనశంకర వరప్రసాద్గారు, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి’ సినిమాలన్నీ విజయం సాధించడం గొప్ప విషయం ఇది. ఈ సినిమా ప్రమోషన్స్కి రవితేజగారు, కిషోర్, డింపుల్ హయతి, ఆషిక... ఇలా అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకునే సినిమా ఒకటి తీయాలనేది నా కల.ఆ కల ‘ది ఫ్యారడైజ్’ చిత్రంతో తీరిపోతుందనే నమ్మకం ఉంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కలిసి చేస్తున్న సినిమా అద్భుతంగా వస్తోంది. నానిగారి ‘ది ఫ్యారడైజ్’ మూవీ తర్వాత చిరంజీవిగారి సినిమా మొదలుపెడతాం. అలాగే కిషోర్ తిరుమలగారి దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నాం. నాకు ‘అరుంధతి’ లాంటి సినిమా చేయాలని ఉంది. అలాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిర్మించిన ‘కేజేక్యూ’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అని చెప్పారు. -
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. ఆరనీకుమా ఈ దీపం సాంగ్ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్ప్రైజ్ అయ్యారు. స్క్రీన్పై రవితేజ మాస్ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్ సాంగ్ను తాజాగా రిలీజ్ చేశారు. పబ్లో హీరోయిన్ ఆషికా రంగనాథ్తో మాస్ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..సినిమాసినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)
-
వెటకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ సునీల్: రవితేజ
సునీల్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య కామెడీ వదిలే వేరే జోనర్లో వెళ్లాడు. మళ్లీ భర్త మహాశయులు సినిమాతో కామెడీ వైపు వచ్చాడు. సినిమా చూసినవాళ్లు అంతా సునీల్ కామెడీ గురించి మాట్లాడుతున్నారు. దుబాయ్ శ్రీను తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. అప్పుడప్పుడైనా సునీల్ కామెడీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ నెల 13న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ లభించింది. శనివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో సినిమా సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్తో తనకున్న అనుబంధాన్ని రవితేజ పంచుకున్నాడు. ‘సునీల్, నేను మంచి స్నేహితులం. ఓ రకంగా చెప్పాలంటే.. వెతకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ నాకు. మా అమ్మ, వాళ్ల అమ్మ మంచి స్నేహితులు. వాళ్ల నుంచే మాకు వెతకారం వచ్చింది(నవ్వుతూ..) ’ అన్నారు. ఇక సునీల్ కూడా రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్ లేకున్నా సరే నేను కలిసే ఏకైక హీరో రవితేజ. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎనర్జీ నెక్ట్ లెవల్’ అన్నారు. -
ఒక్క క్లిక్తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : భర్త మహాశయులకు విజ్ఞప్తినటీనటులు: రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఎల్వి సినిమాస్నిర్మాత: చెరుకూరి సుధాకర్దర్శకత్వం: కిషోర్ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: జనవరి 13, 2023ఈ ముగ్గుల పండక్కి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్ మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయినా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్ని స్పెయిన్లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్కు తగ్గట్లు ప్రెష్గా ఉన్నాయి. మీమ్స్ కంటెంట్ని బాగా వాడుకున్నాడు. సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు కొన్ని సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఏ జోనర్ సినిమాకైనా ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్ అయింది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్ మోడల్ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు. ఫస్టాఫ్లో సత్య, కిశోర్ల కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్ ఎపిసోడ్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది. హైదరాబాద్ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. మొత్తంగా పస్టాఫ్లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి.. బోర్ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్లో మాత్రం ఆ కామెడీ డోస్ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్లో కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ సీన్ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్, డింపుల్ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, సత్య, సునీల్ల కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయింది. మరళీధర్ గౌడ్ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. పిన్నీ సీరియల్ సాంగ్తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
కాణిపాకం వినాయకుడి సేవలో రవితేజ మూవీ టీమ్
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీమ్ కాణిపాకం వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సినిమా రిలీజ్కు ముందు రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారిలో హీరోయిన్స్ ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి, డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రవితేజ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రవితేజ ఫ్యాన్స్ను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళే భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీమియర్స్ కూడా ప్రదర్శించనున్నారు. Blessed to seek the divine blessings of Lord Kanipakam Vinayaka alongside the talented @AshikaRanganath and our amazing #BMW movie team! Starting this new journey with positivity, laughter, and Ganapati Bappa's grace ahead of our Sankranthi release on 13th Jan! Here's a… pic.twitter.com/L45cM9g1NQ— Dimple parody (@hayathidimple) January 12, 2026 -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి
-
'ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్లా ఉంటాడు'..మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఫ్యాన్స్ను పలకరించనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రవితేజ మాట్లాడారు.రవితేజ మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఆషికా, డింపుల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుంది. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్తో కలిసి 13 సినిమాలు చేశా. శేఖర్ కంపోజ్ చేసిన మూడు సాంగ్స్ బాగుంటాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక మా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడని అన్నారు. స్టీవ్ వా అనుకుంటా. హిట్తో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. నా నెక్ట్స్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నా. ఇక ఈ మూవీకి భీమ్స్ అదరగొట్టేశాడు. కిశోర్ తిరుమలతో హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.'JAN 13TH - BHARTHA MAHASAYULAKU WIGNYAPTHI - thammullu kaluddham 💥💥💥 '@RaviTeja_offl super confident speech at the #BharthaMahasayulakuWignyapthi grand pre-release event ❤🔥#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/EHB6UXkmQ9— SLV Cinemas (@SLVCinemasOffl) January 10, 2026 -
ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు: రవితేజ
‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో తీశారు కిషోర్. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ నెల 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేటర్స్లో కలుద్దాం. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు’’అని హీరో రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు.కానీ, సినిమాని చాలా ఫ్యాషన్తో చేశారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్.. వీరి డైరెక్షన్లో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్ట్స్ శివ నిర్వాణతో చేస్తున్నాను. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. డింపుల్, ఆషిక, సునీల్, సత్య, కిషోర్, మురళీధర్, గెటప్ శీను అద్భుతంగా చేశారు. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’అని తెలిపారు.కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘జనవరి 13న మా బీఎమ్డబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్కి వెళ్లండి.. అదిరి΄ోతుంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలిపారు. ‘‘నాకు డైరెక్టర్గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజగారే. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. ‘‘త్వరలోనే రవితేజగారితో సినిమా చేస్తాను’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు’’ అన్నారు డైరెక్టర్ పవన్. -
ఏపీలో 'రవితేజ, నవీన్' సినిమాలకు టికెట్ ధరలు పెంపు
సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రాలకు ప్రీమియర్ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా సింగిల్ స్క్రీన్స్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. -
అది సవాల్గా అనిపించింది : ఆషికా రంగనాథ్
‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. నా పీఏ క్యారెక్టర్లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్ని మ్యాచ్ చేయడం సవాల్ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని పేర్కొన్నారు. -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన.. ఆషికా, డింపుల్ (ఫొటోలు)
-
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలతో కాస్త హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రం జనవరి 13న అంటే వచ్చే మంగళవారం థియేటర్లలోకి రానుంది.రవితేజ కెరీర్ చూసుకుంటే గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. ధమాకా, క్రాక్.. కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ.. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడిపోయాడు. మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కాస్త కుదురుకోవాలంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో పక్కా హిట్ కొట్టాల్సిందే. మరి ఈసారి రవితేజ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ని నేడు గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్బస్టర్గా నిలిచాయి. శర్వానంద్కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ప్రమోషన్స్లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ను పంచుకునా్నరు మేకర్స్.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రేపు(బుధవారం) గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది.ముఖ్యంగా రవితేజ ఇద్దరు భామల (ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి) మధ్య నలిగిపోయే లవ్ ట్రయాంగిల్ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. భీమ్స్ సంగీతం మా సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో...’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. రవితేజ మేనరిజమ్స్, స్టెప్పులు ఈ పాటను హిట్గా మార్చేశాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్..!
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి వచ్చేశారు. గతేడాది హిట్ రాకపోవడంతో ఈ సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. వామ్మో..వాయో అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ ఈ పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ సాంగ్రకు దేవ్ పావేర్ లిరిక్స్ అందించగా.. స్వాతిరెడ్డి ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)
-
సీనియర్ హీరోలతో జోడీ.. అది మ్యాటరే కాదంటున్న బ్యూటీ
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్లో భాగంగా చిట్చాట్ నిర్వహించింది.సీనియర్ హీరోలతో జోడీ..ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను. ఏజ్ గ్యాప్పై ఓపెనైన బ్యూటీభర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య -
రవితేజ మార్క్ ఫన్ మిస్ కాకుండా...
‘‘రవితేజగారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ రాశాను. చక్కని వినోదంతోపాటు అద్భుతమైన సంగీతంతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ కిశోర్ తిరుమల తెలిపారు. రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘రవితేజగారి మార్క్ ఫన్ మిస్ అవ్వకుండా నా శైలిలో ఈ సినిమాని చాలా వినోదాత్మకంగా చేశాను. ఈ చిత్రంలో ఆయన పోషించిన రామ సత్యనారాయణపాత్ర ఫ్రెష్గా ఉంటుంది’’ అన్నారు. సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది.ఈ సంక్రాంతికి మాతోపాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా బాగా ఆడాలి... కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి... అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఈ చిత్రంలో నాపాత్ర పేరు బాలామణి. ఇది నా ఫస్ట్ సంక్రాంతి సినిమా కాబట్టి చాలా ప్రత్యేకం’’ అన్నారు డింపుల్ హయతి. ‘‘ఈ మూవీలో మోడ్రన్, కాన్ఫిడెంట్, బోల్డ్గా ఉండే మానసా శెట్టిపాత్రలో కనిపిస్తాను’’ అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు. -
'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు
హీరో రవితేజ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే అనేలా పరిస్థితి తయారైంది. గత మూడు నాలుగేళ్లలో 'క్రాక్', 'ధమాకా' లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాప్ అవడంతో పాటు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ చేతిలో ఉంది. దీనికోసం రవితేజ భారీ త్యాగాలే చేశాడు. తాజాగా ఆ విషయాల్ని దర్శకనిర్మాత బయటపెట్టారు.దర్శకుడు కిశోర్ తిరుమల తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్.. ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపించేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాలో నటించడంతో పాటు కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి త్యాగాలని రవితేజ చేశాడు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ గానీ రెమ్యునరేషన్ గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో బయటపెట్టారు. ఇదే చిత్రం కోసం రవితేజ.. తన 'మాస్ మహారాజా' ట్యాగ్ కూడా పక్కనబెట్టేశారని దర్శకుడు చెప్పాడు.ఇదంతా చూస్తుంటే రవితేజకు కూడా తన పరిస్థితి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుకే ఇలా త్యాగాలు చేస్తున్నాడా అని సందేహం వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రేక్షకుడు, కంటెంట్ చూసే థియేటర్కి వెళ్తున్నాడు. చిన్న సినిమానా పెద్ద సినిమానా.. చిన్న హీరోనా పెద్ద హీరోనా అని అస్సలు ఆలోచించట్లేదు. వరస ఫ్లాప్స్ వల్ల రవితేజ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బతింది. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయమని నిర్మాతని కోరాడు. అందుకు తగ్గట్లే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈసారి హిట్ పడితేనే రవితేజకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. -
ఈ సంక్రాంతికి రవితేజ మార్క్ మూవీ
-
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ కామెడీగా టీజర్
మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ రిలీజ్కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
అబద్ధం చెప్పలేనే...
‘‘హోయ్.. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి... నిజం దాచలేనే...’ అంటూ సాగే ఈపాట ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనిది. రవితేజ హీరోగా, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘అద్దం ముందు..’పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.ఈపాట పూర్తి లిరికల్ వీడియో ఈ నెల 10న విడుదల కానుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. జీ స్టూడియోస్ సమర్పణలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా పాట రిలీజ్ (ఫొటోలు)
-
రవితేజ-ఆషిక కొత్త పాట రిలీజ్.. క్యూట్ డ్యాన్స్
రవితేజ కొత్త సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉన్న దృష్ట్యా ప్రమోషన్లు మొదలుపెట్టారు. 'బెల్లా బెల్లా' అంటూ సాగే తొలి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. రవితేజ ఎప్పటిలానే డ్యాన్స్తో ఆకట్టుకోగా, ఇతడి పక్కన ఆషికా రంగనాథ్ క్యూట్గా కనిపించింది. స్పెయిన్లో ఈ పాట చిత్రీకరించారు.(ఇదీ చదవండి: అయ్యర్తో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన మృణాల్)ఈ సినిమాలో రవితేజ సరసన ఆషిక, డింపుల్ హయతి నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. భీమ్స్ సంగీతమందించాడు. ఇదివరకే గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. రవితేజ ఈసారి హిట్ కొడతాడేమోనని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్ని చిత్రాలతో దారుణమైన ఫలితాలని అందుకున్న ఈ హీరో మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది. కాబట్టి ఈసారి సక్సెస్ చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?) -
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్కు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్
గత కొన్నేళ్లుగా హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది లేకుండా పోయింది. వారం పదిరోజుల క్రితం 'మాస్ జాతర' అంటూ వచ్చాడు. యధావిధిగా ఇది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో కొత్త మూవీని సిద్ధం చేశాడు. దీనికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల.. రవితేజ కొత్త చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్ చూస్తుంటే కామెడీగా బాగానే ఉంది. రామసత్యనారాయణ (రవితేజ)ని అతడి జీవితంలోని ఇద్దరు ఆడోళ్లు రెండు ప్రశ్నలు అడుగుతారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి? వాటికి ఎవరూ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారనేదే స్టోరీలా అనిపిస్తుంది.'నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో' అని రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. భీమ్స్ సంగీతమందించాడు. వచ్చే సంక్రాంతికి మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)


