భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్‌! యార్కర్ల కింగ్‌ అరంగేట్రం? | Predicted India playing XI for IND vs AFG 1st ODI | Sakshi
Sakshi News home page

IND vs AFG: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్‌! యార్కర్ల కింగ్‌ అరంగేట్రం?

Jun 12 2026 1:58 PM | Updated on Jun 12 2026 2:52 PM

Predicted India playing XI for IND vs AFG 1st ODI

వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్‌-అఫ్గాన్ జట్లు ధర్మశాలకు చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. ఈ మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరయ్యారు. విరాట్ స్ధానంలో యశస్వి జైశ్వాల్‌ను జట్టులోకి తీసుకోగా, ఇంకా హార్దిక్ రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అంచనా వేద్దాం.

భారత ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నారు. అయితే కోహ్లి లేనుందన మూడో స్ధానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. కిష‌న్ చివ‌ర‌గా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గాన్‌పై భార‌త్ త‌ర‌పున వ‌న్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల త‌ర్వాత పున‌రాగ‌మ‌నం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు.

కోహ్లి ప్రత్యామ్నయంగా వచ్చిన జైశ్వాల్ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిగా డిసెంబర్ 2025లో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు. జైశ్వాల్ కేవ‌లం ఓపెన‌ర్‌గా మాత్రమే ఆడ‌గ‌లడు. కాబ‌ట్టి రోహిత్‌కు విశ్రాంతి ఇస్తే త‌ప్ప జైశూకు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌దు. నాలుగో స్ధానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్‌(వికెట్ కీప‌ర్‌) బ్యాటింగ్‌కు రానున్నారు.

ఆల్‌రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, సుందర్
హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం కార‌ణంగా సిరీస్‌కు దూరం కావ‌డంతో, తెలుగు కుర్రాడు ఆల్‌రౌండ‌ర్ల కోటాలో చోటు ద‌క్క‌నుంది. అత‌డు త‌న  10 ఓవర్ల కోటాను పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ ఉండ‌నున్నాడు.

ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం?
ఇక ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేస‌ర్ ప్రిన్స్ యాద‌వ్ భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది. ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ప్రిన్స్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆక‌ర్షించాడు. 

ఈ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్ర‌ధాన పేస‌ర్లు లేక‌పోవ‌డంతో ప్రిన్స్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. అర్ష్‌దీప్ సింగ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ వంటి యువ బౌలర్లతో ప్రిన్స్ బంతిని పంచుకోనున్నాడు. అతడు యార్కర్లు వేయడంలో దిట్ట.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్‌ యాదవ్‌

Advertisement
 
Advertisement
Advertisement