సూపర్‌ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం | Mumbai get Jaiswal boost in SMAT push | Sakshi
Sakshi News home page

సూపర్‌ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం

Dec 7 2025 1:10 PM | Updated on Dec 7 2025 1:18 PM

Mumbai get Jaiswal boost in SMAT push

దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్యశస్వి జైస్వాల్కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ముస్తాక్అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. విషయాన్ని ముంబై క్రికెట్అసోసియేషన్సీనియర్అధికారి ఒకరు ధృవీకరించారు.

జైస్వాల్సయ్యద్ముస్తాక్అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్లో కనిపించాడు. టోర్నీలో అతడికి మంచి ట్రాక్రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్ల్లో 136.42 స్ట్రయిక్రేట్తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్సెంచరీలు ఉన్నాయి

త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్స్థానాన్ని ఆక్రమించాడు.

ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్స్టార్రోహిత్శర్మ కూడా సయ్యద్ముస్తాక్అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ప్రకటించిన హిట్మ్యాన్ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్కానీ జైస్వాల్కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.

ప్రస్తుతం ఎడిషన్సయ్యద్ముస్తాక్అలీ టోర్నీలో డిఫెండింగ్ఛాంపియన్గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్గ్రూప్‌-ఏలో టేబుల్టాపర్గా కొనసాగుతుంది. జట్టుకు నాకౌట్బెర్త్ఇదివరకే ఖరారైంది

ఎడిషన్లో శార్దూల్ఠాకూర్నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ఆయుశ్మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ఠాకూర్స్వయంగా ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్మ్యాచ్ను డిసెంబర్‌ 8 ఒడిషాతో ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement