breaking news
India Vs South Africa
-
గంభీర్, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్పూర్ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపించింది మేనేజ్మెంట్. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (17)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ను పంపించారనుకోవచ్చు.కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ల తీరును స్టెయిన్ తప్పుబట్టాడు.కాగా సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్ జోడీ మాత్రమే ఫిక్స్డ్గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.అయితే, టీ20 ఓపెనర్గా గిల్ను పంపడం కోసం.. ఫామ్లో ఉన్న సంజూ శాంసన్పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేశారు. -
‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?
టీ20 వరల్డ్కప్-2026కు కౌంట్డౌన్ మొదలైంది. మరో 55 రోజుల్లో భారత్, శ్రీలంక వేదిలకగా ఈ మెగా టోర్నమెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్దరు ప్లేయర్ల పేలవ ఫామ్ భారత జట్టు మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్మన్ గిల్.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో వీరిద్దరూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.సూర్యకు ఏమైంది..?ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో రాణించినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్నెస్ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్లు ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్లలో సూర్య తిరిగి తన ఫామ్ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్కు బ్యాటింగ్ కష్టాలు తప్పవు. ఈ సిరీస్లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. మూడో మ్యాచ్లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.గిల్ ఢమాల్..ఇక మొన్నటివరకు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ను తప్పించి ఆ బాధ్యతలను గిల్కు బీసీసీఐ అప్పగించింది.అయితే ఆల్ఫార్మాట్గా గిల్కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ శాంసన్ను తప్పించి మరి అతడికి ఓపెనర్గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్లలోనైనా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ తమ ఫామ్ను అందుకుంటారో లేదో చూడాలి.చదవండి: IND Vs SA: అర్ష్దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్ -
అర్ష్దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో 51 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది. ఒక్క వరుణ్ చక్రవర్తి తప్ప మిగితా బౌలర్లు అందరూ అట్టర్ప్లాప్ అయ్యారు. స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ అయితే దారుణ ప్రదర్శన కనబరిచాడు. పదేపదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ సఫారీ బ్యాటర్లకు టార్గెట్గా మారాడు. అస్సలు ఏ మాత్రం రిథమ్లో కన్పించలేదు.ఒక ఓవర్లో 13 బంతులుప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్దీప్ తన చెత్త బౌలింగ్తో అందరికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1.. ఆ ఓవర్లో అర్ష్దీప్ వేసిన బంతుల వరుస ఇది. ఈ పంజాబీ పేసర్ తన ఓవర్ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వచ్చింది. తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అర్ష్దీప్పై సీరియస్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.చెత్త రికార్డు..అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భారత్ తరపున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌలర్ మాత్రం అర్ష్దీపే కావడం గమనార్హం.Gautam Gambhir angry at Arshdeep as he bowled 7 wide bowls in an over 💀 pic.twitter.com/EqUa7nFqW5— ••TAUKIR•• (@iitaukir) December 11, 2025చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో సఫారీలు ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్((46 బంతుల్లో 7 సిక్స్లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.ఆల్టైమ్ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.భారత్పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లుదక్షిణాఫ్రికా-13ఆస్ట్రేలియా-12ఇంగ్లాండ్-12న్యూజిలాండ్-10వెస్టిండీస్10చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్ -
నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ పూర్తిగా తేలిపోయింది. 214 పరుగుల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 162 రన్స్కే టీమిండియా కుప్పకూలింది.భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 62) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5), శుభ్మన్ గిల్(0), అభిషేక్ శర్మ(17) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. సఫారీ పేసర్ బార్ట్మాన్ 4 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, జాన్సెన్, సిప్లమా తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు క్వింటన్ డికాక్(90) చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ విజయంతో సిరీస్ను 1-1తో ప్రోటీస్ సమం చేసింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యామని అతడు చెప్పుకొచ్చాడు.అభిషేక్ ఒక్కడే కాదు.."ఈ మ్యాచ్లో టాస్ గెలవడం మినహా ఏదీ మాకు అనుకూలించలేదు. టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ తీసుకుని ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్ సమయానికి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే తొలుత బౌలింగ్ తీసుకున్నాము. కానీ ఆరంభంలోనే ఈ వికెట్పై ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఆ తర్వాత ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లు గ్రహించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది నేర్చుకునే ప్రక్రియ. మేము ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా మొదటి ప్లాన్ విఫలమైనప్పుడు.. వెంటనే మా సెకెండ్ ప్లాన్ను అమలు చేయలేకపోయాము. కానీ సౌతాఫ్రికా బౌలర్లు మాత్రం రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఉన్నప్పటికి ఎలా బౌలింగ్ చేయాలో మాకు చూపించారు. మా తదుపరి మ్యాచ్లో వారిని మేము అనుసరిస్తాము.బ్యాటింగ్లో నేను, శుభ్మన్ ఇంకొంచెం బాధ్యత తీసుకోవాల్సింది. అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ ప్రతిసారీ అతనిపైనే ఆధారపడలేము. శుభ్మన్ తొలి బంతికే అవుటయ్యాడు. ఆ సమయంలో నేను ఎక్కువ క్రీజులో ఉండి, ఛేజింగ్ బాధ్యతను నా భుజాలపై వేసుకోవాల్సింది. ఇక అన్ని ఫార్మాట్లలోనూ అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో అతడిని ప్రమోట్ చేశాము. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్లో మా ప్లాన్ విజయవంతం కాలేదు. ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అయినప్పటికి మా తదుపరి మ్యాచ్లో గట్టిగా కమ్బ్యాక్ ఇస్తాం. ధర్మశాలలో కలుద్దాం" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: యువ భారత్కు ఎదురుందా! -
డికాక్ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా చిత్తు
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో డొనోవన్ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ 8, కెప్టెన్ మార్క్రమ్ 29, బ్రెవిస్ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్ బార్ట్మన్ 4, ఎంగిడి, జన్సెన్, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్ శర్మ 27, అక్షర్ పటేల్ 21, హార్దిక్ 20, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ 5, అర్షదీప్ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్మన్ గిల్, వరుణ్ చక్రవర్తి డకౌటయ్యారు.ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్లో డికాక్ (90), బౌలింగ్లో ఓట్నీల్ బార్ట్మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్ 14న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. తొందరపాటు చర్యతో.. -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్గా శుబ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో గిల్తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్లోనూ సంజూకు ఓపెనర్గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో ముల్లన్పూర్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్గా గిల్ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా, బ్యాటర్గా మెరుగ్గా ఆడుతున్న గిల్ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
డికాక్ విధ్వంసం.. సౌతాఫ్రికా భారీ స్కోరు
టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్ (8) అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ తొలి బంతికే అతడిని బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో డికాక్ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వేగంగా స్పందించి డికాక్ను రనౌట్ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.ఇక డికాక్కు తోడుగా కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్కు డికాక్తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. డికాక్ను వికెట్ కీపర్ జితేశ్ శర్మ రనౌట్ చేశాడు. ఎక్స్ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్ 22 పరుగులు సమర్పించుకుంది.ఇక భారత పేసర్లలో అర్ష్దీప్ సింగ్ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్ పూర్తి కోటాలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. కానీ
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ముల్లన్పూర్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్వాష్ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్పూర్ ఆతిథ్యమిస్తోంది.పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.క్వింటన్ డికాక్ జోరుఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మూడో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.12 ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్ కంటే ముందు వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్కు 20 ఇన్నింగ్స్.. బట్లర్కు 24 ఇన్నింగ్స్ అవసరం కాగా.. డికాక్ 12 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. తొందరపాటు చర్యతోకానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్ రనౌట్ అయ్యాడు. పదహారో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో షాట్ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్కు గిరాటేశాడు. దీంతో డికాక్ రనౌట్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో డికాక్ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్లోకి వచ్చిన డికాక్.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి! -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్లో డికాక్ (90), బౌలింగ్లో ఓట్నీల్ బార్ట్మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా 5 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఓటమి అంచుల్లో టీమిండియా19వ ఓవర్లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత శివమ్ దూబే (1), ఆతర్వాత అర్షదీప్ సింగ్ను (4), వరుణ్ చక్రవర్తి (0) ఔటయ్యారు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా14.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సిపాంమ్లా బౌలింగ్లో బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (20) ఔటయ్యాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-4తిలక్ వర్మ 18 బంతులలో 32, హార్దిక్ పాండ్యా 4 పరుగులు.. విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం👉7.3: బార్ట్మాన్ బౌలింగ్లో హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (21). స్కోరు: 67-4 (7.4)👉పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 51-3 (6)👉 3.5: మార్కో యాన్సెన్ బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన సూర్య (5). స్కోరు: 32-3 (4).👉1.6: మార్కో యాన్సెన్ బౌలింగ్లో కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (8 బంతుల్లో 17). స్కోరు: 19-2 (2).👉మరో ప్రయోగం.. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్👉0.5: మరోసారి శుబ్మన్ గిల్ విఫలం.. ఎంగిడి బౌలింగ్లో హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్. గత మ్యాచ్లో నాలుగు పరుగులు చేసిన గిల్... భారత్ స్కోరు: 9-1 (1)సౌతాఫ్రికా భారీ స్కోరు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?👉డికాక్ మెరుపులు (46 బంతుల్లో 90- 5 ఫోర్లు, 7 సిక్సర్లు).. రాణించిన డొనోవాన్ (16 బంతుల్లో 30 నాటౌట్), మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్)👉భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి రెండు, అక్షర్ పటేల్కు ఒక వికెట్👉సౌతాఫ్రికా స్కోరు: 213-4.. టీమిండియా లక్ష్యం 214 టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్👉ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా భారీస్కోరు: 213-4👉16.1: అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా పెవిలియన్ చేరిన డెవాల్డ్ బ్రెవిస్ (14)👉15.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్ రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా👉15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156-2 👉11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన మార్క్రమ్ (29) 👉10.3: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా👉పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 90-1 👉8.3: హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్ డికాక్.👉పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 53-1👉4.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) అవుట్👉ముల్లన్పూర్ స్టేడియంలో టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్టాండ్ ఆవిష్కరణఎలాంటి మార్పులూ లేవుటాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాము. పురుషుల క్రికెట్లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.సంజూకు మరోసారి మొండిచేయికాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్గా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్ రాకతో ఓపెనింగ్ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్ (Sanju Samson).. వికెట్ కీపర్గానూ ప్లేయింగ్ ఎలెవన్లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్మెంట్ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.మూడు మార్పులతో బరిలోకిమరోవైపు.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, బార్ట్మన్లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. ఆల్ ఫార్మాట్ సిరీస్లుకాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్ ఫార్మాట్ సిరీస్లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్లో సఫారీలు దుమ్ములేపారు. అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్వాష్ చేశారు. అయితే, వన్డే సిరీస్ను 2-1తో గెలిచి భారత్ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మాన్.చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. శాంసన్కు మరోసారి నో ఛాన్స్!
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే కటక్లో ఆడిన జట్టునే రెండో టీ20కు కూడా భారత్ కొనసాగించే అవకాశముంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్గా కొనసాగించాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చిన జితీశ్.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు. అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్కప్-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్లో నైనా సూర్య తన రిథమ్ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.తుది జట్లు(అంచనా)భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా. -
సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా, ఓవరాల్గా 33వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.హార్దిక్కు ముందు రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లి (124) భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్ సెంచరీ చేయలేదు.హార్దిక్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్) కటక్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ (175/6) చేయగలిగింది.అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్ పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్పూర్లో జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్ తప్పు చేశాడా?
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్)కు తోడు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh), జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు.. పేస్బౌలింగ్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్లో సఫారీ స్టార్, టాప్ రన్ స్కోరర్ డెవాల్డ్ బ్రెవిస్ (22)ను అవుట్ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్లో చేరాడు. అదే విధంగా.. కేశవ్ మహరాజ్ (0)ను కూడా పెవిలియన్కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్లో బుమ్రా పదకొండో ఓవర్లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్ ఎదుర్కొన్నాడు. ఫుల్ స్వింగ్తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్-ఫుట్ నోబాల్ కోసం చెక్ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్ను థర్డ్ అంపైర్ పెవిలియన్కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్దీప్ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్ మలింగ (శ్రీలంక)టిమ్ సౌతీ (న్యూజిలాండ్)షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025 -
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్గా శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కినా.. వన్డౌన్లో... ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ స్థానాన్ని జితేశ్ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్లో టాలెంట్కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్ ఘన విజయంకాగా కటక్ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జితేశ్ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్లో భాగమై కీపర్గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్ గిల్ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ముందంజ వేసింది. చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025 -
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్లో మార్కో యాన్సెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్ సెంచరీఅయితే, శుబ్మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్ను.. టీ20లలోనూ కెప్టెన్గా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
అతడొక అద్భుతం.. నమ్మబుద్ధికాలేదు: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆరంభంలో తడబడినా.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరచడంతో మెరుగైన స్కోరు సాధించింది.50- 50 అనుకున్నాంఅనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకుని సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు. ‘‘టాస్ సమయంలో గెలుపు అవకాశాలు 50- 50 అనుకున్నాం. ఏదేమైనా తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగా అనిపించింది.48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఆ తర్వాత తేరుకుని 175 పరుగులు చేయగలిగాము. హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో జితేశ్ శర్మ (Jitesh Sharma)కూడా తన వంతు పాత్ర పోషించాడు.నమ్మశక్యం కాని విషయంతొలుత మేము 160 పరుగుల వరకు చేయగలుగుతామని అనుకున్నాం. అయితే, 175 పరుగులు సాధించడం అన్నది నమ్మశక్యం కాని విషయం. 7-8 మంది బ్యాటర్లలో ఇద్దరు- ముగ్గురు పూర్తిగా విఫలమైనా.. మిగిలిన నలుగురు రాణించి దీనిని సుసాధ్యం చేశారు.టీ20 క్రికెట్లోని మజానే ఇది. తదుపరి మ్యాచ్లో మా బ్యాటర్లంతా మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము. టీమిండియా టీ20 ప్రయాణం గొప్పగా సాగుతోంది.అర్ష్దీప్, బుమ్రా పరిపూర్ణమైన బౌలర్లు. మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే వాళ్లిద్దరే బౌలింగ్ అటాక్ ఆరంభించేవారు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయి ఏమిటో మరోసారి చూపించాడు. Hard-hit Pandya is back in business! 🙌💪Two mammoth maximums in the same over and the crowd in Cuttack begins to chant his name. 🤩#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/VYKUx3OhVT— Star Sports (@StarSportsIndia) December 9, 2025అతడొక అద్భుతం.. నిజంగా అద్భుతం చేశాడు. ఏదేమైనా అతడిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అతడి బౌలింగ్ పట్ల కూడా నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.టాపార్డర్ విఫలంకాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (17), శుబ్మన్ గిల్ (4) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.ఆదుకున్న హార్దిక్ఇలాంటి దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59)తో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే (9 బంతుల్లో 11), జితేశ్ శర్మ (5 బంతుల్లో 10 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రొటిస్ జట్టు బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (14 బంతుల్లో 22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
హార్దిక్ విధ్వంసం.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 17, శుభ్మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్కీపర్),అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. సంజూకు మొండిచెయ్యి
కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్కీపర్ బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్కీపర్),అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్గా సేవలు అందిస్తూ.. టాపార్డర్లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్డౌన్లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్కప్ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్కప్లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్ పాండ్యా ఆగ్రహం
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..భార్య నటాషా స్టాంకోవిక్కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్ మొదలు బీచ్ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.తీయకూడని యాంగిల్లో ఫొటో..‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.ప్రైవేట్ మూమెంట్అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్ మూమెంట్ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్లైన్స్ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.కాస్త మానవత్వం చూపండిప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్ -
వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
భారత్- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.టెస్టు సారథి గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించిన గిల్.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.మరోవైపు.. ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. జితేశ్ శర్మకే ప్రాధాన్యంఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్పై వేటు తప్పదన్న పఠాన్.. వికెట్ కీపర్గా జితేశ్ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.శివం దూబేకు నో ఛాన్స్అదే విధంగా.. హార్దిక్ వల్ల ఓ ఆల్రౌండర్కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్తో పాటు.. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్ పఠాన్.. శివం దూబేకు ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు.ఇర్ఫాన్ ఓటు అర్ష్కేఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్ హర్షిత్ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలనని హర్షిత్ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్దీప్కే ఓటు వేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా..
భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 మంగళవారం(డిసెంబర్ 9) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సఫారీలతో వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి టీ20కు ముందు బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల క్లబ్లో చేరేందుకు బుమ్రా ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.అరుదైన రికార్డుపై కన్ను..కటక్ టీ20లో బుమ్రా వికెట్ సాధిస్తే వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు. ఈ పేస్ గుర్రం ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలలో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 80 మ్యాచ్లు ఆడి 99 వికెట్లు సాధించాడు. అయితే భారత తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అర్ష్దీప్ సింగ్ 105 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్లో అర్ష్దీప్ను కూడా బుమ్రా అధిగమించే అవకాశముంది. అదేవిధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి బుమ్రాకు 18 వికెట్లు మాత్రమే అవసరం. బుమ్రా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 221 మ్యాచ్లు ఆడి 482 వికెట్లు సాధించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. తిరిగి మంగళవారం కటక్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టీ20ల్లో ఆడనున్నాడు.పునరాగమనంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యాడు. ఈ టోర్నీలో బరోడా తరపున రెండు మ్యాచ్లు ఆడాడు. ఈ రెండింటిలోనూ అతడు తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేశాడు.ఎడమ క్వాడ్రిసెప్స్(తొడ కండరాలు) గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకున్నట్లు కన్పిస్తున్నాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్కు చేరుకున్నాడు.బారాబతి స్టేడియంలో ఈ ఆల్రౌండర్ ఒంటరిగా ట్రైనింగ్ పాల్గోన్నాడు. వార్మప్, స్ట్రెచింగ్, రన్నింగ్ డ్రిల్స్తో పాటు, త్రోడౌన్ స్పెషలిస్టులు నువాన్ సెనెవిరత్నే, దయానంద్ గారానితో కలిసి 20 నిమిషాలు బౌలింగ్ చేశాడు.ప్రాక్టీస్కు దూరం!ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి.. సోమవారం జరిగిన భారత్ చివరి ప్రాక్టీస్ సెషన్కు హార్దిక్ గైర్హాజరయ్యాడు. దీంతో అతడు మళ్లీ గాయపడ్డాడా? అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. అయితే హార్దిక్కు ఎటువంటి గాయం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శిక్షణకు దూరమయ్యాడని క్రిక్ బజ్ తెలిపింది. టీ20 ప్రపంచకప్-2026కు సమయం అసన్నమవుతుండడంతో హార్దిక్ లాంటి అద్భుతమైన ఆటగాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బౌలింగ్ చేసే క్రమంలో పాండ్యా కాస్త ఆసౌకర్యంగా కన్పించడాని, అందుకే ట్రైనింగ్ సెషన్కు దూరంగా ఉన్నాడని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం హార్దిక్ ట్రైనింగ్ స్కిప్పై ఎటువంటి ప్రకటన చేయలేదు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
ఇక ధనాధన్ షురూ...
టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్ చేతిలో టి20 వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.పైగా నిలకడ లేని టీమ్తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్ కప్కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు. కటక్: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా వరల్డ్ కప్ బరిలోకి దిగడానికి ముందు భారత్ 10 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో కూడా ఐదు టి20 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. గిల్, పాండ్యా సిద్ధం... ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ గిల్, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం. అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేయనుండగా సూర్య, తిలక్ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్ కీపర్గా సంజూ సామ్సన్, జితేశ్ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. అక్షర్ పటేల్తో పాటు ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ పోటీలో ఉన్నాడు. పేస్ ఆల్రౌండర్ కావాలంటే హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయిలో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్రెవిస్పై దృష్టి... దక్షిణాఫ్రికా టీమ్ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్ల చేతిలో సిరీస్లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్, పేసర్ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్రమ్ మెరుగైన ఫామ్లో ఉండటం కలిసి రావచ్చు. ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్ బ్రెవిస్పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్ ఆల్రౌండ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్ పిచ్. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్కు ఇబ్బంది లేకపోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్, తిలక్, జితేశ్ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్/సుందర్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్గిడి, మహరాజ్. -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఝలక్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
గిల్ వచ్చేశాడు.. సంజూ శాంసన్కు మళ్లీ నిరాశే..!
డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్లో ఆడించాల్సి వస్తే మేనేజ్మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్గా, ఫైన్గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఆతిథ్య వేదికకు చేరుకుని ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి. టెస్టు సిరీస్ను సౌతాఫ్రికా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్ను మాత్రం మెన్ ఇన్ బ్లూ తమ ఖాతాలో వేసుకుంది.ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. కటక్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం.టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం.. తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్ను ఎర్రమట్టితో తాయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.సుందర్పై వేటు..గత కొన్ని మ్యాచ్లగా మూడో స్పిన్నర్గా ఉన్న వాషింగ్టన్ సుందర్పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు ఛాన్స్ ఉంది. ఎలాగో మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. గాయం నుంచి పాండ్యా కోలుకుని తిరిగొచ్చాడు.ఇక సీమర్లగా అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశముంది. ఒకవేళ అవసరమైతో దూబేతో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్గా ఉపయోగించుకుంటారు. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు చోటు దక్కకపోవచ్చు. భారత ఇన్నింగ్స్ను శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ప్రారంభించనుండగా.. మూడు నాలుగు స్ధానాలలో సూర్యకుమార్, తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను ఆడించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్చదవండి: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన! -
భువనేశ్వర్కు చేరుకున్న టీమిండియా (వీడియో)
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్ను మాత్రం సొంతం చేసుకుంది. మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు టీ20 సిరీస్పై కన్నేసింది. భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆదివారం రాత్రి భువనేశ్వర్కు చేరుకున్నాయి. ప్రోటీస్, భారత్ జట్లకు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మహంతి స్వాగతం పలికారు. వైజాగ్ నుంచి అర్ష్దీప్, నితీశ్ కుమార్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు భువనేశ్వర్ చేరుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి వారు ముంబై నుంచి నేరుగా జట్టులో కలిశారు. ఇరు జట్లు సోమవారం బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్కు హాజరు కానున్నారు. స్టేడియం, హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ లోచన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్కు దూరమైన స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు టీ20ల్లో ఆడనుండడం ఖాయం. మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఇప్పటికే ఫిట్నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును సఫారీలపై కొనసాగించాలని ఈ బరోడా ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే సిరీస్కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20లకు అందుబాటులోకి వచ్చాడు.సఫారీలతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ. So Sanju Samson reached Cuttack. Today Kerala will be playing without Sanju Samson. This reminds me off 90s Indian team without Sachin. I don't think we will cross 100 without Sanju pic.twitter.com/tiuPi1TAj0— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) December 8, 2025 -
కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
వన్డే ప్రపంచకప్-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో రో-కో అదరగొట్టారు.కోహ్లి రెండు సెంచరీలతో సత్తాచాటి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలవగా.. రోహిత్ కూడా పరుగులు వరద పారించాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్గా, ఫిట్గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.భారత క్రికెట్కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ -
నితీష్ నిజంగా ఆల్రౌండరేనా..?
నితీశ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసి ఆపై భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారాడు. గతేడాది టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి.. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్న నితీశ్ను టీమ్ మెనెజ్మెంట్ మాత్రం సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైంది.నితీశ్ రోల్ ఏంటి?హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీశ్ నిజంగా ఆల్రౌండరేనా సందేహం వ్యక్తమవుతోంది. నితీశ్ ప్రధాన జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ నితీశ్ తిరిగి స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ సిరీస్లో నితీశ్తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు.ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికి ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు. అయితే కోల్కతా టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలవ్వడం, శుభ్మన్ గిల్ గాయపడడంతో అతడికి మళ్లీ పిలుపు నిచ్చారు.అయితే గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో నితీశ్కు చోటు దక్కింది. కానీ ఈ మ్యాచ్లో కూడా నితీశ్కు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించలేదు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం పది ఓవర్లు మాత్రమే నితీశ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 150 ఓవర్లు పైగా బౌలింగ్ చేస్తే.. నితీశ్కు కేవలం 6 ఓవర్లు దక్కాయి. నితీశ్ తన మీడియం పేస్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.ఇంతకుముందు ఆసీస్, ఇంగ్లండ్ టూర్లలో బంతితో కూడా నితీశ్ సత్తాచాటాడు. కానీ స్వదేశంలో టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో ఆర్ధం కావడం లేదు. అదేవిధంగా ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లోనూ రెండు మ్యాచ్లు ఆడి కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.దీంతో గంభీర్పై అశ్విన్, ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమర్శలు వర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో అతడిని జట్టులోకి తీసుకున్నప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించడం లేదని అశ్విన్ ప్రశ్నించాడు.నితీశ్కు నో ఛాన్స్సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు కూడా నితీశ్ ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రధాన ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకుని అతడిని బెంచ్కే పరిమితం చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అదేవిధంగా మొన్నటివరకు టీ20ల్లో భాగంగా ఉన్న నితీశ్ను పాండ్యా రావడంతో జట్టు నుంచి తప్పించారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక భారత జట్టులో ఈ ఆంధ్ర ఆల్రౌండర్కు చోటు దక్కలేదు. దీనిబట్టి నితీశ్ టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో కూడా నితీశ్ ఆడే సూచనలు కన్పించడం లేదు. దీంతో ఆరు నెలల తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు నితీశ్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుందున నితీశ్కు ప్లేయింగ్ ఎలెవన్లో కచ్చితంగా చోటు దక్కుతుందో లేదో తెలియదు. ఉపఖండ పిచ్లు ఎక్కువ స్పిన్కు అనుకూలించనుందన అక్షర్, కుల్దీప్, జడేజాలతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ -
సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్ను ఎంపిక చేశారు.దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్లో కూడా గిల్ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. అయితే సూర్యను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్ను కెప్టెన్గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్ను కెప్టెన్గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు."సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.శుభ్మన్ ఏ ఫార్మాట్లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్కాస్ట్లో దాదా పేర్కొన్నాడు.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే? -
సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్ల్లో 136.42 స్ట్రయిక్రేట్తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.ప్రస్తుతం ఎడిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ ఇదివరకే ఖరారైంది. ఈ ఎడిషన్లో శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది. -
తెలివిగా ఆడలేకపోయాం.. టీమిండియా నాణ్యత చూపించింది: బవుమా
విశాఖ వేదికగా భారత్తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కీలకమైన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్లో తడబడిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్లో పూర్తిగా చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకొని సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో.. ఆతర్వాత బ్యాటింగ్లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. బౌలింగ్లో కుల్దీప్, ప్రసిద్ద్ కృష్ణ సత్తా చాటగా.. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో.. రోహిత్, కోహ్లి బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్ను మరింత ఉత్కంఠభరితంగా చేయాలని అనుకున్నాం. కానీ బోర్డుపై సరిపడా పరుగులు పెట్టలేకపోయాం. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు బహుమతిగా ఇచ్చేయడం వల్ల ఒత్తిడి పెరిగింది. 50 ఓవర్ల మ్యాచ్లో ఆలౌట్ కావడం ఎప్పుడూ కష్టమే. డికాక్ అద్భుతంగా ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే జట్టు కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్కు శుభారంభం లభించినా, ఆతర్వాత దారి తప్పాను. మొదటి రెండు వన్డేల్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం చూపాము. కానీ ఈ మ్యాచ్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వికెట్లు కోల్పోయాము. తొలుత బంతితో బాగా పోరాడాం. మొదటి స్పెల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ బోర్డుపై సరిపడా స్కోర్ లేకపోవడంతో భారత బ్యాటర్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మొత్తంగా భారత జట్టు తమ నాణ్యతను చూపించింది. మేము తెలివిగా ఆడలేకపోయాముం. ఈ సిరీస్లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. జట్టుగా ఎదిగాము. మేము ఎప్పుడూ ప్రత్యర్థిపై దాడి చేయాలని మాట్లాడుకుంటాం. భారత్కి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా, వారిపై ఒత్తిడి పెట్టగలిగాం. పరిస్థితులను గుర్తించి మరింత తెలివిగా ఆడటం నేర్చుకోవాలి. పది బాక్సుల్లో ఆరు లేదా ఏడు టిక్ చేశామని అనుకుంటున్నానని బవుమా అన్నాడు. -
సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్ రాహుల్
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్ తప్ప ఈ మ్యాచ్ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడటం వల్ల సెకెండ్ ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.పిచ్ బ్యాటింగ్కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. ప్రసిద్ద్ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్లో మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారి తరఫున డికాక్ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్ చాలా కీలకం. సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశాం. సిరీస్ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్ యాదవ్ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీతో.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat kohli) ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాఫ్రికా వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలవడంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. సచిన్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉండగా.. విరాట్ ఖాతాలో 20వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు చేరింది. ఈ విభాగంలో విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (17), జాక్ కల్లిస్ (14), సనత్ జయసూర్య (13), డేవిడ్ వార్నర్ (13) ఉన్నారు.జయసూర్య రికార్డు సమంప్రత్యేకించి వన్డే క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్కు వన్డేల్లో ఇది 11వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో విరాట్ సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ చలామణి అవుతున్నాడు.కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండు శతకాలు (135, 102) సహా చివరి మ్యాచ్లో అజేయమైన అర్ద సెంచరీ (65) చేశాడు. ఈ ప్రదర్శనలకు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.జైస్వాల్ సూపర్ సెంచరీ.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్విశాఖ వేదికగా నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (106) సెంచరీ సాయంతో 270 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీ.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.జైశ్వాల్ సెంచరీ..లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Look at what it means to him! 🥳What a special knock this has been from Yashasvi Jaiswal 🙌Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025డికాక్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.Virat Kohli in this series :Innings -3 Runs - 302Avg. - 151SR - 117.05100s- 250s-1Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ -
యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు.271 పరుగుల లక్ష్య చేధనలో జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన యశస్వి.. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. జైశూ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన వన్డే సెంచరీ మార్క్ అందుకున్నాడు. శతక్కొట్టగానే జైశ్వాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.కాగా మొదటి రెండు వన్డేల్లో ఈ ముంబై ఆటగాడు విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జైశ్వాల్పై నమ్మకం ఉంచాడు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని జైశ్వాల్ అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడడంతో జైశ్వాల్కు జట్టులో చోటుదక్కింది. మళ్లీ గిల్ తిరిగొస్తే జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్గానే కొనసాగనున్నాడు. ఇక వైజాగ్ వన్డేలో టీమిండియా విజయానికి చేరువైంది. సిరీస్ విజయానికి భారత్కు ఇంకా 29 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(46), జైశ్వాల్(107) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ -
ముఖం మాడ్చుకున్న కుల్దీప్!.. రోహిత్ ఇలా చేశావేంటి?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్గా చరిత్రకెక్కాడు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచిలో భారత్ గెలవగా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్తో సిరీస్ ఫలితం తేలనుంది. వైజాగ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.270 పరుగులకు ఆలౌట్కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లలో ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో ఓవరాల్గా పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) రూపంలో ముగ్గురు డేంజరస్ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పదే పదే అప్పీలు చేస్తూ.. అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్ అయ్యాడంటూ కుల్దీప్ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.ముఖం మాడ్చుకున్న కుల్దీప్ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్ను టీజ్ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్.. మరోవైపు విరాట్ కోహ్లి కూడా నవ్వులు చిందించారు. అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవంThese are the moments we pay our internet bills for! 😉😁😍#INDvSA 3rd ODI, LIVE NOW 👉 https://t.co/Es5XpUmR5v pic.twitter.com/hPZJFPlJ0G— Star Sports (@StarSportsIndia) December 6, 2025 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ను హిట్మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్( (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రవిడ్ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో ఈ ముంబైకర్ 50 సెంచరీలు నమోదు చేశాడు.వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్(264) పేరిటే ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్గా సఫారీలపై మూడు ఫార్మాట్లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(78)ను అధిగమించాడు.డికాక్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(83), విరాట్ కోహ్లి(7) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే! -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.ఫిట్నెస్ సాధించాడుభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్మన్ గిల్ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్నెస్ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్ వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్కు గిల్ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్వాష్కు గురైంది.మెడనొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.ఈ క్రమంలో గిల్ టీ20 సిరీస్కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్ టీమ్తో పొట్టి సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్నెస్ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వెల్లడించింది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్, ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు -
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును 270 పరుగులకు పరిమితం చేశారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచిలో టీమిండియా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నాటి మూడో వన్డే (IND vs SA 3rd ODI) ద్వారా సిరీస్ ఫలితం తేలనుంది. విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా తొలుత బ్యాటింగ్కు దిగిన ప్రొటిస్ జట్టుకు భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) ఆదిలోనే షాకిచ్చాడు. టీమిండియా బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ లెఫ్టార్మ్ బౌలర్.. ఐదో బంతికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను పెవిలియన్కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.శతక్కొట్టిన డికాక్ఈ క్రమంలో డికాక్ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు- 106 పరుగులు) పూర్తి చేసుకుని జోరు కనబరచగా ప్రసిద్ కృష్ణ అతడిని బౌల్డ్ చేశాడు. మరోవైపు.. బవుమా అర్ధ శతకం దిశగా సాగుతున్న వేళ.. రవీంద్ర జడేజా బౌలింగ్లో విరాట్ కోహ్లి (Virat Kohli)కి క్యాచ్ ఇచ్చి 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.మార్క్రమ్ విఫలంమిగతా వారిలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్ బ్రెవిస్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్లు చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ (1) దారుణంగా విఫలం కాగా.. ఆల్రౌండర్లలో మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) తేలిపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్ కాగా.. ఆఖర్లో కేశవ్ మహరాజ్ మెరుగైన (20 నాటౌట్) బ్యాటింగ్తో అలరించాడు. ప్రసిద్ బౌలింగ్ ఒట్నీల్ బార్ట్మన్ పదో వికెట్గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిపోయింది.చెరో నాలుగు పంచుకున్న ప్రసిద్, కుల్దీప్ఈ క్రమంలో 47.5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ డికాక్, బ్రీట్జ్కే, మార్క్రమ్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చడంతో పాటు బార్ట్మన్ను అవుట్ చేశాడు. మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రెవిస్, యాన్సెన్. బాష్, ఎంగిడిలను పెవిలియన్కు పంపాడు. మిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు -
చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే!
టీమిండియాతో వన్డే సిరీస్లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా భారత్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో డికాక్ సెంచరీతో చెలరేగాడు. తొలి రెండు వన్డేల్లో తడబడిన డికాక్.. ఈ మ్యాచ్లో మాత్రం భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఈ వెటరన్ తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో డికాక్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 89 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డేల్లో అతడికి ఇది 23వ సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్పై 7వ వన్డే సెంచరీ. తద్వారా డికాక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన డికాక్..ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా క్వింటన్ డికాక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్, శ్రీలంక లెజెండ్ సంగర్కర పేరిట ఉండేది. గిల్లీ శ్రీలంకపై 6 సెంచరీలు సాధించగా.. సంగక్కర భారత్పై సరిగ్గా ఆరు వన్డే సెంచరీలు నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో వీరిద్దరిని డికాక్(7) అధిగమించాడు.అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా కుమార సంగక్కర రికార్డును డి కాక్ సమం చేశాడు. సంగక్కర తన వన్డే కెరీర్లో 23 సెంచరీలు చేయగా.. డికాక్ కూడా సరిగ్గా ఇప్పటివరకు 23 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సంగాను డికాక్ అధిగమిస్తాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్ధానంలో షాయ్ హోప్(19), గిల్క్రిస్ట్(19) ఉన్నారు.విదేశీగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ రికార్డును డికాక్ సమం చేశాడు. వీరిందరూ 7 సెంచరీలు విదేశాల్లో చేశారు.భారత్పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(7) రికార్డును డికాక్ సమం చేశాడు.చదవండి: IND vs SA: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్ నమ్మకమే నిజమైంది -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్ నమ్మకమే నిజమైంది
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పై వేటు పడింది.కానీ తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన పేసర్ ప్రసిద్ద్ కృష్ణపై మాత్రం టీమ్ మెనెజ్మెంట్ నమ్మకం ఉంచింది. కానీ గంభీర్ నమ్మకాన్ని ఈ కర్ణాటక పేసర్ తొలి స్పెల్లో నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి స్పెల్లో 2 ఓవర్లు వేసిన కృష్ణ ఏకంగా 13.5 ఏకానమీతో 27 పరుగులు ఇచ్చాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్లో తన తొలి స్పెల్ను వేసేందుకు వచ్చిన ప్రసిద్ద్ కృష్ణను క్వింటన్ డికాక్ ఓ ఆడుకున్నాడు. దీంతో గంభీర్తో పాటు కృష్ణను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అతడు తప్ప ఇంకొక బౌలర్ మీకు దొరకలేదా అంటూ నెటిజన్లు మండిడ్డారు.సీన్ రివర్స్.. అయితే కాసేపటికే ప్రసిద్ద్, గంభీర్ను విమర్శించిన వారే శెభాష్ అంటూ ప్రశంసించారు. ప్రసిద్ద్ కృష్ణ తన సెకెండ్ స్పెల్లో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్యాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లను పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. 29వ ఓవర్ వేసిన కృష్ణ రెండో బంతికి ఇన్ ఫామ్ బ్యాటర్ బ్రీట్జ్కేను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కృష్ణ.. ఆఖరి బంతికి రాయ్పూర్ వన్డే హీరో మార్క్రమ్ను పెవిలియన్కు పంపాడు.ఆ తర్వాత డికాక్ను కూడా అద్భుత బంతతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రసిద్ద్ తన సూపర్ బౌలింగ్తో తిరిగి జట్టును గేమ్లోకి తెచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 38 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్(106) సెంచరీతో మెరిశాడు.What a brilliant comeback by Prasidh Krishna 👏🏻 First 2 overs - 28 runs and 0 wickets 😆Next 5 overs - 25 runs and 3 wickets 🔥 pic.twitter.com/wPIluvIgVS— Richard Kettleborough (@RichKettle07) December 6, 2025 -
ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా..
టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అందుకే తొలుత బౌలింగ్ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేశాము. రాంచి, రాయ్పూర్లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.వాషీపై వేటు.. జట్టులోకి తిలక్అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.గాయాలతో వారిద్దరు దూరంమరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. రాంచి, రాయ్పూర్ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్ బార్ట్మన్, ర్యాన్ రికెల్టన్ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.ఫలితం తేల్చే మ్యాచ్కాగా మూడు వన్డేలో సిరీస్లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్.చదవండి: భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు -
భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు
భారత్తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్ నండ్రీ బర్గర్ (Nandre Burger), బ్యాటర్ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. గాయాల కారణంగా..టీమిండియాతో రాయ్పూర్ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్ బౌలర్ నండ్రీ బర్గర్కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరంఫలితంగా బర్గర్, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. డి జోర్జి భారత్తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.క్వెనా మఫాకా సైతం..అదే విధంగా.. యువ ఫాస్ట్ బౌలర్ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్వాష్ చేశారు సఫారీలు.ఇక వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ప్రొటిస్ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్కు తెరలేస్తుంది.చదవండి: చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్ -
వైజాగ్ అంటే 'కింగ్'కు పూనకాలే..!
వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.వైజాగ్ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. ఈ సిరీస్లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.కోహ్లి ఉన్న ఫామ్ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్ పిచ్ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతనాడిన 7 మ్యాచ్ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.స్ట్రయిక్రేట్ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. వైజాగ్లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.పిచ్ స్వభాగం కోహ్లి బ్యాటింగ్ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్కు అవకాశమున్నా, బంతి బ్యాట్ వద్దకు సలువుగా వస్తుంది. ఈ పరిస్థితి కోహ్లిని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లు ఆడటం కంటే, టైమింగ్, బ్యాలెన్స్, ప్లేస్మెంట్ను నమ్ముకునే కోహ్లి బంతి బ్యాట్ వద్దకు వస్తే చెలరేగిపోతాడు.కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వైజాగ్లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి, కోహ్లి తన సహజశైలిలో పంచ్ షాట్లు, డ్రైవ్లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లికి పెద్దగా స్ట్రయిక్ రొటేట్ చేసే పని కూడా ఉండదు. పిచ్ స్వభావం, చిన్న బౌండరీలు ఉండటం చేత కోహ్లి వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారముంది.కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వీటన్నిటి కంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. అదేంటంటే.. బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్లో స్పష్టమైంది. ప్రధాన పేసర్లు ఎంగిడి, జన్సెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్లో ఈ ముగ్గురూ బరిలోకి దిగినా పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లి ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. -
అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు.. క్లారిటీతో ఉన్నాము: టీమిండియా కోచ్
భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? గత కొన్ని సిరీస్లగా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే సుందర్ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉంటున్నాడు. కానీ ఓ మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడితే..మరో మ్యాచ్లో స్పిన్నర్గా తన బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. బ్యాటింగ్లో కూడా ఒక స్దానంలో పంపడం లేదు. ఒక మ్యాచ్లో మూడో స్దానం, మరో మ్యాచ్లో ఆరో స్దానం అలా అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంది. బౌలింగ్లో కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై తీవ్రస్దాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జట్టులో సుందర్ రోల్పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్గానే వాషీని జట్టులోకి తీసుకున్నట్లు టెన్ డెష్కాట్ తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేలలోనూ బ్యాట్తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడిని మూడో వన్డే నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంచు ప్రభావం కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించడం లేదు. అందుకే సుందర్కు రాంచీలో 3 ఓవర్లు, రాయ్పూర్లో 4 ఓవర్లు మాత్రమే ఇచ్చాము. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. గత ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా సుందర్ కృషి చేస్తున్నాడు అని పోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ర్యాన్ పేర్కొన్నాడు.చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్లో ఎక్కువ మంది వెతికింది అతడినే -
‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’
భారత మహిళా క్రికెట్ జట్టు తొలి వన్డే వరల్డ్కప్ ట్రోఫీ గెలవడంలో దీప్తి శర్మది కీలక పాత్ర. ఈ మెగా ఈవెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ ఆల్రౌండర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీలో దీప్తి మొత్తంగా 215 పరుగులు చేయడంతో పాటు.. 22 వికెట్ల కూల్చింది.ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ.. అర్ధ శతకం బాదడంతో పాటు.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలంలోనూ దీప్తికి భారీ ధర దక్కింది.వేలానికి ముందు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను వదిలేసిన యూపీ వారియర్స్.. ఏకంగా రూ. 3.2 కోట్లు వెచ్చించి తిరిగి ఆమెను సొంతం చేసుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్గా దీప్తి నిలిచింది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ విన్నింగ్ జట్టుతో కలిసి దీప్తి శర్మ.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ప్రముఖ షో.. ‘కౌన్ బనేగా కరోడ్పతి’కి హాజరైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్గా మారడానికి తన అన్నయ్యే కారణమని వెల్లడించింది.‘‘నేను క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. మా అన్నయ్య ప్రొఫెషనల్ క్రికెటర్. ఆయన వల్లే నేనూ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. నేను వేసిన ఒక్క త్రో నా జీవిత ప్రయాణాన్నే మార్చివేసింది.ఓరోజు మా అన్నయ్య ఆడుతున్న చోటికి వెళ్లాను. అక్కడే మెట్ల మీద కూర్చుని మ్యాచ్ చూస్తున్నా. ఇంతలో బంతి నా వైపు దూసుకువచ్చింది. వేగంగా స్పందించిన నేను.. దాదాపు 40- 50 మీటర్ల దూరం నుంచి దానిని నేరుగా స్టంప్స్నకు గిరాటేశాను. మా అన్నయ్య చాలా సంతోషించాడు.చుట్టూ ఉన్న వాళ్లు కూడా.. ‘ఈ అమ్మాయి క్రికెట్ ఆడితే బాగుంటుంది’ అని ఉత్సాహపరిచారు. ఆరోజు నుంచి క్రికెటర్గా ప్రయాణం మొదలుపెట్టిన నేను ఇంత వరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’’ అని దీప్తి శర్మ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దీప్తి సేవలకు గానూ ఆమెను పోలీస్ శాఖలో డీఎస్పీగా నియమించింది. -
మనసు మార్చుకున్న గంభీర్..!
సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డేల సిరీస్లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. శనివారం(డిసెంబర్ 6) వైజాగ్ వేదికగా సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా వన్డే సిరీస్ను కూడా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ ఆఖరి పోరులో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సుందర్పై వేటు..ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ తొలి రెండు వన్డేలలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మొదటి వన్డేలో 13, రాయ్పూర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్లో కూడా ఈ తమిళనాడు ప్లేయర్ తేలిపోయాడు.దీంతో అతడిపై వేటు వేయాలని గంభీర్ అండ్ కో సిద్దమైనట్లు సమాచారం. అతడి స్దానంలో స్పెషలిస్ట్ బ్యాటర్గా రిషబ్ పంత్ లేదా తిలక్ వర్మను తీసుకోవాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తుందంట. మరోవైపు తీవ్ర నిరాశపరుస్తున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణను కూడా తప్పించనున్నట్లు తెలుస్తోంది. అతడి స్దానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్కు అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటింగ్తో పాటు మీడియం పేస్తో బౌలింగ్ కూడా చేయగలడు. ఎలాగో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు. అంతేకాకుండా యశస్వి జైశ్వాల్పై కూడా వేటు పడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. జైశ్వాల్ రెండు వన్డేలలోనూ దారుణంగా విఫలమయ్యాడు. కాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు రాయ్పూర్ వన్డేలో ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు.సౌతాఫ్రికాతో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ/ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్చదవండి: ‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మినందుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’ -
‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మారు.. క్రెడిట్ ఇవ్వాల్సిందే’
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడిన జట్టునే.. రెండో వన్డేలోనూ కొసాగించింది టీమిండియా యాజమాన్యం. ఫలితంగా మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది.సెంచరీతో అదరగొట్టాడుఈసారి రుతురాజ్ ఎలాంటి తప్పిదమూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్పూర్ మైదానంలో శతక్కొట్టిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ (Ruturaj Gaikwad)... మొత్తంగా 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు రాబట్టాడు.సాధారణంగా రుతురాజ్ ఓపెనింగ్ బ్యాటర్గా వస్తాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా ఈసారి అతడు మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గైర్హాజరీ కారణంగా రుతుకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రిషభ్ పంత్ (Rishabh Pant) నుంచి గట్టి పోటీ ఉన్నా.. యాజమాన్యం అనూహ్య రీతిలో తుదిజట్టులోనూ అతడిని ఆడించింది.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ విషయంలో మేనేజ్మెంట్కు తప్పక క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తిలక్, పంత్ ఉన్నా.. ‘‘ఒక్క మ్యాచ్తో ఏ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేడు. కాబట్టే రుతురాజ్కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఇందుకు యాజమాన్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తిలక్ వర్మ , రిషభ్ పంత్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్నా రుతుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అతడిని నాలుగో స్థానంలో పంపినా సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ముందు కూడా అతడిని జట్టులో కొనసాగిస్తే టాపార్డర్లో ఉంటాడా? లేదంటే నాలుగో స్థానంలో ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.తనను ఏ స్థానంలో ఆడించినా పర్లేదనే సంకేతాన్ని రుతురాజ్ సెలక్టర్లకు ఇచ్చేశాడు. కాబట్టి మూడో వన్డేలోనూ అతడిని తప్పక కొనసాగిస్తారనే భావిస్తున్నా’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.దురదృష్టవశాత్తూకాగా రాంచి వేదికగా తొలి వన్డేలో రుతు 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో రుతు ఇచ్చిన క్యాచ్ను డెవాల్డ్ బ్రెవిస్ సంచలన రీతిలో ఒంటిచేత్తో అందుకుని.. అతడికి రీఎంట్రీలో చేదు అనుభవం మిగిల్చాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓడింది. ఫలితంగా ప్రస్తుతం 1-1తో ఇరుజట్లు సమానంగా ఉండగా.. విశాఖపట్నంలో శనివారం జరిగే మూడో వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్గానూ సరైనోడు! -
భారత్పై అదరగొట్టాడు.. ఐసీసీ అవార్డు రేసులోకి వచ్చాడు
సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో తన అద్భుత ప్రదర్శన కారణంగానే అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.అతడితో పాటు ఈ జాబితాలో బంగ్లా దేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్తాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత నుంచి మెన్స్ క్రికెటర్ ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం.దుమ్ములేపిన హార్మర్..సైమన్ హార్మర్ ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్తో జరిగిన సిరీస్లో అతడు బంతితో మ్యాజిక్ చేశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.హార్మర్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టి భారత్ గడ్డపై దక్షిణాఫ్రికా చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పాక్తో సిరీస్లో కూడా హార్మర్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ నామినేట్ అయ్యింది. గత నెలలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లలో షెఫాలీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ ఫైనల్లో పోరులో బ్యాటింగ్లో 87 పరుగులు చేసిన షెఫాలీ.. అనంతరం బౌలింగ్లో సునే లూస్, మరిజానే కాప్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు ఈ లిస్ట్లో థాయ్లాండ్కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.చదవండి: ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా? -
ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా?
భారతదేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే.. సగటు అభిమాని ఎగిరి గంతేయడం ఖాయం. అయితే, అందుకోసం టికెట్లు సంపాదించే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించడం విచారకరం. ఒడిషాలోని కటక్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.ఆల్ ఫార్మాట్ సిరీస్లతో బిజీటీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో ఆల్ ఫార్మాట్ సిరీస్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత టెస్టు సిరీస్లో ప్రొటిస్ జట్టు చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. రాంచి వేదికగా తొలి వన్డేలో గెలిచింది. అయితే, రాయ్పూర్లో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్ 1-1తో సమం కాగా.. విశాఖపట్నంలో జరిగే మూడో వన్డేతో సిరీస్ ఫలితం తేలనుంది. ఆఫ్లైన్ టికెట్ల కోసంఇక వన్డే సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. కటక్లోని బారాబతి స్టేడియంలో డిసెంబరు 9న జరిగే టీ20తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఆరంభంలో ఆన్లైన్లో టికెట్ల అమ్మకం చేపట్టగా.. త్వరితగతిన సేల్ ముగిసిపోయింది.ఈ క్రమంలో ఆఫ్లైన్ టికెట్ల కోసం శుక్రవారం అభిమానులు పెద్ద ఎత్తున బారాబతి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందురోజు రాత్రి 11. 30 నిమిషాలకే కొంతమంది స్టేడియం వద్దకు చేరుకోవడం గమనార్హం.ఏకంగా రూ. 11 వేలకు కూడా..స్థానిక ఒడిశా టీవీ కథనం ప్రకారం.. భారత్- సౌతాఫ్రికా టీ20 మ్యాచ్కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో బ్లాకులో టికెట్లు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని సుమారుగా ఆరు వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్ల విక్రయం జరిగినట్లు సమాచారం.ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంటే.. మరోవైపు ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి టికెట్ల కోసం అభిమానులు ప్రాణాలకు తెగించడం గమనార్హం. టికెట్ల కోసం స్టేడియం వద్ద పరుగులు తీస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఇదేం పిచ్చి?.. ప్రాణాలంటే కూడా లెక్కలేదా? మ్యాచ్ చూడటం వల్ల ఒరిగే లాభం ఏమిటి?’’ అని కొంతమంది నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.బీసీసీఐ ఏం చేస్తోంది?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విధానం ప్రకారం.. వంద శాతం టికెట్లను ఆన్లైన్లో అమ్మడానికి వీలులేదు. కొద్దిమేర టికెట్లు కచ్చితంగా ఆఫ్లైన్లో విక్రయించాల్సిన పరిస్థితుల్లో కొన్ని క్రికెట్ అసోసియేషన్లు ఇందుకు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నాయి. దీంతో తొక్కిసలాట జరిగే దుస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో వంద శాతం టికెట్లు ఆన్లైన్లో విక్రయించి.. టికెట్తో పాటు సరైన ఐడీ ప్రూఫ్ ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్గానూ సరైనోడు!Massive turnout at Barabati Stadium today as fans line up for India–South Africa T20 tickets.One hopes @dcp_cuttack, @cpbbsrctc & @Satya0168 have ensured proper crowd-control arrangements, because the visuals below tell a different story--something essential is missing to keep… pic.twitter.com/heRx96QDFT— Soumyajit Pattnaik (@soumyajit) December 5, 2025 -
'ఒకప్పుడు వరల్డ్ నంబర్ వన్.. ఇప్పుడు జట్టులో నో ఛాన్స్'
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండో వన్డేల్లోనూ మన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు.సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సిరీస్కు వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ఫిట్నెస్ లోపం పేరిట జట్టులోకి తీసుకోవడం లేదు. మరి సిరాజ్ను ఎందుకు తీసుకోలేదో సెలక్టర్లు స్పష్టత ఇవ్వలేదు.ఆసీస్తో వన్డే సిరీస్లో ఆడిన సిరాజ్.. సఫారీలతో వన్డేలకు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ ఇప్పటివరకు ఒకే వన్డే సిరీస్ ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. సిరాజ్ కేవలం ఒక-ఫార్మాట్ ఆటగాడిగా మార్చడంపై నిరాశ వ్యక్తం చేశాడు. హైదరాబాదీ కేవలం టెస్ట్ క్రికెట్కు మాత్రమే పరిమితం కావడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని చోప్రా తెలిపాడు."మహ్మద్ సిరాజ్ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు? సెలక్టర్ల వ్యూహాలు ఏంటో ఆర్ధం కావడం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్గా ఉంటాడు. అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సిరాజ్.. వన్డేల్లో ఆడలేడా? ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేయకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఎందుకంటే అతడు కొన్నాళ్ల పాటు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్గా కొనసాగాడు. అటువంటి బౌలర్ ఇప్పుడు జట్టులోనే లేకుండా పోయాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ లాంటి బౌలర్లకు తరుచూ జట్టులో చోటు దక్కుతుంది. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్టులో కన్పించడం లేదు. అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిదు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయరయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20లకు ప్రకటించిన భారత జట్టులోనూ సిరాజ్కు చోటు దక్కలేదు.చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్గానూ సరైనోడు! -
"బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..": రియాన్ పరాగ్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కు (Riyan Parag) చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై రియాన్ తాజాగా స్పందించాడు. భారత జట్టులో స్థానం దక్కనందుకు నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.గతేడాది అక్టోబర్లో చివరిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్గా ఉన్నప్పుడు తాను రెండు వైట్ బాల్ ఫార్మాట్లు ఆడగల సమర్దుడినని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.రియాన్ మాటల్లో.. "నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకమనుకోండి లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు రెండు వైట్బాల్ ఫార్మాట్లలో ఆడగలను"ఫామ్ పెద్ద సమస్య కాదుప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాలీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐదు మ్యాచ్ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్ స్పందించాడు.ఫామ్ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్నెస్ సాధిస్తే అదంతటదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.బాత్రూంలో కూర్చొని ఏడ్చానుఇదే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను.ఈ ఫామ్తో ఐపీఎల్కు సంబంధం లేదుసయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫామ్తో ఐపీఎల్ ఫామ్కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే. పరుగులు చేయలేకపోతే ఐపీఎల్లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్ అభిప్రాయపడ్డాడు.కాగా, 24 ఏళ్ల రియాన్ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్తో జరిగిన T20 సిరీస్లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్లోని ఐదు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు.సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా సీఎస్కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. గత సీజన్లో అతను కొన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ కూడా చేశాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా రియాన్ ఐపీఎల్ 2025లో పర్వాలేదనిపించాడు. 32 సగటున 393 పరుగులు చేశాడు. -
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్గానూ సరైనోడు!
జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్ కీపర్గానూ సేవలు అందించాడు.తరచూ మార్పులుఅయితే, తర్వాతి కాలంలో రాహుల్ (KL Rahul) తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్ బ్యాటర్గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత రాహుల్కు టెస్టుల్లో ఓపెనర్గా వరుస అవకాశాలు వస్తున్నాయి.కీపింగ్ బాధ్యతలు కూడా.. ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్ బ్యాటర్గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు తాత్కాలిక కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు.సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రాహుల్. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లి (135)తో రాహుల్ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందిరాహుల్ విలువైన ఇన్నింగ్స్ఇక ఈ మ్యాచ్లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్లోనూ బ్యాటర్గా, కెప్టెన్గా రాహుల్ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు నిజానికి టీమిండియా కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్గా రాహుల్ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
రిషభ్ పంత్ చేసిన పనికి.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బ్యాట్తో పరుగుల వరద పారించే హిట్మ్యాన్.. సారథిగా గంభీరంగా కనిపిస్తూనే.. పరిస్థితులకు తగ్గట్లు నవ్వులు పూయించడంలోనూ ముందే ఉంటాడు. ఇక మైదానం వెలుపల సహచర ఆటగాళ్లతో రోహిత్ ఫ్రెండ్లీగా ఉంటాడనే విషయం అతడి అభిమానులకు బాగా తెలుసు.తానొక లెజెండరీ బ్యాటర్, కెప్టెన్ని అనే గర్వం రోహిత్ శర్మ (Rohit Sharma)లో అస్సలు కనిపించదు. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ముందుండే హిట్మ్యాన్.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించినా సరదాగానే ఉంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన ఇటీవల చోటు చేసుకుంది.మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా..టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో వరుస సిరీస్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉంది. ఆఖరి ఓవర్ ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 358 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.రాలిపడ్డ కనురెప్పఈ రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 57, 14 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడు, బెంచ్కే పరిమితమైన రిషభ్ పంత్ (Rishabh Pant).. రోహిత్ను ఆటపట్టించాడు. రోహిత్ కంటి నుంచి రాలిపడిన రెప్పను పట్టుకున్న పంత్.. అతడి చెయ్యిపై ఉంచి.. ఓ కోరిక కోరుకోమన్నాడు.ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?ఇందుకు నవ్వులు చిందించిన రోహిత్ అలాగే చేశాడు. వీరిద్దరు ఇలా సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో.. ‘ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై రోహిత్ శర్మ సన్నిహితుడు అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ వేదికగా స్పందించాడు.రెండే రెండు కోరికలు‘‘నాకు తెలిసి ప్రస్తుతం రోహిత్కు రెండే రెండు కోరికలు ఉండి ఉంటాయి. ఒకటేమో.. ‘నేను 2027 వన్డే వరల్డ్కప్ను నా చేతుల్లో పట్టుకోవాలి’ అని.. మరొకటి.. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ చేయాలని’’ అంటూ అభిషేక్ నాయర్.. రోహిత్ శర్మ మాటలను డీకోడ్ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య శనివారం విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన రోహిత్ శర్మను.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ తొలగించిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు రోహిత్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్తో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
-
'అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఇకనైనా మారండి'
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర స్టార్.. ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్ను మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ తన సత్తా నిరూపించుకున్నాడని, అతడికి వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మెనెజ్మెంట్ను సూచించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సఫారీలతో వన్డే సిరీస్కు దూరం కావడంతో రుతురాజ్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి.. రెండో వన్డేలో మాత్రం కమ్ బ్యాక్ ఇచ్చాడు. సెంచరీతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు."జట్టు సెలక్షన్ విషయంలో ఇకపై పెద్దగా ప్రయోగాలు చేయరని ఆశిస్తున్నాను . రతురాజ్ అద్భుతమైన ఆటగాడు. అతడికి మూడు ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. కచ్చితంగా రుతురాజ్ ఆల్ ఫార్మాట్ జట్టులో ఉండటానికి అర్హుడు. అతడికి అవకాశాలు ఇవ్వండి. టెస్టుల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పటికే రంజీ ట్రోఫీలో తనను నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్లో అయితే రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులోకి వచ్చి రాగానే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది.అతడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌతాఫ్రికా వంటి బౌలింగ్ అటాక్పై సెంచరీ కొట్టడం గొప్ప విషయం "అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా? -
సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?
రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 359 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు.పదే పదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్ను సఫారీ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ద్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి భారీగా పరుగులివ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ మధ్యలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ప్రసిద్ద్ కృష్ణపై అగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో ఎంతో ప్రశాతంగా ఉండే రాహుల్.. ప్రసిద్ద్ కృష్ణ చెత్త బౌలింగ్ కారణంగా తన సహనాన్ని కోల్పోయాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో ప్రసిద్ద్ షార్ట్ పిచ్ బంతులు ఎక్కువగా సంధించి బ్యాటర్లకు టార్గెట్గా మారాడు. ఈ క్రమంలో ప్రోటీస్ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన ప్రసిద్ద్.. టోనీ డి జోర్జి హెడ్ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు. అలా బౌలింగ్ చేయవద్దని రాహుల్ అంతకుముందే అతడికి చెప్పాడు. కానీ ప్రసిద్ద్ మరోసారి అలానే బౌలింగ్ చేయడంతో కేఎల్ తన నోటికి పనిచెప్పాడు. ప్రసిద్ద్ నీ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు. నేను చెప్పినట్లు చెయ్యి. ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాను కదా. అదే చేయ్యి అని రాహుల్ గట్టిగా అరుస్తూ ప్రసిద్ద్తో కన్నడలో అన్నాడు. అందుకు బదులుగా హెడ్ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయాలా అని ప్రసిద్ద్ బదులిచ్చాడు.అరే షార్ట్ పిచ్ బంతులు వేయాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడే చెప్పాను కదా. మళ్లీ అదే చేస్తున్నావు అని రాహల్ అన్నాడు. ఈ సంభాషణంతా స్టంప్ మైక్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతోంది. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ಪಂದ್ಯದ ನಡುವೆ Prasidh Krishna ಅವರಿಗೆ KL Rahul ರವರ ವಿಶೇಷ ಕಿವಿಮಾತು!👏🏻🗣📺 ವೀಕ್ಷಿಸಿ | #INDvSA 👉 2nd ODI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TeamIndia pic.twitter.com/OkNN2aqkMc— Star Sports Kannada (@StarSportsKan) December 3, 2025 -
సౌతాఫ్రికా సిరీస్కు ముందు దుమ్మురేపుతున్న సంజూ శాంసన్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్కు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్లతో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు.ఇదే ఫామ్ను సంజూ సౌతాఫ్రికా సిరీస్లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్కీపర్ బ్యాటర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్మన్ గిల్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశారెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.ముంబైని ఓడించిన తొలి మొనగాడుప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్లో బ్యాటర్గా, వికెట్కీపర్గా, కెప్టెన్గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్కీపింగ్లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్ దూబేను స్టంపౌట్ చేశాడు. ఈ వికెటే మ్యాచ్ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.స్కోర్ల వివరాలు..కేరళ-178/5ముంబై-163 ఆలౌట్ -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్ల్లో ఆడేందుకు హిట్మ్యాన్ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్కు చేరువైంది.ఇప్పటికే స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్మ్యాన్ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముంబైకి టైటిల్ అందించాడు.ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?ఈ సీజన్లో ముంబై ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్లో ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.ఇదిలా ఉంటే, టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్లో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన హిట్మ్యాన్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6 విశాఖ వేదికగా జరుగనుంది.సిరీస్ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. -
మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి వారి జట్టును గెలిపించుకున్నారు. టీమిండియా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే సవాలక్ష కనిపిస్తున్నాయి.టాస్తో మొదలుపెడితే.. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకం. గెలిచిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తడి బంతితో బ్యాటర్లను నియంత్రించడం దాదాపు అసాధ్యం. అందుకే అంతటి భారీ లక్ష్యాన్ని అయినా దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. టీమిండియా కెప్టెన్ రాహుల్ టాస్ కోల్పోయిన వెంటనే సగం మ్యాచ్ను కోల్పోయాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతనే స్వయంగా అంగీకరించాడు.లోయర్ ఆర్డర్ వైఫల్యంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా టీమిండియా భారీ స్కోరే చేయగలిగింది. వాస్తవానికి ఇంకాస్త భారీ స్కోర్ రావాల్సి ఉండింది. అయితే డెత్ ఓవర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా టీమిండియా పుట్టి ముంచారు. వీరిద్దరు చాలా నిదానంగా ఆడి అదనంగా రావాల్సిన 20-30 పరుగులకు అడ్డుకట్ట వేశారు. సుందర్ అయితే మరీ దారుణంగా ఆడి 8 బంతుల్లో కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. జడ్డూ.. తానేమీ తక్కువ కాదన్నట్లు 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడుంటే స్కోర్ 380 దాటేది. ఈ స్కోర్ చేసుంటే టీమిండియా డిఫెండ్ చేసుకోగలిగేదేమో.మంచు ప్రభావంముందుగా అనుకున్నట్లుగానే రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం చాలా తీవ్రంగా ఉండింది. ఆదిలో కాస్త తక్కువగా ఉన్నా చీకటి పడే కొద్ది దాని ప్రభావం అధికమైంది. దీంతో బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సునాయాసంగా వచ్చాయి. ఫీల్డర్ల వైఫల్యాలు దీనికి అదనం. దేశంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్లు కూడా మిస్ ఫీల్డ్ చేశారు. సెంచరీ వీరుడు మార్క్రమ్ క్యాచ్ను జైస్వాల్ నేలపాలు చేయడం భారత ఓటమిని ప్రభావితం చేసింది.బ్రెవిస్ డ్యామేజ్బ్రెవిస్ ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావడం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణం. ఈ డాషింగ్ బ్యాటర్ వచ్చీరాగానే భారత బౌలర్లపై ఎదురుదాడికి దాగాడు. ఏ బౌలర్ను కుదురుకోనివ్వలేదు. విధ్వంసకర బ్యాటింగ్తో లక్ష్యాన్ని కరిగించాడు. పైగా అతను క్రీజ్లోకి రాగానే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ తప్పిదం చేశాడు. తొలి వన్డేలో బ్రెవిస్ను ఔట్ చేశాడని హర్షిత్ రాణాను బరిలోకి దించాడు. అసలే హర్షిత్పై కసితో రగిలిపోతున్న బ్రెవిస్కు ఇది బాగా కలిసొచ్చింది. హర్షిత్తో పాటు మిగతా బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. తొలి వన్డేలో బ్రెవిస్ను ఔట్ చేసిన అనంతరం హర్షిత్ అతని పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?టీమిండియా మరో 20-30 పరుగులు చేసుంటే గెలిచేదని కేఎల్ రాహుల్ సహా చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి సఫారీలు ఉన్న ఊపుకు 380 స్కోర్ కూడా చాలేది కాదు. వాళ్లు లక్ష్యాన్ని ఛేదించాలన్న టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగలేదు. మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మాత్రమే బరిలోకి దిగారు. ఒకవేళ భారత్ 380 పరుగులు చేసినా వారి లక్ష్యం మారేది కాదు. లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగంగానే వారికి ఈ విజయం దక్కింది. అది 380 అయినా 420 అయినా వాళ్లు ఓటమినైతే ఒప్పుకునే వారు కాదు. వారి పోరాటాలు ఎలా ఉంటాయో జతమంతా చూసింది. -
ఆ వ్యూహం పని చేసింది.. అద్భుతంగా ఆడాం..!
రాయ్పూర్ వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్, కోహ్లి సెంచరీల సాయంతో టీమిండియా భారీ స్కోర్ (358) చేసినా, మంచు ప్రభావం కారణంగా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది.సఫారీలు బౌలింగ్లో విఫలమైనా, బ్యాటింగ్లో అదరగొట్టి రికార్డు లక్ష్యాన్ని ఛేదించారు (4 బంతులు మిగిలుండగానే). మార్క్రమ్ సూపర్ సెంచరీతో.. బ్రెవిస్ మెరుపు విన్యాసాలతో.. బవుమా, బ్రీట్జ్కే, కార్బిన్ బాష్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో సౌతాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) హర్షం వ్యక్తం చేశాడు. నమ్మశక్యంకాని మ్యాచ్గా అభివర్ణించాడు. రికార్డు ఛేదన అంటూ సహచరులను కొనియాడాడు. మార్క్రమ్, బ్రీట్జ్కే, బ్రెవిస్, బాష్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా బ్రెవిస్ను ఆకాశానికెత్తాడు.బ్రెవిస్ను బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు పంపిన వ్యూహం పని చేసిందని చెప్పుకొచ్చాడు. కీలకమైన భాగస్వామ్యాలు గెలుపుకు కారణమయ్యాయని అభిప్రాయపడ్డాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటను చివరి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు.ఎంతటి భారీ లక్ష్యమైనా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై నమ్మకముంచితే గెలుపు సాధ్యమని అభిప్రాయపడ్డాడు. కార్బిన్ బాష్ చివర్లో పరిపక్వత చూపాడని ప్రశంసించాడు. బౌలింగ్ ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. బర్గర్, జోర్జి గాయాల అప్డేట్ ఏంటనే అంశంపై స్పందిస్తూ.. తానేమీ డాక్టర్ను కానని వ్యంగ్యంగా అన్నాడు.మొత్తంగా ఈ విజయం జట్టుకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో సిరీస్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చామని అన్నాడు. కాగా, గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన బవుమా ఈ మ్యాచ్తోనే తిరిగి బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన జట్టును గెలిపించాడు. ఇటీవలికాలంలో బవుమా విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. అతనాడిన ప్రతి మ్యాచ్లోనూ దక్షిణాఫ్రికా గెలుస్తుంది. టెస్ట్ల్లో అయితే అతనికి తిరుగేలేదు. వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉన్నా జట్టును మాత్రం విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే.."ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్, డ్యూ కొంపముంచాయి. రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం. -
IND vs SA: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.ప్రోటీస్ ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 110) సూపర్ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖరిలో కార్బిన్ బాష్(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్ ఆడాడు.ఈ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్దీప్ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. మిస్ ఫీల్డ్ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.కోహ్లి, రుతు సెంచరీలు వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది. -
భారత జట్టు నుంచి ఫినిషర్ అవుట్.. కారణమెవరు?
టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ను టీ20 వరల్డ్కప్-2026కు పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.రింకూ ఔట్.. హార్దిక్ ఇన్అతడి స్ధానంలో జట్టులోకి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగొచ్చాడు. ఈ జట్టు సెలక్షన్ను బట్టి రింకూ పొట్టి ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. రింకూ చివరగా భారత్ తరపన ఆసియాకప్-2025లో ఆడాడు.పాక్తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ రన్స్ అతడే కొట్టాడు.అయితే వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గాయం కాకపోయి ఉంటే రింకూకు తుది జట్టులో దక్కకపోయేది. ఇప్పుడు పాండ్యా గాయం నుంచి కోలుకోని తిరిగి రావడంతో రింకూను పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించారు. బహుశా రింకూ తరుచుగా చెప్పే విధంగా దేవుని ప్లాన్ అయి వుంటుంంది.గంభీర్ కారణమా?రింకూ గత కొన్ని టీ20 సిరీస్లగా జట్టుతో పాటు ఉన్నప్పటికి తుది జట్టులో మాత్రం పెద్దగా చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్రౌండర్ల మొగ్గు చూపడంతో రింకూ చాలా మ్యాచ్లలో బెంచ్కే పరిమితమయ్యాడు. అతడికి బదులుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు ప్లేయింగ్ ఎలెవన్లో టీమ్ మెనెజ్మెంట్ చోటు కల్పిస్తోంది.అతడు ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. మొన్నటివరకు ముఖ్యమైన 'ఫినిషర్'గా పరిగణించబడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే లేకుండా పోయాడు. అయితే టీ20 వరల్డ్కప్-2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో మంచి స్పిన్నర్లు, స్పిన్ను ధీటుగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి. వాషింగ్టన్, దూబేలు స్పినర్లకు బాగా ఆడగలరు. అంతేకాకుండా వాషింగ్టన్ బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. సుందర్, దూబే ప్రధాన జట్టులో ఉన్నప్పటికి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరూ స్పిన్నర్లు ఎలాగానూ తుది జట్టులో ఉంటారు. బహుశా అందుకే రింకూను టీ20 ప్రపంచకప్ సెటాప్ నుంచి తప్పించండొచ్చు. అంతే తప్ప రింకూపై వేటు వెనక మరే ఏ ఇతర కారణం లేకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే రుతురాజ్ను మేనేజ్మెంట్.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్పూర్లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్లు జరుగగా.. కివీస్తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్లో రుతురాజ్తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన -
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.హార్దిక్ రీఎంట్రీ.. రింకూపై వేటుఇక వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ఫిట్నెస్ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్ (Rinku Singh)పై ఈసారి వేటుపడటం గమనార్హం. ఇవి తప్ప రెగ్యులర్ టీ20 జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.టెస్టులలో వైట్వాష్.. వన్డేలలో జోరుకాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్లో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్తో వన్డే సిరీస్ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్.. టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
సౌతాఫ్రికాకు భారీ షాక్
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. ఆ ఓవర్లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేందుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.అయితే టీ20 సిరీస్కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.భారత్ భారీ స్కోర్..ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
శతక్కొట్టిన రుతురాజ్, కోహ్లి.. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (102), రుతురాజ్ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) రనౌట్ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్.. ప్రొటిస్పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్-5 జాబితా🏏గ్వాలియర్ వేదికగా 2010లో 401/3🏏రాయ్పూర్ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్పూర్లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్టేజ్’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్ అయ్యాడు.అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025మొత్తంగా రాయ్పూర్లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్లో.. ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి రెండో వికెట్కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.అనంతరం తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 101 నాటౌట్🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు🏏రాయ్పూర్ వేదికగా 2025లో 102 పరుగులుచదవండి: IND vs SA: గంభీర్ నమ్మకమే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్ -
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా విరాట్కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆరంభంలోనే రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..వన్డేల్లో అత్యధిక సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 32 సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని మరొక ఆటగాడితో కలిసి నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.టీమిండియా భారీ స్కోరుఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్) సాధించాడు.Play it on loop ➿Just like Virat Kohli 😎💯Yet another masterful knock! 🫡 Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025 -
గంభీర్ నమ్మకమే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్ను ఈ మహారాష్ట్ర బ్యాటర్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి.జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడురుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్-ఎ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్తో తొలి వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.దీంతో అతడిని రెండో వన్డేకు పక్కన పెట్టాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓవరాల్గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కోహ్లి(102) కూడా శతక్కొట్టాడు.భారీ స్కోర్ దిశగా భారత్..రాయ్పూర్ వన్డేలో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(43), జడేజా(9) ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.రెండో వన్డేలోనూ దూకుడుఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్పూర్ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లియాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్ నమోదు చేయగా.. సచిన్ టెండుల్కర్ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.కోహ్లి- రుతు ధనాధన్మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, నాలుగో నంబర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీచదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్ -
అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో అతడికి ఇప్పటికే రెండు చేదు అనుభవాలు చవిచూశాడు. గంభీర్ మార్గదర్శనంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 3-0తో వైట్వాష్కు గురైంది.గంభీర్ టెస్టు కోచ్గా పనికిరాడంటూ..భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా ఓ విదేశీ జట్టు చేతిలో మన జట్టు మూడు మ్యాచ్ల సిరీస్లో క్లీన్స్వీప్ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని కోల్పోయింది. ఆసీస్ చేతిలో 3-1తో ఓడి ఇంటిబాట పట్టింది.ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో టెస్టు సిరీస్ను సమం చేసిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్ టెస్టు కోచ్గా పనికిరాడని.. అతడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్లు పెరిగాయి.బీసీసీఐదే నిర్ణయంఈ విషయంపై గంభీర్ (Gautam Gambhir) స్వయంగా స్పందిస్తూ.. తన హయాంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, ఆసియా టీ20 కప్-2025లో జట్టు గెలిచిందని పేర్కొన్నాడు. తనను కోచ్గా కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకుంటుందని స్పష్టం చేశాడు.అదే జరిగితే నీపై వేటు వేస్తారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ప్రభాత్ ఖబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ భవితవ్యం గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘మన ప్రదర్శన బాగా లేకుంటే.. కచ్చితంగా మనపై వేటు వేస్తారు. పదవి నుంచి తొలగిస్తారు.పరస్పర సమన్వయం, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఇక్కడ అత్యంత ముఖ్యం. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటేనే అంతా సాఫీగా సాగిపోతుంది. గెలిచేలా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలి. కోచ్లుగా మా పని అదే. అయితే, మనం చేసే పని పట్ల ఇష్టం ఉండాలి. దానిని ఆస్వాదించాలి. అంతేగానీ ఒత్తిడిగా ఫీలవ్వకూడదు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అయిన రవిశాస్త్రి.. 2017- 2021 వరకు భారత జట్టు హెడ్కోచ్గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శనంలోనే తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలు గెలిచింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. రవిశాస్త్రి- నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి కాంబినేషన్లో టెస్టుల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా అగ్రపీఠానికి చేరుకుంది.చదవండి: హర్షిత్ రాణాకు బిగ్ షాక్ -
హర్షిత్ రాణాకు బిగ్ షాక్
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) భారీ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా డెవాల్డ్ బ్రెవిస్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ ఆగ్రహించింది. ఓ డిమెరిట్ పాయింట్ జోడించి, 24 నెలల్లో మొదటి తప్పిదం కావడంతో మందలింపు వదిలేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇంతకీ ఏం జరిగిందంటే.. రాంచీ వేదికగా నవంబర్ 30న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఆ మ్యాచ్లో బ్రెవిస్ను ఔట్ చేసిన తర్వాత అత్యుత్సాహానికి లోనైన హర్షిత్ ఆగ్రహపూరితమైన సెండ్ ఆఫ్ గెశ్చర్ (డ్రెస్సింగ్రూమ్ వైపు చూపిస్తూ వెళ్లు అన్నట్లు సైగ చేశాడు) ఇచ్చాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇలాంటి దురుసు ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గత 24 నెలల్లో హర్షిత్ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో భారీ మూల్యాన్ని తప్పించుకున్నాడు.ఓవరాక్షన్కు తప్పదు మూల్యంవాస్తవానికి హర్షిత్కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేమీ కాదు. గతంలో ఐపీఎల్, దేశవాలీ టోర్నీల్లోనూ చాలా సందర్భాల్లో ఇలాగే ప్రవర్తించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆయుశ్ దోసేజా, ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు క్రికెట్ సమాజం అతనిపై దుమ్మెత్తిపోసింది. అయినా హర్షిత్ తన తీరు మార్చుకోకుండా డెవాల్డ్ బ్రెవిస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భవిష్యత్తులోనూ హర్షిత్ ఇలాంటి ప్రవర్తనే కొనసాగిస్తే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడి కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గతంలో చాలామంది క్రికెటర్లు ఇలాగే కెరీర్లను నాశనం చేసుకున్నారు. కాబట్టి హర్షిత్ ఇకనైనా ప్రవర్తన మార్చుకుంటే ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న కెరీర్ను కాపాడుకోగలుగుతాడు. తొలి వన్డేలో పర్వాలేదు ప్రస్తుతం హర్షిత్ సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో హర్షిత్ ఓ మోస్తరు ప్రదర్శనతో (10-1-64-2) పర్వాలేదనిపించాడు. ఇప్పుడిప్పుడే ఈ యువ పేసర్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.కాగా, రాంచీ వన్డేలో భారత్ సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ మ్యాచ్లో విరాట్ సూపర్ సెంచరీ చేసి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఇవాళ రాయపూర్ వేదికగా రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే టీమిండియా కొనసాగించింది.దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాతో పాటు కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి తుది జట్టులోకి వచ్చారు. -
IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత తుదిజట్టు అదే!
భారత్తో రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్తో తిరిగి జట్టుతో చేరిన ప్రొటిస్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘వికెట్ పాత బడుతున్న కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం.అయితే, పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. గత మ్యాచ్లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. నాతో పాటు కేశవ్ మహరాజ్ (Keshav Maharan), లుంగి ఎంగిడి తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ మాకెంతో కీలకమైనది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత్తో తొలి వన్డేలో విఫలమైన సఫారీ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్పై వేటు పడగా.. పేసర్లు ప్రెనేలన్ సుబ్రేయన్, ఒట్నీల్ బార్ట్మన్ తమ స్థానాలు కోల్పోయారు.తుది జట్టులో మార్పులు లేవుమరోవైపు.. మరోసారి టాస్ ఓడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేకపోతున్నాం. ఏదేమైనా గత మ్యాచ్లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది.పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలము.ఈ వికెట్ బాగుంది. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు. ఆధిక్యంలో టీమిండియాకాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రాంచి వేదికగా ఆదివారం తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది.ఈ మ్యాచ్లో భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli) శతక్కొట్టడం (135), రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) రాణించడం హైలైట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనూ రో-కో ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు మరోసారి చితక్కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో వన్డే తుదిజట్లు👉వేదిక: షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్పూర్👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికా తుదిజట్టుక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ప్లేయర్ -
భారీ మైలురాయిపై కన్నేసిన రోహిత్ శర్మ
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 3) రెండో వన్డే జరుగనుంది. రాయ్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు ముందు భారత వెటరన్ స్టార్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో అతను 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 20000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 13 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో భారత్కు చెందిన వారే ముగ్గురున్నారు (సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్). వీరిలో సచిన్ అందరి కంటే ఎక్కువగా 34357 పరుగులు చేసి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..సచిన్-34357సంగక్కర-28016కోహ్లి-27808పాంటింగ్-27483జయవర్దనే-25957కల్లిస్-25534ద్రవిడ్-24208లారా-22358రూట్-21774జయసూర్య-21032చంద్రపాల్-20988ఇంజమామ్-20580డివిలియర్స్-20014కాగా, టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్ సెంచరీ, ఓ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్లోనూ అదిరిపోయే అర్ద సెంచరీతో అలరించాడు. ప్రస్తుత రోహిత్ ఫామ్ను బట్టి చూస్తే.. ఇవాల్టి మ్యాచ్లో 20000 పరుగుల మార్కును చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు. -
అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?
రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 అధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్లో గెలుపొందినప్పటికి జట్టు ఎంపికపై మాత్రం స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.రాంచీ వన్డేలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడాన్ని అశ్విన్ తప్పు బట్టాడు. ఆసియాకప్లో గాయపడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో వన్డేలకు నితీశ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే తొలి వన్డే తుది జట్టులో నితీశ్ ఉంటాడని అంతా భావించారు. కానీ టీమ్ మెనెజెమెంట్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్లో నితీశ్ బదులుగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశమిచ్చింది. కానీ సుందర్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో వన్డేలోనైనా నితీశ్ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు."జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికి అతడిని బెంచ్కే పరిమితం చేస్తే కచ్చితంగా టీమ్ సెలక్షన్లో తప్పుందనే చెప్పాలి. తుది జట్టులో ఆడించినప్పుడు నితీశ్ను ఎందుకు ఎంపిక చేశారు? హార్దిక్ ఏమి చేయగలడో నితీశ్ కూడా అదే చేయగలడు. అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. కానీ అతడు ఎక్కువ శాతం బెంచ్కే పరిమితం చేస్తున్నారు. అటువంటి అప్పుడు అతడి ప్రధాన జట్టుకే ఎంపిక చేయడం మానేయండి" అని తన యూట్యూబ్ ఛానల్లో అశూ పేర్కొన్నాడు.చదవండి: Ashes 2025-26: అనుకున్నదే జరిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్ -
సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బుధవారం(డిసెంబర్ 3) రాయ్పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా మాత్రం తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాకు ఓ గుడ్ న్యూస్ అందింది.వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తిరిగి తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. వీరిద్దరి రాకతో క్వింటన్ డికాక్, ప్రేనేలన్ సుబ్రాయెన్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. ఈ ఇద్దరు ప్రోటీస్ ఆటగాళ్లు తొలి వన్డేలో దారుణంగా విఫలమయ్యారు. ఇక రాంచీ వన్డేలో బవుమా గైర్హజరీలో ప్రోటీస్ కెప్టెన్గా ఐడైన్ మార్క్రమ్ వ్యవహరించాడు. ఇప్పుడు రెండో వన్డేలో బవుమా తిరిగి జట్టు పగ్గాలను చేపట్టడం దాదాపు ఖాయం. పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు ముందు బవుమా ఎడమ కాలి గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు పాక్ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు.ఆ తర్వాత అతడు భారత్తో టెస్టు సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడి నాయకత్వంలోనే ప్రోటీస్ జట్టును భారత్తో టెస్టు సిరీస్ను వైట్ వాష్ చేసింది. బవుమా ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడు. కానీ తర్వాత వరుస సిరీస్ల నేపథ్యంలో అతడికి తొలి వన్డేకు విశ్రాంతి ఇచ్చారు. కానీ ఇప్పుడు సిరీస్లో సౌతాఫ్రికా 1-0 వెనకంజలో ఉండడంతో అతడి పునరాగమనం అనివార్యమైంది.రెండో వన్డేకు సౌతాఫ్రికా తుది జట్టు: ర్యాన్ రికెల్టన్, ఐడైన్ మార్క్రమ్, టెంబా బవుమా, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాంద్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్మాన్చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్కు ఛాన్స్? -
ఒక్క మ్యాచ్కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్కు ఛాన్స్?
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక ప్రోటీస్ జట్టును 17 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికి సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రాహుల్ సేన ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది.జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో జాన్సెన్, బాష్ జోరు చూస్తే సఫారీలదే మ్యాచ్ అన్నట్లు అన్పించింది. కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మయాజాలంతో ఓటమి నుంచి మెన్ బ్లూ గట్టెక్కింది.అదేవిధంగా రాంచీ వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(13) కూడా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు.వారిద్దరిపై వేటు.. ఈ నేపథ్యంలో బుధవారం రాయ్పూర్ వేదికగా సఫారీలతో జరిగే రెండో వన్డేలో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, సుందర్లపై వేటు వేసేందుకు మెనెజ్మెంట్ సిద్దమైనట్లు సమాచారం.రుతు స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, సుందర్ స్ధానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పంత్ గతేడాది చివరగా భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఈ డేంజరస్ బ్యాటర్ బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. గత మ్యాచ్లో సుందర్ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. జట్టులో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా ఉండడంతో సుందర్ను బెంచ్కు పరిమితం చేయాలని గంభీర్ యోచిస్తున్నట్లు సమాచారం. నితీష్ బ్యాట్తో పాటు మీడియం పేస్ బౌలర్గా కూడా తన సేవలను అందించనున్నాడు. అయితే సఫారీలతో జరిగిన రెండో టెస్టులో మాత్రం నితీష్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్చదవండి: రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్! -
రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్- అగార్కర్కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్రూమ్లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్లాబీలో గంభీర్తో రోహిత్ సీరియస్గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025 -
గంభీర్, అగార్కర్లతో బీసీసీఐ అత్యవసర భేటీ!
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేలో కూడా ప్రోటీస్ను చిత్తు చేసి సిరీస్ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్తో పాటు మరికొంత మంది ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమికి గల కారణాలను, భవిష్యత్తు ప్రణాళికలను గంభీర్, అగార్కర్తో బీసీసీఐ చర్చించే అవకాశముంది.బీసీసీఐ సీరియస్?"హోమ్ టెస్టు సీజన్లో మాకు కొన్ని ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్లో మైదానంలోనూ, బయట కొన్ని గందరగోళ వ్యూహాలు కనిపించాయి. వాటిపై మాకు స్పష్టత కావాలి. మా తదుపరి టెస్టు సిరీస్కు ఇంకా ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది. అందుకోసం ముందుస్తు ప్రణాళికలను కోచ్, చీఫ్ సెలక్టర్ నుంచి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్లో కూడా టీమిండియా టైటిల్ ఫేవరేట్గా ఉంది. కాబట్టి ఈ రెండు మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోర్డు భావిస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా టీమ్మెనెజ్మెంట్కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మీటింగ్కు బీసీసీఐ కొత్త బాస్ మిథున్ మన్హాస్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సమావేశం మ్యాచ్ రోజే జరగనుండడంతో సీనియర్ ప్లేయర్లు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఇక టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్ కావడంతో గంభీర్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా డిమాండ్ చేశారు.గంభీర్ మాత్రం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటిలో గంభీర్ హెడ్కోచ్ పదవికి ఎటువంటి ముప్పులేదు. ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్-2027 వరకు భారత హెడ్ కోచ్గా కొనసాగే అవకాశముంది.చదవండి: వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్ -
వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.ఓ దశలో యాన్సెన్ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. బాష్ ఒంటరి పోరాటంఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్ వరకు బాష్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్ జోరు టీమిండియాను భయపెట్టింది. Game, set, match! 💪Prasidh Krishna bags the final wicket as #TeamIndia clinch a thrilling contest in Ranchi to go 1⃣-0⃣ up 🙌Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yHpkRnlEVk— BCCI (@BCCI) November 30, 2025 అయితే, ప్రసిద్ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్.. రెండో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..వాళ్ల పోరాటం అద్భుతం‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే. జాగ్రత్త అంటూ వార్నింగ్తదుపరి రెండు మ్యాచ్లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు. కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) రాణించగా.. విరాట్ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
'వారిద్దరూ అద్భుతం.. ఆడకపోతే వరల్డ్ కప్ను మరిచిపోవడమే'
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్ (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో వన్డే వరల్డ్కప్-2027లో ఈ వెటరన్ క్రికెటర్లు ఆడుతారా? అప్పటివరకు ఫిట్నెస్గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెటర్లు వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్ జోడీ అద్భుత ఇన్నింగ్స్లతో సమాధానమిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్ను గెలవడం అసాధ్యమని అతడు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వేరే లెవల్లో ఆడుతున్నారు. వీరిద్దరూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మనం వరల్డ్కప్ను గెలవలేం. కాబట్టి ఇకపై ప్రపంచకప్లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్నెస్గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతూ తమ రిథమ్ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్కప్లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కోహ్లి
సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పాత ‘కింగ్’ను గుర్తుచేశాడు. రాంచి వేదికగా ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతక్కొట్టాడు. వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసి.. సింగిల్ ఫార్మాట్లో అత్యధికసార్లు వంద పరుగుల మార్కు అందుకున్న ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు.తన ‘విన్’టేజ్ ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. టీమిండియా యాజమాన్యానికి కూడా తన ఫామ్ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో సఫారీలపై విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు‘‘నేను వందకు 120 శాతం ఫామ్తో తిరిగి వస్తానని ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచ్ కోసం నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేశాను. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు.నా శరీరానికి కూడా తగినంత విశ్రాంతి, రికవరీ కోసం సమయం కావాలి. ఆట ఎలా ఉండబోతుందో ముందుగానే నా మైండ్లోనే ఓ స్పష్టతకు వచ్చేస్తాను. ఈరోజు మ్యాచ్లో ఇలా ఆడటం అద్భుతంగా అనిపించింది. తొలి 20- 25 ఓవర్ల వరకు పిచ్ బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్ కాస్త నెమ్మదించింది.వెళ్లి బంతిని బాదడమే కదా అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటను పూర్తిగా ఆస్వాదించాను. చాలా ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నాను. గత 15-16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను.టచ్లో ఉన్నట్లే లెక్కప్రాక్టీస్లో మనం బంతిని హిట్ చేయగలిగామంటే టచ్లో ఉన్నట్లే లెక్క. సుదీర్ఘకాలం పాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయాలంటే శారీరకంగా ఫిట్గా ఉండటం ముఖ్యం. ఆటకు మానసికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.కేవలం గంటల కొద్ది సాధన చేస్తేనే రాణించగలము అనే మాటను నేను పెద్దగా నమ్మను. ముందుగా చెప్పినట్లు మానసికంగా సిద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ కఠినశ్రమ చేస్తాను. క్రికెట్ ఆడుతున్నాను కాబట్టే వర్కౌట్ చేయను. జీవితంలో ఇదీ ఒక భాగం కాబట్టే చేస్తాను.అప్పటి వరకు ఆడుతూనే ఉంటానాకు నచ్చినట్లుగా జీవిస్తాను. శారీరకంగా ఫిట్గా ఉండి.. మానసికంగా ఆటను ఆస్వాదించినన్ని రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటాను’’ అని కోహ్లి కుండబద్దలు కొట్టాడు. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చాడు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నుంచి వన్డే వరల్డ్కప్-2027 ఆడతామనే హామీ రాలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు. అయితే, రో-కో వన్డేల్లో వరుసగా సత్తా చాటుతూ తాము ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చాటి చెబుతున్నారు.తాజాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు చేయగా.. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 51 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా సఫారీలను 17 పరుగులతో ఓడించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్! A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 -
టీమిండియాకు శుభవార్త
టీమిండియాకు శుభవార్త. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం నుంచి కోలుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మెడ గాయం కారణంగా గిల్ దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్కి దూరమయ్యాడు. ఈ గాయం కారణగానే అతడు సౌతాఫ్రికాతో రెండో టెస్టు కూడా ఆడలేకపోయాడు. ఇవాళ (డిసెంబర్ 1) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తుంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపీ పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి, ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. వైద్యులు ఆయనకు ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గాయం తర్వాత బ్యాటింగ్కి దూరంగా ఉన్న గిల్, త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల చేసిన పలు విమాన ప్రయాణాల్లో గిల్కు ఎలాంటి అసౌకర్యం లేకపోవడం వైద్య బృందాన్ని ఉత్సాహపరుస్తోంది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లో గిల్ ఆడతాడా లేదా అన్నది రిహాబ్ ప్రోగ్రామ్లో అతని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో, రోహిత్, రాహుల్ అద్భుతమైన అర్ద శతకాలతో భారత్కు భారీ స్కోర్ అందించారు. ఆతర్వాత భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా అద్భుతంగా ప్రతిఘటించినా అంతిమంగా భారత్దే పైచేయి అయ్యింది. రెండో వన్డే రాయ్పూర్ వేదికగా డిసెంబర్ 3న జరుగనుంది. -
అస్తవ్యస్తంగా ఉన్న భారత మిడిలార్డర్కు శాశ్వత పరిష్కారమేది..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వెటరన్ స్టార్ విరాట్ కోహ్లి అద్భుత శతకంతో (135) చెలరేగి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.మరో వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (57), ఈ సిరీస్లో భారత కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ (60) కూడా తలో హాఫ్ సెంచరీ చేసి, గెలుపులో తనవంతు పాత్రలు పోషించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత శిబిరంలో గుబులు పుట్టించారు. అంతిమంగా భారత్దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది.సఫారీల ఆట కట్టించడంలో భారత బౌలర్లు కూడా తమవంతు పాత్ర పోషించారు. ఆదిలో అర్షదీప్, హర్షిత్ రాణా.. ఆఖర్లో కుల్దీప్ వికెట్లు తీసి సఫారీలను కట్టడి చేయగలిగారు. ఈ గెలుపుతో భారత్ టెస్ట్ సిరీస్లో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం ఓ లోపం స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్లో భారత్ అవసరం లేని ప్రయోగానికి పోయి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.సహజంగా ఓపెనింగ్, తప్పదనుకుంటే వన్డౌన్లో బ్యాటింగ్ చేసే రుతురాజ్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దించి చేతులు కాల్చుకుంది. వాస్తవానికి రుతురాజ్ను ఆ స్థానంలో బ్యాటింగ్కు దించే అవసరం లేదు. అప్పటికే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుండింది. రోహిత్ తర్వాత బరిలోకి దిగిన రుతు 14 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా సాధించలేక కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.రుతురాజ్ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. టెక్నికల్గా ఆలోచిస్తే, ఈ మ్యాచ్లో రుతురాజ్ కంటే తిలక్ వర్మ బెటర్ ఆప్షన్ అయ్యుండేవాడు. లేని పక్షంలో ఇన్ ఫామ్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా మంచి ఆప్షనే. వీరిద్దరిని కాదని భారత మేనేజ్మెంట్ రుతుకు ఎందుకు ఓటు వేసిందో అర్దం కావడం లేదు.లోతుగా పరిశీలిస్తే.. ఈ మధ్యకాలంలో భారత మిడిలార్డర్ (వన్డేల్లో) అస్వవ్యస్తంగా మారిపోయింది. ఏ మ్యాచ్లో ఎవరు, ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగుతారో ఎవరికీ అర్దం కాదు. శ్రేయస్ గాయపడిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాషింగ్టన్ సుందర్కు ప్రమోషన్ ఇచ్చి ఆడిస్తున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించినా, సౌతాఫ్రికా సిరీస్లో అతను లేడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ను స్థిరంగా ఆడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు. అయితే సందర్భానుసారం రాహుల్ తన స్థానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుతమైన అర్ద సెంచరీతో భారత్కు భారీ స్కోర్ను అందించాడు.ఇది తాత్కాలిక ఫలితమే కాబట్టి భారత మేనేజ్మెంట్ ఐదు, ఆరు స్థానాల కోసం స్థిరమైన బ్యాటర్లను చూసుకోవాలి. పంత్ సరైన అప్షనే అయినప్పటికీ.. కేఎల్ రాహుల్ వల్ల అది సాధ్యపడకపోచ్చు. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ధృవ్ జురెల్ బెటర్ ఆప్షన్ కావచ్చు. జురెల్ వికెట్కీపింగ్ బ్యాటర్ అయినప్పటికీ, అతన్ని స్పెషలిస్ట్ బ్యాటర్గా కొనసాగించినా నష్టం లేదు. పైగా అతను ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. లేదనుకుంటే రియాన్ పరాగ్, రింకూ సింగ్ కూడా మంచి ఆప్షన్సే. వీరిద్దరు కూడా ఈ స్థానాలకు న్యాయం చేసే అవకాశం ఉంది. రింకూతో పోలిస్తే పరాగ్కు ఆరో స్థానంలో అద్భుతంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలా అని రింకూని కూడా తీసి పారేయాల్సిన అవసరం లేదు. అతను కూడా చేయి తిప్పగల సమర్థుడే. ఒకవేళ హార్దిక్ పాండ్డా జట్టులోకి వచ్చినా ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే అతడు తరుచూ గాయాలతో సతమతమవుతుంటాడు. కాబట్టి రియాన్, రింకూలకు సరైన అవకాశాలు కల్పిస్తే దీర్ఘకాలం ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది. -
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
-
IND Vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు. అంతింగా భారత్దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఈ మ్యాచ్లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. రాంచిలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్లో టాస్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. రోహిత్, కోహ్లి, రాహుల్ ధనాధన్ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆదిలోనే షాకులుసౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను డకౌట్ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన క్వింటన్ డికాక్ను కూడా డకౌట్గా వెనక్కి పంపాడు. అదరగొట్టిన మాథ్యూ, యాన్సెన్మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్ జట్టును మాథ్యూ బ్రీట్జ్కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ యాన్సెన్ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఫర్వాలేదనిపించారు. భయపెట్టిన బాష్అయితే, సగం ఇన్నింగ్స్లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్ సుబ్రేయన్ (17), నండ్రీ బర్గర్ (17) ఆల్రౌండర్ కార్బిన్ బాష్తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. ప్రసిద్ కృష్ణ, రోహిత్ అద్భుతంఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్ గాల్లోకి లేపగా ఎక్స్ట్రా కవర్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక కీలక వికెట్ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ -
పొడిచేశావ్ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.ఎట్టకేలకు ఓ అవకాశంఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్.. రెండో మ్యాచ్లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్ పంత్కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్కు వచ్చాడు.ఊహించని రీతిలో షాక్నెమ్మదిగానే తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రుతురాజ్కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. భారత ఇన్నింగ్స్లో 27వ ఓవర్ను సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. అంతే.. ఇన్సైడ్ సర్కిల్ లోపల ఇంతలో బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడుబ్రెవిస్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్ ఆ క్యాచ్ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్లో ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం.. ఆ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టాడు.అలా బ్రెవిస్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ హైలైట్ కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేసిన పోస్టు వైరల్గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేసిన సీఎస్కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.Why, Brevis… why?Ruturaj was settling in so beautifully, playing with such calm and class —and then you flew in the air and snatched that catch out of nowhere.Brevis, you just broke the hearts of countless Rutu fans today. 💔pic.twitter.com/qEfyTuhfHC— Mahi Patel (@Mahi_Patel_07) November 30, 2025 పొడిచేశావు కదా కట్టప్పాతమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్కే ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్ మీమ్స్తో ఇద్దరినీ ట్రోల్ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్.. ఐపీఎల్లో రుతు కెప్టెన్సీలో సీఎస్కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్ను సీఎస్కే అట్టిపెట్టుకుంది కూడా!భారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.కష్టాల్లో సౌతాఫ్రికాలక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7), ర్యాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.అన్నట్లు హర్షిత్ రాణా బౌలింగ్లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్ను రుతురాజ్ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!Need a breakthrough? Call Harshit Rana! 📞A fine catch by Ruturaj as the dangerman Dewald Brevis departs 👏#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/w4PAuCIgUR— Star Sports (@StarSportsIndia) November 30, 2025 -
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!
‘‘వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాట ఇది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించిన అగార్కర్.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్ టూర్లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో అలరించాడు.రో- కో వన్డే భవితవ్యంపై చర్చమూడో వన్డేలో శతక్కొట్టి భారత్ను గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.ఇచ్చిపడేశారు భయ్యా!ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్, అగార్కర్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్- అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్ సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025ముఖం మీద కొట్టినట్లుగా ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. గంభీర్- అగార్కర్లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీRohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025 -
దంచికొట్టిన కోహ్లి, రోహిత్, రాహుల్.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ నమోదు చేసింది.రోహిత్ మెరుపు అర్ధ శతకంస్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) ధనాధన్ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.మరోవైపు.. రోహిత్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్మ్యాన్తో కలిసి రెండో వికెట్కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి రికార్డు సెంచరీఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 52nd ODI hundred for the King! 🤩👑Most in a single format in international cricket 🙌🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/DPYCzEZ72J— Star Sports (@StarSportsIndia) November 30, 2025రాణించిన జడేజామిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్ విధించింది.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). ఇంతకు ముందు 2010లో గ్వాలియర్ వేదికగా టీమిండియా ప్రొటిస్ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా? -
ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా..
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలురాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) 102 బంతుల్లో శతక మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సింగిల్ ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు.ఏకైక బ్యాటర్గాకాగా శతక శతకాల వీరుడు సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా.. కోహ్లి వన్డేల్లో 52వసారి వంద పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు.అంతేకాదు వన్డేల్లో భారత్లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి రాంచిలో ఐదు ఇన్నింగ్స్లో మూడు శతకాలు బాదగా.. సచిన్ వడోదరలో ఏడు ఇన్నింగ్స్లో మూడుసార్లు శతక్కొట్టాడు.అదే విధంగా.. సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ప్రొటిస్ జట్టుపై కోహ్లికి ఇది ఆరో శతకం. అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్, డేవిడ్ వార్నర్ (David Warner) పేరిట ఉండేది. వీరిద్దరు సౌతాఫ్రికాపై చెరో ఐదు శతకాలు బాదారు.అరుదైన నంబర్అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో కోహ్లి తాజాగా సాధించిన 83వ సెంచరీ (టెస్టుల్లో 30, వన్డేల్లో 52, టీ20లలో ఒకటి)కి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం దక్కనుంది. కోహ్లి హండ్రెడ్ బాదడంతో మెన్స్ క్రికెట్లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓవరాల్గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది. భారత్ స్కోరెంతంటే?కాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి మొత్తంగా 120 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన కోహ్లి.. కేఎల్ రాహుల్ (60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరితో పాటు రవీంద్ర జడేజా (32) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?.. ఫ్యాన్స్ ఫైర్ -
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. వన్డే రారాజుకు తిరుగులేదు
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి శతక్కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ శతకం. ఈ నేపథ్యంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు కోహ్లి.వింటేజ్ కింగ్ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఆసీస్తో మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్ను కొనసాగించాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ 102 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో 38వ ఓవర్లో ఐదో బంతికి మార్కో యాన్సెన్ బౌలింగ్లో ఫోర్ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.రోహిత్తో కలిసి ధనాధన్రాంచి వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి ఇన్నింగ్ నిర్మించాడు.రోహిత్ శర్మ అర్ద శతకం (57)తో సత్తా చాటగా.. అతడితో కోహ్లి రెండో వికెట్కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించాడు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లి మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కేఎల్ రాహుల్ కోహ్లికి తోడుగా నిలిచాడు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చిన కోహ్లి జోరు పెంచాడు. ఫలితంగా 41 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.చదవండి: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్ -
రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?
సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. చాన్నాళ్ల తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మెరుగ్గానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ నిలకడగా ముందుకు సాగలేకపోయాడు.ఈ నేపథ్యంలో జైస్వాల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో మాత్రం అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. టీ20లలో శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరైనా గైర్హాజరైతే మాత్రమే జట్టులో చోటు దక్కుతోంది.తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. రాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతికే ఫోర్ బాది సత్తా చాటిన జైసూ.. రెండో బంతిని కూడా బౌండరీకి తరలించాడు.ఆ తర్వాత సిక్సర్ బాది దూకుడు ప్రదర్శించిన జైస్వాల్కు ప్రొటిస్ పేసర్ నండ్రీ బర్గర్ చెక్ పెట్టాడు. నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బర్గర్... తొలి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా సంధించగా.. జైస్వాల్ గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ బంతిని ఒడిసిపట్టగా.. జైసూ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో జైస్వాల్పై విమర్శలు వస్తున్నాయి. రీఎంట్రీలో సత్తా చాటుతాడనుకుంటే.. నిరాశపరిచాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ జైసూ విఫలమైన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 12, 0, 58, 13. ప్రొటిస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ జైస్వాల్.. ఒక్క హాఫ్ సెంచరీతో సరిపెట్టాడు. -
రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.మూడు వన్డేల సిరీస్లో భాగంగా సొంతగడ్డపై ప్రొటిస్ జట్టుతో రాంచి వేదికగా తొలి మ్యాచ్లో.. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది . ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.ఈ క్రమంలో రోహిత్కు తోడైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్ ప్లేలో (10 ఓవర్లు) భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించింది. తద్వారా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో మొదటిసారి ఈమేర అత్యధిక స్కోరు సాధించింది. ఇక రోహిత్- కోహ్లి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డురోహిత్ శర్మ 36 బంతుల్లో 45, కోహ్లి 44 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ప్రొటిస్ స్పిన్నర్ సుబ్రేయన్ రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో రోహిత్ వరుసగా సిక్సర్లు బాదాడు. Just one Ro-𝗛𝗜𝗧 away from history! 👀🔥@ImRo45 now has the joint-most 6️⃣s in ODIs! He reached his fifty with some classy attacking strokes along the way! 🏏🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF#RohitSharma pic.twitter.com/DbJ822jVda— Star Sports (@StarSportsIndia) November 30, 2025 ఈ క్రమంలోనే వన్డేల్లో తన 352వ సిక్సర్ను రోహిత్ నమోదు చేశాడు. తద్వారా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (351 సిక్సర్లు) పేరిట ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. అనంతరం రోహిత్ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుగదిరిగాడు.కోహ్లి అర్ద శతకంమరోవైపు... కోహ్లి అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. కార్బిన్ బాష్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది కెరీర్లో 76వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది. కాగా 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.చదవండి: శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర -
IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్కు చోటు.. పంత్కు నో ఛాన్స్
టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచింది. రాంచి వేదికగా తాము తొలుత ఫీల్డింగ్ చేయనున్నట్లు ప్రొటిస్ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. వికెట్ పాతబడుతున్న కొద్ది బ్యాటింగ్కు అనుకూలిస్తుందని.. రాత్రివేళ మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తాము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.ఇక రాంచి వన్డేలో తాము ఒకే ఒక్క స్పిన్నర్తో బరిలోకి దిగుతున్నట్లు మార్క్రమ్ తెలిపాడు. సుబ్రేయన్తో పాటు తాను కూడా పార్ట్టైమ్ బౌలింగ్ చేస్తానని పేర్కొన్నాడు. కెప్టెన్ తెంబా బవుమాతో పాటు కేశవ్ మహరాజ్కు విశ్రాంతినిచ్చామన్న మార్క్రమ్.. నలుగురు సీమర్లను ఆడించనున్నట్లు వెల్లడించాడు.ముగ్గురు స్పిన్నర్లతో భారత్మరోవైపు.. శుబ్మన్ గిల్ గైర్హాజరీలో టీమిండియాకు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో నిలబడటం కీలకమని... తాము మ్యాచ్కు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు. పటిష్ట జట్టుతో పోటీపడటం తమకు సవాలు లాంటిదని.. అనుకూల ఫలితం రాబట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు. తమ తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇచ్చినట్లు కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తెలిపాడు.టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే తుదిజట్లు ఇవేటీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనేలన్ సుబ్రేయన్, నండ్రీ బర్గర్, ఒట్నీల్ బార్ట్మాన్. -
IND vs SA ODIs: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, జట్లు.. పూర్తి వివరాలు
టెస్టు సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా వన్డేలలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం మూడు మ్యాచ్ల సిరీస్కు తెరలేవనుంది. ఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా వన్డేల్లో ముఖాముఖి 94 మ్యాచ్లలో తలపడ్డాయి.సఫారీలదే పైచేయిఇందులో యాభై ఒక్క మ్యాచ్లు గెలిచి సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. భారత్ కేవలం నలభై గెలిచింది. మూడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, ఈసారి సొంతగడ్డపై సిరీస్ జరగడం టీమిండియాకు సానుకూలంగా పరిణమించింది. టెస్టుల్లో 2-0తో వైట్వాష్ పరాభవానికి.. కనీసం వన్డేలలోనైనా గెలిచి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.గిల్ లేకుండానే..అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల ఈ సిరీస్కు దూరం కావడం వల్ల ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లతో పాటు జట్టులోకి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు సత్తా చాటితే అతడు లేని ప్రభావం పెద్దగా పడకపోవచ్చు.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తలపడిన టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు.. గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత మరోసారి సౌతాఫ్రికాతో టెస్టుల్లో టీమిండియా ఈ మేరకు ఘోర ఓటమి రుచిచూసింది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్షెడ్యూల్👉తొలి వన్డే: నవంబరు 30, ఆదివారం- రాంచి👉రెండో వన్డే: డిసెంబరు 3, బుధవారం- రాయ్పూర్👉మూడో వన్డే: డిసెంబరు 6, శనివారం- విశాఖపట్నంమ్యాచ్ ఆరంభ సమయంభారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభమవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో ప్రసారాలు.. డిజిటల్ మీడియాలో జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.భారత్తో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా జట్టు నండ్రీ బర్గర్, క్వింటన్ డికాక్, తెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మాన్, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్, ఐడెన్ మార్క్రమ్, ప్రెనేలన్ సుబ్రాయేన్.చదవండి: IND vs SA: తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు: కెప్టెన్ కేఎల్ రాహుల్ -
‘రుతురాజ్ అద్భుతమైన ఆటగాడు.. ఛాన్సులు ఇస్తాం’
ప్రతిభ ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు పొందలేకపోతున్న టీమిండియా ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటడంతో పాటు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్నాడు. టీమిండియా ఓపెనర్గానూ తనను తాను నిరూపించుకున్న రుతు.. ఆసియా క్రీడలు-2023లో భారత జట్టు కెప్టెన్గా పసిడి పతకం గెలిచాడు.రెండేళ్ల తర్వాత..అయితే, అనుకున్న స్థాయిలో రుతుకు టీమిండియాలో ఛాన్సులు మాత్రం రావడం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ల నుంచి ఎదురైన పోటీలో రుతు వెనుకబడిపోయాడు. ఈ క్రమంలో మరోసారి దేశీ క్రికెట్, భారత్-‘ఎ’ తరఫున అదరగొట్టి.. టీమిండియా పునరాగమనానికి రుతురాజ్ సిద్ధమయ్యాడు.దాదాపు రెండేళ్ల విరామం తర్వాత.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ను సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఈసారి, కెప్టెన్ హోదాలో ఉన్న శుబ్మన్ గిల్ గాయం వల్ల దూరం అయినా.. అతడికి బ్యాకప్గా టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మకు.. ఓపెనింగ్ జోడీగా జైసూ, రుతులలో ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది.రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడుఈ విషయంపై టీమిండియా వన్డే తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం మా వన్డే జట్టులో 5-6 స్థానాల్లో ఆటగాళ్లు ఫిక్సయిపోయారు.అయితే, తనకు వచ్చిన అవకాశాలన్నిటిని రుతురాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఈ సిరీస్లో అతడికి ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు. అయితే, ఏ స్థానంలో రుతురాజ్ను ఆడించే అవకాశం ఉందన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా ఆదివారం భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందుకు రాంచీ వేదిక.చదవండి: అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్ -
తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు: కెప్టెన్ కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వన్డే మ్యాచ్ ఆడి ఏడాది దాటిపోయింది. గతేడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో చివరగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ వన్డే బరిలో దిగాడు. టెస్టుల్లో రెగ్యులర్ ఆటగాడిగా బిజీ అయిన రిషభ్ పంత్.. చాన్నాళ్లుగా వన్డే ఫార్మాట్కు దూరమయ్యాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ పంత్ (Rishabh Pant)కు స్థానం దక్కలేదు. అయితే, తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు మాత్రం సెలక్టర్లు పంత్ను ఎంపిక చేశారు. శుబ్మన్ గిల్ (Shubman Gill) గైర్హాజరీలో అతడికే కెప్టెన్ చేస్తారని కూడా భావించగా.. సీనియర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది.వికెట్ కీపర్గా పంత్ను ఆడిస్తారా? ఇక రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను భారత్ రాంచీ వేదికగా మొదలుపెట్టనుంది. ప్రొటిస్ జట్టుతో ఆదివారం జరిగే ఈ మ్యాచ్ తుదిజట్టు కూర్పు, పంత్ స్థానం గురించి చర్చ నడుస్తుండగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సౌతాఫ్రికాతో తొలి వన్డేకు ముందు శనివారం మీడియాతో మాట్లాడిన రాహుల్కు.. పంత్ గురించి ప్రశ్న ఎదురైంది. వికెట్ కీపర్గా పంత్ను ఆడిస్తారా? లేదంటే మీరే కీపర్గానూ వ్యవహరిస్తారా? అని విలేకరులు రాహుల్ను అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రిషభ్ స్పెషలిస్టు బ్యాటర్గా ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.తుదిజట్టులో తప్పక ఉంటాడుతుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు. అయితే, వికెట్ కీపర్గా తను ఉంటాడా? లేదా? నేనే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తానా అనేది రేపే (ఆదివారం) తెలుస్తుంది’’ అని రాహుల్ పేర్కొన్నాడు. మొత్తానికి తుదిజట్టులో పంత్కు చోటు ఉందని చెప్పి.. అతడి వన్డే రీఎంట్రీని రాహుల్ ధ్రువీకరించాడు.కాగా రెండేళ్లుగా కేఎల్ రాహుల్ వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సౌతాఫ్రికాతో సిరీస్లో కెప్టెన్సీ చేస్తున్నందున కీపర్గా అదనపు భారాన్ని అతడు పక్కనపెట్టే అవకాశం ఉంది.ఇక నవంబరు 29- డిసెంబరు 6 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ప్రొటిస్ జట్టు చేతిలో టెస్టుల్లో టీమిండియా 2-0తో వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో పంత్ సహా కీలక బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.సౌతాఫ్రికాతో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్. -
అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
చెప్పినట్లు వింటారా?.. తమ మాటే నెగ్గించుకుంటారా?
సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్వాష్ తర్వాత వన్డే సిరీస్కు సిద్ధమైంది టీమిండియా. సంప్రదాయ క్రికెట్లో విఫలమైనా.. పరిమిత ఓవర్ల సిరీస్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నవంబరు 30- డిసెంబరు 6 మధ్య ప్రొటిస్ జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రాంచి వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు మొత్తం ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రో- కో భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. వన్డే వరల్డ్కప్-2027 (ICC World Cup 2027) వరకు ఈ లెజెండరీ బ్యాటర్లు కొనసాగుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వాటి ఆధారంగానే నిర్ణయిస్తాంఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. రోహిత్- కోహ్లిల విషయంలో యాజమాన్యం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి. జట్టులో వారి పాత్ర, అంచనాలు, ఫామ్ ఆధారంగానే వీరిద్దరు ప్రపంచకప్ టోర్నీ ఆడతారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.‘‘ఆస్ట్రేలియా పర్యటనలో వాళ్లిద్దరు మూడో వన్డేలో వింటేజ్ ఆటను గుర్తు చేశారు. అయితే, అప్పటికే సిరీస్ మన చేజారిపోయింది. తొలి రెండు మ్యాచ్లలో రో-కో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్క మ్యాచ్లో ఆడినంత మాత్రాన ప్రతిసారీ వారికి మినహాయింపు లభిస్తుందని అనుకోవద్దు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియతో సదరు వర్గాలు పేర్కొన్నాయి.తిరుగులేని రో-కోవన్డేల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు కోహ్లి, రోహిత్. ముఖ్యంగా ఇప్పటికే వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడిగా కోహ్లి కొనసాగుతుండగా.. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనుడు రోహిత్ (264 పరుగులు). వీరి ఘనతను చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచాడు. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని సారథిగా తప్పించి.. అతడి స్థాయంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చెప్పినట్లు వింటారా?కాగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఇంకా 22 నెలల వ్యవధి ఉంది. ఈలోపు టీమిండియా ఆడే వన్డే సిరీస్లలో ప్రదర్శన ఆధారంగానే రో- కో భవితవ్యం తేలనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్ నాటికి రోహిత్ 40, కోహ్లి 38 ఏళ్ల వయసు దాటేస్తారు. కాబట్టి ఫిట్నెస్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, ఇప్పటికే ఫిట్నెస్కు మారుపేరుగా పేరొందిన కోహ్లి.. మరింత ఫిట్గా మారగా.. రోహిత్ ఆసీస్ టూర్కు ముందు ఏకంగా పది కిలోల బరువు తగ్గి స్లిమ్గా మారిపోయాడు. అయితే, ఇప్పటికే వీరిద్దరు అంతర్జాతీయ టీ20లతో పాటు.. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఫిట్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసం రో- కో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డు కూడా వీరి నుంచి ఇదే కోరుకుంటోంది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకున్న రో-కో ఇందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’తో వన్డే సిరీస్లో వీరిద్దరు ఆడతారని ముందుగా వార్తలు వచ్చాయి.గంభీర్, అగార్కర్తో చర్చల తర్వాతే..కానీ ఈ అనధికారిక సిరీస్లో రో-కో ఆడలేదు. ఏదేమైనా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్తో రోహిత్- కోహ్లి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయం గురించి రో-కోతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో రోహిత్- కోహ్లి వంటి సీనియర్ల అనుభవం యువ జట్టుకు పనికివస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిని మించి సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అలాంటపుడు రో- కోను గనుక కావాలని తప్పిస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు!!చదవండి: India vs South Africa: టికెట్లు సోల్డ్ అవుట్ -
వాళ్లకి టెస్టు క్యాప్లు ఎలా ఇస్తారు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ స్టార్లకు టెస్టు క్యాప్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటినప్పటికీ చాలా మంది ఆటగాళ్లు టెస్టుల్లో రాణించలేకపోతున్నారని విమర్శించాడు.సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్వాష్వాస్తవానికి సదరు ప్లేయర్లు టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వారిని ఆడిస్తూ జట్టు భారీ మూల్యమే చెల్లిస్తోందని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా స్వదేశంలో టీమిండియాకు టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయిన టీమిండియా.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 2-0 (IND vs SA)తో చిత్తుగా ఓడింది.ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో మరీ దారుణంగా ప్రొటిస్ జట్టు చేతిలో 408 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో పాటు సెలక్టర్ల విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ క్రికెటర్లు.. బ్యాటర్ల వైఫల్యాన్ని తూర్పారబడుతున్నారు.అంత మాత్రాన టెస్టు జట్టులో చోటిచ్చేస్తారా?ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సైతం యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇటీవలి కాలంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో చాలా మందికి ఎక్కువగా ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. యశస్వి జైస్వాల్ 15, శుబ్మన్ గిల్ (Shubman Gill) 20-22 మ్యాచ్లు ఆడిన తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేశారు.సాయి సుదర్శన్ 29, నితీశ్ కుమార్రెడ్డి 23, ధ్రువ్ జురెల్ 15 మ్యాచ్లు ఆడి ఉంటారు. దేవదత్ పడిక్కల్ అందరి కంటే ఎక్కువగా 31 మ్యాచ్లు ఆడినా.. అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్ లేదంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో విజృంభించినంత మాత్రాన టెస్టు జట్టులో చోటిచ్చేస్తారా?జైసూ, గిల్ వంటి ఆటగాళ్లు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అనుభవం తక్కువగా ఉన్నా టెస్టుల్లో తమను తాము ఇప్పటికే నిరూపించుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు అలాగే ఆడలేరు కదా!.. ఫార్మాట్కు అనుగుణంగా రాణించేందుకు కొందరికి తక్కువ సమయం పడితే.. మరికొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు.అర్థం చేసుకోవాల్సింది మీరే!ఇప్పుడు జరిగింది ఇదే. ప్రొటిస్తో మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు వారు ఆపసోపాలు పడ్డారు. నిజానికి వాళ్లు సంప్రదాయ ఫార్మాట్ ఆడేందుకు సిద్ధంగా లేరు. కనీసం 3-4 సీజన్లలో వరుసగా రెడ్బాల్ క్రికెట్ ఆడితే వారు పూర్తి స్థాయిలో టెస్టులకు సన్నద్ధం కాగలరు. కానీ అది గుర్తించకుండా వెంటనే జాతీయ జట్టులోకి పిలిపిస్తే ఎలా?నిజానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. వారు సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాల్సింది మీరే!.. ఓ ఆటగాడికి టెస్టు క్యాప్ అందించే ముందు అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో కనీసం 2-3 సీజన్లు ఆడేలా చూసుకోండి. నిలకడగా పరుగులు రాబట్టిన బ్యాటర్లు, వికెట్లు తీసిన బౌలర్లకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. ఆ తర్వాతే టెస్టుల్లో ఆడించండి. సంధి కాలంలో ఇదే సరైన విధానం అనిపించుకుంటుంది’’ అంటూ టీమిండియా మేనేజ్మెంట్కు ఆకాశ్ చోప్రా చురకలు అంటించాడు.చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన -
India vs South Africa: టికెట్లు సోల్డ్ అవుట్
వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో డిసెంబర్ 6న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ తొలి దఫా టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా జరగనున్న చివరిదైన మ్యాచ్ డే–నైట్ ఫార్మాట్లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు సంబంధించి కార్పొరేట్ టికెట్లు మినహా.. అభిమానుల కోసం అందుబాటులో ఉంచిన మొత్తం 22,000 టికెట్లలో.. సగం టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్(డిస్ట్రిక్టస్ యాప్)లో విక్రయానికి పెట్టారు. రూ.1200, రూ.2,000, రూ.2500, రూ.3,000, రూ.3,500, రూ.4,000 డినామినేషన్లలో ఉన్న ఈ టికెట్లు కొద్దిసేపట్లోనే అమ్ముడైపోయాయి. మిగిలిన సగం టికెట్లను ఈ నెల 30న సాయంత్రం 4 గంటలకు రెండోసారి విక్రయించనున్నారు. రూ.5,000, రూ.10,000, రూ.15,000, రూ.18,000 ధరల టికెట్లను హాస్పిటాలిటీ, సెమీ–హాస్పిటాలిటీ కేటగిరీల పేరిట విక్రయిస్తున్నారు.4న జట్ల రాకఏసీఏ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాయ్పూర్లో జరిగే రెండో వన్డే ముగించుకుని, డిసెంబర్ 4న ఆతిథ్య భారత్ జట్టుతో పాటు ఆహ్వాన జట్టు దక్షిణాఫ్రికా విశాఖకు చేరుకోనున్నాయి. 5న ఇరు జట్లు వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయి. -
గంభీర్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం!?.. ఇంకోసారి ఇలా చేస్తే..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ అకస్మాత్ రిటైర్మెంట్ ప్రకటనల వెనుక గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.విమర్శలు.. రాజీనామాకు డిమాండ్అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్కోచ్గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, అశ్విన్ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.అండగా ఉంటామని చెప్పినా..ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గంభీర్ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్ అలా తయారు చేయించానని గంభీర్ అంగీకరించిన విషయం తెలిసిందే.అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి, యువ పేసర్ హర్షిత్ రాణాను ఆడించే విషయమై గంభీర్ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులుఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్గా నిలిచిన ఆ క్రెడిట్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్కప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపితేనే గంభీర్ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన -
గంభీర్ నా బంధువు కాదు.. తప్పంతా వాళ్లదే: అశ్విన్ ఆగ్రహం
టీమిండియా సిరీస్ పరాజయానికి హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్వాష్ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో కీలక వ్యాఖ్యలు చేశాడు.అది సరైంది కాదు‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.తప్పంతా వాళ్లదేభారత క్రికెట్ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.కోచ్, కెప్టెన్ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?గంభీర్ నా బంధువు కాదు.. గంభీర్ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్ వివరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయిన విషయం తెలిసిందే. చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ గంభీర్కు అండగా నిలిచాడు. కోచ్ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో గావస్కర్ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్ పరాజయానికి గంభీర్ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్గా ఉంచాలని మీరు చెప్పారా. మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్ వైపు చూస్తారు’ అని గావస్కర్ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్ను కోచ్గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్రెండన్ మెక్ల్లమ్ అన్ని ఫార్మాట్లలో కోచింగ్ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు. -
గంభీర్పై వేటు తప్పదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!
సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్ కోచ్గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.కోచ్గా ఎలాంటి అనుభవం లేకపోయినా..టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్కోచ్గా తప్పుకోగా.. గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్గా గంభీర్కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయింది భారత్. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లలో చాంపియన్గా నిలిచి సత్తా చాటింది.ద్రవిడ్కే ఆ క్రెడిట్కానీ చాంపియన్స్ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ భాయ్ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు టైటిల్కు అందించిన హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు.పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అంతకుముందే స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్మన్ గిల్కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.సంధి కాలంఈ నేపథ్యంలో గంభీర్ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.కివీస్తో సిరీస్తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్ విజ్ఞప్తి చేశాడు.బీసీసీఐ నిర్ణయం ఇదే!ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్కప్ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్ను హెడ్కోచ్గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్.. సరికొత్త చరిత్ర -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సత్తా చాటింది. స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో 2-0తో వైట్వాష్ చేసింది. ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్లో విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ తాజా సీజన్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్స్వీప్ చేశారు.408 పరుగుల భారీ తేడాతోరెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో భారత్పై గెలిచిన సౌతాఫ్రికా.. గువాహటిలో చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన బర్సపరా స్టేడియంలో ఆద్యంత ఆధిపత్యం కనబరిచి.. టీమిండియా (IND vs SA 2nd Test)ను ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.తొలి జట్టుగా చరిత్ర తద్వారా ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. గతంలో ఆస్ట్రేలియా నాగ్పూర్ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో గెలవగా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది.కాగా టీమిండియాను వైట్వాష్ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లది కీలక పాత్ర. పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) రెండో టెస్టులో సత్తా చాటి ప్లేయర్గా నిలవగా.. సఫారీ పేసర్ సైమన్ హార్మర్ రెండు మ్యాచ్లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఘోర పరాజయాలు (పరుగుల పరంగా)🏏సౌతాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి- 2025, గువాహటి🏏ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి- 2008, నాగ్పూర్🏏పాకిస్తాన్ చేతిలో 341 పరుగుల తేడాతో ఓటమి- 2006, కరాచి🏏ఆస్ట్రేలియా చేతిలో 337 పరుగుల తేడాతో ఓటమి- 2007, మెల్బోర్న్🏏ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి- 2017, పూణె.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బర్సపరా స్టేడియం, గువాహటి👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్👉సౌతాఫ్రికా స్కోర్లు: 489 &260/5 డిక్లేర్డ్👉భారత్ స్కోర్లు: 201 &140👉ఫలితం: 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు.. సిరీస్ 2-0తో వైట్వాష్.చదవండి: సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే.. -
గంభీర్ కోచింగ్ అద్భుతం.. ఇదంతా ఆయన ఘనతే!
''కేవలం సంవత్సరం కాలంలో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జాతీయ కోఆర్డినేటర్ వినయ్ కుమార్ డోకానియా (Vinay Kumar Dokania) సెటైర్ వేశారు. సొంతగడ్డపై టెస్టుల్లో రెండో విజయవంతమైన వైట్వాష్కు అభినందనలు అంటూ చురక అంటించారు.దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లపై ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు గుప్పించారు. వీరిద్దరినీ తొలగించకపోతే భారత క్రికెట్కు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. 80, 90లలో కూడా భారత టెస్ట్ జట్టు ఇంత బలహీనంగా లేదని.. అగార్కర్, గంభీర్ వల్లే ఇప్పుడు అది సాధ్యమైందని దుయ్యబట్టారు. కోచ్ పదవికి గంభీర్ తనంత తానుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వారిద్దరినీ తొలగించాలిపటిష్టమైన భారత టెస్ట్ జట్టును గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భ్రష్టు పట్టించాడని, టి20 ఆల్ రౌండర్ల టీమ్గా మార్చేశాడని వినయ్ కుమార్ ధ్వజమెత్తారు. టి20 క్రికెటర్లతో నిండిన ఈ భారత జట్టు కంటే ఇంట్లోని చిన్న పిల్లలు బాగా క్రికెట్ ఆడతారని వ్యంగ్యంగా అన్నారు. అసంబద్ధ నిర్ణయాలతో ఇండియన్ క్రికెట్ జట్టును గంభీర్ ఎగతాళి చేశాడని మండిపడ్డారు. టీమిండియా 2027లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుందని.. గంభీర్, అగార్కర్లను తొలగించకపోతే మన జట్టు 5-0 తేడాతో ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.భారత టెస్ట్ క్రికెట్ హంతకుడుఅశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. టెస్ట్ క్రికెట్ నుంచి అవమానకరంగా రిటైర్ కావడానికి గంభీర్ కారణమయ్యాడని వినయ్ కుమార్ ఆరోపించారు. అసమర్థ టి20 క్రికెటర్లతో టెస్ట్ జట్టును నింపేశారని అన్నారు. తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రయోగాలతో ఆటగాళ్ల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గౌతమ్ గంభీర్ను భారత టెస్ట్ క్రికెట్ హంతకుడిగా అభివర్ణించారు. క్రికెట్ కోచింగ్ ఆయనకు సరిపడదని, రాజకీయాల్లోకి తిరిగి వెళ్లాలని గంభీర్కు సలహాయిచ్చారు. గంభీర్ తన అద్భుతమైన కోచింగ్, జట్టు కూర్పుతో 2027 సీజన్లో ఇండియాను WTC ఫైనల్స్కు వెళ్లకుండా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.సక్సెస్ రేటు డౌన్2016 నుంచి 2019 వరకు సొంతగడ్డపై టీమిండియా విజయాల శాతం 79 కాగా, 2020 నుంచి 2024 వరకు 73 శాతం సక్సెస్ రేటు సాధించిందని వినయ్ కుమార్ గుర్తు చేశారు. 2024 అక్టోబర్ నుంచి ఇది 29 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. ఇంతటి ఘనత సాధించిన గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు.చదవండి: భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది13 నెలల్లో ఆరుగురు..టీమిండియా టెస్ట్ టీమ్లో కీలకమైన మూడో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారని విమర్శించారు. రాహుల్ ద్రవిడ్ 15 ఏళ్లు, ఛతేశ్వర్ పుజారా పదేళ్ల పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశారని గుర్తు చేశారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 నెలల కాలంలోనే ఆరుగురిని మార్చారని తెలిపారు. శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, పడిక్కల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్లను మూడో స్థానంలో ఆడించిన విషయాన్ని వెల్లడించారు.I demand Bharat Ratna from Indian govt for Gautam Gambhir and Ajit Agarkar for these herculean achievements for Team India in just 1 year #IndvsSA pic.twitter.com/z5JpekDHFm— Vinay Kumar Dokania (@VinayDokania) November 26, 2025 -
మా కోచ్ ఒక్కడేనా?.. వాళ్లూ హద్దు దాటారు: బవుమా కౌంటర్
సౌతాఫ్రికా కెప్టెన్గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్వాష్ చేసిన ప్రొటిస్ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.సాష్టాంగపడేలా చేస్తాంగువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.కోచ్ కామెంట్స్పై బవుమా స్పందన ఇదేఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.హద్దు మీరి ప్రవర్తించారుఅదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్లో మా కోచ్ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్ లైన్ క్రాస్ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.కాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్కతాలో భారత్పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్ -
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
'భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది'
''టీమిండియాను సొంతగడ్డపై ఓడించలేరని ఒకప్పుడు అంటుండేవారు. కానీ ఇప్పుడు ఏ జట్టు అయినా భారత్లో భారత్ను ఓడించగలదు'' అంటూ ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాట పటిమ లేకుండా ప్రత్యర్థికి దాసోహమవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా భారీ ఓటమి అభిమానులను మరింత కుంగదీసింది.అన్ని విభాగాల్లో పైచేయి సాధించి టీమిండియాను సొంత గడ్డపై ఓడించిన దక్షిణాఫ్రికాపై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడమే కాకుండా, వైట్వాష్ చేయడంతో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విజయానికి సఫారీలు అన్నివిధాలా అర్హులని కితాబిస్తున్నారు. ఇక, భారత్ ఘోర వైఫల్యానికి హెచ్కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారకుడని టీమిండియా ఫ్యాన్స్ నిందిస్తున్నారు. భారత టెస్టు క్రికెట్ను నాశనం చేశాడని ఫైర్ అవుతున్నారు.నెటిజనుల మండిపాటుటీమిండియా (Team India) ఓటమిపై సోషల్ మీడియాలో నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గువాహటిలో ఇండియన్ టెస్టు క్రికెట్ ఈరోజు చనిపోయిందంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు సొంత గడ్డపై భారత జట్టుతో క్రికెట్ ఆడటానికి ప్రత్యర్థి జట్లు భయపడేవని, కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యాయని వాపోతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా, అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు టీమిండియాకు సొంతగడ్డపై ఓటమి అనేది ఊహల్లోకి కూడా వచ్చేది కాదని పేర్కొంటున్నారు. చదవండి: అందుకే ఓడిపోయాం.. ఓటమి నిరాశపరిచిందన్న పంత్సొంత గడ్డపై టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో నెటిజనులు మీమ్స్, సైటర్లతో విరుచుకుపడుతున్నారు. వీడియోలు, కామెంట్లతో పాటు గణాంకాలను జత చేసి టీమిండియా ఓటమిపై బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఓడిపోతారా అన్నట్టుగా ఆవేదన వెలిబుచ్చుతున్నారు. #INDvSA India in India pic.twitter.com/6PG6ylLI4a— ARMSB 🇮🇳 (@armsb_in) November 26, 2025They came,They saw,And Destroyed Indian Test Team 😆Once upon a time, India was undefeated on their home soil, but now any team can beat India in India 🤪- Who is responsible for India's Decline ?#IndianCricket pic.twitter.com/U2LfPOYsR9— Ankit Sharma (@AnkitsharmaINC) November 26, 2025With these four players in the team, no one could have even imagined defeating India in India. 🔥 pic.twitter.com/M19zalfUuS— Rajat (@RajatMemes_) November 26, 2025Lord Bavuma, 1st Proteas captain to whitewash India in India 🥳🥳🥳🥳🥳 #INDvSA #IndianCricket pic.twitter.com/XsluVHhDCO— Noko (@TruthOrPeace_) November 26, 2025Tamba Bavuma became 1st South Africa captain to win a test series in India in 25 years . Defeating India in IndiaUndefeated in the test as a captain.#INDvsSA #GautamGambhir#SAvsIND #IndianCricket pic.twitter.com/F3Uh8YRW9z— Innocent Indian (@InnocentIndiann) November 26, 2025Highest target Set by Team against India in India in Test549 - 🇿🇦 at Guwahati,2025*543 - 🇦🇺 at Nagpur,2004467 - 🇿🇦 at Eden Gardens,1996457 - 🇦🇺 at Bengaluru,2004452 - 🏴 at Chennai,1934447 - 🏝️ at Chennai,1959444 - 🏝️ at Kanpur,1958441 - 🇦🇺 at Pune,2017#INDvSA pic.twitter.com/dhbg0BuLXn— CricBeat (@Cric_beat) November 25, 2025History Created In Gautam Gambhir Era.India In India : pic.twitter.com/hiGcgHmqS1— Mr.CricGuy 🏏 (@mrcricguy) November 26, 2025 -
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.కాస్త నిరాశకు లోనయ్యాంఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.భారీ మూల్యమే చెల్లించాముఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. క్రికెట్లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్ పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్లు ఆడింది. కోల్కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇరవై ఐదేళ్ల తర్వాతఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్వాష్ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల దూరం కాగా.. పంత్ పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్ బౌలర్లు అడియాసలు చేశారు.ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్ హార్మర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్ రెండు, సెనూరన్ ముత్తుస్వామి ఒక వికెట్ తీశారు. పేసర్ మార్కో యాన్సెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యాన్సెన్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి భారత్ను 201 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. హార్మర్ (మొత్తంగా 17 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.చదవండి: Sai Sudharsan: సూపర్ స్లో బ్యాటింగ్! -
సాయి సుదర్శన్.. సూపర్ స్లో బ్యాటింగ్!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకునేందుకు చాలాసేపు క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల పదునైన బంతులను ఎదుర్కొనేందుకు బాగా కష్టపడ్డాడు. వికెట్ పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయవంతం కాలేకపోయాడు. ముత్తుసామి బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా అవుటయ్యాడు.27/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు 31 పరుగులు మాత్రమే జోడించి మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ యాదవ్ (5), ధ్రువ్ జురేల్(2), రిషబ్ పంత్(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.మరో ఎండ్లో సాయి సుదర్శన్ మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. 2 పరుగులతో చివరి రోజు ఆట మొదలు పెట్టిన ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ ఆత్మరక్షణ ధోరణిలో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. పరుగులు రాబట్టకపోయినా వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సిరీస్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్గా నిలిచాడు. 139 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్తో 14 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది సాయి ఎంత స్లోగా ఆడాడో. మ్యాచ్ ఎలాగూ ఓడిపోతాం కాబట్టి.. వికెట్లు పడకుండా ఉంటే డ్రా అవుతుందన్న ఉద్దేశంతో అతడు ఇలా బ్యాటింగ్ చేశాడని విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా చిత్తుమ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో 549 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ 140 పరుగులకు ఆలౌటయింది. అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 9వ వికెట్గా వెనుదిరిగాడు. జడేజా 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి కేశవ మహరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు.చదవండి: దక్షిణాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు -
టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!
ఊహించిందే జరిగింది.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA) 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కనీస పోరాట పటిమ కూడా కనబరచకుండా ‘స్టార్’ బ్యాటర్లంతా పెవిలియన్కు వరుస కట్టడం భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) -2025 విజేత సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు భారత్కు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఇరుజట్ల మధ్య కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది.ఆది నుంచే ఆధిపత్యంఅనంతరం భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.549 పరుగుల లక్ష్యంఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్ వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నెమ్మదిగా ఆడుతూనే 78.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్ జట్టు తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. టీమిండియాకు 549 పరుగుల (288+260) భారీ లక్ష్యాన్ని విధించింది.రెండో ఇన్నింగ్స్లో ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. టోనీ డి జోర్జీ (49) తృటిలో అర్ధ శతంక చేజార్చుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (13)ను యాన్సెన్ వెనక్కి పంపగా.. కేఎల్ రాహుల్ (6)ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.హార్మర్ విజృంభణఈ క్రమంలో 27/2 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ చుక్కలు చూపించాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (5)ను సైమన్ బౌల్డ్ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14)ను సెనూరన్ ముత్తుస్వామి వెనక్కి పంపాడు.ఆ తర్వాత సైమన్ హార్మర్ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్ జురెల్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. లాంఛనం పూర్తి చేసిన మహరాజ్ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్ కేశవ్ మహరాజ్.. మొహమ్మద్ సిరాజ్ (0) ఆఖరి వికెట్గా వెనక్కి పంపి టీమిండియా ఓటమిని ఖరారు చేశాడు. మొత్తంగా సైమన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ రెండు, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ యాన్సెన్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక సమిష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టు సిరీస్ గెలవడమే కాదు..వైట్వాష్ చేసింది కూడా!! భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 489 & 260/5 డిక్లేర్డ్భారత్: 201 & 140ఫలితం: 408 పరుగుల తేడాతో భారత్పై సౌతాఫ్రికా గెలుపుచదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు
స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదుర్కోవడానికి సిద్ధపడింది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా (IND vs SA Tests) చేతిలోనూ అదే చేదు ఫలితం పొందనుంది. గువాహటి వేదికగా ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్ సేన తడబడింది.భారీ ఆధిక్యం లభించినా..బర్సపరా స్టేడియంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు చేసింది. నిజానికి నాలుగో రోజు భారీ ఆధిక్యం లభించినా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంలో ప్రొటిస్ జట్టు ఆలస్యం చేసింది. ఆఖరి రోజు వరకు టీమిండియాను తిప్పలుపెట్టాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సాష్టాంగపడేలా చేస్తాంఈ విషయం గురించి సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ.. టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇలా చేశాము.వాళ్లు బ్యాటింగ్ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి మాదే పైచేయి అవుతుంది’’ అంటూ అవమానకరంగా మాట్లాడాడు.కాస్త హుందాగా ఉండండిఈ నేపథ్యంలో షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ మండిపడ్డారు. అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. ‘‘యాభై ఏళ్ల క్రితం అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ వెస్టిండీస్ జట్టును ఉద్దేశించి ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.విండీస్ అగ్రస్థానానికి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. సౌతాఫ్రికా ఇప్పుడు చారిత్రాత్మక సిరీస్ గెలిచేందుకు చేరువైంది. నిజానికి మీదే పైచేయిగా ఉన్నపుడు.. మీరు మాట్లాడే మాటలు కూడా అంతే హుందాగా ఉండాలి. కోచ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలా ఎవరైనా మాట్లాడతారా?ఇక ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇదే విషయంపై స్పందించాడు. ‘‘ఇది అసలు ఎలాంటి మాట? నిజానికి ఈ విషయంపై స్పందించాలని కూడా నేను అనుకోవడం లేదు. ఇదొక అసందర్భ ప్రేలాపన. సౌతాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం సాధించింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి మాటలను నేను అస్సలు సమర్థించను’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో స్టెయిన్ ఫైర్ అయ్యాడు.ఓటమి అంచున టీమిండియాఇదిలా ఉంటే.. గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఓటమికి చేరువైంది. టీ బ్రేక్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులే చేసింది. విరామం తర్వాత టీమిండియా మరింత కష్టాల్లో కూరుకుపోయింది. 56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు చేసింది. భారత్ విజయానికి 440 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా కేవలం నాలుగు వికెట్లు తీస్తే సిరీస్ సొంతం చేసుకోగలదు. ఇప్పటికే కోల్కతా వేదికగా సౌతాఫ్రికా టీమిండియాపై 30 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. Update: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!చదవండి: టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
రోడ్డు మీద కూడా ఆడలేరా?.. ఈ టెస్టు కూడా పోయినట్లేనా?
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.రోడ్డు మీద కూడా ఆడలేరా?ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్ మీద సఫారీలు రయ్ రయ్మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్వాష్ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చేదు అనుభవం తప్పదా?స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (93) ఇన్నింగ్స్ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగిసఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58)తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఫలితంగా 201 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలగా.. ప్రొటిస్ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.మరోసారి మనోళ్లు ఫెయిల్రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్క్రమ్ (29) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ భారీ హాఫ్ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్ ముల్దర్ (35 నాటౌట్) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి.. యాన్సెన్ బౌలింగ్లో వెనుదిరగగా.. కేఎల్ రాహుల్ 6 పరుగులు చేసి సైమన్ హార్మర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్ 2, కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!చదవండి: పీవీ సింధు ఫిట్నెస్పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
గువాహటి వేదికగా భారత్తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు.తొలి ఇన్నింగ్స్లో..ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్ను ఫాలో ఆన్ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్నైట్ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.టార్గెట్ ఎంతంటే?తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది సౌతాఫ్రికా. వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్ ముల్డర్ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్-5 జాబితా)🏏1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 403.. భారత్ విజయం (406/4)🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టార్గెట్ 387.. భారత్ విజయం (387/4)🏏2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టార్గెట్ 328.. భారత్ విజయం (329/7)🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 276.. భారత్ విజయం (276/5)🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్లో టార్గెట్ 264.. భారత్ విజయం (264/5).చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మరింతగా పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 395 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. గువాహటి వేదికగా 26/0 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది సౌతాఫ్రికా.ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగాడు. జడ్డూ బౌలింగ్లో మూడో బంతికి షాట్ ఆడబోయి బంతిని గాల్లోకి లేపిన ర్యాన్ రికెల్టన్ (35) సిరాజ్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.ఇక 29వ ఓవర్లో జడ్డూ మార్క్రమ్ (29)ను బౌల్డ్ చేయగా.. 32వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతం చేశాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) రూపంలో కీలక వికెట్ పడగొట్టాడు. వాషీ బౌలింగ్లో లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. 1-0తో ఆధిక్యంలో సౌతాఫ్రికాఇందులో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ మెరుగ్గా రాణించగా.. టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో ప్రొటిస్ జట్టు 489 పరుగులకు ఆలౌట్ అయింది. తేలిపోయిన భారత బ్యాటర్లుఅనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే మొగ్గుచూపింది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. UPDATE: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం 508 పరుగులుస్కోరు: 220/4 (70)చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
యాన్సెన్ జోరు...
‘కోల్కతాతో పోలిస్తే ఇక్కడి పిచ్ రోడ్డులా, బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది... కాబట్టి మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు’... ఆదివారం దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమైన తర్వాత భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అదే పిచ్ సోమవారానికి వచ్చే సరికి బౌలింగ్కు అనుకూలించింది. ఫలితంగా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రెండో రోజు బ్యాటింగ్తో దెబ్బ కొట్టిన మార్కో యాన్సెన్ మూడో రోజు తన బౌలింగ్ పదునుతో ఏకంగా ఆరు వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చాడు. అతని ‘షార్ట్’ బంతులను ఆడలేక బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరడంతో భారత్ భారీ ఆధిక్యం కోల్పోయింది. ఇప్పటికే సఫారీలు పట్టు బిగించగా...ఓటమి వెంటాడుతుండగా ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో మన జట్టు నిలిచింది.గువహటి: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులోనూ భారత్ ఓటమికి చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా భారత్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. రికెల్టన్ (13 బ్యాటింగ్), మార్క్రమ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 314 పరుగులు ముందంజలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్లో మరిన్ని పరుగులు జోడించి భారత్కు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఓవర్నైట్ స్కోరు 9/0తో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (97 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్కో యాన్సెన్ (6/48) చెలరేగిపోగా, హార్మర్కు 3 వికెట్లు దక్కాయి. టపటపా... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (22) తొలి గంటలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే మహరాజ్ చక్కటి బంతితో రాహుల్ను వెనక్కి పంపడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 85 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఒక దశలో భారత్ 95/1తో మెరుగైన స్థితిలో కనిపించింది. సఫారీల చక్కటి బౌలింగ్తో పాటు మన బ్యాటర్ల చెత్త షాట్లు జట్టు పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చాయి. 27 పరుగుల వ్యవధిలో టీమ్ 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చక్కటి షాట్లతో దూసుకుపోతున్న జైస్వాల్ ఆటకు యాన్సెన్ క్యాచ్తో తెరపడగా, సాయి సుదర్శన్ (15) విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో యాన్సెన్ బౌలింగ్ జోరు మొదలైంది. వరుసగా జురేల్ (0), పంత్ (7), నితీశ్ రెడ్డి (10), జడేజా (6)లను అతను వెనక్కి పంపించాడు. వీటిలో పంత్ మినహా మిగతా ముగ్గురు బౌన్సర్లకే వెనుదిరిగారు! పంత్ మాత్రం ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కీలక భాగస్వామ్యం... 122/7 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే గత మ్యాచ్ తరహాలోనే సుందర్ మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, అనూహ్యంగా కుల్దీప్ యాదవ్ (19) కూడా పట్టుదలగా క్రీజ్లో నిలబడి సహకరించాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలమని ముందు రోజు చెప్పిన కుల్దీప్ నిజంగానే క్రీజ్లో ఎలా నిలబడాలో ఆడి చూపిస్తూ ఇన్నింగ్స్లో అందరికంటే ఎక్కువగా 134 బంతులు ఎదుర్కోవడం విశేషం! ఈ జోడీ ఏకంగా 34.4 ఓవర్లు ఆడి ప్రధాన బ్యాటర్లకు పాఠం నేరి్పంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 72 పరుగులు జత చేయడంతో కాస్త పరువు నిలిచింది. సుందర్ను అవుట్ చేసి హార్మర్ ఈ జంటను విడదీయగా... తర్వాతి రెండు వికెట్లు యాన్సెన్ ఖాతాలోనే చేరాయి. 6.82 అడుగుల ఎత్తు ఉన్న యాన్సెన్ షార్ట్ బంతులను సమర్థంగా వాడుకోగా, మన బ్యాటర్లు ఆ వలలో పడ్డారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 58; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 22; సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) హార్మర్ 15; జురేల్ (సి) మహరాజ్ (బి) యాన్సెన్ 0; పంత్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 7; జడేజా (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 6; నితీశ్ రెడ్డి (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 10; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 48; కుల్దీప్ (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 19; బుమ్రా (సి) వెరీన్ (బి) యాన్సెన్ 5; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (83.5 ఓవర్లలో ఆలౌట్) 201. వికెట్ల పతనం: 1–65, 2–95, 3–96, 4–102, 5–105, 6–119, 7–122, 8–194, 9–194, 10–201. బౌలింగ్: యాన్సెన్ 19.5–5–48–6, ముల్డర్ 10–5–14–0, మహరాజ్ 15–1–39–1, హార్మర్ 27–6–64–3, మార్క్రమ్ 10–1–26–0, ముత్తుసామి 2–0–2–0.5: తొలి ఇన్నింగ్స్లో ఫీల్డర్గా ఎయిడెన్ మార్క్రమ్ పట్టిన క్యాచ్ల సంఖ్య. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన 15 మంది సరసన అతను చేరగా... దక్షిణాఫ్రికా తరఫున గ్రేమ్ స్మిత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. -
పాపం రాహుల్!.. అంత దూకుడు ఎందుకు?.. కాస్త తగ్గు సిరాజ్!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మూడో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. సోమవారం నాటి ఆట ముగిసే సరికి మొత్తంగా 314 పరుగుల ఆధిక్యం సంపాదించారు.గువాహటి వేదికగా రెండో టెస్టులో భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. బౌలర్ల పేలవ ఆట తీరు వల్ల సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే, ఇదే వేదికపై ప్రొటిస్ బౌలర్లు మాత్రం దుమ్ములేపారు.ఆరు వికెట్లతో చెలరేగి..ముఖ్యంగా పేస్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) ఆరు వికెట్లతో చెలరేగి.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. కీలక వికెట్లు తీసి.. పంత్ సేన 201 పరుగులకే కుప్పకూలడంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మాత్రం తామే బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకోగా.. వికెట్లు తీసేందుకు యత్నించిన బౌలర్లకు ఏమాత్రం కలిసిరాలేదు.పటిష్ట స్థితిలోనే..సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. బర్సపరా స్టేడియంలో సోమవారం ఆట పూర్తయ్యేసరికి ప్రొటిస్ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.కాగా అప్పటికే బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాకు.. మూడో రోజు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో సహజంగానే బౌలర్లు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ కాస్త దూకుడు ప్రదర్శించగా.. కేఎల్ రాహుల్ అతడిని వారించిన తీరు హైలైట్గా నిలిచింది.ఫ్రస్టేషన్లో సిరాజ్ మియా.. వైల్డ్ త్రోప్రొటిస్ రెండో ఇన్నింగ్స్లో సోమవారం నాటి ఆఖరి ఓవర్ (8)ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని రికెల్టన్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. సిరాజ్ బంతిని అందుకున్నాడు. అయితే, అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న సిరాజ్ మియా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపు వైల్డ్గా బాల్ త్రో చేశాడు.పంత్ ఆ బంతిని మిస్ కాగా.. స్లిప్స్లో అతడి వెనకే ఉన్న కేఎల్ రాహుల్ కష్టమ్మీద బంతిని ఒడిసిపట్టాడు. ఆ సమయంలో సిరాజ్ తన దూకుడు పట్ల పశ్చాత్తాపంగా నాలుక కరచుకోగా.. ‘అంత దూకుడు ఎందుకు.. కాస్త తగ్గు.. నెమ్మదిగా వెయ్’ అన్నట్లు రాహుల్ సైగ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.చదవండి: ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లేpic.twitter.com/xq4i771JXV— Nihari Korma (@NihariVsKorma) November 24, 2025 -
వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?: మాజీ క్రికెటర్
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) విమర్శించాడు. సౌతాఫ్రికాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటిచ్చిన సెలక్టర్లు.. అర్హుడైన మరో ఆటగాడిని మాత్రం ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. టెస్టుల్లో ఆడుతున్నాడనే కారణంతో ధ్రువ్ జురెల్ను వన్డేలకు కూడా సెలక్ట్ చేయడం సరికాదని విమర్శించాడు. కాగా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుండగా... ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.వాళ్లు దూరం.. వీరికి విశ్రాంతిఈ నెల 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్పూర్లో రెండో వన్డే, 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరుగుతాయి. సఫారీలతో తొలి టెస్టు సందర్భంగా గిల్ గాయపడగా... శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా అంతకుముందే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో గతంలో 12 మ్యాచ్ల్లో జట్టుకు సారథ్యం వహించిన రాహుల్కు మరోసారి అవకాశం దక్కింది.సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు.సంజూకు దక్కని చోటుఅయితే, ఈ జట్టులో సంజూ శాంసన్ పేరు మాత్రం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరఫున వన్డే ఆడిన సంజూ.. సెంచరీ చేశాడు. అది కూడా సౌతాఫ్రికా గడ్డపై శతక్కొట్టాడు. కానీ ఆ తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కనే లేదు. తాజాగా స్వదేశంలో ప్రొటిస్ జట్టుతో సిరీస్లో ఆడిస్తారని భావించగా.. మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ సంజూకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఈ జట్టులో ఒక పేరు కచ్చితంగా ఉండాలని నేను కోరుకున్నాను. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. దాదాపు రెండేళ్ల క్రితం వన్డే ఆడిన అతడు శతకంతో చెలరేగాడు.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?కానీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు సెలక్ట్ చేస్తారని భావించా. ఆడిన చివరి మ్యాచ్లో శతకం బాదిన ఆటగాడు జట్టులో చోటుకైనా అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు వికెట్ కీపర్ బ్యాటర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపికయ్యారు. సీనియర్ అయిన సంజూను కాదని.. వన్డేలో టీమిండియాకు ఆడిన అనుభవం లేని జురెల్కు సెలక్టర్లు చోటు ఇవ్వడం గమనార్హం. కాగా జురెల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 4 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 457, 12 పరుగులు చేశాడు.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టుకేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్. చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లే
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్ పారేసుకుని పెవిలియన్ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.దారుణంగా విఫలంసఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.పంత్ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. టెయిలెండర్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్ అనవసరపు షాట్కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్.. యాన్సెన్ బౌలింగ్లో స్లాగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంత్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.ఇలా ఎవరైనా చేస్తారా?కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.అతడిని త్వరగా అవుట్ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్ మ్యాచ్ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షోలో పంత్ షాట్ సెలక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
చరిత్ర సృష్టించిన యాన్సెన్.. పట్టు బిగించిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్ పర్యటనకు వచ్చింది. కోల్కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.సెంచరీ.. జస్ట్ మిస్బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ఆరు వికెట్లు పడగొట్టిఇక ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో చెలరేగిన యాన్సెన్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ (19), జస్ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్.ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్లో టెస్టు మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.పట్టు బిగించిన సౌతాఫ్రికాటీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్లో ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్ -
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం గంభీర్ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను కోల్కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్లో వాషీతో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్ చేశారు.అసలు సెన్స్ ఉందా?ఈ పరిణామాలపై కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.కోల్కతాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి? ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?కోల్కతా టెస్టులో వాషీని వన్డౌన్లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. మరీ అంత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ ఆధిక్యంలో సఫారీ జట్టుకాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ (288) కలుపుకొని.. భారత్ కంటే ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులతో రాణించాడు. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.అయితే, సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్ అయిన యాన్సెన్ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్ సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్తో చెలరేగిపోయాడు.భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.జైసూ హాఫ్ సెంచరీభారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.అంతా ఫెయిల్.. వాషీ ఒక్కడే..వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్కు పంపాడు.ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్.. బుమ్రా (5)ను కూడా అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్ హార్మర్ మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటయ్యా? అంటూ పంత్ సేనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: IND vs SA: పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే? -
గిల్ కోటాలో సాయి.. సీఎస్కే ప్లేయర్ను తీసుకోరా?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తడబడింది. మొదట పసలేని బౌలింగ్తో పరుగులు సమర్పించుకున్న భారత్.. తర్వాత బ్యాటింగ్లోనూ సత్తా చాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా.. టీమిండియా 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఫర్వాలేదని పించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఎదురీదుతోంది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ పేలవ ప్రదర్శన జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. సాయి 40 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ధ్రువ్ జురైల్(0), రిషబ్ పంత్(7), రవీంద్ర జడేజా(6), నితీశ్ కుమార్రెడ్డి (10) కూడా వరుసగా విఫలం కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.అయితే సోషల్ మీడియాలో సాయి సుదర్శన్పై నెటిజనులు ఎక్కువగా విమర్శలు కురిపిస్తున్నారు. శుబ్మన్ గిల్ (Shubman Gill) స్థానంలో అతడికి జట్టులో చోటు కల్పించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కడానికి గిల్ కోటా కారణమని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ స్నేహితుడు కాబట్టే సాయికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ స్థానంలో అదే జట్టు ఆటగాడిని తప్ప మరొకని తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్కు గిల్ కెప్టెన్గా కాగా, సాయి ఓపెనర్."గిల్ స్నేహితుడు కాబట్టి సాయి సుదర్శన్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఒకట్రెండు మ్యాచ్ల్లో విఫలమైతే చాలు ఇతర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతడినిటెస్టుల్లోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో చూపిన ప్రతిభ ఆధారంగా కాదని ఓ నెటిజన్ ఎక్స్లో కామెంట్ చేశారు. దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) లాంటి వారిని కాదని సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకున్నందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్ కనీసం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. టెస్టులో సాయి ప్రదర్శన అంతంత మాత్రమేనని పెదవి విరిచారు. సీఎస్కే ఆటగాడు కాబట్టే రుతురాజ్ను జట్టులోకి తీసుకోవడం లేదని అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.చదవండి: రిషబ్ పంత్పై నెటిజన్ల మండిపాటుటెస్టుల్లో విఫలంతమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ (Sai Sudharsan) గతేడాది జూన్లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో రెండు అర్ధసెంచరీలతో 288 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 87. వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండవ టెస్ట్లో ఈ స్కోరు నమోదు చేశారు. 24 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం బ్యాటర్లో ఇప్పటివరకు 3 వన్డేలు ఆడి 127 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 28 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 6 సెంచరీలతో 1396 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 40 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 1793 పరుగులు బాదాడు. టెస్టుల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. Sai Sudarshan * 39 avg in the domestic* 28 avg in Test * Came into test team on IPL runs * TN Ranji coach said his technique is not good enough for Test cricket * Indian Assistant coach admitted his technique against Spin is not good Playing on GT Captain Quota? #INDvSA pic.twitter.com/ul8U9pcWzJ— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) November 24, 2025 Another failure for Sai Sudharsan but still Ajit Agarkar and Gautam Gambhir are not going to pick Ruturaj Gaikwad.Because Ruturaj Gaikwad plays for CSK. pic.twitter.com/zxrGlzldfx— Abhishek Kumar (@Abhishek060722) November 24, 2025 -
అస్సలు నీవు కెప్టెన్వా?
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలుత బౌలింగ్లో విఫలమైన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 123 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9/0 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా రాహుల్(22), జైశ్వాల్(58) శుభారంభం అందించారు. తొలి వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటయ్యాక టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. సాయిసుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0) వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు.పంత్పై విమర్శలు..ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యత రహితంగా ఆడాడు. కష్టాల్లో పడిన జట్టును ఆదుకోవాల్సింది పోయి ర్యాష్ షాట్ ఆట ఆడి తన వికెట్ను కోల్పోయాడు. భారత్ ఇన్నింగ్స్ 38 ఓవర్ వేసిన సఫారీ స్పీడ్ స్టార్ మార్కో జాన్సెసన్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఈ క్రమంలో పంత్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి స్లాగ్ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే సౌతాఫ్రికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ పంత్ మాత్రం రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. క్లియర్గా ఎడ్జ్ తాకిందని తెలిసి మరి పంత్ రివ్యూ వృథా చేశాడు. రిప్లేలో భారీ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ షాట్ అవసరమా అంటూ పోస్ట్లు పెడుతున్నారు. కాగా 55 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 342 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్ ఆన్ గండం తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 142 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(23), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.చదవండి: IND vs SA: పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే? -
పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే?
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గైర్హాజరీ కారణంగా జట్టు పగ్గాలను రాహుల్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తాత్కాలిక వన్డే కెప్టెన్గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే పంత్కు కాకుండా రాహుల్ను నియమించడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు."సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో మాత్రమే కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శుభ్మన్ గిల్ తిరిగి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సమయానికి అందుబాటులో వచ్చే అవకాశముంది. అతడు తన గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఇక రిషబ్ పంత్ సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందుకే అతడిని కెప్టెన్సీ ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. కాగా పంత్ గతేడాది శ్రీలంకపై భారత్ తరపున చివరగా ఆడాడు. అప్పటి నుంచి వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు అతడు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనానికి అతడు సిద్దమయ్యాడు.ఇక ఈ వన్డే సిరీస్కు గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, జైశ్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్దీప్, ధ్రువ్ జురెల్. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బ్యాటింగ్లో తేలిపోయిన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్లో కూడా అదే తీరును కనబరుస్తోంది. లంచ్ సమయానికి ఏడు వికెట్ల ష్టానికి 174 పరుగులు చేసింది.పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును వాషింగ్టన్ సుందర్(33బ్యాటింగ్), కుల్దీప్(14బ్యాటింగ్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 52 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇంకా సౌతాఫ్రికా 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్ అన్ గండం తప్పించుకోవాలంటే మెన్ ఇన్ బ్లూ.. 116 పరుగులు చేయాలిటాపార్డర్ అట్టర్ ప్లాప్..9/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ఆరభించిన భారత్కు రాహుల్(22), జైశ్వాల్(58) శుభారంభం అందించారు. తొలి వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత రిషబ్ పంత్(7), నితీశ్ కుమార్ రెడ్డి(10), జడేజా(6) తీవ్ర నిరాశపరిచారు. ప్రోటీస్ బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్మర్ రెండు,మహారాజ్ ఓవికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది. -
పాపం సంజూ.. వరల్డ్ మోస్ట్ అన్లక్కీ క్రికెటర్
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.అదేవిధంగా ఈ సిరీస్కు గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. గిల్ స్ధానంలో గైక్వాడ్కు చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్ధానంలో తిలక్ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.సంజూ మరో 'సారీ'..ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్కు రెగ్యూలర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. పంత్ గైర్హజరీలో కూడా సంజూకు చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్ ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి సంజూను జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైరవతున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.శాంసన్ చివరగా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్లకు అతడికి చోటు దక్కలేదు. ఇప్పటివరకు 16 వన్డేలు ఆడిన సంజూ 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్దీప్, ధ్రువ్ జురెల్. -
400 పరుగులు దాటిన దక్షిణాఫ్రికా స్కోర్
గువహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. రెండో రోజు ఆటలో ప్రోటీస్ లోయర్-ఆర్డర్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు.ఏడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన సెనురన్ ముత్తుసామి(203 బంతుల్లో 107 బ్యాటింగ్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ముత్తుసామికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 247/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్లో పట్టు బిగించింది. ముత్తుసామి, కైల్ వెర్రెయెన్నె (45) నిలకడగా ఆడి స్కోర్ను 300 పరుగులు దాటించారు.టీ బ్రేక్ తర్వాత కైల్ వెర్రెయెన్నె పెవిలియన్కు చేరాడు. అనంతరం మార్కో జాన్సెన్ (51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57 ) దూకుడుగా ఆడి మూడో టెస్టు హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. జాన్సెన్ భారత స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అతడిని ఆపేందుకు బుమ్రాను ఎటాక్లోకి తీసుకొచ్చినప్పటి ఫలితం మాత్రం దక్కలేదు. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ సాధించాడు. పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్ -
కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై పంత్ సీరియస్ అయ్యాడు. కుల్దీప్ తన ఓవర్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్ అసహనం వ్యక్తం చేశాడు.అయితే పంత్ కోపానికి ఆర్ధం వుంది. ఎందుకంటే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన క్లాక్ రూల్ ప్రకారం.. ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపల తదుపరి ఓవర్ను ఆరంభించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు రెండు హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ చేసే జట్టు ఐదు పెనాల్టీ పరుగులు కలిపిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి.రెండోసారి వార్నింగ్..ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో కూడా పంత్కు ఇదే విషయంపై అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్ను సమయానికి ప్రారంభించనందును పంత్కు అంపైర్ రెండోసారి వార్నింగ్ ఇచ్చాడు. అదే మూడో సారి ఇదే సమస్యపై హెచ్చరిక వస్తే భారత్ ఐదు పరుగులు పెనాల్టీగా సౌతాఫ్రికాకు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే కుల్దీప్పై పంత్ ఫైరయ్యాడు. "30 సెకన్ల టైమర్ ఉంది. ఇంట్లో ఆడుతున్నాను అనుకున్నావా ఏంటి? త్వరగా ఒక బంతి వేయి. కుల్దీప్ ఇది నీకు రెండోసారి హెచ్చరిక"అని పంత్ గట్టిగా చెప్పాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. కాగా సౌతాఫ్రికా వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 112 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. క్రీజులో ముత్తుసామి(64), వెర్రియిన్(43) ఉన్నారు.What's going to be a good score for #TeamIndia to chase in the 1st innings? 💬#CheteshwarPujara backs the batters to score big in Guwahati! 🏟#INDvSA 2nd Test, Day 2 LIVE NOW 👉 https://t.co/J8u4bmcZud pic.twitter.com/vGjwWPopSm— Star Sports (@StarSportsIndia) November 23, 2025 -
భారత్తో రెండో టెస్టు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
గువహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా అధిపత్యం కొనసాగుతోంది. 247/6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.రెండో రోజు టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సెనూరన్ ముత్తుసామి (56 బ్యాటింగ్), కైల్ వెరీన్ (38 బ్యాటింగ్) తమ వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఎంతమంది బౌలర్లను మారుస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. తొలి సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తొలి రోజు ఆట మొదటి సెషన్లో కూడా సఫారీ బ్యాటర్లు పై చేయి సాధించారు. కానీ సెకెండ్ సెషన్లో భారత స్పిన్నర్లు కమ్ బ్యాక్ ఇవ్వడంతో 6 వికెట్లు నేల కూలాయి. ఇప్పుడు రెండో రోజు కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాలి.చదవండి: SA vs IND: పంత్, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్! -
పంత్, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్!
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. మెడ నొప్పి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న గిల్.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.దీంతో అతడు ప్రోటీస్తో వన్డే, టీ 20 సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశముందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా వైస్ కెప్టెన్ కూడా సఫారీలతో వన్డేలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత జట్టు పగ్గాలను ఎవరు చేపడతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.కెప్టెన్గా రాహుల్..రిషభ్ పంత్ కెప్టెన్సీ చేపడతాడనే వార్తలు వినిపించినప్పటికీ.. జట్టు మేనేజ్మెంట్ మాత్రం స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సెలక్టర్లు తమ నిర్ణయాన్ని రాహుల్కు తెలియజేశారంట. అందుకు రాహుల్ కూడా అంగీకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడనున్నారు. . గతంలో కూడా భారత జట్టు సారథిగా రాహుల్ వ్యవహరించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. పంత్తో పోలిస్తే కెప్టెన్గా రాహుల్కే మెరుగైన రికార్డు ఉంది. అతడి అభనువాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టు వన్డే పగ్గాలను అప్పగించేందుకు సెలక్టర్లు సిద్దమయ్యారు. సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించే ఛాన్స్ ఉంది. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: కెప్టెన్గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన -
రేపే జట్టు ప్రకటన.. టీమిండియాకు కొత్త కెప్టెన్?
సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం(నవంబర్ 23) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న గువహటిలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెలక్టర్ ఆర్పీ సింగ్, సెక్రటరీ దేవజిత్ సైకియా సమావేశమై స్క్వాడ్ను ఎంపిక చేయనున్నారు. అయితే ప్రోటీస్తో వన్డే సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కానున్నట్లు సమాచారం. మెడనొప్పి గాయం కారణంగా సఫారీలతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకొన్న గిల్.. పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు వస్తున్నాయి. అతడు తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నారు. హార్దిక్ తొడ కండరాల గాయం కారణంగా ఆసియా కప్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంకా అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు సౌతాఫ్రికాతో సిరీస్తో పాటు న్యూజిలాండ్తో వన్డేలకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సౌతాఫ్రికాతో వన్డేలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.కెప్టెన్గా రిషబ్ పంత్..?కాగా శుభ్మన్ గిల్ గైర్హజరీలో భారత వన్డే జట్టు పగ్గాలను స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వన్డేల్లో గిల్కు డిప్యూటీగా అయ్యర్ ఉన్నాడు. కానీ అయ్యర్ కూడా ఇప్పుడు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. పంత్ ప్రస్తుతం గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.ఇప్పటివరకు టెస్టు, టీ20ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన పంత్.. తొలిసారి వన్డే జట్టు బాధ్యతలను తీసుకునేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు వన్డే జట్టులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. సౌతాఫ్రికా-ఎతో జరిగిన అనాధికారిక వన్డే సిరీస్లో రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నవంబర్ 30 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: Bengal squad for SMAT: మహ్మద్ షమీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవరంటే? -
ముగిసిన తొలి రోజు ఆట.. సఫారీలదే పై చేయి
గువహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామి (25*), వెర్రిన్ (1*) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటీస్ జట్టుకు ఓపెనర్లు మార్క్రమ్ (38), రికెల్టన్ (35) శుభారంభాన్ని అందించారు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో తొలి వికెట్ను సాధించేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మార్క్రమ్ను ఔట్ చేయడంతో భారత్కు తొలి వికెట్ లభించింది. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే రెండో సెషన్లో మాత్రం భారత బౌలర్లు పుంజుకున్నారు.ముఖ్యంగా స్పిన్నర్లు కీలక వికెట్లు పడగొట్టారు. రికెల్టన్, స్టబ్స్, ముల్డర్లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు పంపగా.. బవుమాను జడ్డూ బోల్తా కొట్టించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో? -
IND vs SA: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరెంతంటే?
టీమిండియాతో రెండో టెస్టులో ఓపెనర్లు సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ కలిసి ఆచితూచి ఆడుతూ తొలి వికెట్కు 161 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. ఎట్టకేలకు టీ విరామ సమయానికి ముందు మార్క్రమ్ను పెవిలియన్కు పంపాడు.ఇదే జోరులో బ్రేక్కు వెళ్లి వచ్చిన వెంటనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మ్యాజిక్ చేశాడు. ర్యాన్ రికెల్టన్ను అవుట్ చేసి భారత్కు రెండో వికెట్ అందించాడు. ఏదేమైనా ఓపెనర్లు మార్క్రమ్- రికెల్టన్ 82 పరుగుల భాగస్వామ్యం కారణంగా సౌతాఫ్రికాకు శుభారంభమే లభించిందని చెప్పవచ్చు.స్టబ్స్, బవుమా నిలకడగా..ఇక ఓపెనర్లు అవుటైన తర్వాత వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబా బవుమా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఫలితంగా భోజన విరామ సమయానికి (మధ్యాహ్నం 1.24 నిమిషాలు) సౌతాఫ్రికా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్టబ్స్ 82 బంతుల్లో 32, బవుమా 86 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచారు.భారత బౌలర్లలో పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా ముందుకు సాగుతోంది. తొలిసారి ఇలాకాగా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి డే మ్యాచ్లో ముందుగా టీ విరామం ఇచ్చి.. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి. గువాహటిలో సూర్యోదయం, సూర్యస్తమయానికి అనుగుణంగా టైమింగ్స్ ఇలా సెట్ చేశారు. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్ -
ఎంత పని చేశావు రాహుల్?!.. బుమ్రా రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test)కు ఆరంభం నుంచే పెద్దగా కలిసి రావడం లేదు. గువాహటిలో టాస్ ఓడి తొలుత బౌలింగ్కు దిగిన భారత్ టీ విరామ సమయం వరకు కనీసం ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయింది. వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.నిలకడగా ఆడిన ఓపెనర్లుప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించగా.. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయలేక అవస్థలు పడ్డారు. నిజానికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే మార్క్రమ్ను వెనక్కి పంపే సువర్ణావకాశం టీమిండియాకు వచ్చింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏడో ఓవర్ రెండో బంతిని గంటకు 142.5 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.క్యాచ్ జారవిడిచిన రాహుల్ఈ గుడ్లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో ముందుకు వచ్చిన మార్క్రమ్ బ్యాట్ అంచుకు తాకిన బంతి.. గాల్లోకి లేచింది. ఈ క్రమంలో సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ (KL Rahul) తన ఎడమ పక్కకు జరిగిన మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని రీతిలో రాహుల్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బుమ్రా.. ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.KL Rahul dropped the catch of A Markram 🫣#TeamIndia #IndvSA #TestCricket pic.twitter.com/yA8MzTtkWJ— MEHRA (@DevMehra790) November 22, 2025తొలి వికెట్ బుమ్రాకేఇక నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్క్రమ్.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, 27వ ఓవర్ ఐదో బంతికి బుమ్రా అద్భుత బంతితో మార్క్రమ్ను బౌల్డ్ చేశాడు. దీంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ నిష్క్రమించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. భారత్కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది. టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. మార్క్రమ్ (38).. ర్యాన్ రికెల్టన్తో కలిసి తొలి వికెట్కు 82 పరుగులు జోడించాడు. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ సమం చేసి పరువు నిలుపుకోగలుగుతుంది.చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అక్షర్పై వేటు.. నితీశ్ రెడ్డితో పాటు అతడి ఎంట్రీ
టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బర్సపరా వికెట్ ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలిస్తుందనే అంచనాతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొటిస్ జట్టు కెప్టెన్ తెంబా బవుమా తెలిపాడు. పిచ్పై ప్రస్తుతానికి పగుళ్లు లేవన్న బవుమా.. ఈ వికెట్పై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉన్నామని పేర్కొన్నాడు.గువాహటి వేదికగా జరిగే చారిత్రాత్మక తొలి టెస్టులో తాము భాగం కావడం సంతోషంగా ఉందని బవుమా హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. సెనురాన్ ముత్తుస్వామి జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరుటీమిండియా రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో రిషభ్ పంత్ పగ్గాలు చేపట్టాడు. బీసీసీఐ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.గిల్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశామన్న పంత్.. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్ను తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇక తొలిసారి భారత జట్టు టెస్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్న పంత్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. టాస్ ఓడటంపై స్పందిస్తూ.. బర్సపరా వికెట్ బ్యాటింగ్కు బాగుంటుందన్న పంత్.. బౌలింగ్ కూడా మరీ అంత చెత్త ఆప్షన్ ఏమీ కాదన్నాడు. శుబ్మన్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరతాడని పంత్ తెలిపాడు.టీమిండియాకు చావోరేవోఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టు జరుగగా.. భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక గువాహటి వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో పంత్ సేన చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై సఫారీల చేతిలో వైట్వాష్ కాకతప్పదు. మరోవైపు.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడటంతో పాటు.. తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో గువాహటి పిచ్ను ఎర్రమట్టితో తయారు చేయించినట్లు తెలుస్తోంది. తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ వికెట్.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ టాస్ ఓడటం భారత జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేభారత్కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.Updates: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 156-2(55)స్టబ్స్ 32, బవుమా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.డ్రింక్స్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 129-2 (42)బవుమా 24, స్టబ్స్ 19 పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా27.2: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన రికెల్టన్ (82 బంతుల్లో 35).టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 82-1 (26.5).ట్రిస్టన్ స్టబ్స్ 0, రికెల్టన్ 35 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా26.5: బుమ్రా బౌలింగ్లో మార్క్రమ్ (81 బంతుల్లో 38) బౌల్డ్.చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్లో టీమిండియా ఓటమి🚨 Toss 🚨#TeamIndia have been asked to bowl first Updates ▶️ https://t.co/Wt62QebbHZ#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/isE64twdaB— BCCI (@BCCI) November 22, 2025 -
భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన
త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్గా ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) ఎంపికయ్యారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్పై అరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.భారత్తో జరిగే వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు:టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్.భారత్తో జరిగే టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ -
IND vs SA: అతడిపై వేటు.. భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరు!
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహటి వేదికగా శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడం ఆందోళనకరంగా పరిణమించింది.గిల్ స్థానంలో రిషభ్ పంత్ (Rishabh Pant)ను బీసీసీఐ తాత్కాలిక కెప్టెన్గా నియమించింది. అయితే, తుదిజట్టులో గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పంత్ స్పందిస్తూ.. తాము ఇప్పటికే గిల్ రీప్లేస్మెంట్ గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ ఆటగాడి పేరు మాత్రం వెల్లడించలేదు.ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం (Saba Karim) కీలక వ్యాఖ్యలు చేశాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లను ఆడించాలని సూచించాడు. అదే విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వాలని పేర్కొన్నాడు.ఇందులో భాగంగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై వేటు వేయక తప్పదని సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అయితే, ఇలాంటి సమయంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్తో పాటు దేవ్దత్ పడిక్కల్ను కూడా తీసుకుంటే మంచిది.అతడిపై వేటు వేయాల్సి వస్తుందిఆరు స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగాలి. గువాహటిలో గెలవాలంటే ఇదే సరైన కాంబినేషన్. కాబట్టి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తప్పించకతప్పదు. బ్యాటింగ్, బౌలింగ్లో వైవిధ్యం కోసం అతడిపై వేటు వేయాల్సి వస్తుంది.కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ల కోటాలో తుదిజట్టులో ఉంటారు. ఇక పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ఉండనే ఉన్నారు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. సాయి, పడిక్కల్ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు లెఫ్ట్- రైట్ కాంబినేషన్ సెట్ అవుతుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో ఆరుగురుకాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్.. సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తొలి టెస్టులో భారత్ ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.చదవండి: గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ -
గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ
హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.గంభీర్ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్వాష్ అయింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి ఫామ్లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది. వేళ్లన్నీ గంభీర్ వైపేకోల్కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు.ఈ క్రమంలో గంభీర్ కూడా పిచ్ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘మా సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.అయితే, ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్కోచ్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.అదే విధంగా.. ఆసియా టీ20 కప్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్ సైకియా.. గంభీర్, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు. కాగా గంభీర్ గైడెన్స్లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్ -
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్ప్రైజ్.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్ తన రొమాంటిక్ ప్రపోజల్తో స్మృతిని సర్ప్రైజ్ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్కప్-2025 టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ప్రపంచకప్ గెలవాలన్న మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్లో తొలిసారి భారత్ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్గా, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్తో పాటు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్గా సత్తా చాటుతుండగా.. ఇండోర్కు చెందిన 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్కు గంభీర్ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా సారథిగా రిషభ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్.. తనకు కెప్టెన్గా అవకాశం ఇచ్చినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ధన్యవాదాలు తెలిపాడు.నా కెప్టెన్సీ అలాగే ఉంటుందిటీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్.. గువాహటి టెస్టులో తమ తుదిజట్టు కూర్పు గురించి స్పందించాడు. ‘‘మా బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాం.పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏదేమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడి దరిచేరనీయము. నా కెప్టెన్సీ సంప్రదాయబద్దంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్-ఆఫ్-ది- బాక్స్ కూడా ఆలోచిస్తా.ఆడాలని ఉన్నా..నిజానికి రెండో టెస్టులో ఆడాలని శుబ్మన్ ఎంతగానో పరితపించాడు. కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకూ ఇది ప్రత్యేకం.పిచ్ తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండవచ్చు. ఆతర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ మార్గదర్శనంలో ఆల్రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ..‘‘జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్టు ప్లేయర్ల కంటే కూడా ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీమ్ బ్యాలెన్స్ దృష్ట్యానే ఆల్రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప.. టెస్టు స్పెషలిస్టులను పక్కనపెట్టాలని కాదు’’ అని పంత్ స్పష్టం చేశాడు.ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాంఅదే విధంగా.. గిల్ స్థానంలో తుదిజట్టులోకి ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్ ప్లేస్లో ఎవరు ఆడతారో.. ఆ ప్లేయర్కు తెలుసు’’ అంటూ తాత్కాలిక కెప్టెన్ పంత్ మాట దాటవేశాడు. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా కోల్కతాలో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిస్తేనే టీమిండియా పరువు నిలుస్తుంది.ఇక కోల్కతా టెస్టులో టీమిండియా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లను ఆడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శుబ్మన్ గిల్ సఫారీలతో తొలి టెస్టులో భాగమయ్యారు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్


