breaking news
Yashasvi Jaiswal
-
టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు చోటు దక్కకపోవడం అందరినీ బాధిస్తుంది. జైస్వాల్ను కాదని భారత సెలెక్టర్లు శుభ్మన్ గిల్వైపు మొగ్గు చూపడం కరెక్ట్ కాదని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే, గిల్ అంతర్జాతీయ టీ20 ఆడి ఏడాది దాటిపోయింది. అయినా టెస్ట్ జట్టు కెప్టెన్ అని, ఆ ఫార్మాట్లలో ఇటీవల అద్భుతంగా రాణించాడని అతన్ని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇంతటితో ఆగకుండా వైస్ కెప్టెన్ను కూడా చేశారు.జైస్వాల్ పరిస్థితి అది కాదు. ఇతగాడు గత ఏడాది కాలంగా భారత టీ20 ఫార్మాట్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. గత 9 ఇన్నింగ్స్ల్లో 3 అర్ద సెంచరీలు చేసి రాణించాడు. పైగా టీ20 ర్యాంకింగ్స్లో టాప్-10లో (10) ఉన్నాడు.ఆసియా కప్ జట్టులో ఉండేందుకు ఇన్ని అర్హతలు ఉన్నా.. గిల్లా బీసీసీఐ పెద్దల అండదండలు లేకపోవడం జైస్వాల్కు మైనస్ అయ్యింది. అందుకే అతడికి ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు.జైస్వాల్ @10.. గిల్ @41ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో జైస్వాల్ 10వ స్థానంలో ఉండగా.. చాలాకాలంగా పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న గిల్ 41వ స్థానంలో కొనసాగుతున్నాడు. జైస్వాల్-గిల్ మధ్య ఈ ర్యాంకింగ్స్ వ్యత్యాసం చూసిన తర్వాత కొందరు భారత అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ర్యాంకింగ్స్ విషయంలో గిల్తో పోలిస్తే జైస్వాల్కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. టెస్ట్ల్లో, టీ20ల్లో టాప్-10 ఉన్న ఏకైక బ్యాటర్ జైస్వాల్ ఒక్కడే. టీ20 ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న జైస్వాల్.. టెస్ట్ల్లో 5వ స్థానంలో ఉన్నాడు. గిల్ విషయానికొస్తే.. వన్డేల్లో నంబర్ వన్గా కొనసాగుతున్న ఇతగాడు, టెస్ట్ల్లో 13వ స్థానంలో ఉన్నాడు. -
Asia Cup: గిల్, శ్రేయస్కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఆడే భారత జట్టులో.. టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) చోటు దక్కించుకుంటాడా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. గతేడాది జూలైలో గిల్ టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు.మరోవైపు.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు కూడా టెస్టుల్లోనే పెద్దపీట వేసింది మేనేజ్మెంట్. ఈ క్రమంలో అతడు కూడా గిల్ మాదిరి గతేడాదే చివరగా టీ20లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అదరగొట్టిన అభిషేక్- సంజూఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి స్థానంలో అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి అదరగొట్టారు. గత కొన్నాళ్లుగా ఓపెనర్లుగా జట్టులో పాతుకుపోయారు. అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆసియా కప్ టోర్నీని పొట్టి ఫార్మాట్లో నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఈ ఖండాంతర టోర్నీకి భారత జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. గిల్, జైసూలను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు మేనేజ్మెంట్కు సూచిస్తుండగా.. మరికొందరు మాత్రం అభిషేక్- సంజూ జోడీకి ఓటు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. క్రిక్బజ్ కథనం ప్రకారం.. శుబ్మన్ గిల్ను ఆసియా టీ20 కప్ టోర్నీలో ఆడించేందుకు సెలక్షన్ కమిటీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి ఎంపిక చేసే జట్టులో గిల్కు చోటివ్వద్దని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.గిల్కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!ఓపెనింగ్ జోడీగా అభిషేక్- సంజూ రిథమ్లో ఉన్నారు కాబట్టి వారినే కొనసాగించాలని అగార్కర్ భావిస్తున్నాడట. గిల్ను జట్టులోకి తీసుకుంటే తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారుతుందని.. అయితే, యశస్వి జైస్వాల్ను మాత్రం బ్యాకప్ ఓపెనర్గా తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గౌతీ రంగంలోకి దిగితే మాత్రంఅయితే, ఒకవేళ హెడ్కోచ్ గౌతం గంభీర్.. గిల్ను జట్టులో చేర్చాలని పట్టుబడితే మాత్రం.. అగార్కర్ అందుకు అంగీకరించే అవకాశం ఉంది. మరోవైపు.. దేశీ టోర్నీలు, ఐపీఎల్-2025లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్కు కూడా అగార్కర్ మొండిచేయి చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్లను ఈ టోర్నీకి తప్పక ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్లో శివం దూబే, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ స్థానం కోసం పోటీపడుతున్నారు.సిరాజ్, షమీలకు మొండిచేయిఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ టోర్నీకి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు ఈ జట్టులో చోటు దక్కడం సాధ్యం కాకపోవచ్చు. బుమ్రా పేస్ దళంలో యువ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ తప్పక స్థానం దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ.. మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ అంశంపై స్పష్టత వస్తుంది.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
Asia Cup: జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్గా అతడే సరైనోడు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఖండాంతర టోర్నీలో ఓపెనర్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. వికెట్ కీపర్లలోనూ మొదటి ప్రాధాన్యంగా తన ఓటు సంజూకేనని స్పష్టం చేశాడు.గిల్, జైసూ రీ ఎంట్రీ పక్కా!కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్కు ఆగష్టు 19న బీసీసీఐ తమ జట్టును ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ల టీ20 రీఎంట్రీపై చర్చ భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు గిల్, జైసూలను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూచిస్తుండగా.. కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సంజూ- అభిషేక్ శర్మలనే ఓపెనింగ్ జోడీనే కొనసాగించాలని పేర్కొన్నాడు.జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్గా అతడే సరైనోడు!అయితే, వీరికి బ్యాకప్ ఓపెనర్గా గిల్ను ఎంపిక చేస్తే బాగుంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘జైస్వాల్, గిల్.. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆసియా కప్ జట్టులో చోటు దక్కే వీలుంది. నేనైతే శుబ్మన్ గిల్ వైపే మొగ్గుచూపుతాను.ఇంగ్లండ్లో కెప్టెన్గా గిల్ రాణించాడు. 750 పరుగులు కూడా చేశాడు. అంతేకాదు.. ఐపీఎల్లోనూ అతడు మెరుగ్గా రాణించాడు. అయితే, తుదిజట్టులో కాకపోయినా.. బ్యాకప్ ఓపెనర్గానైనా గిల్ పేరు ఆసియా కప్ జట్టులో ఉంటుంది.జితేశ్ శర్మకు నా ఓటునిజానికి ఓపెనింగ్ స్లాట్ కోసం గిల్- జైస్వాల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే, ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. గిల్ సరైన ఆప్షన్ అవుతాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ విషయానికి వస్తే.. జితేశ్ శర్మకు నా ఓటు.ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్ చేరి టైటిల్ గెలవడంలో జితేశ్ పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆసియా కప్ టోర్నీలో సంజూ ప్రధాన వికెట్ కీపర్గా ఉంటే.. జితేశ్ అతడికి బ్యాకప్గా ఉండాలి’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అదే విధంగా.. ఆసియ కప్-2025లో భారత తుదిజట్టును కూడా కైఫ్ ఈ సందర్భంగా ఎంచుకున్నాడు. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా వరుణ్ చక్రవర్తి, శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మలను కైఫ్ తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు.ఆసియా కప్-2025లో కైఫ్ ఎంచుకున్న భారత తుదిజట్టు ఇదేసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోయావా జైస్వాల్..: రోహిత్
ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నాడు. గోవాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఈ యువ ఆటగాడు తిరిగి ముంబైకే ఆడాలని ఫిక్సయ్యాడు. అయితే, జైసూ తన నిర్ణయం మార్చుకోవడానికి ప్రధాన కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించాడు. ‘‘ముంబై వంటి జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఎంతటి గర్వకారణమో రోహిత్ శర్మ.. యశస్వికి అర్థమయ్యేలా చెప్పాడు.టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దురికార్డు స్థాయిలో 42సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ఘనమైన చరిత్ర ముంబైకి ఉంది. అంతేకాదు.. తన ప్రతిభను నిరూపించుకోవడానికి వేదికను కల్పించి.. టీమిండియాకు ఆడే స్థాయికి తీసుకువచ్చింది ముంబై అసోసియేషన్ అన్న విషయం మర్చిపోవద్దని రోహిత్.. యశస్వికి గుర్తు చేశాడు.ఇందుకు యశస్వి ముంబైకి రుణపడి ఉండాలని హితబోధ చేశాడు. ముంబైలోనే క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టిన యశస్వి.. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూపుల జట్లకు ఎంపికైన విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు.యశస్వి రిక్వెస్ట్.. మేము కూడా ఓకే చెప్పామురోహిత్ శర్మతో పాటు ముంబైకి ఆడిన మరి కొందరు దిగ్గజ క్రికెటర్లతో చర్చించిన తర్వాత యశస్వి జైస్వాల్ తనకు మంజూరు చేసిన నిరభ్యంతర పత్రాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మాకు మరోసారి ఈ-మెయిల్ పంపాడు. తాను గోవా జట్టుకు మారడం లేదని తెలిపాడు. మేము అతడి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపాము’’ అని అజింక్య నాయక్ పేర్కొన్నట్లు ముంబై మిర్రర్ తన కథనంలో వెల్లడించింది.యూపీ నుంచి ముంబై.. టీమిండియా దాకా ఇలాకాగా ఉత్తరప్రదేశ్కు చెందిన యశస్వి జైస్వాల్ క్రికెటర్ కావాలన్న కలను నెరవేర్చుకునేందుకు పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత్ అండర్-19 జట్టులో చోటు సంపాదించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2020 వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన జట్టులో సభ్యుడు. అంతకంటే ముందు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు.అయితే, ముంబై జట్టులోని సీనియర్ ఆటగాడితో విభేదాలు అంటూ వార్తలు వచ్చిన వేళ.. తాను గోవాకు ఆడాలనుకుంటున్నట్లు ఎంసీఏకు యశస్వి లేఖ రాశాడు. అయితే, కొన్నిరోజుల తర్వాత మళ్లీ ముంబైకే ఆడతానని స్పష్టం చేశాడు. కాగా యశస్వి జైస్వాల్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడాడు. ఆండర్సన్ - టెండుల్కర్ ట్రోఫీలో జైసూ మొత్తంగా 400 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై దిగ్గజం రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కాగా జైసూ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా తన టెస్టు కెరీర్ ఆరంభించిన విషయం తెలిసిందే.చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా! -
Asia Cup 2025: ఆసియా కప్లో గిల్, జైస్వాల్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్లను ఆసియా కప్కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్లను టి20 టీమ్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీమ్ పరిశీలనలో ఉంది. సుదర్శన్ భారత్ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్కు 17 మందితో టీమ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్ గ్రూప్’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్ల విషయంలో టోర్నీకి ముంద ఫిట్నెస్ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు. -
IND vs ENG: టీమిండియా నుంచి ఆరుగురు.. గిల్కు చోటు లేదు!
ఐదు టెస్టులు.. ఇరవై ఐదు రోజులు.. ఆద్యంతం ఆసక్తికరం.. ఆఖరి టెస్టు.. ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరు.. టెస్టు క్రికెట్ ప్రేమికుల మది దోచుకున్న సిరీస్.. అదే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 2-2తో సమంగా ముగిసింది.లీడ్స్లో ఇంగ్లండ్, ఎడ్జ్బాస్టన్లో టీమిండియా గెలవగా.. లార్డ్స్లో ఆతిథ్య జట్టు జయభేరి మోగించింది. అనంతరం మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టు డ్రా కాగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను డ్రా చేసింది. సిరాజ్ మేజిక్అయితే, ఇరుజట్లు కూడా ఆఖరి నిమిషం వరకు పోరాడిన తీరు అద్భుతం. చివరకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి టీమిండియా విజయాన్ని ఖరారు చేయడం అభిమానులను ఖుషీ చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మెగా సిరీస్కు సంబంధించి ఇంగ్లండ్- ఇండియా నుంచి అత్యుత్తమ తుదిజట్టును ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఎంపిక చేశాడు. తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా జోడీకి స్థానం ఇచ్చిన ఈ లెజెండరీ బౌలర్.. మిడిలార్డర్లో మాత్రం ఇంగ్లండ్కే పెద్దపీట వేశాడు.అదనపు భారాన్నీ తానే మోశాడుఇక ఆల్రౌండర్ జాబితాలో వాషింగ్టన్ సుందర్కూ చోటిచ్చిన బ్రాడ్.. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్తో పాటు టీమిండియా ద్వయాన్ని కూడా ఎంపిక చేశాడు. ఓవరాల్గా తన జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఐదుగురు ఇంగ్లండ్ ప్లేయర్లకు చోటిచ్చాడు. అయితే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, 754 పరుగులు సాధించిన భారత సారథి శుబ్మన్ గిల్కు మాత్రం అతడు స్థానం కల్పించలేదు.ఈ సందర్భంగా సిరాజ్ను ప్రత్యేకంగా అభినందించాడు స్టువర్ట్ బ్రాడ్. ‘‘ప్రతిసారి బంతిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. బాధ్యతంతా తన మీదే వేసుకున్నాడు. బుమ్రా గైర్హాజరీలో అదనపు భారాన్నీ తానే మోశాడు. పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. సిరాజ్ ఉండటం భారత జట్టును మరింత పటిష్టం చేస్తుంది’’ అంటూ స్టువర్ట్ బ్రాడ్ సిరాజ్పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో పదకొండు వందలకు పైగా బంతులు వేసిన సిరాజ్ 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ 2025 టెస్టు సిరీస్- స్టువర్ట్ బ్రాడ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జోఫ్రా ఆర్చర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
IND vs ENG: అదరగొట్టిన జైసూ, ఆకాశ్, జడ్డూ.. వాషీ మెరుపు ఇన్నింగ్స్
ఇంగ్లండ్తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ మీద తొలి ఇన్నింగ్స్లో 373 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఆతిథ్య జట్టుకు 374 పరుగుల లక్ష్యం విధించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకం (118)తో చెలరేగితే.. ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53) హాఫ్ సెంచరీలతో అలరించారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ మెరుపు అర్ధ శతకం (46 బంల్లో 53)తో అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ 3, జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన భారత బ్యాటర్లుఇంగ్లండ్తో ఐదో టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఫలితంగా 87 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి.. ఇంగ్లండ్ కంటే 373 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లండన్లో ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడ్డ గిల్ సేన 69.4 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 38 పరుగులు చేయగలిగాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (21), రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు రాబట్టాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఒక్కడే అర్ధ శతకం (57)తో రాణించాడు.. అతడి ఇన్నింగ్స్ కారణంగానే భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక టెయిలెండర్లలో ఆకాశ్ దీప్ (0) నాటౌట్గా నిలవగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ డకౌట్గా వెనుదిరిగారు.ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జోష్ టంగ్ మూడు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43)తో పాటు హ్యారీ బ్రూక్ (53) రాణించాడు.భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ఇంగ్లండ్ టెయిలెండర్ క్రిస్ వోక్స్ ఆబ్సెంట్హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. రెండు వికెట్ల (కేఎల్ రాహుల్-7, సాయి సుదర్శన్- 11) నష్టానికి 75 పరుగులు చేసింది.వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూఈ క్రమంలో 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టగా (118), నైట్ వాచ్మన్గా వచ్చిన పేసర్ ఆకాశ్ దీప్ సంచలన అర్ధ శతకం (66) సాధించాడు.ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ (11) మరోసారి నిరాశపరచగా.. కరుణ్ నాయర్ (17) కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 బంతుల్లో 34) వేగంగా ఆడే ప్రయత్నం చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.మరోవైపు.. అర్ధ శతకంతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా (53)ను జడేజా జోష్ టంగ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి.. ఎనిమిదో వికెట్గా పెవిలియన్ చేరాడు. జడ్డూ అవుటయ్యే సరికి అంటే.. 83.2 ఓవర్లలో టీమిండియా 357 పరుగులు చేసింది. తద్వారా ఇంగ్లండ్ కంటే 334 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన సిరాజ్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బాధ్యత తన మీద వేసుకున్న వాషింగ్టన్ సుందర్ వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. -
జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్గా..
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇంగ్లండ్తో ఐదో టెస్టులో అద్బుత శతకంతో మెరిశాడు. ఓవల్ మైదానంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైసూ.. శనివారం దానిని శతకంగా మలచుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం 127 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 164 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పద్నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 71కి పైగా స్ట్రైక్రేటుతో 118 పరుగులు సాధించాడు. నిజానికి రెండో రోజు భారత్.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (11) రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.ఆరంభం నుంచే అదరగొట్టారుఈ క్రమంలో నైట్ వాచ్మన్గా ఆకాశ్ దీప్ (Akash Deep).. యశస్వికి జతయ్యాడు. అయితే, ఇద్దరూ కలిసి చక్కటి సమన్వయంతో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ.. మూడో రోజు ఆరంభం నుంచే అదరగొట్టారు. ఇక ఆకాశ్ దీప్ ఊహించని రీతిలో బౌండరీలు బాదుతూ.. జైస్వాల్పై ఒత్తిడి తగ్గించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వీరికి కలిసివచ్చాయి. తొలి అర్ధ శతకంఈ క్రమంలో ఆకాశ్ దీప్ తన టెస్టు కెరీర్లో తొలి అర్ధ శతకం (66) సాధించగా.. జైసూ ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 23 ఏళ్ల యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు.జైస్వాల్ ప్రపంచ రికార్డుజైస్వాల్ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్ స్క్వేర్ పొజిషన్ నుంచి వచ్చినవే. ఇప్పటికి టెస్టు చరిత్రలో 1526 శతకాలు నమోదు కాగా.. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.నువ్వా- నేనాఇక మ్యాచ్ విషయానికొస్తే.. లండన్లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్తో గురువారం మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించగా.. కరుణ్ నాయర్ (57) అర్ధ శతకంతో రాణించాడు.ఇక ఇందుకు బదులుగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు ఆరంభంలో అదరగొట్టినా.. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు కూల్చి.. బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! -
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
ఇంగ్లండ్తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది.కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయగలదు.జైసూ సెంచరీఇక ఈ మ్యాచ్లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్లో రెండోది.12 సెంచరీలు అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ శతకం (118), ఆకాశ్ దీప్ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరేయశస్వి జైస్వాల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ది ఓవల్- లండన్)శుబ్మన్ గిల్- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ఎడ్జ్బాస్టన్- బర్మింగ్హామ్, ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్ )రిషభ్ పంత్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్)కేఎల్ రాహుల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, లార్డ్స్- లండన్)రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)వాషింగ్టన్ సుందర్- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలుపాకిస్తాన్- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలుసౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలుటీమిండియా- 2025లో ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలుచదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙖𝙜𝙖𝙞𝙣𝙨𝙩 𝙖𝙡𝙡 𝙤𝙙𝙙𝙨 🥶🗣 #YashasviJaiswal completes a dramatic knock to bring up his 6th International Test century in style! 🔥#ENGvIND 👉 5th TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/3V6YCy3sHy pic.twitter.com/ezdwfz3oYi— Star Sports (@StarSportsIndia) August 2, 2025 -
IND vs ENG: శతక్కొట్టిన జైస్వాల్.. ఇంగ్లండ్తో మ్యాచ్ అంటే అంతే!
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) శతక్కొట్టాడు. ఓవల్ మైదానంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా వంద పరుగుల మార్కును అందుకున్నాడు. 127 బంతుల్లోసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ సిరీస్లో జైసూకు ఇది రెండో శతకం. అంతకు ముందు లీడ్స్ వేదికగా తొలి టెస్టులో జైస్వాల్ 101 పరుగులు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన ఐదో మ్యాచ్ లండన్లో గురువారం మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచాడుతొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్కు వచ్చే సరికి జైస్వాల్ గేరు మార్చాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలోనే అర్ధ శతకం (52*) పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. శనివారం దానిని సెంచరీగా మలిచాడు.టెస్టులలో ఆరోది..తద్వారా ఈ సిరీస్లో రెండో శతకంతో పాటు.. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో నాలుగు ఇంగ్లండ్ మీద బాదినవే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన టీమిండియా 51 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. నైట్ వాచ్మన్ ఆకాశ్ దీప్ అర్ధ శతకం(66)తో చెలరేగగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ (11) మాత్రం నిరాశపరిచాడు. జైసూతో కలిసి కరుణ్ నాయర్ (9*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా భారత్ను తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌట్ అయింది.చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ -
ఆకాశ్ ధనాధన్.. తొలి హాఫ్ సెంచరీ! డకెట్తో.. నిన్న అలా.. ఈరోజు ఇలా!
ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ (Ben Dcukett) టీమిండియా అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)ను ఆలింగనం చేసుకుని స్వీట్ షాకిచ్చాడు. ఇంగ్లండ్- భారత్ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.క్రీడా స్ఫూర్తిదే విజయంఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘చిన్న చిన్న యుద్ధాలు.. అయితే వాటిపై అంతిమంగా క్రీడా స్ఫూర్తిదే విజయం’’ అంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవల్ టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డకెట్- ఆకాశ్ మధ్య నువ్వా- నేనా అన్నట్లు పోటీ జరిగిన విషయం తెలిసిందే.భుజంపై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూఆకాశ్ బౌలింగ్లో బౌండరీలు బాదిన డకెట్.. ఆఖరికి రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో తనదే పైచేయి అన్నట్లుగా ఆకాశ్ దీప్.. డకెట్ క్రీజును వదిలి వెళ్తుంటే అతడి భుజంపై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూ స్లెడ్జ్ చేశాడు. అయితే, డకెట్ కూల్గానే ఇందుకు సమాధానమిస్తూ పెవిలియన్కు చేరాడు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఆకాశ్ దీప్పై విమర్శలు వచ్చాయి. అయితే, శనివారం నాటలో భాగంగా ఫీల్డర్ డకెట్ వచ్చి.. ‘బ్యాటర్’ ఆకాశ్ దీప్ను హగ్ చేసుకోవడం విశేషం. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 28వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.కాగా ఓవల్ మైదానంలో 224 పరుగులకు టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగించగా.. ఇందుకు సమాధానంగా ఇంగ్లండ్ 247 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) నిరాశపరిచారు. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులతో.. ఆకాశ్ దీప్ నాలుగు పరుగులతో క్రీజులో నిలిచాడు. తొలి హాఫ్ సెంచరీఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆరంభం నుంచే.. జైస్వాల్తో కలిసి ఆకాశ్ దీప్ ధనాధన్ దంచికొట్టాడు. 70 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఫోర్ బాది మరీ యాభై పరుగుల మార్కును చేరుకోవడం విశేషం. టెస్టులలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ.ఇక 40 ఓవర్ల ముగిసేసరికి జైస్వాల్ 82, ఆకాశ్ దీప్ 53 పరుగులతో ఉన్నారు. భారత్ స్కోరు: 158/2 (40). ఇంగ్లండ్ కంటే 135 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్.. 80 పరుగులు ఇచ్చి.. డకెట్ (38 బంతుల్లో 43) రూపంలో కీలక వికెట్ తీశాడు. చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్A much needed breakthrough for India 🔥And a cheeky send-off for Ben Duckett 😜#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/9YaTjcEYOn— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025 -
కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) సీజన్లో పాల్గొనే వెస్ట్జోన్ (West Zone) జట్టు ఖరారైంది. టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఈ దేశవాళీ టోర్నీలో వెస్ట్జోన్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతడి సారథ్యంలోని ఈ టీమ్లో టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా భాగం కానున్నారు.దూబే, రహానే, పుజారాలకు మొండిచేయివీరితో పాటు దేశీ స్టార్లు తుషార్ దేశ్పాండే, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్ కూడా వెస్ట్జోన్కు ఆడనున్నారు. మరోవైపు.. శివం దూబే అందుబాటులో ఉన్నా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. అదే విధంగా.. టీమిండియా వెటరన్ బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలకు కూడా దులిప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు.రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో శార్దూల్ ఠాకూర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ఈ ఆల్రౌండర్ లోయర్ ఆర్డర్లో భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియాలో శార్దూల్ సభ్యుడిగా ఉన్నాడు.ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో శార్దూల్ పెద్దగా రాణించడం లేదు. మరోవైపు.. వెస్ట్జోన్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వస్తాడనుకుంటే.. ఆసియా టీ20 కప్-2025తో అతడు బిజీ కానున్న నేపథ్యంలో పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ జోన్ కెప్టెన్గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. కాగా ఆగష్టు 28- సెప్టెంబరు 15 వరకు దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు.దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.సౌత్ జోన్ జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్దులిప్ ట్రోఫీ-2025 షెడ్యూల్👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.చదవండి: IND vs ENG: నా కుమారుడు చేసిన తప్పేంటి?: సెలక్టర్లపై క్రికెటర్ తండ్రి ఫైర్ -
బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జైస్వాల్ టెక్నిక్ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. అతడు ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడని.. అట్కిన్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో జైసూ పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు.బిక్కముఖం వేశాడుఈ మేరకు.. ‘‘జైస్వాల్ ఎన్నటికీ సాయి సుదర్శన్ కాలేడు. అయినా వీళ్లిద్దరిని పోల్చడం సరికాదనుకోండి. కానీ ఇంగ్లండ్తో తొలి టెస్టులో జైస్వాల్ అవుటైన తీరును చూస్తే.. అతడికి ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియక బిక్కముఖం వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇలాంటి పిచ్పై ఎలా ఆడాలన్న గేమ్ ప్లాన్ అతడి వద్ద లేనట్లే అనిపించింది. నీ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు లేకపోతే ఇలాగే అవుట్ అయిపోతావు. బంతిని అతడు సరిగ్గా అంచనా వేయలేదు. డిఫెండ్ చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇప్పటికైనా జైస్వాల్ తన టెక్నిక్ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.కాగా ఈ మ్యాచ్లో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 108 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. చెన్నైకి చెందిన సాయి కూడా యశస్వి జైస్వాల్ మాదిరే లెఫ్టాండ్ బ్యాటర్ అన్న విషయం తెలిసిందే.తొలి రోజు ఇంగ్లండ్దే పైచేయిఇదిలా ఉంటే.. ఓవల్ వేదికగా గురువారం ఇంగ్లండ్తో మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 64 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించాడు.అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (21) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. గత మ్యాచ్లో అజేయ శతకంతో మెరిసిన రవీంద్ర జడేజా (9) ఈసారి విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (19) తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరుణ్ నాయర్ 52, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన ఈ సిరీస్ను కనీసం సమం చేయగలుగుతుంది. ఇక ఈ సిరీస్లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 101, 4, 87, 28, 13, 0, 58, 0, 2.చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
అతడు టీమిండియాకు ఎంపికైన తర్వాత.. 15 మంది అరంగేట్రం!
జాతీయ జట్టు తరఫున ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడు కోరుకుంటాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే అంతకంటే గొప్పదేమీ లేదంటూ గర్వపడతాడు. అయితే, క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)కు మాత్రం ఇప్పట్లో ఈ కల నెరవేరేలా కనిపించడం లేదు.961 రోజులుగా నిరీక్షణటీమిండియాకు ఆడాలన్న అభిమన్యు ఆశయానికి వరుసగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన నాటి నుంచి ఇప్పటికి 961 రోజులుగా అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. అరంగేట్రం చేసేందుకు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నాడు. కానీ మేనేజ్మెంట్ ఇంత వరకు కనికరించనేలేదు.పదిహేను మంది ఆటగాళ్ల అరంగేట్రంతాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లోనూ ఒక్క మ్యాచ్లో కూడా అభిమన్యును ఆడించలేదు. అయితే, అభిమన్యు టెస్టుల కోసం సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్న తర్వాత.. పదిహేను మంది ఆటగాళ్లు అతడి కంటే ముందే అరంగేట్రం చేయడం గమనార్హం.బంగ్లాదేశ్తో 2022 నాటి టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడటంతో.. అతడి స్థానంలో అభిమన్యుకు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. కానీ తుదిజట్టులో స్థానం కల్పించలేదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికైనప్పటికీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడే ఛాన్స్ దక్కలేదు.ఆ లిస్టు ఇదేఅయితే, కేఎస్ భరత్ (2023), సూర్యకుమార్ యాదవ్ (2023), యశస్వి జైస్వాల్ (2023), ఇషాన్ కిషన్ (2023), ముకేశ్ కుమార్ (2023), ప్రసిద్ కృష్ణ (2023), రజత్ పాటిదార్ (2024), సర్ఫరాజ్ ఖాన్ (2024), ధ్రువ్ జురెల్ (2024), ఆకాశ్ దీప్ (2024), దేవ్దత్ పడిక్కల్ (2024), నితీశ్ కుమార్ రెడ్డి (2024), హర్షిత్ రాణా (2024), సాయి సుదర్శన్ (2025), అన్షుల్ కంబోజ్ (2025)లు మాత్రం ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేశారు.అందుకే నో ఛాన్స్!వీరిలో యశస్వి జైస్వాల్ టెస్టు జట్టు ఓపెనర్గా పాతుకుపోగా.. రోహిత్ శర్మ రిటైరైన తర్వాత అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచే జైస్వాల్- రాహుల్ ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్నారు. దీంతో ఓపెనింగ్ బ్యాటర్ అయిన అభిమన్యుకు నిరాశ తప్పడం లేదు.కాగా దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 103 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 7841 పరుగులు సాధించాడు. చివరగా ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులో భారత్-ఎ తరఫున బరిలోకి దిగి 11, 80 పరుగులు సాధించాడు.అభిమన్యుతో పాటు వీరిద్దరు కూడాకాగా ఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. లండన్లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టులో గెలిస్తేనే సిరీస్ను 2-2తో సమం చేయగలుగుతుంది.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్లో అభిమన్యుతో పాటు పేసర్ అర్ష్దీప్ సింగ్కు కూడా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మరోవైపు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లండ్ పర్యటనను ముగించనున్నాడు.చదవండి: Jacob Bethell: ఐదో టెస్టులో కొత్త సూపర్స్టార్ని చూస్తాం: అశ్విన్ -
పద్నాలుగుసార్లు ఫెయిల్!.. ఇప్పటికి రిలీఫ్.. స్టోక్స్కు సైగ చేసి మరీ..
టీమిండియాతో ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ స్టార్ ఓలీ పోప్ (Ollie Pope)నకు ఓ చెత్త రికార్డు ఉండేది. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథిగా వ్యవహరించే ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటికి నాలుగుసార్లు టాస్ ఓడిపోయాడు.రెండింటినీ ఒకేసారి అధిగమించేశాడుఅంతేకాదు.. రివ్యూ (Decision Review System) విషయంలోనూ పద్నాలుగుసార్లు పోప్ విఫలమయ్యాడు. అయితే, ఓవల్ టెస్టు సందర్భంగా ఓలీ పోప్ ఈ రెండింటినీ ఒకేసారి అధిగమించేశాడు. బెన్ స్టోక్స్ (Ben Stokes) భుజం నొప్పి కారణంగా టీమిండియాతో ఐదో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఐదోసారి ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్గా తొలిసారి టాస్ గెలిచిన అతడు.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈసారి ధైర్యంగానే రివ్యూకు ఈ క్రమంలో క్రిస్ వోక్స్ చేతికి కొత్త బంతినివ్వగా.. అతడు ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టాడు. అయితే, మ్యాచ్ మొదలైన కాసేపటికే ఆతిథ్య జట్టుకు గస్ అట్కిన్సన్ మంచి బ్రేక్ ఇచ్చాడు. నాలుగో ఓవర్ రెండో బంతికే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం జైసూను లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనక్కి పంపడానికి నిరాకరించాడు. అట్కిన్సన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించడంతో కెప్టెన్ పోప్ ధైర్యంగానే రివ్యూకు వెళ్లాడు. ఈసారి మాత్రం అతడి అంచనా తప్పలేదు.స్టోక్స్కు సైగ చేసి మరీ..రీప్లేలో బంతి జైసూ ప్యాడ్ను తాకినట్లు స్పష్టంగా తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. ఫలితంగా భారత్ తొలి వికెట్ కోల్పోగా.. పోప్ సంబరాల్లో మునిగిపోయాడు. రెండు చేతులు పైకెత్తి సాధించాను అన్నట్లుగా.. డ్రెసింగ్రూమ్ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న స్టోక్స్కు సైగ చేశాడు. దీంతో స్టోక్స్ సైతం నవ్వులు చిందిస్తూ పోప్ను చూసి సంతోషించాడు.పదిహేనోసారి ఖతమే అనుకున్నాఅయితే, థర్డ్ అంపైర్ నిర్ణయానికి ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆథర్టన్ పోప్ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘ఇది ఇన్సైడ్ ఎడ్జ్. రెండు శబ్దాలు వినిపించాయి. కానీ పోప్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. ఇప్పటికే అతడు పద్నాలుగుసార్లు డీఆర్ఎస్ విషయంలో ఫెయిలయ్యాడు.నాకెందుకో పదిహేనోసారి కూడా ఇలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది’’ అని కామెంట్రీలో చెప్పాడు. అయితే, ఆ తర్వాత అతడు నాలిక్కరుచుకున్నాడు. నిజానికి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ సమయంలో రెండు శబ్దాలు వచ్చాయి. అయితే, బంతి బ్యాట్ను మాత్రం తాకలేదు. తొలుత ఫ్రంట్ ప్యాడ్, ఆ తర్వాత బ్యాక్ ప్యాడ్ను తాకింది.రెండు వికెట్లు డౌన్రీప్లేలో బంతి స్టంప్ను ఎగురగొట్టినట్లు తేలడంతో జైస్వాల్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగక తప్పలేదు. ఇక పదహారో ఓవర్ మొదటి బంతికే టీమిండియా రెండో వికెట్ కూడా కోల్పోయింది. వోక్స్ బౌలింగ్లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (14) బౌల్డ్ అయ్యాడు. వర్షం.. లంచ్ బ్రేక్వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో కాస్త ముందుగానే భోజన విరామం వచ్చింది. అప్పటికి 23 ఓవర్ల ఆట పూర్తికాగా సాయి సుద్శన్ 25, కెప్టెన్ శుబ్మన్ గిల్ 15 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 72/2 (23).చదవండి: అతడి పేరు మర్చిపోయిన గిల్.. వాళ్లిద్దరికి భంగపాటు! ఒక్క మ్యాచ్ ఆడకుండానే..Ollie Pope 🤝 DRS🇮🇳 1️⃣0️⃣-1️⃣ pic.twitter.com/VyX4061MvH— England Cricket (@englandcricket) July 31, 2025 -
ENG VS IND 5th Test: టీమిండియాకు భారీ షాక్లు
భారత్, ఇంగ్లండ్ మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.20 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 56/2గా ఉంది. సాయి సుదర్శన్ (18), శుభ్మన్ గిల్ (6) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
తొలి ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా!.. గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes)అద్భుతమైన డెలివరీలతో వీరిద్దరిని పెవిలియన్కు పంపాడు.మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు డౌన్తొలి ఓవర్లో నాలుగో బంతికి వోక్స్ సంధించిన బంతిని జైసూ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న జో రూట్ (Joe Root) చేతుల్లోకి వెళ్లింది. అయితే, క్యాచ్ పట్టడంలో తడబడిన రూట్.. ఎట్టకేలకు బంతిని జాగ్రత్తగా ఒడిసిపట్టాడు. దీంతో.. నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఇక జైసూ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ను మరుసటి బంతికే వోక్స్ పెవిలియన్కు పంపాడు. వోక్స్ వేసిన బంతిని వదిలేయాలని సాయి భావించగా.. బాల్ అతడు ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే జంప్ అయింది. ఈ క్రమంలో బ్యాట్ బాటమ్ ఎడ్జ్ను తాకిన బంతి.. సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ చేతుల్లో పడింది. దీంతో భారత్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్ఇక అంతకముందు 669 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. భారత్ రెండో ఇన్నింగ్స్లో తొలి ఓవర్ ముగిసేసరికి 311 పరుగుల ఆధిక్యంలో కొనసాగడంతో పాటు.. రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. వరుస బంతుల్లో వికెట్లు తీసిన వోక్స్... కెప్టెన్ శుబ్మన్ గిల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో అతడు హ్యాట్రిక్ మిస్సవగా.. టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఈ క్రమంలో రెండో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సింగిల్, గిల్తో కలిసి సింగిల్ తీయడంతో ఎట్టకేలకు భారత్ పరుగుల ఖాతా తెరిచింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భోజన విరామ సమయానికి మూడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. ఇంగ్లండ్కు 310 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది. గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్ఇందులో ఇప్పటికి మూడు పూర్తి కాగా ఆతిథ్య జట్టు రెండు గెలిచి గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ టీమిండియా పట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. వన్డే, టీ20ల సంగతి ఎలా ఉన్నా టెస్టు జట్టు కోచ్గా పనికిరాడంటూ ట్రోల్ చేస్తున్నారు.కాగా గంభీర్ ప్రధాన కోచ్గా వచ్చిన తర్వాత స్వదేశంలో టెస్టుల్లో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వైఫల్యాన్ని కొనసాగిస్తోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు -
ENG VS IND 4th Test Day 1: కష్టాల్లో భారత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా కష్టాల్లో పడింది. 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) శుభారంభాన్ని అందించి ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. 46 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలకమైన వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సాయి సుదర్శన్ (26), రిషబ్ పంత్ (3) భారత్ను పటిష్ట స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: సచిన్ రికార్డును సమం చేసిన జైస్వాల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 58 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 20వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాటర్గా సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డును సమం చేశాడు. సచిన్, అజహార్, జైస్వాల్ ఇంగ్లండ్పై తలో 16 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్పై అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 47 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (20), కెప్టెన్ శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు దక్కింది. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test Day 1: నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి నిలకడగా ఆడుతుంది. లంచ్ విరామం సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 40, యశస్వి జైస్వాల్ 36 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి సెషన్ అంతా కష్టపడినా ఇంగ్లండ్ బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. లంచ్ సమయానికి బెన్ స్టోక్స్ వారి స్పిన్ అస్త్రం లియామ్ డాసన్ను బరిలోకి దించలేదు. పేసర్లు క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ తలో 8 ఓవర్లు బౌలింగ్ చేశారు. స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలో 5 ఓవర్లు వేశారు. బౌలర్లను ఎంత మార్చినా స్టోక్స్కు ఎలాంటి ఫలితం రాలేదు. రాహుల్, జైస్వాల్ ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నారు. నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test Day 1: ముక్కలైన జైస్వాల్ బ్యాట్..!
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి నిలకడగా ఆడుతుంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 39, యశస్వి జైస్వాల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఈ సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ఎంత కష్టపడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రాహుల్, జైస్వాల్ నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. ఇన్నింగ్స్లో 9వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్ వోక్స్ బౌలింగ్ను ఎదుర్కోబోయి జైస్వాల్ బ్యాట్ రెండు ముక్కలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వోక్స్ సంధించిన బంతి ఏమంత వేగవంతమైంది కాదు. జైస్వాల్ డిఫెన్స్ ఆడినా బ్యాట్ హ్యాండిల్ దగ్గర చీలిపోయింది. దీంతో అతను బ్యాట్ను మార్చకతప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఒత్తిడిలో జైస్వాల్యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో పర్వాలేదనిపించినప్పటికీ చెత్త షాట్ సెలెక్షన్ కారణంగా ఒత్తిడిలో ఉన్నాడు. మూడో టెస్ట్లో అతను ఓ చెత్త ఆడి వికెట్ పారేసుకోవడాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ మ్యాచ్లో భారత్ 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా.. జైస్వాల్ అవసరం లేని షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంతో పాటు జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆ మ్యాచ్లో టీమిండియా కొంపముంచింది. జైస్వాల్ తన సహజ ఆటతీరుతో ఆడి ఉంటే ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండేది. ఈ చెత్త షాట్ కారణంగా జైస్వాల్ మేనేజ్మెంట్తో పాటు అభిమానుల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్లో అతను తొలి మూడు మ్యాచ్ల్లో సెంచరీ సహా 241 పరుగులు చేశాడు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. తొలి, మూడో టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. -
ENG VS IND 3rd Test: స్వల్ప లక్ష్య ఛేదన.. ఆదిలోనే టీమిండియాకు షాక్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించినట్లే సాధించి పట్టు చేజార్చుకునేలా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను తడబాటుతో మొదలుపెట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో జైస్వాల్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లోనూ ఆర్చర్రే జైస్వాల్ను ఔట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ వికెట్ నష్టానికి 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్కు (5) జతగా కరుణ్ నాయర్ క్రీజ్లోకి వచ్చాడు. క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అయినా కరుణ్ రాణిస్తాడేమో చూడాలి. ఒక వేళ ఈ ఇన్నింగ్స్లో కరుణ్ బాగా ఆడకపోతే అతని స్థానం గల్లంతైనట్లే. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 188 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలుపుకు 9 వికెట్లు కావాలి. ఇవాల్టి ఆటలో మరో గంట మిగిలి ఉంది. ఈ గంటలో భారత్ వికెట్ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వికెట్ పోగొట్టుకుంటే మాత్రం ఆతర్వాత వచ్చే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ పిచ్పై 193 పరుగుల లక్ష్యం మరీ అంత చిన్నదేమీ కాదు. భారత బ్యాటర్లు ఎమరపాటుగా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లింఉకోవాల్సి వస్తుంది.దీనికి ముందు భారత్ ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.అంతకుముందు తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
నాలుగేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే భారత్కు షాకిచ్చాడు
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్.. తన వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తాచాటాడు. లార్డ్స్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్కు ఆదిరిపోయే ఆరంభాన్ని ఆర్చర్ అందించాడు.తొలి ఇన్నింగ్స్లో తన వేసిన మొదటి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(13)ను ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఆర్చర్.. మూడో బంతిని జైశ్వాల్కు 145 కి.మీ వేగంతో సీమ్ ఆప్ డెలివరీగా సంధించాడు.ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని జైశ్వాల్ బ్యాక్ ఫుట్ నుంచి లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్లో ఉన్న హ్యారీ బ్రూక్ చేతికి వెళ్లింది. దీంతో 1596 రోజుల తర్వాత అతడి ఖాతాలో తొలి టెస్టు వికెట్ చేరింది.ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఏడాది క్రితం వైట్బాల్ జట్టులోకి వచ్చినప్పటికి.. టెస్టుల్లో మాత్రం ఆడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి.ఇంగ్లండ్ స్కోరంతంటే?తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.Pace is pace man, Jaiswal had no reply to Jofra Archer.He is making a comeback after long 4 years & bowled as if he never gone anywhere. True cricket fans missed 4 years of peak Archer, god please bless him now for next few years❤️🧿pic.twitter.com/aSrOEdqe2B— Rajiv (@Rajiv1841) July 11, 2025 -
రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్తో స్టోక్స్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అసలేమి ఏమి జరిగిందంటే.. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో పేసర్ జోష్ టంగ్ వేసిన బంతి జైస్వాల్ ప్యాడ్ను తాకింది.దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు బౌలర్ కూడా ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. వెంటనే అంపైర్ షర్ఫుద్దౌలా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో జైశ్వాల్ డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా అని? నాన్స్ట్రైకర్లో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్తో చర్చించాడు. కొద్దిసేపు మాట్లాడకున్నాక జైశ్వాల్ చివరకు రివ్యూ కోసం వెళ్లాడు.అయితే జైస్వాల్ రివ్యూ అడగడానికి ముందే 15 సెకన్ల టైమర్ ముగిసినట్లు బిగ్ స్క్రీన్పై కన్పించింది. అయినప్పటికి అంపైర్ మాత్రం రివ్యూకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్టోక్స్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు.మైదానంలో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు సైతం అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో స్టాండ్స్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. అయితే రిప్లేలో మాత్రం బంతి స్టంప్స్ను హిట్చేస్తున్నట్లు తేలడంతో జైశ్వాల్(28) మైదానాన్ని వీడక తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs ENG: ఉత్కంఠ పోరు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమిpic.twitter.com/fJTJeyRZ4n— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 4, 2025Josh Tongue gets Jaiswal trapped in front! ☝️🇮🇳 5️⃣1️⃣-1️⃣ pic.twitter.com/raWBqQXjv4— England Cricket (@englandcricket) July 4, 2025 -
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసిన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 22 బంతుల్లో 28 పరుగులు సాధించాడు.కేఎల్ రాహుల్తో కలిసి 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఈ ముంబైకర్ నెలకొల్పాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2000 పరుగులు మైలు రాయిని అత్యంతవేగంగా అందుకున్న భారత ప్లేయర్గా జైశ్వాల్ నిలిచాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు. భారత ఓపెనర్ కేవలం 21 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.గవాస్కర్ రికార్డు బద్దలు..ఇంతకముందు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) పేరిట ఉండేది. గవాస్కర్ 23 మ్యాచ్లలో ఈ మైల్స్టోన్ను సాధించాడు. గవాస్కర్ ఈ రికార్డును 1976లో సాధించాడు. తాజా మ్యాచ్తో 49 ఏళ్ల గవాస్కర్ ఆల్టైమ్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు. అయితే ఇన్నింగ్స్ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ సరసన జైశ్వాల్ నిలిచాడు. సెహ్వాగ్, ద్రవిడ్ ఈ ఘనతను 40 ఇన్నింగ్స్లలో సాధించగా.. జైస్వాల్ వారిని సమం చేశాడు. అయితే వారిద్దరికి ఈ ఫీట్ను అందుకోవడానికి 25 మ్యాచ్లు అవసరమయ్యాయి. ఓవరాల్గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్(15 మ్యాచ్లు) అగ్రస్ధానంలో ఉండగా.. జార్జ్ హెడ్లీ (17), హెర్బర్ట్ సట్క్లిఫ్ (22),మైఖేల్ హస్సీ (20), మార్నస్ లబుషేన్(20) ఉన్నారు.ఆరేసిన సిరాజ్..ఇక ఈ ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (184 నాటౌట్; 207 బంతుల్లో 21×4, 4×6), హ్యారీ బ్రూక్ (158; 234 బంతుల్లో 17×4, 1×6) అద్బుతమైన సెంచరీలతో మెరిశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 64/1తో నిలిచింది. రాహుల్ (28), కరుణ్ నాయర్ (7) క్రీజులో ఉన్నారు.చదవండి: బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు! -
ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, భారత్ రెండో టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై విమర్శలు వస్తున్నాయి.మూడు మార్పులుబర్మింగ్హామ్లో బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూలను జట్టు నుంచి తప్పించింది.వీరి స్థానాల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్కు కాస్త ఎక్కువగానే సహకరిస్తుందనే విశ్లేషణల నడుమ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను టీమిండియా పక్కనపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.విమర్శల వర్షంఅంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేసేందుకు ఆల్రౌండర్లు నితీశ్, వాషీలను తీసుకున్నామని.. ఆఖర్లో కుల్దీప్ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ టీమిండియా నాయకత్వ బృందంపై విమర్శలు గుప్పించారు.ఎనిమిది రోజుల విరామం తర్వాత కూడా బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబడితే.. కుల్దీప్ను ఎలా పక్కనపెడతారంటూ గావస్కర్, గంగూలీ ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్లో తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదంటూ విమర్శించారు.ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్అయితే, బుధవారం నాటి తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క మాటతో ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆట పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లేదు.. తుదిజట్టు ఎంపికలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’’ అంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగానే మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్గా, కెప్టెన్గా అతడు అద్బుతం. జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేము అనుకున్న పని పూర్తి చేస్తాం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (2) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకం(87) సాధించాడు. ఇక కరుణ్ నాయర్ (31) మరోసారి నిరాశపరచగా.. రిషభ్ పంత్ 25 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గిల్ శతక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా అతడికి అండగా నిలిచాడు. బుధవారం ఆట పూర్తయ్యేసరికి గిల్ 114, జడ్డూ 41 పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర.. 51 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లండ్ టూర్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను యశస్వి ఉతికారేశాడు.తన మెరుపు బ్యాటింగ్తో భారత్కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.51 ఏళ్ల రికార్డు బద్దలుఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్గా జైశ్వాల్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది. సుదీర్ నాయక్ 1974లో ఇదే మైదానంలో 77 పరుగులు చేశారు.ఇప్పుడు తాజా మ్యాచ్తో నాయక్ పేరిట ఉన్న 51 ఏళ్ల రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. జైశ్వాల్, సుదీర్ తర్వాతి స్ధానాల్లో సునీల్ గవాస్కర్ (68), చేతేశ్వర్ పుజారా (66), చేతన్ చౌహాన్ (56) వంటి భారత ఓపెనర్లు ఉన్నారు.సునీల్ గవాస్కర్ రికార్డుపై కన్ను..భారత టెస్టు జట్టులో యశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో రాణిస్తూ వస్తున్నాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్ల్లోనే యశస్వి.. ఐదు సెంచరీలు, పన్నెండు అర్ధ సెంచరీలతో సహా 1,990 పరుగులు చేశాడు.ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్లో అతడు 10 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో అత్యంతవేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు.చదవండి: SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు -
ENG VS IND 2nd Test Day 1: జైస్వాల్ సెంచరీ మిస్.. పోరాడుతున్న గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 86, రవీంద్ర జడేజా 30 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 76 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 270/5గా ఉంది. -
ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. ఈ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. 11వ హాఫ్ సెంచరీఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించాడు.పాపం జైస్వాల్ఈ దశలో జైస్వాల్ ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ తీసిన ఆనందంలో స్టోక్స్ సంబరాలు చేసుకోగా.. జైస్వాల్ క్రీజ్లో అలాగే ఉండిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో జైస్వాల్ చాలా సార్లు కట్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరికి అదే షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. జైస్వాల్ సెంచరీకి ముందు ఔట్ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశపడ్డారు. పాపం జైస్వాల్ అంటూ సోషల్మీడియా వేదికగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 170/3గా ఉంది. శుభ్మన్ గిల్ 38, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. -
జైస్వాల్పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే!
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫీల్డింగ్ వైఫల్యం. కీలక సమయాల్లో కీలక క్యాచ్లు నేలపాలు చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాదాపు ఆరుసార్లు మనోళ్లు ‘లైఫ్’ ఇచ్చారు. అందుకు బదులుగా ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించారు.ఇక ఫీల్డర్ల తప్పిదాలు గమనిస్తే ప్రధాన దోషిగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరు చెప్పవచ్చు. ఆరింటిలో నాలుగు క్యాచ్లు అతడే జారవిడిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ వీరుడు, గెలుపునకు పునాది వేసిన బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్ను జైసూ వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది.జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై గంభీర్ ఆగ్రహంఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించిన గౌతీ.. ఈ సందర్భంగా గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఫీల్డింగ్ విషయంలో జైసూని డిమోట్ చేయాలని నిర్ణయించినట్లు రెవ్స్పోర్ట్స్ పేర్కొంది.టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సోమవారం నాటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని దాదాపు ధ్రువీకరించింది. ‘‘క్యాచింగ్ విభాగం మరింత దృఢంగా మారాలి. ఇంగ్లండ్లో కనీసం నాలుగు ప్రధాన క్యాచర్లు ఒక్కోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.విరామం అనివార్యంయశస్వి కూడా మంచి క్యాచర్. ఇక ఇద్దరు స్పిన్నర్లను ఆడించినప్పుడు షార్ట్ లెగ్ ఫీల్డింగ్ స్థానం మరింత కీలకమవుతుందని చెప్తారు. అందుకే అక్కడ మేము ఒకరి కంటే ఎక్కువ మందిని సెట్ చేయాలని భావిస్తున్నాం.ఏదేమైనా యశస్వికి గల్లీ క్యాచ్ పాయింట్ నుంచి కాస్త విరామం ఇవ్వడం అవసరమే. ప్రస్తుతం అతడి ఫీల్డింగ్ తీరు బాగాలేదు. అయినా సరే అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఈ బ్రేక్ ఇవ్వాలి’’ అంటూ స్లిప్ క్యాచింగ్ రోల్ నుంచి జైసూను తప్పిస్తామని డష్కాటే చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ (101)తో అదరగొట్టాడు.కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు (జూలై 2-6) బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. భారత తుది జట్టులోకి తమిళనాడు కుర్రాడు? -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం తమ జోరును ఎడ్జ్బాస్టన్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టెస్టులో జైశ్వాల్ 97 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్గా రికార్డులెక్కుతాడు. జైశ్వాల్ ఇప్పటివరకు 20 టెస్టుల్లో 52.86 సగటుతో 1,903 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రికార్డు భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు. గవాస్కర్ తర్వాతి స్ధానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. గంభీర్ ఈ ఫీట్ను తన 24వ టెస్టు మ్యాచ్లో అందుకున్నాడుటెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు👉సునీల్ గవాస్కర్ - 23 మ్యాచ్లు👉గౌతమ్ గంభీర్ - 24👉రాహుల్ ద్రవిడ్ - 25👉వీరేంద్ర సెహ్వాగ్ - 25👉విజయ్ హజారే - 26👉చెతేశ్వర్ పుజారా – 26👉సౌరవ్ గంగూలీ - 27👉శిఖర్ ధావన్ - 28👉పటౌడీ - 28 -
ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
Jaiswal: నీకసలు బుద్ధుందా? రోహిత్ ఉంటే ఒక్కటి ఇచ్చేవాడు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్తో జట్టు ఓటమికి కారణమైందే గాకుండా.. డాన్సులు వేస్తావా? అంటూ మండిపడుతున్నారు. కాగా ఐదు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ (India vs England)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు మరీ చెత్తగా ఫీల్డింగ్ చేశారు.నాలుగు క్యాచ్లను జారవిడిచిన జైసూమొత్తంగా ఐదు రోజుల ఆటలో దాదాపు ఎనిమిది క్యాచ్లు డ్రాప్ చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించారు. ఇందులో నాలుగు క్యాచ్లను యశస్వి జైస్వాల్ జారవిడిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కీలక సమయాల్లో బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేసిన జైసూ.. ఆఖరి రోజు ఆటలోనూ బెన్ డకెట్ (149) క్యాచ్ విడిచిపెట్టేశాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో డకెట్.. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు క్యాచ్ ఇవ్వగా.. జైసూ దానిని జారవిడిచాడు. ఆ ర్వాత డకెట్ భారీ సెంచరీ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పటికే జైస్వాల్పై అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డాన్స్ చేసిన జైసూ.. అభిమానులు ఫైర్ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న వేళ.. యశస్వి జైస్వాల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చిన్నగా స్టెప్పులేస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ అభిమానుల ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తుండగా.. వారి ముందు జైసూ నవ్వుతూ కాలుకదిపాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘నీకసలు బుద్ధి ఉందా?.. ఏకంగా నాలుగు క్యాచ్లు మిస్ చేశావు. ప్రత్యర్థి జట్టు గెలుపునకు పరోక్షంగా కారణమయ్యావు. అయినా.. ఏమాత్రం బాధ లేకుండా డాన్స్ చేస్తున్నావా?.. ఇప్పుడు గనుక కెప్టెన్గా రోహిత్ శర్మ మైదానంలో ఉంటే.. చెంప మీద ఒక్కటి ఇచ్చేవాడు’’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.మరికొందరేమో.. ‘‘విరాట్ కోహ్లిని కాపీ కొట్టాలని చూస్తున్నావేమో.. నువ్వెప్పటికీ కింగ్వి కాలేవు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, జైసూ అభిమానులు మాత్రం అతడికి అండగా నిలుస్తున్నారు. బ్యాటర్గా తన వంతు పూర్తి చేసిన ఈ యువ ఆటగాడి పట్ల అంత ద్వేషం పనికిరాదని.. ఇంగ్లండ్ గడ్డ మీద తన తొలి మ్యాచ్ను అతడు ఆస్వాదించడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.గిల్కు చేదు అనుభవంకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో జైస్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఇక ఈ మ్యాచ్తో భారత టెస్టు జట్టు సారథిగా ప్రస్థానం ఆరంభించిన శుబ్మన్ గిల్కు.. ఓటమి రూపంలో తొలి ప్రయత్నంలోనే భంగపాటు ఎదురైంది.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్Bro Jaiswal dancing happily after dropping 7 catches in a single match.Helped England to win single-handedly.Goal achieved.#INDvsENG pic.twitter.com/EqjsxuJ5vO— Villager Anuj Tomar (@Da___Engineer) June 24, 2025 -
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) శతక్కొట్టాడు. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్లో.. 122 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా 2010 తర్వాత ఓ టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి ఓపెనింగ్ బ్యాటర్గా నిలిచాడు.చివరగా 2010లో బంగ్లాదేశ్తో మీర్పూర్ టెస్టులో అలిస్టర్ కుక్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే.. బెన్ డకెట్కు టెస్టుల్లో ఇది ఆరో శతకం. నిజానికి.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే డకెట్ సెంచరీ మార్కు అందుకున్నాడని చెప్పవచ్చు.జైసూ తప్పిదం..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 39వ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో ప్రయత్నంలో షార్ట్ బంతిని సంధించంగా.. దానిని ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన డకెట్.. బంతిని గాల్లోకి లేపాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఉన్న వేళ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన జైస్వాల్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు.సిరాజ్ ఆగ్రహంఅప్పటికి డకెట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని అవుట్ చేసే అవకాశాన్ని జైసూ జారవిడవడంతో సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. గాల్లోకి పంచ్లు విసురుతూ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరోవైపు.. భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా అసహనానికి లోనయ్యాడు.కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో జైస్వాల్ క్యాచ్లు డ్రాప్ చేయడం ఇది నాలుగోసారి. తొలి ఇన్నింగ్స్లో మూడుసార్లు ఇదే తరహాలో జైసూ కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నారు. క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు కదా! కానీ జైసూ ఇలా కీలక సమయాల్లో పదే పదే క్యాచ్లు మిస్ చేయడం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి! ఒకవేళ వీటి కారణంగా మ్యాచ్ ఫలితం గనుక తారుమారైతే జైస్వాల్పై విమర్శల జడి కురవడం ఖాయం.వర్షం వల్ల ఆగిన మ్యాచ్ఇక బ్యాటర్గా మాత్రం ఈ యువ ఓపెనర్ లీడ్స్ టెస్టులో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో శతకం (101) బాదిన జైసూ.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది. మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో 40.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ నిలిచిపోయింది. అప్పటికి ఓపెనర్లు డకెట్ 105, జాక్ క్రాలే 59 పరుగులతో ఉండగా.. ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. విజయానికి భారత్ ఇంకా పది వికెట్ల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు 190 పరుగులు అవసరం.UPDATE: Ind vs Eng 1st Test: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమిచదవండి: గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం! -
అడ్డుగోడలా..: జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. లీడ్స్ వేదికగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్లో ఈ పేస్ గుర్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా స్టోక్స్ బృందాన్ని 465 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి బౌలింగ్ విభాగం భారమంతా తన భుజాలపైనే వేసుకుని ముందుకు నడిపించాడు.అయితే, మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు అంతగా సహకారం లభించలేదు. మరోవైపు.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన దాదాపు ఐదు క్యాచ్లు నేలపాలయ్యాయి. శనివారం నాటి రెండో రోజు ఆటలో మూడు.. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో రెండు క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.క్యాచ్లు నేలపాలు చేసిన జైసూ, జడ్డూముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (62), వన్డౌన్ బ్యాటర్, శతక వీరుడు ఓలీ పోప్ (106), మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ (99) ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశాడు. మరోవైపు.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా బుమ్రా బౌలింగ్లో డకెట్ క్యాచ్ను జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. బ్రూక్ను బుమ్రా డకౌట్ చేశాడని భావించగా.. అది నో బాల్గా తేలడం.. ఆ తర్వాత బ్రూక్ శతకానికి సమీపించడం జరిగాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసిస్తూనే.. భారత ఫీల్డర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!‘‘బుమ్రాకు శుభాకాంక్షలు!.. ఒక నో బాల్.. మూడు జారవిడిచిన క్యాచ్లు నీకూ.. తొమ్మిది వికెట్లకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి’’ అని పేర్కొన్నాడు.జైసూ, జడ్డూ ఫీల్డింగ్ తప్పిదాలతో, బ్రుక్కు వేసిన బంతి నో బాల్గా తేలనట్లయితే బుమ్రా ఖాతాలో మరో నాలుగు వికెట్లు చేరేవని.. తద్వారా అతడు తొమ్మిది వికెట్లు తీసేవాడని సచిన్ టెండుల్కర్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఎవరి వికెట్లు తీశాడంటే?కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 24.4 ఓవర్ల బౌలింగ్లో 83 పరుగులు (3.40 ఎకానమీ) ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో బుమ్రా.. జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (62), జో రూట్ (28), క్రిస్ వోక్స్(38), జోష్ టంగ్ (11) వికెట్లు పడగొట్టాడు. ఇందులో డకెట్తో పాటు.. వోక్స్, టంగ్లను బుమ్రా బౌల్డ్ చేశాడు.ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ను గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్ నుంచి దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా- ఇంగ్లండ్కు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్తోనే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు (జూన్ 20-24)🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్ (జైస్వాల్ (101), గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాలు)🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (ఓలీ పోప్ (106) శతకం)🏏ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి: టీమిండియా స్కోరు: 90/2 (23.5).. 96 పరుగుల ఆధిక్యం.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ Congratulations Bumrah!A no-ball and 3 missed chances stood between you and 𝙣𝙖𝙪 wickets. 🤪 pic.twitter.com/09rJNI9KP0— Sachin Tendulkar (@sachin_rt) June 22, 2025 -
Ind vs Eng: వర్షం వల్ల ముందే ముగిసిన ఆట.. పూర్తి వివరాలు
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.భారత తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మెడల్స్ ఏమీ లేవు.. ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తారా! గవాస్కర్ ఫైర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఇంగ్లీష్ జట్టు ధీటైన జవాబు ఇస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్(0) ఉన్నారు. స్టోక్స్ సేన టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది.బుమ్రా ఒక్కడే భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేశాడు. సిరాజ్, జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ రెండో రోజు ఆటలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత కూడా తన పేస్ బౌలింగ్తో నిప్పులు చెరిగాడు. అతడిని ఎదుర్కొవడానికి ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కానీ మిగితా ముగ్గురు పేసర్లు వన్డేను తలపిస్తూ పరుగులు సమర్పించుకున్నారు.ఆ మూడు క్యాచ్లు పట్టుంటే..అయితే ఈమ్యాచ్లో బుమ్రాకు ఫీల్డర్ల నుంచి మద్దతు లభించి ఉంటే టీమిండియా కచ్చితంగా పైచేయి సాధించి ఉండేది. అతడి బౌలింగ్లో భారత ఫీల్డర్లు మొత్తం మూడు క్యాచ్లను జారవిడిచారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు.డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు. దీంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో గిల్ సేన చెత్త ఫీల్డింగ్పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు."గత కొంత కాలంగా అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి డ్రెస్సింగ్ రూమ్లో అవార్డు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఎవరికి ఎటువంటి అవార్డు ఇవ్వడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారత ఫీల్డర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు.యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫీల్డర్, కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. రెండు క్యాచ్లను జారవిడిచాడు. నిజంగా ఇది నన్ను తీవ్ర నిరాశపరిచిందని" కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్ -
ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్.. గంగూలీ రిప్లై ఇదే
ఇంగ్లండ్ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గిల్ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్లో శుబ్మన్ గిల్ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్, గిల్, పంత్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్, శుబ్మన్ గిల్లకు శుభాకాంక్షలు. రిషభ్ పంత్ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.ఈరోజు టీమిండియా బ్యాటింగ్ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.ఈరోజు.. యశస్వి, శుబ్మన్ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్ చాంప్.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్ బాగుంది.. పంత్.. కరుణ్ కూడా శతకాలు బాదుతారేమో!అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్ స్వభావానికి ఇప్పటి వికెట్కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్ టెండుల్కర్ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్ సంజయ్ బంగర్ 68 రన్స్ రాబట్టాడు.కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. రోహిత్ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది.Tendulkar at Leeds, 2002pic.twitter.com/o7MlA5Zn3L— Cricketopia (@CricketopiaCom) June 20, 2025 చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియాతో తొలి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్కు భంగపాటే ఎదురైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బౌలింగ్ను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (Kl Rahul- 42) రాణించగా.. యశస్వి జైస్వాల్ శతకం (101)తో చెలరేగాడు. ఇక ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో కదం తొక్కాడు.అదే విధంగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా అర్ధ శతకంతో మెరిశాడు. వెరసి శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులు సాధించింది. తద్వారా ఆతిథ్య జట్టుపై పర్యాటక టీమ్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది.కామన్ సెన్స్ ఉన్నవాళ్లు ఇలా చేయరుఈ నేపథ్యంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ ఆథర్టన్ కూడా ఈ విషయంలో స్టోక్స్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘టాస్ గెలిచిన కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా అనిపించింది. గత ఆరు మ్యాచ్లలో తొలుత బౌలింగ్ చేసిన జట్టే విజయం సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్లు.. క్రికెట్ బుర్ర వాడేవారు ఎవరైనా ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు.ఎందుకంటే.. ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన ఎండ ఉంది. రానున్న రెండు రోజుల్లో 30 డిగ్రీలకు పైగానే ఉంటుంది. స్టోక్స్ కేవలం గత రికార్డు ఆధారంగానే తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటాడు’’ అని ఆథర్టన్ స్టోక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించగల సత్తా ఇంగ్లండ్కు ఉందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.ఇంగ్లండ్ పశ్చాత్తాపం!కాగా ఇంగ్లండ్ మరో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా టాస్ విషయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్కు ఏమాత్రం అవకాశం లేని వాతావరణం, పెద్దగా అనుభవం లేని బౌలర్లు... ఇలాంటి స్థితిలో టాస్ గెలిచి స్టోక్స్ బౌలింగ్ ఎంచుకునే సాహసం చేయడంతో ఇంగ్లండ్ పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి తలెత్తింది.నిజమే... హెడింగ్లీ మైదానంలో గత ఆరు టెస్టుల్లో ముందుగా బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ శుక్రవారం పరిస్థితి వాటికి భిన్నం. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్కు అర్థమై ఉంటుంది. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లింది.ఇంగ్లండ్ చేజారిన అవకాశాలు.. పెనాల్టీ పరుగులు👉45 పరుగుల వద్ద జైస్వాల్కు అదృష్టం కలిసొచ్చింది. కార్స్ వేసిన యార్కర్ను అతను చివరి నిమిషంలో నిలువరించగలిగాడు. ఇంగ్లండ్ అప్పీల్కు సిద్ధమైన తరుణంలో అంపైర్ దానిని ‘నోబాల్’గా ప్రకటించాడు. ఆ తర్వాత రీప్లే చూస్తే బంతి ముందుగా అతని ప్యాడ్కు తాకినట్లు తేలింది. ‘నోబాల్’ కాకపోతే అది కచ్చితంగా అవుట్గా తేలేది. 👉గిల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు కార్స్ బౌలింగ్లో కష్టసాధ్యమైన సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే గిల్ చాలా దూరంలోనే ఉన్నా... పోప్ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఓవర్త్రో బౌండరీని చేరడంతో మరో నాలుగు పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. 👉టీ విరామానికి ముందు స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో స్లిప్ ఫీల్డర్ రూట్ బంతిని ఆపే క్రమంలో దానిని పక్కకు తోశాడు. అది అక్కడే పెట్టిన వికెట్ కీపర్ హెల్మెట్ను తాకడంతో భారత్కు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా లభించాయి. ఈ గందరగోళంలో అంపైర్ లెక్క తప్పడంతో ఈ ఓవర్లో స్టోక్స్ 7 బంతులు వేశాడు. చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
వయసు జస్ట్ 23 ఏళ్లు.. అయితేనేం.. టీమిండియా ఓపెనర్గా అతడు కనబరిచే పరిణితి మాత్రం అమోఘం.. టెస్టుల్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు.. రెండు ద్విశతకాలు.. తాజాగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు అతడు.. అంతేకాదు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనర్గా నిలిచాడు.. అవును.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswak) గురించే ఈ ఉపోద్ఘాతం.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ (India vs England)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో జైసూ శతక్కొట్టాడు. ఆది నుంచే పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మూడో వికెట్కు కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి 129 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు.తొందరపడితే నన్ను వారించు..అయితే, గిల్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా జైసూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తొందరపడితే తనను వారించాలంటూ జైసూ కెప్టెన్కు చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. భారత్ ఇన్నింగ్స్లో 38 వ ఓవర్లో క్రిస్ వోక్స్ బంతితో రంగంలోకి దిగాడు.అతడి బౌలింగ్లో తొలి బంతికి బౌండరీ బాదిన జైస్వాల్.. తదుపరి బాల్కు సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. షాట్ బాదగానే వెంటనే పరుగు కోసం వెళ్లాడు. అయితే, మరో ఎండ్లో ఉన్న గిల్ మాత్రం రన్కు నిరాకరించాడు. దీంతో కాస్త అసహనానికి గురైనప్పటికి... ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న జైస్వాల్ వెంటనే క్రీజులోకి పరిగెత్తాడు. తద్వారా ఇంగ్లండ్కు రనౌట్ చేసే అవకాశం చేజారింది.నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!ఈ ఘటన తర్వాత జైస్వాల్ గిల్తో.. ‘‘రిస్కీ సింగిల్స్ వద్దని నాకు చెబుతూనే ఉండండి ప్లీజ్.. బంతిని బాదగానే వెంటనే పరిగెత్తడం నాకు అలవాటై పోయింది’’ అని పేర్కొన్నాడు. కాగా జైసూ బాదిన బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ విషయాన్ని గమనించని జైసూ పరుగుకు రాగా.. ‘‘లేదు లేదు బంతి ఇక్కడే ఉంది’’ అంటూ గిల్ చెప్పాడు. గిల్ నో చెప్పిన కారణంగా ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కాగా అప్పటికి జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గిల్తో కలిసి చక్కటి సమన్వయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 101 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 127 పరుగులతో.. రిషభ్ పంత్ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?When #YashasviJaiswal says “Run!” and #ShubmanGill is still deciding if it’s a good idea! 😂Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/UJDlpPlpkH— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. బ్రాడ్మన్నే అధిగమించాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (Don Bradman)ని జైసూ అధిగమించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) తొలి టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.భారత్ బ్యాటింగ్ అదుర్స్.. జైసూ, గిల్ సెంచరీలుఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఆద్యంతం ఆకట్టుకుని తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో కదం తొక్కాడు.మరో సెంచరీ వీరుడు, కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న జైసూ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేసి.. స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.బ్రాడ్మన్ రికార్డు బద్దలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద జైసూకు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్గా పది ఇన్నింగ్స్లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్మన్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ మీద టెస్టుల్లో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి గిల్ 127 పరుగులతో.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక టెస్టు యావరేజ్ కలిగిన బ్యాటర్లు🏏యశస్వి జైస్వాల్- 90.33🏏డాన్ బ్రాడ్మన్- 89.78🏏స్టీవీ డెంప్స్టర్- 88.42🏏లారెన్స్ రోవ్- 74.20🏏జార్స్ హెడ్లీ- 71.23 చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!𝐓𝐎𝐍 🆙𝐓𝐀𝐈𝐋𝐒 🆙Yashasvi Jaiswal leads Team India from the front. #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #DhaakadIndia #TeamIndia | @ybj_19 pic.twitter.com/QX4kdlTBu4— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2025 -
IND Vs ENG: ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు.. పట్టుబిగించిన ‘గిల్’ సేన (ఫొటోలు)
-
Ind vs Eng 1st Day 1: బ్యాటింగ్తో అదరగొట్టారు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. సీనియర్లు తప్పుకున్నా... జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సరైనోళ్లమని యువ ఆటగాళ్లు నిరూపించారు. అసాధారణ బ్యాటింగ్తో ముందుగా యశస్వి జైస్వాల్, ఆపై కెప్టెన్గా తొలి పరీక్షలో శుబ్మన్ గిల్ సెంచరీలు బాది సత్తా చాటగా, రిషభ్ పంత్ తన విలువను ప్రదర్శించాడు. హెడింగ్లీ పిచ్పై ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లందరినీ ఒక ఆటాడుకున్న మన బ్యాటర్లు భారీ స్కోరుతో మొదటి రోజును గొప్పగా ముగించారు. లీడ్స్: ఇంగ్లండ్తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ భారీ స్కోరుతో చెలరేగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెపె్టన్ శుబ్మన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగగా, వైస్ కెపె్టన్ రిషభ్ పంత్ (102 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. టెస్టుల్లో జైస్వాల్కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్కు ఆరో శతకం. జైస్వాల్, గిల్ మూడో వికెట్కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్, పంత్ నాలుగో వికెట్కు అభేద్యంగా 138 పరుగులు జత చేశారు. సిరీస్లో శుభారంభం... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 42; 8 ఫోర్లు) జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా బౌండరీలు బాదారు. ఒకదశలో అసహనంతో జైస్వాల్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ ఏమాత్రం అవకాశం లేకపోయినా... ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరి విఫలమైంది. తొలి గంటలో భారత్ 9 ఫోర్లతో 44 పరుగులు చేసింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్కు ఊరట దక్కింది. ఆరు బంతుల వ్యవధిలో రాహుల్, తొలి టెస్టు ఆడుతున్న సుదర్శన్ (0) అవుట్ కాగా...లంచ్ సమయానికి జట్టు స్కోరు 92/2కు చేరింది. భారీ భాగస్వామ్యం... విరామానంతరం 96 బంతుల్లో జైస్వాల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో జైస్వాల్, గిల్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆడుకున్నారు. ఓవర్కు దాదాపు ఐదు పరుగుల రన్రేట్తో పరుగులు రాబట్టి ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించారు. వోక్స్ వేసిన రెండు ఓవర్లలో గిల్, జైస్వాల్ చెరో 3 ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించారు. 56 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్ కార్స్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 99కు చేరుకున్నాడు. తర్వాతి బంతిని సింగిల్ తీసిన అతను 144 బంతుల్లో సెంచరీ మార్క్ను చేరుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరడానికి జైస్వాల్ 48 బంతులే (8 ఫోర్లు, 1 సిక్స్తో) తీసుకోవడం విశేషం. పంత్ జోరు... టీ తర్వాత రెండో ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్, పంత్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా...గిల్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. బషీర్ ఓవర్లో పంత్ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు 300కు చేరుకోగా... టంగ్ ఓవర్లో కవర్స్ దిశగా ఆడి గిల్ 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ హాఫ్ సెంచరీ (91 బంతుల్లో) పూర్తయింది. ఎంత ప్రయత్నించినా ...పేలవ బౌలింగ్తో ఇంగ్లండ్ ఈ జోడీని విడదీయలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 127; పంత్ (బ్యాటింగ్) 65; ఎక్స్ట్రాలు 24; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221. బౌలింగ్: వోక్స్ 19–2–89–0, కార్స్ 16–5–70–1, టంగ్ 16–0–75–0, స్టోక్స్ 13–1–43–2, బషీర్ 21–4–66–0. -
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(101), కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో గిల్తో పాటు రిషబ్ పంత్(65) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్ ఓ వికెట్ సాధించాడు. -
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఒక్కడిగా రికార్డు
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన అద్బుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.144 బంతుల్లోనే జైశ్వాల్ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించాడు.ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఈ క్రమంలో జైశ్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్లోని లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ టీమిండియా ఓపెనర్ ఈ ఫీట్ సాధించలేకపోయాడు. 1967లో భారత క్రికెట్ దిగ్గజం ఫరూక్ ఇంజనీర్ చేసిన 87 పరుగులే.. టీమిండియా ఓపెనర్ లీడ్స్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పుడు 58 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు👉ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండు దేశాల్లోనూ తన కెరీర్లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా జైశ్వాల్నిలిచాడు. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైశ్వాల్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ గడ్డపై జైశ్వాల్కే అదే తొలిటెస్టు మ్యాచ్.👉ఇంగ్లండ్పై గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025చదవండి: ENG vs IND: ఇషాన్ కిషన్కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే? -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 144 బంతుల్లో తన సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు.కేఎల్ రాహుల్తో కలిసి మొదటి వికెట్కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యశస్వి.. ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశాడు . జైశ్వాల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. తన సెంచరీ మార్క్ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఐదో ఆటగాడిగా.కాగా జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లండ్పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025టీబ్రేక్కు భారత స్కోరంతంటే?ఇక తొలి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(100), గిల్(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?𝙔𝙚𝙝 𝙨𝙞𝙠𝙝𝙖𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣! 🔥A young star rises in England with a knock full of class. @ybj_19's first century on English soil shines bright. 🤩Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/SizxLx76AB— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్పై భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంకా ‘కింగ్’ను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేయడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..?!భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. టీమిండియాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు.రాహుల్, జైస్వాల్ జోరుఈ క్రమంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ కలిసి భారత్కు శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లీడ్స్లో టీమిండియా ఓపెనింగ్ జంటకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, జైస్వాల్లను కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతులను వదిలేసి మంచి పనిచేశారంటూ కొనియాడాడు. అదే సమయంలో పరోక్షంగా కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు.వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!‘‘ఓ మాజీ బ్యాటర్.. పదే పదే ఇలాంటి బంతుల వెనుక పడి.. తనను తాను చిక్కుల్లో పడేసుకునేవాడు’’ అంటూ కోహ్లి పేరు ప్రస్తావించకుండానే మంజ్రేకర్ పరోక్షంగా అతడిని విమర్శించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు మంజ్రేకర్పై మండిపడుతున్నారు.‘‘బాగా ఆడినందుకు రాహుల్- జైస్వాల్లను మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పటికీ కోహ్లి పేరును వాడుకోవడం ఎందుకు? అతడు రిటైర్ అయిపోయాడు. ఇప్పటికైనా అతడిని వదిలేయండి. మంజ్రేకర్ సాబ్.. మీ పేరు నలుగురి నోళ్లలో నానేందుకు ఇలా చేయడం సరికాదు’’ అని చురకలు అంటిస్తున్నారు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను టీమిండియా ఇంగ్లండ్తో పర్యటనతో ఆరంభించింది. ఈ సిరీస్కు ముందే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో శుబ్మన్ గిల్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు.ఇక కోహ్లి, రోహిత్ చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టులు ఆడారు. నాటి టూర్లో కోహ్లి పదే పదే అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతులను ఆడే క్రమంలో అత్యధికసార్లు వికెట్ పారేసుకున్న విషయం తెలిసిందే.జైసూ హాఫ్ సెంచరీ..మ్యాచ్ విషయానికొస్తే.. భోజన విరామ సమయానికి ముందే కేఎల్ రాహుల్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అరంగేట్ర ఆటగాడు, మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 35 ఓవర్లు ముగిసే సరికి మరో ఓపెనర్ జైస్వాల్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. కెప్టెన్ గిల్ 36 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. జట్టు స్కోరు: 135/2 (35) . చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు! -
డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం
9 జట్లతో రెండేళ్ల పాటు సాగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ మే 14న ముగిసింది. ఈ సైకిల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్స్కు చేరాయి. లార్డ్స్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి విజేతగా అవతరించింది. తద్వారా సౌతాఫ్రికా 27 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ సాధించింది. ఈ టైటిల్ సౌతాఫ్రికాకు తొలి ప్రపంచ టైటిల్. 1998లో ఆ జట్టు గ్రేమ్ స్మిత్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. తాజాగా ముగిసిన సైకిల్లో సౌతాఫ్రికా విజేతగా ఆవిర్భవించడంతో డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ముగిసిన నేపథ్యంలో ఈ ఎడిషన్ అత్యుత్తమ జట్టు ఇదే అంటూ సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎడిషన్లో అత్యుత్తమ ప్రదర్శలు చేసిన ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్కు కెప్టెన్గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా, ఆసీస్ నుంచి తలో ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.ఈ జట్టు ఓపెనర్లుగా టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ ఎంపికయ్యారు. వన్డౌన్లో రూట్, నాలుగో స్థానంలో విలియమ్సన్, ఐదో ప్లేస్లో కమిందు మెండిస్ అవకాశాలు దక్కించుకున్నారు. వికెట్కీపర్గా అలెక్స్ క్యారీ, ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, పేసర్లుగా కమిన్స్, రబాడ, బుమ్రా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లయోన్ ఎంపికయ్యారు. ఛాంపియన్ జట్టు సౌతాఫ్రికా నుంచి ఈ జట్టుకు కేవలం ఒక్కరు మాత్రమే (రబాడ) ఎంపికయ్యారు. ఫాబ్ ఫోర్లో ముఖ్యుడైన విరాట్ కోహ్లి ఇటీవలే టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడు స్టీవ్ స్మిత్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో చోటు దక్కని మరికొంత మంది అర్హులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన హ్యారీ బ్రూక్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హులే. డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్..యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, కేన్ విలియమ్సన్, కమిందు మెండిస్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లయోన్ -
రచిన్, బ్రూక్.. కొత్త ఫాబ్ ఫోర్ వీళ్లే..!
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ ఫాబ్ ఫోర్గా (అత్యుత్తమమైన నలుగురు) కీర్తించబడుతున్నారు. అయితే వీరిలో విరాట్ కోహ్లి టెస్ట్లకు, టీ20లకు.. స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫాబ్ ఫోర్కు బీటలు వారినట్లైంది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణిస్తుంటేనే ఫాబ్ ఫోర్ బిరుదుకు సార్దకత ఉంటుంది. అలాంటిది విరాట్, స్టీవ్ స్మిత్ ఆయా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై వీరిని ఫాబ్ ఫోర్లో సభ్యులుగా పరిగణించలేము. మిగిలిన ఇద్దరిలో రూట్, విలియమ్సన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వీరికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్ట్ల్లో మాత్రమే యాక్టివ్గా ఉన్నారు.ఫాబ్ ఫోర్కు బీటలు వారిన నేపథ్యంలో కొత్త ఫాబ్ ఫోర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. విశ్లేషకులు, మాజీలు కొత్త ఫాబ్ ఫోర్గా కీర్తించబడేందుకు పలానా ఆటగాళ్లు అర్హులంటూ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడ కేన్ విలియమ్సన్ కూడా కొత్త ఫాబ్ ఫోర్ను ప్రకటించాడు. సొంత దేశ ఆటగాడు రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు కొత్త ఫాబ్ ఫోర్గా కీర్తించబడే అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్కు కూడా ఫాబ్ ఫోర్లో భాగమయ్యే అర్హతలున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా కేన్ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్ట్ల్లో రాణిస్తేనే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్కు అమితమైన ఆదరణ ఉన్న జమానాలో ఎదిగినందుకు గర్వపడుతున్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్ట్ క్రికెట్ను విస్మరించకూడదని సూచించాడు. కేన్ అంచనా వేస్తున్న నయా ఫాబ్ ఫోర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నారు. అయితే వీరంతా ఇదే ప్రదర్శనను సుదీర్ఘకాలం కొనసాగించగలిగితే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారు. గిల్, బ్రూక్, రచిన్, జైస్వాల్, గ్రీన్ ఆటగాళ్లుగా ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. వీరి వయసు కూడా చాలా తక్కువ. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెటర్గా స్థిరపడేందుకు వీరికి తగినంత సమయం ఉంది. ఇప్పటివకే వీరు కెరీర్లో అత్యుత్తమ దశలను చూశారు. -
అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్పై జైశ్వాల్ ఫైర్! వీడియో వైరల్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 17పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.క్రిస్ వోక్స్ బౌలింగ్లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి జైశ్వాల్ ప్యాడ్కు తాకింది. వెంటనే కీపర్తో పాటు బౌలర్ ఎల్బీకి అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో అంపైర్ నిర్ణయం పట్ల జైశ్వాల్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. జైస్వాల్ కొన్ని సెకన్ల పాటు క్రీజులోనే నిలబడి అలా షాక్లో ఉండిపోయాడు. బంతి స్టంప్స్ను మిస్స్ అవుతుంది, ఎలా ఔట్ ఇస్తావు అన్నట్లు అంపైర్ వైపు చూస్తూ జైశ్వాల్ సైగ చేశాడు. అయితే ఈ అనధికారిక టెస్ట్లో డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో, జైశ్వాల్ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శతక్కొట్టిన రాహుల్..ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్ (168 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో విజృంభించాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకగా... జట్టులో అందరికంటే సీనియర్ రాహుల్కు ఈ మ్యాచ్ ద్వారా చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’జట్టు 83 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?Won’t be the only time Woakes gets Jaiswal this summer.pic.twitter.com/UwT23WycGr— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 6, 2025 -
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
కాంటర్బరీ వేదికగా భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆఖరి రోజు భారత యువ బ్యాటర్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (68; 8 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (64; 8 ఫోర్లు, 2 సిక్స్లు) సహా టాప్–4 బ్యాటర్లు అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ధ్రువ్ జురేల్ (53 నాటౌట్; 4 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్కు ఓపెనర్లు 123 పరుగులు జోడిస్తే... జురేల్, నితీశ్ అబేధ్యమైన మూడో వికెట్కు 91 పరుగులు జతచేశారు. అయితే ఫలితం వచ్చే అవకాశమే లేకపోవడంతో నిరీ్ణత సమయానికి గంటన్నర ముందే మ్యాచ్ను ఆపేశారు. లయన్స్కు ఆధిక్యం అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 527/7తో ఆఖరి నాలుగోరోజు ఆటను కొనసాగించిన లయన్స్ 145.5 ఓవర్లలో 587 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జమాన్ అక్తర్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడగా, టెయిలెండర్లు ఎడీ జాక్ (25; 2 ఫోర్లు), అజిత్ సింగ్ (27 నాటౌట్; 5 ఫోర్లు) పోరాడారు.భారత బౌలర్లలో ముకేశ్ 3, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 557 పరుగులు చేయగా... ఇంగ్లండ్ లయన్స్కు 30 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నెల 6 నుంచి నార్తంప్టన్లో రెండో అనధికారిక టెస్టు జరుగుతుంది.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. -
ఇంగ్లండ్ టూర్: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTV) 2025-27 సీజన్ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్-‘ఎ’- ఇంగ్లండ్ లయన్స్ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు, భారత ‘ఎ’ టీమ్ మధ్య కూడా జూన్ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.జైసూ, నితీశ్, గిల్, జురెల్ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ గత సీజన్లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్ కరుణ్ నాయర్కు భారత టెస్టు టీమ్లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్ నాయర్కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్దీప్లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్కు వెళ్లే భారత్-‘ఎ’ జట్టులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్లు ఉన్నారు. వీరి టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్ రాయల్స్ (యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే, శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ఓపెనర్గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!
భారత టెస్టు జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఓపెనర్గా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగే దిగ్గజం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరన్న అంశంపై చర్చ జరగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కొనసాగించాలని సూచించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోఅయితే, నాలుగో స్థానానికి మాత్రం వసీం జాఫర్ కొత్త ఆటగాడిని ఎంపిక చేశాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జైసూతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. రోహిత్ తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరే ఓపెనర్లుగా కొనసాగారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ న్యూస్18తో మాట్లాడుతూ.. ‘‘బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. కాబట్టి కేఎల్ అదే స్థానంలో కొనసాగితే బాగుంటుంది. నిలదొక్కుకున్న జోడీని విడదీయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.నాలుగో స్థానంలో గిల్!ఇక శుభ్మన్ గిల్ విషయానికొస్తే.. అతడు వైట్ బాల్ క్రికెట్లో ఓపెనర్గా వస్తున్నాడు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం అతడిని మూడు నుంచి నాలుగో స్థానానికి పంపితే బాగుంటుంది.మూడో స్థానంలో సాయి సుదర్శన్ను ఆడించాలి. సుదీర్ఘకాలం వన్డౌన్లో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఓపెనర్గా 83 ఇన్నింగ్స్లో 2803 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి.ఓపెనర్లుగా ఇలాఇక నాలుగో స్థానంలో రెండు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్.. 108 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ 30 ఇన్నింగ్స్లో మూడో స్థానంలో వచ్చి 1019 పరుగులు చేశాడు. ఓపెనర్గా 29 ఇన్నింగ్స్లో 874 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంత వరకు ఒక్కసారి కూడా నాలుగో స్థానంలో ఆడలేదు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల నిష్క్రమణ తర్వాత టీమిండియా తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో తొలి సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఈ టూర్ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.చదవండి: ‘మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
ఇంగ్లండ్ పర్యటనకు జైస్వాల్, ఇషాన్ కిషన్.. సర్ఫరాజ్ ఖాన్ను నేరుగా..?
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో మొదటి టెస్ట్ మే 30న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల భారత-ఏ జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తుంది. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్ కారణంగా ఇంగ్లండ్ లయన్స్తో రెండో టెస్ట్కు జట్టు ఎంపికను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తేదీలతో తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ తేదీలు క్లాష్ అవుతున్న కారణంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్న జట్ల ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.కాగా, తొలి అనధికారిక టెస్ట్ కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టులో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారని సమాచారం. వీరితో పాటు దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించిన కరుణ్ నాయర్కు కూడా బెర్త్ దక్కినట్లు తెలుస్తుంది.ఈ ముగ్గురితో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ అవకాశాలు లేని జట్లకు చెందిన నితీశ్ రెడ్డి, ధృవ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్దీప్, తనుశ్ కోటియన్ను కూడా తొలి అనధికారిక టెస్ట్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వీరంతా ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టూర్లో భాగమై ఉన్నారు. ధృవ్ జురెల్, ఇషాన్ కిషన్ ఎంపికతో సంజూ శాంసన్కు మొండిచెయ్యి ఎదురైనట్లు తెలుస్తుంది. పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు దేశవాలీ క్రికెట్లో సత్తా చాటిన శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్ను కూడా తొలి అనధికారిక టెస్ట్ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఐపీఎల్-2025లో అంచనాలకు మించి రాణించిన సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్కు కూడా జట్టులో చోటు దక్కినట్లు తెలుస్తుంది.ఐపీఎల్ టైటిల్ రేసులో ముందున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ను రెండో అనధికారిక టెస్ట్కు ఎంపిక చేస్తారని తెలుస్తుంది. వీరితో పాటు రజత్ పాటిదార్, అర్షదీప్ సింగ్, తిలక్ వర్మను కూడా రెండో టెస్ట్కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ టెస్ట్ జూన్ 6న ప్రారంభమవుతుంది. గత ఇంగ్లండ్ సిరీస్లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ను నేరుగా భారత సీనియర్ జట్టుకు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉంటే, రెండు అనధికారిక టెస్ట్ తర్వాత జూన్ 20న భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో శుభ్మన్ గిల్ను భారత కెప్టెన్గా నియమించవచ్చని తెలుస్తుంది. విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు గుడ్బై చెప్పడంతో అతని స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. -
అతడి విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం!
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను తిరిగి జట్టులోకి తీసుకునే విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి అభయ్ హదాప్ (Abhay Hadap) స్పష్టం చేశాడు. జైసూ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని.. అయితే, అందుకు ఎంసీఏ ఇంకా స్పందించలేదని తెలిపాడు.గోవా జట్టుకు మారాలనికాగా భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు తరఫునే కొనసాగాలని ఆశిస్తున్నాడు. గతంలో రంజీ ట్రోఫీ అనంతరం ముంబై నుంచి గోవా జట్టుకు మారాలని అనుకున్న జైస్వాల్... ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోరాడు.ఇందుకు అంగీకరించిన ఎంసీఏ జైస్వాల్కు ఎన్ఓసీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్న జైస్వాల్ ఈ సీజన్లో ముంబై జట్టుకే ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఎంసీఏకు లేఖ రాశాడు.అందుకే యూ- టర్న్‘గోవా జట్టుకు మారేందుకు కొన్ని కుటుంబ ప్రణాళికలు మధ్యలో ఉన్నాయి. అందుకే ఆ దిశగా ఆలోచించడం లేదు. నాకు ఇచ్చిన ఎన్ఓసీని ఉపసంహరించుకోవాలని ఎంసీఏను కోరుతున్నా.కాబట్టి ఈ సీజన్లో ముంబై తరఫున ఆడేందుకు అనుమతించమని ఎంసీఏను అభ్యర్థిస్తున్నా. నేను ఎన్ఓసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ సంఘానికి గానీ సమర్పించలేదు’ అని యశస్వి పేర్కొన్నాడు.సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయంఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదాప్ స్పందిస్తూ.. ‘‘అవును.. గురువారం జైస్వాల్ ఎంసీఏకు ఇ-మెయిల్ పంపించాడు. తాను ఇప్పుడు ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.అయితే, ఈ విషయంలో ముంబై సెలక్షన్ కమిటీ, క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీదే తుది నిర్ణయం. జైస్వాల్ భవిష్యత్తులో ముంబైకి ఆడతాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని పేర్కొన్నాడు.అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాంఇక గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంబా నాయక్ దేశాయి కూడా జైసూ యూటర్న్పై తన స్పందన తెలియజేశాడు. ‘‘జైస్వాల్ తన బిజీ షెడ్యూల్ను పరిగణనలోకి తీసుకుని.. గోవా జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని భావించాడు.కాబట్టి మా గెస్టు ప్లేయర్ల జాబితాలో ఒకరు తగ్గిపోతారు. ఏదేమైనా ఇరువర్గాల మధ్య ఇందుకు సంబంధించి సమన్వయం, పరస్పర అవగాహన ఉన్నాయి. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడుతున్న జైసూకాగా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల యశస్వి .. సారథ్య బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ముంబై నుంచి గోవాకు మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ముంబై తరఫున 2019లొ అరంగేట్రం చేసి.. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 12 అర్ధ శతకాలు, 13 శతకాల సాయంతో 3712 పరుగులు సాధించాడు. కాగా గత ఏడాది చివర్లో రోహిత్ శర్మతో కలిసి జైసూ.. ముంబై ఓపెనర్గా ఆఖరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 19 టెస్టులు ఆడిన యశస్వి జైస్వాల్ 4 సెంచరీలు, రెండు ద్విశతకాల సాయంతో 1798 పరుగులు సాధించాడు. 23 టీ20లలో 723, ఒక వన్డేలో 15 పరుగులు చేశాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన యశస్వి.. మెరుగైన అవకాశాల కోసం ముంబైకి చేరి.. అదే జట్టు తరఫున దేశీ క్రికెట్లో సత్తా చాటాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’! -
యూ టర్న్ తీసుకున్న యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు. తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్కు కాని సమర్పించలేదని తెలిపాడు.కాగా, ఉత్తర్ప్రదేశ్లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.జైస్వాల్కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.2019-20 సీజన్లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు. -
IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో క్లీన్స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్నే కెప్టెన్గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు ఆడడు. కాబట్టి కెప్టెన్కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్లోనూ అతడిని వరుస మ్యాచ్లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్ -
ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!
ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్లో ఆఖరి బంతి వరకు పోరాడి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా రాజస్తాన్ ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో కేకేఆర్తో తలపడింది.ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35) రాణించగా.. సునిల్ నరైన్ (11) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే (30), అంగ్క్రిష్ రఘువన్షీ (44) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఆండ్రీ రసెల్ తొలి ఫిఫ్టీఇక ఆఖర్లో ఆండ్రీ రసెల్ (Andre Russel), రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించారు. రసెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 57 పరుగులతో చెలరేగగా.. రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో దుమ్ములేపారు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 206 పరుగులు సాధించింది.రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రాజస్తాన్కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4), వన్డౌన్లో వచ్చిన కునాల్ సింగ్ రాథోడ్ (0) పూర్తిగా విఫలమయ్యారు.రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (0), వనిందు హసరంగ (0) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి కఠిన దశలో రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ హర్షిత్ రాణా బౌలింగ్లో షాట్కు యత్నించి వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.పరాగ్ అవుటైన తర్వాత జోఫ్రా ఆర్చర్ (12), శుభమ్ దూబే (25 నాటౌట్) ఆఖరి బంతి వరకు పోరాడారు. కానీ చివరి బాల్కు మూడు పరుగులు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి ఆర్చర్ రనౌట్ కావడంతో రాయల్స్ ఇన్నింగ్స్కు తెరపడింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్తాన్ 205 పరుగుల వద్ద నిలిచిపోయింది.ఫలితంగా కేకేఆర్ సొంతగడ్డపై ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికి పన్నెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాజస్తాన్కు ఇది తొమ్మిదో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. 11 మ్యాచ్లలో ఐదు గెలిచిన కేకేఆర్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్ 2025: కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్👉కేకేఆర్ స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్పై కేకేఆర్ విజయం👉ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్: ఆండ్రీ రసెల్చదవండి: శెభాష్ రియాన్!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
KKR vs RR: ఒక్క పరుగు తేడాతో ఓటమి
IPL 2025 KKR vs RR- Eden Gardens, Kolkata Updates: ఐపీఎల్-2025లో 53వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్- రాజస్తాన్ రాయల్స్ తలపడ్డాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి.. రాజస్తాన్కు 207 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో కేకేఆర్ పైచేయి సాధించింది. ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. రాయల్స్ బ్యాటర్లలో కెప్టెన్ రియాన్ పరాగ్ 95 పరుగులతో చెలరేగగా.. మిగతా వాళ్లలో యశస్వి జైస్వాల్ (34), శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు కూల్చగా.. వైభవ్ అరోరా ఒక వికెట్ దక్కించుకున్నాడు.దంచికొట్టిన రసెల్, రింకూ.. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్ సునిల్ నరైన్ (11) మినహా మిగతా వాళ్లంతా మెరుగ్గా ఆడారు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 35), కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించగా.. ఆఖర్లో ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ మెరుపులు మెరిపించారు.రసెల్ 25 బంతుల్లో 57, రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 206 పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు. కేకేఆర్ స్కోరు: 206/4 (20)రాజస్తాన్ స్కోరు: 205/8 (20)సెంచరీకి ఐదు పరుగుల దూరంలో17.3: హర్షిత్ రాణా బౌలింగ్లో రియాన్ పరాగ్ వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.15.5: హర్షిత్ రాణా బౌలింగ్లో సునిల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా వెనుదిరిగిన హెట్మెయిర్ (29)గేరు మార్చిన రాజస్తాన్15 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 155/5 రియాన్ పరాగ్ 38 బంతుల్లో 86 పరుగులు, హెట్మెయిర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 82-5పరాగ్ 34, హెట్మెయిర్ 8 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్7.5: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ హసరంగ బౌల్డ్ అయి.. జురెల్ మాదిరి సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. స్కోరు: 71/5 (7.5) .హెట్మెయిర్ క్రీజులోకి రాగా.. రియాన్ పరాగ్ 31 రన్స్తో ఉన్నాడు.7.3: నాలుగో వికెట్ డౌన్వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో జురెల్ బౌల్డ్. డకౌట్గా పెవిలియన్ చేరిన వికెట్ కీపర్ బ్యాటర్. స్కోరు: 71/4 (7.3). హసరంగ క్రీజులోకి వచ్చాడు.6.6: మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్జైస్వాల్ (34) రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్లో జైసూ.. రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 66/3 (7). పరాగ్ 26 పరుగులతో క్రీజులో ఉండగా.. జైసూ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చాడు.పవర్ ప్లేలో రాజస్తాన్ స్కోరెంతంటే?ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా రాజస్తాన్ తిరిగి గాడిలో పడుతోంది. ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. జైస్వాల్ 18 బంతుల్లో 32, పరాగ్ 11 బంతుల్లో 22 పరుగులు చేశారు.1.5: రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మొయిన్ అలీ బౌలింగ్ కునాల్ సింగ్ రాథోడ్ (0) రసెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ క్రీజులోకి రాగా... జైస్వాల్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 9-2. పాపం వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ విఫలంకేకేఆర్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు. వైభవ్ అరోరా బౌలింగ్లో రహానేకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. జైస్వాల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. కునాల్ సింగ్ రాథోడ్ క్రీజులోకి వచ్చాడు. కాగా వైభవ్ గత మ్యాచ్లో డకౌట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు మాత్రం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రాజస్తాన్ స్కోరు: 5/1 (1).18.4: ఈ సీజన్లో రసెల్ తొలి అర్ధ శతకంజోఫ్రా ఆర్చర్బౌలింగ్లో సిక్సర బాది యాభై పరుగుల మార్కు అందుకున్న రసెల్.నాలుగో వికెట్ డౌన్18.1: జోరు మీదున్న రఘువన్షీ అవుట్రఘువన్షీ రూపంలో కేకేఆర్నాలుగో వికెట్ కోల్పోయింది. 30 బంతుల్లో 44 పరుగుల వద్ద ఉన్న అతడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అశోక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రసెల్ 20 బంతుల్లో 45 పరుగులతో ఉండగా.. రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. కేకేఆర్ స్కోరు: 173/4 (18.3) .15 ఓవర్లలో కేకేఆర్ స్కోరు: 121/3రసెల్ 2, రఘువన్షీ 36 పరుగులతో ఆడుతున్నారు.మూడో వికెట్ డౌన్12.4: జోరు మీదున్న కేకేఆర్ కెప్టెన్ రహానే (30)ను రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అవుట్ చేశాడు. పరాగ్ బౌలింగ్లో రహానే ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 111/3 (13). ఆండ్రీ రసెల్ క్రీజులోకి రాగా.. రఘువన్షీ 28 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో కేకేఆర్ స్కోరు: 86/2 (10) రహానే 24, రఘువన్షీ 11 పరుగులతో ఆడుతున్నారు.7.3: రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్మహీశ్ తీక్షణ బౌలింగ్లో ఓపెనర్ గుర్బాజ్ (35) హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. రహానే 20 పరుగులతో ఆడుతుండగా.. అంగ్క్రిష్ రఘువన్షీ క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో ఓవర్ ముగిసే సరికి స్కోరు:72/2 (8).పవర్ ప్లేలో కేకేఆర్ స్కోరుగుర్బాజ్, రహానే నిలకడగా ఆడుతున్న క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి గుర్బాజ్ 24, రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్1.6: యుధ్వీర్ బౌలింగ్లో సునిల్ నరైన్ (11) బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అజింక్య రహానే క్రీజులోకి రాగా. రహ్మనుల్లా గుర్బాజ్ ఒక్క పరుగుతో ఉన్నాడు. కేకేఆర్ స్కోరు: 13-1 (2).టాస్ గెలిచిన కేకేఆర్రాజస్తాన్ రాయల్స్తో టాస్ గెలిచిన కోల్కతా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. వికెట్ కాస్త పొడిగా ఉన్నట్లు కనిపిస్తోందన్నాడు. ఏదేమైనా మెరుగైన స్కోరు సాధించి.. దానిని తప్పక కాపాడుకుంటామని పేర్కొన్నాడు. మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు రహానే తెలిపాడు.మూడు మార్పులుఇక రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. నితీశ్ రాణా గాయపడ్డాడని.. అందుకే ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని తెలిపాడు. ఇక కుమార్ కార్తికేయ స్థానంలో హసరంగ వచ్చాడని.. అదే విధొంగా కునాల్ రాథోడ్, యుధ్వీర్లను ఆడిస్తున్నట్లు పరాగ్ చెప్పాడు.తుదిజట్లుకోల్కతారహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, రోవ్మన్ పావెల్, లవ్నిత్ సిసోడియారాజస్తాన్యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వాల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్పాండే, క్వెనా మఫాకా, అశోక్ శర్మ. -
రొమారియో షెపర్డ్ విధ్వంసం.. సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిప్టీ
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.సీఎస్కే బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా సీఎస్కే బౌలర్ ఖాలీల్ అహ్మద్కు చుక్కలు చూపించాడు. 19వ ఓవర్ వేసిన ఖాలీల్ బౌలింగ్లో షెఫర్డ్ 4 సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంతవేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ప్లేయర్గా కేఎల్ రాహుల్, కమ్మిన్స్ సరసన షెపర్డ్ నిలిచాడు. రాహుల్, కమ్మిన్స్ కూడా 14 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు.ఈ ఫీట్ సాధించిన జాబితాలో యశస్వి జైశ్వాల్(13 బంతులు) అగ్రస్దానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో షెపర్డ్ ఓవరాల్గా 6 సిక్స్లు, రెండు ఫోర్లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదేవిధంగా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు బాదిన నాలుగో ప్లేయర్గా రొమారియో నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా UNREAL HITTING! 💪🔥#RomarioShepherd blitzkrieg hits Chinnaswamy! ⚡He smashes a jaw-dropping 53 off just 14 balls,equaling the 2nd fastest fifty in IPL history! Worthy of this epic clash #Kohli vs #Dhoni - one last time? 🙌🏻Watch the LIVE action in Haryanvi commentary ➡… pic.twitter.com/cOReV8qcPT— Star Sports (@StarSportsIndia) May 3, 2025 -
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్.. రాయల్స్ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్గా ఐదో ప్లేయర్గా, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్గా, రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్ రాయల్స్కే ఆడుతున్న జైస్వాల్.. 62 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు ముందు రాయల్స్ తరఫున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 48 ఇన్నింగ్స్ల్లోషాన్ మార్ష్- 52రుతురాజ్ గైక్వాడ్- 57కేఎల్ రాహుల్- 60యశస్వి జైస్వాల్- 62మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. ఐపీఎల్లో తొలి ప్లేయర్గా..
రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్ బాదిన ఏకైక బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు.రాయాల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్ గురువారం ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.205 పరుగులుఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్గా మలిచాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రొమారియో షెఫర్డ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది.అంతేకాదు.. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా పతనమైంది. నితీశ్ రాణా (28), రియాన్ పరాగ్ (22), ధ్రువ్ జురెల్ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు1.యశస్వి జైస్వాల్- 32. నమన్ ఓజా-13. మయాంక్ అగర్వాల్- 14. సునిల్ నరైన్- 15. విరాట్ కోహ్లి- 16. రాబిన్ ఊతప్ప- 17. ఫిల్ సాల్ట్- 18. ప్రియాన్ష్ ఆర్య- 1.చదవండి: ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లి ఘనత Woke up and said Pehla ball, JaisBall 🔥 pic.twitter.com/pg4w29Jl2G— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2025 -
DC vs RR: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?
రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ (Shane Watson) మండిపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో సూపర్ ఓవర్లో రాయల్స్ తెలివి తక్కువగా వ్యవహరించి.. మ్యాచ్ను చేజార్చుకుందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్లో ఇన్ఫామ్ బ్యాటర్ నితీశ్ రాణాను పంపకపోవడాన్ని మతిలేని చర్యగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.ఒకే స్కోరు.. 188 పరుగులు ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్తాన్ రాయల్స్ (DC vs RR) బుధవారం తలపడ్డాయి. అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 38) రాణించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇక లక్ష్య ఛేదనలో రాయల్స్ 20 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్లు నష్టపోయి సరిగ్గా 188 పరుగులే చేసింది.ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51), కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 31 రిటైర్ట్ హర్ట్) రాణించగా.. నితీశ్ రాణా (28 బంతుల్లో 51) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26), షిమ్రన్ హెట్మెయిర్ (9 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలుపుఇక ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలుత రాజస్తాన్ బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో రంగంలోకి దిగాడు. రాయల్స్ బ్యాటర్లలో హెట్మెయిర్ తొలికి పరుగులేమీ తీయలేదు. రెంబో బంతికి ఫోర్ బాది, మూడో బంతికి ఒక్క రన్ సాధించాడు.ఇక నాలుగో బంతికి రియాన్ ఫోర్ బాదాడు.. అది నోబాల్గా తేలడంతో ఫ్రీ హిట్ అవకాశం రాగా.. రియాన్ రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో హెట్మెయిర్ కూడా రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో 0.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి రాయల్స్ 11 పరుగులు మాత్రమే చేసింది.అనంతరం సందీప్ శర్మ బౌలింగ్లో ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 2, 4, 1 పరుగులు రాబట్టగా.. నాలుగో బంతిని ట్రిస్టన్ స్టబ్స్ సిక్సర్గా మలిచాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో రాజస్తాన్పై ఢిల్లీ జయభేరి మోగించి.. సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ నితీశ్ రాణాను బ్యాటింగ్కు ఎందుకు పంపలేదని షేన్ వాట్సన్ ప్రశ్నించాడు. ‘‘రాయల్స్ ఇన్నింగ్స్లో తొందరపాటు చర్యలు కనిపించాయి. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. అసలు నితీశ్ రాణా ఏం తప్పు చేశాడు? అతడిని ఎందుకు సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు పంపలేదు?అతడు మంచి రిథమ్లో బ్యాటింగ్ చేశాడు. పరుగులు రాబట్టాడు. అయినా సరే.. అతడిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు పంపలేదంటే.. మీకు బుర్ర పనిచేయడం లేదని అనుకోవాలా?’’ అంటూ షేన్ వాట్సన్ రాయల్స్ యాజమాన్యాన్ని విమర్శించాడు. చదవండి: SRH vs MI: రైజర్స్ రఫ్ఫాడించేనా! 𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన అద్భుత ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్గా పాతుకుపోయాడు.అరంగేట్రంలోనే శతక్కొట్టిన జైసూ.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా విశేషం. టెస్టుల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 23 మ్యాచ్లు పూర్తి చేసుకుని 723 పరుగులు సాధించాడు. అయితే, దాదాపు ఏడాది కాలంగా మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు.మరోసారి విఫలంగతేడాది ఐపీఎల్లోనూ యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పదహారు ఇన్నింగ్స్లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం ఇంత వరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 107 (1, 29, 4, 67, 6 )పరుగులే చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లోనూ జైసూ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు.తొలి టెస్టులో సెంచరీ (161), ఆఖరి టెస్టులో హాఫ్ సెంచరీలు (82, 84) మినహా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. తర్వాత రంజీ బరిలో దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చి జైస్వాల్.. అరంగేట్రంలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం పదిహేను పరుగులే చేశాడు.పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి కడుపు నిండిపోయింది. అంటే.. ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్ ప్రస్తుతం క్రికెట్పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.అతడికి ఇదే నా సందేశం.. క్రికెట్ను నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు. అదే సమయంలో.. అదే రీతిలో ఏడిపించగలదు కూడా! ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపటిలా క్రికెట్ను ప్రేమించు. అదే ప్యాషన్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు’’ అని బసిత్ అలీ జైసూకు సూచించాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జైస్వాల్ స్థానం గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నాడు.విరాట్ కాస్త తొందరపడ్డాడు.. కానీభారత్లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదువలేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకు వస్తున్నారు కాబట్టి జైసూ ఇప్పటికైనా జాగ్రత్తపడాలని బసిత్ అలీ సలహా ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగి రోహిత్, విరాట్ మంచి పని చేశారు.నాకైతే విరాట్ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. అయితే.. సరైన సమయంలో అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి వారికి మార్గం సుగమం చేశారు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు. కాగా చిన్న వయసులోనే సత్తా చాటి భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా.. టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించి ఐపీఎల్ వేలంలో కూడా అమ్ముడుపోని స్థితికి దిగజారిపోయాడు.చదవండి: అతడికి కాస్త మర్యాద నేర్పండి.. చీప్ జోకులు వద్దు: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్ -
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్కు మతి పోయింది..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే రాయల్స్ అంచనాలకు తగ్గట్టుగా గుజరాత్ను కంట్రోల్ చేయలేకపోయింది. సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ చేసింది. ఆదిలోనే శుభ్మన్ గిల్ (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు) గుజరాత్ ఇన్నింగ్స్ను నిర్మించారు. బట్లర్ ఔటైన అనంతరం సాయి సుదర్శన్తో షారుక్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జత కట్టాడు. బట్లర్, షారుక్ ఖాన్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సాయి జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. షారుక్ ఖాన్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన రూథర్ఫోర్డ్ (3 బంతుల్లో 7; సిక్స్) తొలి బంతికే సిక్సర్ బాది మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే సందీప్ శర్మ అద్భుతమైన బంతితో రూథర్ఫోర్డ్ను పెవిలియన్కు పంపాడు. ఇన్నింగ్స్ చివరల్లో రాహుల్ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (4 బంతుల్లో 12; ఫోర్, సిక్స్) తమ సహజ శైలిలో విరుచుకుపడటంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటింది. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ను (6) అర్షద్ ఖాన్, నితీశ్ రాణాను (1) సిరాజ్ ఔట్ చేశారు. 4.2 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 41/2గా ఉంది. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (14) ధాటిగా ఆడుతూ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో రాయల్స్ గెలవాలంటే మరో 94 బంతుల్లో 177 పరుగులు చేయాలి.A NO LOOK SHOT FROM RASHID KHAN.- Yashasvi Jaiswal takes a stunner of it. 😲pic.twitter.com/Jb9u6AtOPa— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2025జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్ఈ మ్యాచ్లో రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ ఖాన్ కొట్టిన నో లుక్ షాట్ను (తుషార్ దేశ్పాండే బౌలింగ్లో) జైస్వాల్ నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్గా మలిచాడు. అప్పటికి రషీద్ ఖాన్ అదే ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ బాది మాంచి జోష్లో ఉన్నాడు. జైస్వాల్ ఈ క్యాచ్ పట్టకపోయుంటే రషీద్ మరింత చెలరేగిపోయేవాడు. జైస్వాల్ పట్టిన ఈ క్యాచ్ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
రూ. 18 కోట్లు! .. వరుస వైఫల్యాలు.. అందరి కళ్లు అతడి మీదే..
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన కెరీర్కు పునాది వేసిన ముంబై క్రికెట్ను వీడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తదుపరి దేశవాళీ సీజన్లో గోవాకు ఆడనుండటం చర్చకు దారితీసింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానే, యాజమాన్యంతో విభేదాల వల్లే జైసూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు రావడం గమనార్హం.వరుస వైఫల్యాలు.. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా యశస్వి జైస్వాల్ ఫామ్లేమితో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో, ఇంగ్లండ్తో వన్డేలోనూ పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది.రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంటే..మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ తమ ఓపెనర్ జైసూను ఏకంగా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలోనూ అతడు తేలిపోయాడు. తన స్థాయికి తగ్గట్లుగా ఒక్కసారీ బ్యాట్ ఝులిపించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్లో కలిపి 11.33 సగటుతో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కటే గెలిచింది. ఇక శనివారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడే ముఖ్యం‘‘జైస్వాల్ ఇప్పటికీ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్గా తను బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో అతడు అత్యంత కీలక సభ్యుడు. తప్పక పరుగులు చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. పంజాబ్తో మ్యాచ్లో అందరి దృష్టి అతడి మీదే కేంద్రీకృతమై ఉంటుందనడంలో సందేహం లేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సంజూ రాకతోఇక పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ కెప్టెన్గా విధుల్లో చేరనుండటం రాజస్తాన్కు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్గా, కీపర్గా రాయల్స్ సంజూను మిస్ అయింది.పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో అతడు దిట్ట. కీపర్గానూ జట్టుకు అతడి సేవలు ముఖ్యం. కాబట్టి అతడి రాకతో జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: IPL 2025 MI Vs LSG: బెడిసికొట్టిన వ్యూహం.. ఏం చేస్తున్నావ్ హార్దిక్? .. ఆకాశ్ అంబానీ రియాక్షన్ వైరల్ -
అందుకే ముంబైని వీడి.. గోవాకు ఆడబోతున్నా: యశస్వి జైస్వాల్
దేశవాళీ క్రికెట్లో వచ్చే సీజన్లో టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కొత్త జట్టుకు ఆడబోతున్నాడు. ఇన్నాళ్లుగా తాను ప్రాతినిథ్యం వహించిన ముంబైని వీడి.. అతడు గోవా జట్టుతో జత కట్టనున్నాడు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడగా.. జైస్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వీటిని నిర్ధారించాడు.అందుకే ముంబైని వీడి.. గోవాకు ఆడబోతున్నా‘‘నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ముంబై కారణం. ఈ మహానగరం నాకంటూ ఓ గుర్తింపు వచ్చేలా చేసింది. నా జీవితాంతం నేను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు రుణపడి ఉంటాను.అయితే, గోవా అసోసియేషన్ నాకు కొత్త అవకాశం కల్పిస్తామని చెప్పింది. గోవా జట్టు కెప్టెన్గా నాకు ఆఫర్ ఇచ్చింది. నేను ఏ జట్టుకు ఆడుతున్నా.. టీమిండియా తరఫున గొప్పగా రాణించడమే నా ఏకైక లక్ష్యం.జాతీయ జట్టు విధుల్లో లేనపుడు మాత్రం తప్పక దేశీ క్రికెట్ ఆడతా. డొమెస్టిక్ టోర్నమెంట్లలో ఇకపై గోవాకు ఆడుతూ.. జట్టును ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తా. నా కెరీర్లో నాకు వచ్చిన ముఖ్యమైన అవకాశాల్లో ఇది ఒకటి. అందుకే వేరే ఆలోచనకు తావు లేకుండా వారి ప్రతిపాదనుకు అంగీకరించాను’’ అని యశస్వి జైస్వాల్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు.రహానే కిట్ బ్యాగ్ను తన్నిన జైస్వాల్?!ఈ నేపథ్యంలో ఇండియా టుడే కథనం జైస్వాల్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ముంబై జట్టులోని సీనియర్ సభ్యుడితో గొడవల కారణంగానే జైసూ ఆ టీమ్ను వదిలేశాడని సదరు కథనం పేర్కొంది. 2022 నాటి ఓ మ్యాచ్లో జైస్వాల్ ప్రత్యర్థి జట్టు ఆటగాడిని స్లెడ్జ్ చేయడంతో కెప్టెన్ అజింక్య రహానే అతడిని మైదానం నుంచి బయటకు పంపాడు.అంతేకాదు.. ప్రతిసారి అతడి షాట్ సెలక్షన్ గురించి ముంబై యాజమాన్యం, రహానే ప్రశ్నించడం జైసూకు నచ్చలేదు. గత సీజన్లో జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో జైస్వాల్ విఫలమైనపుడు అతడిని కెప్టెన్ ప్రశ్నించగా.. అతడూ తిరిగి అదే ప్రశ్న వేశాడు.దీంతో సీనియర్ సభ్యుడికి కోపం వచ్చింది. జైస్వాల్ కూడా సీరియస్గానే ఉన్నాడు’’ అని సదరు కథనాన్ని బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. జైస్వాల్ కోపంతో రహానే కిట్ బ్యాట్ తన్నినట్లు వదంతులు వస్తున్నాయి. ఈ కారణాల వల్లే జైస్వాల్ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.వారు జట్టు మారడం లేదుఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా స్టార్ తిలక్ వర్మ కూడా జైస్వాల్ బాటలోనే తమ సొంత జట్లను వీడనున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే, సూర్య ముంబైని వీడటం లేదని ఎంసీఏ.. తిలక్ వర్మ హైదరాబాద్తోనే ఉంటానని చెప్పాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్. దేవరాజ్ స్పష్టం చేశారు. చదవండి: రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్లో స్కోరు చేయాలా? -
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ.. దేశవాళీ క్రికెట్లో తమ సొంత జట్టును వీడేందుకు సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, జైస్వాల్ (Yashasvi Jaiswal) ముంబై జట్టును వీడి.. గోవాకు ఆడటం అధికారికంగా ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు ధ్రువీకరించాయని జాతీయ మీడియా పేర్కొంది.ఖండించిన ఎంసీఏమరోవైపు.. జైస్వాల్ బాటలో సూర్య కూడా టీమ్ మారుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, సూర్యకుమార్ (Suryakuar Yadav) విషయంలో వస్తున్న వదంతులను ఎంసీఏ ఖండించింది.‘సూర్యకుమార్ యాదవ్ గురించి మీడియాలో వస్తున్న వదంతుల గురించి మాకు సమాచారం ఉంది. అయితే ఈ విషయంపై మేం ఇప్పటికే సూర్యతో మాట్లాడాం. అతను తాను ముంబైకే ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు.ఆ వార్తలన్నీ నిరాధారం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించకుండా ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని అందరినీ కోరుతున్నాం’ అని ఎంసీఏ కార్యదర్శి అభయ్ హడప్ పేర్కొన్నారు. సూర్య కూడా సోషల్ మీడియా ద్వారా నేరుగా ఈ వార్తలను కొట్టిపారేశాడు. ‘ఈ వార్త రాసింది జర్నలిస్టా, స్క్రిప్ట్ రైటరా. కామెడీ సినిమాలు చూడటం మానేసి ఈ కథనాలు చదువుకుంటే చాలు. అర్థంపర్థం లేని విషయమిది’ అని సూర్య వ్యాఖ్యానించాడు. HCA స్పందన ఇదేమరోవైపు.. జైస్వాల్కు సంబంధించిన కథనంలో మరో భారత ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) కూడా హైదరాబాద్ను వీడి గోవాకు ఆడబోతున్నట్లుగా వచ్చింది. ఈ విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) స్పష్టతనిచ్చింది. తిలక్ వర్మతో వ్యక్తిగతంగా మాట్లాడానని, అతడు హైదరాబాద్కే ఆడతానని చెప్పినట్లు హెచ్సీఏ కార్యదర్శి ఆర్. దేవరాజ్ తెలిపారు.ఇదీ చదవండి: రబడ ఇంటి బాట న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐపీఎల్ నుంచి స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. లీగ్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సఫారీ పేసర్... వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిన్నట్లు టీమ్ మేనేజ్మెంట్ గురువారం వెల్లడించింది. తాజా సీజన్లో గుజరాత్ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా... అందులో రెండింట్లో బరిలోకి దిగిన రబడ 2 వికెట్లు పడగొట్టాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు.‘ముఖ్యమైన వ్యక్తిగత కారణాలతో రబడ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు’ అని గుజరాత్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. అతడు తిరిగి వస్తాడా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. రబడ సేవలు దూరమైనా... మహ్మ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ రూపంలో గుజరాత్ టైటాన్స్కు నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకే చెందిన గెరాల్డ్ కోట్జీ, అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ కరీమ్ జనత్లో ఒకరిని విదేశీ పేసర్ కోటాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా అరుదైన రికార్డు -
ముంబైని వీడనున్న సూర్యకుమార్! క్లారిటీ ఇచ్చిన ఎంసీఏ
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపై అతడు డొమాస్టిక్ క్రికెట్లో గోవా తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్కు లేఖ రాశాడు. అందుకు ఏంసీఎ కూడా అంగీకరించింది.అయితే జైశ్వాల్ బాటలో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా గోవాకు మారేందుకు సిద్దంగా ఉన్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా చాలా మంది ముంబై ఆటగాళ్లకు గోవా తరపున ఆడాలని సూర్య సూచిస్తున్నాడన్న నిరాధరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజగా ఈ వార్తలపై ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. అవన్నీ రూమర్సే అని ఏంసీఎ కార్యదర్శి అభయ్ హడప్ కొట్టిపారేశారు."ముంబై ఆటగాళ్లు చాలా మందిని గోవా తరపున ఆడాలని సూర్యకుమార్ ప్రేరేపిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఈ విషయం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలుసు. అవన్నీ వట్టి రూమర్సే. ఎంసీఎ అధికారులు ఇప్పటికే సూర్యతో మాట్లాడారు. ఆ వార్తలని అవాస్తవమని ధృవీకరించారు. సూర్య కుమార్ యాదవ్ ముంబై తరపున ఆడేందుకు కట్టుబడి ఉన్నాడు. అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాడు. కాబట్టి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయడం మానుకోవాలి" అని అభయ్ హడప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సూర్యకుమార్ తన జూనియర్ క్రికెట్ నుంచి ముంబై తరపున ఆడుతున్నాడు. అతడు 2010లో మూడు ఫార్మాట్లలో ముంబై సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడల్లా ముంబై కోసం సూర్య ఆడుతూనే ఉన్నాడు. సూర్యకుమార్ రంజీ ట్రోఫీలో 77 మ్యాచ్లు ఆడి 44.93 సగటుతో 13 సెంచరీలతో 5392 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా సూర్య కొనసాగుతున్నాడు. -
అర్థంపర్థంలేని చెత్త మాటలు: సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్
తాను జట్టు మారబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జర్నలిస్టులు ఈ మధ్య స్క్రిప్టు రైటర్లుగా మారిపోయారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం కంటే చెత్త విషయం మరొకటి ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి నయా తారల వరకు.. ముంబై క్రికెట్ టీమిండియాకు ఎంతో మంది ఆటగాళ్లను అందించింది. అంతేకాదు అత్యధికంగా 42 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన ఘనత కూడా ముంబైదే.అయితే, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టును వీడి.. గోవా జట్టులో చేరబోతున్నాడని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అదే విధంగా.. సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైని వీడి గోవా క్రికెట్తో జట్టు కట్టబోతున్నాడని.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ కూడా సూర్య బాటలో నడవనున్నాడనే ప్రచారం జరిగింది.అంతేకాదు.. జైస్వాల్, తిలక్ గోవా జట్టులో చేరేలా సూర్యనే వారిని ప్రోత్సహించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్షాట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ .. ‘‘ఇతను స్క్రిప్టు రైటరా? లేదంటే జర్నలిస్టా?ఇకపై నేను నవ్వుకోవాలంటే కామెడీ సినిమాలు చూడటం మానేసి.. ఇలాంటి ఆర్టికల్స్ చదవడం మొదలుపెట్టాలేమో!.. అర్థంపర్థంలేని చెత్త మాటలు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సూర్య పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. సూర్య, తిలక్లను మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వరుసగా రూ. 16.35 కోట్లు, రూ. 8 కోట్లకు అట్టిపెట్టుకోగా.. రాజస్తాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఇక హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో సూర్య ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పటి వరకు ముంబై మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుని కేవలం ఒకే ఒక్కటి గెలిచింది.ఇక సూర్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్లలో కలిపి 104 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 70 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జైస్వాల్ మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 34 పరుగులే చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 విజయవంతమైన కెప్టెన్గా సూర్య కొనసాగుతుండగా.. తిలక్ టీ20లలో, జైస్వాల్ టెస్టుల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.Script writer hai ya journalist? Agar hasna hai toh I will stop watching comedy movies and start reading these articles. Ekdum bakwas 🤣🤣🤣 pic.twitter.com/VG3YwQ5eYb— Surya Kumar Yadav (@surya_14kumar) April 2, 2025 -
జైస్వాల్ బాటలోనే సూర్య, తిలక్..?
దేశవాలీ క్రికెట్కు సంబంధించి గోవా క్రికెట్ అసోసియేషన్ (GCA) ఆసక్తికర రీతిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారీ ఆఫర్తో ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్కు గాలం వేసిన జీసీఏ.. మరో ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్, హైదరాబాద్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తదుపరి దేశవాలీ సీజన్ కోసం జీసీఏ ఈ ముగ్గురిని తమ జట్టులో (గోవా) చేర్చుకోవాలని భావిస్తుందట.జీసీఏ జైస్వాల్కు ఆటగాడిగా అవకాశం ఇవ్వడంతో పాటు కెప్టెన్సీ కూడా కట్టబెట్టనుందని సమాచారం. జీసీఏ ఆఫర్కు జైస్వాల్ కూడా సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అతను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ను కూడా సంప్రదించాడని తెలుస్తుంది. వ్యక్తిగత కారణాల వల్ల జైస్వాల్ ముంబైని వీడాలని భావిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. గతంలో అర్జున్ టెండూల్కర్ (సచిన్ టెండూల్కర్ తనయుడు), సిద్దేశ్ లాడ్ ముంబైని వీడి గోవాకు ప్రాతినిథ్యం వహించిన వారిలో ఉన్నారు.కాగా , ఉత్తరప్రదేశ్కు చెందిన యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అండర్-19 దశ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. విజయ్ హజారే (వన్డే) టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఐపీఎల్లో (2020) ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్.. 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్కు ముందు జైస్వాల్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. జైస్వాల్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో కేవలం 34 పరుగులే చేసి నిరాశపరిచాడు. అతడి జట్టు రాయల్స్ కూడా ఈ సీజన్లో అంతంతమాత్రంగానే ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో మాత్రమే గెలిచింది.సూర్యకుమార్, తిలక్ వర్మ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఈ ఇద్దరు గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్కు ఆడుతున్నారు. ఈ సీజన్ వేలానికి ముందు ముంబై ఈ ఇద్దరిని రీటైన్ చేసుకుంది. ఈ సీజన్లో స్కై, తిలక్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. వారి జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో కేవలం ఒకదాంట్లోనే గెలిచింది. -
యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో ఇకపై ముంబైకి ఆడకూడదని ఈ యువ ఓపెనర్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు జైసూ ఈ- మెయిల్ పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ఉత్తరప్రదేశ్లోని సురియాకు చెందిన యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అండర్-19 కెరీర్ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. విజయ్ హజారే (వన్డే) టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం ద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.డబుల్ సెంచరీలతో సత్తా చాటిఅంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్ 2020లో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న 23 ఏళ్ల జైస్వాల్.. అక్కడసత్తా చాటడం ద్వారా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.టెస్టుల్లో సత్తా చాటుతున్న ఈ యువ ఓపెనర్.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా జట్టులో పాతుకుపోయాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేసిన జైసూ ఖాతాలో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. 23 టీ20లలో కలిపి 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులకే పరిమితమయ్యాడు.ఇక జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. 2024 రంజీ బరిలో దిగాడు జైస్వాల్. ముంబై తరఫున రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసి విఫలమయ్యాడు. గోవాకు ఆడేందుకు సిద్ధంఅయితే, వచ్చే సీజన్ నుంచి జైస్వాల్ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని ఎంసీకేకు మెయిల్ ద్వారా తెలిపినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది.అర్జున్ టెండుల్కర్, సిద్దేశ్ లాడ్ మాదిరి జైస్వాల్ కూడా ముంబై జట్టును వీడి.. గోవాకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘అతడు గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై నిరభ్యంతర పత్రం (No Objection Certificate) కోసం మెయిల్ పంపాడు.వ్యక్తిగత కారణాల వల్లే గోవాకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు’’ అని తెలిపాయి. కాగా గోవా జట్టుకు జైస్వాల్ కెప్టెన్గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జైసూ గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్లేమితో సతమతంగతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో చతికిల పడ్డ యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై ఇంగ్లండ్తో వన్డేల్లో అరంగేట్రం చేసి.. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-202 ప్రాథమిక జట్టులో అతడికి చోటు ఇచ్చిన సెలక్టర్లు.. ఆ తర్వాత ప్రధాన జట్టు నుంచి తప్పించారు. ఇక ఐపీఎల్-2025లోనూ ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి జైస్వాల్ కేవలం 34 పరుగులే చేశాడు. కాగా రూ. 18 కోట్లకు రాజస్తాన్ అతడిని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం -
IPL 2025: రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం.. 16 ఫోర్లు, 10 సిక్సర్లతో..!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగుల బ్యాటింగ్ ఊచకోత మొదలైంది. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ముగ్గురు రాయల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. స్టార్ బాయ్ రియాన్ పరాగ్, వికెట్కీపర్ బ్యాటర్ దృవ్ జురెల్ విధ్వంసకర సెంచరీలతో విరుచుకుపడగా.. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మెరుపు అర్ద శతకంతో బీభత్సం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ రెండు గ్రూప్లుగా విడిపోయి ఆడిన మ్యాచ్లో తొలుత రియాన్ పరాగ్ శతకొట్టాడు. రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆతర్వాత జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురిలో రియాన్ పరాగ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. 144* (64) - What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025రియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రియాన్ తన వీర బాదుడును ముగించుకుని పెవిలియన్కు వెళ్తుండగా సహచరులు సంజూ, జైస్వాల్, జురెల్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజూ 'వెల్ డన్ మచ్చా..నైస్ హిట్టింగ్' అనగా.. జైస్వాల్, జురెల్ 'వాట్ ఎ రియాన్' అంటూ అభినందించారు. సహచరులు రియాన్ను అభినందిస్తున్న వీడియో రాయల్స్ తమ సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని జట్లు ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రయాణాన్ని మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో ప్రారంభిస్తుంది. ఈ సీజన్లో రాయల్స్, సన్రైజర్స్ జట్లు బ్యాటింగ్ విస్పోటాలు కలిగి ఉన్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. బౌలర్లను ఊచకోత కోయడంలో ఈ ఇరు జట్ల మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చెప్పలేం.సన్రైజర్స్లో ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి విధ్వంసకర యోధులు ఉండగా.. రాయల్స్లో రియాన్ పరాగ్, దృవ్ జురెల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, హెట్మైర్ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.సన్రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్, యుద్ద్వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: రాయల్స్ మునుపటి వైభవం సాధిస్తుందా?
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్లకు చేరుకుంది. రాయల్స్ కెప్టెన్గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది. సీజన్లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.గాయం నుంచి కోలుకున్న సామ్సన్ ఇంగ్లండ్తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది. జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:సంజు సామ్సన్కెప్టెన్గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.యశస్వి జైస్వాల్అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.నితీష్ రాణాకోల్కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్కు గట్టి బలాన్నిస్తోంది.జోఫ్రా ఆర్చర్గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టుసంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్కు గాయం
రంజీట్రోఫీ 2024-25 సీజన్లో విదర్భతో సెమీఫైనల్కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గాయం కారణంగా సెమీస్కు దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. జైశ్వాల్ ఎడమ కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రాక్టీస్ సమయంలో తన కాలి చీలమండలో నొప్పి వచ్చినట్లు జైశ్వాల్ టీమ్ మెనెజ్మెంట్కు తెలియజేసినట్లు సమచారం. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి జైశ్వాల్ను బీసీసీఐ రిలీజ్ చేయడంతో.. అతడిని ముంబై క్రికెట్ అసోషియేషన్ విధర్బతో సెమీస్కు ఎంపిక చేసింది. అంతలోనే గాయం కారణంగా జైశూ జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై జాబితాలో మాత్రం జైశ్వాల్ ఉన్నాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని మరోక క్రికెటర్తో బీసీసీఐ భర్తీ చేయనుంది. అయితే జైశ్వాల్ గాయపడడంతో ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు బ్యాకప్ ఓపెనర్ లేకుండానే ఆడనుంది. ఒకవేళ రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ గాయపడితే బీసీసీఐ ఎవరిని జట్టులోకి తీసుకుంటుందో చూడాలి.కాగా జైశ్వాల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇక ముంబై-విదర్భ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. యశస్వీ దూరం కావడంతో ముంబై ఇన్నింగ్స్ను ఆయుష్ మాత్రే, ఆకాష్ ఆనంద్ ఆరంభించనున్నారు.జైశ్వాల్కు ఫస్ట్ క్లాస్క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఈ ముంబైకర్ 5 సెంచరీలతో సహా 3712 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత జట్టులోకి యశస్వి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు భారత టెస్టు జట్టులో జైశ్వాల్ రెగ్యూలర్ ఓపెనర్గా కొనసాగుతున్నాడు.చదవండి: WPL 2025: గెలుపు జోష్లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్.. -
రంజీ సెమీఫైనల్ పోరుకు యశస్వి జైస్వాల్
ముంబై: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్కు చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కలేదు. ప్రాథమిక జట్టులో జైస్వాల్ను ఎంపిక చేసినా... అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం 15 మందితో కూడిన జట్టు నుంచి అతడిని తప్పించారు.ప్రస్తుతానికి జైస్వాల్తో పాటు పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఉన్నారు. అత్యవసమైతేనే వీరు దుబాయ్కు వెళ్లనున్నారు. దీంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్ కోసం జైస్వాల్ ముంబై సెలెక్టర్లు ఎంపిక చేశారు. విదర్భతో ఈనెల 17 నుంచి జరగనున్న సెమీఫైనల్ పోరులో యశస్వి, సూర్యకుమార్, శివమ్ దూబే, అజింక్య రహానే, శార్దుల్ ఠాకూర్ వంటి భారత ఆటగాళ్లు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సీజన్లో జమ్మూకశ్మీర్తో ఆడిన ఏకైక రంజీ మ్యాచ్లో జైస్వాల్ ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగినా... భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భను చిత్తు చేసిన ముంబై జట్టు 42వసారి టైటిల్ చేజిక్కించుకుంది. ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్ ), ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భక్తల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సిద్ధేశ్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తమోర్, సూర్యాన్ష్ షెడ్గే, శార్దుల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, మోహిత్ అవస్థి, సెల్వెస్టర్ డిసౌజ, రోస్టన్ డియాస్, అథర్వ అంకొలేకర్, హర్ష్ తన్నా. -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్ను ఆడించే క్రమంలో అయ్యర్ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్తో సిరీస్ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ?
కటక్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఈ మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కటక్ వన్డేలో ఎలాగైనా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది.మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని యోచిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్లే గెలిచి మరో 25 మ్యాచ్ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.కింగ్ ఇన్.. జైశ్వాల్ ఔట్!మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని భారత జట్టు వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.కటక్ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో అతడిని పక్కన పెట్టి యథావిధిగా గిల్ను ఓపెనర్గా పంపాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గిల్ స్దానంలో కోహ్లి బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది.మరోవైపు ఈ మ్యాచ్లో యువపేసర్ అర్ష్దీప్ సింగ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు అర్ష్దీప్ను ఈ మ్యాచ్లో ఆడించాలని మెనెజ్మెంట్ నిర్ణయించందంట. దీంతో మరో యువ పేసర్ హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కటక్ వన్డేతో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. కానీ పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ను ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తే కేఎల్ రాహుల్ బెంచ్కే పరిమితం కానున్నాడు.రోహిత్ ఫామ్లోకి వస్తాడా?కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ అభిమానులను అందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో సిరీస్లో కూడా కూడా అదేతీరును కనబరుస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హిట్మ్యాన్ ఔటయ్యాడు.ఈ క్రమంలో రోహిత్కు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడని, అతడి ఫామ్పై మాకు ఎటువంటి ఆందోళన లేదని కోటక్ అన్నారు. అదేవిధంగా ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంకపై వన్డేల్లో రోహిత్ మెరుగ్గా రాణించాడని, తిరిగి తన ఫామ్ను అందుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ),శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్, బెన్ డకెట్, లివింగ్స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్కే వేటు
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.దీంతో నాగ్పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం అప్డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.జైశ్వాల్పై వేటు..ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది. నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్మన్ గిల్ను యథావిధిగా ఓపెనర్గా పంపాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది.సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..ఇక ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్కు మైండ్ బ్లాంక్! వీడియో
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) సంచలన క్యాచ్తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ను పెవిలియన్కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హర్షిత్ రాణా.. మూడో బంతిని బెన్ డకెట్కు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డకెట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ మిస్టైమ్ కావడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇక జైశ్వాల్ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ బిత్తర పోయారు.వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జైశ్వాల్తో పాటు హర్షిత్ రాణా వన్డేల్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి కూడి మోకాలికి గాయమైంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: IND vs ENG1st Odi: ఇంగ్లండ్తో తొలి వన్డే.. భారత్కు భారీ షాక్YASHASVI JAISWAL TAKES A BLINDER ON DEBUT. 🤯- Harshit Rana has 2 early wickets. pic.twitter.com/GxnVvxDOta— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025 -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్ శర్మ -
మా మధ్య అలాంటి పోటీ లేనేలేదు.. రోహిత్ భయ్యా మాత్రం: గిల్
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్మన్ గిల్కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.టీ20లలో కొత్త జోడీకేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్తో స్వదేశంలో తాజా సిరీస్లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.‘టాక్సిక్’ కాంపిటిషన్?ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్మన్ గిల్కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.అతడు బాగా ఆడకూడదనుకోనుప్రతి మ్యాచ్లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో గిల్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్సిగ్నల్! -
‘ఇగో’ చూపించాలనుకుంటే జట్టులో చోటుండదు: సంజూకు వార్నింగ్
టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ ‘ఇగో’ చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టీ20 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్తో సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు.స్వదేశంలో బట్లర్ బృందంతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్(India vs England)లో సంజూ మొత్తంగా కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. పదే పదే ఒకే రీతిలో అవుటయ్యాడు. షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్లు ఇచ్చి వెనుదిరిగాడు.‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడు.మరోసారి పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి.. అతడు తన ‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నా. ‘లేదు.. లేదు.. నేను ఈ షాట్ కచ్చితంగా ఆడగలను’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.అసలు అతడు ఫామ్లేమితో సతమతమయ్యాడా? లేదంటే.. ‘ఇగో’ ట్రిప్నకు ఏమైనా వెళ్లాడా? నాకైతే అతడి గురించి ఏమీ ఏమీ అర్థం కావడం లేదు. ఈ సిరీస్లో.. నిజంగా తీవ్రంగా నిరాశపరిచాడు.జైస్వాల్ తిరిగి వస్తాడుసంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నాం కదా! ఇదిలో ఇలాగే ఆడితే మాత్రం.. సెలక్టర్లు మాత్రం అతడిపై మరోసారి వేటు వేస్తారు. యశస్వి జైస్వాల్ తిరిగి వస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ను కాదని యశస్వి జైస్వాల్ను ఆడిస్తారు’’ అని చిక్కా సంజూకు హెచ్చరికలు జారీ చేశాడు.గాయం.. ఆరు వారాలు దూరంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్ చేస్తుండగా సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.‘స్కానింగ్లో స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో శాంసన్ ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. పుణే వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు జమ్మూ కశ్మీర్తో కేరళ ఆడే రంజీ క్వార్టర్ ఫైనల్ పోరులో అతను బరిలోకి దిగడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సామ్సన్ ఐపీఎల్ కల్లా అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది.ఇక ఐపీఎల్లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గురువారం(ఫిబ్రవరి 6) నాగ్పూర్లో జరిగే తొలి వన్డేతో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్ అరుదైన ఘనత
సౌతాఫ్రికా గడ్డపై శతకాలతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్ సంజూ శాంసన్(Sanju Samson).. స్వదేశంలో మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఐదో టీ20 సందర్భంగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్తో కలిసి ఎలైట్ క్లబ్లో చేరాడు.కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సంజూ శాంసన్ రెండు అంతర్జాతీయ టీ20 శతకాలు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో సొంతగడ్డపై కూడా బ్యాట్ ఝులిపిస్తాడని ఎదురుచూసిన అభిమానులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ నిరాశపరిచాడు.ఆరంభం బాగున్నాకోల్కతాలో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన సంజూ.. ఆ తర్వాత చెన్నైలో ఐదు, రాజ్కోట్లో మూడు, పుణెలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో సంజూ శాంసన్ అంచనాలు అందుకోలేకపోయాడు. ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయాడు.తొలి బంతికే సిక్స్ బాదిమొత్తంగా ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో మరో పేసర్ జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్లోనూ సంజూ విఫలమైనప్పటికీ.. తన ఇన్నింగ్స్ను సిక్సర్తో ఆరంభించడం ద్వారా అరుదైన ఫీట్ నమోదు చేశాడు.టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్లో తొలి బంతికే సిక్స్ బాదిన మూడో భారత క్రికెటర్గా సంజూ చరిత్రకెక్కాడు. అంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు. కాగా ఇంగ్లండ్తో ఐదో టీ20లొ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో డీప్ స్వ్కేర్ లెగ్ మీదుగా ఫ్లాట్ సిక్స్(70 మీటర్లు) బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతడు మరో సిక్స్, ఫోర్ బాదడం విశేషం.సంజూకు భారత మాజీ క్రికెటర్ మద్దతుఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ ఇంగ్లండ్తో ఐదు టీ20లలో కలిపి కేవలం 51 పరుగులే చేశాడు. దీంతో అతడి నిలకడలేమి ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు మద్దతుగా నిలిచాడు. ‘‘టీ20 క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. ముఖ్యంగా బ్యాటింగ్ టాలెంట్ కోసం చూస్తున్నట్లయితే.. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.మ్యాచ్పై వారి ప్రభావం ఎలా ఉంటోంది.. జట్టు కోసం వారు ఏం చేయగలరన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంజూ శాంసన్ విషయానికొస్తే.. కఠినమైన పిచ్లపై అతడు అద్బుతమైన శతకాలతో జట్టును గెలిపించాడు.టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిదికాబట్టి అలాంటి వాళ్లు కొన్నిసార్లు విఫలమైనా పెద్దగా పట్టించుకోకూడదు. అయితే, దీర్ఘకాలంలో ఇదే పునరావృతమైనా కాస్త వేచిచూడాలి. టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిది. దూకుడుగా ముందుకెళ్లేందుకు రిస్క్ తీసుకుంటే ఇలాంటివి తప్పవు. ఇలాంటి వాళ్లకు ఫామ్లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు’’ అని సంజయ్ మంజ్రేకర్ సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, ఐదో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన క్రికెటర్లురోహిత్ శర్మ- 2021లో ఇంగ్లండ్పై- అహ్మదాబాద్ వేదికగా ఆదిల్ రషీద్ బౌలింగ్లోయశస్వి జైస్వాల్- 2024లో జింబాబ్వేపై- హరారే వేదికగా సికందర్ రజా బౌలింగ్లోసంజూ శాంసన్- 2025లో ఇంగ్లండ్పై- ముంబై వేదికగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్All those fake narrative PR by Rishabh Pant against Sanju Samson that "can't play extra pace, can't play short ball, can't play Archer". Sanju silenced all those critics by his performance🥵 . 6️⃣, 6️⃣ and 4️⃣ vs Jofra Archer in the FIRST over of the match. pic.twitter.com/YmAxAqoXrw— Rosh🧢 (@ImetSanjuSamson) February 3, 2025 -
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.ఆచితూచి...భారత్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించే ఎక్కువగా చర్చముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంగ్లండ్తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా లేదంటే.. టీమ్ మేనేజర్గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్రౌండర్గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమైన స్టార్లు జమ్మూ అండ్ కశ్మీర్తో మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.శ్రేయస్ మరోసారి..!ఈ మ్యాచ్లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు రెండు ఇన్నింగ్స్ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ అదే జోష్ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.రెండో ఇన్నింగ్స్లోనూ డకౌటైన శివమ్ దూబేఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్లో ఉన్నారు.ముంబై పరువు కాపాడిన శార్దూల్ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది. -
రోహిత్ బాటలోనే జైస్వాల్.. ఊరించి ఊసూరుమనిపించారు..!
చాలాకాలం తర్వాత రంజీల్లో ఆడుగుపెట్టిన టీమిండియా బ్యాటింగ్ స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా పూర్తిగా తేలిపోయారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) ఖాతా కూడా తెరవలేదు.టీమిండియా స్టార్ బ్యాటర్ల ప్రదర్శన సెకెండ్ ఇన్నింగ్స్లోనైనా మారుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలు ఆదిలోనే అడియాశలయ్యాయి. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన వీరు సెకెండ్ ఇన్నింగ్స్లో గుడి కంటే మెల్ల మేలన్నట్టుగా రెండంకెల స్కోర్లు చేశారు.రోహిత్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. జైస్వాల్ 51 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో రోహిత్ క్రీజ్లో ఉండింది కొద్ది సేపే అయినా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇదొక్కటే టీమిండియా అభిమానులకు ఊరట కలిగించే విషయం.మ్యాచ్ విషయానికొస్తే.. జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకు ఆలౌటైన ముంబై, సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా అదే పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు తొలి సెషన్లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ముంబై టాప్ త్రీ బ్యాటర్లు రోహిత్ (28), యశస్వి (26), హార్దిక్ తామోర్ (1) ఔట్ కాగా.. అజింక్య రహానే (1), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజ్లో ఉన్నారు. ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసింది. శుభమ్ ఖజూరియా (53), అబిద్ ముస్తాక్ (44) ఓ మోస్తరుగా రాణించారు. -
Rohit Sharma: వింటేజ్ ‘హిట్మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమైన ఈ ముంబై రాజా.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్తో పోరు(Mumbai Vs Jammu Kashmir)లో రెండు ఇన్నింగ్స్లో కలిపి కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.ఫలితంగా అతడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇకనైనా టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్గా, బ్యాటర్గా ఫెయిల్కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ విఫలమయ్యాడు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి సొంతగడ్డపై భారత్ 3-0తో ప్రత్యర్థి చేతుల్లో వైట్వాష్కు గురైంది.అనంతరం.. ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా రోహిత్ చేతులెత్తేశాడు. ఫలితంగా 3-1తో ఓడిన భారత్.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఇక గత పదకొండు ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9.రంజీల్లోనైనా రాణిస్తాడనిఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అంశం తెరమీదకు రాగా.. తాను ఇప్పట్లో తప్పుకొనే ప్రసక్తి లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీల బరిలో దిగాడు.ఇందులో భాగంగా గురువారం జమ్మూ కశ్మీర్తో మొదలైన మ్యాచ్లో యశస్వి జైస్వాల్తో కలిసి రోహిత్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా రాణిస్తాడనుకుంటే.. శుక్రవారం కూడా రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తుచేసి.. మరోసారి విఫలమైఆరంభంలో దూకుడుగా ఆడుతూ సిక్స్లు, బౌండరీలు బాదిన రోహిత్ శర్మ.. వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. అయితే, అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.VINTAGE ROHIT SHARMA IS BACK....🔥#RohitSharma#RanjiTrophy#Ranjitropy #RohitSharmapic.twitter.com/NQ3T9m52cu— HitMan (@HitMan_4545) January 24, 2025 జైసూ, గిల్, పంత్ కూడా అంతేఇక తొలి ఇన్నింగ్స్లో ఉమర్ నజీర్ బౌలింగ్లో పోరస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్.. తాజాగా యుధ్వీర్ సింఘ్ బౌలింగ్లో అబిద్ ముస్తాక్ చేతికి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ శతకం(161- పెర్త్) యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్తో తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్.. రెండో ఇన్నింగ్స్లో 51 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం కారణంగా ముంబై జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ కూడా రంజీ పునరాగమనంలో వైఫల్యం చెందారు. కర్ణాటకతో మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్గా బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్ సౌరాష్ట్రతో మ్యాచ్లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం. చదవండి: Ind vs Engఅతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ What a Lofted drive - rohit sharma #INDvENG #INDvsENG #ChampionsTrophy #RanjiTrophy#RohitSharma pic.twitter.com/igEGrpYc1n— kuldeep singh (@kuldeep0745) January 24, 2025 -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో రమన్దీప్సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! 3 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై కేవలం 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్తో పాటు కెప్టెన్ అజింక్య రహానే,హార్దిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.తీరు మారని రోహిత్..కాగా రోహిత్ శర్మ రెడ్బాల్ ఫార్మాట్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.అంతకముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ హిట్మ్యాన్ అదే తీరును కనబరిచాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తన రిథమ్ను తిరిగి పొందేందుకు రంజీల్లో ఆడాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా తన మార్క్ను చూపించలేకపోయాడు. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్లోనైనా హిట్మ్యాన్ తన బ్యాట్కు పనిచెబుతాడో లేదో చూడాలి.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా Rohit Sharma out for 3 in 19 😶Embarrass!ng #RohitSharmapic.twitter.com/UIoY5tCj6Z— Veena Jain (@DrJain21) January 23, 2025 -
Shubman Gill: అక్కడే కాదు.. ఇక్కడా ఫెయిల్!.. సింగిల్ డిజిట్ స్కోర్
దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.తారలు దిగి వచ్చారుఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడుపంజాబ్ ఓపెనర్గా గిల్ విఫలంఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి శుబ్మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్లో తొలి వికెట్గా గిల్ వెనుదిరిగాడు.కర్ణాటక పేసర్ల జోరుమొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.వన్డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షోకాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్లో జరిగిన ఈ మ్యాచ్లో గిల్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్లో శుబ్మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్లోకి రావాలని ఆశించిన గిల్కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్తో మ్యాచ్లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. చదవండి: NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా.. -
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్తో వన్డేల్లో శుబ్మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్గా భారత్కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రంజీ ట్రోఫీ 2024-25లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీ సెకెండ్ రౌండ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్తో జరగనున్న మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. 2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్మ్యాన్.. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ప్రాతిష్టత్మక టోర్నీలో ఆడనున్నాడు.రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో హిట్మ్యాన్ దారుణంగా నిరాశపరిచాడు. అంతకముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్రమంలో రోహిత్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో రోహిత్ తన పూర్వ వైభావాన్ని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే.. సీనియర్ ఆటగాళ్లు సైతం దేశీవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే రోహిత్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక జట్టులో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ను కూడా ముంబై సెలక్టర్లు చేర్చారు. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.పదేళ్ల తర్వాత..రోహిత్ శర్మ చివరగా 2015లో ముంబై తరపున రంజీల్లో ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఖరిగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్(114) సెంచరీతో మెరిశాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో రోహిత్కు అద్భుతమైన రికార్డు ఉంది.ఇప్పటివరకు 128 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ ముంబైకర్ 9287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 29 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు సన్నద్దం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్కు ముంబై జట్టు ఇదే..అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వెస్టర్ డిసౌజా, రొయిస్టన్ ద్యాస్, కర్ష్ కొఠారిచదవండి: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన.. -
‘గిల్ కంటే బెటర్.. టీమిండియా భవిష్య కెప్టెన్గా అతడికే నా ఓటు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సరికాదని.. పాకిస్తాన్పై శతకం బాదినప్పుడు మాత్రమే గిల్ ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నాడు. నిజానికి గిల్ కంటే.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందన్నాడు. అదే విధంగా.. భారత జట్టు భవిష్య కెప్టెన్(India Future Captain) ఎవరైతే బెటర్ అన్న అంశం గురించి కూడా బసిత్ అలీ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్తో మ్యాచ్తో రోహిత్ సేన ఫిబ్రవరి 20న తమ వేట మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో.. ఈ ఐసీసీ వన్డే ఫార్మాట్ ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ టీమ్కు శుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.గిల్ కంటే జైస్వాల్ బెటర్అంతేకాదు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తొలిసారిగా వన్డే జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్, పంత్ పేర్లను ప్రస్తావిస్తూ.. చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టు కూర్పు గురించి బసిత్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘గిల్ కంటే జైస్వాల్ బిగ్ ప్లేయర్. గిల్ ఓవర్రేటెడ్. ఒకవేళ అతడు పాకిస్తాన్ మీద సెంచరీ కొడితే అప్పుడు అతడిని మనం ప్రశంసించవచ్చు. అయినా సరే.. నా దృష్టిలో గిల్ కంటే.. జైస్వాల్ మెరుగైన ఆటగాడు. అతడి టెక్నిక్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జైస్వాలే బెటర్.టీమిండియా భవిష్య కెప్టెన్గా అతడికే నా ఓటుఇక టీమిండియా భవిష్య కెప్టెన్గా నా ఆప్షన్ రిషభ్ పంత్(Rishabh Pant). అతడికే నా ఓటు. కెప్టెన్గా శుబ్మన్ గిల్కు అవకాశాలు ఉండవచ్చు. అయితే, రిషభ్ పంత్ నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడు. అతడిని కెప్టెన్ను చేస్తే వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. సారథిగానూ అదరగొట్టగలడు. టీమిండియాకు అతడికి అవసరం ఉంది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.ఓపెనర్గా జైసూ, మిడిల్ ఆర్డర్లో పంత్ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత తుదిజట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగితే మంచిది. ఒకరు ఓపెనర్(జైస్వాల్)గా.. మరొకరు మిడిలార్డర్(పంత్)లో రావాలి. ఏదేమైనా జైస్వాల్ లేకుండా ప్లేయింగ్ ఎలెవన్ ఉండదనే అనుకుంటున్నా.అదే విధంగా.. రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఉంటాడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగల సత్తా అతడి సొంతం. కేఎల్ రాహుల్కు అలాంటి నైపుణ్యాలు లేవు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టు, టీ20లో టీమిండియా తరఫున రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అతడి వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమేఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్- గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్-వైస్ కెప్టెన్ జోడీని విడదీసి.. జైస్వాల్ను ఓపెనర్గా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ మాత్రం గిల్ను కాదని.. ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయని జైసూకు ఓటేయడం గమనార్హం.ఇక వన్డేల్లో గిల్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 47 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2328 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. మరోవైపు.. పంత్ వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే. 31 వన్డేల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 871 రన్స్ మాత్రమే చేశాడు.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
ఇంగ్లండ్తో స్వదేశంలో మూడు వన్డేల(Ind vs Eng ODI Series)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. ఇదే జట్టు ఒక్క మార్పుతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలోకి దిగుతుందని వెల్లడించిందిఓపెనర్గా ఎవరు?కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్(Shubman Gill) వైస్ కెప్టెన్గా ఎంపికకాగా.. మరో యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు తుదిజట్టులో ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో దుమ్ములేపాడు. అనంతరం రెండు ద్విశతకాలు కూడా బాది సత్తా చాటాడు. అదే టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలోనూ జైసూ ఎంట్రీ ఇచ్చాడు.బుమ్రా బదులు హర్షిత్ రాణాఇక ఇప్పటి వరకు ఓవరాల్గా టీమిండియా తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 1798, టీ20లలో 723 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది.అందుకే ఇంగ్లండ్తో వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, ఫిట్నెస్ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా జట్టుతో చేరనుండగా.. హర్షిత్ పక్కకు తప్పుకొంటాడు.షమీతో పాటు వారు కూడాఇక ఈ జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ స్థానం సంపాదించగా.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మొత్తం ఐదు టీ20లు(జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2) జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది.ఇంగ్లండ్తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
ఫామ్లో ఉన్నంత మాత్రాన కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు: డీకే
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(Karun Nair) సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్లో అతడు నాటౌట్గా నిలవడం విశేషం.బ్యాటర్గా దుమ్ములేపుతూనే.. కెప్టెన్గానూ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో విదర్భను విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్కు చేర్చాడు. దేశీ వన్డే టోర్నీలో విదర్భ ఇలా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.అతడిని ఎంపిక చేయాలిఈ నేపథ్యంలో కరుణ్ నాయర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. కరుణ్ నాయర్ను ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నా.. అతడిని ఈ మెగా ఈవెంట్కు ఎంపిక చేయడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు అమోఘం. అతడు ఊహకు అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు.ఫామ్లో ఉన్నంత మాత్రాన సెలక్ట్ చేయరుఅందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి గురించే చర్చిస్తున్నారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కరుణ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఎందుకంటే.. సెలక్టర్లు ఇప్పటికే టీమ్ గురించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటారు.ఏదేమైనా కరుణ్ నాయర్ గొప్ప ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్లో అద్భుతంగా ఆడగలిగే ఇన్ ఫామ్ బ్యాటర్ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అతడు గనుక తిరిగి జట్టులోకి వస్తే నాకూ సంతోషమే’’ అని డీకే పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యే అవకాశం లేదని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో జైసూ ఆడటం ఖాయం‘‘ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సెలక్టర్లు జైస్వాల్కు విశ్రాంతినిచ్చారు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం ఈ యువ ఆటగాడికి తగినంత రెస్ట్ అవసరం.ఈ విషయంలో సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందకు వంద శాతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేస్తారు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిస్తారు. వన్డేల్లో అరంగేట్రం కదా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్తో టీ20లలో ఆడనంత మాత్రాన అతడికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో, టీ20లలో అదరగొడుతున్న జైస్వాల్ ఇంత వరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్మన్ గిల్పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.దుబాయ్ వేదికగాపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్లు ఆడనుంది.ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.అతడిని సెలక్ట్ చేయండిఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.పంత్ వద్దు: భజ్జీమరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా తన మొదటి ఓటు సంజూ శాంసన్కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్ను కాదని సంజూ శాంసన్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు.జైసూ భేష్అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్ -
ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో రోహిత్ పేలవ ప్రదర్శన కనబర్చగా... యశస్వి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఆసీస్తో ప్రతిష్టాత్మక సిరీస్లో భారత జట్టు పరాజయం పాలవగా... ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీ ల్లో ఆడాలనే డిమాండ్ పెరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ‘అందుబాటులో ఉన్నవాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడాలి’ అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెపె్టన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్లో గడపగా... బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా... జమ్ముకశ్మీర్తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని... ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ‘రోహిత్ను కూడా అడుగుతాం. అతడు అందుబాటులో ఉంటానంటే జట్టులోకి ఎంపిక చేస్తాం’ అని అన్నారు. -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
CT 2025: యశస్వి జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు బంపరాఫర్!?
టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal). తొలుత(2023) టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారీ శతకం(171) బాది.. తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. విండీస్తో సిరీస్తోనే టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.డబుల్ సెంచరీల వీరుడునిలకడైన ఆట తీరుతో దాదాపు ఏడాదిన్నర కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు జైస్వాల్. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయి.. ఇప్పటికే ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన జైస్వాల్.. 1798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.వన్డేల్లో మాత్రం నో ఛాన్స్!ఇక అంతర్జాతీయ టీ20లలో 23 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ముంబై బ్యాటర్.. 723 రన్స్ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా, టీ20లలో శుబ్మన్ గిల్(Shubman Gill)కు జంటగా ఓపెనర్గా పాగా వేసిన 23 ఏళ్ల జైసూకు ఇంత వరకు వన్డేల్లో మాత్రం అవకాశం రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ- గిల్లు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ యువ బ్యాటర్కు ఇంత వరకు సెలక్టర్లు పిలుపునివ్వలేదు.మెగా టోర్నీకి ఎంపిక?! అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా జైస్వాల్ వన్డేల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జైసూ వన్డే అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది.లిస్ట్-‘ఎ’ క్రికెట్లో గణాంకాలు ఇలాఅందుకే ఈ మెగా టోర్నీకి ముందు జైస్వాల్ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్- గిల్లకు చాంపియన్స్ ట్రోఫీలో బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్తో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడించి అతడిని సన్నద్ధం చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో యశస్వి జైస్వాల్ మెరుగైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కేవలం 32 మ్యాచ్లలోనే 1511 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ(203) ఉంది.నితీశ్ కుమార్ రెడ్డికి బంపరాఫర్!ఇక జైస్వాల్తో పాటు మరో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంధ్ర క్రికెటర్ ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో శతకంతో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.అయితే, ఇప్పట్లో వన్డేల్లో నితీశ్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు రెవ్స్పోర్ట్స్ పేర్కొంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీశ్ రెడ్డి ఎంపికకానున్నట్లు పేర్కొంది. అయితే, ప్రధాన జట్టులో కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్స్లో అతడు చోటు సంపాదించనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్తో సిరీస్లలోనైనా ఆడిస్తారా? -
మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. దీంతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారిపోయింది.అయితే ఈ సిరీస్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన యశస్వి.. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు.మొత్తం ఐదు మ్యాచ్లలో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ (448) తర్వాత ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యశస్వి ఈ పోస్ట్ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ పనిని ప్రేమించు బ్రదర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్ View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్లో ఓడి, బ్రిస్బేన్లో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్తో ఈ సిరీస్లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఆల్టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్గా 145 పరుగుల లీడ్లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
టీమిండియా ప్లేయర్లు అబద్దాల కోరులు: భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా(Surinder Khanna) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సేనను ‘అబద్దాల కోరు’గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. సరిగ్గా ఆడటం చేతగాకే సాకులు వెదుక్కొంటూ.. వివాదాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.శుభారంభం చేసినా..భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులో ఆడుతోంది. అయితే, పెర్త్లో 295 పరుగుల తేడాతో గెలిచి.. శుభారంభం చేసినా.. తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. కాస్త కష్టపడినా కనీసం డ్రా చేసుకోగలిగే మ్యాచ్లో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.జైస్వాల్ అవుటైన తీరుపై వివాదంఇక ఈ మ్యాచ్లో చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్((Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ) కావడంతో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో జైసూ.. లెగ్సైడ్ దిశగా షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.ఈ నేపథ్యంలో ఆసీస్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ స్పందించలేదు. దీంతో కంగారూలు రివ్యూకు వెళ్లగా.. చాలాసార్లు రీప్లేలో చూసినా స్పష్టత రాలేదు. స్నీకో మీటర్లోనూ బంతి బ్యాట్ను లేదంటే గ్లౌవ్ను తాకినట్లుగా శబ్దం రాలేదు. అయినప్పటికీ విజువల్ ఎవిడెన్స్ కారణంగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ తారుమారు చేస్తూ.. జైస్వాల్ను అవుట్గా ప్రకటించారు.కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిఫలితంగా కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమికి బాటలు పడ్డాయి. అయితే, తాను అవుట్ కాలేదని టెక్నాలజీ(స్నీకో) చెబుతున్నా అవుట్గా ప్రకటించడం పట్ల జైస్వాల్ అంపైర్ల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని మైదానం వీడాల్సిందిగా కోరగా.. ఈ విషయమై వివాదం చెలరరేగింది.మండిపడ్డ సన్నీఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జైస్వాల్ స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా.. ఆసీస్కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సురీందర్ ఖన్నా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు. నిజాయితీ ఆడటం నేర్చుకోండి‘‘ఇందులో వివాదం సృష్టించడానికి తావులేదు. నాలుగు కోణాల్లో పరిశీలించిన తర్వాత బంతి బ్యాటర్ గ్లౌవ్ను తాకి.. అలెక్స్ క్యారీ చేతుల్లో పడినట్లు తేలింది. ఆకాశ్ దీప్ కూడా ఇలాగే.. తాను క్యాచ్ అవుట్ అయినా.. మైదానం వీడకుండా ఫిర్యాదులు చేస్తూ ఉండిపోయాడు.వీళ్లంతా అబద్దాల కోరులు. ముందు నిజాయితీ ఆడటం నేర్చుకోండి. అప్పుడే మీరు గెలుస్తారు. అయినా, బ్యాట్ మన చేతుల్లోనే ఉన్నపుడు.. అది బంతిని లేదంటే గ్లౌవ్ను తాకిందా లేదా స్పష్టంగా తెలుస్తుంది కదా!అందుకే ఓడిపోయాంమనం చెత్తగా ఆడాం కాబట్టే ఓడిపోయాం. ఇంత చెత్తగా ఎవరైనా బ్యాటింగ్ చేస్తారా? రండి వచ్చి ఐపీఎల్లో పరుగులు సాధించండి. మరీ దూకుడుగా ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సానుకూల దృక్పథంతో ఆడండి.కనీసం కొత్త సంవత్సరంలో అయినా టీమిండియాను అదృష్టం వరిస్తుందో చూడాలి’’ అంటూ సురీందర్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యానించాడు. కాగా ఢిల్లీకి చెందిన సురీందర్ ఖన్నా 1979- 84 మధ్య టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడి.. 176 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరుగనుంది. జనవరి 3-7 మధ్య ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్తో మ్యాచ్లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో మాత్రే.. అంగ్క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్డౌన్ బ్యాటర్గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
జైస్వాల్ నాటౌట్.. ఆస్ట్రేలియా మోసం
-
IND Vs AUS: పోరాడినా... ఓటమి తప్పలేదు
భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యం... తొలి సెషన్లో 33/3 స్కోరుతో కాస్త ఆందోళన... అయితే రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా చేజార్చుకోలేదు... దాంతో ఓటమిని తప్పించుకోవడంపై ఆశలు... విరామం తర్వాత 121/3తో మెరుగైన స్థితి... అయితే అనూహ్యంగా 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి... పంత్ ఆడిన తప్పుడు షాట్తో ఈ పతనం మొదలైంది... అయినా సరే జైస్వాల్ పట్టుదలగా ఆడుతుండటం, మరో నాలుగు వికెట్లు ఉండటంతో కొంత భరోసా... మరో 21.2 ఓవర్లు నిలబడిగలిగితే చాలు... మ్యాచ్ను ‘డ్రా’గా ముగించవచ్చు... కానీ జైస్వాల్ అవుట్ కావడంతో అంతా మారిపోయింది... అతను వెనుదిరిగిన తర్వాత టీమిండియా ఆట ముగించేందుకు ఆసీస్కు 8.2 ఓవర్లు సరిపోయాయి... ఒక్క సెషన్లోనే 7 వికెట్లు చేజార్చుకున్న భారత్ మరో 12.5 ఓవర్లు మిగిలి ఉన్న దశలో ఓటమిని ఖరారు చేసుకుంది... వరుస మలుపులతో సాగుతూ వచ్చిన మెల్బోర్న్ టెస్టులో చివరకు ఆ్రస్టేలియానే గెలుపు బావుటా ఎగరవేసింది. వేర్వేరు సందర్భాల్లో పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా... వాటిని సమర్థంగా ఉపయోగించుకోలేక రోహిత్ బృందం సిరీస్లో వెనుకబడిపోయింది. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉండాలంటే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. మెల్బోర్న్: నాలుగేళ్ల క్రితం ‘గాబా’ మైదానం తరహాలో భారీ లక్ష్యాన్ని ఛేదించి మెల్బోర్న్లో భారత్ సంచలన విజయం సాధిస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. గెలుపు కాదు కదా ... ఓటమి నుంచి తప్పించుకొని ‘డ్రా’గా ముగించే చాన్స్ కూడా ఆ్రస్టేలియా ఇవ్వలేదు. ఎంసీజీలో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కమిన్స్, బోలండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, లయన్కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆ్రస్టేలియా 2–1తో ముందంజ వేసింది. చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మ్యాచ్లో కీలకమైన 90 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. జైస్వాల్ మినహా... సిరీస్లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న కెపె్టన్ రోహిత్ శర్మ (9) ఈసారి చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. అయితే 40 బంతులు ఎదుర్కొన్న అతను తొలిసారి కమిన్స్ బౌలింగ్లో దూకుడైన షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. అదే ఓవర్లో రాహుల్ (0) కూడా అవుట్ కాగా, స్టార్క్ పదునైన బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లి (5) కూడా స్లిప్లో చిక్కడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత జైస్వాల్, పంత్ (104 బంతుల్లో 30; 2 ఫోర్లు) సాధికారికంగా ఆడారు. 27.5 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే టీ తర్వాత ఎట్టకేలకు పార్ట్టైమర్ హెడ్తో బౌలింగ్ చేయించిన వ్యూహం ఫలించింది. పంత్ను అవుట్ చేసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంతే... ఆ తర్వాత జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 34 పరుగుల వ్యవధిలోనే జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. జడేజా (2), నితీశ్ రెడ్డి (1) విఫలం కాగా, సిరాజ్ (0)ను లయన్ ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 228/9తో ఆట కొనసాగించిన ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 234; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) కమిన్స్ 84; రోహిత్ (సి) మార్‡్ష (బి) కమిన్స్ 9; రాహుల్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 5; పంత్ (సి) మార్‡్ష (బి) హెడ్ 30; జడేజా (సి) కేరీ (బి) బోలండ్ 2; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) లయన్ 1; సుందర్ (నాటౌట్) 5; ఆకాశ్దీప్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) బోలండ్ 0; సిరాజ్ (ఎల్బీ) (బి) లయన్ 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–25, 2–25, 3–33, 4–121, 5–127, 6–130, 7–140, 8–150, 9–154, 10–155. బౌలింగ్: స్టార్క్ 16– 8–25–1, కమిన్స్ 18–5–28–3, బోలండ్ 16–7 –39–3, మార్‡్ష 3–2–2–0, లయన్ 20.1–6– 37–2, హెడ్ 5–0–14–1, లబుషేన్ 1–1–0–0. చాలా నిరాశగా ఉంది. చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాం కానీ అది సాధ్యం కాలేదు. ఆఖర్లో అంతా మారిపోయింది. టెస్టు మొత్తాన్ని చూస్తే మాకూ కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ మేం వాడుకోలేక పోయాం. వారి చివరి వికెట్ భాగస్వామ్యం కూడా దెబ్బ తీసింది. 340 పరుగులు ఎప్పుడైనా కష్టమే. చివరి రెండు సెషన్లలో ధాటిగా ఆడి లక్ష్యం చేరేందుకు ప్రయతి్నంచేందుకు కావాల్సిన పునాది వేయలేకపోయాం. తర్వాతి టెస్టుకు ముందు కొన్ని లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. గట్టిగా ప్రయతి్నంచి 2–2గా మార్చే ప్రయత్నం చేస్తాం. నా బ్యాటింగ్ గురించి చెప్పాలంటే మానసికంగా నేను సరైన స్థితిలో లేను. నేను ఏం చేయాలని ప్రయతి్నంచినా కలిసి రావడం లేదు. ఫలితం దక్కకపోవడం నిరాశ కలిగిస్తోందనేది మాత్రం వాస్తవం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ జైస్వాల్ అవుట్పై వివాదం! చక్కటి ఇన్నింగ్స్తో ఓటమి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. కమిన్స్ బౌలింగ్లో లెగ్సైడ్ దిశగా వెళుతున్న బంతిని ఆడి కీపర్ కేరీకి అతను క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ విల్సన్ స్పందించకపోవడంతో ఆసీస్ రివ్యూ కోరింది. ఇదే చివరకు చర్చకు దారి తీసింది. వరుస రీప్లేల తర్వాత స్పష్టత రాకపోగా, ‘స్నికో’లో కూడా ఏదీ తేలలేదు. ఇక్కడా బంతి బ్యాట్ను తాకినట్లుగా కనిపించలేదు. అయితే ముందు భాగంనుంచి చూసిన రీప్లేలో బంతి బ్యాట్ను దాటిన తర్వాత దిశను మార్చుకున్నట్లుగా కనిపించింది. దీని ఆధారంగానే అది బ్యాట్కు తగిలిందని చెబుతూ థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ‘అవుట్’గా ప్రకటించడంతో జైస్వాల్ నిరాశగా మైదానం వీడాడు. అయితే ‘స్నికో’ను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ప్రశి్నంచిన సునీల్ గావస్కర్... ఇక సాంకేతికత ఎందుకని, కొన్నిసార్లు బ్యాట్కు తగలకపోయినా బంతి దిశ మార్చుకోవడం సహజమని విమర్శించాడు. మరోవైపు మాజీ అంపైర్ సైమన్ టఫెల్ కూడా ఇది ‘అవుట్’ అని నిర్ధారించాడు. అంపైరింగ్ ప్రొటోకాల్ ప్రకారం బంతి దిశ మార్చుకున్నట్లు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత కెపె్టన్ రోహిత్ శర్మ కూడా జైస్వాల్ బ్యాట్కి బంతి తాకిందని, అతను అవుట్ అని తేల్చి వివాదానికి ముగింపు పలకడం గమనార్హం. -
‘థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే.. జైస్వాల్ నాటౌట్’
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు((Yashasvi Jaiswal’s controversial dismissal) )పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. జైసూ నాటౌట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. అవుట్గా ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.సరైన కారణాలు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేయడం ఏమిటని రాజీవ్ శుక్లా(Rajiv Shukla) మండిపడ్డారు. అదే విధంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులుఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టు ఆఖరిరోజైన సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఘోర ఓటమిభారత ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ఒంటరి పోరాటం చేసిన యశస్వి జైస్వాల్ అవుటైన విధానం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో భాగంగా కమిన్స్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు జైస్వాల్. అయితే, బంతి అతడి గ్లౌవ్ను తాకినట్లుగా కనిపించి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ వికెట్ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా స్నీకో మీటర్లో స్పైక్ రాకపోయినా.. థర్డ్ అంపైర్ జైస్వాల్ను అవుట్గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్కు సూచించాడు. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోగా.. మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరికి 184 పరుగుల తేడాతో కంగారూ జట్టు రోహిత్ సేనపై విజయదుందుభి మోగించి.. 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేఅయితే, జైస్వాల్ అవుటా? నాటౌటా? అన్న అంశంపై క్రీడా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల జైస్వాల్కు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మీరు సాంకేతికతను ఉపయోగించాలనుకుంటే.. మొత్తంగా దానినే పరిగణనలోకి తీసుకోండి.అంతేకానీ మిథ్యనే నిజమని భావించవద్దు. అక్కడ స్నీకో మీటర్ ఉంది. అందులో లైన్ స్ట్రెయిట్గానే ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా నాటౌట్’’ అని తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ షోలో పంచుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నాడు.సిరీస్లో వెనుకబడిన టీమిండియాకాగా ఆసీస్తో పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు డ్రా చేసుకున్న రోహిత్ సేన.. మెల్బోర్న్ టెస్టులో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. కమిన్స్ బృందం విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 155 పరుగులకే కుప్పకూలింది. ఇరుజట్ల మధ్య జనవరి 3న సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో 82 పరుగులు చేసి దురదృష్టకరరీతిలో రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 84 పరుగుల వద్ద థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 నామినీస్ వీరే.. జైస్వాల్కు నో ఛాన్స్
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 30) విడుదల చేసింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్.. శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నామినేట్ కాగా.. బౌలింగ్ విభాగం నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నామినేట్ అయ్యాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు నామినేట్ కాకపోవడం గమనార్హం. జైస్వాల్ (29 ఇన్నింగ్స్ల్లో 1478 పరుగులు) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ కాకుండా అతని కంటే తక్కువ పరుగులు చేసిన కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్ ఐసీసీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.రూట్: టెస్ట్ల్లో ఈ ఏడాది రూట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రూట్ ఈ ఏడాది 31 ఇన్నింగ్స్ల్లో 1556 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. రూట్ ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు దాటడం ఇది ఐదో సారి. రూట్ ఈ ఏడాది ఆరు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. రూట్ బౌలింగ్లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రూట్ ఈ ఏడాదే తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ను సాధించాడు. ముల్తాన్ టెస్ట్లో రూట్ పాక్పై డబుల్ సెంచరీ (262) చేశాడు. బుమ్రా: బుమ్రా ఈ ఏడాది ఏ ఇతర బౌలర్ చేయనటువంటి అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా ఈ ఏడాది 13 టెస్ట్ల్లో 14.92 సగటున 71 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా టాప్లో ఉండగా.. అతని దరిదాపుల్లో ఏ బౌలర్ లేడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బుమ్రా తర్వాత అత్యధికంగా 52 వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాతి స్థానాల్లో సిరాజ్ (35), కమిన్స్ (37), సౌధీ (17) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 మ్యాచ్ల్లో 30 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.బ్రూక్: బ్రూక్ ఈ ఏడాది అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రూక్ ఈ ఏడాది 20 ఇన్నింగ్స్ల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 1100 పరుగులు చేశాడు. బ్రూక్ ముల్తాన్ టెస్ట్లో పాక్పై ట్రిపుల్ సెంచరీ (317) చేశాడు. బ్రూక్ ఈ ఏడాది చేసిన పరుగుల్లో అత్యధిక శాతం విదేశాల్లో చేసినవే కావడం విశేషం. బ్రూక్ ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో కొద్ది కాలం పాటు నంబర్ వన్ బ్యాటర్గానూ కొనసాగాడు.కమిందు మెండిస్: శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కమిందు ఐదో స్థానంలో నిలిచాడు. కమిందు ఈ ఏడాది 16 ఇన్నింగ్స్ల్లో 74.92 సగటున 1049 పరుగులు చేశాడు. -
మెల్బోర్న్ టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
జైస్వాల్ అవుటా? నాటౌటా?.. అంపైర్ కళ్లకు ఏమైంది?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్నీకో మీటర్లో స్పైక్ రాకున్నా జైసూను అవుట్గా ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారత బ్యాటర్కు అన్యాయం(Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా.. మూడు టెస్టులు పూర్తి చేసుకుని ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు భారత్కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఆది నుంచే తడ‘బ్యా’టు.. ‘స్టార్లు’ దారుణంగా విఫలంఇంతటి కీలక టెస్టులో ఆది నుంచే తడబడ్డ టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్(82) అద్భుత ఇన్నింగ్స్.. నితీశ్ కుమార్ రెడ్డి(114) శతకం వల్ల మ్యాచ్లో నిలవగలిగింది. ఇక ఆసీస్ను రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకే కట్టడి చేసి భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు సజీవం చేశారు.ఈ క్రమంలో ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మళ్లీ పాత కథే పునరావృతమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(9), కేఎల్ రాహుల్(0), విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆది నుంచి క్రీజులో పాతుకుపోయి.. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.పంత్ కాసేపురిషభ్ పంత్(Rishabh Pant- 30)తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు జైస్వాల్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి మాత్రం అతడికి పెద్దగా సహకారం అందలేదు. అయినప్పటికీ పట్టుదలగా నిలబడ్డ జైసూ.. అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాల్సి వచ్చింది.నాటౌట్ ఇచ్చిన ఫీల్డ్ అంపైర్ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో షార్ట్ బాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన జైసూ.. షాట్ కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. అయితే, ఆస్ట్రేలియా అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.స్పైక్ రాలేదు.. అయినాదీంతో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ నిర్ణయం కీలకంగా మారింది. అయితే, బంతి బ్యాట్ను లేదంటే గ్లౌవ్ను తాకిందా అన్న విషయం స్పష్టంగా కనబడలేదు. అంతేకాదు.. శబ్దాన్ని సూచించే స్నీకో మీటర్లోనూ స్పైక్ రాలేదు. అయినప్పటికీ తనకు బంతి గ్లౌవ్ను తాకినట్లుగా కనిపించిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు.ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేసి.. జైస్వాల్ను అవుట్గా ప్రకటించాలని సూచించాడు. దీంతో టీమిండియా కీలక వికెట్ కోల్పోయింది. 208 బంతులు ఎదుర్కొని 84 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఏడో వికెట్గా అతడు వెనుదిరిగాడు.అయితే, తనను అవుట్గా ప్రకటించడం పట్ల జైసూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతడిని మైదానం వీడాల్సిందిగా సూచించడంతో నిరాశగా వెనుదిరిగాడు.అంపైర్కు కళ్లు కనిపించడం లేదా?ఈ నేపథ్యంలో జైస్వాల్ అవుటైన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా.. కేవలం విజువల్ ఎవిడెన్స్ ద్వారా.. అది కూడా క్లారిటీ లేకుండా బ్యాటర్ను ఎలా అవుట్గా పరిగణిస్తారని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంపైర్కు కళ్లు కనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్లో 1-2తో వెనుకబడి ఉంది.చదవండి: వారి మాటలు తప్పని నిరూపించా.. ఇక మిగిలింది అదే: నితీశ్ రెడ్డిThird Umpire giving the decision on Yashasvi Jaiswal. pic.twitter.com/HVYzaNkLlf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024 -
బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 340 పరుగుల లక్ష్య చేధనలో భారత్ పోరాడుతోంది. ఆఖరి రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించగా.. రెండో సెషన్లో మాత్రం టీమిండియా అద్బుతంగా తిరిగి పుంజుకుంది.యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆఖరి రోజు ఆటలో యశస్వి జైశ్వాల్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.ఏమి జరిగిందంటే?అద్భుతంగా ఆడుతున్న జైశ్వాల్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు స్టార్క్ నాన్-స్ట్రైకర్ ఎండ్లో వికెట్లపై ఉన్న బెయిల్స్ను మార్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అసంతృప్తికి గురయ్యాడు. స్టార్క్ తన రన్ ఆప్ను తీసుకునేందుకు వెళ్లిన వెంటనే యశస్వి బెయిల్స్ను తిరిగి మార్చాడు.దీంతో బంతి వేసిన తర్వాత జైశ్వాల్ను స్టార్క్ ఏదో అన్నాడు. జైశ్వాల్ కూడా అందుకు ధీటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(61 నాటౌట్), పంత్(22) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 236 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్కు 7 వికెట్లు కావాలి.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్ డ్రా కోసం ఆడుతున్నట్లు అన్పిస్తోంది.చదవండి: IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్ అయిపో రోహిత్'..Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 -
ఈజీ క్యాచ్లు విడిచిపెట్టిన జైశ్వాల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్
మెల్బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్స్లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. ఆఖరి సెషన్లో ఆసీస్ అద్బుతమైన కమ్బ్యాక్ చేసింది. 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను టెయిలాండర్లు నాథన్ లియోన్(41 నాటౌట్), స్కాట్ బోలాండ్(10 నాటౌట్) విరోచిత పోరాటం కనబరిచారు.ఆఖరి వికెట్కు వీరిద్దరూ 55 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 333 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.జైశ్వాల్పై రోహిత్ ఫైర్..కాగా ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచాడు. మూడు క్యాచ్లను జైశ్వాల్ జారవిడిచాడు. తొలుత 2 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్ను యశస్వి విడిచిపెట్టాడు. అయితే ఆ క్యాచ్ అందుకోవడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత మాత్రం లబుషేన్, కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్లను మాత్రం ముంబైకర్ నేలపాలు చేశాడు. ఆసీస్ స్కోర్ 99/6 ఉన్నప్పుడు.. ఆకాష్ దీప్ బౌలింగ్లో ఓ బంతి లబుషేన్ బ్యాట్కు తాకి గల్లీ పొజిషేన్లో ఉన్న జైశ్వాల్ చేతికి వెళ్లింది. అయితే ఆ బంతిని అందుకోవడంలో యువ ఆటగాడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ..జైశ్వాల్పై సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: WTC 2023-25: పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా -
పాపం జైస్వాల్.. కోహ్లి క్షమాపణ చెప్పాలి!.. తప్పు ఎవరిది?
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. స్వీయ తప్పిదం కారణంగా రనౌట్(#Yashasvi Jaiswal Run Out) అయ్యాడు. అయితే, కొంత మంది మాత్రం జైస్వాల్ పెవిలియన్ చేరడానికి విరాట్ కోహ్లి(#Virat Kohli)నే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఆసీస్ భారీ స్కోరుబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ముగియగా.. 1-1తో సమంగా ఉన్న ఇరుజట్ల మధ్య.. గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్కు శుభారంభం లభించినా.. ఆఖర్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.రోహిత్ మరోసారి విఫలంకెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma Fails Again- 3) మరోసారి నిరాశపరచగా.. మూడో స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్(24) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(82), విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జైస్వాల్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు.పరుగు కోసం యత్నించిన జైస్వాల్టీమిండియా ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బంతితో బరిలోకి దిగగా.. ఆఖరి బంతికి జైస్వాల్ మిడాన్దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో మరో ఎండ్లో ఉన్న కోహ్లి.. ఫీల్డర్ల వైపు చూస్తూ ఉండగా.. అప్పటికే జైస్వాల్ క్రీజును వీడాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్వైపు దూసుకురాగా.. అప్పటికి కోహ్లి కూడా తన ప్లేస్లోకి తిరిగి వచ్చేశాడు.జైస్వాల్ రనౌట్.. శతక భాగస్వామ్యానికి తెరఅప్పటికి బంతిని అందుకున్న ఫీల్డర్ కమిన్స్ స్టంప్స్ వైపు బంతిని విసరగా.. మిస్ అయింది. అయితే, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వేగంగా స్పందించి స్టంప్స్ను గిరాటేయడంతో జైస్వాల్ రనౌటయ్యాడు. ఫలితంగా జైస్వాల్- కోహ్లి శతక భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 102 పరుగులు జోడించారు.అంతా తలకిందులుఅయితే, జైస్వాల్ అవుటైన కాసేపటికే కోహ్లి కూడా పెవిలియన్ చేరాడు. బోలాండ్ బౌలింగ్లో క్యారీకి క్యాచ్ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ రెండు, స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.కాగా జైస్వాల్కు రనౌట్కు కోహ్లినే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. యువ బ్యాటర్కు కోహ్లి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించాడు. అయితే, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం.. రనౌట్ విషయంలో జైస్వాల్దే తప్పని.. అందుకు కోహ్లిని నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.చదవండి: IND Vs AUS 4th Test: ‘జట్టుకు భారంగా మారావు.. మర్యాదగా తప్పుకుంటే మంచిది’A massive mix-up between Virat Kohli and Yashasvi Jaiswal sees Jaiswal run out for 82! #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/a9G4uZwYIk— cricket.com.au (@cricketcomau) December 27, 2024 -
గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించలేదు. తొలిరోజు అద్భుత ఆట తీరు కనబరిచిన ఆతిథ్య ఆసీస్ పైచేయి సాధించింది. ఆది నుంచి భారత జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది.భారత బౌలర్ల సహనానికి పరీక్షముఖ్యంగా అరంగేట్ర ఓపెనర్, 19 ఏళ్ల సామ్ కొన్స్టాస్(Sam Konstas) కొరకరాని కొయ్యగా మారి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ అనుభవజ్ఞుడిలా దూకుడు ప్రదర్శించాడు. అయితే, ఎట్టకేలకు రవీంద్ర జడేజా కొన్స్టాస్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది.మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) కూడా అర్ధ శతకాలతో రాణించగా.. ట్రవిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(31) కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ సైతం బ్యాట్ ఝులిపించాడు. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి స్మిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు.సహనం కోల్పోయిన రోహిత్ఈ నేపథ్యంలో చిరాకెత్తిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోనే చాలాసార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ విషయంలో నిర్లక్ష్యంగా కనిపించిన యశస్వి జైస్వాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డూ బౌలింగ్లో స్మిత్ డిఫెన్సివ్ షాట్ ఆడగా.. సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్(Yashasvi Jaiswal) బంతిని ఆపాల్సింది పోయి.. జంప్ చేశాడు.ఏయ్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?అంతేకాదు.. అక్కడి నుంచి కొంచెం కూడా కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. ఇక జడ్డూ అప్పటికే బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. ఈ ఘటన నేపథ్యంలో అసహనానికి గురైన రోహిత్ శర్మ.. ‘‘ఏయ్ జైసూ.. ఇక్కడ ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాటర్ బంతిని టచ్ చేసేంత వరకు నీ పొజిషన్లోనే ఉండు. కింద కూర్చున్నట్లుగానే ఉండు. అంతేగానీ.. నిలబడేందుకు ప్రయత్నించకు’’ అంటూ చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.తొలిరోజు కంగారూలదేకాగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మొదటిరోజే మెరుగైన స్కోరు సాధించింది. బాక్సింగ్ డే(క్రిస్మస్ తెల్లవారి) మ్యాచ్లో టాపార్డర్ దంచికొట్టడంతో మూడు వందల పైచిలుకు స్కోరు సాధించింది. 86 ఓవర్ల ఆటలో ఆరు వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది. ఇక స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: IND vs AUS: బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియోStump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్లో నంబర్వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్వన్గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్పై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా అతడి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.మూడో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్కుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్లో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా.. ఆసీస్ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.ఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్- భారత్ మధ్య శనివారం(డిసెంబరు 14) నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఇందుకోసం టీమిండియా అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ చేరుకునే క్రమంలో జైస్వాల్ చేసిన పొరపాటు రోహిత్ ఆగ్రహానికి కారణమైనట్లు వార్తలు వచ్చాయి.అతడు లేకుండానే వెళ్లిపోయిన బస్!అడిలైడ్లో తాము బస చేసిన హోటల్ నుంచి ఎయిర్పోర్టుకు బయల్దేరేటపుడు యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. సహచర ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ తదితరులు అతడి కోసం సుమారు 20 నిమిషాల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట. అయినప్పటికీ యశస్వి రాకపోవడంతో టీమ్ బస్ అతడు లేకుండానే నిష్క్రమించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా భద్రతా అధికారి.. హోటల్కు చెందిన కారులో యశస్వి జైస్వాల్ ఒక్కడిని ప్రత్యేకంగా ఎయిర్పోర్టుకు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపమొచ్చినట్లు తెలుస్తోంది.కోహ్లి, బుమ్రా కుటుంబాలు ప్రత్యేక విమానంలోఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తమ కుటుంబాలను కూడా ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. కోహ్లి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్లతో పాటు బుమ్రా సతీమణి సంజనా గణేషన్, కుమారుడు అంగద్.. అంతా కలిసి చార్టెడ్ ఫ్లైట్లో బ్రిస్బేన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో జైస్వాల్ది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. భారీ శతకం(161) బాది అతడు జట్టు గెలుపులో భాగమయ్యాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు.. టెస్టు క్రికెట్కు పనికిరాడు'Adelaide ✅Hello Brisbane 👋#TeamIndia | #AUSvIND pic.twitter.com/V3QJc3fgfL— BCCI (@BCCI) December 11, 2024 -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ను అందుకున్నాడు. అద్బుతమైన క్యాచ్తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ను యశస్వి పెవిలియన్కు పంపాడు.గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న లబుషేన్ ఈ మ్యాచ్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు సైతం సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. మరో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు నితీశ్ రెడ్డిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎటాక్లో తీసుకువచ్చాడు. అయితే రోహిత్ ప్లాన్ సఫలమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన నితీష్ మూడో బంతిని షార్ట్ అండ్ వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జైశ్వాల్ అద్బుతం చేశాడు. తన పొజిషన్కు కుడివైపునకు కదులుతూ సంచలన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్(64) బిత్తరపోయాడు.కోహ్లి రియాక్షన్ వైరల్..ఇక జైశ్వాల్ క్యాచ్ అందుకోగానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆసీస్ ప్రేక్షకుల వైపు చూస్తూ సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్లో చిక్కుకున్న స్మిత్! వీడియో pic.twitter.com/e9HmixGbG2— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024 -
తొలి బంతికే ఔట్.. జైశ్వాల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో మొదటి బంతికే జైశ్వాల్ పెవిలియన్కు చేరాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన జైశ్వాల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్గా జైశ్వాల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో యశస్వి కంటే ముందు ఆర్చీ మాక్లారెన్ (ఇంగ్లండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లండ్), రోరీ బర్న్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.ఓవరాల్గా ఓ టెస్టు మ్యాచ్లో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్గా జైస్వాల్ నిలిచాడు. చివరగా జైశ్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2017లో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా జైశ్వాల్ తొలి టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. కానీ తర్వాత రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుమైన సెంచరీతో చెలరేగాడు.టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు వీరే..సునీల్ గవాస్కర్, 1974 vs ఇంగ్లండ్ఎస్ నాయక్, 1974 vs ఇంగ్లండ్సునీల్ గవాస్కర్, 1983 vs వెస్టిండీస్సునీల్గవాస్కర్, 1987 vs పాకిస్తాన్వి రామన్, 1990 vs న్యూజిలాండ్ఎస్ దాస్, 2002, వెస్టిండీస్వసీం జాఫర్, 2007 vs బంగ్లాదేశ్కేఎల్ రాహుల్, 2017 vs శ్రీలంకచదవండి: IND vs AUS: ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్లు వచ్చినా! వీడియో -
ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్
పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్క్ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా "నువ్వు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావు" అని స్టార్క్ అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. అయితే ఆ సమయంలో స్టార్క్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై మిచిల్ స్టార్క్ స్పందించాడు. ఆ సమయంలో యశస్వి అన్న మాటలను తను వినలేదని స్టార్క్ చెప్పుకొచ్చాడు.వాస్తవానికి ఆ రోజు నేను చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తానని జైశ్వాల్ చెప్పడం నేను వినలేదు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. మూడో రోజు ఆటలో ఓ షార్ట్ పిచ్ డెలివరీని జైశ్వాల్ ప్లిక్ షాట్ ఆడాడు.ఆ బంతిని అతడు సిక్సర్గా మలిచాడు. మరోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. కానీ ఈసారి అతడు డిఫెన్స్ ఆడాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫ్లిక్ షాట్ ఎక్కడ? అని అడిగాను. అతడు నన్ను చూసి నవ్వాడు. దీంతో ఆ విషయాన్ని ఇద్దరం అక్కడితో వదిలేశామని" స్టార్క్ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా జైశ్వాల్పై స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో భయంలేని బ్యాటర్లలో జైశ్వాల్ ఒకడిని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడని స్టార్క్ కొనియాడాడు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఆసీస్తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్మ్యాన్ పేర్కొన్నాడు.ఇక.. తాను మిడిలార్డర్లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.పితృత్వ సెలవులుకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్మ్యాన్.జైస్వాల్తో కలిసి రాణించిన రాహుల్ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్ను మిడిలార్డర్లోకి పంపి రోహిత్ ఓపెనర్గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పింక్ బాల్తోకాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
జైస్వాల్ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. -
రోహిత్ వచ్చాడు!.. మరి మీ పరిస్థితి ఏంటి?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.రాణించిన రాహుల్కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్లో ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఓపెనర్గా వస్తాడా? లేదంటే ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తుదిజట్టులో చోటు ఉండాలి కదా!‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..ఇప్పటి వరకు నా కెరీర్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.విదేశీ గడ్డపై ఐదుకాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.శుబ్మన్ గిల్ కూడా వచ్చేశాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
వాళ్లు కూడా స్లెడ్జ్ చేశారు.. ఈసారి గనుక ఛాన్స్ ఇస్తే: ఆసీస్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్యాట్ కమిన్స్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శల వర్షం కురిపించాడు. పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల చేతిలోనూ మానసికంగా ఓడిపోయారంటూ ఎద్దేవా చేశాడు. జట్టులో ఏ ఒక్కరిలోనూ పోరాటపటిమ కనబడలేదని.. ఇకనైనా కాస్త ఆటపై దృష్టి పెట్టి విజయాల బాటపట్టాలని సూచించాడు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాషెస్ సిరీస్ మాదిరేఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మాదిరే కంగారూ జట్టుకు ఈ సిరీస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక టీమిండియాతో టెస్టు అంటే కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. అందుకు తగ్గట్లుగా భారత ఆటగాళ్లూ బదులిచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.స్లోగా బౌల్ చేస్తున్నాడుఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులోనూ ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నా.. వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. అయితే, ఈ టీజింగ్ మూమెంట్లలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను ఉద్దేశించి చాలా స్లోగా బౌల్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం హైలైట్గా నిలిచింది.295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిమరోవైపు.. స్టార్క్.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాను ఉద్దేశించి.. ‘‘నీకంటే నేనే ఫాస్ట్గా బౌల్ చేస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, రాణా చిరునవ్వుతోనే స్టార్క్కు బదులిచ్చాడు. అయితే, అతడిని అవుట్ చేసి తన సత్తా చాటడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఆసీస్ 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బయటి నుంచి ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తున్న నాకు.. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏమాత్రం పోరాటపటిమ కనిపించలేదు. ముఖ్యంగా ఓ అరంగేట్ర ఆటగాడు.. యువ ఓపెనర్.. మన సొంతగడ్డ మీద.. మిచెల్ స్టార్క్ను స్లెడ్జ్ చేస్తూ.. స్లోగా బౌలింగ్ చేస్తున్నావనడం.. అయినా మనలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.బ్యాట్తోనూ.. బాల్తోనూ మనం సమాధానం ఇవ్వలేకపోయాం. అసలు ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?’’ అని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్కు రాసిన కాలమ్లో ఆసీస్ జట్టును విమర్శించాడు. ఇక టీమిండియాకు భయపడితే పనులు జరగవని.. అడిలైడ్లో మాత్రం తప్పక విజృంభించాలని కమిన్స్ బృందానికి మిచెల్ జాన్సన్ సూచించాడు.ఈసారి గనుక ఛాన్స్ ఇస్తేలేనిపక్షంలో వాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టమవుతుందని టీమిండియా గురించి ఆసీస్కు మిచెల్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పింక్ బాల్తో జరిగే ఈ టెస్టులోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉన్న టీమిండియా.. అందుకు తగ్గట్లుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో గులాబీ బంతితో సాధన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్లో పీఎం ఎలెవన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.ఇక తొలి టెస్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుబ్మన్ గిల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. మరోవైపు.. జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ గాయాల రూపంలో ఆసీస్కు షాక్ తగిలింది. కాగా ఆసీస్- భారత్ మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: వెళ్లు వెళ్లు.. వెనక్కి వెళ్లు: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! ఆఖరికి..
ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్(Prime Ministers XI)తో మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్లో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. పీఎం ఎలెవన్తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్కు కోపమొచ్చింది.తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన ఆసీస్ పేసర్ జాక్ నిస్బెట్(Jack Nisbet)కు బ్యాట్తో పాటు.. నోటితోనూ గట్టిగానే సమాధానమిచ్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్లో రెండో టెస్టు ఆడనుంది.తొలిరోజు ఆట టాస్ పడకుంగానే అయితే, పింక్ బాల్తో నిర్వహించే ఈ మ్యాచ్కు సన్నద్ధమయ్యే క్రమంలో.. ఆసీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండురోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం నాటి తొలిరోజు ఆట టాస్ పడకుంగానే ముగిసిపోగా.. రెండో రోజు సవ్యంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్ను 46 ఓవర్లకు కుదించారు.కాన్స్టాస్ శతకంకాన్బెర్రా వేదికగా ఆదివారం టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్ జట్టు ఓపెనర్ సామ్ కాన్స్టాస్ శతకం(107)తో చెలరేగగా.. మిగతా వాళ్లలో హనో జాకబ్స్(61), జాక్ క్లేటన్(40) మెరుగ్గా రాణించారు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పీఎం జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో పేసర్లు హర్షిత్ రాణా నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజకు తలా ఒక వికెట్ దక్కింది. 42.5 ఓవర్లలోనే ఛేదించినాఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ శుభారంభం అందించగా.. కేఎల్ రాహుల్(27 రిటైర్డ్ హర్ట్), శుబ్మన్ గిల్(50- రిటైర్డ్ హర్ట్) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మాత్రం విఫలం కాగా.. నితీశ్ రెడ్డి(42), వాషింగ్టన్ సుందర్(42 నాటౌట్) అదరగొట్టారు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(27) ఫర్వాలేదనిపించగా.. సర్ఫరాజ్ ఖాన్(1) పూర్తిగా విఫలమయ్యాడు. దేవ్పడిక్కల్ నాలుగు పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నిజానికి రోహిత్ సేన 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించినా... ప్రాక్టీస్ కోసం పూర్తి ఓవర్లు ఆడటం గమనార్హం.ఇదిలా ఉంటే.. టీమిండియా ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ను పీఎం ఎలెవన్ పేసర్ జాక్ నిస్బెట్ వేశాడు. అతడి బౌలింగ్లో తొలి రెండు బంతులను యశస్వి జైస్వాల్ బౌండరీకి తరలించగా.. నిస్బెట్ జైస్వాల్ను చూస్తూ ఏదో అన్నాడు. వెనక్కి వెళ్లు..ఇందుకు బదులుగా.. ‘‘వెనక్కి వెళ్లు.. వెళ్లి బౌలింగ్ చెయ్’’ అని జైస్వాల్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో చిరునవ్వుతోనే వెనక్కి వెళ్లిన నిస్బెట్ ఆఖరి వరకు రాకాసి బౌన్సర్లతో జైస్వాల్ను తిప్పలు పెట్టాడు.దీంతో ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఆఖరి వరకు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఇక నిస్బెట్ ఓవర్లో జైస్వాల్ ఎనిమిది పరుగులు రాబట్టగా.. అతడు మాత్రం వికెట్లెస్గా వెనుదిరిగాడు. జైస్వాల్ను అవుట్ చేయాలన్న అతడి కల నెరవేరలేదు. అంతే కాదు మ్యాచ్ మొత్తంలో ఆరు ఓవర్లు వేసిన 21 ఏళ్ల నిస్బెట్ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మరోసారి బరిలోకి దిగిన నిస్బెట్ జైస్వాల్ను పరుగులు రాబట్టకుండా అడ్డుకోగలిగాడు.చదవండి: బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం Yashasvi Jaiswal took it up to Jack Nisbet in Canberra but the fiery NSW quick wasn't backing down! 👀 #PMXIvIND pic.twitter.com/tX3O86wEv2— cricket.com.au (@cricketcomau) December 1, 2024 -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.కోహ్లి శతకాలు@81 కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.కోహ్లి అద్భుతంకఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.సఫారీ గడ్డపై కఠినమైన పిచ్లపై కూడా బ్యాట్తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.అందరికీ సాధ్యం కాదుఇక ఇదే మ్యాచ్లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్గా వ్యవహరించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.భారీ విజయంతో మొదలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఎడిషన్లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు -
జైశ్వాల్ ఒక అద్భుతం.. 40కి పైగా టెస్టు సెంచరీలు చేస్తాడు: మాక్స్వెల్
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై సత్తాచాటిన జైశ్వాల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై తను ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో యశస్వీ అద్బుతమైన సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలోవకగా ఎదుర్కొంటూ దిగ్గజాలను సైతం జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 161 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో జైశ్వాల్పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని మాక్సీ జోస్యం చెప్పాడు."జైశ్వాల్ ఒక అద్బుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్లో నలభై కంటే ఎక్కువ సెంచరీలు చేసే సత్తా అతడికి ఉంది. విభిన్న రికార్డులను తిరిగి రాస్తాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ జైశ్వాల్ దగ్గర ఉంది.ఈ సిరీస్లో రాబోయే మ్యాచ్ల్లో అతడిని మా బౌలర్లు అడ్డుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. జైశ్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది. అన్ని రకాల షాట్లు ఆడగలడు. స్పిన్ కూడా బాగా ఆడగలడు. అతడొక ఫుల్ ప్యాకెజ్ ప్లేయర్" అని గ్రేడ్ క్రికెటర్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్వెల్ పేర్కొన్నాడు. -
సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్కు ఒక్క అడుగు దూరంలో
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో జైశ్వాల్ రెండో స్ధానానికి చేరుకున్నాడు. యశస్వి జైశ్వాల్కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అయితే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 297 బంతుల్లో 161 పరుగులు చేసిన జైశ్వాల్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే యశస్వీ రెండు స్ధానాలు ఎగబాకి సెకెండ్ ర్యాంక్కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 825 పాయింట్లు ఉన్నాయి.మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 9 స్ధానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు వచ్చాడు. ఈ మ్యాచ్లో కోహ్లి కూడా ఆజేయ శతకంతో మెరిశాడు. ఇక టాప్ ర్యాంక్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(903) పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు.టెస్టు ర్యాంకింగ్స్లో టాప్-10 బ్యాటర్లు వీరే..1.జో రూట్- 903 పాయింట్లు2. యశస్వి జైస్వాల్ 8253.కేన్ విలియమ్సన్ 8044. హ్యారీ బ్రూక్ 7785. డారిల్ మిచెల్ 7436. రిషబ్ పంత్ 7367. స్టీవెన్ స్మిత్ 7268. సౌద్ షకీల్ 7249. కమిందు మెండిస్ 71610. ట్రావిస్ హెడ్ 713 -
వాళ్లిద్దరు అద్భుతం... గర్వంగా ఉంది.. ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్గా తొలి టెస్టులోనే విజయం సాధించడం పట్ల జస్ప్రీత్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. పెర్త్లో తమ జట్టు ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా.. గర్వంగా ఉన్నానని చెప్పాడు. ఆత్మవిశ్వాసం ఉంటే అనుభవంతో పనిలేదని భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపించారని కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. పేసర్ బుమ్రా భారత జట్టు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆడిన టీమిండియా.. ఆసీస్ను ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా కంగారూ గడ్డపై అతిపెద్ద విజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో విజయానంతరం తాత్కాలిక కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా మాట్లాడుతూ.. ‘‘విజయంతో సిరీస్ ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. అయితే, ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది.2018లో ఇక్కడ ఆడాను. ఇక ఈ పిచ్ మాకు సవాళ్లు విసిరింది. అయితే, అనుభవం కంటే.. సామర్థ్యాన్నే మేము ఎక్కువగా నమ్ముకున్నాం. పూర్తిస్థాయిలో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాం. ఆత్మవిశ్వాసం ఉంటే.. ప్రత్యేకంగా ఏదైనా సాధించగలమని విశ్వసించాం. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి’’ అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.ఇక సెంచరీ వీరులు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావన రాగా.. ‘‘జైస్వాల్ టెస్టు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. టెస్టుల్లో ఇదే అతడికి మొదటి అత్యుత్తమ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ అతడు అటాక్ చేసిన విధానం అద్భుతం.ఇక విరాట్.. అతడు ఫామ్లో లేడని నేనెప్పుడూ అనుకోను. ఇలాంటి కఠినమైన పిచ్లపైనే కదా.. బ్యాటర్ అసలైన ఫామ్ తెలిసేది’’ అంటూ బుమ్రా వారిద్దరిపై ప్రశంసలు కురిపించాడు. కాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్, కోహ్లి నిరాశపరిచిని విషయం తెలిసిందే. జైస్వాల్ డకౌట్ కాగా.. కోహ్లి 5 పరుగులే చేశాడు.అయితే, రెండో ఇన్నింగ్స్లో లెఫ్టాండ్ బ్యాటర్ జైస్వాల్.. 161 పరుగులతో దుమ్ములేపగా.. కోహ్లి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు బుమ్రా రెండు ఇన్నింగ్స్లో కలిపి ఎనిమిది వికెట్లు కూల్చాడు.ఇక తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆసీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెర్త్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియగా.. ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు అడిలైడ్లో రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పెర్తు టెస్టు స్కోర్లు👉భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 238 ఆలౌట్👉ఫలితం: ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో బుమ్రా సేన భారీ విజయం -
ఆసీస్ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందేప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్కు చేరాలంటే ఆసీస్పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.బాధ్యతలు తీసుకున్న బుమ్రాఅయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.అప్పుడు ఆదుకున్న పంత్, నితీశ్ రెడ్డిపెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్. మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి.జైస్వాల్ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లిఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 38 నాటౌట్)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్ను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు👉వేదిక: పెర్త్ స్టేడియం, పెర్త్👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 104 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 238 ఆలౌట్👉ఫలితం: ఆసీస్పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(8 వికెట్లు)👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!Big wicket for India! Siraj with a beauty! #AUSvIND pic.twitter.com/NEJykx9Avj— cricket.com.au (@cricketcomau) November 25, 2024History Made Down Under! 🇮🇳✨Team India seals a memorable victory, becoming the FIRST team to defeat Australia at the Optus Stadium, Perth! 🏟💥A moment of pride, determination, and unmatched brilliance as #TeamIndia conquers new heights in the 1st Test & secures No.1 Spot in… pic.twitter.com/B61Ic9qLuO— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్ను దెబ్బ కొట్టారు. మెక్స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్ను అప్పర్ కట్తో జైస్వాల్ సిక్సర్గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్లో చెత్త షాట్కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్పై మెరుగైన డిఫెన్స్తో ఆకట్టుకున్న రాహుల్ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్మార్క్ కవర్ డ్రైవ్లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
‘కోహ్లి.. జైస్వాల్ను చూసి ఎలా ఆడాలో నేర్చుకో’
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన మొదటి టెస్టు మ్యాచ్లోనే జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం కంగారులను కంగరెత్తించాడు.స్టార్క్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను ఆలోవకగా ఎదుర్కొని శెభాష్ అన్పించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్హగ్ను గుర్తు చేసేలా సిక్సర్తో తన సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్గా జైశ్వాల్కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.ఓవరాల్గా 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో జైశ్వాల్పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని మంజ్రేకర్ కొనియాడాడు. అదేవిధంగా బ్యాక్ ఫుట్లో జైశ్వాల్ అద్బుతంగా ఆడుతున్నాడని అతడు మెచ్చుకున్నాడు."జైశ్వాల్ ఒక సంచలనం. అతడు షాట్ సెలక్షన్ చాలా బాగుంది. ఈ మ్యాచ్లో అతడు కట్ షాట్ వైట్బాల్ క్రికెట్లో ఆడినట్లు ఆడాడు. సాధారణంగా ఆటగాళ్ళు కట్షాట్ ఆడేందుకు ముందుగానే పొజిషన్లోకి వస్తారు. కానీ జైశ్వాల్ మాత్రం చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు.అదే అతడి స్పెషల్. బ్యాక్ఫుట్లో నుంచి అద్బుతంగా కట్ షాట్ ఆడుతున్నాడు. బ్యాక్ఫుట్ నుంచి షాట్ ఆడి స్క్వేర్ వెనక దిశగా పరుగులు రాబడుతున్నాడు. విరాట్ కోహ్లి కంటే జైశ్వాల్ బాగా కట్ షాట్ ఆడుతున్నాడు.విరాట్ కోహ్లి మాత్రం ఫ్రంట్ ఫుట్లో ఉండి ఆడేందుకు ఇష్టపడతాడు. అందువల్ల పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో బ్యాక్ఫుట్లో ఎలా ఆడాలన్నది యశస్వి నుంచి కోహ్లి నేర్చుకోవాలి" అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో సంజయ్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. టీమిండియా తొలి క్రికెటర్గా అరుదైన రికార్డు!
పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్.. ఆస్ట్రేలియా గడ్డ మీద తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్గా టెస్టుల్లో తనకిది నాలుగో శతకం.What a way to bring up the ton! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/okMDAno5tE— cricket.com.au (@cricketcomau) November 24, 2024 ఈ క్రమంలో ఎన్నెన్నో అరుదైన రికార్డులను యశస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పెర్త్ టెస్టులో శతకం బాది టీమిండియా దిగ్గజాలుగా ఎదిగిన సునిల్ గావస్కర్, విరాట్ కోహ్లి మాదిరి జైస్వాల్ కూడా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్)గా పేరొందుతాడంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కాగా.. మూడో రోజు ఆటలో భాగంగా యశస్వి జైస్వాల్ భారీ శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్.. మరో 92 బంతులు ఎదుర్కొని ఓవరాల్గా 161 రన్స్ సాధించాడు.జైస్వాల్ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇవ్వడంతో జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా పెర్త్ టెస్టులో టీమిండియా ఇప్పటికే నాలుగు వందలకు పైగా ఆధిక్యం సంపాదించి పట్టు బిగించింది.పెర్త్ టెస్టులో సెంచరీ చేసి యశస్వి జైస్వాల్ సాధించిన రికార్డులు👉23 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో.. సునిల్ గావస్కర్(4), వినోద్ కాంబ్లీ(4)ల సరసన యశస్వి నిలిచాడు. ఈ లిస్టులో సచిన్ టెండుల్కర్ 8 శతకాలతో మొదటి స్థానంలో ఉండగా.. రవిశాస్త్రి(5) రెండో స్థానంలో ఉన్నాడు.👉అదే విధంగా.. 23 ఏళ్ల వయసులోపే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలోనూ జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ ఏడాది జైస్వాల్ ఇప్పటికి మూడు శతకాలు బాదాడు.👉ఆస్ట్రేలియా గడ్డమీద తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్ జైస్వాల్. అతడి కంటే ముందు ఎంఎల్ జైసింహా(101- బ్రిస్బేన్- 1967-68), సునిల్ గావస్కర్(113- బ్రిస్బేన్-1977-78)లో ఈ ఘనత సాధించారు.మరో అరుదైన ఘనత.. భారత తొలి క్రికెటర్గాపెర్త్ టెస్టులో భారీ శతకంతో యశస్వి జైస్వాల్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి పదిహేను టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో విజయ్ హజారే(1420)ను అతడు వెనక్కినెట్టాడు. కాగా 2023లో వెస్టిండీస్ గడ్డ మీద జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అతడి ఖాతాలో నాలుగు శతకాలు. రెండు డబుల్ సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఫోర్ల సంఖ్య 178, సిక్సర్లు 38.ఆడిన తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు👉డాన్ బ్రాడ్మన్- 2115👉మార్క్ టేలర్- 1618👉ఎవర్టన్ వీక్స్- 1576👉యశస్వి జైస్వాల్- 1568👉మైకేల్ హస్సీ- 1560.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా పెర్త్ టెస్టు👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 104 ఆలౌట్.చదవండి: IPL 2025 Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి -
యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. తొలి ఆసియా బ్యాటర్గా రికార్డు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 161 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి నాలుగు సెంచరీలను 150 ప్లస్ స్కోర్లుగా మలిచిన తొలి ఆసియా బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అలాగే 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేసిన మూడో ఏషియన్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు సచిన్, జావిద్ మియాందాద్ 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేశారు.టెస్ట్ల్లో యశస్వి జైస్వాల్ 150 ప్లస్ స్కోర్లు..ఇంగ్లండ్పై 214 (2024లో రాజ్కోట్ టెస్ట్లో)ఇంగ్లండ్పై 209 (2024లో వైజాగ్ టెస్ట్లో)వెస్టిండీస్పై 171 (2023లో డోమినికా టెస్ట్లో)ఆస్ట్రేలియాపై 161 (2024లో పెర్త్ టెస్ట్లో)మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 201 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం రాహుల్ (77) తొలి వికెట్గా వెనుదిరిగాడు. రాహుల్ ఔటైన అనంతరం దేవ్దత్ పడిక్కల్ (25) కాసేపు నిలకడగా ఆడాడు. ఆతర్వాత అతను కూడా ఔటయ్యాడు. 161 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ అనవసరమైన షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో రిషబ్ పంత్ (1), ధృవ్ జురెల్ (1) వికెట్లు కోల్పోయింది. 100 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 326/5గా ఉంది. విరాట్ కోహ్లి (20), వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 372 పరుగులుగా ఉంది. భారత్ మరో 100 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్వుడ్, కమిన్స్, మార్ష్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20) చెలరేగిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్లో నాథన్ మెక్స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మిచ్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
-
IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన జైస్వాల్-రాహుల్ జోడీ
పెర్త్ టెస్ట్లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 201 పరుగులు జోడించారు. ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డు గతంలో సునీల్ గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ జోడీ పేరిట ఉండేది. వీరిద్దరు 1986 సిడ్నీ టెస్ట్లో తొలి వికెట్కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన భారత ఓపెనింగ్ జోడీలు..కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ (201 పరుగులు)సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ (191)సునీల్ గవాస్కర్-చేతర్ చౌహాన్ (165)కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్దత్ పడిక్కల్ (17) క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.భారత్ తొలి ఇన్నింగ్స్-150 ఆలౌట్ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్-104 ఆలౌట్సిక్సర్తో సెంచరీ పూర్తి చేసిన యశస్విఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వికి ఆసీస్ గడ్డపై ఇది తొలి టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో యశస్వి దిగ్గజాల సరసన చేరాడు. తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి తమ తొలి ఆసీస్ పర్యటనలోనే సెంచరీలు సాధించారు. -
జైశ్వాల్ అరుదైన ఫీట్.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్.. స్టార్క్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 172 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్లో ఆసాదరణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్లో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్..1170* పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండర్ ఈయర్లో 8 టెస్టులు ఆడి 1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో గంభీర్ ఆల్టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండ్ జోరూట్(1,338*) ఉన్నాడు.చదవండి: IND vs AUS: జైశ్వాల్, రాహుల్కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
జైశ్వాల్, రాహుల్కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో కూడా ఆతిథ్య జట్టుపై భారత్ పై చేయి సాధించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అద్బుతమైన ఆరంభం ఇచ్చారు.వీరిద్దరూ తొలి వికెట్కు 172 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మొదటి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపరిచిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. తొలిసారి ఆసీస్ గడ్డపై ఆడుతున్నప్పటకి తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియాతో తన తొలి టెస్టు సెంచరీకి ఈ ముంబైకర్ చేరువయ్యాడు. మరోవైపు రాహుల్ సైతం తన క్లాస్ను చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా వచ్చిన కేఎల్.. తనను తను మరోసారి నిరూపించుకున్నాడు. మూడో రోజు ఆటలో వీరిద్దరూ లంచ్ సెషన్ వరకు క్రీజులో ఉంటే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయం.సెల్యూట్ చేసిన కోహ్లి.. ఇక ఈ ఓపెనింగ్ జోడీ ప్రదర్శనకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. రెండో రోజు ఆట అనంతరం ప్రాక్టీస్ కోసం మైదానంలో వచ్చిన కోహ్లి.. రాహుల్, యశస్వీలకు సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ గడ్డపై భారత ఓపెనర్లు 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!? Virat Kohli immediately came out for practice after the day's play and appreciated Jaiswal and KL Rahul #INDvAUS pic.twitter.com/kvG1caIUXp— Robin 𝕏 (@SledgeVK18) November 23, 2024 -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. జైశ్వాల్ వరల్డ్ రికార్డు..ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్లో నాథన్ లియోన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్ -
Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతోంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.మరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు.ఐదు పరుగులకే అవుట్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు. మండిపడుతున్న ఫ్యాన్స్మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారుకష్టాల్లో టీమిండియాఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవేవిధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకుExtra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h— Div🦁 (@div_yumm) November 22, 2024 -
ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా భారత టెస్టు జట్టులో కీలక సభ్యునిగా ఉన్న జైశ్వాల్ ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్లలో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో సత్తా చాటేందుకు యశస్వీ సైతం ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఈ ముంబైకర్ ప్రారంభించే అవకాశముంది.అయితే ఈ మ్యాచ్కు ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ జైశ్వాల్ మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇచ్చిన సలహా తన కెరీర్ ఎదుగుదలలో ఎలా సహాయపడిందో జైశ్వాల్ చెప్పుకొచ్చాడు."విరాట్ కోహ్లితో నాకు మంచి అనుబంధం ఉంది. క్రికెట్ను కెరీర్గా ఎక్కువ కాలం కొనసాగించాలంటే క్రమశిక్షణతో ఉండాలని, ఆటను గౌరవించడం చాలా ముఖ్యమని కోహ్లి నాతో చెప్పాడు. విరాట్ భాయ్ సలహా నా కెరీర్ ఎదుగుదలలో ఎంతగానో సహాయపడింది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడిలా కష్టపడి పనిచేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాను అని యశస్వీ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన జైశ్వాల్.. 56.28 సగటుతో 1407 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు డబుల్ సెంచరీలతో పాటు 3 శతకాలు, 8 హాఫ్ సెంచరీల ఉన్నాయి. తన తొలి టెస్టు సిరీస్లోనే యశస్వీ డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.చదవండి: బాబాకీ జై! : మంజ్రేకర్పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్ -
ఆసీస్తో తొలి టెస్ట్.. టీమిండియా ఆటగాళ్ల ముందున్న భారీ రికార్డులు ఇవే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది.మూడో స్థానానికి చేరనున్న విరాట్ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్లో ఉన్నారు.బుమ్రా ఈ సిరీస్లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్లు మాత్రమే ఆడాడు.కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. -
కోహ్లి ‘కీ’లకం!
జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్మెంట్లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది! సుదీర్ఘ ఫార్మాట్ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్లో ఆసీస్పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్కు అనుకూలించే పిచ్లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి. పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే. ఫామ్ అందుకుంటాడా... గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది. భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లిని వదిలేయండి: వాట్సన్ కీలక సిరీస్కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు. కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్ఫుట్కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు. విరాట్ ఒక చాంపియన్: లయన్ భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు మరో షాక్..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. చేతి వేలి గాయం కారణంగా శుభ్మన్ గిల్ ఇదివరకే తొలి టెస్ట్కు దూరంగా కాగా.. తాజాగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం బారిన పడినట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా యశస్వి మెడ పట్టేసినట్లు సమాచారం. యశస్వి నొప్పితో విలవిలలాడుతున్న దృష్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. టీమ్ ఫిజియో యశస్వి మెడకు మసాజ్ చేస్తూ కనిపించాడు. యశస్వి గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఈ విషయం మాత్రం టీమిండియా అభిమానులను తెగ కలవరపెడుతుంది.ఇప్పటికే రోహిత్ దూరమయ్యాడు..!తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలోనే ఉండిపోయాడు. తొలి టెస్ట్కు అతను అందుబాటులో ఉండడం లేదు. రోహిత్కు ప్రత్యామ్నాయ ఓపెనర్గా కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లను పరిశీలుస్తున్నారు. ఇప్పుడు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా గాయం బారిన పడితే తొలి టెస్ట్కు భారత్ రెగ్యులర్ ఓపెనర్లు లేకుండా బరిలోకి దిగినట్లవుతుంది.2020-21లోనూ ఇదే సీన్బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్లోనూ టీమిండియా ఇదే తరహాలో గాయల బారిన పడింది. నాటి సిరీస్లోనూ భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సందర్భంగా గాయాల బారిన పడ్డారు. దీంతో టీమిండియా ఆ సిరీస్లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో బరిలోకి దిగింది.అనుభవం లేని ఆటగాళ్లతో టీమిండియా..!పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్లో టీమిండియా పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్పై ఆధారపడాల్సి ఉంది. శుభ్మన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్కు ఛాన్స్ దక్కవచ్చు. ఈ సిరీస్లో భారత పేస్ అటాక్ అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. బుమ్రా మినహా జట్టులో పెద్దగా అనుభవజ్ఞులు లేరు. సిరాజ్కు పదుల సంఖ్యలో టెస్ట్లు ఆడిన అనుభవమున్నా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ టెస్ట్ మ్యాచ్లే ఆడారు. ఈ సిరీస్లో టీమిండియా ప్రధాన బలం స్పిన్నర్లు. అయితే తొలి టెస్ట్కు వేదిక అయిన పెర్త్ స్పిన్నర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. -
ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్ భావోద్వేగం(ఫొటోలు)
-
BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!
టీమిండియా క్రికెటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరెన్నో అరుదైన ఘనతలతో రికార్డుల రారాజుగా గుర్తింపు పొందాడు.సొంతగడ్డపై పూర్తిగా విఫలమైఅయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్లో కలిపి ఒకే అర్ధ శతకం నమోదు చేయడం అతడి ఫామ్లేమి నిదర్శనం.ఆసీస్ మీడియా దృష్టి మొత్తం అతడి మీదే! ఇలాంటి తరుణంలో టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు వెళ్లనుండటంతో.. అందరి దృష్టి కోహ్లిపైనే నిలిచింది. ఆసీస్పై మంచి రికార్డు ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్ అంటే కంగారూ బౌలర్లకూ వణుకే! అందుకే ప్రస్తుతం కోహ్లి ఫామ్ సంగతి ఎలా ఉన్నా ఆస్ట్రేలియా మీడియాలో మాత్రం అతడే హైలైట్గా నిలుస్తున్నాడు.తరతరాల పోరాటంప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియా వార్త పత్రికలు కోహ్లి గణాంకాలను విశ్లేషిస్తూ.. అతడి చిత్రాలను కవర్పేజీలపై ప్రముఖంగా ప్రచురించడం విశేషం. అంతేకాదు.. ఆసీస్- భారత్ టెస్టు పోరును హైలైట్ చేస్తూ హిందీ, పంజాబీ భాషల్లో.. ‘‘తరతరాల పోరాటం’’ అంటూ హెడ్లైన్స్ ఇచ్చాయి.ఇక కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆసీస్ మీడియా అతడిని ఇలా హైలైట్ చేయడంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే, ఈసారి కోహ్లితో పాటు మరో యువ క్రికెటర్ నిలువెత్తు ఫొటోను సైతం ఆసీస్ పత్రికలు ప్రచురించడం విశేషం. అతడు మరెవరో కాదు.. యశస్వి జైస్వాల్.‘నవం రాజా’గా యశస్విఅవును.. టెస్టు క్రికెట్లో అరంగేట్రం నుంచే సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్కు కూడా ఆస్ట్రేలియా మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. ‘నవం రాజా’(కొత్త రాజు) అంటూ యశస్వికి కితాబులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ అభిమానులు మాత్రం వీటిని చూసి చిన్నబుచ్చుకుంటున్నారు.హర్ట్ అవుతున్న పంత్ అభిమానులుఆస్ట్రేలియాలో టీమిండియా గత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలకమైన ఈ వికెట్ కీపర్కు మాత్రం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా 2020-21 పర్యటనలో గాబా టెస్టులో అద్భుత ఇన్నింగ్స్(89 నాటౌట్)తో ఆకట్టుకున్న పంత్.. భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. జైస్వాల్ ఇప్పటి వరకు14 టెస్టులు ఆడి 1407 రన్స్ చేశాడు. ఇందులో మూడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?A lot of @imVkohli in the Australian papers this morning as is the norm whenever India are in town but never expected to see Hindi and Punjabi appearing in the Adelaide Advertiser. Tells you about the magnitude of the #AusvInd series for Australia & cricket in this country pic.twitter.com/I5B2ogPvEJ— Bharat Sundaresan (@beastieboy07) November 12, 2024 -
జైస్వాల్ సొంత అన్న.. తొలి హాఫ్ సెంచరీ! టీమిండియా ఓపెనర్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సోదరుడు తేజస్వి జైస్వాల్పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి అర్ధ శతకం బాదినందుకు అతడిని అభినందించాడు. కాగా ఉత్తరప్రదేశ్లో జన్మించిన యశస్వి జైస్వాల్కు ముగ్గురు తోబుట్టువులు.. ఇద్దరక్కలు, ఓ అన్న ఉన్నారు.ఇటీవలే అరంగేట్రంయశస్వి సోదరుడు తేజస్వి కూడా క్రికెటర్గా రాణించాలనే ఆశయంతో ఉన్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఇటీవలే అరంగే ట్రం చేవాడు. త్రిపుర జట్టుకు ఆడుతూ.. తాజా రంజీ ట్రోఫీ సీజన్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. బరోడాతో మ్యాచ్లో 159 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు రాబట్టాడు.అంతేకాదు.. ఈ మ్యాచ్లో ఒక వికెట్ను కూడా తేజస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రిపుర- బరోడా మ్యాచ్కు సంబంధించిన స్కోరు కార్డును యశస్వి జైస్వాల్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. అన్న తేజస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను హైలైట్ చేసి అతడిని అభినందించాడు.డ్రాగా ముగిసిన మ్యాచ్కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా అగర్తల వేదికగా త్రిపుర- బరోడా జట్ల మధ్య నవంబరు 6న మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన త్రిపుర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బరోడా జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులుగా ఆతిథ్య త్రిపుర తమ మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 482 పరుగుల వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. అయితే, ఈ నాలుగు రోజుల మ్యాచ్లో శనివారమే చివరి రోజు. ఈ క్రమంలో వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డ బరోడా.. ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఒకే ఒక్క విజయంకాగా తేజస్వి జైస్వాల్ తమ్ముడు యశస్వి మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్. అయితే, ఆల్రౌండర్ అయిన తేజస్వి రైటార్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో త్రిపుర తొలుత ఒడిశాతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తర్వాతి మ్యాచ్లో మేఘాలయపై ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది.టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయిన యశస్విఅనంతరం.. ముంబైతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తాజాగా బరోడా జట్టుతో మ్యాచ్లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లోనూ సత్తా చాటిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ప్రస్తుతం టీమిండియాలో టెస్టు, టీ20 ఓపెనర్గా పాతుకుపోయాడు.ముఖ్యంగా టెస్టు అరంగేట్రం(2023)లోనే 23 ఏళ్ల యశస్వి భారీ శతకం(171) బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు ఆడి 1407 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక భారత్ తరఫున 23 టీ20లు ఆడిన యశస్వి ఓ శతకం సాయంతో 723 రన్స్ చేశాడు. తదుపరి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీకానున్నాడు.చదవండి: స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్! -
BGT 2024: రోహిత్ ఓపెనర్గా వద్దు.. వాళ్లిద్దరే ఆడాలి: పాక్ మాజీ క్రికెటర్
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో మ్యాచ్లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది.ఇదే తొలిసారి..కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్స్వీప్నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అన్ని మ్యాచ్లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ ఓపెనర్గా వద్దుఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా కాకుండా వన్డౌన్లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్తో సిరీస్లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్డౌన్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.జైస్వాల్కు జోడీగా అతడు రావాలిటాపార్డర్లో యశస్వి జైస్వాల్తో కలిసి శుబ్మన్ గిల్ ఓపెనర్గా రావాలి. రోహిత్ వన్డౌన్లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే?