breaking news
India Vs South Africa
-
గంభీర్పై వేటు తప్పదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!
సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్ కోచ్గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.కోచ్గా ఎలాంటి అనుభవం లేకపోయినా..టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్కోచ్గా తప్పుకోగా.. గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్గా గంభీర్కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయింది భారత్. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లలో చాంపియన్గా నిలిచి సత్తా చాటింది.ద్రవిడ్కే ఆ క్రెడిట్కానీ చాంపియన్స్ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ భాయ్ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు టైటిల్కు అందించిన హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు.పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అంతకుముందే స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్మన్ గిల్కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.సంధి కాలంఈ నేపథ్యంలో గంభీర్ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.కివీస్తో సిరీస్తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్ విజ్ఞప్తి చేశాడు.బీసీసీఐ నిర్ణయం ఇదే!ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్కప్ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్ను హెడ్కోచ్గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్.. సరికొత్త చరిత్ర -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సత్తా చాటింది. స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో 2-0తో వైట్వాష్ చేసింది. ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్లో విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ తాజా సీజన్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్స్వీప్ చేశారు.408 పరుగుల భారీ తేడాతోరెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో భారత్పై గెలిచిన సౌతాఫ్రికా.. గువాహటిలో చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన బర్సపరా స్టేడియంలో ఆద్యంత ఆధిపత్యం కనబరిచి.. టీమిండియా (IND vs SA 2nd Test)ను ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.తొలి జట్టుగా చరిత్ర తద్వారా ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. గతంలో ఆస్ట్రేలియా నాగ్పూర్ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో గెలవగా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది.కాగా టీమిండియాను వైట్వాష్ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లది కీలక పాత్ర. పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) రెండో టెస్టులో సత్తా చాటి ప్లేయర్గా నిలవగా.. సఫారీ పేసర్ సైమన్ హార్మర్ రెండు మ్యాచ్లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఘోర పరాజయాలు (పరుగుల పరంగా)🏏సౌతాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి- 2025, గువాహటి🏏ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి- 2008, నాగ్పూర్🏏పాకిస్తాన్ చేతిలో 341 పరుగుల తేడాతో ఓటమి- 2006, కరాచి🏏ఆస్ట్రేలియా చేతిలో 337 పరుగుల తేడాతో ఓటమి- 2007, మెల్బోర్న్🏏ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి- 2017, పూణె.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బర్సపరా స్టేడియం, గువాహటి👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్👉సౌతాఫ్రికా స్కోర్లు: 489 &260/5 డిక్లేర్డ్👉భారత్ స్కోర్లు: 201 &140👉ఫలితం: 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు.. సిరీస్ 2-0తో వైట్వాష్.చదవండి: సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే.. -
గంభీర్ కోచింగ్ అద్భుతం.. ఇదంతా ఆయన ఘనతే!
''కేవలం సంవత్సరం కాలంలో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జాతీయ కోఆర్డినేటర్ వినయ్ కుమార్ డోకానియా (Vinay Kumar Dokania) సెటైర్ వేశారు. సొంతగడ్డపై టెస్టుల్లో రెండో విజయవంతమైన వైట్వాష్కు అభినందనలు అంటూ చురక అంటించారు.దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లపై ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు గుప్పించారు. వీరిద్దరినీ తొలగించకపోతే భారత క్రికెట్కు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. 80, 90లలో కూడా భారత టెస్ట్ జట్టు ఇంత బలహీనంగా లేదని.. అగార్కర్, గంభీర్ వల్లే ఇప్పుడు అది సాధ్యమైందని దుయ్యబట్టారు. కోచ్ పదవికి గంభీర్ తనంత తానుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వారిద్దరినీ తొలగించాలిపటిష్టమైన భారత టెస్ట్ జట్టును గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భ్రష్టు పట్టించాడని, టి20 ఆల్ రౌండర్ల టీమ్గా మార్చేశాడని వినయ్ కుమార్ ధ్వజమెత్తారు. టి20 క్రికెటర్లతో నిండిన ఈ భారత జట్టు కంటే ఇంట్లోని చిన్న పిల్లలు బాగా క్రికెట్ ఆడతారని వ్యంగ్యంగా అన్నారు. అసంబద్ధ నిర్ణయాలతో ఇండియన్ క్రికెట్ జట్టును గంభీర్ ఎగతాళి చేశాడని మండిపడ్డారు. టీమిండియా 2027లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుందని.. గంభీర్, అగార్కర్లను తొలగించకపోతే మన జట్టు 5-0 తేడాతో ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.భారత టెస్ట్ క్రికెట్ హంతకుడుఅశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. టెస్ట్ క్రికెట్ నుంచి అవమానకరంగా రిటైర్ కావడానికి గంభీర్ కారణమయ్యాడని వినయ్ కుమార్ ఆరోపించారు. అసమర్థ టి20 క్రికెటర్లతో టెస్ట్ జట్టును నింపేశారని అన్నారు. తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రయోగాలతో ఆటగాళ్ల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గౌతమ్ గంభీర్ను భారత టెస్ట్ క్రికెట్ హంతకుడిగా అభివర్ణించారు. క్రికెట్ కోచింగ్ ఆయనకు సరిపడదని, రాజకీయాల్లోకి తిరిగి వెళ్లాలని గంభీర్కు సలహాయిచ్చారు. గంభీర్ తన అద్భుతమైన కోచింగ్, జట్టు కూర్పుతో 2027 సీజన్లో ఇండియాను WTC ఫైనల్స్కు వెళ్లకుండా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.సక్సెస్ రేటు డౌన్2016 నుంచి 2019 వరకు సొంతగడ్డపై టీమిండియా విజయాల శాతం 79 కాగా, 2020 నుంచి 2024 వరకు 73 శాతం సక్సెస్ రేటు సాధించిందని వినయ్ కుమార్ గుర్తు చేశారు. 2024 అక్టోబర్ నుంచి ఇది 29 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. ఇంతటి ఘనత సాధించిన గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు.చదవండి: భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది13 నెలల్లో ఆరుగురు..టీమిండియా టెస్ట్ టీమ్లో కీలకమైన మూడో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారని విమర్శించారు. రాహుల్ ద్రవిడ్ 15 ఏళ్లు, ఛతేశ్వర్ పుజారా పదేళ్ల పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశారని గుర్తు చేశారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 నెలల కాలంలోనే ఆరుగురిని మార్చారని తెలిపారు. శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, పడిక్కల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్లను మూడో స్థానంలో ఆడించిన విషయాన్ని వెల్లడించారు.I demand Bharat Ratna from Indian govt for Gautam Gambhir and Ajit Agarkar for these herculean achievements for Team India in just 1 year #IndvsSA pic.twitter.com/z5JpekDHFm— Vinay Kumar Dokania (@VinayDokania) November 26, 2025 -
మా కోచ్ ఒక్కడేనా?.. వాళ్లూ హద్దు దాటారు: బవుమా కౌంటర్
సౌతాఫ్రికా కెప్టెన్గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్వాష్ చేసిన ప్రొటిస్ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.సాష్టాంగపడేలా చేస్తాంగువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.కోచ్ కామెంట్స్పై బవుమా స్పందన ఇదేఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.హద్దు మీరి ప్రవర్తించారుఅదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్లో మా కోచ్ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్ లైన్ క్రాస్ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.కాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్కతాలో భారత్పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్ -
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
'భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది'
''టీమిండియాను సొంతగడ్డపై ఓడించలేరని ఒకప్పుడు అంటుండేవారు. కానీ ఇప్పుడు ఏ జట్టు అయినా భారత్లో భారత్ను ఓడించగలదు'' అంటూ ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాట పటిమ లేకుండా ప్రత్యర్థికి దాసోహమవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా భారీ ఓటమి అభిమానులను మరింత కుంగదీసింది.అన్ని విభాగాల్లో పైచేయి సాధించి టీమిండియాను సొంత గడ్డపై ఓడించిన దక్షిణాఫ్రికాపై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడమే కాకుండా, వైట్వాష్ చేయడంతో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విజయానికి సఫారీలు అన్నివిధాలా అర్హులని కితాబిస్తున్నారు. ఇక, భారత్ ఘోర వైఫల్యానికి హెచ్కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారకుడని టీమిండియా ఫ్యాన్స్ నిందిస్తున్నారు. భారత టెస్టు క్రికెట్ను నాశనం చేశాడని ఫైర్ అవుతున్నారు.నెటిజనుల మండిపాటుటీమిండియా (Team India) ఓటమిపై సోషల్ మీడియాలో నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గువాహటిలో ఇండియన్ టెస్టు క్రికెట్ ఈరోజు చనిపోయిందంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు సొంత గడ్డపై భారత జట్టుతో క్రికెట్ ఆడటానికి ప్రత్యర్థి జట్లు భయపడేవని, కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యాయని వాపోతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా, అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు టీమిండియాకు సొంతగడ్డపై ఓటమి అనేది ఊహల్లోకి కూడా వచ్చేది కాదని పేర్కొంటున్నారు. చదవండి: అందుకే ఓడిపోయాం.. ఓటమి నిరాశపరిచిందన్న పంత్సొంత గడ్డపై టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో నెటిజనులు మీమ్స్, సైటర్లతో విరుచుకుపడుతున్నారు. వీడియోలు, కామెంట్లతో పాటు గణాంకాలను జత చేసి టీమిండియా ఓటమిపై బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఓడిపోతారా అన్నట్టుగా ఆవేదన వెలిబుచ్చుతున్నారు. #INDvSA India in India pic.twitter.com/6PG6ylLI4a— ARMSB 🇮🇳 (@armsb_in) November 26, 2025They came,They saw,And Destroyed Indian Test Team 😆Once upon a time, India was undefeated on their home soil, but now any team can beat India in India 🤪- Who is responsible for India's Decline ?#IndianCricket pic.twitter.com/U2LfPOYsR9— Ankit Sharma (@AnkitsharmaINC) November 26, 2025With these four players in the team, no one could have even imagined defeating India in India. 🔥 pic.twitter.com/M19zalfUuS— Rajat (@RajatMemes_) November 26, 2025Lord Bavuma, 1st Proteas captain to whitewash India in India 🥳🥳🥳🥳🥳 #INDvSA #IndianCricket pic.twitter.com/XsluVHhDCO— Noko (@TruthOrPeace_) November 26, 2025Tamba Bavuma became 1st South Africa captain to win a test series in India in 25 years . Defeating India in IndiaUndefeated in the test as a captain.#INDvsSA #GautamGambhir#SAvsIND #IndianCricket pic.twitter.com/F3Uh8YRW9z— Innocent Indian (@InnocentIndiann) November 26, 2025Highest target Set by Team against India in India in Test549 - 🇿🇦 at Guwahati,2025*543 - 🇦🇺 at Nagpur,2004467 - 🇿🇦 at Eden Gardens,1996457 - 🇦🇺 at Bengaluru,2004452 - 🏴 at Chennai,1934447 - 🏝️ at Chennai,1959444 - 🏝️ at Kanpur,1958441 - 🇦🇺 at Pune,2017#INDvSA pic.twitter.com/dhbg0BuLXn— CricBeat (@Cric_beat) November 25, 2025History Created In Gautam Gambhir Era.India In India : pic.twitter.com/hiGcgHmqS1— Mr.CricGuy 🏏 (@mrcricguy) November 26, 2025 -
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.కాస్త నిరాశకు లోనయ్యాంఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.భారీ మూల్యమే చెల్లించాముఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. క్రికెట్లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్ పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్లు ఆడింది. కోల్కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇరవై ఐదేళ్ల తర్వాతఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్వాష్ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల దూరం కాగా.. పంత్ పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్ బౌలర్లు అడియాసలు చేశారు.ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్ హార్మర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్ రెండు, సెనూరన్ ముత్తుస్వామి ఒక వికెట్ తీశారు. పేసర్ మార్కో యాన్సెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యాన్సెన్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి భారత్ను 201 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. హార్మర్ (మొత్తంగా 17 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.చదవండి: Sai Sudharsan: సూపర్ స్లో బ్యాటింగ్! -
సాయి సుదర్శన్.. సూపర్ స్లో బ్యాటింగ్!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకునేందుకు చాలాసేపు క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల పదునైన బంతులను ఎదుర్కొనేందుకు బాగా కష్టపడ్డాడు. వికెట్ పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయవంతం కాలేకపోయాడు. ముత్తుసామి బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా అవుటయ్యాడు.27/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు 31 పరుగులు మాత్రమే జోడించి మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ యాదవ్ (5), ధ్రువ్ జురేల్(2), రిషబ్ పంత్(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.మరో ఎండ్లో సాయి సుదర్శన్ మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. 2 పరుగులతో చివరి రోజు ఆట మొదలు పెట్టిన ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ ఆత్మరక్షణ ధోరణిలో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. పరుగులు రాబట్టకపోయినా వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సిరీస్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్గా నిలిచాడు. 139 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్తో 14 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది సాయి ఎంత స్లోగా ఆడాడో. మ్యాచ్ ఎలాగూ ఓడిపోతాం కాబట్టి.. వికెట్లు పడకుండా ఉంటే డ్రా అవుతుందన్న ఉద్దేశంతో అతడు ఇలా బ్యాటింగ్ చేశాడని విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా చిత్తుమ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో 549 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ 140 పరుగులకు ఆలౌటయింది. అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 9వ వికెట్గా వెనుదిరిగాడు. జడేజా 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి కేశవ మహరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు.చదవండి: దక్షిణాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు -
టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!
ఊహించిందే జరిగింది.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA) 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కనీస పోరాట పటిమ కూడా కనబరచకుండా ‘స్టార్’ బ్యాటర్లంతా పెవిలియన్కు వరుస కట్టడం భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) -2025 విజేత సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు భారత్కు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఇరుజట్ల మధ్య కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది.ఆది నుంచే ఆధిపత్యంఅనంతరం భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.549 పరుగుల లక్ష్యంఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్ వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నెమ్మదిగా ఆడుతూనే 78.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్ జట్టు తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. టీమిండియాకు 549 పరుగుల (288+260) భారీ లక్ష్యాన్ని విధించింది.రెండో ఇన్నింగ్స్లో ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. టోనీ డి జోర్జీ (49) తృటిలో అర్ధ శతంక చేజార్చుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (13)ను యాన్సెన్ వెనక్కి పంపగా.. కేఎల్ రాహుల్ (6)ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.హార్మర్ విజృంభణఈ క్రమంలో 27/2 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ చుక్కలు చూపించాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (5)ను సైమన్ బౌల్డ్ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14)ను సెనూరన్ ముత్తుస్వామి వెనక్కి పంపాడు.ఆ తర్వాత సైమన్ హార్మర్ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్ జురెల్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. లాంఛనం పూర్తి చేసిన మహరాజ్ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్ కేశవ్ మహరాజ్.. మొహమ్మద్ సిరాజ్ (0) ఆఖరి వికెట్గా వెనక్కి పంపి టీమిండియా ఓటమిని ఖరారు చేశాడు. మొత్తంగా సైమన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ రెండు, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ యాన్సెన్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక సమిష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టు సిరీస్ గెలవడమే కాదు..వైట్వాష్ చేసింది కూడా!! భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 489 & 260/5 డిక్లేర్డ్భారత్: 201 & 140ఫలితం: 408 పరుగుల తేడాతో భారత్పై సౌతాఫ్రికా గెలుపుచదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు
స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదుర్కోవడానికి సిద్ధపడింది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా (IND vs SA Tests) చేతిలోనూ అదే చేదు ఫలితం పొందనుంది. గువాహటి వేదికగా ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్ సేన తడబడింది.భారీ ఆధిక్యం లభించినా..బర్సపరా స్టేడియంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు చేసింది. నిజానికి నాలుగో రోజు భారీ ఆధిక్యం లభించినా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంలో ప్రొటిస్ జట్టు ఆలస్యం చేసింది. ఆఖరి రోజు వరకు టీమిండియాను తిప్పలుపెట్టాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సాష్టాంగపడేలా చేస్తాంఈ విషయం గురించి సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ.. టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇలా చేశాము.వాళ్లు బ్యాటింగ్ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి మాదే పైచేయి అవుతుంది’’ అంటూ అవమానకరంగా మాట్లాడాడు.కాస్త హుందాగా ఉండండిఈ నేపథ్యంలో షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ మండిపడ్డారు. అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. ‘‘యాభై ఏళ్ల క్రితం అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ వెస్టిండీస్ జట్టును ఉద్దేశించి ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.విండీస్ అగ్రస్థానానికి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. సౌతాఫ్రికా ఇప్పుడు చారిత్రాత్మక సిరీస్ గెలిచేందుకు చేరువైంది. నిజానికి మీదే పైచేయిగా ఉన్నపుడు.. మీరు మాట్లాడే మాటలు కూడా అంతే హుందాగా ఉండాలి. కోచ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలా ఎవరైనా మాట్లాడతారా?ఇక ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇదే విషయంపై స్పందించాడు. ‘‘ఇది అసలు ఎలాంటి మాట? నిజానికి ఈ విషయంపై స్పందించాలని కూడా నేను అనుకోవడం లేదు. ఇదొక అసందర్భ ప్రేలాపన. సౌతాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం సాధించింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి మాటలను నేను అస్సలు సమర్థించను’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో స్టెయిన్ ఫైర్ అయ్యాడు.ఓటమి అంచున టీమిండియాఇదిలా ఉంటే.. గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఓటమికి చేరువైంది. టీ బ్రేక్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులే చేసింది. విరామం తర్వాత టీమిండియా మరింత కష్టాల్లో కూరుకుపోయింది. 56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు చేసింది. భారత్ విజయానికి 440 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా కేవలం నాలుగు వికెట్లు తీస్తే సిరీస్ సొంతం చేసుకోగలదు. ఇప్పటికే కోల్కతా వేదికగా సౌతాఫ్రికా టీమిండియాపై 30 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. Update: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!చదవండి: టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
రోడ్డు మీద కూడా ఆడలేరా?.. ఈ టెస్టు కూడా పోయినట్లేనా?
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.రోడ్డు మీద కూడా ఆడలేరా?ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్ మీద సఫారీలు రయ్ రయ్మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్వాష్ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చేదు అనుభవం తప్పదా?స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (93) ఇన్నింగ్స్ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగిసఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58)తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఫలితంగా 201 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలగా.. ప్రొటిస్ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.మరోసారి మనోళ్లు ఫెయిల్రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్క్రమ్ (29) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ భారీ హాఫ్ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్ ముల్దర్ (35 నాటౌట్) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి.. యాన్సెన్ బౌలింగ్లో వెనుదిరగగా.. కేఎల్ రాహుల్ 6 పరుగులు చేసి సైమన్ హార్మర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్ 2, కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!చదవండి: పీవీ సింధు ఫిట్నెస్పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
గువాహటి వేదికగా భారత్తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు.తొలి ఇన్నింగ్స్లో..ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్ను ఫాలో ఆన్ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్నైట్ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.టార్గెట్ ఎంతంటే?తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది సౌతాఫ్రికా. వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్ ముల్డర్ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్-5 జాబితా)🏏1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 403.. భారత్ విజయం (406/4)🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టార్గెట్ 387.. భారత్ విజయం (387/4)🏏2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టార్గెట్ 328.. భారత్ విజయం (329/7)🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 276.. భారత్ విజయం (276/5)🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్లో టార్గెట్ 264.. భారత్ విజయం (264/5).చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మరింతగా పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 395 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. గువాహటి వేదికగా 26/0 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది సౌతాఫ్రికా.ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగాడు. జడ్డూ బౌలింగ్లో మూడో బంతికి షాట్ ఆడబోయి బంతిని గాల్లోకి లేపిన ర్యాన్ రికెల్టన్ (35) సిరాజ్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.ఇక 29వ ఓవర్లో జడ్డూ మార్క్రమ్ (29)ను బౌల్డ్ చేయగా.. 32వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతం చేశాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) రూపంలో కీలక వికెట్ పడగొట్టాడు. వాషీ బౌలింగ్లో లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. 1-0తో ఆధిక్యంలో సౌతాఫ్రికాఇందులో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ మెరుగ్గా రాణించగా.. టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో ప్రొటిస్ జట్టు 489 పరుగులకు ఆలౌట్ అయింది. తేలిపోయిన భారత బ్యాటర్లుఅనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే మొగ్గుచూపింది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. UPDATE: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం 508 పరుగులుస్కోరు: 220/4 (70)చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
యాన్సెన్ జోరు...
‘కోల్కతాతో పోలిస్తే ఇక్కడి పిచ్ రోడ్డులా, బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది... కాబట్టి మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు’... ఆదివారం దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమైన తర్వాత భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అదే పిచ్ సోమవారానికి వచ్చే సరికి బౌలింగ్కు అనుకూలించింది. ఫలితంగా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రెండో రోజు బ్యాటింగ్తో దెబ్బ కొట్టిన మార్కో యాన్సెన్ మూడో రోజు తన బౌలింగ్ పదునుతో ఏకంగా ఆరు వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చాడు. అతని ‘షార్ట్’ బంతులను ఆడలేక బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరడంతో భారత్ భారీ ఆధిక్యం కోల్పోయింది. ఇప్పటికే సఫారీలు పట్టు బిగించగా...ఓటమి వెంటాడుతుండగా ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో మన జట్టు నిలిచింది.గువహటి: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులోనూ భారత్ ఓటమికి చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా భారత్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. రికెల్టన్ (13 బ్యాటింగ్), మార్క్రమ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 314 పరుగులు ముందంజలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్లో మరిన్ని పరుగులు జోడించి భారత్కు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఓవర్నైట్ స్కోరు 9/0తో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (97 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్కో యాన్సెన్ (6/48) చెలరేగిపోగా, హార్మర్కు 3 వికెట్లు దక్కాయి. టపటపా... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (22) తొలి గంటలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే మహరాజ్ చక్కటి బంతితో రాహుల్ను వెనక్కి పంపడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 85 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఒక దశలో భారత్ 95/1తో మెరుగైన స్థితిలో కనిపించింది. సఫారీల చక్కటి బౌలింగ్తో పాటు మన బ్యాటర్ల చెత్త షాట్లు జట్టు పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చాయి. 27 పరుగుల వ్యవధిలో టీమ్ 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చక్కటి షాట్లతో దూసుకుపోతున్న జైస్వాల్ ఆటకు యాన్సెన్ క్యాచ్తో తెరపడగా, సాయి సుదర్శన్ (15) విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో యాన్సెన్ బౌలింగ్ జోరు మొదలైంది. వరుసగా జురేల్ (0), పంత్ (7), నితీశ్ రెడ్డి (10), జడేజా (6)లను అతను వెనక్కి పంపించాడు. వీటిలో పంత్ మినహా మిగతా ముగ్గురు బౌన్సర్లకే వెనుదిరిగారు! పంత్ మాత్రం ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కీలక భాగస్వామ్యం... 122/7 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే గత మ్యాచ్ తరహాలోనే సుందర్ మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, అనూహ్యంగా కుల్దీప్ యాదవ్ (19) కూడా పట్టుదలగా క్రీజ్లో నిలబడి సహకరించాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలమని ముందు రోజు చెప్పిన కుల్దీప్ నిజంగానే క్రీజ్లో ఎలా నిలబడాలో ఆడి చూపిస్తూ ఇన్నింగ్స్లో అందరికంటే ఎక్కువగా 134 బంతులు ఎదుర్కోవడం విశేషం! ఈ జోడీ ఏకంగా 34.4 ఓవర్లు ఆడి ప్రధాన బ్యాటర్లకు పాఠం నేరి్పంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 72 పరుగులు జత చేయడంతో కాస్త పరువు నిలిచింది. సుందర్ను అవుట్ చేసి హార్మర్ ఈ జంటను విడదీయగా... తర్వాతి రెండు వికెట్లు యాన్సెన్ ఖాతాలోనే చేరాయి. 6.82 అడుగుల ఎత్తు ఉన్న యాన్సెన్ షార్ట్ బంతులను సమర్థంగా వాడుకోగా, మన బ్యాటర్లు ఆ వలలో పడ్డారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 58; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 22; సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) హార్మర్ 15; జురేల్ (సి) మహరాజ్ (బి) యాన్సెన్ 0; పంత్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 7; జడేజా (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 6; నితీశ్ రెడ్డి (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 10; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 48; కుల్దీప్ (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 19; బుమ్రా (సి) వెరీన్ (బి) యాన్సెన్ 5; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (83.5 ఓవర్లలో ఆలౌట్) 201. వికెట్ల పతనం: 1–65, 2–95, 3–96, 4–102, 5–105, 6–119, 7–122, 8–194, 9–194, 10–201. బౌలింగ్: యాన్సెన్ 19.5–5–48–6, ముల్డర్ 10–5–14–0, మహరాజ్ 15–1–39–1, హార్మర్ 27–6–64–3, మార్క్రమ్ 10–1–26–0, ముత్తుసామి 2–0–2–0.5: తొలి ఇన్నింగ్స్లో ఫీల్డర్గా ఎయిడెన్ మార్క్రమ్ పట్టిన క్యాచ్ల సంఖ్య. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన 15 మంది సరసన అతను చేరగా... దక్షిణాఫ్రికా తరఫున గ్రేమ్ స్మిత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. -
పాపం రాహుల్!.. అంత దూకుడు ఎందుకు?.. కాస్త తగ్గు సిరాజ్!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మూడో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. సోమవారం నాటి ఆట ముగిసే సరికి మొత్తంగా 314 పరుగుల ఆధిక్యం సంపాదించారు.గువాహటి వేదికగా రెండో టెస్టులో భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. బౌలర్ల పేలవ ఆట తీరు వల్ల సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే, ఇదే వేదికపై ప్రొటిస్ బౌలర్లు మాత్రం దుమ్ములేపారు.ఆరు వికెట్లతో చెలరేగి..ముఖ్యంగా పేస్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) ఆరు వికెట్లతో చెలరేగి.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. కీలక వికెట్లు తీసి.. పంత్ సేన 201 పరుగులకే కుప్పకూలడంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మాత్రం తామే బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకోగా.. వికెట్లు తీసేందుకు యత్నించిన బౌలర్లకు ఏమాత్రం కలిసిరాలేదు.పటిష్ట స్థితిలోనే..సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. బర్సపరా స్టేడియంలో సోమవారం ఆట పూర్తయ్యేసరికి ప్రొటిస్ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.కాగా అప్పటికే బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాకు.. మూడో రోజు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో సహజంగానే బౌలర్లు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ కాస్త దూకుడు ప్రదర్శించగా.. కేఎల్ రాహుల్ అతడిని వారించిన తీరు హైలైట్గా నిలిచింది.ఫ్రస్టేషన్లో సిరాజ్ మియా.. వైల్డ్ త్రోప్రొటిస్ రెండో ఇన్నింగ్స్లో సోమవారం నాటి ఆఖరి ఓవర్ (8)ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని రికెల్టన్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. సిరాజ్ బంతిని అందుకున్నాడు. అయితే, అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న సిరాజ్ మియా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపు వైల్డ్గా బాల్ త్రో చేశాడు.పంత్ ఆ బంతిని మిస్ కాగా.. స్లిప్స్లో అతడి వెనకే ఉన్న కేఎల్ రాహుల్ కష్టమ్మీద బంతిని ఒడిసిపట్టాడు. ఆ సమయంలో సిరాజ్ తన దూకుడు పట్ల పశ్చాత్తాపంగా నాలుక కరచుకోగా.. ‘అంత దూకుడు ఎందుకు.. కాస్త తగ్గు.. నెమ్మదిగా వెయ్’ అన్నట్లు రాహుల్ సైగ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.చదవండి: ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లేpic.twitter.com/xq4i771JXV— Nihari Korma (@NihariVsKorma) November 24, 2025 -
వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?: మాజీ క్రికెటర్
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) విమర్శించాడు. సౌతాఫ్రికాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటిచ్చిన సెలక్టర్లు.. అర్హుడైన మరో ఆటగాడిని మాత్రం ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. టెస్టుల్లో ఆడుతున్నాడనే కారణంతో ధ్రువ్ జురెల్ను వన్డేలకు కూడా సెలక్ట్ చేయడం సరికాదని విమర్శించాడు. కాగా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుండగా... ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.వాళ్లు దూరం.. వీరికి విశ్రాంతిఈ నెల 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్పూర్లో రెండో వన్డే, 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరుగుతాయి. సఫారీలతో తొలి టెస్టు సందర్భంగా గిల్ గాయపడగా... శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా అంతకుముందే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో గతంలో 12 మ్యాచ్ల్లో జట్టుకు సారథ్యం వహించిన రాహుల్కు మరోసారి అవకాశం దక్కింది.సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు.సంజూకు దక్కని చోటుఅయితే, ఈ జట్టులో సంజూ శాంసన్ పేరు మాత్రం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరఫున వన్డే ఆడిన సంజూ.. సెంచరీ చేశాడు. అది కూడా సౌతాఫ్రికా గడ్డపై శతక్కొట్టాడు. కానీ ఆ తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కనే లేదు. తాజాగా స్వదేశంలో ప్రొటిస్ జట్టుతో సిరీస్లో ఆడిస్తారని భావించగా.. మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ సంజూకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఈ జట్టులో ఒక పేరు కచ్చితంగా ఉండాలని నేను కోరుకున్నాను. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. దాదాపు రెండేళ్ల క్రితం వన్డే ఆడిన అతడు శతకంతో చెలరేగాడు.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?కానీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు సెలక్ట్ చేస్తారని భావించా. ఆడిన చివరి మ్యాచ్లో శతకం బాదిన ఆటగాడు జట్టులో చోటుకైనా అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు వికెట్ కీపర్ బ్యాటర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపికయ్యారు. సీనియర్ అయిన సంజూను కాదని.. వన్డేలో టీమిండియాకు ఆడిన అనుభవం లేని జురెల్కు సెలక్టర్లు చోటు ఇవ్వడం గమనార్హం. కాగా జురెల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 4 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 457, 12 పరుగులు చేశాడు.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టుకేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్. చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లే
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్ పారేసుకుని పెవిలియన్ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.దారుణంగా విఫలంసఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.పంత్ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. టెయిలెండర్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్ అనవసరపు షాట్కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్.. యాన్సెన్ బౌలింగ్లో స్లాగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంత్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.ఇలా ఎవరైనా చేస్తారా?కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.అతడిని త్వరగా అవుట్ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్ మ్యాచ్ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షోలో పంత్ షాట్ సెలక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
చరిత్ర సృష్టించిన యాన్సెన్.. పట్టు బిగించిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్ పర్యటనకు వచ్చింది. కోల్కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.సెంచరీ.. జస్ట్ మిస్బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ఆరు వికెట్లు పడగొట్టిఇక ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో చెలరేగిన యాన్సెన్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ (19), జస్ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్.ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్లో టెస్టు మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.పట్టు బిగించిన సౌతాఫ్రికాటీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్లో ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్ -
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం గంభీర్ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను కోల్కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్లో వాషీతో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్ చేశారు.అసలు సెన్స్ ఉందా?ఈ పరిణామాలపై కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.కోల్కతాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి? ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?కోల్కతా టెస్టులో వాషీని వన్డౌన్లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. మరీ అంత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ ఆధిక్యంలో సఫారీ జట్టుకాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ (288) కలుపుకొని.. భారత్ కంటే ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులతో రాణించాడు. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.అయితే, సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్ అయిన యాన్సెన్ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్ సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్తో చెలరేగిపోయాడు.భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.జైసూ హాఫ్ సెంచరీభారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.అంతా ఫెయిల్.. వాషీ ఒక్కడే..వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్కు పంపాడు.ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్.. బుమ్రా (5)ను కూడా అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్ హార్మర్ మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటయ్యా? అంటూ పంత్ సేనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: IND vs SA: పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే? -
గిల్ కోటాలో సాయి.. సీఎస్కే ప్లేయర్ను తీసుకోరా?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తడబడింది. మొదట పసలేని బౌలింగ్తో పరుగులు సమర్పించుకున్న భారత్.. తర్వాత బ్యాటింగ్లోనూ సత్తా చాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా.. టీమిండియా 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఫర్వాలేదని పించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఎదురీదుతోంది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ పేలవ ప్రదర్శన జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. సాయి 40 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ధ్రువ్ జురైల్(0), రిషబ్ పంత్(7), రవీంద్ర జడేజా(6), నితీశ్ కుమార్రెడ్డి (10) కూడా వరుసగా విఫలం కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.అయితే సోషల్ మీడియాలో సాయి సుదర్శన్పై నెటిజనులు ఎక్కువగా విమర్శలు కురిపిస్తున్నారు. శుబ్మన్ గిల్ (Shubman Gill) స్థానంలో అతడికి జట్టులో చోటు కల్పించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కడానికి గిల్ కోటా కారణమని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ స్నేహితుడు కాబట్టే సాయికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ స్థానంలో అదే జట్టు ఆటగాడిని తప్ప మరొకని తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్కు గిల్ కెప్టెన్గా కాగా, సాయి ఓపెనర్."గిల్ స్నేహితుడు కాబట్టి సాయి సుదర్శన్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఒకట్రెండు మ్యాచ్ల్లో విఫలమైతే చాలు ఇతర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతడినిటెస్టుల్లోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో చూపిన ప్రతిభ ఆధారంగా కాదని ఓ నెటిజన్ ఎక్స్లో కామెంట్ చేశారు. దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) లాంటి వారిని కాదని సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకున్నందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్ కనీసం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. టెస్టులో సాయి ప్రదర్శన అంతంత మాత్రమేనని పెదవి విరిచారు. సీఎస్కే ఆటగాడు కాబట్టే రుతురాజ్ను జట్టులోకి తీసుకోవడం లేదని అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.చదవండి: రిషబ్ పంత్పై నెటిజన్ల మండిపాటుటెస్టుల్లో విఫలంతమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ (Sai Sudharsan) గతేడాది జూన్లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో రెండు అర్ధసెంచరీలతో 288 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 87. వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండవ టెస్ట్లో ఈ స్కోరు నమోదు చేశారు. 24 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం బ్యాటర్లో ఇప్పటివరకు 3 వన్డేలు ఆడి 127 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 28 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 6 సెంచరీలతో 1396 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 40 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 1793 పరుగులు బాదాడు. టెస్టుల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. Sai Sudarshan * 39 avg in the domestic* 28 avg in Test * Came into test team on IPL runs * TN Ranji coach said his technique is not good enough for Test cricket * Indian Assistant coach admitted his technique against Spin is not good Playing on GT Captain Quota? #INDvSA pic.twitter.com/ul8U9pcWzJ— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) November 24, 2025 Another failure for Sai Sudharsan but still Ajit Agarkar and Gautam Gambhir are not going to pick Ruturaj Gaikwad.Because Ruturaj Gaikwad plays for CSK. pic.twitter.com/zxrGlzldfx— Abhishek Kumar (@Abhishek060722) November 24, 2025 -
అస్సలు నీవు కెప్టెన్వా?
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలుత బౌలింగ్లో విఫలమైన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 123 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9/0 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా రాహుల్(22), జైశ్వాల్(58) శుభారంభం అందించారు. తొలి వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటయ్యాక టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. సాయిసుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0) వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు.పంత్పై విమర్శలు..ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యత రహితంగా ఆడాడు. కష్టాల్లో పడిన జట్టును ఆదుకోవాల్సింది పోయి ర్యాష్ షాట్ ఆట ఆడి తన వికెట్ను కోల్పోయాడు. భారత్ ఇన్నింగ్స్ 38 ఓవర్ వేసిన సఫారీ స్పీడ్ స్టార్ మార్కో జాన్సెసన్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఈ క్రమంలో పంత్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి స్లాగ్ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే సౌతాఫ్రికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ పంత్ మాత్రం రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. క్లియర్గా ఎడ్జ్ తాకిందని తెలిసి మరి పంత్ రివ్యూ వృథా చేశాడు. రిప్లేలో భారీ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ షాట్ అవసరమా అంటూ పోస్ట్లు పెడుతున్నారు. కాగా 55 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 342 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్ ఆన్ గండం తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 142 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(23), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.చదవండి: IND vs SA: పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే? -
పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే?
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గైర్హాజరీ కారణంగా జట్టు పగ్గాలను రాహుల్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తాత్కాలిక వన్డే కెప్టెన్గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే పంత్కు కాకుండా రాహుల్ను నియమించడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు."సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో మాత్రమే కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శుభ్మన్ గిల్ తిరిగి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సమయానికి అందుబాటులో వచ్చే అవకాశముంది. అతడు తన గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఇక రిషబ్ పంత్ సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందుకే అతడిని కెప్టెన్సీ ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. కాగా పంత్ గతేడాది శ్రీలంకపై భారత్ తరపున చివరగా ఆడాడు. అప్పటి నుంచి వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు అతడు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనానికి అతడు సిద్దమయ్యాడు.ఇక ఈ వన్డే సిరీస్కు గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, జైశ్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్దీప్, ధ్రువ్ జురెల్. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బ్యాటింగ్లో తేలిపోయిన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్లో కూడా అదే తీరును కనబరుస్తోంది. లంచ్ సమయానికి ఏడు వికెట్ల ష్టానికి 174 పరుగులు చేసింది.పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును వాషింగ్టన్ సుందర్(33బ్యాటింగ్), కుల్దీప్(14బ్యాటింగ్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 52 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇంకా సౌతాఫ్రికా 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్ అన్ గండం తప్పించుకోవాలంటే మెన్ ఇన్ బ్లూ.. 116 పరుగులు చేయాలిటాపార్డర్ అట్టర్ ప్లాప్..9/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ఆరభించిన భారత్కు రాహుల్(22), జైశ్వాల్(58) శుభారంభం అందించారు. తొలి వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత రిషబ్ పంత్(7), నితీశ్ కుమార్ రెడ్డి(10), జడేజా(6) తీవ్ర నిరాశపరిచారు. ప్రోటీస్ బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్మర్ రెండు,మహారాజ్ ఓవికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది. -
పాపం సంజూ.. వరల్డ్ మోస్ట్ అన్లక్కీ క్రికెటర్
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.అదేవిధంగా ఈ సిరీస్కు గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. గిల్ స్ధానంలో గైక్వాడ్కు చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్ధానంలో తిలక్ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.సంజూ మరో 'సారీ'..ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్కు రెగ్యూలర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. పంత్ గైర్హజరీలో కూడా సంజూకు చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్ ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి సంజూను జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైరవతున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.శాంసన్ చివరగా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్లకు అతడికి చోటు దక్కలేదు. ఇప్పటివరకు 16 వన్డేలు ఆడిన సంజూ 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్దీప్, ధ్రువ్ జురెల్. -
400 పరుగులు దాటిన దక్షిణాఫ్రికా స్కోర్
గువహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. రెండో రోజు ఆటలో ప్రోటీస్ లోయర్-ఆర్డర్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు.ఏడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన సెనురన్ ముత్తుసామి(203 బంతుల్లో 107 బ్యాటింగ్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ముత్తుసామికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 247/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్లో పట్టు బిగించింది. ముత్తుసామి, కైల్ వెర్రెయెన్నె (45) నిలకడగా ఆడి స్కోర్ను 300 పరుగులు దాటించారు.టీ బ్రేక్ తర్వాత కైల్ వెర్రెయెన్నె పెవిలియన్కు చేరాడు. అనంతరం మార్కో జాన్సెన్ (51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57 ) దూకుడుగా ఆడి మూడో టెస్టు హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. జాన్సెన్ భారత స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అతడిని ఆపేందుకు బుమ్రాను ఎటాక్లోకి తీసుకొచ్చినప్పటి ఫలితం మాత్రం దక్కలేదు. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ సాధించాడు. పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్ -
కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై పంత్ సీరియస్ అయ్యాడు. కుల్దీప్ తన ఓవర్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్ అసహనం వ్యక్తం చేశాడు.అయితే పంత్ కోపానికి ఆర్ధం వుంది. ఎందుకంటే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన క్లాక్ రూల్ ప్రకారం.. ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపల తదుపరి ఓవర్ను ఆరంభించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు రెండు హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ చేసే జట్టు ఐదు పెనాల్టీ పరుగులు కలిపిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి.రెండోసారి వార్నింగ్..ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో కూడా పంత్కు ఇదే విషయంపై అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్ను సమయానికి ప్రారంభించనందును పంత్కు అంపైర్ రెండోసారి వార్నింగ్ ఇచ్చాడు. అదే మూడో సారి ఇదే సమస్యపై హెచ్చరిక వస్తే భారత్ ఐదు పరుగులు పెనాల్టీగా సౌతాఫ్రికాకు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే కుల్దీప్పై పంత్ ఫైరయ్యాడు. "30 సెకన్ల టైమర్ ఉంది. ఇంట్లో ఆడుతున్నాను అనుకున్నావా ఏంటి? త్వరగా ఒక బంతి వేయి. కుల్దీప్ ఇది నీకు రెండోసారి హెచ్చరిక"అని పంత్ గట్టిగా చెప్పాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. కాగా సౌతాఫ్రికా వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 112 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. క్రీజులో ముత్తుసామి(64), వెర్రియిన్(43) ఉన్నారు.What's going to be a good score for #TeamIndia to chase in the 1st innings? 💬#CheteshwarPujara backs the batters to score big in Guwahati! 🏟#INDvSA 2nd Test, Day 2 LIVE NOW 👉 https://t.co/J8u4bmcZud pic.twitter.com/vGjwWPopSm— Star Sports (@StarSportsIndia) November 23, 2025 -
భారత్తో రెండో టెస్టు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
గువహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా అధిపత్యం కొనసాగుతోంది. 247/6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.రెండో రోజు టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సెనూరన్ ముత్తుసామి (56 బ్యాటింగ్), కైల్ వెరీన్ (38 బ్యాటింగ్) తమ వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఎంతమంది బౌలర్లను మారుస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. తొలి సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తొలి రోజు ఆట మొదటి సెషన్లో కూడా సఫారీ బ్యాటర్లు పై చేయి సాధించారు. కానీ సెకెండ్ సెషన్లో భారత స్పిన్నర్లు కమ్ బ్యాక్ ఇవ్వడంతో 6 వికెట్లు నేల కూలాయి. ఇప్పుడు రెండో రోజు కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాలి.చదవండి: SA vs IND: పంత్, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్! -
పంత్, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్!
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. మెడ నొప్పి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న గిల్.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.దీంతో అతడు ప్రోటీస్తో వన్డే, టీ 20 సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశముందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా వైస్ కెప్టెన్ కూడా సఫారీలతో వన్డేలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత జట్టు పగ్గాలను ఎవరు చేపడతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.కెప్టెన్గా రాహుల్..రిషభ్ పంత్ కెప్టెన్సీ చేపడతాడనే వార్తలు వినిపించినప్పటికీ.. జట్టు మేనేజ్మెంట్ మాత్రం స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సెలక్టర్లు తమ నిర్ణయాన్ని రాహుల్కు తెలియజేశారంట. అందుకు రాహుల్ కూడా అంగీకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడనున్నారు. . గతంలో కూడా భారత జట్టు సారథిగా రాహుల్ వ్యవహరించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. పంత్తో పోలిస్తే కెప్టెన్గా రాహుల్కే మెరుగైన రికార్డు ఉంది. అతడి అభనువాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టు వన్డే పగ్గాలను అప్పగించేందుకు సెలక్టర్లు సిద్దమయ్యారు. సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించే ఛాన్స్ ఉంది. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: కెప్టెన్గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన -
రేపే జట్టు ప్రకటన.. టీమిండియాకు కొత్త కెప్టెన్?
సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం(నవంబర్ 23) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న గువహటిలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెలక్టర్ ఆర్పీ సింగ్, సెక్రటరీ దేవజిత్ సైకియా సమావేశమై స్క్వాడ్ను ఎంపిక చేయనున్నారు. అయితే ప్రోటీస్తో వన్డే సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కానున్నట్లు సమాచారం. మెడనొప్పి గాయం కారణంగా సఫారీలతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకొన్న గిల్.. పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు వస్తున్నాయి. అతడు తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నారు. హార్దిక్ తొడ కండరాల గాయం కారణంగా ఆసియా కప్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంకా అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు సౌతాఫ్రికాతో సిరీస్తో పాటు న్యూజిలాండ్తో వన్డేలకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సౌతాఫ్రికాతో వన్డేలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.కెప్టెన్గా రిషబ్ పంత్..?కాగా శుభ్మన్ గిల్ గైర్హజరీలో భారత వన్డే జట్టు పగ్గాలను స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వన్డేల్లో గిల్కు డిప్యూటీగా అయ్యర్ ఉన్నాడు. కానీ అయ్యర్ కూడా ఇప్పుడు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. పంత్ ప్రస్తుతం గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.ఇప్పటివరకు టెస్టు, టీ20ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన పంత్.. తొలిసారి వన్డే జట్టు బాధ్యతలను తీసుకునేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు వన్డే జట్టులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. సౌతాఫ్రికా-ఎతో జరిగిన అనాధికారిక వన్డే సిరీస్లో రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నవంబర్ 30 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: Bengal squad for SMAT: మహ్మద్ షమీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవరంటే? -
ముగిసిన తొలి రోజు ఆట.. సఫారీలదే పై చేయి
గువహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామి (25*), వెర్రిన్ (1*) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటీస్ జట్టుకు ఓపెనర్లు మార్క్రమ్ (38), రికెల్టన్ (35) శుభారంభాన్ని అందించారు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో తొలి వికెట్ను సాధించేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మార్క్రమ్ను ఔట్ చేయడంతో భారత్కు తొలి వికెట్ లభించింది. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే రెండో సెషన్లో మాత్రం భారత బౌలర్లు పుంజుకున్నారు.ముఖ్యంగా స్పిన్నర్లు కీలక వికెట్లు పడగొట్టారు. రికెల్టన్, స్టబ్స్, ముల్డర్లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు పంపగా.. బవుమాను జడ్డూ బోల్తా కొట్టించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో? -
IND vs SA: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరెంతంటే?
టీమిండియాతో రెండో టెస్టులో ఓపెనర్లు సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ కలిసి ఆచితూచి ఆడుతూ తొలి వికెట్కు 161 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. ఎట్టకేలకు టీ విరామ సమయానికి ముందు మార్క్రమ్ను పెవిలియన్కు పంపాడు.ఇదే జోరులో బ్రేక్కు వెళ్లి వచ్చిన వెంటనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మ్యాజిక్ చేశాడు. ర్యాన్ రికెల్టన్ను అవుట్ చేసి భారత్కు రెండో వికెట్ అందించాడు. ఏదేమైనా ఓపెనర్లు మార్క్రమ్- రికెల్టన్ 82 పరుగుల భాగస్వామ్యం కారణంగా సౌతాఫ్రికాకు శుభారంభమే లభించిందని చెప్పవచ్చు.స్టబ్స్, బవుమా నిలకడగా..ఇక ఓపెనర్లు అవుటైన తర్వాత వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబా బవుమా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఫలితంగా భోజన విరామ సమయానికి (మధ్యాహ్నం 1.24 నిమిషాలు) సౌతాఫ్రికా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్టబ్స్ 82 బంతుల్లో 32, బవుమా 86 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచారు.భారత బౌలర్లలో పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా ముందుకు సాగుతోంది. తొలిసారి ఇలాకాగా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి డే మ్యాచ్లో ముందుగా టీ విరామం ఇచ్చి.. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి. గువాహటిలో సూర్యోదయం, సూర్యస్తమయానికి అనుగుణంగా టైమింగ్స్ ఇలా సెట్ చేశారు. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్ -
ఎంత పని చేశావు రాహుల్?!.. బుమ్రా రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test)కు ఆరంభం నుంచే పెద్దగా కలిసి రావడం లేదు. గువాహటిలో టాస్ ఓడి తొలుత బౌలింగ్కు దిగిన భారత్ టీ విరామ సమయం వరకు కనీసం ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయింది. వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.నిలకడగా ఆడిన ఓపెనర్లుప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించగా.. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయలేక అవస్థలు పడ్డారు. నిజానికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే మార్క్రమ్ను వెనక్కి పంపే సువర్ణావకాశం టీమిండియాకు వచ్చింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏడో ఓవర్ రెండో బంతిని గంటకు 142.5 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.క్యాచ్ జారవిడిచిన రాహుల్ఈ గుడ్లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో ముందుకు వచ్చిన మార్క్రమ్ బ్యాట్ అంచుకు తాకిన బంతి.. గాల్లోకి లేచింది. ఈ క్రమంలో సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ (KL Rahul) తన ఎడమ పక్కకు జరిగిన మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని రీతిలో రాహుల్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బుమ్రా.. ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.KL Rahul dropped the catch of A Markram 🫣#TeamIndia #IndvSA #TestCricket pic.twitter.com/yA8MzTtkWJ— MEHRA (@DevMehra790) November 22, 2025తొలి వికెట్ బుమ్రాకేఇక నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్క్రమ్.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, 27వ ఓవర్ ఐదో బంతికి బుమ్రా అద్భుత బంతితో మార్క్రమ్ను బౌల్డ్ చేశాడు. దీంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ నిష్క్రమించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. భారత్కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది. టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. మార్క్రమ్ (38).. ర్యాన్ రికెల్టన్తో కలిసి తొలి వికెట్కు 82 పరుగులు జోడించాడు. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ సమం చేసి పరువు నిలుపుకోగలుగుతుంది.చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అక్షర్పై వేటు.. నితీశ్ రెడ్డితో పాటు అతడి ఎంట్రీ
టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బర్సపరా వికెట్ ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలిస్తుందనే అంచనాతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొటిస్ జట్టు కెప్టెన్ తెంబా బవుమా తెలిపాడు. పిచ్పై ప్రస్తుతానికి పగుళ్లు లేవన్న బవుమా.. ఈ వికెట్పై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉన్నామని పేర్కొన్నాడు.గువాహటి వేదికగా జరిగే చారిత్రాత్మక తొలి టెస్టులో తాము భాగం కావడం సంతోషంగా ఉందని బవుమా హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. సెనురాన్ ముత్తుస్వామి జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరుటీమిండియా రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో రిషభ్ పంత్ పగ్గాలు చేపట్టాడు. బీసీసీఐ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.గిల్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశామన్న పంత్.. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్ను తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇక తొలిసారి భారత జట్టు టెస్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్న పంత్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. టాస్ ఓడటంపై స్పందిస్తూ.. బర్సపరా వికెట్ బ్యాటింగ్కు బాగుంటుందన్న పంత్.. బౌలింగ్ కూడా మరీ అంత చెత్త ఆప్షన్ ఏమీ కాదన్నాడు. శుబ్మన్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరతాడని పంత్ తెలిపాడు.టీమిండియాకు చావోరేవోఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టు జరుగగా.. భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక గువాహటి వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో పంత్ సేన చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై సఫారీల చేతిలో వైట్వాష్ కాకతప్పదు. మరోవైపు.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడటంతో పాటు.. తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో గువాహటి పిచ్ను ఎర్రమట్టితో తయారు చేయించినట్లు తెలుస్తోంది. తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ వికెట్.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ టాస్ ఓడటం భారత జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేభారత్కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.Updates: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 156-2(55)స్టబ్స్ 32, బవుమా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.డ్రింక్స్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 129-2 (42)బవుమా 24, స్టబ్స్ 19 పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా27.2: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన రికెల్టన్ (82 బంతుల్లో 35).టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 82-1 (26.5).ట్రిస్టన్ స్టబ్స్ 0, రికెల్టన్ 35 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా26.5: బుమ్రా బౌలింగ్లో మార్క్రమ్ (81 బంతుల్లో 38) బౌల్డ్.చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్లో టీమిండియా ఓటమి🚨 Toss 🚨#TeamIndia have been asked to bowl first Updates ▶️ https://t.co/Wt62QebbHZ#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/isE64twdaB— BCCI (@BCCI) November 22, 2025 -
భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన
త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్గా ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) ఎంపికయ్యారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్పై అరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.భారత్తో జరిగే వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు:టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్.భారత్తో జరిగే టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ -
IND vs SA: అతడిపై వేటు.. భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరు!
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహటి వేదికగా శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడం ఆందోళనకరంగా పరిణమించింది.గిల్ స్థానంలో రిషభ్ పంత్ (Rishabh Pant)ను బీసీసీఐ తాత్కాలిక కెప్టెన్గా నియమించింది. అయితే, తుదిజట్టులో గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పంత్ స్పందిస్తూ.. తాము ఇప్పటికే గిల్ రీప్లేస్మెంట్ గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ ఆటగాడి పేరు మాత్రం వెల్లడించలేదు.ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం (Saba Karim) కీలక వ్యాఖ్యలు చేశాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లను ఆడించాలని సూచించాడు. అదే విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వాలని పేర్కొన్నాడు.ఇందులో భాగంగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై వేటు వేయక తప్పదని సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అయితే, ఇలాంటి సమయంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్తో పాటు దేవ్దత్ పడిక్కల్ను కూడా తీసుకుంటే మంచిది.అతడిపై వేటు వేయాల్సి వస్తుందిఆరు స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగాలి. గువాహటిలో గెలవాలంటే ఇదే సరైన కాంబినేషన్. కాబట్టి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తప్పించకతప్పదు. బ్యాటింగ్, బౌలింగ్లో వైవిధ్యం కోసం అతడిపై వేటు వేయాల్సి వస్తుంది.కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ల కోటాలో తుదిజట్టులో ఉంటారు. ఇక పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ఉండనే ఉన్నారు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. సాయి, పడిక్కల్ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు లెఫ్ట్- రైట్ కాంబినేషన్ సెట్ అవుతుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో ఆరుగురుకాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్.. సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తొలి టెస్టులో భారత్ ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.చదవండి: గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ -
గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ
హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.గంభీర్ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్వాష్ అయింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి ఫామ్లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది. వేళ్లన్నీ గంభీర్ వైపేకోల్కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు.ఈ క్రమంలో గంభీర్ కూడా పిచ్ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘మా సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.అయితే, ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్కోచ్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.అదే విధంగా.. ఆసియా టీ20 కప్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్ సైకియా.. గంభీర్, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు. కాగా గంభీర్ గైడెన్స్లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్ -
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్ప్రైజ్.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్ తన రొమాంటిక్ ప్రపోజల్తో స్మృతిని సర్ప్రైజ్ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్కప్-2025 టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ప్రపంచకప్ గెలవాలన్న మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్లో తొలిసారి భారత్ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్గా, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్తో పాటు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్గా సత్తా చాటుతుండగా.. ఇండోర్కు చెందిన 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్కు గంభీర్ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా సారథిగా రిషభ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్.. తనకు కెప్టెన్గా అవకాశం ఇచ్చినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ధన్యవాదాలు తెలిపాడు.నా కెప్టెన్సీ అలాగే ఉంటుందిటీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్.. గువాహటి టెస్టులో తమ తుదిజట్టు కూర్పు గురించి స్పందించాడు. ‘‘మా బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాం.పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏదేమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడి దరిచేరనీయము. నా కెప్టెన్సీ సంప్రదాయబద్దంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్-ఆఫ్-ది- బాక్స్ కూడా ఆలోచిస్తా.ఆడాలని ఉన్నా..నిజానికి రెండో టెస్టులో ఆడాలని శుబ్మన్ ఎంతగానో పరితపించాడు. కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకూ ఇది ప్రత్యేకం.పిచ్ తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండవచ్చు. ఆతర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ మార్గదర్శనంలో ఆల్రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ..‘‘జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్టు ప్లేయర్ల కంటే కూడా ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీమ్ బ్యాలెన్స్ దృష్ట్యానే ఆల్రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప.. టెస్టు స్పెషలిస్టులను పక్కనపెట్టాలని కాదు’’ అని పంత్ స్పష్టం చేశాడు.ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాంఅదే విధంగా.. గిల్ స్థానంలో తుదిజట్టులోకి ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్ ప్లేస్లో ఎవరు ఆడతారో.. ఆ ప్లేయర్కు తెలుసు’’ అంటూ తాత్కాలిక కెప్టెన్ పంత్ మాట దాటవేశాడు. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా కోల్కతాలో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిస్తేనే టీమిండియా పరువు నిలుస్తుంది.ఇక కోల్కతా టెస్టులో టీమిండియా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లను ఆడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శుబ్మన్ గిల్ సఫారీలతో తొలి టెస్టులో భాగమయ్యారు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ -
టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెకెండ్ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో భారత జట్టు సారథిగా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. జట్టుతో పాటు గిల్ గువహటికి వెళ్లినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. గిల్ తన గాయం నుంచి కోలుకోనేంందుకు తిరిగి ముంబైకి వెళ్లనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత కెప్టెన్ ముంబైలోని డాక్టర్ దిన్షా పార్దివాలా వద్ద చికిత్స పొందనున్నాడు. దీంతో గిల్ నవంబర్ 30 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశముంది.గిల్కు ఏమైందంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్కు మెడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని కోల్కతాలోని వుడ్స్ల్యాండ్ అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ తర్వాత అతడిని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం నెక్ బ్యాండ్ లేకుండా గిల్ కన్పించడంతో రెండో టెస్టులో ఆడుతాడని చాలా భావించారు. అతడు జట్టుతో పాటు గువహటికి వెళ్లడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ అతడికి ఇంకా పూర్తి స్ధాయిలో నొప్పి తగ్గలేదు. అందుకే అతడిని రెండో టెస్టు నుంచి బీసీసీఐ తప్పించింది.38వ టెస్టు కెప్టెన్గా..టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తొలిసారి చేపట్టేందుకు పంత్ సిద్దమయ్యాడు. టీ20 క్రికెట్లో సారథిగా అపారమైన అనుభవం కలిగి ఉన్న పంత్.. సంప్రాదాయ క్రికెట్లో ఎలా జట్టును నడిపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా కెప్టెన్గా పంత్ వ్యవహరించాడు. 2017-18 రంజీ ట్రోఫీ సీజన్లో ఇషాంత్ శర్మ గైర్హజరీలో ఢిల్లీ జట్టును పంత్ నడిపించాడు. ఆ సీజన్లో పంత్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా నిరాశపరిచినప్పటికి.. అతడి నాయకత్వంలో ఢిల్లీ ఫైనల్కు చేరింది. పంత్ ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించగా.. రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్నాడు.రెండు మ్యాచ్లు డ్రాగా ముగిసింది. అదేవిధంగా గతంలో భారత టీ20 జట్టు కెప్టెన్గా కూడా పంత్ బాధ్యతలు నిర్వర్తించాడు. సీనియర్ ఆటగాళ్లు గైర్హజరీలో ఐదు టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ ఐదు మ్యాచ్లలో భారత్ రెండింట విజయం సాధించగా.. రెండో మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఐపీఎల్లో పంత్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా పంత్ పనిచేశాడు. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంత్ 57 మ్యాచ్లలో నాయకత్వం వహించాడు.ఇందులో 30 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. అతడి విన్నింగ్ శాతం 52.63గా ఉంది. టీ20ల్లో కెప్టెన్గా సాహసోపేతమైన నిర్ణయాలు, ఫీల్డ్ ప్లేస్మెంట్లు సెట్ చేయడంలో పంత్ది దిట్ట. మరి టెస్టుల్లో అదే మైండ్ సెట్తో వెళ్తాడా లేదా? తన శైలికి భిన్నంగా జట్టును నడిపిస్తాడో వేచి చూడాలి. కాగా భారత టెస్టు జట్టుకు 38వ కెప్టెన్గా పంత్ రికార్డులకెక్కాడు. -
ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్కు గంభీర్ సలహా ఇదే
టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill). భారత జట్టు టెస్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్గానూ పగ్గాలు చేపట్టాడు. ఇక అంతకంటే ముందే ఆసియా కప్-2025 సందర్భంగా టీమిండియా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.విరామం లేని షెడ్యూల్ఇలా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న గిల్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా ఆట మధ్యలోనే నిష్క్రమించి.. మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. ఐసీయూలో చికిత్స పొందిన ఈ కెప్టెన్ సాబ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫలితంగా గువాహటిలో సఫారీలతో జరిగే రెండో టెస్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కాగా నిద్రలేమి, అవిశ్రాంతంగా ఆడటం వల్లే గిల్ మెడ నొప్పి తీవ్రమైందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే.. పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సైతం పనిభారం తగ్గించుకునే క్రమంలో ఇంగ్లండ్లో ఐదింటికి కేవలం రెండే టెస్టులు ఆడిన విషయం తెలిసిందే.వారికి విశ్రాంతిఅంతేకాదు.. సౌతాఫ్రికాతో టీ20లకు కూడా బుమ్రా దూరంగా ఉండనున్నాడని.. అతడితో పాటు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు కూడా సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మరోసారి చర్చ మొదలైంది.ఈ విషయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) వైఖరి ఏమిటన్న ప్రశ్నలు మొదలుకాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాను ఈ విషయం గురించి గంభీర్తో చర్చించినపుడు ఆటగాళ్లను ఉద్దేశించి అతడు ఓ కీలక సూచన చేశాడని తాజాగా వెల్లడించాడు.ఐపీఎల్ ఆడకపోతే సరిజియోస్టార్తో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ‘‘వెస్టిండీస్తో టీమిండియా టెస్టు మ్యాచ్ సందర్భంగా నేను గౌతమ్ను ఓ ప్రశ్న అడిగాను. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు ఏం చేయాలంటారు? అని అడిగాను. అందుకు అతడు.. ‘ఐపీఎల్ ఆడకపోతే సరి’ అని సమాధానం ఇచ్చాడు.‘ఐపీఎల్లో కెప్టెన్గా ఉంటే.. అదనపు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటపుడు సారథిగా ఉండకుండా పగ్గాలు వదిలేయడం ఇంకా మంచిది. ఒకవేళ టీమిండియా కోసం ఆడాలనుకుంటే.. ఫిట్గా ఉండటంతో పాటు మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి.అలా జరగాలంటే ఐపీఎల్ వంటి టోర్నీలను వదిలేస్తే సరి’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు’’ అని తెలిపాడు. ఏదేమైనా టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు అదనపు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుస సిరీస్లు ఆడగలరని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మానసికంగా బలంగా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్కు విరామం ఇవ్వాల్సిన అవసరం రాదని అభిప్రాయపడ్డాడు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ -
శుబ్మన్ గిల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. అంతేకాదు అతడు జట్టును వీడి తిరిగి ముంబైకి పయనమైనట్లు సమాచారం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియాతో రెండు టెస్టులు (IND vs SA) ఆడేందుకు సౌతాఫ్రికా ఇక్కడకు వచ్చింది.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. కోల్కతా వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగగా సౌతాఫ్రికా టీమిండియాపై ముప్పై పరుగుల తేడాతో గెలిచింది. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది.ఆ మరుసటి రోజు గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు వెల్లడించింది. అయితే, మెడ నొప్పి ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో టెస్టుకు గిల్ దూరమవుతాడనే అంచనాలు రాగా.. అనూహ్యంగా అతడు జట్టుతో పాటు గువాహటికి ప్రయాణం చేశాడు. తద్వారా మ్యాచ్కు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు.అయితే, గిల్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు ఫిజియోలు, వైద్యులు నిర్ణయించలేదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ గురువారం మీడియా సమావేశంలో తెలిపాడు. శుక్రవారం సాయంత్రానికి గిల్ పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు. తాజా సమాచారం ప్రకారం గిల్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.జట్టు నుంచి రిలీజ్!టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ గిల్ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. కోలుకునే దశలో భాగంగా అతడిని మళ్లీ ముంబైకి పంపించినట్లు తెలుస్తోంది. బోర్డు సూచన మేరకు కొన్నాళ్ల పాటు గిల్ ముంబైలో డాక్టర్ దిన్షా పార్థీవాలా పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం. రికవరీని బట్టి గిల్ సౌతాఫ్రికాతో వన్డేలు ఆడతాడా? లేదా? అన్న విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుంది. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై టెస్టులలో మరో ఘోర పరాభవం తప్పదు.చదవండి: IND vs SA: 'నీ ఈగోను పక్కన పెట్టు'.. టీమిండియా ఓపెనర్కు వార్నింగ్ -
'నీ ఈగోను పక్కన పెట్టు'.. టీమిండియా ఓపెనర్కు వార్నింగ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్.. స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. కీలకమైన రెండో టెస్టు కోసం జైశ్వాల్ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. జైశూ తన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బలహీనతను అధిగమించేందుకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆధ్వర్యంలో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశాడు. ఈ నేపథ్యంలో గౌహతి టెస్టుకు ముందు జైశ్వాల్ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. జైశ్వాల్ తన అహంకారాన్ని (Ego) పక్కన పెట్టి జాగ్రత్తగా ఆడాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. సాధారణంగా జైశ్వాల్ దూకుడుగా ఆడి జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని అందిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఆడే ప్రయత్నంలో తన వికెట్ను కూడా యశస్వి కోల్పోతుంటాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో జైశ్వాల్ కేవలం 12 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతడు సఫారీ స్పీడ్ స్టార్ మార్కో జాన్సెన్కే వికెట్ సమర్పించుకున్నాడు."యశస్వి జైశ్వాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అతడు చాలా సందర్భాల్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లకే ఔటయ్యాడు. అయితే గౌహతిలో రెండో టెస్టు జరగనుండడం జైశ్వాల్కు కలిసిస్తోంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్కు గౌహతిలోని బర్సపారా స్టేడియం హోం గ్రౌండ్గా ఉంది. అక్కడ చాలా ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. కాబట్టి పిచ్ కండీషన్స్పై జైశ్వాల్ పూర్తి అవగాహన ఉంటుంది. ఈ మ్యాచ్లో కూడే జైశ్వాల్ దూకుడుగా ఆడే విధానాన్ని కొనసాగిస్తాడని అనుకుంటున్నాను. కానీ మార్కో జాన్సెన్ను మాత్రం కాస్త ఆచితూచి ఆడాలి. ఎందుకంటే అతడు చాలా డేంజరస్ బౌలర్.కాబట్టి నీ ఈగోను పక్కన పెట్టి క్రీజులో నిలదొక్కకోవడానికి ప్రయత్నించాలి. జాన్సెన్ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే ఆ ప్రయత్నంలో మరోసారి ఔటయ్యే ప్రమాదం ఉందని" స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్ ప్లాన్'లో చోప్రా పేర్కొన్నాడు. కాగా రెండో టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరమయ్యే అవకాశముంది. అతడి స్ధానంలో రిషబ్ పంత్ జట్టు పగ్గాలను చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.చదవండి: IPL 2026: 'అతడొక అద్భుతం.. ఆర్సీబీ ప్లాన్ ఇదే' -
అది ఎవరి పని?.. బీసీసీఐ తీరుపై మండిపడ్డ మాజీ క్రికెటర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి మండిపడ్డాడు. సీనియర్ ఆటగాళ్ల విషయంలో మేనేజ్మెంట్ వైఖరి సరిగా లేదని విమర్శించాడు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని సాకులు చెబుతూ కావాలనే పక్కకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఇక అతడు టెస్టులు ఆడి రెండేళ్లకు పైగానే గడిచిపోయింది. అంతర్జాతీయ టీ20లలో కూడా షమీకి ప్రాధాన్యం దక్కడం లేదు. అయితే, వన్డేల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచి మేనేజ్మెంట్ అతడిని పక్కనపెట్టింది.మాటల యుద్ధంఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- షమీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. షమీ ఫిట్గా లేడంటూ అగార్కర్ చెప్పగా.. రంజీల్లో బెంగాల్ తరఫున వికెట్లు తీస్తూ షమీ ఆటతో కూడా అతడికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇక రంజీల్లో సత్తా చాటినప్పటికీ సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు షమీని ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ మాజీ ఆటగాడు మనోజ్ తివారి తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా సర్కిల్లో పరస్పర నమ్మకం, అర్ధం చేసుకునే తత్వం కొరవడిందని అనిపిస్తోంది. దేశీ క్రికెట్లో బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ నిలకడగా ఆడుతూ వికెట్లు తీస్తున్నాడు.కానీ టెస్టులకు అతడిని అసలు ఎంపిక చేయడమే లేదు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలకు కూడా అతడిని సెలక్ట్ చేయలేదు. షమీ ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని చీఫ్ సెలక్టర్ బహిరంగంగా చెబుతాడు.అది ఎవరి పని?అయినా.. ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి అడగాల్సిన బాధ్యత ఎవరిదో అతడికి తెలియదా?.. ఫిజియోలు, ట్రెయినర్లు ఏం చేస్తున్నారు? వారే కదా ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి ఆరా తీసి సెలక్టర్లకు చెపాల్సింది. ఇప్పటికైనా మీకు ఫోన్లను కాస్త వాడండి. ఆటగాళ్లకు కాల్ చేసి వారి నుంచి సమాధానం తెలుసుకోండి.షమీ చాలా ఏళ్లుగా జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడికి కనీస గౌరవం ఇవ్వండి. అతడికి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. కోచ్, సెలక్షన్ కమిటీ నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత అది’’ అని మనోజ్ తివారి టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. కోల్కతా వేదికగా తొలిటెస్టులో సఫారీ జట్టు చేతిలో ముప్పై పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటి వేదిక.చదవండి: IPL 2026: ‘సన్రైజర్స్కు అతడు దొరకడు.. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’ -
గిల్ స్థానంలో అతడే ఆడతాడు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆడతాడా? లేదా? అన్న సందిగ్దం నెలకొంది. కోల్కతాలో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పి కారణంగా గిల్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు.అయితే, గిల్ మెడ నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఇంకా పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలోనే అతడు గువాహటి టెస్టు ఆడడనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) గురువారం స్పందించాడు.కెప్టెన్ కోలుకుంటున్నాడు‘‘గిల్ కోలుకుంటున్నాడు. నిన్ననే అతడిని కలిశాను. తనకు పెద్దగా సమస్య లేదు. అయితే, అతడు ఆడతాడా? లేదా అన్న అంశంపై శుక్రవారం సాయంత్రమే స్పష్టత వస్తుంది. ఫిజియోలు, డాక్టర్ల నిర్ణయాన్ని బట్టే అతడి ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ప్రస్తుతానికి గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ మ్యాచ్ సమయంలో నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలను కొట్టిపడేయలేము. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే కచ్చితంగా అతడికి విశ్రాంతినిస్తాం. ఏదేమైనా కీలక బ్యాటర్, కెప్టెన్గా గిల్ సేవల్ని మాత్రం మేము కోల్పోతాము.అయినా మరేం పర్లేదు. ఒకవేళ గిల్ ఆడకపోయినా.. మాకు చాలా మంది బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్లంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లే. జట్టు కోసం వచ్చి ఆడతారు. గిల్ ఆడాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే, అతడి ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.గిల్ స్థానంలో అతడే ఆడతాడుగిల్ ఆడే నాలుగో స్థానంలో ధ్రువ్ జురెల్ అందుబాటులో ఉండనే ఉన్నాడు. అయితే, గిల్ ప్లేస్లో తుదిజట్టులోకి ఎవరు వస్తారనేది రేపే నిర్ణయిస్తాం’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇదిలా ఉంటే.. కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలో గెలిస్తేనే రెండు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 1-1తో సమం చేయగలదు.చదవండి: IPL 2026: ‘సన్రైజర్స్కు అతడు దొరకడు.. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’ -
గంభీర్ మాస్టర్ ప్లాన్తో వాళ్లకు చెక్!.. ఎవరీ మిస్టరీ స్పిన్నర్?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఊహించని ఫలితాన్ని పొందింది. ప్రొటిస్ బ్యాటర్ల కోసం బిగించిన స్పిన్ ఉచ్చులో.. మనవాళ్లే చిక్కుకుపోయి విలవిల్లాడారు. సఫారీ స్పిన్నర్లు సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) ధాటికి తాళలేక చేతులెత్తేశారు.కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 93 పరుగులకే కుప్పకూలి ఓటమిని ఆహ్వానించారు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో పిచ్ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో గువాహటిలో సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాతక్మకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ను సమం చేయగలుగుతుంది. ఇలాంటి తరుణంలో బర్సపరా క్రికెట్ మైదానంలో ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని బీసీసీఐ సంకల్పించింది.ఈ నేపథ్యంలో పేస్తో పాటు ఎక్కువగా బౌన్స్ అవుతూ.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ను క్యూరేటర్ రూపొందించినట్లు సమాచారం. ఇలాంటి వికెట్పై పరుగులు రాబట్టే క్రమంలో టీమిండియా బ్యాటర్లు.. ఈడెన్ గార్డెన్స్లోనే ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా మంగళవారం ఓ ప్రత్యేక బౌలర్ను భారత బ్యాటర్లు ఎదుర్కొన్నారు.అతడు మరెవరో కాదు.. బెంగాల్ మిస్టరీ స్పిన్నర్ కౌశిక్ మెయిటీ. రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల సవ్యసాచి. కుడి చేతితో ఆఫ్ స్పిన్.. ఎడమ చేతితో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల కౌశిక్ను పిలిపించాలన్నది హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచన అని సమాచారం. గతంలో పలు ఐపీఎల్ జట్లకు నెట్ బౌలర్గా కౌశిక్ మెయిటీ పనిచేశాడు.అయితే, టీమిండియాకు నెట్స్లో కౌశిక్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. 26 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. నెట్స్లో లెఫ్టాండర్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దేవ్దత్ పడిక్కల్కు ఆఫ్ స్పిన్ వేశాడు. అదే విధంగా.. కుడిచేతి వాటం గల బ్యాటర్లు ధ్రువ్ జురెల్ వంటి వాళ్లను లెఫ్టార్మ్ స్పిన్తో తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో హార్మర్, మహరాజ్లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల విలక్షణ నైపుణ్యం కలిగిన కౌశిక్ మెయిటీ కారణంగా టీమిండియాకు అన్ని రకాలుగా సిద్ధమయ్యే అవకాశం దొరికింది. కాగా కోల్కతాకు చెందిన కౌశిక్ మెయిటీ దేశీ క్రికెట్లో ఎనిమిది లిస్ట్-ఎ మ్యాచ్లతో పాట మూడు టీ20 మ్యాచ్లు ఆడి.. మొత్తంగా పదకొండు వికెట్లు కూల్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియాకు నెట్స్లో బౌలింగ్ చేసే అవకాశం రావడంపై కౌశిక్ మెయిటీ స్పందిస్తూ.. ‘‘మొదటిసారి భారత బ్యాటర్లకు నెట్స్ బౌలింగ్ చేశాను. కల నిజమైన అనుభూతి కలిగింది. నేను జడ్డూ భాయ్కు బౌలింగ్ చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.తాను బౌలింగ్ చేస్తున్నపుడు గౌతం గంభీర్ కానీ.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని.. తనను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనిచ్చారని మెయిటీ తెలిపాడు. తన సహజ నైపుణ్యాలపై నమ్మకం ఉంచినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. జడేజా తనకు కొన్ని సూచనలు ఇచ్చాడని.. ఈ ట్రెయినింగ్ సెషన్ తనకు సరికొత్త అనుభవం, అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు. -
టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు నుంచి మెడ గాయం కారణంగా ఆర్ధరాంతరంగా వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అతడు జట్టుతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే గిల్ దాదాపుగా గౌహతి టెస్టుకు దూరమైనట్లే. అతడి స్ధానంలో సాయిసుదర్శన్ను తుది జట్టులోకి రానున్నాడు.వన్డేలకు దూరం?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్కు సౌతాఫ్రికాతో వన్డేలకు కూడా విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం కానున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అతడిని ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ యోచిస్తోంది. వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలకు కూడా సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.ఈ క్రమంలో సఫారీలతో వన్డే సిరీస్లో భారత పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను సారథిగా నియమించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఈ వన్డే సిరీస్కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. వన్డే జట్టులోకి యశస్వి జైశ్వాల్, సాయిసుదర్శన్లు రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా నవంబర్ 30 నుంచి రాంఛీ వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: రెండో టెస్టులో ఆడాలని ఉన్నా... -
శుబ్మన్ గిల్ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక అప్డేట్ అందించింది. గిల్ గువాహటికి ప్రయాణం చేస్తాడని స్పష్టం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.మెడ నొప్పి తీవ్రం కావడంతోఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ భారత తొలి ఇన్నింగ్స్ సమయంలో గాయపడ్డాడు. మెడ నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడాడు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గిల్ను ఆస్పత్రికి తరలించిన బీసీసీఐ.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది.ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉంది. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ మెడ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు. దీంతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో గిల్ విమాన ప్రయాణం చేస్తే.. నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం బయటకు వచ్చింది.దీంతో సౌతాఫ్రికాతో గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గిల్ అందుబాటులో ఉండడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా గిల్ ఆరోగ్యం గురించి కీలక అప్డేట్ అందించింది.శుబ్మన్ గిల్ వెళ్తాడు.. కానీఈ మేరకు.. ‘‘కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాము.మరుసటి రోజు అతడు డిశ్చార్జ్ అయ్యాడు. చికిత్సకు గిల్ స్పందిస్తున్నాడు. నవంబరు 19న జట్టుతో కలిసి అతడు గువాహటికి ప్రయాణం చేస్తాడు. అయితే, బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. పరిస్థితిని బట్టి అతడిని రెండో టెస్టులో ఆడించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటాం’’ అని బీసీసీఐ బుధవారం నాటి ప్రకటనలో పేర్కొంది.చదవండి: ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే.. -
అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?.. గంభీర్పై డీకే ఫైర్!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను పక్కనపెట్టడం.. మూడో స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కూడా ఈ జాబితాలో చేరాడు. గంభీర్ నిర్ణయం వల్ల వాషింగ్టన్ సుందర్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లేనిపోని ఆందోళనలతో అతడు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.టాపార్డర్కు ప్రమోట్కాగా సౌతాఫ్రికాతో కోల్కతా వేదికగా భారత తుదిజట్టులో తమిళనాడు ప్లేయర్ సాయి సుదర్శన్కు చోటు ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను కాదని.. మరో తమిళనాడు ఆటగాడు, ఎడమచేతి వాటం ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేశారు.ఈ క్రమంలో.. బ్యాటింగ్కు అనుకూలించని పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు వాషీ. అయితే, బంతితో మాత్రం ఈ స్పిన్ ఆల్రౌండర్ రాణించలేకపోయాడు. ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో ఒకే ఒక్క ఓవర్ వేసి మూడు పరుగులు ఇచ్చిన వాషీకి.. రెండో ఇన్నింగ్స్లో అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు.ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్.. టెస్టు ప్లేయర్.. అతడు బ్యాటింగ్ చేయగల బౌలరా? అతడిని మీరు మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. తద్వారా.. పరోక్షంగా ‘నువ్వు బ్యాటింగ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టు’ అనే సందేశం ఇచ్చారు.అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?బ్యాటింగ్ ప్రాక్టీస్లో గంటలు గంటలు తలమునకలైదే.. బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గించాల్సి వస్తుంది. రెండూ సమానంగా చేయాలంటే శారీరకంగా మరింత శ్రమించక తప్పదు. టాపార్డర్కు ప్రమోట్ చేయడం ద్వారా.. ‘నీ నుంచి ఎక్కువ పరుగులు ఆశిస్తున్నాం’ అని చెబితే.. అతడు గందరగోళానికి గురవ్వచ్చు.అతడి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారవచ్చు’’ అంటూ గంభీర్ తీరును డీకే విమర్శించాడు. కాగా తొలి టెస్టులో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గువాహటి వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ఆరంభానికి షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడాడు. ఓ సెంచరీ సాయంతో టెస్టుల్లో 821 పరుగులు చేసిన వాషీ.. ఇప్పటికి 35 వికెట్లు పడగొట్టాడు. -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు.. సిద్దమవుతున్న స్పెషల్ పిచ్
గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్ తమ ప్రయోగాలకు ఫుల్స్టాప్ పెట్టింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో చావు దెబ్బ తినడంతో గౌహతి టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని క్యూరేటర్ను టీమ్ మేనెజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కోల్కతాలో ఉపయోగించిన నల్ల మట్టి పిచ్లా కాకుండా.. రెడ్ సాయిల్ పిచ్లపై పేస్తో పాటు బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాక్లపై క్రాక్స్ కూడా ఎక్కువగా రావు. అంతేకాకుండా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవకాశముంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం, బీసీసీఐ ప్రధాన క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ ఇప్పటికే పిచ్ను తాయారు చేయడం మొదలు పెట్టినట్లు సమాచారం."గౌహతిలోని పిచ్ ఎర్ర మట్టితో తయారు అవుతోంది. సాధారణంగా ఈ ట్రాక్పై స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పిచ్లో టర్న్ ఉంటే వేగంతో ఎక్కువగా బౌన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేకుండా ఉండేలా క్యూరేటర్లు ప్రయత్నిస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో పేర్కొన్నారు. కాగా తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇరు జట్లు బ్యాటర్లు తేలిపోయారు. టెస్టు మొత్తంలో ఒక్క జట్టు కూడా 200 పరుగుల స్కోర్ దాటలేకపోయింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ పిచ్ క్యూరేటర్కు సపోర్ట్గా నిలిచాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటింగ్ వైఫల్యమేనని గౌతీ పేర్కొన్నాడు. -
గంభీర్ ఆలోచించుకో.. మూడో స్థానానికి అతడు సరిపోడు: గంగూలీ
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం(నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలను గౌహతిలో పునరావృతం చేయకూడదని భారత్ పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్మెంట్కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. నంబర్ 3 స్ధానానికి వాషింగ్టన్ సుందర్ సరిపోడని, టాప్ 5లో కచ్చితంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండాలని దాదా అభిప్రాయపడ్డాడు. కాగా కోల్కతా టెస్టులో మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 60 పరుగులు చేశాడు. వాస్తవానికి ఆ స్ధానం సాయి సుదర్శన్ది. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన సుదర్శన్ స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.అయినప్పటికి సఫారీలతో తొలి టెస్టుకు సుదర్శన్ను టీమ్ మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్పై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తొలి టెస్టులో నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది."వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన క్రికెటర్. అతడికి మంచి ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో మూడో నంబర్ స్ధానానికి అతడు సరిపోడు. గతంలో చాలా మంది దిగ్గజాలు ఆ స్ధానంలో బ్యాటింగ్ చేశారు. దీర్ఘ కాల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. టాప్-5లో కచ్చితంగా స్పెషలిస్టు బ్యాటర్లు ఉండాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వంటి కఠిన పరిస్ధితుల్లో కూడా బ్యాటింగ్ చేస్తే సత్తా ఉన్న ఆటగాళ్లకి టాప్-5లో చోటు ఇవ్వాలి. గౌతమ్ గంభీర్ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. తొలి టెస్టులో వాషి కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. పిచ్పై టర్న్ వున్నప్పటికి ప్రధాన స్పిన్నర్లు ముగ్గురు జట్టులో ఉంటే సరిపోతుంది" అని ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: 'ద్రవిడ్నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా' -
'ద్రవిడ్నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం అందరని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.ఇరు జట్లు కూడా ఒక్కసారి కూడా 200 పరుగుల మార్క్ను అందుకోలేకపోయాయి. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచి బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. దీంతో పిచ్పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఇటువంటి పిచ్లు టెస్టు క్రికెట్ నాశనం చేస్తున్నాయి అని మాజీలు మండిపడ్డారు. అయితే ఈడెన్ పిచ్ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్ధించడం కొత్త వివాదానికి దారితీసింది.పిచ్లో భూతాలు లేవని, బ్యాటర్లు తప్పిదం వల్లే ఓడిపోయామని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలను అనిల్ కుంబ్లే, డెల్ స్టెయిన్ వంటి దిగ్గజాలు తప్పుబట్టారు. అస్సులు ఇటువంటి పిచ్ను తాము చూడలేదని వారు ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం గంభీర్కు మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్లో ఓటమికి గంభీర్ను బాధ్యుడిని చేయకూడదని ఊతప్ప అభిప్రాయపడ్డాడు."నేను గంభీర్ను డిఫెండ్ చేస్తున్నానని విమర్శిస్తున్నారు. కానీ మ్యాచ్ ఫలితాన్ని కోచ్తో ముడిపెట్టడం సరికాదు. ఎందుకంటే మైదానంలో కోచ్ వెళ్లి ఆడలేడు కాదా. గెలుపు ఓటములు సహజం. గతంలో రాహుల్ ద్రవిడ్ను కూడా ఈ విధంగానే విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 25 వేల పరుగులు చేసిన ద్రవిడ్ను ట్రోల్ చేసినప్పుడు.. గంభీర్ వారికి ఒక లెక్క కాదు. గతంలో దేశవాళీ టోర్నీలో పేలవమైన పిచ్లను తయారు తయారుచేసినందుకు క్యూరేటర్లను బీసీసీఐ మందలించింది. కానీ అంతర్జాతీయ మ్యాచ్ల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. టర్నింగ్ ట్రాక్లను సిద్దం చేయమని ఎవరూ ప్రోత్సహించరు. కానీ సహజంగా మూడో రోజు, నాలుగో రోజులలో ఎక్కువ టర్న్ ఉండే పిచ్లు ఉపఖండంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పిన్ బాగా ఆడే ప్లేయర్లు తాయారు చేయాల్సిన బాధ్యత భారత్పై ఉంది. గత కొన్నేళ్ల నుంచి మనల్ని స్పిన్ సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ సమస్యపై టీమ్ మెనెజ్మెంట్, సెలక్టర్లు దృష్టిసారించాలని ఊతప్ప పేర్కొన్నాడు.చదవండి: PAK vs ZIM: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్ -
భారత్తో రెండో టెస్ట్కు ముందు సౌతాఫ్రికాకు షాక్ల మీద షాక్లు
నవంబర్ 22 నుంచి గౌహతి వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్కు ముందు సౌతాఫ్రికా జట్టుకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్ట్ హీరోలు సైమన్ హార్మర్, మార్కో జన్సెన్ గాయాల బారిన పడ్డారని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ రెండో టెస్ట్కు దూరమయ్యాడని అధికారిక ప్రకటన వెలువడింది.పక్కటెముకల్లో గాయం కారణంగా తొలి టెస్ట్కు దూరంగా ఉన్న రబాడ రెండో టెస్ట్కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. అతనికి ప్రత్యామ్నాయంగా లుంగి ఎంగిడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఎంగిడి చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికాను టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్టడంలో తనవంతు పాత్ర పోషించాడు.మరోవైపు భారత్ను కూడా గాయాల సమస్య వేధిస్తుంది. తొలి టెస్ట్ సందర్భంగా మెడ గాయానికి గురైన కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటం అనుమానంగా ఉంది. గిల్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే గిల్ గాయపడ్డాడు. వెంటనే అతన్ని వుడ్లాండ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్సనందించారు. ఆతర్వాత ఆతర్వాత రెండో ఇన్నింగ్స్లో అతని అవసరం అనివార్యమైనా తిరిగి బరిలోకి దిగలేకపోయాడు.హార్మర్, జన్సెన్కు కూడా గాయాలు..?తొలి టెస్ట్ అనంతరం సైమన్ హార్మర్ (Simon Harmer), మార్కో జన్సెన్ (Marco Jansen) గాయాలతో బాధపడుతూ గిల్ చికిత్స పొందిన వుడ్లాండ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతంది. హార్మర్ భుజం గాయం, జన్సెన్ మరో గాయంతో బాధపడుతున్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ హార్మర్, జన్సెన్ గాయాల బారిన పడి ఉంటే, సౌతాఫ్రికాకు ట్రిపుల్ షాక్లు (రబాడ) తగిలినట్లవుతుంది.కాగా, తొలి టెస్ట్లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నాలుగో ఇన్నింగ్స్లో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ 93 పరుగులకే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసిన హార్మర్ భారత్ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. జన్సెన్ 2 ఇన్నింగ్స్ల్లో 5 వికెట్లు తీసి టీమిండియాను ఓడించడంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2026 Auction: 'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్కే -
టీమిండియాకు ఒకటైతే.. సౌతాఫ్రికాకు డబుల్ షాక్లు..!
కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మెడ గాయం కారణంగా కెప్టెన్ గిల్ (Shubman Gill) సేవలను ఉన్నపళంగా కోల్పోయిన భారత జట్టు.. మ్యాచ్ను కూడా అత్యంత అవమానకర రీతిలో చేజార్చుకుంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని టీమిండియా బొక్కబోర్లా పడి, ఘోర అపవాదును మూటగట్టుకుంది.తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన గిల్.. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్కు కూడా అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తొలి టెస్ట్లో గిల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్లో అతని అవసరం అనివార్యమైనా తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. మైదానం నుంచి గిల్ను నేరుగా వుడ్లాండ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్సనందించారు.సౌతాఫ్రికాకు డబుల్ షాక్లు..!ఇదే ఆసుపత్రిలో సౌతాఫ్రికాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కూడా మ్యాచ్ అనంతరం చికిత్సనందించారని సోషల్మీడియా కోడై కూస్తుంది. తొలి టెస్ట్లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించడంలో కీలక పాత్రధారులైన సైమన్ హార్మర్ (Simon Harmer), మార్కో జన్సెన్ (Marco Jansen) గాయాలతో బాధపడుతూ గిల్ చికిత్స పొందిన వుడ్లాండ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందారని సమాచారం. హార్మర్ భుజం గాయం, జన్సెన్ మరో గాయంతో బాధపడుతూ సదరు ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తుంది. ఈ గాయాల తాలుకా అధికారిక సమాచారమైతే ఇప్పటివరకు లేదు. ఒకవేళ నిజంగా హార్మర్, జన్సెన్ గాయాల బారిన పడి ఉంటే, సౌతాఫ్రికాకు డబుల్ షాక్లు తగిలినట్లే.కోల్కతా టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసిన హార్మర్ భారత్ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా అతినికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జన్సెన్ కూడా తొలి టెస్ట్లో సత్తా చాటాడు. 2 ఇన్నింగ్స్ల్లో 5 వికెట్లు తీసి టీమిండియా పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒకవేళ ఈ ఇద్దరు రెండో టెస్ట్కు దూరమైతే, సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బలు తగిలనట్లవుతుంది.వీరికి ప్రత్యామ్నాయాలుగా సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ ఉన్నా, ఫామ్లో ఉన్న ఆటగాళ్లు లేకపోవడం సౌతాఫ్రికాకు పెద్ద లోటే అవుతుంది. చదవండి: IPL 2026 Auction: 'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్కే -
‘టీమిండియా హెడ్కోచ్గా అతడు ఉంటే బాగుండేది’
గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ చేదు ఫలితమే చవిచూసింది.30 పరుగుల తేడాతోకోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలో సఫారీలు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రొటిస్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో టీమిండియా కూరుకుపోయింది.కాగా గంభీర్ హెడ్కోచ్గా నియమితుడైన తర్వాత టెస్టుల్లో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను మాత్రమే ఓడించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లండ్ టూర్లో 2-2తో సిరీస్ను సమం చేసుకుంది.జీర్ణించుకోలేకపోతున్నాంఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్.. కోచ్ గంభీర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకపక్ష నిర్ణయాలతో కోచ్లను నియమిస్తే ఇలాగే ఉంటుందటూ బీసీసీఐని విమర్శించాడు. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్లో ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని.. కోచ్ల నియామకంలో పారదర్శకత ప్రదర్శిస్తే బాగుండేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.పెద్దగా బాధపడే వారు కాదు.. కానీ ఈసారిఅదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరును కైఫ్ తెరమీదకు తెచ్చాడు. ఈ మేరకు.. ‘‘అవును.. స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడితే కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. గతంలో.. ఆస్ట్రేలియా పర్యటన అంటే ఓటమి ఖరారు అనే భావన ఉండేది. ముందుగానే అభిమానులు కూడా ఫిక్స్ అయ్యే వారు కాబట్టి పెద్దగా బాధపడే వారు కాదు.ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఓటమిని మరీ ఎక్కువగా మనసుకు తీసుకునేవారు కాదు. కానీ మన సొంతగడ్డపై ఇలా మ్యాచ్లు ఓడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సౌతాఫ్రికా మన కోటను బద్దలు కొట్టింది. న్యూజిలాండ్ గతంలోనే వైట్వాష్ చేసింది.ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు..కాబట్టి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు అందరికీ గుర్తుకువస్తుంది. అయన లాంటి మరికొందరి పేర్లు కూడా కోచింగ్ పోటీదారుల జాబితాలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. నిజానికి కోచింగ్ ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తారు.ఇంటర్వ్యూ ద్వారా కోచ్ను సెలక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ.. దరఖాస్తులు ఆహ్వానించినా తమకు నచ్చిన వారి కోసం.. మిగతా వారిని నిర్దద్వంగా తిరస్కరిస్తున్నారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ లేకుండానే కోచ్ను ఎంపిక చేస్తున్నారు. అలాంటపుడు ఎవరు మాత్రం ఎందుకు ముందుకు వస్తారు?పారదర్శకత లేదుతమ దరఖాస్తు తిరస్కరణకు గురి అవుతుందని కచ్చితంగా తెలిసిన తర్వాత అవమానపడాలని ఎందుకు అనుకుంటారు?.. అక్కడ పారదర్శకత లేదని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని కైఫ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించాడు.కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా ఉన్న సమయంలో.. హైదరాబాదీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బ్యాకప్ కోచ్గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్గా పనిచేస్తున్నాడు. కోచింగ్ పరంగా వీవీఎస్కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కైఫ్ ఈ మేరకు అతడు హెడ్కోచ్గా వస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇంతకుముందు ఎలాంటి కోచింగ్ అనుభవం లేకుండానే గంభీర్ నేరుగా టీమిండియా హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే.చదవండి: IND vs SA: సిరీస్ సమమా? సమర్పణమా? -
శుబ్మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతడు ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ఇంకా కనీసం మూడు, నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.ఊహించని ఆటగాడుగిల్ ప్రస్తుతం విమానంలో ప్రయాణించే పరిస్థితి లేదు కాబట్టి.. గువాహటి వేదికగా రెండో టెస్టు (IND vs SA 2nd Test)కు అతడు దూరమయ్యే పరిస్థితి ఉందని బీసీసీఐ అధికారి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తుదిజట్టులో గిల్ స్థానాన్ని మేనేజ్మెంట్ ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ జరుగుతుండగా.. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఊహించని ఆటగాడి పేరు తెరపైకి తెచ్చాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను టెస్టు జట్టులోకి తీసుకోవాలా? ఈ మాట వింటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఇప్పటికే సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ఎంపిక చేసిన తర్వాత రుతు పేరెందుకు? అని మీరు అడుగవచ్చు.సాయి, పడిక్కల్ కాదు!రెండో టెస్టులో గిల్ ఆడతాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మెడ నొప్పి ఇంకా తగ్గలేదనే సమాచారం ఉంది. ఒకవేళ అతడు మ్యాచ్కు పూర్తిగా దూరమైతే.. సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్లో ఒకరిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుంటారా?ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్టాండర్లు ఉన్నారు. మరి అలాంటపుడు మరో ఇద్దరు లెఫ్టాండర్ల (సాయి, పడిక్కల్)లలో ఒకరివైపు మొగ్గుచూపుతారా? అలాంటపుడు మొత్తంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఆడించాల్సి వస్తుంది.రుతు బెస్ట్.. ఎందుకంటే?అలాంటపుడే బెటర్ ఆప్షన్ కోసం చూడాలి. రుతురాజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. భారత్-‘ఎ’ తరఫున వైట్బాల్ క్రికెట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లలో అదరగొడుతున్నాడు. రంజీ, దులిప్ ట్రోఫీ వంటి రెడ్బాల్ టోర్నీల్లోనూ పరుగులు రాబడుతున్నాడు.మిడిలార్డర్లోనూ రుతు బ్యాటింగ్ చేయగలడు. అతడి టెక్నిక్ కూడా బాగుంటుంది. నిజానికి టెస్టులకు అతడు సరైన ఆప్షన్. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్లో ఇదే వేదిక (గువాహటి)పై రుతు సెంచరీ చేశాడు. కాబట్టి శుబ్మన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో లేకుంటే.. రుతురాజ్ను తీసుకువస్తే బాగుంటుంది’’ అంటూ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది? -
చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్.. గంభీర్ చర్య వైరల్
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA 1st Test) చేదు ఫలితాన్ని చవిచూసింది. సొంతగడ్డపై చతికిల పడి సఫారీల చేతిలో ఓటమిపాలైంది. కోల్కతాలో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో గిల్ సేన ముప్పై పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ (Eden Gardens Pitch)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోవడం.. నాలుగు ఇన్నింగ్స్లో ఒకే ఒక్క అర్ధ శతకం నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఘాటుగానే స్పందించాడు. టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగానే తమ క్యూరేటర్ పిచ్ తయారుచేశాడని కౌంటర్ ఇచ్చాడు.సంతృప్తిగానే గంభీర్ఈ క్రమంలో తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందిస్తూ.. ‘‘ఈ పిచ్పై పరుగులు రాబట్టవచ్చు. అయితే, మా వాళ్లు డిఫెన్స్ సరిగ్గా ఆడలేకపోయారు’’ అని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తప్పేమీ లేదన్నట్లు అతడిని సమర్థించాడు. ఇక భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం (నవంబరు 22) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక.ఆలింగనం చేసుకున్న గౌతీఅయితే, టీమిండియా మాత్రం ఇంకా కోల్కతాలోనే ఉంది. అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పట్ల గంభీర్ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. సుజన్ను ఆలింగనం చేసుకున్న గంభీర్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. తద్వారా తమ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు.చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శల నేపథ్యంలో సుజన్ ముఖర్జీ టైమ్స్ నౌ బంగ్లాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు పిచ్ గురించే ప్రశ్నిస్తున్నారు. టెస్టు మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ తయారుచేయాలో నాకు బాగా తెలుసు. అదే విధంగా తొలిటెస్టుకూ పిచ్ను రూపొందించాను.జట్టు కోరినట్లుగానే పిచ్ తయారు చేశా. వేరే వాళ్లు ఏదో చెప్పారని నేను చేయను. అది సరైంది అనిపిస్తేనే చేస్తా. ఏదేమైనా నా పనిని పూర్తి అంకితభావంతో పూర్త చేస్తా. భవిష్యత్తులోనూ నా వైఖరి ఇలాగే ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు.చదవండి: నేనేమీ హర్మన్ప్రీత్ కౌర్ని కాదు.. అలా ఎందుకు చేస్తా?: బంగ్లా కెప్టెన్ ఓవరాక్షన్ -
IND vs SA: సిరీస్ సమమా? సమర్పణమా?
ఈడెన్ గార్డెన్స్.. భారత క్రికెట్ జట్టుకు కంచుకోట. ఈ ప్రతిష్టాత్మక మైదానంలో టీమిండియాను ఓడించాలంటే ప్రత్యర్ధి జట్టుకు కత్తి మీద సామే. అయితే ఈ ఐకానిక్ గ్రౌండ్లో గత 13 ఏళ్లగా ఓటమి ఎరుగుని భారత జట్టును టెంబా బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా కంగు తినిపించింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ను ప్రోటీస్ చిత్తు చేసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ 93 పరుగుల వద్దే చతికిల పడింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 తేడాతో వెనకంజలో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టు తమ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన సమయం అసన్నమైంది.భారత్కు 'డూ ఆర్ డై'నవంబర్ 22 నుంచి గౌహతిలోని బార్సాపరా స్టేడియం వేదికగా ప్రోటీస్తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ 'డూ ఆర్ డై' మ్యాచ్ కోసం భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.ఎక్కడైతే ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొలేక భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారో.. అక్కడే ప్రాక్టీస్ను మొదలు పెట్టారు. భారత జట్టు మంగళవారం ఈడెన్ గార్డెన్స్లో తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు చమటోడ్చనున్నారు. బ్యాటింగ్ ప్రాక్టీస్పై ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.గిల్ దూరం..!ఇక కీలకమైన రెండో టెస్టుకు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరమయ్యే అవకాశముంది. మెడ నొప్పి కారణంగా తొలి టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న గిల్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి నాలుగైదు రోజుల సమయం పట్టనుంది.దీంతో గౌహతికి టెస్టుకు గిల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే అతడి స్ధానంలో సాయి సుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. సుదర్శన్కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడి సేవలను మిడిలార్డర్లో భారత్ ఉపయెగించుకోనుంది.వాషింగ్టన్పై వేటు..ఈ మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. గౌహతి పిచ్ సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్లో ముగ్గురు పేసర్లతో భారత్ ఆడనున్నట్లు సమాచారం. వాషింగ్టన్ సుందర్పై మెనెజ్మెంట్ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గత మ్యాచ్లో అతడు స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడాడు. వాషీ రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు స్పిన్నర్లగా మెరుగ్గా రాణించారు. ఇప్పుడు సుందర్ స్ధానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ను ఆడించే యోచనలో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడంట. భారత్కు బౌలింగ్కు పరంగా ప్రస్తుతం ఎటువంటి ఢోకా లేదు. సఫారీలపై మన బ్యాటర్లే సత్తాచాటాల్సి ఉంది. అదేవిధంగా ఈ మ్యాచ్లో ఒకే వికెట్ కీపర్తో భారత్ ఆడనునున్నట్లు సమాచారం. ధ్రువ్ జురెల్ స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.జైశ్వాల్ ఫామ్ అందుకుంటాడా?ఇక తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన ఫామ్ను తిరిగి అందుకోవాల్సిన సమయం అసన్నమైంది. దాదాపుగా ప్రతీ టెస్టులోనూ జైశూ తన మెరుపు బ్యాటింగ్తో భారత్కు అద్భుతమైన శుభారంభం అందిస్తూ ఉంటాడు.గత మ్యాచ్లో అతడు తన బ్యాట్కు పని చెప్పకోవడంతో భారత్ ఘోర పరాజయం ఎదుర్కొంది. దీంతో అతడు కీలకమైన గౌహతి టెస్టులో రాణించాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. అతడితో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా రాణించాల్సిన అవసరముంది. ఒకవేళ గిల్ దూరమైతే పంత్నే జట్టును నడిపించనున్నాడు.రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్,ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
'ఏమి చేయాలో అతడికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు'
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం(నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే తొలి టెస్టులో భారత్కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది.బంతి గింగరాలు తిరిగిన పిచ్పై భారత బ్యాటర్లు తడబడ్డారు. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా ఈ పిచ్పై మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అస్సలు అది టెస్టు క్రికెట్ సరిపోయే పిచ్ కాదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.కాగా పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చినా, తాము కోరుకున్నది ఇదేనని హెడ్ కోచ్ గంభీర్ పేర్కొనడం గమనార్హం. బ్యాటింగ్కు పిచ్ మరి అంత కష్టంగా లేదని, సరైన డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించవచ్చు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలపై కూడా కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి మాజీలు ఫైరయ్యారు. ఇప్పటివరకు ఇటువంటి పిచ్ను చూడలేదని అతడు అన్నాడు.ఈ నేపథ్యంలో గంభీర్కు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. పిచ్ క్యూరేటర్ల పనిలో గంభీర్ జోక్యం చేసుకోకుండా ఉండాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."ఐపీఎల్లో గంభీర్కు ప్లేయర్గా, హెడ్కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. అక్కడ పిచ్ల ఎంపిక విషయంలో ఏం జరుగుతుందో అతడికి తెలుసు. ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా క్యూరేటర్ను ఫలానా పిచ్ కావాలని అడగదు. క్యూరేటర్ స్వతంత్రంగా పిచ్ను తయారుచేస్తాడు. పిచ్ తయారీని క్యూరేటర్కే వదిలేయాలి. అతడి పనిలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. ఎలా తాయారు చేయాలో అతడికి బాగా తెలుసు. మీరు మధ్యలో వెళ్లి పిచ్లో మార్పులు చేయమని, 'ర్యాంక్-టర్నర్' కావాలని ఆదేశాలు ఇస్తే మొదటికే మోసం వచ్చే అవకాశముంది" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు -
టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు
కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనుహ్య ఓటమి చవిచూసిన భారత్.. ఇప్పుడు గౌహతిలో జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్లో తమ మొదటి ట్రైనింగ్ సెషన్లో టీమిండియా పాల్గోనుంది. ఆ తర్వాత బుధవారం గౌహతికి భారత జట్టు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.మెడనొప్పితో తొలి టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. . ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా అతని పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని సమాచారం. ‘గిల్కి మెడ నొప్పి తీవ్రంగా ఉంది. అతను నెక్ కాలర్ ధరిస్తూనే ఉన్నాడు. కనీసం 3–4 రోజులు విశ్రాంతి తీసుకోవాలని, విమానం ఎక్కరాదని వైద్యులు చెప్పారు. ఇలాంటి స్థితిలో అతను ప్రయాణించే పరిస్థితి లేదు. అయితే అతని ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే గిల్ బుధవారం జట్టుతో పాటు గౌహతికి వెళ్లనున్నాడని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ బుధవారం కాకపోతే గురువారం గౌహతికి గిల్ పయనం కానున్నాడు. ఏదేమైనప్పటికి భారత కెప్టెన్ ఫుల్ ఫిట్నెస్ సాధిస్తేనే రెండో టెస్టులో ఆడనున్నాడు.నితీశ్కు పిలుపు..ఈ నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమ్ మేనెజ్మెంట్ తిరిగి పిలుపునిచ్చింది. వాస్తవానికి సౌతాఫ్రికాతో టెస్టులకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నితీశ్ కూడా ఉన్నాడు. కానీ సౌతాఫ్రికా-తో వన్డే సిరీస్ ఆడేందుకు జట్టు నుంచి అతడిని రిలీజ్ చేశారు. ఇప్పుడు గిల్ గాయపడడంతో అతడిని తిరిగి జట్టులో చేరమని ఆదేశించారు. ఈ ఆంధ్ర ఆటగాడు మంగళవారం జట్టుతో చేరి ప్రాక్టీస్లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది.రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్,ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా అతడే.. అధికారిక ప్రకటన -
'గంభీర్ వ్యాఖ్యలు సరికాదు.. నేను బౌలింగ్ చేసినా వికెట్ వచ్చేది'
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 1-0 తేడాతో వెనకంజలో నిలిచింది. అయితే తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటువంటి పిచ్లు వల్ల టెస్టు క్రికెట్ అంతరించిపోతుందని భారత మాజీ స్పిన్నర్ హార్బజన్ సింగ్ మండిపడ్డాడు. భజ్జీ ఒక్కడే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు ఈడెన్ పిచ్పై విమర్శలు గుప్పించారు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ పిచ్ను సమర్ధించాడు. పిచ్లో భూతాలు ఏమి లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించవచ్చని గంభీర్ అన్నాడు. అంతేకాకుండా తామే ఇటువంటి పిచ్ కావాలని కోరుకున్నట్లు అతడు తెలిపాడు.అయితే పిచ్ను సమర్ధించిన గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైరయ్యాడు. అస్సలు టెస్టు క్రికెట్కు సరిపోయే పిచ్ కాదు అని శ్రీకాంత్ అన్నాడు."సొంత గడ్డపై మనకు ఘోర పరాభావం ఎదురైంది. పూర్తి స్దాయి జట్టుతో ఆడుతున్నప్పటికి టీమిండియా ఇంత దారుణ ఓటమిని ఎదుర్కొవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గంభీర్ ఇటువంటి పిచ్ కావాలని క్యూరేటర్ను అడిగాడు. వికెట్ ప్రవర్తించిన తీరును చూసిన తర్వాత కూడా అతడు తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. ఇది అస్సలు టెస్టు క్రికెట్కు సరిపోయే పిచ్ కాదు. మొదటి రోజు నుంచే పిచ్లో టర్న్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా ఇదే తప్పు చేస్తున్నాం. టర్నింగ్ పిచ్లు కావాలని అడుగుతున్నాము. కానీ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇదొక చెత్త ట్రాక్. ఇటువంటి వికెట్పై ఆటగాళ్లు మంచి టెక్నిక్తో ఆడాలని గంభీర్ చెప్పడం సరికాదు. నేను బౌలింగ్ చేసినా కూడా ఓ వికెట్ వచ్చి ఉండేది.రెండు జట్లలో ఒక టీమ్ కూడా 200 పరుగుల మార్క్ దాటకపోతే.. అదెలా మంచి వికెట్ అవుతుంది? గంభీర్ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడు. ప్రతీ ఒక్క బ్యాటర్ ఈ వికెట్పై కష్టపడి ఆడాడు. రెండు జట్లు కూడా ఇబ్బంది పడ్డాయి. గంభీర్ ఒత్తిడిలో ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ, భారత జట్టు మాత్రం ఒత్తిడిలో ఉంది” అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో 13 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో భారత్కు ఓటమి రుచిని చూపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టును ఓడించడంలో సఫారీ బౌలర్లు ఎంత కీలక పాత్ర పోషించారో.. బవుమా ఆడిన ఇన్నింగ్స్ కూడా అంతే విలువైనది. బ్యాటింగ్కు కష్టతరమైన పిచ్పై బవుమా.. బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడతున్నప్పటికి బవుమా మాత్రం తన ఏకాగ్రాతను కోల్పోకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్ అంటే బవుమాలా ఉండాలని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆఖరికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బవుమా ఆడిన ఇన్నింగ్స్కు ఫిదా అయిపోయాడు.కెప్టెన్సీ రికార్డు అదుర్స్..2021 మార్చిలో క్వింటన్ డికాక్ నుంచి సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్గా బవుమమా బాధ్యతలు స్వీకరించాడు. తద్వారా దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఫుల్టైమ్ కెప్టెన్గా నియమితులైన మొదటి నల్లజాతి ఆఫ్రికన్ ఆటగాడిగా టెంబా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2022లో ప్రోటీస్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు.వైట్ బాల్ క్రికెట్లో కెప్టెన్గా బవుమా పర్వాలేదన్పించినప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అతడి కెప్టెన్సీలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గెలుచుకున్న తొలి ఐసీసీ ట్రోఫీవరల్డ్ రికార్డు..టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 11 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 10 విజయాలు, ఒక్క డ్రా ఉంది. తద్వారా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 11 టెస్టుల్లో పది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గా టెంబా వరల్డ్ రికార్డు సృష్టించాడు.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ -
తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం
కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు.. తమ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రోటీస్తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం టీమిండియా తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టనుంది.అయితే భారత జట్టు గౌహతిలో కాకుండా ఈడెన్ గార్డెన్స్లోనే మొదటి ట్రైనింగ్ సెషన్ను మంగళవారం(నవంబర్ 18) నిర్వహించనుంది. ఈడెన్ లాంటి కఠినమైన వికెట్పై తమ ప్లేయర్లను ప్రాక్టీస్ చేయించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.మ్యాచ్ అనంతరం మాట్లాడిన గంభీర్ ఈడెన్గార్డెన్స్ పిచ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్లో ఎటువంటి భూతాలు లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే ఇటువంటి వికెట్పై పరుగులు సాధించవచ్చు అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్ జరిగిన పిచ్పై భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేసే అవకాశముంది.గౌహతికి ఎప్పుడంటే?కాగా బుధవారం మెన్ ఇన్ బ్లూ గౌహతికి పయనం కానుంది. అయితే తొలి ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కానున్నాడు. మెడ నొప్పి గాయం నుంచి గిల్ కోలుకుంటున్నాడు.ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ ప్రస్తుతం టీమ్ హోటల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడపట్టేసింది. దీంతో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని ఆస్ప్రత్రికి తరలించారు. 24 గంటల పర్యవేక్షణ తర్వాత గిల్ ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతడు మెడ అటు ఇటు కదపుతున్నప్పటికి వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో శుభ్మన్ గౌహతి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే అతడి స్దానంలో సాయిసుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా తొలి టెస్టులో భారత్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా పరాజయం పాలైంది.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ -
గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో తాము కోరుకున్న పిచ్పై టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. బౌలర్లు రాణించినప్పటికి బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు.కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో టీమిండియాకు 12 ఏళ్ల తర్వాత ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు కీలక సూచనలు చేశాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తిరిగి టెస్టు జట్టులోకి తీసుకోవాలని దాదా కోరాడు.అతడొక మ్యాచ్ విన్నర్.."భారత టెస్టు జట్టులోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు షమీ అన్నిరకాలగా అర్హుడు. అతడొక మ్యాచ్ విన్నర్. షమీతో పాటు మంచి స్పిన్నర్లు జట్టులో ఉంటే టీమిండియాకు తిరిగుండదు. నాకు గౌతమ్ గంభీర్ అంటే చాలా ఇష్టం. అతడు 2007, 2011 టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది. గౌతమ్ హెడ్ కోచ్ పదవిలో కొన్నాళ్ల పాటు కొనసాగుతాడన్న నమ్మకం నాకుంది. కానీ సొంతగడ్డపై ఆడుతున్నప్పడు బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లను ఎంచుకోవాలి. పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ముగ్గురు జట్టులో ఉండాలి. వీరిపై గంభీర్ నమ్మకం ఉంచాలి" అని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా పేర్కొన్నాడు. కాగా షమీ చివరగా భారత తరపున టెస్టుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2023 ఫైనల్లో ఆడాడు.ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్లకు షమీ ఎంపిక చేయలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే షమీని పక్కన పెట్టినట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాడు. కానీ షమీ మాత్రం తను ఫిట్గా ఉన్నప్పటికి ఎంపిక చేయడం లేదని సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే -
ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మెడకు గాయమైన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఆస్ప్రత్రి నుంచి ఆదివారం గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెడ గాయం నుంచి కోలుకుంటున్నందున గిల్కు విమాన ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అతడికి కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీమ్ హోటల్లో ఉన్న గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది.అయితే ప్రస్తుతం అతడు మెడను ఈజీగా అటూ ఇటూ కదపగలుగుతున్నాడు. కానీ గౌహతి వేదికగా జరిగే రెండో టెస్టులో అతడు ఆడుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు గిల్ను మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరామర్శించాడు.గిల్ ఎలా గాయపడ్డాంటే?తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా సైమన్ హార్మర్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ప్రయత్నంలో గిల్ మెడపట్టేసింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడు మూడు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే అతడి గాయం తీవ్రతరం కావడంతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. గిల్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వార్తలు వచ్చాయి. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాక అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గిల్ రెండు ఇన్నింగ్స్లకు దూరం కావడం టీమిండియా కొంపముంచింది. గిల్ లేకపోవడంతో భారత జట్టును వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ అనుహ్య ఓటమిని చవిచూసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ చతికలపడింది.చదవండి: PAK vs SL 3rd Odi: శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు... పిచ్ ఎలాంటిదైనా కాస్త పట్టుదల కనబరిస్తే సునాయాసంగా ఛేదించగల స్కోరే... కానీ టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలింది...రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్కు, ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్ ముందు బ్యాటర్లు తలవంచారు. మనకు అనుకూలిస్తుందనుకున్న స్పిన్ పిచ్ సఫారీలకు అంది వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన తీరును గుర్తుకు చేస్తూ భారత్ స్వదేశంలో మరో పరాభవాన్ని మూటగట్టుకోగా, వరల్డ్ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు గెలిచి సంబరాలు చేసుకుంది. పదేళ్ల క్రితం అనామకుడిగా ఇక్కడ అడుగు పెట్టి భారత బ్యాటర్ల చేతిలో చావు దెబ్బ తిన్న ఆఫ్స్పిన్నర్ సైమన్ హార్మర్ దశాబ్దం తర్వాత ఒక అరుదైన విజయాన్ని రచించడం విశేషం. కోల్కతా: భారత టెస్టు జట్టుకు స్వదేశంలో అనూహ్య షాక్...ఈడెన్ గార్డెన్లో స్పిన్ పిచ్ కోరుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన జట్టు చివరకు ప్రత్యర్థి స్పిన్ దెబ్బకే తలవంచింది. ఆదివారం మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో సైమన్ హార్మర్ 4, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 93/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 54 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మ్యాచ్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచ్లో సిరీస్లో దక్షిణాఫ్రికా 1–0తో ముందంజ వేయగా, నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగుతుంది. రెండో రోజు మెడకు గాయం కావడంతో ఆట నుంచి తప్పుకొని ఆస్పత్రిలో చేరిన భారత కెపె్టన్ శుబ్మన్ గిల్ ఆదివారం వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేకపోయాడు. కోలుకున్న గిల్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆదుకున్న బవుమా... ఆదివారం మైదానంలోకి వచ్చే సమయానికి భారత్ విజయంపై ధీమాగా ఉంది. మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోగా, పదునైన డిఫెన్స్తో పట్టుదలగా నిలిచిన బవుమా సింగిల్స్తో పరుగులు జోడిస్తూ పోయాడు. కొద్ది సేపు దూకుడుగా ఆడిన కార్బిన్ బాష్ (37 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), బవుమా కలిసి ఎనిమిదో వికెట్కు 44 పరుగులు జోడించారు. చివరకు బాష్ను బుమ్రా బౌల్డ్ చేయగా...సిరాజ్ ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్ మినహా... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ (0)ను అవుట్ చేసిన యాన్సెన్, తన రెండో ఓవర్లో రాహుల్ (1)ను పెవిలియన్కు పంపి దెబ్బ కొట్టాడు. ఈ దశలో 32 పరుగులు జత చేసి సుందర్, జురేల్ (13) జట్టును ముందుకు నడిపించారు. అయితే జురేల్, పంత్ (2) చెత్త షాట్లతో వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలోనూ సుందర్, రవీంద్ర జడేజా (18) భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ సఫారీ స్పిన్నర్లు మళ్లీ పైచేయి సాధించారు. వీరిద్దరు 8 పరుగుల తేడాతో అవుట్ కాగా, కుల్దీప్ (1) వారిని అనుసరించాడు. గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) కాస్త సాహసం ప్రదర్శించాడు. మహరాజ్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్లు బాది 16 పరుగులు రాబట్టాడు. చివరకు మహరాజ్దే పైచేయి అయింది. ఐదో బంతికి మరో భారీ షాట్కు ప్రయతి్నంచి అక్షర్ వెనుదిరగ్గా, తర్వాతి బంతికే సిరాజ్ (0) అవుట్ కావడంలో దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159; భారత్ తొలి ఇన్నింగ్స్ 189; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సుందర్ (సి) హార్మర్ (బి) మార్క్రమ్ 31; జురేల్ (సి) బాష్ (బి) హార్మర్ 13; పంత్ (సి) అండ్ (బి) హార్మర్ 2; జడేజా (ఎల్బీ) (బి) హార్మర్ 18; అక్షర్ (సి) బవుమా (బి) మహరాజ్ 26; కుల్దీప్ (ఎల్బీ) (బి) హార్మర్ 1; బుమ్రా (నాటౌట్) 0; సిరాజ్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్ట్రాలు 1; మొత్తం (35 ఓవర్లలో ఆలౌట్) 93. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–33, 4–38, 5–64, 6–72, 7–77, 8–93, 9–93. బౌలింగ్: యాన్సెన్ 7–3–15–2, హార్మర్ 14–4–21–4, మహరాజ్ 9–1–37–2, బాష్ 2–0–14–0, మార్క్రమ్ 3–0–5–1. బ్యాటింగ్ చేయలేనంత ఇబ్బందికరంగా పిచ్ ఏమీ లేదు. మేం సరిగ్గా ఇలాంటి పిచ్నే కోరుకున్నాం. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తే టాస్ ప్రభావం తగ్గించవచ్చని భావించాం. క్యురేటర్ కూడా అదే ఇచ్చారు. మేం మ్యాచ్ గెలిచి ఉంటే పిచ్పై ఇంత చర్చ జరిగేది కాదు. మంచి డిఫెన్స్ ఉంటే పరుగులు సాధించవచ్చు. మీరు మానసికగా ఎంత దృఢంగా ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. బవుమా, అక్షర్, సుందర్ పరుగులు రాబట్టారు కదా’ –గౌతమ్ గంభీర్, భారత కోచ్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనను అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ బౌలర్లు డిఫెండ్ చేసి అద్భుతం చేశారు.లక్ష్య చేధనలో భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. ప్రోటీస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్ల పడగొట్టి టీమిండియాను దెబ్బ తీశాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో సంచలన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.తొలి జట్టుగా రికార్డు..👉ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టెస్టుల్లో లోయోస్ట్ టోటల్ డిఫెండ్ చేసిన జట్టుగా ప్రోటీస్ నిలిచింది. ఇంతకుముందు రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. ఈ వేదికలో 1973లో ఇంగ్లండ్తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో 192 పరుగులను టీమిండియా కాపాడుకుంది. తాజా మ్యాచ్లో 124 పరుగులను డిఫెండ్ చేసుకున్న సౌతాఫ్రికా.. భారత్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.👉అదేవిధంగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా ఓ రికార్డు సాధించాడు. భారత్పై ఒక టెస్టు మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సఫారీ ప్పిన్నర్గా హార్మర్ నిలిచాడు.ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి అతడు 51 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాల్ ఆడమ్స్ పేరిట ఉండేది. 1996లో కాన్పూర్ వేదికగా భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆడమ్స్ 139 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్ -
బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా- సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య నెలకొన్న 'బౌనా'(మరగుజ్జు) వివాదం సద్దమణుగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్టు ముగిసిన అనతరం బుమ్రా.. బవుమా వద్దకు వెళ్లి అప్యాయంగా మాట్లాడు.ఈ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవుమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే ప్రోటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను అలింగనం చేసుకుంటా నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బుమ్రా ఆఖరి బంతిని బవుమాకు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని బవుమా ఆడే ప్రయత్నం చేయగా బంతి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో వెంటనే బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తల ఊపాడు. దీంతో ఆర్ఎస్ తీసుకోవాలా వద్దా అని బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్తో చర్చించాడు. బంతి ప్యాడ్స్కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా "బౌనా భీ హై" అని సమాధనమిచ్చాడు. 'బౌనా' అనేది హిందీలో మరగుజ్జు అని అర్థం. బవుమా పొట్టిగా ఉండటం వల్ల బంతి స్టంప్స్ను మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి జస్ప్రీత్ ఈ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్వెల్ ప్రిన్స్ సైతం స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి చర్చా రాలేదు. ఇక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. ఇక ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.చదవండి: WTC 2025-27 Points Table: టాప్-2కు సౌతాఫ్రికా.. మరి భారత్ ఏ ప్లేస్లో ఉందంటే?Bumrah explaining the Bauna controversy to Bavuma crying 😭😭 pic.twitter.com/l9WTsYcCkZ— tweeting from my grave. (@kalhonahoooooo) November 16, 2025 -
టాప్-2కు సౌతాఫ్రికా.. మరి భారత్ ఏ స్ధానంలో ఉందంటే?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. పర్యాటక జట్టు నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. 35 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయపడి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్కు రాలేదు. గిల్ లేకపోవడం కూడా భారత జట్టుకు చాలా నష్టాన్ని కలిగించిందే అని చెప్పాలి.నాలుగో స్ధానానికి పడిపోయిన భారత్..ఇక భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు ఫలితంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది. భారత్ పాయింట్ల శాతం 54.17గా ఉంది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత జట్టు 8 మ్యాచ్లు ఆడి నాలుగింట గెలుపొందగా.. మూడింట ఓటమి చవిచూసింది. మరోవైపు ఈ విజయంతో దక్షిణాఫ్రికా(66.7 శాతం) రెండో స్ధానానికి దూసుకెళ్లింది. అయితే పీసీటీ పరంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సమంగా ఉన్నాయి.కానీ పాయింట్లు పరంగా మాత్రం లంక(16) కంటే సౌతాఫ్రికా(24) ముందుంజలో ఉంది. అందుకే శ్రీలంక మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా(100.00) అగ్రస్ధానంలో ఉంది. ఈ సైకిల్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్లలో 2 విజయాలు, ఒక్క ఓటమి చవిచూసింది.చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్ -
చెలరేగిన భారత బౌలర్లు.. 132 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత్-ఎ బౌలర్లు నిప్పలు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. యువ ఆల్రౌండర్ నిశాంత్ సింధు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. సింధు తన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ హర్యానా ఆటగాడు 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ మెన్ ఇన్ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.తుది జట్లుభారత్రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణసౌతాఫ్రికారివాల్డో మూన్సామి(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్మన్ -
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్ నుంచే పిచ్పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో స్పిన్నర్లు బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.ఈడెన్ గార్డెన్స్ పిచ్పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటుంటి పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. కాగా ఈ పిచ్ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ తాయారు చేశాడు. దీంతో గంభీర్ను కూడా నెటిజన్లు టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో గంభీర్ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్గా అతడిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.బ్యాటర్లే కొంప ముంచారు..ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్ను కోరుకున్నట్లు గంభీర్ ధ్రువీకరించాడు. "మేము అడిగిన పిచ్ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేటర్ మాకు అన్ని విధాల సహకరించారు. అయితే ఈ వికెట్పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాము. అందుకే ఓడిపోయాము. పిచ్లో ఎలాంటి భూతాలు లేవు. ఇదే వికెట్పై టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్, వాషింగ్టన్ కూడా రన్స్ చేశారు. కాబట్టి ఇక్క పిచ్ సమస్య కాదు. ఎక్కువ వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే వచ్చాయి. కాబట్టి ఇది బ్యాటింగ్కు మరి అంత కష్టమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్లు మీ టెక్నిక్, సహనాన్ని పరీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే, ఇలాంటి వికెట్పై కూడా పరుగులు సాధించవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్ -
వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ను టీమిండియా ఓటమి (IND vs SA)తో ఆరంభించింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Risbah Pant) ఓటమిపై స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లమని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.వాళ్లిద్దరు అద్భుతంఈ మేరకు.. ‘‘124 పరుగుల టార్గెట్ను మేము ఛేదించి ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే, మేము దానిని అధిగమించలేకపోయాము. తెంబా, బాష్.. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్ను తమ వైపునకు తిప్పేసుకున్నారు.ఇలాంటి పిచ్పై 120 పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో సఫలం కాలేకపోయాము. మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.బవుమా ఫిఫ్టీ.. నిలబడిన బాష్కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోయింది. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన సఫారీ జట్టుకు కెప్టెన్ తెంబా బవుమా, టెయిలెండర్ కార్బిన్ బాష్ అద్భుత బ్యాటింగ్తో మెరుగైన స్కోరు అందించారు.తొలి ఇన్నింగ్స్(3)లో విఫలమైన బవుమా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం (136 బంతుల్లో 55) బాదాడు. మరోవైపు.. బాష్ 37 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 79 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. ఆది నుంచే తడబాటుఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినందున.. విజయ లక్ష్యం 124 పరుగులుగా మారింది. అయితే, లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), యశస్వి జైస్వాల్ (0) పూర్తిగా విఫలం కాగా.. ధ్రువ్ జురెల్ (13), రిషభ్ పంత్ (2) నిరాశపరిచారు.ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. రవీంద్ర జడేజా (18), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (1), సిరాజ్ (0) చేతులెత్తేయగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ అబ్సెంట్ హర్ట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయింది. కాగా మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ పంత్.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి -
'అదొక చెత్త పిచ్.. సచిన్, కోహ్లిలు ఆడినా'
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ చతికలపడింది. 35 ఓవర్లు ఎదుర్కొని కేవలం 90 పరుగులకే భారత్ కుప్పకూలింది. బౌలర్లకు స్వర్గధామంగా మారిన ఈడెన్ గార్డెన్స్ వికెట్పై భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. సౌతాఫ్రికా స్పిన్నర్లు సైమర్ హార్మర్, కేశవ్ మహారాజ్ బంతితో మ్యాజిక్ చేశారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్గా నిలిచారు. ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్పై సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. వారు కూడా భారత బౌలర్ల ధాటికి విల్లవిల్లాడారు. ఈ మ్యాచ్లో ఒక్క ఇన్నింగ్స్లో కూడా స్కోర్ 200 పరుగుల మార్క్ దాటలేదంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."టెస్టు మ్యాచ్ చూడటానికి ఈడెన్ గార్డెన్స్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూసి నేను నేను చాలా సంతోషించాను. కానీ పిచ్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్కు గురిచేసింది. తొలుత టాస్ గెలిచి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. కానీ మన జట్టు కూడా అదే తీరును కనబరిచి 189 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఇటువంటి పిచ్పై 30 పరుగుల లీడ్ 300 పరుగులగా పరిగణించాలి. అనంతరం సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సరికి 93 పరుగులతో ఉంది. దీంతో భారత్ సునాయసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడో రోజు వికెట్ మరి వింతగా ప్రవర్తించింది.ఇటువంటి పిచ్లు టెస్టు క్రికెట్ ఉనికిని నాశనం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో భారత జట్టు ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ ఆడనుంది. అక్కడ ఇరు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయి. ప్రేక్షకులకు అసలైన టెస్టు క్రికెట్ మజాను అందించాయి. ఐదు రోజుల వరకు మ్యాచ్ జరిగేది. కానీ ఇక్కడ మాత్రం పిచ్ భయంకరంగా ఉంది. బంతి ఎక్కడ పడుతుందో, ఎలా టర్న్ అవుతోంది బ్యాటర్ అస్సలు అంచనా వేయలేకపోయాడు.మీకు ఎంత మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉన్న కూడా ఈ వికెట్పై ఆడలేరు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటరైనా ఈ పిచ్పై ఫెయిల్ అయ్యే వారు. ఓ బంతి ఎక్కువ ఎత్తులో పడి ఒక్కసారిగా టర్న్ అవుతోంది. మరొకొన్ని సార్లు తక్కువ ఎత్తులో ఉండి స్పిన్ అవుతుంది. ఈడెన్లో ఇంతకుముందు చాలా టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి కండీషన్స్ను చూడలేదు. టెస్టు క్రికెట్ పరువు తీస్తున్నారు" అని తన యూట్యూబ్ ఛానల్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ గిల్ గాయపడడం కూడా భారత ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మెడ నొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే గిల్ వైదొలిగాడు.చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి -
పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.గంభీర్ ప్రయోగాలుకోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్ పర్యటన, వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్ను తుదిజట్టు నుంచి తప్పించింది.సాయికి బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది. వన్డౌన్లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.వాషీ పర్లేదుఇక రెండో ఇన్నింగ్స్లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్ బౌలింగ్లో హార్మర్కు క్యాచ్ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.గిల్ స్థానంలో జురెల్ఈ మ్యాచ్లో మరో ప్రయోగం... ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్ను ప్రమోట్ చేశాడు హెడ్కోచ్ గౌతం గంభీర్. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఐదో నంబర్ బ్యాటర్ రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు.గెలుపు ఆశలు రేపిన అక్షర్మరోవైపు టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. Pressure? What pressure? 🔥#AxarPatel takes the attack to the South African bowlers! 🏏👏#INDvSA | 1st Test, Day 3, LIVE NOW 👉 https://t.co/19cUrY4aXc pic.twitter.com/zpiIumJibl— Star Sports (@StarSportsIndia) November 16, 2025అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్లో (34.5)నే బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇక గిల్ ఆబ్సెంట్ హర్ట్ (0) కావడంతో.. ఆలౌట్ అయిన భారత్ ఓటమి ఖరారైంది.టాస్ గెలిచిన.. తొలుత బ్యాటింగ్రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది.ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తెంబా బవుమా హాఫ్ సెంచరీఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా హాఫ్ సెంచరీ (55 నాటౌట్) చేయడంతో ప్రొటిస్ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.తప్పని ఓటమిఅయితే, ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్ నాలుగు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు. ఓపెనర్లను అవుట్ చేసి యాన్సెన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్ -
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్
టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.మూడో రోజు హాఫ్ సెంచరీఅయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.టెస్టు క్రికెట్ను చంపేస్తారా?ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు. అస్సలు ఊహించలేదుమరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.నాలుగు రోజుల పాటు పిచ్పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీమిండియా ఓటమిసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్కు షాకులు తగిలాయి.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్ చేసిన ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్.. మూడో ఓవర్ ఆరంభంలోనే రాహుల్ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు. ఆచితూచి ఆడకపోతే..ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్ గార్డెన్స్ పిచ్ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.మరి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 2012లో ఇంగ్లండ్ 41 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1977లో ఇంగ్లండ్ 16 పరుగుల లక్ష్య ఛేదన.చదవండి: సన్రైజర్స్ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత? -
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.టార్గెట్ 124ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) మొదలైంది. తొలిరోజు పేసర్లు సత్తా చాటగా.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.అనంతరం ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా.. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను.. 153 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా.. భారత జట్టు లక్ష్యం 124 పరుగులుగా మారింది. దీంతో టార్గెట్ చిన్నదే కదా అని సంబరపడిన అభిమానులకు సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ ఆదిలోనే షాకులు ఇచ్చారు.చెలరేగిన సఫారీ పేసర్మొత్తంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కైలీ వెరెన్నెకు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్.. ఈసారి ఆరు బంతులు ఎదుర్కొని యాన్సెన్ బౌలింగ్లో వెరెన్నెకు క్యాచ్ ఇవ్వడంతో నిష్క్రమించాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రాహుల్ అవుటయ్యాడు.తొలి ఓవర్లో జైసూను.. మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ను వెనక్కి పంపి యాన్సెన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో కేవలం ఒకే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే, వన్డౌన్లో వాషింగ్టన్ సుందర్ రాగా.. నాలుగో స్థానంలో మరో ప్రయోగానికి టీమిండియా తెరలేపింది. జురెల్ ముందుగానేకెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను టాప్కి ప్రమోట్ చేసింది. నిజానికి ఐదో నంబర్ బ్యాటర్ పంత్ బ్యాటింగ్కు వస్తాడనుకుంటే అనూహ్యంగా జురెల్ ముందుగా వచ్చాడు.ఇక భోజన విరామ సమయానికి ఏడు ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి పది పరుగులే చేసింది. వాషీ 20 బంతుల్లో 5, జురెల్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో నిలిచారు.టీమిండియా చెత్త రికార్డుజైసూ, రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగోసారి అత్యల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది.సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు సంయుక్తంగా సాధించిన అత్యల్ప స్కోర్లు👉1964లో ఆస్ట్రేలియాతో చెన్నై మ్యాచ్లో- 0 (ఎంఎల్ జైసింహ 0, ఇంద్రజిత్సిన్హ్జీ 0)👉1999లో న్యూజిలాండ్తో మొహాలీ మ్యాచ్లో- 0 (దేవాంగ్ గాంధీ 0, సదగోపన్ రమేశ్ 0)👉2010లో న్యూజిలాండ్తో అహ్మదాబాద్ మ్యాచ్లో- 1 (గంభీర్ 0, సెహ్వాగ్ 1)👉2025లో సౌతాఫ్రికాతో కోల్కతాలో మ్యాచ్లో- 1 (జైస్వాల్0, కేఎల్ రాహుల్ 1).చదవండి: ఐసీయూలో శుబ్మన్ గిల్ -
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అర్ధ శతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిలకడగా ఆడుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైంది. కోల్కతాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు.31, 39.. తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్లు ఇవేఇక తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో సఫారీ టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. బవుమా పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగులో క్రీజులో నిలిచారు.జోడీని విడదీసిన బుమ్రాఈ క్రమంలో 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికా కాసేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బవుమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన టెయిలెండర్ బాష్ను బుమ్రా అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. బవుమా- బాష్ (25) జోడీని విడదీసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్అయితే, బవుమా మాత్రం జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయాడు. బుమ్రా బౌలింగ్లో ఫోర్ బాది.. 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిరాజ్ సైమన్ హార్మర్ (20 బంతుల్లో 7)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సఫారీ జట్టు ఆలౌట్అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ మియా కేశవ్ మహరాజ్ (0)ను పదో వికెట్గా వెనక్కి పంపడంతో సఫారీ జట్టు ఆలౌట్ అయింది. మొత్తంగా 54 ఓవర్ల ఆటలో 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. దీంతో టార్గెట్ 124 (153-30=123) పరుగులుగా మారింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మూడోరోజు బుమ్రా ఒక వికెట్ పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జడ్డూ -
ఐసీయూలో శుబ్మన్ గిల్!.. టీమిండియాకు ఊహించని షాక్!
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు తొలి టెస్టులో మిగిలిన ఆటకు.. రెండో టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.బిజీబిజీకాగా టెస్టు, వన్డే సారథి గిల్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఆసియా టీ20 కప్ టోర్నీ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ (IND vs SA)లో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.కోల్కతాలో సఫారీ జట్టుతో శుక్రవారం మొదలైన టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. అయితే, శనివారం నాటి ఆట సందర్భంగా కెప్టెన్ గిల్ మెడకు గాయమైంది. నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన గిల్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.నొప్పి ఎక్కువగా ఉండటంతోప్రొటిస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్కు మెడపట్టేసింది. వెంటనే ఫిజియో వచ్చి గిల్ను పరిశీలించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్ను డ్రెసింగ్రూమ్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా అతడిని కోల్కతాలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.ఐసీయూలో చికిత్సఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. గిల్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. అయితే, ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే వైద్యుల సమక్షంలో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు వెల్లడించాయి.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానేగిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటైందని.. క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం గిల్ వుడ్లాండ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని.. పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే అతడు మళ్లీ మైదానంలో దిగుతాడా? లేదా? అన్నది తేలుతుందని తెలిపాయి.కాగా తొలి ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత కూడా మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్గా ప్రకటించారు. ఈ మ్యాచ్లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.బీసీసీఐ అప్డేట్గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడని తెలిపింది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.చదవండి: IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే -
చరిత్ర సృష్టించిన జడేజా.. భారత తొలి క్రికెటర్గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సత్తా చాటాడు. కోల్కతా వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా బ్యాట్తో, బాల్తో రాణించాడు.భారత తొలి ఇన్నింగ్స్లో 45 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, సైమన్ హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఈ లెఫ్లాండర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఏదేమైనా భారత్ 189 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో జడ్డూ తన వంతు పాత్రను పోషించాడని చెప్పవచ్చు.ఆకాశమే హద్దుగాఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది ఓవర్ల బౌల్ చేసి పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్లో శనివారం నాటి రెండో రోజు ఆటలో జడ్డూ 13 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.భారత తొలి క్రికెటర్గా రికార్డుప్రొటిస్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11), టోనీ డి జోర్జి (2) రూపంలో మూడు వికెట్ల తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. ట్రిస్టన్ స్టబ్స్ (5)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 250 వికెట్ల క్లబ్లో చేరిన భారత తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు.ప్రపంచంలో రెండో ప్లేయర్గాఅంతేకాదు.. ఓవరాల్గా ప్రపంచంలో స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన (స్వదేశంలో 2000+ 250 వికెట్లు) రెండో ఆటగాడిగా జడేజా నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో ఓవరాల్గా నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కి పైగా వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్గా ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ బోతమ్, కపిల్ దేవ్, డానియెల్ వెటోరి జడ్డూ కంటే ముందు వరుసలో ఉన్నారు.కాగా భారత్తో తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు సాధించింది. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సౌతాఫ్రికా. ఆట పూర్తయ్యేసమయానికి 35 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: అందుకే రాజస్తాన్ రాయల్స్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్ -
తిప్పేసిన జడ్డూ.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు ప్రభావం చూపితే.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు తిప్పేశారు. ఫలితంగా అరవై పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. శనివారం ఆట ముగిసే సరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్ చేసింది. పర్యాటక జట్టును తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది.తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్ల సత్తాటీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్ల చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23).. వియాన్ ముల్దర్ (24), టోనీ డి జోర్జి (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఇక 37/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో 152 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా 189 పరుగులు చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాపై ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ప్రొటిస్ బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.భారత స్పిన్ దెబ్బకు సఫారీలు విలవిలఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు ఆది నుంచే భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. రియాన్ రికెల్టన్ (11)ను కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేసి వికెట్ల వేట మొదలుపెట్టగా... జడ్డూ ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11)లను వెనక్కి పంపి సఫారీలకు కోలుకోలేని షాకిచ్చాడు..@imkuldeep18 comes into the attack… and STRIKES instantly! 💥South Africa lose their first as Rickelton falls LBW to the Chinaman! 👌🏻Catch the LIVE action ⬇️#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/OOZQRsBLzl— Star Sports (@StarSportsIndia) November 15, 2025 అదే విధంగా.. టోనీ డి జోర్జి (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వికెట్ కీపర్ కైలీ వెరెన్నె (9)ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్.. మార్కో యాన్సెన్ (13)ను పెవిలియన్కు పంపించాడు. Spinning a web! 🕸️🌀Some gun bowling from the No.1 Test All-rounder #RavindraJadeja has South Africa 3 down!#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/qgrOk7lvGW— Star Sports (@StarSportsIndia) November 15, 2025నాలుగేసిన జడ్డూఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 35 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే కేవలం 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇక మూడోరోజైన ఆదివారం ఆటలో ఆరంభంలోనే మిగిలిన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారంటే.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యమే ఉంటుందని చెప్పవచ్చు. స్పిన్నర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. టార్గెట్ వంద కంటే తక్కువగానే ఉండొచ్చు.ఇదిలా ఉంటే.. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. సిరాజ్ చేతికి ఇంకా బంతి రానేలేదు.చదవండి: ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే.. -
ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఇందుకు వేదిక.రాణించిన భారత బౌలర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్.. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చెరో రెండు.. అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు.అయితే, బుమ్రా ఆది నుంచే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో అప్పటికే 43 పరుగులు ఇచ్చేసిన సిరాజ్ మియా చేతికి ఆ తర్వాత బంతి రావడానికి చాలా సమయమే పట్టింది.ఒకే ఓవర్లో రెండుఎట్టకేలకు తను వేసిన పదో ఓవర్లో సిరాజ్ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 45వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన ఈ రైటార్మ్ పేసర్.. తొలి బంతికి కైల్ వెరెన్నె(16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి మార్కో యాన్సెన్(0)ను బౌల్డ్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు.ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వుఈ నేపథ్యంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట తర్వాత సిరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వు అని గిల్ను అడిగాను. అదే ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు తీశాను’’ అని సిరాజ్ తెలిపాడు.అదే విధంగా బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వికెట్ తీయడానికి నేను ఇబ్బంది పడుతున్న సమయంలో జస్సీ భాయ్ వచ్చి.. స్టంప్స్ మీదకు బౌల్ చేయమని చెప్పాడు. ఎల్బీడబ్ల్యూ కోసం ట్రై చేయమన్నాడు. బౌల్డ్ చేయడం.. క్యాచ్లు పట్టడం.. ఇలా వికెట్ తీయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయని.. నన్ను కేవలం బౌలింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. తాను నిరాశకు గురైన వేళ బుమ్రా తనలో ఆత్మవిశ్వాసం నింపాడని తెలిపాడు. కాగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మొత్తంగా 12 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.స్వల్ప ఆధిక్యంకాగా తొలిరోజు సౌతాఫ్రికాను 159 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. శుక్రవారం ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో ఆటలో భాగంగా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. 189 పరుగులకు భారత్ ఆలౌట్
కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సైతం తీవ్ర నిరాశపరిచారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌటైంది. 37/1 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ అదనంగా 152 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.తొలి ఇన్నింగ్స్లో భారత్కు కేవలం 30 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్(39) టాప్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(29), రవీంద్ర జడేజా(27), రిషబ్ పంత్(27) కాసేపు క్రీజులో నిలబడ్డారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. హార్మర్ 4 వికెట్లతో గిల్ సేన పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మార్కో జానెసన్ మూడు, మహారాజ్, బాష్ తలా వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.గిల్ రిటైర్డ్ ఔట్..కాగా ఈ మ్యాచ్లో భారత్కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. హార్మర్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత అతడు తిరిగి బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ ఔట్గా పరిగణించారు. అయితే గిల్ తమ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండో ఇన్నింగ్స్లో గిల్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రిషబ్ నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఈ ఫీట్ను అందుకున్నాడు.ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (90) సిక్సర్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సెహ్వాగ్ ఆల్టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 92 సిక్స్లు బాదాడు. కాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన పంత్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 24 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మంచి టచ్లో కనిపించిన పంత్.. బాష్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. 51 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టీమిండియా 6 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(24), అక్షర్ పటేల్(1) ఉన్నారు. రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు.భారత్ తరపున టెస్ట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరేరిషబ్ పంత్-92వీరేంద్ర సెహ్వాగ్-90రోహిత్ శర్మ-88రవీంద్ర జడేజా-80ఎంఎస్ ధోని-70చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. ఆట మధ్యలోనే -
IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్..
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడపట్టేయడం (Neck Sprain)తో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ 35 ఓవర్ వేసిన సైమన్ హార్మర్ బౌలింగ్లో రెండో బంతిని సుందర్ ఔటయ్యాక గిల్ క్రీజులోకి వచ్చాడు. అదే ఓవర్లో ఐదో బంతికి స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో గిల్ నొప్పితో విల్లవిల్లాడు. అతడు మెడను పూర్తిగా కదల్చలేని విధంగా కనిపించాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి గిల్ మాత్రం కాస్త ఆసౌకర్యంగానే కన్పించాడు.ఈ క్రమంలో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు. గిల్ బ్యాటింగ్కు తిరిగి వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టీమిండియా సఫారీల కంటే ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది. కాగా అంతకుముందు పర్యాటక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది. కాగా గిల్ గాయంపై బీసీసీఐ తాజాగా అప్డేట్ ఇచ్చింది. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ రికవరీ బట్టి ఈ రోజు ఆటలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని బీసీసీఐ ఎక్స్లో రాసుకొచ్చింది.చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్ -
తడబడుతున్న భారత బ్యాటర్లు.. లంచ్ బ్రేక్కు స్కోరెంతంటే?
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సైతం తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం రవీంద్ర జడేజా(11), ధ్రువ్ జురెల్(4) ఉన్నారు.37-1 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ సుందర్(29) వికెట్ కోల్పోయింది. ఆచితూచి ఆడిన సుందర్ సఫారీ స్పిన్నర్ హార్మర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ శుభ్మన్ గిల్(4) మెడ పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో నిలదొక్కుకున్న కేఎల్ రాహుల్(39), రిషబ్ పంత్(27) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు జానెసన్, బాష్, హార్మర్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది.తుది జట్లుదక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
-
‘అసలే మరుగుజ్జు కదా!’.. స్పందించిన సౌతాఫ్రికా కోచ్!
భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య రెండు టెస్టుల సిరీస్కు శుక్రవారం తెరలేచింది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.బంతితో అదరగొట్టిన బుమ్రాఈ క్రమంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆది నుంచే నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వేగంగా ఆడుతూనే.. క్రీజులో పాతుకుపోవాలని ప్రయత్నించిన ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (48 బంతుల్లో 31), రియాన్ రికెల్టన్ (22 బంతుల్లో 23)లను త్వరగానే పెవిలియన్కు పంపాడు.అంతేకాదు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24), సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)లను కూడా అవుట్ చేసిన బుమ్రా.. మొత్తంగా ఐదు వికెట్లతో మెరిశాడు. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఈ రైటార్మ్ పేసర్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.అదే సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాను ఉద్దేశించి.. బుమ్రా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికా స్కోరు 62/2 వద్ద ఉన్న వేళ.. బవుమా క్రీజులో ఉండగా.. బుమ్రా అద్భుతమైన బంతిని సంధించాడు. దీనిని ఎదుర్కొనే క్రమంలో బవుమా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బాల్ అతడి ప్యాడ్కు తాకింది.బుమ్రా నోట ఊహించని మాటదీంతో బుమ్రాతో పాటు టీమిండియా ఫీల్డర్లు కూడా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. అయితే, బుమ్రా మాత్రం కచ్చితంగా బంతి వికెట్లను గిరాటేస్తుందన్న నమ్మకంతో .. వికెట్ కీపర్ రిషభ్ పంత్తో చర్చించేందుకు వెళ్లాడు. బాల్ మరీ ఎత్తులో వెళ్లిందా? లేదా? అని చర్చించాడు. ఇందుకు పంత్.. బాల్ ఎత్తులోనే వెళ్తుందని అభిప్రాయపడ్డాడు.అసలే మరుగుజ్జు కదా!మరోవైపు.. బుమ్రా ఊహిస్తున్నట్లుగా ఇది అవుట్ కాదని భావించిన కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా రివ్యూ తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలోనే బుమ్రా.. ‘క్రీజులో ఉన్నది అసలే మరుగుజ్జు కదా!’ అంటూ ఒక రకంగా బవుమాను ఎగతాళి చేస్తూ బౌలింగ్ చేసేందుకు వెళ్లాడు. దీంతో భారత ఆటగాళ్లంతా నవ్వుకోగా.. బుమ్రా మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.నిజానికి బుమ్రా మైదానంలో ఇలా వ్యవహరించడం అరుదు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి గురించి అతడు ఇలా మాట్లాడతాడని అభిమానులు కూడా అస్సలు ఊహించలేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లు బుమ్రా తీరు సరికాదంటూ విమర్శల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం సరదాగా అన్న మాటలకు అపార్థాలు ఆపాదించవద్దని హితవు పలికారు.స్పందించిన సౌతాఫ్రికా కోచ్!ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్వెల్ ప్రిన్స్ తాజాగా స్పందించాడు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం గురించి మా జట్టులో ఎలాంటి చర్చా రాలేదు. అవును.. ఇలా జరగడం ఇదే తొలిసారి.అందుకే త్వరగానే నా దృష్టికి కూడా వచ్చింది. అయితే, అక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ అంటూ మాట దాటేశాడు. ఏదేమైనా బుమ్రా తీరుకు బవుమా, అతడి అభిమానులు నొచ్చుకున్నారన్నది మాత్రం నిజమేనని తెలుస్తోంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్లో.. బవుమా కెప్టెన్సీలోని సౌతాఫ్రికా టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్లో జరిగిన టైటిల్ పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సఫారీలు ఐసీసీ గదను సొంతం చేసుకున్నారు. చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్దే పైచేయి!JB - "bauna hai yeh"RP- "bauna hai but laga yahape"JB - "bauna hai yeh BC"Review not taken for the appeal of LBW against Bavuma.#INDvsSA #Bumrah pic.twitter.com/r8UO8afR1J— The last dance (@26lastdance) November 14, 2025 -
బుమ్రా సూపర్ హిట్.. జైసూ విఫలం.. తొలిరోజు హైలైట్స్
భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) తొలి రోజు ఆట ముందుగానే ముగిసిపోయింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బౌలర్ల విజృంభణ కారణంగా మొదటి రోజు ఆతిథ్య భారత్.. ప్రొటిస్ జట్టుపై పైచేయి సాధించింది.ఈడెన్ గార్డెన్స్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం టెస్టు సిరీస్ మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.159 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బవుమా బృందం టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లు ఆడి 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) ఓ మోస్తరుగా రాణించగా.. వీరిద్దరని భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెనక్కి పంపించాడు.వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 51 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ తెంబా బవుమా దారుణంగా విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.ఒకే ఓవర్లోమరోవైపు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24) నిలబడే ప్రయత్నం చేయగా బుమ్రా.. అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వికెట్ కీపర్ కైల్ వెరెన్నె(16)తో పాటు.. మార్కో యాన్సెన్ (0)ను ఒకే ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ పెవిలియన్కు చేర్చాడు. కార్బిన్ బాష్ (3)ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యూ చేయగా.. సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)ల వికెట్లు కూల్చి.. బుమ్రా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్కు చరమగీతం పాడాడు. ట్రిస్టన్ స్టబ్స్ 74 బంతులు ఎదుర్కొని 15 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. జైసూ విఫలంఅనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన లభించిన లైఫ్లను దుర్వినియోగం చేసుకున్నాడు.మొత్తంగా 27 బంతులు ఎదుర్కొన్న జైసూ.. మూడు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 59 బంతుల్లో 13, వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ 38 బంతుల్లో 6 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి.. పైచేయిఫలితంగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్.. 20 ఓవర్ల ఆటలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 122 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి గిల్ సేన ఆధిపత్యం కొనసాగించింది. చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్ -
IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్ రాణించడంతో ప్రొటిస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.టాస్ గెలిచిన సౌతాఫ్రికాప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC )సీజన్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే విజృంభించిబుమ్రా ఆరంభం నుంచే బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలకు షాకిచ్చాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సౌతాఫ్రికా వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (24)తో పాటు కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?ఆ తర్వాత బుమ్రా మరోసారి తన పేస్ పదునుతో టోనీ డి జోర్జి (24)ని బౌల్డ్ చేయగా.. వికెట్ కీపర్ వెరెన్నె (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్.. మార్కో యాన్సెన్ (0)ను డకౌట్ చేశాడు. ఇక స్పిన్నర్ అక్షర్ పటేల్.. కార్బిన్ బాష్ (3)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఒక వికెట్ దక్కించుకోగా.. సైమన్ హార్మర్ (5)ను తొమ్మిదో వికెట్గా బుమ్రా వెనక్కి పంపాడు.ఆ తర్వాత కేశవ్ మహరాజ్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన బుమ్రా.. ఐదు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకుని... సౌతాఫ్రికా కథను ముగించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.దక్షిణాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ని (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్ -
గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే
కోల్కతా వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లతో బరిలోకి దిగింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లు ఆడడం ఇదే తొలిసారి.యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్ వంటి ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు ఉన్నారు. టాప్-8లో అయితే ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఏకంగా ఐదుగురు ఉండడం గమనార్హం.అంతకముందు మూడు సందర్భాల్లో భారత్ ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లతో ఆడింది. కానీ ఆరు మంది ఆడడం ఇదే మొదటి సారి. అయితే హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆరుగురు అవసరమంటా అంటూ మండిపడుతున్నారు. అందులో నలుగురు స్పిన్నర్లే ఉన్నారు. ఈ మ్యాచ్లో కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే భారత్ ఆడుతోంది.భారత్ అత్యధిక లెఫ్ట్ హ్యాండర్లతో ఆడిన టెస్టులు ఇవే..6 vs సౌతాఫ్రికా-కోల్కతా 20255 vs ఇంగ్లండ్ - మాంచెస్టర్, 20255 vs వెస్టిండీస్- అహ్మదాబాద్, 20255 vs వెస్టిండీస్- ఢిల్లీ, 2025సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్ను జట్టు నుంచి తప్పించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సుదర్శన్ విఫలమైనప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.దీంతో సౌతాఫ్రికా సిరీస్లో కూడా అతడు ఆడడం ఖాయమని అంతా భావించారు. కానీ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని బెంచ్కు పరిమితం చేశాడు. మూడో స్ధానంలో సుదర్శన్కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు పంపాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు (జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్)తో బరిలోకి దిగింది.ఈ నేపథ్యంలో గంభీర్పై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఆడుతాడని అనుకున్నాను. కానీ అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు నంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడుతాడా? అస్సలు మీ ప్రణాళిక ఎంటో ఆర్ధం కావడం లేదు. నలుగురు స్పిన్నర్లు, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడడం ఏంటి? తొలి రోజు బ్యాటింగ్కు కోల్కతా వికెట్ బాగుంది. కాబట్టి నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. కచ్చితంగా నలుగురులో ఎవరో ఒకరు తక్కువ ఓవర్లకే పరిమితమవుతారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు ఉన్న అప్షన్స్ను ఎలా ఉపయోగిస్తాడో వేచి చూడాలి అని సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. అద్బుతమైన యార్కర్లు, ఇన్స్వింగర్స్తో ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్లు రియాన్ రికెల్టన్, ఐడైన్ మార్క్రమ్ ఇద్దరిని బుమ్రా వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. అయితే ప్రోటీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?13 ఓవర్లో మార్క్రమ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా.. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని జస్ప్రీత్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని ప్రోటీస్ కెప్టెన్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ బంతి మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు భారత ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. బుమ్రా మాత్రం ఖచ్చితంగా వికెట్లకు తాకుతుందన్న నమ్మకంగా కన్పించాడు.అయితే బంతి మరీ ఎత్తులో తాకిందా లేదా అని చర్చించడానికి రిషబ్ పంత్ వద్దకు బుమ్రా వెళ్లాడు. మిగితా ఆటగాళ్లంతా స్టంప్ల దగ్గర గుమిగూడారు. ఇదే విషయాన్ని పంత్ను బుమ్రా అడిగాడు. పంత్ కూడా కొంచెం పైకి వెళ్తుందని సూచించాడు. కెప్టెన్ గిల్ కూడా శుభ్మన్ గిల్ రివ్యూ తీసుకోవడానికి అంతగా సుముఖత చూపలేదు. దీంతో “క్రీజులో ఉన్నది బావుమా” కదా అంటూ బుమ్రా బౌలింగ్ చేసేందుకు తన ఎండ్కు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఓ అసభ్య పదాజాలన్ని కూడా వాడాడు. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. కాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ పొట్టిగా ఉంటాడని ఉద్దేశ్యంతో బుమ్రా ఈ కామెంట్స్ చేశాడు. అతడి హైట్ తక్కువగా ఉండడంతో బంతి మరీ ఎత్తులో వెళుతుందేమో అనే డౌట్తో బుమ్రా రివ్యూకు వెళ్లలేదు. బుమ్రా సందేహమే నిజమైంది. రిప్లేలో బంతి స్టంప్స్ మిస్ అవుతున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బుమ్రా ప్రవర్తనపై సీరియస్ అవుతున్నారు. పొట్టిగా ఉన్న బవుమాను బుమ్రా ఎగతాళి చేశాడని, ఇది అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇది బుమ్రా సరదాగా అన్నాడని, సీరియస్ తీసుకోవాల్సిన అవసరములేదని మద్దతుగా నిలుస్తున్నారు. సాధారణంగా బుమ్రా మైదానంలో చాలా సైలెంట్గా ఉంటాడు. వికెట్ సెలబ్రేషన్స్ కూడా అతిగా చేసుకోడు. ప్రత్యర్ధి బ్యాటర్లను హేళన చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి బుమ్రా ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన సహజ ప్రవర్తనకు కాస్త భిన్నంగా బుమ్రా వ్యవహరించాడు.చదవండి: పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్..pic.twitter.com/TEgjD33KZA— Pulga (@Lap_alt) November 14, 2025 -
కుల్దీప్ మ్యారేజ్ లీవ్.. రెండో టెస్టుకు దూరం!
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కానున్నాడు. నవంబర్ చివరి వారంలో కుల్దీప్ వివాహం జరగనుంది. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. కుల్దీప్ తన పెళ్లికి సెలవు మంజారు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని కుల్దీప్ అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. సఫారీలతో తొలి టెస్టు తర్వాత తనను జట్టు నుంచి కుల్దీప్ను రిలీజ్ చేసే అవకాశముంది."కుల్దీప్ వివాహం నవంబర్ చివరి వారంలో జరగనుంది. అతడు సెలవు మంజూరు చేయాలని బోర్డును అభ్యర్దించాడు. అయితే షెడ్యూల్ను పరిగణలోకి తీసుకుని అతడికి ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఏడాది జూన్లో తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో యాదవ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికి.. ఐపీఎల్ ముగింపు ఆలస్యం కావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.అతడికి బీసీసీఐ సెలవు మంజారు చేస్తే నవంబర్ 22 నుంచి జరగనున్న రెండో టెస్టుకు కుల్దీప్ దూరమయ్యే అవకాశముంది. అతడి తిరిగి వన్డే సిరీస్కు భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కుల్దీప్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. క్విక్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఈడెన్ వికెట్పై కుల్దీప్ మ్యాజిక్ చేసే అవకాశముంది. అంతకుముందు విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ కుల్దీప్ 12 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్.. -
ముగిసిన తొలి రోజు ఆట
IND vs SA 1st Test Live Updates: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుతబ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సరికి 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. వెలుతురు లేమి వల్ల ముందుగానే ఆట ను ముగించారు. కేఎల్ రాహుల్ 13 , వాషింగ్టన్ సుందర్ ఆరు పరుగులతో క్రీజులో నిలిచారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్మార్కో జాన్సెన్ బౌలింగ్లో జైస్వాల్ (12) బౌల్డ్. తొలి వికెట్ కోల్పోయిన భారత్. స్కోరు: 18-1(7). క్రీజులోకి వాషింగ్టన్ సుందర్. కేఎల్ రాహుల్ 17 బంతుల్లో రెండు పరుగులతో ఉన్నాడు.సౌతాఫ్రికా ఆలౌట్భారత్తో తొలి టెస్టులో తొలి రోజే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల ధాటికి తాళలేక 159 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(23), ముల్డర్(24) కాసేపు క్రీజులో నిబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల హాల్తో చెలరేగాడు. అతడితో పాటు సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెటలు తీశారు.పదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాబుమ్రా బౌలింగ్ కేశవ్ మహరాజ్ (0) ఎల్బీడబ్ల్యూ కావడంతో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ డౌన్బుమ్రా బౌలింగ్లో హార్మర్ (5) బౌల్డ్. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.ఆలౌట్ దిశగా సౌతాఫ్రికా..కార్బిన్ బాష్ రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బాష్ అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(15), హార్మర్(0) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్..సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. మార్కో జానెసన్ను అద్భుతమైన బంతితో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 48 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 151/7సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన వెర్రియిన్.. సిరాజ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులోకి మార్కో జానెసన్ వచ్చాడు. 44.4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 146/6సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్..లంచ్ విరామం తర్వాత సౌతాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వియాన్ ముల్డర్(24) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్లో డీజోరీ ఎల్బీగా వెనుదిరిగాడు. 33 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(2), కైల్ వెర్రియినే ఉన్నారు.లంచ్ బ్రేక్కు సౌతాఫ్రికా స్కోరెంతంటే?తొలి రోజు లంచ్ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో టోనీ డి జోర్జీ(15), ముల్డర్(22) ఉన్నాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్..టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బవుమా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన మార్క్రమ్.. బుమ్రా బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్లకు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(2), ముల్డర్(5) ఉన్నారు. సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..57 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ను కోల్పోయింది. 23 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్..జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి వియాన్ ముల్డర్ వచ్చాడు.5 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోరెంతంటే?5 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్( మార్క్రమ్(0),భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సమరం షురూ అయింది. ఈ సిరీస్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్కు సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ దూరమయ్యాడు. అతడి స్ధానంలో బాష్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు.అదేవిధంగా సూపర్ ఫామ్లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు సైతం ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. అక్షర్ పటేల్ కూడా కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడుతున్నాయి.తుది జట్లుదక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విరోచిత పోరాటం
రాజ్కోట్ వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా-ఎ లోయార్డర్ బ్యాటర్లు సత్తాచాటారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసన ప్రోటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది.అయితే టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలకు భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి తొలి ఓవర్లోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లో ప్రసిద్ద్ కృష్ణ సైతం కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత అర్ష్దీప్, సింధు వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు సాధించారు. దీంతో ప్రోటీస్ జట్టు కేవలం 53 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో దిల్దానో పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో) విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ ఆరో వికెట్కు వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదేవిధంగా స్పిన్నర్ బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) బ్యాట్తో సత్తాచాటాడు. దీంతో భారత్కు ఫైటింగ్ టార్గెట్ను సౌతాఫ్రికా ఉంచింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి తలో ఒక వికెట్ పడగొట్టారు. 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31), రియాన్ పరాగ్(8) వికెట్లను మెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు (India vs South Africa) ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్లకు సన్నాహకంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు.ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగుతాడు.హర్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గాయపడిన అతను.. ఆతర్వాత పాకిస్తాన్తో జరిగిన ఫైనల్తో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యాడు. హార్దిక్ ఇటీవలే గాయం (ఎడమ క్వాడ్రిసెప్స్) నుంచి పూర్తిగా కోలుకొని, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.ఫిట్నెస్ టెస్ట్లన్నీ క్లియర్ చేసి అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 26న బెంగాల్తో జరిగే మ్యాచ్తో రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ రెండు మ్యాచ్లకు (28న జరిగే మ్యాచ్కు కూడా) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత అతను భారత జట్టుతో కలవాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కు హార్దిక్ తప్పక ఎంపికయ్యే అవకాశం ఉంది. రాంచీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 3న రాయ్పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కటక్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభవుతుంది. ఈ సిరీస్లో కూడా హార్దిక్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. హార్దిక్ జట్టులో చేరితే భారత మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది. హార్దిక్ గైర్హాజరీలో భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే.ఆతర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లలో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు
కోల్కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి 19 మధ్యలో సౌతాఫ్రికా-ఏతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో పాల్గొనాలని ఆదేశించారు. నవంబర్ 22 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ సమయానికి తిరిగి సీనియర్ జట్టులో చేరతాడని పేర్కొన్నారు.నితీశ్ను భవిష్యత్ విదేశీ పర్యటనల కోసం సిద్దం చేస్తున్నామని బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో నితీశ్ ఖంగుతిన్నాడు. నితీశ్కు ఈ పరిస్థితి రావడానికి సరైన అవకాశాలు రాకపోవడం ఓ కారణమైతే, ధృవ్ జురెల్ ఫామ్ మరో కారణం.పంత్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన జురెల్ జట్టులో స్థిరపడిపోయాడు. ఇటీవల విండీస్పై సెంచరీతో పాటు తాజాగా సౌతాఫ్రికా-ఏపై ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. మరోపక్క గాయం నుంచి కోలుకున్న పంత్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా పూర్వపు ఫామ్ను కొనసాగించాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో పంత్, జురెల్ ఇద్దరిని ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో ఎవరిపై వేటు వేయాలని ఆలోచిస్తే మేనేజ్మెంట్కు నితీశ్ కుమార్ రెడ్డి మొదటి ఆప్షన్ అయ్యాడు. నితీశ్ తాజాగా విండీస్తో జరిగిన సిరీస్లో రెండు మ్యాచ్ల్లో ఆడినా రెండు విభాగాల్లో (బ్యాటింగ్, బౌలింగ్) సరైన అవకాశాలు రాలేదు.తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఇన్నింగ్స్లో నితీశ్కు బంతినే ఇవ్వలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అవకాశం రాగా, దానికి నితీశ్ న్యాయం చేశాడు. అప్పటికే భారత్ భారీ స్కోర్ చేయగా.. నితీశ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 43 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో నితీశ్కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విండీస్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతో నితీశ్కు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు..! -
ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్లో రిషబ్ పంత్ (Rishabh Pant), ధృవ్ జురెల్ (Dhruv Jurel) బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ధృవీకరించాడు. జురెల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడని వెల్లడించాడు.డస్కటే ప్రకటనతో టీమిండియా తుది జట్టు కూర్పుపై క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, వన్డౌన్లో సాయి సుదర్శన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆతర్వాతి స్థానాల్లో జురెల్, పంత్, జడేజా, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలుతొలి టెస్ట్లో తనూ, పంత్ ఇద్దరూ బరిలోకి దిగడం ఖరారైన నేపథ్యంలో జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ "ఫాలో ద బ్లూస్"తో మాట్లాడుతూ పంత్తో పోటీ ఉంటుందా అన్న అంశంపై స్పందించాడు. పంత్తో పోటీ ఉండదని, ఇద్దరం టీమిండియాకు ఆడుతున్నామని అన్నాడు. ఇద్దరిలో ఎవరు బాగా ఆడినా, అంతిమంగా తమ లక్ష్యం భారత్ గెలుపేనని తెలిపాడు.పంత్ బాగా ఆడినా, నేను బాగా ఆడినా సంతోషిస్తానని అన్నాడు. ఇద్దరు బాగా ఆడితే అంతకు మించిన సంతోషం లేదని తెలిపాడు. అంతిమంగా జట్టు ఫోకస్ అంతా గెలుపుపైనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇదే సందర్భంగా సౌతాఫ్రికాతో పోటీపై కూడా స్పందించాడు. ఈ సిరీస్ హోరాహోరీగా ఉండబోతుందని అంచనా వేశాడు. ఇరు జట్లలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అన్నాడు. వారికి రబాడ, జన్సెన్ ఉంటే.. మాకు బుమ్రా, సిరాజ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు.కాగా, పంత్ గైర్హాజరీలో టీమిండియాలోకి వచ్చిన జురెల్ అసాధారణ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల అహ్మదాబాద్ టెస్ట్లో వెస్టిండీస్పై సూపర్ సెంచరీ చేసిన అతను.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్ల్లో అజేయ సెంచరీలు చేశాడు. జురెల్ ప్రస్తుత ఫామ్ టీమిండియాలో అతని స్థానాన్ని సుస్థిరం చేసేలా ఉంది.చదవండి: బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి -
భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక టీమ్ మెనెజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్ల విషయంలో ఎవరిని సెలక్ట్ చేయాలని గంభీర్ అండ్ కో తర్జనభర్జన పడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంత్ బ్యాకప్గా ఉన్న ధ్రువ్ జురెల్ సైతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వెస్టిండీస్ సిరీస్తో పాటు రంజీ ట్రోఫీలోనూ జురెల్ సెంచరీలతో సత్తాచాటాడు. దీంతో అతడికి తుది జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గంభీర్ కూడా ఇద్దరూ స్పెషలిస్టు వికెట్ కీపర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇద్దరు వికెట్ కీపర్లను తుది జట్టులో ఉంచడం కష్టమైనప్పటికీ, ఈ సమస్యకు పరిష్కరం తమ వద్ద ఉందని డెష్కాట్ తెలిపాడు."కోల్కతా టెస్టు నుంచి ధ్రువ్ జురెల్ను మేము దూరంగా ఉంచలేము. కానీ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం మెనెజ్మెంట్కు ఎల్లప్పుడూ బిగ్ ఛాలెంజ్నే. ఒకరికు ఛాన్స్ ఇవ్వాలంటే మరొకరు తప్పక తప్పుకోవాలి. అయితే తుది జట్టును ఎలా ఎంపిక చేయాలన్న విషయంపై మాకు ఒక క్లారిటీ ఉంది.ధ్రువ్ ఫామ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరులో జరిగిన రంజీ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్లో అతడు ఆడడం దాదాపు ఖాయమని ర్యాన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీకి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే టెస్టులకు స్పిన్కు అనుకూలించే పిచ్లను కోరుకుంటుంది. కానీ ఈసారి మాత్రం ఫుల్ రాంక్ టర్నర్ పిచ్ వద్దని క్యూరేటర్కు గంభీర్ చెప్పాడంట. ఈ విషయాన్ని స్వయంగా మఖర్జీనే వెల్లడించాడు. టీమ్ మెనెజ్మెంట్ కొంచెం టర్న్ ఉండేలా పిచ్ తాయారు చేయమని సూచించినట్లు అతడు వెల్లడించాడు."తొలి టెస్టు కోసం మంచి పిచ్ను తాయారు చేశాము. బ్యాటర్లతోపాటు బౌలర్లకూ సహకారం లభిస్తుంది. ఆట సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్పై బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతీ హోమ్ టీమ్ కూడా పిచ్ విషయంలో కొన్ని సూచనలు చేస్తారు. ఆస్ట్రేలియాలో అయితే ఆతిథ్య జట్టు ఎక్కువ బౌన్స్ ఉండే పిచ్లను తాయారు చేయమని అడుగుతారు. అదే భారత జట్టు అయితే టర్న్ ఉండేట్లు కోరుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం వారు ఫుల్ రాంక్ టర్నర్ పిచ్ను అడగలేదు. కొద్దిగా టర్న్ ఉండేలా తాయారు చేయమని చెప్పారు. అని మఖర్జీ ఇండియా టూడేతో పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, కెప్టెన్ శుభ్మన్ గిల్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పిచ్ను పరిశీలించారు. ఈ వికెట్పై వారు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈడెన్ గార్డెన్స్ ఇటీవల రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్లలో పేసర్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచారు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శ్రేయస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజులైనా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్లో శ్రేయస్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. బీసీసీఐ శ్రేయస్ విషయంలో ఎలాంటి తొందరపాటుకు పోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకొని, ప్రాక్టీస్ మొదలుపెట్టాకే అతనికి కబురు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్లో శ్రేయస్కు ప్రత్యామ్నాయం కోసం సెలెక్టర్లు వేట మొదలుపెట్టారు. గత కొంతకాలంగా శ్రేయస్ నాలుగో స్థానంలో అంచనాలకు మించి రాణిస్తూ, స్థిరపడ్డాడు. ఈ సిరీస్కు శ్రేయస్ దూరమైతే టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లవతుంది. ఇటీవలికాలంలో ఛేదనల్లో శ్రేయస్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడకముందు కూడా రాణించాడు. మొత్తంగా శ్రేయస్ గాయం భారత వన్డే జట్టు కూర్పును గందరగోళంలో పడేసింది.ఇదిలా ఉంటే, శ్రేయస్ గాయానికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాయపడిన వెంటనే శ్రేయస్ ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. స్ప్లీన్లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అక్సిజన్ లెవెల్స్ 50కి పడిపోయినట్లు పేర్కొన్నాయి. ఆ సమయంలో శ్రేయస్ పది నిమిషాల పాటు నిలబడలేకపోయాడని, అతడి శరీరం పూర్తిగా బ్లాక్ అవుటయ్యిందని తెలిపాయి. ఈ విషయం వింటుంటే శ్రేయస్ చావుకు దగ్గరగా వెళ్లొచ్చాడని స్పష్టమవుతుంది.అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టుకోగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ విషయం తెలిశాక యావత్ క్రికెట్ సమాజం ఆందోళనకు గురైంది. శ్రేయస్కు ఏమీ కాకూడదని దేవుళ్లను మొక్కింది. దేవుడి దయ, డాక్టర్ల పనితనం వల్ల శ్రేయస్ మృత్యు కొరల్లో నుంచి బయటపడ్డాడు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్ -
ఢిల్లీ పేలుడు ఘటనపై గౌతమ్ గంభీర్ దిగ్భ్రాంతి
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భయంకర పేలుడులో మొత్తం 13 మంది మృతి చెందగా..17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని గంభీర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గంబీర్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు కోల్కతాలో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం కానుంది.భద్రతా వలయంలో ఈడెన్..కాగా ఢిల్లీ ఘటన నేపథ్యంలో కోల్కతా పోలీస్లు అలర్ట్ అయ్యారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, స్టేడియంకి వెళ్లే మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. సోమవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ చుట్టూ పోలీసులు ప్రత్యేక నాకా తనిఖీలు (NAKA checks) చేశారు. -
మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్?
టీమిండియా స్పీడ్ స్టార్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ తుది దశకు చేరుకుందా? జాతీయ జట్టులోకి అతడి రీ ఎంట్రీ అసాధ్యమేనా..? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. షమీ గత ఎనిమిది నెలల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జెర్సీలో షమీ కన్పించలేదు. టెస్టుల్లో అయితే అతడు చివరగా 2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన షమీ.. 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు పడగొట్టాడు. లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేస్తూ తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఈ స్పీడ్ స్టార్ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం మరోసారి షమీకి నిరాశే మిగిల్చారు.షమీ× అగార్కర్అయితే తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని షమీ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. షమీ వ్యాఖ్యలపై అగార్కర్ కూడా స్పందించాడు. షమీకి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా ఉందని అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ చెప్పుకొచ్చాడు. షమీ తన ముందు ఉండింటే సమాధనము చెప్పేవాడని అని అగార్కర్ అన్నాడు.అయితే తాజాగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా షమీ ఆరోపణలపై స్పందించారు. "సెలక్టర్లు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సపోర్ట్ స్టాఫ్ షమీతో నిరంతరం టచ్లోనే ఉన్నారు. ఇంగ్లండ్ టూర్లో కొన్ని మ్యాచ్ల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినందున షమీ లాంటి సీనియర్ బౌలర్ను జట్టులోకి తీసుకోవాలని భావించాము.ఓ సీనియర్ సెలెక్టర్ అతడితో చర్చలు జరిపారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో కాంటర్బరీ లేదా నార్తాంప్టన్లో జరిగే ఇండియా-ఎ మ్యాచ్ ఆడాలని కోరారు. షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయగలడా లేడా అని సెలక్టర్లు పరీక్షించాలి అనుకున్నారు. కానీ షమీ మాత్రం సెలక్టర్ల ప్రతిపాదనను తిరష్కరించాడు. అగార్కర్ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని "సదరు బోర్డు అధికారి పేర్కొన్నారు.ఎవరు గొప్ప..?ఈ నేపథ్యంలో షమీ, అగార్కర్లలో ఎవరూ గొప్ప బౌలర్ అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. అగార్కర్ భారత క్రికెట్లో తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముఖ్యంగా వన్డేల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ బౌలింగ్ చేశాడు.ఈ ఢిల్లీ బాయ్ తన కెరీర్లో మొత్తంగా 191 వన్డేలు ఆడి 288 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో (అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తర్వాత) మూడో స్థానంలో అగార్కర్ ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్గా కూడా అజిత్ చానాళ్లపాటు కొనసాగాడు. అతడు కేవలం 23 మ్యాచ్లలోనూ ఈ రికార్డును అందుకున్నాడు. చాలా మ్యాచ్లలో బ్యాట్తో కూడా అజిత్ సత్తాచాటాడు. వన్డేల్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(కేవలం 21 బంతుల్లో) సాధించిన రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది.అదే విధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్పై అగార్కర్ సాధించిన టెస్టు సెంచరీ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. దాదాపు 15 ఏళ్ల పాటు భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అగార్కర్.. ఇప్పుడూ చీఫ్ సెలక్టర్గా తన సేవలను అందిస్తున్నాడు.ఇక షమీ విషయానికి వస్తే ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. షమీ పేరిట ప్రస్తుతం 206 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ 108 వన్డేల్లో 158 వికెట్లు మాత్రమే సాధించాడు. ఇద్దరూ మధ్య దాదాపుగా 48 వికెట్లు తేడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే షమీ తిరిగి వన్డేల్లో ఆడుతాడన్నది అనుమానమే. ఒకవేళ రీ ఎంట్రీ ఇచ్చినా అగార్కర్ ఆడిన వన్డేలకు సంఖ్యకు దారిదాపుల్లోకి కూడా వెళ్లలేడు. షమీ ఇప్పటివరకు 108 వన్డేల మ్యాచ్ల ఆడగా అందులో భారత్ 69 విజయాలు సాధించిందంటే అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ 69 వన్డేల్లో అతడు 5.24 ఎకానమీ రేటుతో 150 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఐదు ఫైవ్ వికెట్ల హాల్స్, ఎనిమిది ఫోర్ వికెట్ల హాల్స్ను షమీ నమోదు చేశాడు.అదే భారత్ ఓడిపోయిన 33 మ్యాచ్లలో షమీ 6.12 ఎకానమీ రేటుతో 47 మాత్రమే వికెట్లు పడగొట్టాడు. అంటే షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచిన ప్రతీసారి భారత్ దాదాపుగా విజయం సాధించింది. అతడు విఫలమైన చోట టీమిండియా ఓటమి పాలైంది. వన్డే వరల్డ్కప్-2023లోనూ షమీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. షమీ పేరిట టెస్టుల్లో కూడా 229 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ టెస్టుల్లో కేవలం 58 వికెట్లు మాత్రమే సాధించాడు.చదవండి: అతడి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలి: గంగూలీ -
ప్రాక్టీస్కు వేళాయె...
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా సొంతగడ్డపై టెస్టు సిరీస్కు భారత్ సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు ముందు వరుసగా మూడు రోజుల పాటు టీమ్ ప్రాక్టీస్లో పాల్గొంటుంది.ఆ్రస్టేలియాలో టి20 సిరీస్ ఆడిన టెస్టు జట్టు సభ్యులు గిల్, బుమ్రా, అక్షర్, సుందర్, కోచ్ గంభీర్ ఆదివారం రాత్రి కోల్కతాకు చేరుకున్నారు. ఇప్పటికే భారత్లో ఉన్న ఇతర సభ్యులు కూడా విడివిడిగా తమ స్వస్థలాల నుంచి వచ్చి జట్టు సభ్యులతో కలుస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం ఎలాంటి ప్రాక్టీస్ జరగలేదు. నేటినుంచి పూర్తి స్థాయి జట్టు సాధన చేస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యులైన రబాడ, యాన్సెన్ తదితరులు పాకిస్తాన్తో వన్డే సిరీస్ అనంతరం ఆదివారం రాత్రే కోల్కతాలో అడుగు పెట్టగా, ఇప్పటికే ‘ఎ’ టీమ్ తరఫున మ్యాచ్లు ఆడుతూ బెంగళూరులోనే ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా జట్టుతో చేరారు. ఈ బృందంలో కెప్టెన్ తెంబా బవుమా, జుబేర్ హమ్జా, అకెర్మన్ తదితరులు ఉన్నారు. సఫారీ టీమ్ కూడా సోమవారం సాధన చేయలేదు. 2025లో భారత్, దక్షిణాఫ్రికాలకు ఇదే చివరి టెస్టు సిరీస్ కానుంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే జూన్లో గానీ (అఫ్గానిస్తాన్తో) భారత్కు టెస్టు మ్యాచ్ లేదు. -
'అతడి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలి'
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టుకు దాదాపు ఎనిమిది నెలలగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. షమీ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం మొండి చేయి చూపిస్తోంది.ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ చివరసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్తో పాటు ఆసియాకప్, వెస్టిండీస్తో టెస్టులకు షమీని సెలక్టర్లు పక్కన పెట్టారు. కనీసం స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కైనా షమీని ఎంపిక చేస్తారని భావించారు. కానీ మరోసారి అగార్కర్ అండ్ కో షమీకి మొండి చేయి చూపించారు. తను ఫిట్గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ను షమీ పరోక్షంగా విమర్శించాడు. ఈ నేపథ్యంలో షమీకి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. షమీ భారత జట్టు తరపున తిరిగి అన్ని ఫార్మాట్లలో ఆడాలని తన ఆశిస్తున్నట్లు దాదా తెలిపాడు."మహ్మద్ షమీ చాలా ఫిట్గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్లలో బెంగాల్ను అతడు ఒంటి చేత్తో గెలిపించాడు. అతడి ప్రదర్శలను సెలక్టర్లు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే షమీతో సెలక్టర్లు మాట్లాడి ఉంటారు.ఫిట్నెస్ గానీ, స్కిల్ విషయంలో గానీ షమీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి అతడిని టెస్ట్లు, వన్డేలు, టీ20లు అన్నింటిలోనూ భారత్ తరపున కొనసాగించాలి" అని ఓ కార్యక్రమంలో గంగూలీ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత రంజీ సీజన్లో షమీ 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు సాధించాడు. కాగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోల్కతా వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. -
సిగ్గులేని వాళ్లుంటారు: వరల్డ్కప్ విజేతలకు గావస్కర్ వార్నింగ్
నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ICC Women's ODI World Cup) విజేతగా నిలిచింది. సొంతగడ్డపై ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మొదలు అభిమానుల దాకా.. యావత్ భారతావని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.భారీ నజరానాఢిల్లీ నుంచి గల్లీ దాకా హర్మన్ సేన గెలుపును ప్రస్తావిస్తూ మన ఆడబిడ్డలను ఆకాశానికెత్తింది. ఇక వరల్డ్కప్ గెలిచిన జట్టులోని సభ్యులైన క్రికెటర్లకు ఐసీసీ అందించే రూ. 40 కోట్ల ప్రైజ్మనీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన రూ. 51 కోట్ల నజరానా దక్కనుంది.క్యాష్ రివార్డులు అంతేకాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ ఎత్తున రివార్డులు ప్రకటించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్లకు ఇప్పటికే ప్రభుత్వం తలా రూ.2.25 కోట్ల మేర చెక్కులు అందించింది. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు.. రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. సొంత ఊరిలో ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విజేతలను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ0, 1983 వరల్డ్కప్ విన్నర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అమ్మాయిలు జాగ్రత్తమిడ్-డేకు రాసిన కాలమ్లో.. ‘‘అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీకోసమే ఈ మాటలు.. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు.జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్పేజీ యాడ్లు, హోర్డింగ్లు పెట్టిస్తారు. జట్టు యాజమాన్యం, స్పాన్సర్లు తప్ప మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. నిజానికి వారి ద్వారా భారత క్రికెట్కు ఒరిగేది ఏమీ ఉండదు.1983లో భారత్కు తొట్టతొలి వరల్డ్కప్ అందించిన విజేతలకు కూడా చాలా ప్రామిస్లు చేశారు. వీటి గురించి మీడియలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను తప్పుబట్టాల్సిన పనిలేదు.సిగ్గులేని వాళ్లుంటారువిజేతలకు వచ్చిన నజరానాల గురించి వారు పెద్ద పెద్ద హెడింగ్లు పెడతారంతే!.. అయితే, విజేతలతో పాటు మీడియాను కూడా కొంత మంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికీ తెలిసి ఉండదు. కాబట్టి.. అమ్మాయిలూ.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులను ఉపేక్షించవద్దు.తమ ప్రచారం కోసం మీ పేరును వాడుకుంటారు. 1983 విజేతల తరఫు నుంచి మీకో మాట చెప్పదలచుకున్నా.. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. మీకూ ఇది వర్తిస్తుంది. మరోసారి విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.కాగా వరల్డ్కప్లో భారత్ గెలవగానే గుజరాత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్లు ఇస్తానని ప్రకటించాడు. మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్ను విజేతలకు కానుకగా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
టీమిండియాకు ఊహించని షాక్..
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయడ్డాడు. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తుండగా జురెల్ కుడి చేతి వేలికి గాయమైంది.ప్రోటీస్ ఓపెనర్ లెసెగో సెనోక్వానే ఆఫ్ స్టంప్ వెలుపల డెలివరీని డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్లో ఉన్న జురెల్ క్యాచ్ను అందుకోవడానికి ప్రయత్నించగా.. బంతి అతడి చేతి వేలికి బలంగా తాకింది. వెంటనే తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.కనీసం ఫిజియో రాకుండానే అతడు మైదానాన్ని వీడాడు. ఇప్పటివరకు తిరిగి అతడు ఫీల్డింగ్కు రాలేదు. జురెల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ అనాధికారిక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ ఈ యూపీ క్రికెటర్ సెంచరీలతో చెలరేగాడు. అంతకుముందు విండీస్ సిరీస్లోనూ శతక్కొట్టాడు. దీంతో సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఆడించాలని భారత జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నప్పటికి ధ్రువ్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. కానీ అంతలోనే జురెల్ గాయ పడడం టీమ్మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక భారత్-సౌతాఫ్రికా ఎ జట్ల మధ్య రెండో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 56 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయానికి 45 ఓవర్లలో 208 పరుగులు కావాలి.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంభీర్ మాస్టర్ మైండ్! 39 ఏళ్ల తర్వాత? -
గంభీర్ మాస్టర్ మైండ్.. 39 ఏళ్ల తర్వాత!?
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వారం రోజులు తిరగకముందే మరో కఠిన సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. స్వదేశంలో శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది.అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లతో బరిలోకి దిగనుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గాయం కారణంగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు దూరమైన రిషబ్ పంత్.. తిరిగి ప్రోటీస్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో పంత్కు యథావిధిగా వికెట్ కీపర్ కోటాలో తుది జట్టులో చోటు దక్కనుంది. మరోవైపు పంత్కు బ్యాకప్గా ఉన్న ధ్రువ్ జురెల్ సైతం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో శతొక్కొట్టిన జురెల్.. ఇప్పుడు సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో కూడా అదరగొట్టాడు. జురెల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలతో కదం తొక్కాడు. ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఎనిమిది ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్లలో నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.నితీశ్పై వేటు?దీంతో సూపర్ ఫామ్లో ఉన్న జురెల్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడించాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానంలో జురెల్కు అవకాశమివ్వనున్నట్లు సమాచారం. ఉపఖండం పిచ్లలో నితీశ్ కుమార్ బౌలింగ్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. గత నెలలో విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా నితీశ్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో జురెల్కు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని హెడ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.39 ఏళ్ల తర్వాత..వన్డేల్లో ఎంఎస్ ధోని, దినేష్ కార్తీక్ లేదా ధోని, పార్థివ్ పటేల్ వంటి ఇద్దరు కీపర్లు కలిసి ఆడినప్పటకి.. టెస్టు తుది జట్టులో మాత్రం ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఆడటం చాలా అరుదు. గతంలో 1986లో కిరణ్ మోర్, చంద్రకాంత్ పండిట్లు కలిసి ఒకటి రెండు టెస్టులు ఆడారు. అప్పుడు పండిట్కు స్పెషలిస్ట్ బ్యాటర్గా అవకాశం దక్కింది. ఇప్పుడు మళ్లీ 39 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లతో భారత్ ఆడనుంది.చదవండి: ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్ -
IND vs SA: టీమిండియాకు భారీ షాక్
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా (IND vs SA)కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant Injured) మరోసారి గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ.. రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. కాగా సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.ఇందుకు సన్నాహకంగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా - ‘ఎ’ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ పంత్ భారత్- ‘ఎ’ కెప్టెన్గా తిరిగి వచ్చాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ (BCCI) ఆఫ్ ఎక్సలెన్స్ స్టేడియం వేదికగా.. తొలి అనధికారిక టెస్టులో పంత్ సేన గెలుపొందింది.ధ్రువ్ జురెల్ అజేయ శతకంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (132) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.అయితే, తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. సఫారీ పేసర్ షెపో మొరేకి వేసిన రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి పరిశీలించగా.. పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి మొరేకి బౌలింగ్లో అవుటయ్యాడు.34 పరుగుల స్వల్ప ఆధిక్యంఇక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు.. 34 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కగా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆదిలోనే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 27) వికెట్ను భారత్ కోల్పోగా.. పంత్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు 108-4గా ఉన్న వేళ పంత్కు రెండుసార్లు గాయమైంది. రెండుసార్లు బంతి బలంగా తాకడంతోమొరేకి బౌలింగ్లో తొలుత పంత్ ఎడమ మోచేతికి గాయమైంది. తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో 22 బంతులు ఎదుర్కొన్న పంత్.. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుండగా.. పంత్ రూపంలో కీలక ఆటగాడు గాయపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో మ్యాచ్లో భారత్ 43 ఓవర్ల ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి.. 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఐసీసీ కీలక నిర్ణయంRishabh Pant retires hurt after taking three blows today. First on the helmet, second on the left-hand elbow, third on the abdomen. Tough day for the fighter. ❤️🩹 pic.twitter.com/kdTX8jdM8B— Harsh 17 (@harsh03443) November 8, 2025 -
ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: మహిళా క్రికెట్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే వరల్డ్ కప్లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచాలని నిర్ణయించింది. దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు బోర్డు తీసుకుంది.ఇకపై ఐసీసీలోని అసోసియేట్ దేశాలకు ఇచ్చే నిధులను 10 శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్ బోర్డుపై నిషేధం ఉన్నా... దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్ భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.మరోవైపు.. ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj)కు చోటు కల్పించారు. యాష్లీ డిసిల్వా, అమోల్ మజుందార్, చార్లెట్ ఎడ్వర్డ్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. రికార్డు రేటింగ్స్... ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ వీక్షణపరంగా డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్స్టార్లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్లో అత్యధికమని పేర్కొంది.మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ (IND vs SA) మ్యాచ్ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్ను 185 మిలియన్ల మంది డిజిటల్ ప్లాట్ఫామ్పై వీక్షించారని... 2024 టీ20 పురుషుల వరల్డ్ కప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్తో ఇది సమానమని నిర్వాహకులు ప్రకటించడం విశేషం. -
జై షా జోక్యం.. నాకూ వరల్డ్కప్ మెడల్: ప్రతికా రావల్
భారత్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 ట్రోఫీ గెలవడంలో ప్రతికా రావల్ (Pratika Rawal)ది కూడా కీలక పాత్ర. టీమిండియా ఓపెనర్గా వచ్చిన నాటి నుంచి సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రపంచకప్ టోర్నీలోనూ అదరగొట్టింది.ఆరు ఇన్నింగ్స్లో కలిపి 308 పరుగులు రాబట్టిన ప్రతికా ఖాతాలో ఓ శతకం.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్కు ముందు ప్రతికా గాయపడింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్తో నామమాత్రపు మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె చీలమండకు గాయమైంది.ప్రతికా స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన ప్రతికా రావల్.. ఆ తర్వాతి మ్యాచ్లకు దూరమైంది. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ షఫాలీ వర్మ (Shafali Verma) జట్టులోకి వచ్చింది. ఆసీస్తో సెమీస్లో తేలిపోయినా.. సౌతాఫ్రికాతో ఫైనల్లో (IND vs SA) షఫాలీ సత్తా చాటింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏకంగా 87 పరుగులు రాబట్టడంతో పాటు రెండు వికెట్లు తీసి సత్తా చాటింది.ప్రతికా స్థానంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న షఫాలీ.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి మెడల్ గెలుచుకుంది. మరోవైపు.. గాయం వల్ల జట్టుకు దూరమైన ప్రతికాకు నిబంధనల కారణంగా వరల్డ్కప్ మెడల్ దక్కలేదు.వీల్చైర్లోనే మైదానానికి వచ్చి..అయితే, భారత్ సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన తర్వాత ప్రతికా వీల్చైర్లోనే మైదానానికి వచ్చి.. సహచరులతో కలిసి సంబరాలు జరుపుకొంది. అయితే, అప్పుడు ఆమెకు మెడల్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో వన్డే వరల్డ్కప్ విజేత జట్టు సమావేశమైన సందర్భంగా ప్రతికా మెడలో పతకం కనిపించింది.అదే సమయంలో అమన్జోత్ కౌర్ మెడల్ లేకుండా కనిపించగా.. ఆమే ప్రతికాకు తన మెడల్ ఇచ్చిందని అంతా భావించారు. ఈ విషయంపై ప్రతికా తాజాగా స్పందించింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.జై షా జోక్యం.. నాకూ వరల్డ్కప్ మెడల్‘‘ఆరోజు అమన్జోత్ మెడల్ ఎందుకు వేసుకోలేదు నాకు తెలియదు. బహుశా తను మర్చిపోయి ఉంటుంది. అయితే, సహాయక సిబ్బంది ఒకరు తన మెడల్ను నాకు ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే.. త్వరలోనే నా మెడల్ నా దగ్గరకు చేరనుంది.ఈ విషయం గురించి జై షా (ఐసీసీ చైర్మన్) మా మేనేజర్కు సందేశం అందించారు. ప్రతికాకు పతకం వచ్చేలా తాను ఏర్పాట్లు చేస్తున్నానని మెసేజ్ చేశారు. కాబట్టి నాకు త్వరలోనే మెడల్ లభిస్తుంది. ఏదేమైనా సపోర్టు స్టాఫ్ నాకు మెడల్ ఇవ్వగానే.. ఏడ్చేశా.సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. ఐసీసీ నాకు మెడల్ పంపగలదా? అని జై షా అక్కడి వారిని అడిగారు. అయితే, పతకం నా చేతికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కానీ ప్రధాని దగ్గరకు వెళ్లినపుడు పతకం లేదనే బెంగ లేకుండా సహాయక సిబ్బంది తన మెడల్ను నాకు ఇచ్చారు’’ అని ప్రతికా రావల్ చెప్పుకొచ్చింది.ఐసీసీ నిబంధనల ప్రకారంకాగా ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్కు ఎంపికైన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లకు మాత్రమే (గెలిచిన జట్టు) మెడల్స్ ఇస్తారు. గాయం వల్ల ప్రతికా జట్టులో స్థానం కోల్పోయినందున ముందుగా ఆమెకు మెడల్ దక్కలేదు. అయితే, ఐసీసీ చైర్మన్ జై షా నేరుగా జోక్యం చేసుకుని పతకం వచ్చేలా చేయడం చర్చకు దారితీసింది. చదవండి: అందుకే వరల్డ్కప్ విన్నర్ని వదిలేశాం: అభిషేక్ నాయర్ -
టీమిండియాకు భారీ షాక్..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడు. బీసీసీఐ ఆఫ్ ఎక్స్లెన్స్ స్టేడియం వేదికగా రెండో అనాధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-ఎ, భారత్-ఎ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో ఇండియా-ఎ జట్టు సారథ్యం వహిస్తున్న పంత్ చేతి వేలికి గాయమైంది.రెండో రోజు ఆట ఆరంభంలో గ్రీన్ టాప్ పిచ్పై సఫారీ పేసర్లు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన షెపో మోరెకి వేసిన ఓ రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. దీంతో రిషబ్ నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. నొప్పిని భరిస్తూనే పంత్ తన బ్యాటింగ్ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత బంతికే పంత్ ఔటయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న క్రమంలో పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. అయితే మూడో రోజు ఆటలో పంత్ ఫీల్డింగ్ వస్తాడో రాడో వేచి చూడాలి.కాగా దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన తర్వాత పంత్కు భారత్ తరపున ఇదే తొలిసారి. సఫారీలతో సిరీస్కు ముందు పంత్ గాయపడడం భారత జట్టు మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.చదవండి: జిడ్డు ఆటగాడి కోసం అతడిని బలి చేస్తావా? గంభీర్ ఇది నీకు న్యాయమేనా? -
Hanuman Tattoo: ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పట్ల భారత స్టార్ క్రికెటర్, వన్డే వరల్డ్కప్ విజేత దీప్తి శర్మ (Deepti Sharma) అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC Women's ODI World Cup)లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది.సరదాగా ముచ్చటించిన మోదీఈ సందర్భంగా.. విజయవంతమైన ఈ ప్రపంచకప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోదీ అభినందించారు. ప్రధాని కేవలం ఓ ఫొటో, రెండు ముక్కల ప్రశంసకే పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలో 2017లో ఫైనల్లో ఓడినపుడు ఉత్త చేతులతో మోదీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది. మోదీ అప్పుడు చెప్పిన మాటలు ఈ సారి కప్ గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది.ఇక ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని తాజా కప్తో కలుసుకోవడం మరింత తృప్తినిచ్చిందని పేర్కొంది. ఈ సందర్భంగా దీప్తి ఇన్స్ట్రాగామ్ బయోలో ఉన్న ‘జై శ్రీరామ్’, ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను మోదీ అడిగితెలుసుకున్నారు. తన మానసిక, శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని దీప్తి చెప్పింది.‘‘మిమ్మల్ని కలవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. 2017లో మీరు మాతో ఓ మాట చెప్పారు. అవరోధాలను అధిగమించి సవాళ్లను సమర్థవంతంగా పూర్తి చేసినవాళ్లే అసలైన ఆటగాళ్లు అని మీరన్నారు.లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?కఠినంగా శ్రమిస్తే తప్పక ఫలితం వస్తుందని చెప్పారు. మీ మాటలు, సలహాలు మాలో స్పూర్తిని నింపాయి’’ అని దీప్తి శర్మ ప్రధాని మోదీతో పేర్కొంది. ఈ క్రమంలో ఆయన.. లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది? అని దీప్తిని అడుగగా.. ‘‘నా కంటే నేను ఆయన (హనుమాన్)నే ఎక్కువగా నమ్ముతాను. నా ఆట మెరుగుపడటానికి ఆయన మీదున్న నా నమ్మకం, సానుకూల దృక్పథమే కారణం’’ అని దీప్తి శర్మ బదులిచ్చింది.కాగా వరల్డ్కప్-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది.‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలోఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో అమన్జోత్ క్యాచ్, క్రాంతి గౌడ్ బౌలింగ్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో విశ్వవిజేతలు భాగం కావాలని మోదీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనపుడు విద్యార్థులను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోదీ సూచించారు. చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’Player of the Tournament, Deepti Sharma, recalled that in 2017, Prime Minister @narendramodi had advised her to learn from failure and keep working hard. She shared that she had been eagerly looking forward to this meeting. Deepti also explained the significance of the ‘Hanuman’… pic.twitter.com/aUXki9yZz6— DD News (@DDNewslive) November 6, 2025 -
‘వాళ్లు ముందే డిసైడ్ అవుతారు.. తర్వాత సాకులు చెబుతారు’
సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని మరోసారి పక్కనపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ బెంగాల్ బౌలర్కు మొండిచేయి చూపుతున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.కావాలనే షమీని పక్కనపెడుతున్నారుఈ నేపథ్యంలో షమీ చిన్ననాటి కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ (Mohammed Badruddin) ఘాటుగా స్పందించాడు. కారణం లేకుండానే షమీని జట్టుకు దూరం చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడుతూ... ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వాళ్లు కావాలనే షమీని పక్కనపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.ఇంతకంటే వాళ్లకు వేరే కారణం ఏమీ లేదు. అతడు ఫిట్గా లేడని అంటారా?... ఓ ఆటగాడు టెస్టు మ్యాచ్లు ఆడుతూ.. రెండు మ్యాచ్లలో కలిపి 15 వికెట్లు పడగొట్టినా అతడు ఫిట్గా లేడంటే మనం ఏం చేయగలం?వాళ్లు ముందే డిసైడ్ అవుతారుసెలక్టర్లు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. తాము అలా చేయడం లేదంటే.. షమీని తప్పించడానికి గల కారణం ఏమిటో వాళ్లే స్వయంగా చెప్పాలి. సౌతాఫ్రికాతో సిరీస్కు షమీని ఎంపిక చేస్తారని భావించాను.స్వదేశంలో టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్బౌలర్లనే ఆడిస్తారు. కాబట్టి షమీకి ఈసారి అవకాశం ఇస్తారని అనుకున్నా. బుమ్రా వర్క్లోడ్ను తగ్గించే క్రమంలో షమీని పిలుస్తారని ఎదురుచూశా. అయినా.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదు.వాళ్లు ముందుగానే.. తమకు ఏ ఆటగాళ్లు కావాలో ఎంచుకుంటారు. ఆ తర్వాత తామేదో పారదర్శకంగా జట్టును ఎంపిక చేసినట్లు మాట్లాడతారు. టెస్టు జట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ ప్రదర్శనల కంటే ప్రామాణికం ఏమి ఉంటుంది?టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేస్తామనడం సరికాదు. రంజీల్లో బాగా ఆడుతున్న వారినే టెస్టుల్లోకి తీసుకోండి. ఏదేమైనా ఇక్కడ ముందుగానే తమకు ఇష్టమైన ఆటగాళ్లను ఎంచుకుంటారు.సాకులు చెబుతారుఅదే జాబితాకు కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత.. ‘అతడు ఫిట్గా లేడు.. అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి’ అంటూ తప్పించిన ఆటగాళ్ల గురించి సాకులు చెబుతారు’’ అంటూ బద్రుద్దీన్ టీమిండియా సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేశాడు.ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదుఅదే విధంగా.. షమీది కష్టపడే తత్వమన్న బద్రుద్దీన్.. ఆట ద్వారానే అతడు అందరికీ సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు. వంద శాతం ఫిట్గా ఉన్న షమీ.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడనే నమ్మకం తనకు ఉందని.. షమీతో తాను ఇదే మాట చెప్పానని తెలిపాడు. అద్భుతంగా ఆడే ఆటగాడిని సెలక్టర్లు ఏదో ఒకరోజు జట్టుకు ఎంపిక చేయక తప్పదని పేర్కొన్నాడు. వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీలో జట్టు కోసం శ్రమించిన ఆటగాడిని పక్కనపెట్టడం ఎంతమాత్రం సరికాదని బద్రుద్దీన్ పునరుద్ఘాటించాడు.చదవండి: అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై విమర్శల వర్షంసౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
టీమిండియాకు ఎంపిక కావాలంటే "ఇంకా ఏం చేయాలి"..?
త్వరలో సౌతాఫ్రికాతో జరుగోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును నిన్న (నవంబర్ 5) ప్రకటించారు. ఊహించిన విధంగానే అన్ని ఎంపికలు జరిగాయి. కొత్త వారెవ్వరికీ అవకాశాలు దక్కలేదు. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. అదే సిరీస్లో ఆకట్టుకున్న ఆకాశ్దీప్ పునరాగమనం చేశాడు. యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.కెప్టెన్గా శుభ్మన్ గిల్.. సీనియర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కొనసాగారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి..?ఈ జట్టు ప్రకటన తర్వాత భారత క్రికెట్ అభిమానుల్లో ఓ విషయంలో గందరగోళం మొదలైంది. అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి.. దీనికి ప్రామాణికం ఏంటని చాలా మంది చర్చించుకుంటున్నారు.ఈ చర్చ ఉత్పన్నమవడానికి ఇటీవలికాలంలో భారత సెలెక్టర్లు అనుసరిస్తున్న విధానాలే కారణం. గతంలో భారత జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాల్సి ఉండేది. అక్కడ అత్యుత్తమంగా రాణిస్తేనే భారత సెలక్టర్ల నుంచి పిలుపు దక్కేది. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది.పెద్ద తలకాయల అండదండలుంటే చాలా..?భారత క్రికెట్కు సంబంధించి పెద్ద తలకాయల అండదండలుంటే ఎలాగైనా జట్టులోకి వచ్చేయవచ్చు. ఇందుకు హర్షిత్ రాణా ఉదంతమే ప్రధాన ఉదాహరణ. హర్షిత్ ఏ అనుభవం లేకుండా, టీమిండియాలో ఓ పెద్ద తలకాయ మద్దతుతో దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. ఇతగాడికి ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా అవకాశాలు సులువుగా వచ్చేస్తుంటాయి.ఇంత లాబీయింగ్ జరిగి తుది జట్టులోకి వచ్చాక ఏమైనా పొడిచేశాడా అంటే, అదీ లేదు. పైగా అతని ఎంపికను కొందరు సమర్దించుకోవడం హాస్యాస్పదం. ఓ పేరుమోసిన వ్యక్తయితే ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఇంకా విడ్డూరం. అంతిమంగా హర్షిత్ విషయంలో వ్యతిరేకత తారాస్థాయికి చేరడంతో సెలెక్టర్లు కాస్త తగ్గారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే సౌతాఫ్రికా-ఏతో వన్డే సిరీస్కు మరో అవకాశం ఇచ్చి ఈగోను సంతృప్తివరచుకున్నారు.అర్హులకు అన్యాయంహర్షిత్ లాంటి అనర్హులు జట్టులో రావడం వల్ల చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇది మరోసారి నిరూపితమైంది. హర్షిత్కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో మొదటి రెండు టీ20లకు ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడో టీ20లో హర్షిత్ను పక్కన పెట్టి అర్షదీప్కు అవకాశం ఇవ్వగా, అతడు చెలరేగిపోయాడు. 3 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు.హర్షిత్ విషయంలో అలా.. షమీ, కరుణ్ విషయంలో ఇలా..!వరుసగా విఫలమవుతున్న హర్షిత్ లాంటి ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు.. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ, కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అయినా వీరికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు అవకాశం దక్కలేదు. కనీసం సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.హర్షిత్ లాంటి ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరించే బీసీసీఐ పెద్దలు.. ఒకప్పుడు టీమిండియాలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న షమీ, కరుణ్ లాంటి వారిని మాత్రం విస్మరిస్తున్నారు. శుభపరిణామం కాదు..!భారత క్రికెట్కు ఇలాంటి అనుభవాలు ఏ మాత్రం మంచివి కావు. అర్హులకు అన్యాయాలు జరుగుతూ పోతుంటే, రానున్న తరాల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆశ చచ్చిపోతుంది. క్రికెట్కు ఇలాంటి అనుభవాలు ఎంత మాత్రం శుభపరిణామం కాదు. అనర్హమైన వ్యక్తుల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి, అర్హులను విస్మరించడం మంచి సాంప్రదాయం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి చాలామంది ఆటగాళ్ల అవేదన ఇది. చదవండి: పంత్, ఆకాశ్ పునరాగమనం -
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.ఫలితంగా టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ కావాలనే షమీ కెరీర్ను ప్రశ్నార్థకం చేశారంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీ చివరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు.ఆ తర్వాత చీలమండ గాయంతో చాన్నాళ్లు జట్టుకు దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే టోర్నీలో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులు, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఈ రైటార్మ్ పేసర్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అప్డేట్ లేదని.. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని.. అందుకే పక్కనపెట్టామని చెప్పాడు. అయితే, అగార్కర్ వ్యాఖ్యలకు షమీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రంజీలు ఆడేందుకు ఫిట్గా ఉన్న తాను.. వన్డేలు కూడా ఆడలేనా? అని ప్రశ్నించాడు.ఆటతోనే సమాధానంఈ క్రమంలో అగార్కర్ బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే తాము అతడిని ఇంగ్లండ్ పర్యటన, ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ నేపథ్యంలో రంజీ సీజన్లో బెంగాల్ తరఫున చివరగా గుజరాత్తో మ్యాచ్ ఆడిన షమీ.. ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడు.గుజరాత్తో మ్యాచ్లో మొత్తంగా ఎనిమిది వికెట్ల (3/44, 5/38)తో చెలరేగి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. ఈ క్రమంలో మీడియా షమీని పలకరించగా.. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా.. అందుకు అపార్థాలు తీస్తారని పేర్కొన్నాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త సెలక్టర్ ఆర్పీ సింగ్ సూచన మేర, అతడి నుంచి అందిన హామీ మేరకే షమీ ఇలా మాట మార్చాడని నెటిజన్లు చర్చించుకున్నారు. అగార్కర్- షమీ మాటల యుద్ధానికి తెరపడినట్లేనని.. సౌతాఫ్రికాతో టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది.బెంగాల్ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్న మరో పేసర్ ఆకాశ్ దీప్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. షమీకి మాత్రం మరోసారి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమీ టెస్టు రీఎంట్రీ కల ముగిసినట్లేనని.. ఇకపై షమీని టీమిండియా టెస్టు జెర్సీలో చూడలేమంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మీకు ఎందుకింత పగ‘ఇగో’ కారణంగానే అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారంటూ.. మీకు ఎందుకింత పగ? అంటూ అగార్కర్పై మండిపడుతున్నారు. కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రకటించింది.చదవండి: IND vs SA Tests: సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని ఈ టీమ్కు పదిహేను మంది సభ్యులను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇక ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ప్రొటిస్ జట్టుతో సిరీస్ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే పంత్.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA) కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.పడిక్కల్పై సెలక్టర్ల నమ్మకంబెంగళూరు వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్టులో పంత్ 90 పరుగులతో రాణించి.. భారత్ను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. సాయి సుదర్శన్తో పాటు దేవదత్ పడిక్కల్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు.ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. ఇటీవల సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో విఫలమైనా పడిక్కల్పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం విశేషం. మరోవైపు.. పంత్ వికెట్ కీపర్గా రీఎంట్రీ ఇవ్వగా.. ధ్రువ్ జురెల్ స్పెషలిస్టు బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.షమీకి మరోసారి మొండిచేయిఇక స్పిన్నర్ల కోటాలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్థానం సంపాదించగా.. పేసర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ క్రమంలో వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మరోసారి మొండిచేయే ఎదురైంది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఇటీవల బెంగాల్ తరఫున షమీ సత్తా చాటినా సెలక్టర్లు అతడిని కనికరించలేదు. మరో బెంగాల్ పేసర్ ఆకాశ్కు చోటిచ్చి షమీని మాత్రం పక్కనపెట్టారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. నవంబరు 14- నవంబరు 26 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. తొలి టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కాగా.. రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే -
అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్ -
దక్షిణాఫ్రికాకు భారీ షాక్..
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ భుజం కండరాల నొప్పి కారణంగా పాక్తో మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. బ్రెవిస్ ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే బ్రెవిస్కు ప్రత్నమ్నాయంగా మరోక ఆటగాడిని జట్టులోకి సెలక్టర్లు తీసుకోలేదు. అతడి స్దానాన్ని మరొకరితో సెలక్టర్లు భర్తీ చేయలేదు. జూనియర్ ఏబీడీ తన స్వదేశానికి వెళ్లకుండా ప్రస్తుతం జట్టుతో పాటు పాక్లో ఉన్నాడు.భారత పర్యటనకు ముందు బ్రెవిస్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తుంది. సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరో వారం రోజుల్లో భారత్ టూర్కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది.ఈ మూడు ఫార్మాట్ల సిరీస్కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో బ్రెవిస్ భాగంగా ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సమయానికి బ్రెవిస్ కోలుకోపోతే అది సఫారీలకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా తన ఆట తీరు ఏ మాత్రం మారదు. అయితే పాక్ పర్యటనలో మాత్రం బ్రెవిస్ విఫలమయ్యాడు. తొలుత టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడి కేవలం 54 పరుగులు మాత్రమే చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత టీ20 సిరీస్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే బ్రెవిస్ లాంటి ఆటగాడు తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)
-
విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ
2025, నవంబర్ 2. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన రోజు. ఈ రోజు భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2025 ఎడిషన్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపుతో యావత్ భారతావణి ఉప్పొంగి పోయింది. భారత ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసిన టీమిండియా ప్లేయర్ల వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీరు, కలలు దాగి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.హర్మన్ప్రీత్ కౌర్.. దూషించిన నోళ్లతోనే జేజేలు కొట్టించుకుందిపంజాబ్లోని మోగాలో జన్మించిన హర్మన్ప్రీత్, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టింది. 1983లో కపిల్ దేవ్ భారత జట్టుకు తొలి ప్రపంచకప్ అందించి, పురుషుల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికితే.. హర్మన్ 2025 ప్రపంచకప్ విక్టరీతో మహిళల క్రికెట్లో కొత్త శకాన్ని ప్రారంభించింది.హర్మన్ క్రీడల్లో అడుపెట్టాలనుకున్న అందరు అమ్మాయిల్లాగే చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె భారత జట్టు కెప్టెన్గా ఎదిగి భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసింది. చిన్నతనంలో హర్మన్ అబ్బాయిలతో క్రికెట్ ఆడుతూ మెళకువల నేర్చుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో అబ్బాయిలతో క్రికెట్ ఏంటని బంధులందరూ ఆమెను దూషించారు. అయినా పట్టువదలని హర్మన్ అనుకున్నది సాధించి దూషించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంది.Worked as a carpenter. Got taunted by many when young daughter started playing cricket with boys in the neighborhood. But he stood by her. Made her first bat with his own hands. Got her enrolled in an academy. Travelled far everyday to take her to training and decided to pick and https://t.co/fgmIiEAFtl— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025అమన్జోత్ కౌర్.. కార్పెంటర్ తండ్రి కలను నెరవేర్చిన కూతురుక్రికెటర్గా అమన్జోత్ ప్రయాణం తండ్రి చెక్కిన బ్యాట్తో మొదలైంది. ఆమె తండ్రి ఓ కార్పెంటర్. బాల్యంలో అమన్జోత్ బాలురతో క్రికెట్ ఆడటాన్ని చూసి ఊరంతా విమర్శించేవారు. అయినా తండ్రి ఆమెను వెనకేసుకొచ్చేవాడు. రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమన్జోత్ను అకాడమీకి తీసుకెళ్లెవాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత అమన్జోత్ తండ్రి ఆనంధానికి అవథుల్లేవు. “నా కూతురు గెలిచింది” అంటూ విజయ గర్వంతో ఊగిపోయాడు.Renuka's father passed away before she turned 3. He was such a cricket tragic that he named his son Vinod after Kambli. Renuka's mother encouraged her to take up the game despite being from a village in HP. Renuka showed her CWG Bronze to all the girls in her village. She will https://t.co/TBUEnQssJb— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025రేణుకా సింగ్.. తల్లి త్యాగాన్ని, అన్న నమ్మకాన్ని నిలబెట్టిందిహిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా జిల్లాలో జన్మించిన రేణుకా సింగ్కు మూడేళ్ల వయసుండగానే తండ్రి చనిపోయాడు. తల్లి సునీతా సింగే రేణుకా బాగోగులు చూసింది. రేణుకను క్రికెట్ అకాడమీకి పంపేందుకు సునీత ఎన్నో కష్టాలు పడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రేణుక కోసం తల్లి సునీత ఎన్నో త్యాగాలు చేసింది. రేణుక కోసం ఆమె అన్న వినోద్ కూడా క్రికెట్ను వదిలేశాడు. ఆర్దిక కష్టాలు ఉండటంతో ఇంట్లో ఒక్కరికే ఆకాడమీలో చేరే అవకాశం ఉండేది. రేణుక క్రికెట్లో రాణిస్తుండటంతో వినోద్ తన కలను చంపుకున్నాడు. చివరికి రేణుక ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచి తల్లి, అన్నల త్యాగాలకు న్యాయం చేసింది.Comes from Bundelkhand, backwaters of Indian cricket. Played tennis ball cricket with boys in the neighborhood. Toiled hard in domestic cricket for years. Became a net bowler in 2024 for MI before UP Warriorz picked her in the auctions. Soon made her India debut, took a 6 wicket https://t.co/NO7T8nd9L1— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025క్రాంతి గౌడ్.. పోలీస్ కానిస్టేబుల్ కూతురుమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని ఘువారా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాంతి గౌడ్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది. క్రాంతి తండ్రి ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, క్రాంతికి క్రికెట్పై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తండ్రి తన పెన్షన్తో ఆమెకు క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. తల్లి రోజూ ప్రాక్టీస్కు తీసుకెళ్లేది.క్రాంతి చిన్నతనంలో అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగింది. క్రాంతి క్రికెటర్ అవుతానంటే ఊరిలోని వారంతా నవ్వేవారు. ఇవాళ ఆమె ప్రపంచకప్లో భారత పేస్ బౌలింగ్ సెస్సేషన్గా నిలిచింది. టీమిండియా వరల్డ్కప్ గెలిచాక క్రాంతి సొంత ఊరిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. #WATCH | Rohtak, Haryana | Cricketer Shafali Sharma's father says, "... It is all by the grace of god. We are thankful to the almighty... The whole nation was praying for our victory... By the grace of god, she has become the player of the match... The whole team worked hard to… https://t.co/uV2mBjIT6V pic.twitter.com/65nBhFfITq— ANI (@ANI) November 2, 2025షఫాలీ వర్మ.. బాలుడి వేషధారణలో..!షఫాలీ వర్మ హర్యానా రాష్ట్రంలోని రూథక్లో జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు క్రికెట్పై ఆసక్తి పెరిగింది. కానీ స్థానిక అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో ఆమె బాలుడి వేషధారణలో, అన్న కోసం తయారు చేసిన జెర్సీ వేసుకుని ప్రాక్టీస్కి వెళ్లేది. షఫాలీ ఆర్థికంగా వెనుకపడిన కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సంజయ్ వర్మ ఎంతో కష్టపడి ఆమెను అకాడమీలో చేర్పించాడు. ఓ సమయంలో అతని దగ్గర షఫాలీకి కిట్ కొనిచ్చే స్తోమత కూడా లేకుండింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న షఫాలీ ఫైనల్లో 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి, భారత్ను విశ్వ విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర పోషించింది.#WATCH | Agra, UP | Celebrations erupt at cricketer Dipti Sharma's residence as India win the ICC Women's World Cup by defeating South Africa by 52 runs. pic.twitter.com/zTbGBH82gK— ANI (@ANI) November 2, 2025దీప్తి శర్మ.. రైల్వే ఉద్యోగి తండ్రి కలను నిజం చేసిన బౌలింగ్ సంచలనంఉత్తరప్రదేశ్లోని సాగర్జీ నగర్కు చెందిన దీప్తి, తన అన్నతో కలిసి క్రికెట్ ఆడుతూ పెరిగింది. తండ్రి రైల్వే ఉద్యోగి. అందరిలాగే అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుండటంతో దీప్తి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసి, టీమిండియా ప్రపంచకప్ కలను సాకారం చేసింది. ఫైనల్లో దీప్తి అర్ద సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది.జెమిమా రోడ్రిగ్స్.. మల్టీ టాలెంటెడ్ స్టార్సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాది భారత్ను ఫైనల్కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. జెమిమా తండ్రి స్వయంగా కోచ్గా మారి ఆమెను ప్రాక్టీస్కు తీసుకెళ్లెవాడు. జెమిమాకు క్రికెట్తో పాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. చదవండి: CWC25 Team India Prize Money: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. వరల్డ్ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్కప్ (women's CWC) ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్లో అరివీర భయంకరమైన ఫామ్లో ఉండిన లారా.. 9 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది. తద్వారా ఈ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్లో 509 పరుగులు చేసింది.ఓ సింగిల్ వన్డే వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..లారా వోల్వార్డ్ట్- 570 (2025)అలైస్సా హీలీ- 509 (2022)రేచల్ హేన్స్- 497 (2022)డెబ్బీ హాక్లీ- 456 (1997)లిండ్సే రీలర్- 448 (1989)సెమీస్, ఫైనల్స్లో సెంచరీలుతాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్లో లారా అరివీర భయంకరమైన ఫామ్లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్తో జరిగిన ఫైనల్స్లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్ల్లో అర్ద సెంచరీలు చేసింది. నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.మూడో ప్రయత్నంలోనూ..గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్కప్ ఫైనల్స్కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధాఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా -
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందా అంటే అది సౌతాఫ్రికానే (South Africa) అని చెప్పాలి. ఈ జట్టు పురుషుల, మహిళల విభాగాంలో సమానంగా దురదృష్టాన్ని షేర్ చేసుకుంటుంది. ఇటీవలికాలంలో ఏకంగా నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడింది.తొలుత మహిళల జట్టు 2023 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ మరుసటి ఏడాదే (2024) మహిళల జట్టు మరోసారి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో (న్యూజిలాండ్) చిత్తైంది. అదే ఏడాది (2024) పురుషుల జట్టుకు కూడా ఫైనల్లో (భారత్ చేతిలో) చుక్కెదురైంది. తాజాగా మహిళల జట్టు మరోసారి ఫైనల్లో ఓటమిపాలై, దురదృష్ట పరంపరను కొనసాగించింది.2025 వన్డే ప్రపంచకప్లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడి, రన్నరప్తో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ ప్రయాణంలో సౌతాఫ్రికా జట్టు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైనల్కు చేరినప్పటికీ.. ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేకపోయింది.ప్రపంచ కప్ టోర్నీల్లో సౌతాఫ్రికా జర్నీ క్రికెట్ అభిమానులను ఒకింత బాధకు గురి చేస్తుంది. పాపం సౌతాఫ్రికా.. అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. తాజా ప్రయత్నంలో సౌతాఫ్రికా వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ సమరంలో అద్భుతమైన క్రికెట్ ఆడిన భారత్ చేతిలో ఓడింది.ఈ ఎడిషన్లో సౌతాఫ్రికా సైతం అది నుంచి అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో భారత్ సహా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించిన ఈ జట్టు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో మాత్రమే ఓడింది).. సెమీస్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఫైనల్లోనూ సౌతాఫ్రికా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. తొలుత బౌలింగ్ చేసి భారీ స్కోర్ (298) ఇచ్చినప్పటికీ.. దాన్ని ఛేదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న వారి కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) మరోసారి శతకంతో విజృంభించింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు.భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (9.3-0-39-5), షఫాలీ వర్మ (7-0-36-2), శ్రీచరణి (9-0-48-1) మ్యాజిక్ చేసి భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడినా హుందాగా ప్రవర్తించి అందరి మన్ననలు అందుకుంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టు చేతిలో ఓడామని సర్ది చెప్పుకుంది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి: టీమిండియా కెప్టెన్
విశ్వవిజేతగా (Women's CWC 2025) నిలిచేందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) అన్ని అర్హతలు ఉన్నాయని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిప్రాయపడింది. 2025 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం అనంతరం హర్మన్ మాట్లాడుతూ ఇలా అంది."వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా ఏదైనా అద్భుతం చేయగలమని మేం నమ్మాం. పగలు, రాత్రి శ్రమించిన ఈ జట్టుకు విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.బ్యాటింగ్లో షఫాలీ చూపించిన ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఆమెకు బౌలింగ్లో కూడా రాణిస్తుందని భావించా. అదే మలుపుగా మారింది. ఈ రోజు పిచ్ సెమీస్కంటే భిన్నమైంది.ఫైనల్లో ఉండే ఒత్తిడి వల్ల మేం చేసిన స్కోరు సరిపోతుందని తెలుసు. దక్షిణాఫ్రికా బాగానే ఆడినా చివర్లో ఒత్తిడి పెంచుకుంది. దానిని మేం సరైన విధంగా వాడుకున్నాం.ప్రతీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం వచ్చే సారైనా ఎలా గెలవాలి అనే విషయం చర్చించుకునేవాళ్లం. గత రెండేళ్లలో కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో మా సన్నాహకాలు చాలా బాగా సాగాయి. తుది జట్టులో మేం పెద్దగా మార్పులు చేయకుండా ప్రతీ మ్యాచ్లో వారిపై నమ్మకం ఉంచాం.ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలు ఉన్నాయి. అక్కడా ఇదే జోరు కొనసాగాలి.మ్యాచ్ ఆసాంతం మైదానంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు"కాగా, నిన్న జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ అందింది. రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి. 300 శాతం పెరిగిన ప్రైజ్మనీవన్డే ప్రపంచకప్ విజేతకు లభించే ప్రైజ్మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.బీసీసీఐ భారీ నజరానావరల్డ్కప్ విజేత భారత్కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
-
ఫైనల్లో హైయెస్ట్ రన్ ఛేజ్ ఎంతో తెలుసా?
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 58 ) రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రయాన్, డిక్లార్క్, మబ్లా తలా వికెట్ సాధించారు. కాగా భారత్ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు వరల్డ్కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్పై ఆసీస్ 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ఫైనల్లో ఛేదించిన అత్యధిక లక్ష్యాలపై ఓ లుక్కేద్దాం. మహిళల వన్డే వరల్డకప్ ఫైనల్లో ఛేజ్ చేసిన హైయెస్ట్ టోటల్ 167గా ఉంది. 2009 వరల్డ్కప్లో నార్త్ సిడ్నీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని చేధించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్లో కేవలం నాలుగు మాత్రమే విజయవంతమైన రన్-ఛేజింగ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన పది ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరి ఇప్పుడు భారత్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదా సౌతాఫ్రికా చరిత్రను తిరగరాస్తుందో వేచి చూడాలి.మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్లో అత్యధిక లక్ష్య చేధనలు ఇవే..సంఖ్యపరుగుల ఛేదనజట్టుప్రత్యర్థిఫైనల్ సంవత్సరం1167ఇంగ్లండ్ న్యూజిలాండ్20092165ఆస్ట్రేలియాన్యూజిలాండ్19973152ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 19824128ఆస్ట్రేలియా ఇంగ్లండ్1988 -
ఆసీస్తో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఆసీస్ మిగిలిన రెండు టీ20కు ముందు జట్టు నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. 30 ఏళ్ల కుల్దీప్ స్వదేశానికి వచ్చి దక్షిణాఫ్రికా-తో జరగనున్న రెండో అనాధికరిక టెస్టులో ఇండియా-ఎ జట్టు తరపున ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఈ మ్యాచ్ కుల్దీప్కు ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని బోర్డు భావించింది. ఈ క్రమంలోనే జట్టు నుంచి యాదవ్ను బీసీసీఐ విడుదల చేసింది. "బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో దక్షిణాఫ్రికా-ఎతో జరగనున్న రెండో టెస్టులో కుల్దీప్ పాల్గోనున్నాడు. భారత జట్టు మెనెజ్మెంట్ అభ్యర్ధన మెరకు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ను రిలీజ్ చేశాము" అని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసీస్తో తొలి రెండు మ్యాచ్లలో ప్లేయింగ్ ఎలెవన్లో భాగమైన కుల్దీప్.. మూడో టీ20కి మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది.ఆసీస్తో సిరీస్ కోసం అప్డేటడ్ భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, సంజూకు రష్దీప్ సింగ్, సంజూకు వాషింగ్టన్ సుందర్.దక్షిణాఫ్రికా -ఎతో జరిగే టెస్టుకు భారత-ఎ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్) , కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఇ, ఖులీల్, అబ్ర్మేద్యు, ఖులీల్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్ -
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు..
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర నిరాశపరిచింది. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.దీప్తి శర్మతో కలిసి కాసేపు క్రీజులో నిలబడినప్పటికి తన మార్క్ చూపించడంలో మాత్రం విఫలమైంది. 29 బంతుల్లో 20 పరుగులు చేసిన హర్మన్.. సఫారీ స్పిన్నర్ మలాబా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్లో హర్మన్ విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చరిత్ర సృష్టించిన హర్మన్..మహిళల ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా హర్మన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్కప్లో నాలుగు నాకౌట్ మ్యాచ్లు ఆడిన హర్మన్.. 331 పరుగులు చేసింది.ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట ఉండేది. బెలిండా తన కెరీర్లో వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో 330 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో బెలిండా ఆల్టైమ్ రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.చదవండి: World cup 2025: మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ -
మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్
నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీస్లో విఫలమైన షఫాలీ.. తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తనదైన షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. స్మృతి మంధానతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మంధానతో కలిసి తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన షఫాలీ వర్మ.. ఆ తర్వాత రోడ్రిగ్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది.ఓ దశలో సునాయసంగా సెంచరీ చేసేలా కన్పించిన ఈ విధ్వంసకర ఓపెనర్, భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయింది. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87 పరుగులు చేసింది. కాగా వాస్తవానికి వరల్డ్ కప్ జట్టులో షఫాలీ వర్మకు చోటు లేదు.స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో.. షఫాలీకి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. తనకు లభించిన అవకాశాన్ని ఈ హర్యానా క్రికెటర్ అందిపుచ్చుకుంది. ఈ మెరుపు ఇన్నింగ్స్తో షఫాలీ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్గా షఫాలీ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ప్లేయర్ పూనమ్ రౌత్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ ఫైనల్లో పూనమ్ 86 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో పూనమ్ ఆల్టైమ్ రికార్డును వర్మ బ్రేక్చేసింది.చదవండి: IND vs AUS: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! ఒంటి చేత్తో గెలిపించాడుA shot that leaves you going 😯😳🤯We’re witnessing vintage #ShafaliVerma, delivering on the grandest stage, just when it matters the most! 👏🏻👍🏻#CWC25 Final 👉 #INDvSA, LIVE NOW 👉 https://t.co/gGh9yFhTix pic.twitter.com/1mwc8WsLH9— Star Sports (@StarSportsIndia) November 2, 2025 -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. 2025 వన్డే వరల్డ్కప్ ఎడిషన్లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 97/0గా ఉంది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాచదవండి: IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్పై టీమిండియా గెలుపు -
ఫైనల్లో సౌతాఫ్రికా చిత్తు.. వరల్డ్ ఛాంపియన్స్గా భారత్
India vs South Africa Womens WC 2025 Final Live Updates: వరల్డ్కప్ విజేతగా భారత్ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లారా వోల్వార్డ్(101) అద్బుతమైన సెంచరీతో పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ రెండు, చరణి ఒక్క వికెట్ సాధించింది.👉సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.44 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 232/844 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రోటీస్ విజయానికి 33 బంతుల్లో 67 పరుగులు కావాలి. సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ డౌన్..221 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీప్తీ శర్మ బౌలింగ్లో ట్రయాన్ వికెట్ల ముందు దొరికిపోయింది.సౌతాఫ్రికా కెప్టెన్ ఔట్.. విజయం దిశగా భారత్తొలి ప్రపంచకప్ విజయం దిశగా భారత్ పయనిస్తోంది. 220 పరుగుల వద్ద సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(101) వికెట్ కోల్పోయింది. క్రీజులోకి డిక్లార్క్ వచ్చింది. ప్రోటీస్ విజయానికి 78 బంతుల్లో51 పరుగులు కావాలి. సౌతాఫ్రికా కెప్టెన్ సెంచరీ..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 96 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకుంది. 41 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(101), ట్రయాన్(9) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి 54 బంతుల్లో 79 పరుగులు కావాలి.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్..209 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన డికర్సన్ దీప్తీ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది.38 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్38 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 207గా ఉంది. ఇంకా దక్షిణాఫ్రికా మహిళల జట్టు 66 బంతుల్లో 92 పరుగులు చేయాలి.36 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్36 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 186గా ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు 84 బంతుల్లో 113 పరుగులు చేయాలి32 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 175, దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఇంకా 124 పరుగులు అవసరం31 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 167 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్148 పరుగుల వద్ద సౌతాఫ్రికా జట్లు ఐదో వికెట్ కోల్పోయింది. దీప్తిశర్మ బౌలింగ్లో రాధా యాదవ్కు క్యాచ్ ఇచ్చి సినాలో జాఫ్తా ఔట్ అయింది. 27 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు141-4 గా ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఇంకా 158 పరుగులు అవసరంమరో వికెట్ తీసిన షఫాలీ వర్మ.. సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్షఫాలీ వర్మ తన రెండో ఓవర్లో మొదటి బంతికి మరో వికెట్ తీసింది. దాంతో 123 పరుగుల వద్ద సౌతాఫ్రికా తన నాలుగో వికెట్ కోల్పోయింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్..సన్నీ లూస్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. పార్ట్టైమ్ బౌలర్ షఫాలీ వర్మ బౌలింగ్లో 25 పరుగులు చేసిన లూస్ ఔటైంది. 21 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 113-3 సౌతాఫ్రికా కెప్టెన్ ఫిప్టీ..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 46 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 19 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(60), లూస్(21) ఉన్నారు. సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..బోష్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ శ్రీచరణి బౌలింగ్లో బోష్(0) వికెట్ల ముందు దొరికిపోయింది. 13 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 69/2. క్రీజులో కెప్టెన్ లారా వోల్డోర్ట్(42), లూస్(1) ఉన్నారు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన టాజ్మిన్ బ్రిట్స్.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరింది. క్రీజులోకి అన్నేకే బోష్ వచ్చింది.స్పీడ్ పెంచిన సౌతాఫ్రికా..8 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో సౌతాఫ్రికా ఓపెనర్లు టాంజిమన్ బ్రిట్స్(17), లారా వోల్డర్ట్(23) ఉన్నారు.కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న భారత్299 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసే సరికి 12 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(3), బ్రిట్స్(6) ఉన్నారు. భారత పేసర్లు రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్, ట్రయాన్ తలా వికెట్ సాధించారు.దీప్తి శర్మ హాఫ్ సెంచరీ..దీప్తి శర్మ 53 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 48 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. క్రీజులో రిచా(33), దీప్తి(50) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రిచా..క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్(25) దూకుడుగా ఆడుతోంది. 47 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్రీజులో రిచాతో పాటు దీప్తి(49) ఉన్నారు.టీమిండియా ఐదో వికెట్ డౌన్అమన్జ్యోత్ కౌర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అమన్జ్యోత్.. డిక్లార్క్ బౌలింగ్లో ఔటైంది. క్రీజులోకి రిచాఘోష్ వచ్చింది. రిచా వచ్చిన వెంటనే సిక్సర్తో తన ఇన్నింగ్స్ను ఆరంభించింది. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 253/5టీమిండియా నాలుగో వికెట్ డౌన్..హర్మన్ప్రీత్ కౌర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన హర్మన్.. మలాబా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. క్రీజులోకి అమన్జ్యోత్ కౌర్ వచ్చింది.నిలకడగా ఆడుతున్న హర్మన్, దీప్తి37 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హర్మన్ ప్రీత్(17), దీప్తి శర్మ(25) ఉన్నారు.భారత్కు భారీ షాక్.. రోడ్రిగ్స్ ఔట్టీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెమీస్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రోడ్రిగ్స్.. ఫైనల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయింది. 24 పరుగులు చేసిన రోడ్రిగ్స్, ఖాఖా బౌలింగ్లో పెవిలియన్కు చేరింది.షెఫాలీ వర్మ ఔట్..షెఫాలీ వర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 87 పరుగులు చేసిన.. ఖాఖా బౌలింగ్లో ఔటైంది. 29 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 167/2గా ఉంది. సెంచరీ దిశగా సాగుతున్న షఫాలీషఫాలీ వర్మ సెంచరీ దిశగా సాగుతుంది. 74 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. షఫాలీకి జతగా జెమీమా (21) క్రీజ్లో ఉంది. 27 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 162/1గా ఉంది. షెఫాలీ వర్మ ఫిప్టీ..ఫైనల్ మ్యాచ్లో షెఫాలీ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతోంది. షెఫాలీ 49 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 20 ఓవర్లకు భారత్ స్కోర్: 114/1తొలి వికెట్ కోల్పోయిన భారత్..భారత మహిళల జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మంధాన.. ట్రయాన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. క్రీజులోకి జెమీమా రోడ్రిగ్స్ వచ్చింది.17 ఓవర్లకు భారత్ స్కోర్: 97/017 ఓవర్లు ముగిసే సరికి భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(45 బంతుల్లో 48), మంధాన(51 బంతుల్లో 39) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు..10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(29), మంధాన(27) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న షెఫాలీ..5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(21), మంధాన(7) ఉన్నారు.2 ఓవర్లు భారత్ స్కోర్: 7/02 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(5) ఉన్నారు.బ్యాటింగ్ భారత్దే..డివై పాటిల్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా లారా వోల్వార్డ్ట్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన జట్టునే కొనసాగించాయి.తుది జట్లుభారత్ : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా : లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాతగ్గిన వర్షం..నవీ ముంబైలో వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. 4:30 గంటలకు టాస్ పడనుంది. సాయంత్రం ఐదు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్కు రంగం సిద్దమైంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు తలపడతున్నాయి. అయితే ఈ తుది పోరుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం టాస్ 2.30 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది.కాగా సౌతాఫ్రికాకు ఇది తొలి వరల్డ్కప్ ఫైనల్ కాగా.. హర్మన్ సేన ఫైనల్ అర్హత సాధించడం ఇది మూడోసారి. అయితే ఈసారి మహిళల క్రికెట్లో సరికొత్త చాంపియన్ను చూడబోతున్నాము. ఎందుకంటే భారత్ కానీ, సౌతాఫ్రికా కానీ ఒక్కసారి కూడా వరల్డ్కప్ ట్రోఫీని గెలుచుకోలేదు. -
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్లో రికార్డు స్థాయిలో చాంపియన్కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్కప్-2022 ఎడిషన్తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్మనీ కంటే తాజా సీజన్ విన్నర్కు ఇచ్చే ప్రైజ్మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్గా అవతరిస్తే మొత్తం ప్రైజ్మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం -
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్లను నిలువరించగలిగితే భారత్కు తిరుగు ఉండదు.ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసుఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.అన్నింటికంటే అదే ముఖ్యంటైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది.ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్ప్రీత్ స్పందిస్తూ..గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్రూమ్లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా. ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.చదవండి: WC 2025 Final IND vs SA: ఇరుజట్ల బలాలు ఇవే -
సెమీస్లో గెలిస్తే సంబరమే..! కానీ ఫైనల్లో ఆ తప్పులు చేశారంటే?
భారత మహిళల జట్టు.. తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి మనం మహిళల క్రికెట్లో సరికొత్త వరల్డ్ ఛాంపియన్ చూడబోతున్నాము. ఎందుకంటే, భారత్ కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేదు. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్కు చేరగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే సెమీస్లో భారత అమ్మాయిల జట్టు రికార్డు విజయం సాధించినప్పటికి.. ఫైనల్కు ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి.ఫీల్డింగ్ మారుతుందా?ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి.. ఫీల్డింగ్, బౌలింగ్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తోంది. భారత జట్టు ఫీల్డింగ్ మ్యాచ్కు మ్యాచ్కు దిగజారుతోంది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటివరకు 18 క్యాచ్లు జారవిడిచింది. అత్యధిక క్యాచ్లు విడిచిపెట్టిన జాబితాలో హర్మన్ సేన అగ్రస్దానంలో నిలిచింది.ఆసీస్తో సెమీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ సైతం సునాయస క్యాచ్ను జారవిడించింది. మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో మన అమ్మాయిల జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంటుంది. ఈ ఈవెంట్లో ఇప్పుటివరకు భారత్ మొత్తం 74 మిస్ఫీల్డ్స్ (అన్ని జట్లలో అత్యధికం) చేశారు. 6 ఓవర్త్రోలు కూడా ఉన్నాయి. సెమీస్లో మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులు ఇచ్చింది. కనీసం ఫైనల్ మ్యాచ్లో భారత్ మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.డెత్ బౌలింగ్ కష్టాలు..బౌలింగ్ విభాగంలో కూడా భారత్ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఒక్క శ్రీ చరణి మినహా మిగితా బౌలర్లంతా తేలిపోయారు. ఆఖరికి దీప్తి శర్మ వంటి స్టార్ స్పిన్నర్ సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది.రేణుకా సింగ్ వంటి స్టార్ పేసర్ జట్టులో ఉన్నప్పటికి ఆరంభంలో పిచ్ స్వింగ్కు అనుకూలించకపోతే ఆమె ఒక సాధారణ బౌలర్గా మారిపోతుంది. అంతేకాకుండా సెమీఫైనల్లో హర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్ను పక్కన పెట్టిమరి రాధా యాదవ్ను తీసుకొచ్చారు. కానీ ఆమె కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌలర్ ఆడపదడప ప్రదర్శనలు చేస్తున్నప్పటికి.. ఫైనల్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఇక భారత జట్టులో డెత్ బౌలింగ్ లేమి స్పష్టంగా కన్పిస్తోంది.భారత జట్టులో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గానీ, గౌడ్ గానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ విషయం తేటతెల్లమైంది. 251 పరుగుల లక్ష్య చేధనలో సఫారీలు 81/5 తో కష్టాల్లో ఉన్నప్పటికీ.. భారత్ బౌలర్లు మాత్రం వారిని ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ మ్యాచ్లో భారత్ అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్లో అదే సౌతాఫ్రికాపై మన బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్, ఫీల్డింగ్లో భారత్ మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇక బ్యాటింగ్లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాట్ ఝూళిపించాల్సి ఉంది. రెగ్యూలర్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో షెఫాలీకి అవకాశం లభించింది. కానీ ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది.అదేవిధంగా లీగ్ దశలో దుమ్ములేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్కు పనిచెప్పాలి. ఆమె కూడా సెమీస్లో విఫలమైంది. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, హర్మన్ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరముంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు -
IND vs SA: ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే
మహిళల వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్ సందర్భంగా కొత్త చాంపియన్ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్ ఫైనల్కు చేరాయి.ఎవరు గెలిచినా చరిత్రేనవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్ పోరులో భారత్- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది.ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరేఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా.. సూ రెడ్ఫెర్న్ థర్డ్ అంపైర్గా.. నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.వర్షం పడే అవకాశంకాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్టు తెలిపింది.ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్ డేన మ్యాచ్ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్: భారత్- సౌతాఫ్రికా జట్లుభారత్హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.సౌతాఫ్రికాలారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్, నదినె డి క్లెర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్కులులెకో మలాబా, అనెరి డెర్క్సెన్, అనెకె బాష్, మసబట క్లాస్, సునే లూస్, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్. చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే -
ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరు..?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(నవంబర్ 2) నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసి ప్రోటీస్ తొలిసారి తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్లో ఆసీస్ను ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.తుది పోరులో ఈ రెండు టీమ్స్లో ఏది గెలిచినా చరిత్రే కానుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గానీ భారత్ ఒక్కసారి కూడా వన్డే వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోలేదు. తొలి టైటిల్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.అయితే ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.రిజర్వ్ డే..ఈ ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం (నవంబర్ 2) నాడు కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. రిజర్వ్ డే అయిన సోమవారం(నవంబర్ 3) ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు ఆదివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్డే సోమవారం రోజు టాస్ నిర్వహిస్తారు. మ్యాచ్ రద్దు అయితే?కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 120నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్డేతో పాటు రిజర్వ్డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
లంచ్కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్లు ఆడేందుకు భారత్కు రానుంది. తొలుత రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్.. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. అయితే నవంబర్ 22 నుంచి 25 వరకు గౌహతి వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య జరగనున్న రెండో టెస్టులో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది.సాధారణంగా రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్ మ్యాచ్లలో మొదటి సెషన్ తర్వాత లంచ్, రెండో సెషన్ తర్వాత టీ బ్రేక్ తీసుకుంటారు. కానీ భారత్-సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్లో మాత్రం ఆటగాళ్లు తొలుత టీ బ్రేక్.. ఆ తర్వాత లంచ్ విరామానికి వెళ్లనున్నారు. నార్త్ ఈస్ట్లో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా ఉండటం కారణంగా.. రెడ్ బాల్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆటగాళ్లు లంచ్కు ముందు టీ బ్రేక్ తీసుకోనున్నారు.చరిత్రలో తొలిసారి..ఒక టెస్టు మ్యాచ్ ఆర్డర్ చాలా సింపుల్. తొలుత టాస్, ఆ తర్వాత ఆట ప్రారంభం, లంచ్ బ్రేక్, టీ బ్రేక్, స్టంప్స్. కానీ గౌహతీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరగనుంది.ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. బర్సపారా స్టేడియంలో ఆట ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అంటే సాధారణ సమయం కంటే అరగంట ముందుగా మొదలు కానుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగుతుంది. తరువాత 20 నిమిషాల టీ విరామం ఉంటుంది.రెండవ సెషన్ ఉదయం 11:20 నుండి మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆటగాళ్ళు 40 నిమిషాల భోజన విరామం తీసుకుంటారు. చివరి సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. రోజులోని 90 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అంపైర్లు ప్రయత్నించనున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఈ షెడ్యూల్ మార్పుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!? -
టీమిండియాతో టెస్టు సిరీస్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన
టీమిండియాతో టెస్టు సిరీస్ (IND vs SA Tests)కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తమ కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. భారత్లో సఫారీ జట్టుకు సారథ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బవుమా కెప్టెన్సీలో టీమిండియాతో టెస్టులు ఆడబోయే జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది.భారత్తో రెండు టెస్టులుప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్టుల్లో తలపడనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్ నిర్వహణకు నవంబరు 14- 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జట్టును ప్రొటిస్ బోర్డు తాజాగా ప్రకటించింది.ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన జట్టులో స్వల్ప మార్పులతోనే టీమిండియాతోనూ సఫారీలు బరిలో దిగనున్నారు. బవుమా తిరిగి రావడంతో డేవిడ్ బెడింగ్హామ్ జట్టులో చోటు కోల్పోయాడు. కాగా పాక్తో ఇటీవల సౌతాఫ్రికా జట్టు రెండు టెస్టులు ఆడింది.పాక్తో టెస్టు సిరీస్ సమంబవుమా గైర్హాజరీలో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సౌతాఫ్రికా.. అనూహ్య రీతిలో పాక్తో తొలి టెస్టులో ఓడింది. ఆ తర్వాత రావల్పిండి వేదికగా రెండో టెస్టు గెలిచి సిరీస్ను 1-1 సమం చేయగలిగింది. తతదుపరి పాక్తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడిన తర్వాత సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో బాగంగా టీమిండియాతో తొలుత రెండు టెస్టులు ఆడనున్న సఫారీలు.. తదుపరి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనున్నారు. విండీస్ను వైట్వాష్ చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో ఓటమి చవిచూసింది. తదుపరి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ పూర్తి చేసుకుని.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇక డబ్ల్యూటీసీ తాజా సీజన్లో గిల్ సేన తొలుత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో వైట్వాష్ చేసి జోరు మీదుంది.టీమిండియాతో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు ఇదేతెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైలీ వెరెన్నె, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, సెనురాన్ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్ హార్మర్. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే వీరి ఏకైక లక్ష్యం. ఇందులో భాగంగానే వారు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.రోకో తదుపరి టార్గెట్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్. ఈ సిరీస్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, వైజాగ్ వేదికలుగా ఈ వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి చెలరేగే అవకాశం ఉంది. స్వదేశంలో జరిగే వన్డేల్లో ఈ ఇద్దరికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యర్ధి ఎవరైనా స్వదేశంలో రోకోను ఆపడం అసాధ్యం.రో'హిట్టు'తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ హిట్టయ్యాడు. 3 మ్యాచ్ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 202 పరుగులు చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ రోహిత్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి వన్డేలో రోహిత్ చేసిన సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.భారీగా బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపర్చుకున్న రోహిత్ ఆ మ్యాచ్లో యధేచ్చగా షాట్లు ఆడాడు. మునుపటి రోహిత్ను గుర్తు చేశాడు. రెండో వన్డేలోనూ రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టమైన పిచ్పై శైలికి విరుద్దంగా, చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.ఈ రెండు ఇన్నింగ్స్ల తర్వాత రోహిత్ భవితవ్యంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ 2027 ప్రపంచకప్ సమయానికి 40వ పడిలో ఉంటాడు.ఆ వయసులో అతనెలా ఆడగలడని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ అనుమానాలకు రోహిత్ తన ప్రదర్శనలతో చెక్ పెట్టేశాడు. ఫిట్నెస్ ఇలాగే కాపాడుకుంటే 40 కాదు మరో ఐదేళ్లైనా ఆడగలనన్న సంకేతాలు పంపాడు. మొత్తంగా ఆస్ట్రేలియా సిరీస్లో హిట్టైన రోహిత్ 2027 ప్రపంచకప్కు సిద్దమంటూ సంకేతాలు పంపాడు.పరువు కాపాడుకున్న కోహ్లిఆసీస్ సిరీస్లో రోహిత్ హిట్టైతే.. అతని సహచరుడు కోహ్లి మాత్రం నాట్ బ్యాడ్ అనిపించాడు. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా, మూడో వన్డేలో రోహిత్తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (74 నాటౌట్) ఆడి పరువు కాపాడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో కోహ్లి భవితవ్యంపై కూడా అనుమానాలు తొలగిపోయాయి. కోహ్లి సైతం 2027 ప్రపంచకప్కు రెడీ అంటూ సంకేతాలు పంపాడు. ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండే కోహ్లి.. ఫామ్ను కాపాడుకుంటే ఈజీగా మరో నాలుగైదేళ్లు ఆడగలడు. మొత్తానికి ఈ సిరీస్తో రోహిత్, కోహ్లి భవితవ్యంపై అనుమానాలకు తెరపడింది. ప్రపంచకప్ వరకు వారు ఈజీగా కొనసాగగలరు.ఈ మధ్యలో వారు ఆడే అవకాశమున్న మ్యాచ్లపై ఓ లుక్కేద్దాం..- స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలోనే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. - దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో భారత్ వన్డే సిరీస్లు ఆడుతుంది. - ఆతర్వాత వెస్టిండీస్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అతర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించి వన్డేలు ఆడుతుంది. - 2027 వన్డే ప్రపంచకప్కు కొద్దిముందు భారత్ స్వదేశంలో శ్రీలంకతో వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ల్లో రోకో అన్ని ఆడతారని చెప్పలేము కాని, మెజార్జీ శాతం సిరీస్ల్లో పాల్గొనే అవకాశం ఉంది. చదవండి: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ -
టీమిండియా పొమ్మంది.. కట్ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ కరుణ్ నాయర్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్తో భాగస్వామ్యం నెలకొల్పిన నాయర్.. తర్వాత శ్రేయస్ గోపాల్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.కరుణ్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.నాయర్ మళ్లీ వస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మ్రోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో దేవ్దత్త్ పడిక్కల్కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో నాయర్ను సౌతాఫ్రికా సిరీస్కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్..
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ను అందుకునే క్రమంలో అయ్యర్ పక్కటెముకులకు గాయమైంది.వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్లు చేయించగా.. గాయం కాస్త తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. దీంతో వచ్చే నెల ఆఖరిలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు అయ్యర్ అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. భారత్కు బిగ్ షాక్.."మ్యాచ్ జరుగుతుండగానే శ్రేయస్ అయ్యర్ను స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది.అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమా లేదా అని నిర్ధారించడానికి మరిన్ని రిపోర్ట్లు స్కాన్లు చేయాల్సి ఉంది.ఇది హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టవచ్చు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్లో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.ఒకవేళ అయ్యర్ ప్రోటీస్తో సిరీస్కు దూరమైతే భారత్ గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అయ్యర్ భారత వన్డే సెటాప్లో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే గతంలో కూడా శ్రేయస్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. కోలుకుని తిరిగొచ్చాక ఇప్పుడు పక్కటెముల గాయం బారిన పడ్డాడు. కాగా సౌతాఫ్రికా-భారత్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
ఆసీస్ టూర్కు నో ఛాన్స్.. రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు పది నెలల తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్కు ప్రకటించిన సౌరాష్ట్ర జట్టులో జడేజాకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్కు జడేజా ఎంపిక కాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.ఈ క్రమంలో ఎంపీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాని జడేజా తనంతట తానే సౌరాష్ట్ర సెలక్టర్లకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జడేజా జట్టులోకి వచ్చినప్పటికి సౌరాష్ట్ర కెప్టెన్గా జయదేవ్ ఉనద్కట్ కొనసాగనున్నాడు. అక్టోబర్ 25 నుంచి రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర-మధ్యప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.సూపర్ ఫామ్లో జడ్డూ..కాగా జడేజా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన జడ్డూ.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆసీస్తో వన్డేలకు జడేజాను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం ఎడమ చేతి వాటం స్పిన్నర్గా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్ను తీసుకున్నారు.వాషింగ్టన్ సుందర్, పటేల్ను స్పిన్ ఆల్రౌండర్లగా ఎంపిక చేసిన సెలక్టర్లు.. జడేజాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే జడ్డూతో చర్చించాకే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సౌరాష్ట్ర క్రికెట్ తిరిగి వచ్చే నెలలో భారత జెర్సీలో కన్పించనున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో జడ్డూ భాగంగా కానున్నాడు. ఈ సిరీస్ సన్నాహకంగా రంజీ ట్రోఫీ మ్యాచ్ను ఉపయోగించుకోవాలని జడేజా భావిస్తున్నాడు.సౌరాష్ట్ర జట్టు: హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), తరంగ్ గోహెల్, రవీంద్ర జడేజా, యువరాజ్సిన్హ్ దోడియా, సమ్మర్ గజ్జర్, అర్పిత్ వాసవాడ, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, అన్ష్ గోసాయి, జే గోహిల్, పార్త్ భుట్, కెవిన్ జీవరాజని, హెత్విక్ కోటక్ మరియు అంకుర్ పన్వర్. -
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్.. టిక్కెట్ ధర 60 రూపాయలే
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టులో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్తో ప్రోటీస్ భారత పర్యటన ప్రారంభం కానుంది. నవంబర్ 14 నుంచి 18 వరకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది.అయితే ఈ మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రకారం..టిక్కెట్ల కనీసం ధర రోజుకు 60 రూపాయలుగా నిర్ణయించారు. మొత్తం ఐదు రోజులకు టిక్కెట్ కావాలనుకుంటే 300 రూపాయలు చెల్లాంచాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రోజు 250 రూపాయల వరకు (మొత్తం అయిదు రోజులకు రూ.1,250) ఉంటాయని క్యాబ్ అధికారులు పేర్కొన్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లను డిస్ట్రిక్ట్ యాప్, అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లు అవసరం లేదు. నేరుగా అన్లైన్ టిక్కెట్ ఉంటే చాలు స్టేడియంలోకి అనుమతి ఇస్తారు.కాగా 2019లో బంగ్లాదేశ్తో జరిగిన పింక్ బాల్ టెస్టు తర్వాత ఈడెన్ గార్డెన్స్లో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC 2025/27) సైకిల్లో భాగంగా జరగనుంది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
ఇండియా టూర్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. నవంబర్ 14న కోల్కతా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో సౌతాఫ్రికా జట్టు ఇండియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా-ఎ జట్టు కూడా భారత్కు రానుంది.రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేల సిరీస్లో ఇండియా-ఎ జట్టును ప్రోటీస్-ఎ జట్టు ఢీకొట్టనుంది. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా-ఎ జట్టు పర్యటన ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్ల అనాధికారిక టెస్టు సిరీస్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో జరగనుండగా.. మూడు వన్డేలకు సిరీస్కు రాజ్కోట్ ఆతిథ్యమివ్వనుంది.ఈ క్రమంలో భారత్ టూర్కు సౌతాఫ్రికా-ఎ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు సిరీస్లలోనూ ప్రోటీస్ జట్టు కెప్టెన్గా మార్క్వెస్ జానీ అకెర్మాన్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా సౌతాఫ్రికా సీనియర్ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కూడా ఈ జట్టులో ఉన్నాడు.వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్లో గాయపడిన బావుమా.. అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఓ వైపు గాయంతో పోరాడుతూనే.. 27 సంవత్సరాల తర్వాత తన జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ను అందించాడు. గాయం కారణంగా పాకిస్తాన్ టూర్కు బావుమా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఐడైన్ మార్క్రమ్ సఫారీలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు భారత్తో సిరీస్కు ముందు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాలని టెంబా పట్టుదలతో ఉన్నాడు. ఇండియా-ఎతో జరిగే రెండో టెస్టులో అతడు ఆడనున్నాడు. తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది.అనధికారిక టెస్టుల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్మాన్, టెంబా బావుమా*, ఓకుహ్లే సెలె, జుబేర్ హంజా, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్సామి, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, లెసెగో సెనోక్వానే, లెసెగో సెనోక్వానే, ప్రెనెలన్ సుబ్రాయెన్, కైల్ సిమ్మండ్స్, త్సెపో ద్వాండ్వా, జాసన్ స్మిత్, టియాన్ వాన్ వురెన్, కోడి యూసుఫ్.వన్డేల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్మాన్, ఒట్నీల్ బార్ట్మన్, బ్జోర్న్ ఫోర్టుయిన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్సామి, త్షెపో మోరెకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, డెలానో పోట్గీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబ క్యూషీలే, జాసన్ స్మిత్, కోడి యూసుఫ్.చదవండి: హైదరాబాద్లో మెరుపులు.. ఇద్దరు డబుల్ సెంచరీలు.. ఏకంగా 529 రన్స్ -
అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్ను అనూహ్య రీతిలో భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్ నదినె డి క్లెర్క్ (Nadine de Klerk) అద్భుత ఆట తీరుతో టీమిండియా నుంచి మ్యాచ్ను లాగేసుకుని.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే తమ జట్టును విజయతీరాలకు చేర్చింది.ఈ నేపథ్యంలో అనూహ్య ఓటమిపై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది. టాపార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణం అని పేర్కొంది. ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని.. భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొంది.251 పరుగులకు ఆలౌట్ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నీలో భాగంగా భారత్ విశాఖ వేదికగా గురువారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి ఫెయిల్ఓపెనర్లలో ప్రతికా రావల్ (37) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (23) మరోసారి నిరాశపరిచింది. ఇక వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియెల్ (13)తో పాటు నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ (9) కూడా విఫలమైంది. రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్జెమీమా రోడ్రిగెస్ డకౌట్ కాగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ 13 పరుగులకే వెనుదిరిగింది. ఇలాంటి క్లిష్ట దశలో వికెట్ కీపర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (77 బంతుల్లో 94)తో జట్టును ఆదుకోగా.. స్నేహ్ రాణా (24 బంతుల్లో 33) ఆమెకు సహకరించింది.A game-changing fifty by Richa Ghosh, her 7th in ODIs & first in CWC! 🔥Will she & Sneh Rana steer Team India over the 250-run mark?Catch the LIVE action ➡ https://t.co/qUAtuPmsC2#CWC25 👉 #INDvSA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/r1SyLR4ieB— Star Sports (@StarSportsIndia) October 9, 202584 పరుగులతో అజేయంగాఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. తజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కాగా.. సునే లూస్ 5 పరుగులకే అవుటైంది. మరో ఓపెనర్, కెప్టెన్ వొల్వార్ట్ 70 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ నదినే డి క్లెర్క్ 54 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి.. హర్మన్సేన హార్ట్ బ్రేక్ చేసింది.టాపార్డర్లో మేము బాధ్యత తీసుకోలేకపోయాంఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్లో మేము బాధ్యత తీసుకోలేకపోయాం. వ్యూహాలు మార్చుకోవాలి. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇదొక సుదీర్ఘ టోర్నమెంట్.ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు కఠినంగా తోచింది. ఎన్నో పాఠాలు నేర్పింది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ఈ మ్యాచ్లో ఇరుజట్లు గొప్పగా ఆడాయి. మా టాపార్డర్ కుప్పకూలినా 250కి పైగా స్కోరు చేయడం శుభపరిణామమే.అయితే, ఆఖర్లో క్లెర్క్ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను తమ జట్టు వైపు తిప్పేసింది. విశాఖ పిచ్ బాగుంది. సౌతాఫ్రికా విజయానికి అర్హమైన జట్టే’’ అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. ఇక రిచా ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అత్యద్భుతంగా ఆడింది. రిచా హిట్టింగ్ ఈ మ్యాచ్లో మాకు అతిపెద్ద సానుకూలాంశం. తనిలాగే ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం’’ అని హర్మన్ పేర్కొంది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. తొలిసారి ఓ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్లు అర్ద సెంచరీలు చేశారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు.వన్డే ప్రపంచకప్ 2025లో (CWC 2025) భాగంగా భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్కు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్ రిచా ఘెష్ (Richa Ghosh), సౌతాఫ్రికా తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) అర్ద సెంచరీలు చేశారు.ఘోష్, క్లెర్క్ ఈ అర్ద సెంచరీలను వారివారి జట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడింది. స్వల్ప తేడాతో సెంచరీ సైతం మిస్ అయ్యింది. స్నేహ్ రాణాతో కలిసి (33) అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు ఫైటింగ్ స్కోర్ను అందించింది.క్లెర్క్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 142 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ఈ దశలో ఎనిమిదో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగిన క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు).. సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుని, తన జట్టుకు అపుకూప విజయాన్నందించింది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్లెర్క్ కారణంగా తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
IND Vs SA: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) ఓ ఆసక్తికర పోరు జరిగింది. భారత్, సౌతాఫ్రికా జట్లు వైజాగ్ వేదికగా హోరాహోరీగా తలపడ్డాయి. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్.. క్లో ట్రయాన్ (49) సహకారంతో సౌతాఫ్రికాను గెలిపించింది. లక్ష్యానికి కొద్ది దూరంలో (41 పరుగులు) ట్రయాన్ ఔట్ కాగా.. చివర్లో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉండి, 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది.క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో, ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఐదో వికెట్ పడిన తర్వాత 171 పరుగులు జోడించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ (159) పేరిట ఉండేది.సౌతాఫ్రికా హ్యాట్రిక్ఈ గెలుపుతో సౌతాఫ్రికా హ్యాట్రిక్ సాధించింది. ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికాకు భారత్పై ఇది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. వన్డేల్లో భారత్ చేతిలో వరుసగా ఐదు ఓటముల తర్వాత సౌతాఫ్రికాకు లభించిన తొలి విజయం ఇది.రిచా ఘోష్ చారిత్రక ఇన్నింగ్స్ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి, రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ఇది తొలి ఓటమి. అంతకుముందు భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్లపై విజయాలు సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు


