breaking news
India vs Afghanistan
-
రోహిత్ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్ హిస్టరీలోనే
చెపాక్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(110) అజేయ శతకంతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్మ్యాన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను రోహిత్ అధిగమించాడు. రోహిత్కు ఇది 95వ హాఫ్ సెంచరీ. ద్రవిడ్ తన వన్డే కెరీర్లో 94 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి(131) రెండో స్ధానంలో ఉన్నాడు.అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల 51 రోజుల వయస్సులో వయస్సులో అతడు ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. అమర్నాథ్ 1989లో పాకిస్తాన్పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో ఆర్ధ శతకం నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డు హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
జైశ్వాల్ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ.. 28.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు.86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 110 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జైశ్వాల్తో కలిసి తొలి వికెట్ రోహిత్ 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(20 నాటౌట్) దూకుడగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ ఒక్కడే వికెట్ సాధించాడు.నిప్పులు చెరిగిన ప్రసిద్ద్ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లకు టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చుక్కలు చూపించాడు. ఈ కర్ణాటక స్పీడ్ స్టార్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తలా వికెట్ సాధించారు. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102), ఓమర్జాయ్(50) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్తాన్ తమ మార్క్ చూపించలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అయితే 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్ను కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102) సెంచరీతో ఆదుకున్నాడు. అతడితో పాటు ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అఫ్గాన్కు షాక్!అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో బంతి పడక ముందే భారత్ స్కోర్ బోర్డులో 5 పరుగులు చూసి అందరూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజర్ లైన్)లో పదే పదే నడిచినందుకు జరిమానా విధించారు.మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్లోకి దూసుకెళ్లాడు.దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్లు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్కు షాకిచ్చారు. నిబంధనలో పిచ్ మధ్యలో నవడవడం గానీ పరిగెత్తడం గానీ చేయకూడదు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.తొలి ఓవర్లో 23 రన్స్కాగా కాగా భారత ఇన్నింగ్స్లో మొదట ఓవర్ వేసిన అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్గా సంధించిన ఓమర్జాయ్.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.దీంతో టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్లో ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్పై మొదటి ఓవర్లో 22 పరుగులు భారత్ సాధించింది. తాజా మ్యాచ్తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో' -
ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్
భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరిగాడు. తన అద్భుత బౌలింగ్తో అఫ్గాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును ప్రసిద్ద్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ విరోచిత శతకంఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిది మాత్రం విరోచిత సెంచరీ సాధించాడు. 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 102 పరుగులు చేశాడు. అతడితో పాటు అజ్మతుల్లా ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు. మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్
చెన్నై వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే ఓ అద్భుతమైన రికార్డుకు వేదికైంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కలిసి అరుదైన ఫీట్ను సాధించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ యూనిక్ హ్యాట్రిక్ నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్కు ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. తన సంచలన బౌలింగ్తో అఫ్గాన్ టాపార్డర్ను కుప్పకూల్చాడు.ప్రసిద్ద్ వేసిన తన స్పెల్ మొదటి బంతికే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని గుర్బాజ్ ఆఫ్సైడ్ ఆడగా, అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 6 ఓవర్లో ప్రసిద్ధ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని రహ్మత్ షా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని మళ్లీ స్లిప్స్లో ఉన్న హిట్మ్యాన్ అందుకున్నాడు. అంతేకాకుండా 8వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్కే క్యాచ్ ఇచ్చాడు. దీంతో రోహిత్ క్యాచ్ల హ్యాట్రిక్ పూర్తి అయింది. ఒక వన్డే మ్యాచ్లో ఒకే బౌలర్ బౌలింగ్లో మూడు క్యాచ్లు పట్టిన మూడవ భారత ఫీల్డర్గా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు వి.వి.ఎస్. లక్ష్మణ్ (2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో), శిఖర్ ధావన్ (2018లో బంగ్లాదేశ్పై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో) ఈ ఫీట్ సాధించారు.చదవండి: MLC 2026: ఐపీఎల్లో డ్రింక్స్ బాయ్.. కట్ చేస్తే! అక్కడ కేవలం 25 బంతుల్లోనేIdentical setups, identical results 🔄Prasidh Krishna 🤝 Rohit Sharma 😎 Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l— BCCI (@BCCI) June 20, 2026 -
IND vs AFG: కేఎల్ రాహుల్ను పక్కనపెట్టారా?
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ సందర్భంగా ధర్మశాలలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ హర్ష్ దూబే.. రెండో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు.రాహుల్ లేడుఅయితే, తాజాగా శనివారం నాటి మూడో మ్యాచ్లో కుల్దీప్ స్థానాన్ని హర్ష్ తిరిగి భర్తీ చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బదులు.. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుదిజట్టులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి నుంచి కోలుకున్న అతడి కోసం రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.అదే విధంగా.. పేస్ దళంలో కీలకమైన అర్ష్దీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణకు చోటు దక్కింది. అయితే, ఈ మూడు మార్పులు చేయడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నలకు.. మ్యాచ్కు ముందే టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పరోక్షంగా సమాధానమిచ్చాడు.బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్డష్కాటే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్ మ్యాచ్కూ తుదిజట్టులో మార్పులు చేస్తున్నాం. ఈసారి అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినిస్తున్నాం. బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్ ఇస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్ను మూడో వన్డేలో పక్కనపెట్టడం గమనార్హం.మరోవైపు.. గత మ్యాచ్లో పది ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్ యాదవ్ కూడా మూడో వన్డే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రాహుల్, కుల్దీప్లపై వేటు వేయడం గాకుండా.. అర్ష్దీప్తో కలిసి వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు డష్కాటే వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.2-0తో సిరీస్ కైవసంఇక ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్ను 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా నామమాత్రపు మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించే క్రమంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గా చెన్నై వేదికగా మూడో వన్డేలో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చదవండి: వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే.. -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఆఖరి వికెట్గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హష్మతుల్లా సింగిల్కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్లో.. హష్మతుల్లా షాహిది సింగిల్కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
IND vs AFG: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్తో నామమాత్రపు మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.సిరీస్ కైవసంకాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది.రెండో వన్డేకు దూరంతద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.సెలక్షన్కు అందుబాటులో ఉన్నాడుఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి నితీశ్ రెడ్డి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్- అఫ్గానిస్తాన్ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
అఫ్గానిస్తాన్తో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ మ్యాచ్కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో మూడో వన్డే కోసం భారత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.రెండో వన్డేకు మూడు మార్పులుకాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు.అయితే, రెండో మ్యాచ్కు హర్ష్ దూబే దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఆడాడు. అదే విధంగా నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో టీమిండియా 170 పరుగుల తేడాతో అఫ్గాన్పై విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టి..ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు. అఫ్గాన్తో మూడో వన్డేలో అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టి.. నితీశ్ రెడ్డిని ఆడించాలని సూచించాడు.ఈ మేరకు.. ‘‘యశస్వి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉంటే.. అతడిని కచ్చితంగా ఆడించాలి. నితీశ్ కోసం అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినివ్వాలి.ఏదేమైనా విరాట్ కోహ్లి తిరిగి వస్తే.. ఇషాన్ కిషన్కు తుదిజట్టులో చోటు ఉండదు. అయితే, రెండో వన్డేలో అతడు శతక్కొట్టాడు. కాబట్టి ఇషాన్ను పక్కనపెట్టే వీలులేదు. పేస్ దళంలో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్లను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.చదవండి: భారత క్రికెట్కు గుడ్బై... వేరే దేశంలో ఆడనున్న తెలుగు క్రికెటర్ -
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
ఆఫ్గన్తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు
స్వదేశంలో అప్గానిస్తాన్తో జరుగున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే చెన్నై వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పు జరగనుంది. మోకాలి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన హర్షిత్ రానా చివరి వన్డే ఆడనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హర్షిత్ రానా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబిలిటేషన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే ఆడేందుకు టీమిండియాలో జాయిన్ అయ్యాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. ఇక 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ రానా గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్కు కూడా దూరమయ్యాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకోకుండానే హర్షిత్ రానాకు ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు లభించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై కూడా క్రీడా వర్గాల్లో కూడా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే హర్షిత్ రానా అప్గానిస్తాన్తో మూడో వన్డేలో ఆడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 24 ఏళ్ల హర్షిత్ రానా టీమిండియా తరఫున 14 వన్డేలాడి 16 వికెట్లు తీశాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో హర్షిత్ రానా టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆఫ్గన్తో వన్డే సిరీస్లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వర్షంతో తొలి వన్డేలో బ్యాటింగ్కు పెద్దగా అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ గిల్తో పాటు ఇషాన్ కిషన్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.అఫ్గానిస్థాన్తో మూడో వన్డేకి భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ సింగ్ యాదవ్, ప్రిన్స్ దీప్, కృష్ణ యాదవ్, యువరాజు బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా.చదవండి: గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే? -
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
ప్రస్తుత తరం క్రికెట్లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.అరంగేట్రంలో అదుర్స్పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవల అఫ్గానిస్తాన్తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.దీంతో తన కెరీర్లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్గా మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు.ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత్ పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. దీంతో భారత క్రికెట్కు మరో బుమ్రా దొరికాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా తన కెరీర్లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే పడగొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో నో ఛాన్స్!గుర్నార్ బ్రార్.. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత మూడు సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అదే టర్నింగ్ పాయింట్?కాగా గుర్నార్ బ్రార్ దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అతడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్గా అవకాశం దక్కింది. ఇప్పుడు అఫ్గాన్తో వన్డే సిరీస్కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు. కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్నార్ను భారత జట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.చదవండి: టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్ -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు 154 పరుగులతో బ్యాటర్గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
రెండో వన్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. -
శుబ్మన్ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్గా
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన గిల్.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్లో కనబరుస్తున్నాడు. లక్నో వేదికగా అఫ్గాన్తో రెండో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 77 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న గిల్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 154 పరుగులు చేశాడు. ఈ అద్భుత శతకంతో వన్డే క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను గిల్ కేవలం 62 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(72 ఇన్నింగ్స్లు) పేరిట సంయుక్తంగా ఉండేది.తాజా నాక్తో వారిద్దరిని శుబ్మన్ అధిగమించాడు. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్దేవ్(2995) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో గిల్(3016) ఉన్నాడు. అదేవిధంగా వన్డేల్లో ఫాస్టెస్ట్ 150 చేసిన మూడో ప్లేయర్గా వీరేంద్ర సెహ్వాగ్ను గిల్ అధిగమించాడు.సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్పై 112 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. అఫ్గాన్తో మ్యాచ్లో గిల్ కేవలం 108 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్(103) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్ -
గిల్, కిషన్ సెంచరీలు.. భారత్ స్కోర్ 402 పరుగులు
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..మంచి టచ్లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.వీరిద్దరూ మూడో వికెట్కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు. -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శుబ్మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్పై భారత్ భారీ స్కోరు -
శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. యశస్వి జైశ్వాల్ తుది జట్టులో చోటు దక్కడంతో గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే జైశ్వాల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులు చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్, తన రెగ్యులర్ ఓపెనర్ పార్టనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో భారత స్కోర్ పవర్ప్లేలో 80 పరుగుల మార్క్ దాటింది. అనంతరం రోహిత్ ఔటైనప్పటికి శుబ్మన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రోహిత్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కిషన్ కూడా కేవలం 71 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్(86 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్లతో 121), కిషన్(111) అజేయంగా తమ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత భారత్ను బ్యాటింగ్కు అహ్హానించింది. లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ.చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ𝘼 𝙘𝙖𝙥𝙩𝙖𝙞𝙣'𝙨 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 𝙩𝙤𝙣!💯👏#ShubmanGill puts on a masterclass, bringing up his FIRST-EVER ODI century as captain for Team India! 🫡#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/KxFphH6k5t— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన రోహిత్.. అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హిట్ మ్యాన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 48 పరుగులు చేశాడు.రోహిత్ ఈ మెరుపు ఇన్నింగ్స్తో 14,000 లిస్ట్-ఎ పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్(348 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. హిట్మ్యాన్ 345 ఇన్నింగ్స్లలో అందుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి(290) అగ్రస్ధానంలో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు:సచిన్ టెండూల్కర్: 21,999 పరుగులువిరాట్ కోహ్లీ: 16,447 పరుగులుసౌరవ్ గంగూలీ: 15,622 పరుగులురాహుల్ ద్రావిడ్: 15,271 పరుగులురోహిత్ శర్మ: 14,007+ పరుగులుఅత్యంత వేగంగా 14,000 లిస్ట్-ఎ పరుగులు చేసిన భారత ప్లేయర్లువిరాట్ కోహ్లి-290రోహిత్ శర్మ-345సచిన్ టెండూల్కర్- 348చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. జైస్వాల్ అట్టర్ ఫ్లాప్ -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.సెంచరీతో ముగించి..ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్లో మరోసారి ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజేయ శతకంతో అలరించాడు.మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.రాక రాక వచ్చిన అవకాశంఅయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.విమర్శలుఅఫ్గన్ యువ పేసర్ మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సలీమ్ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్కప్-2027 జట్టులో బ్యాకప్ ఓపెనర్గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా గిల్కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్లో రషీద్కు క్యాచ్ ఇచ్చి అర్ష్దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో శుబ్మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్తో ఏకైక టెస్టు ఆడింది శుబ్మన్ గిల్ సేన. ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్తో టెస్టు మ్యాచ్లో గుర్నూర్ బ్రార్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్
ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (జూన్ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (53.43), ఏబీ డివిలియర్స్ (53.50), మైఖేల్ బెవాన్ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (58.71) మాత్రమే గిల్ (57.30) కంటే ముందున్నాడు.ఈ ఇన్నింగ్స్తో గిల్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ (72 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ హషిమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. గిల్ (84 నాటౌట్) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్కు ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) సహకరించగా.. రోహిత్ శర్మ (16), శ్రేయస్ అయ్యర్ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. -
అమ్మ నుంచి ఫోన్ కాల్..! లైవ్ ప్రెస్ మీట్లో నితీష్ ఏం చేశాడంటే?
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మొదటి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా తరపున యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?నితీష్ మీడియాతో మాట్లాడుతుండగా.. మైక్ల ముందున్న అతడి మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయ్యింది. నితీశ్ ఒక్క నిమిషం ఆగి, ఫోన్ స్క్రీన్ వైపు చూసి చిరు నవ్వు చిందించాడు. ఫోన్ చేస్తోంది తన అమ్మ అని తెలియడంతో ఏమాత్రం సంకోచించకుండా.. “సారీ, నేను ఈ కాల్ మాట్లాడాలి” అని అక్కడున్న జర్నలిస్టులకు చెప్పి ఫోన్ ఎత్తాడు. అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా’’ అని సమాధానం ఇచ్చాడు. మళ్లీ ప్రెస్మీట్ను కొనసాగించిన నితీశ్ మరోసారి విలేకర్లకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ కాసేపు ఆగవచ్చు ఏమో కానీ అమ్మ నుంచి వచ్చే ఫోన్ కాల్ మాత్రం అస్సలు ఆగదు అంటూ ఆ వీడియో క్యాప్షన్గా బీసీసీఐ రాసుకొచ్చింది.అదరగొట్టిన కుర్రాళ్లుకాగా వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(102) కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో సత్తాచాటారు. వీరితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ కూడా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు.The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH— BCCI (@BCCI) June 13, 2026చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
మెరిసిన గిల్, రాహుల్ అఫ్గాన్ పై భారత్ విక్టరీ..
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. 16 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన రోహిత్.. అనుహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్మ్యాన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఓపెనర్గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు ఈ రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్ల్లోనే సాధించాడు. దీంతో అత్యంతవేగంగా ఈ ఫీట్ను అందుకున్న ఓపెనర్గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్(390) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.👉ఓవరాల్గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలు రాయిని అందుకున్న 7వ ఓపెనర్గా రోహిత్ నిలిచాడు.👉అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్లో ఓపెనర్గా మొత్తం 16,119 పరుగులు చేశాడు.👉ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మోహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్మ్యాన్.. అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్టైమ్లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్లు చేసిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
ఉతికారేసిన గుర్బాజ్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు!
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్ బౌలింగ్కు వచ్చిన ప్రతీ భారత బౌలర్ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉ఇక వన్డేల్లో భారత్పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో గుర్బాజ్కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్, మొహమ్మద్ షెహజాద్లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్.. గతంలో 2021లో ఐర్లాండ్తో మ్యాచ్లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్పై 7 సిక్సర్లు కొట్టాడు. -
అఫ్గానిస్తాన్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 195 పరుగులు
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్కు నెట్బౌలర్గా వచ్చిన గుర్నూర్ బ్రార్కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్కు అండగా నిలబడి నెట్బౌలర్గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్దూబే బెస్ట్ ఆల్రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్గా విదర్భను నడిపించిన హర్ష్దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన హర్ష్దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
అఫ్గన్తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్కు గ్రౌండ్ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్డౌన్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్నెస్కు మారుపేరైన ఈ రన్మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్కు కూడా అఫ్గన్తో వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్డౌన్లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్డౌన్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్లో హష్మతుల్లా (27) రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. హర్ష్కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్దీప్ బౌలింగ్లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్దీప్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
కాసేపట్లో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
ధర్మశాల వేదికగా తొలి వన్డేలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్తో భారత్ తమ వన్డే ప్రపంచకప్-2027 ప్రిపరేషన్స్ను ప్రారంభించనుంది. విరాట్ కోహ్లి అందుబాటులో లేకపోయినప్పటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచింది. శనివారం మ్యాచ్ జరిగే సమయం (మధ్యాహ్నం 1:30)లో భారీ వర్షం పడేందుకు అస్కారముందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అక్యూవెదర్.కామ్ ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు రోజంతా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య 90 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఆ తర్వాత సాయత్రం వర్షం తగ్గుతుందని తెలిపింది. అయితే మళ్లీ రాత్రి వేళ వర్షం పడే అవకాశం 65 శాతం ఉండడంతో మ్యాచ్ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.కాగా ఈ సిరీస్కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. కోహ్లి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో భర్తీ చేశారు. కానీ హార్దిక్ పాండ్యా రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు? -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు?
టీమిండియాకు గుడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్-2026కు ముందు గాయపడిన స్టార్ పేసర్ హర్షిత్ రాణా, ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలలగా పోటీ క్రికెట్కు దూరంగా ఉంటున్న హర్షిత్.. అఫ్గాన్తో మూడో వన్డేకు ముందు భారత జట్టుతో చేరనున్నట్లు సమాచారం.వాస్తవానికి అఫ్గాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో హర్షిత్ లేడు. కానీ ఇప్పుడు అతడు కోలుకోవడంతో గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానంలో జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఐర్లాండ్,ఇంగ్లండ్ పర్యటనలకు మాత్రం ముందే అతడిని ఎంపిక చేశారు.ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఉన్నాడు. అతడు ప్రతి రోజూ 9-10 ఓవర్లు బౌలింగ్ చేస్తూ, తన బ్యాటింగ్పై కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. జూన్ 17 నాటికి అతడికి సీఓఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.సీఓఈ వైద్య బృందం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతడు నేరుగా మూడో వన్డేకు ముందు చెన్నైలో జట్టుతో కలవనున్నాడు. హర్షిత్ చివరగా భారత్ తరపున వన్డేల్లో ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్పై ఆడాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన రాణా.. 6.22 ఏకానమితో 26 వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాట్తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో టీమ్ మెనెజ్మెంట్ అతడిని ఆల్రౌండర్గా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్ -
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు అఫ్గాన్ క్యాంప్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి గురువారం(జూన్ 11) కన్నుమూశారు.దీంతో వెంటనే రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఉన్నపళంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు."దర్విష్ రసూలీ తండ్రి మరణించినట్లు మాకు గత రాత్రి తెలిసింది. ఇది చాలా బాధకరం. ఈ కష్టసమయంలో అతడు తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు అఫ్గాన్కు తిరిగి వెళ్లిపోయాడు" అని షాహిదీ పేర్కొన్నాడు.ఇప్పుడు రసూలీ లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృఛ్చికంగా భారత్ వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా సిరీస్కు దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.కాగా దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ధర్మశాల వేదికగా అతడు భారత్పై వన్డే డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇప్పటికే అఫ్గానిస్తాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్తో 3,022 పరుగులు చేశాడు. అతడు తిరిగి జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.అఫ్ఘనిస్తాన్ జట్టురహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఘజన్ఫర్, బిలాల్ రాసోలీ, ఫాలీద్ సమీ, ఫాలీద్ సమీ, రెహమాన్ షరీఫీచదవండి: IND Vs AFG: రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్! -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. కానీ అర్ష్దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్తో చండీగఢ్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్కు బదులు ఇషాన్ కిషన్నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్డౌన్లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి. -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. బద్దలు కానున్న 37 ఏళ్ల రికార్డు
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్తో ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది.ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్మ్యాన్.. అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్ను ఓపెనర్గా పంపడం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఓపెనర్గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్ను తృటిలో కోల్పోయింది.ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్ల్లో 11,577 పరుగులు సాధించాడు. -
భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం?
వన్డే ప్రపంచకప్-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్-అఫ్గాన్ జట్లు ధర్మశాలకు చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. ఈ మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరయ్యారు. విరాట్ స్ధానంలో యశస్వి జైశ్వాల్ను జట్టులోకి తీసుకోగా, ఇంకా హార్దిక్ రిప్లేస్మెంట్ను ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అంచనా వేద్దాం.భారత ఇన్నింగ్స్ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రారంభించనున్నారు. అయితే కోహ్లి లేనుందన మూడో స్ధానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. కిషన్ చివరగా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గాన్పై భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు.కోహ్లి ప్రత్యామ్నయంగా వచ్చిన జైశ్వాల్ మాత్రం బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిగా డిసెంబర్ 2025లో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు. జైశ్వాల్ కేవలం ఓపెనర్గా మాత్రమే ఆడగలడు. కాబట్టి రోహిత్కు విశ్రాంతి ఇస్తే తప్ప జైశూకు తుది జట్టులో చోటు దక్కదు. నాలుగో స్ధానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్(వికెట్ కీపర్) బ్యాటింగ్కు రానున్నారు.ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, సుందర్హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం కారణంగా సిరీస్కు దూరం కావడంతో, తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ల కోటాలో చోటు దక్కనుంది. అతడు తన 10 ఓవర్ల కోటాను పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు.ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం?ఇక ఈ మ్యాచ్తో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకర్షించాడు. ఈ సిరీస్కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు లేకపోవడంతో ప్రిన్స్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ బౌలర్లతో ప్రిన్స్ బంతిని పంచుకోనున్నాడు. అతడు యార్కర్లు వేయడంలో దిట్ట.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్ -
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్ శుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ విమానంలో బయల్దేరారు. జైస్వాల్కు చోటుఇక లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల అఫ్గన్తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు.రోహిత్ పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్కు బ్యాకప్గా మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని అఫ్గన్తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్మెంట్ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్తో ముల్లన్పూర్ వేదికగా టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్చదవండి: MPL 2026: సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనేIt's Vaibhav Suryavanshi show against Afghanistan 👏Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026 -
అఫ్గానిస్తాన్తో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్దే
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై సంచలన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.మెన్ ఇన్ బ్లూ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.కాగా అందరి కళ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు అఫ్గాన్పై ఎలా రాణిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్ -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేరాడు. పాండ్యా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తన ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేశాడు. దీంతో అఫ్గాన్తో వన్డే సిరీస్లో పాల్గోనేందుకు బీసీసీఐ వైద్య బృందం అనుమతి ఇచ్చింది.అయితే క్లియరన్స్ లభించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పాండ్యాకు పక్కటెముకల గాయమైంది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కూడా ఈ బరోడా ఆల్రౌండర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.టీమిండియాలోకి అర్షద్?ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేయగల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు వేటను మొదలు పెట్టారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్షద్ ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్లో అర్షద్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. 48వ ఓవర్ వేసిన అర్షద్ ఊహకందని అద్భుతం చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా రాణించగలడు. కేవలం బౌలర్గానే కాకుండా లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు బాదగల సత్తా అతడిది. గత ఐపీఎల్ సీజన్లలోనూ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అర్షద్ బ్యాట్తో మెరుపు మెరిపించాడు. అర్షద్ ఇప్పటివరకు 9 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యా స్ధానంలో సెలక్టర్లు అర్షద్కు అవకాశమిస్తారో లేదో చూడాలి మరి. జూన్ 13 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: IND vs AFG: టీమిండియాతో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
భారత్తో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
భారత్తో మూడు వన్డేల సిరీస్కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్లో 6 వికెట్లు పడగొట్టిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీకి ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ఈ ఏకైక టెస్ట్లో అఫ్గాన్ ఓడిపోయినప్పటికి, సఫీ మాత్రం తన అద్భుత బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. ముల్లాన్పూర్లో తీవ్రమైన వేడిని తట్టుకుని మరి సఫీ ఏకంగా 27 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్స్టర్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులో చేర్చారు.2023లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మహ్మద్ సలీమ్ సఫీ.. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడికి అఫ్గాన్ వన్డే జట్టులో చోటు దక్కింది.నబీ, రషీద్ దూరం!కాగా మొహాలీలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్కు సీనియర్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు రషీద్ నేరుగా జట్టుతో కలవనున్నాడు. 41 ఏళ్ల మహ్మద్ నబీ మాత్రం 'అనారోగ్యం' కారణంగా ఈ ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా ఈ వన్డే సిరీస్కు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అదేవిధంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఈ సిరీస్కు అందుబాటులో లేడు.వన్డే సిరీస్ షెడ్యూల్మొదటి వన్డే- జూన్ 13- ధర్మశాలరెండో వన్డే-జూన్ 17-లక్నోమూడో వన్డే-జూన్ 20-చెన్నైవన్డే సిరీస్కు జట్లు భారత్శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, , ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్అఫ్గానిస్తాన్హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతై, రహ్మత్ ఝాన్ఫార్, ఘాజాయ్ మాలిక్, బిలాల్ సామి, సలీమ్ సఫీచదవండి: IND vs ENG: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
అర్హతే లేదు.. అఫ్గనిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు!
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.ఐర్లాండ్తో పాటు టెస్టు హోదాకాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.తాజాగా ముల్లన్పూర్లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఎందుకు అనుమతిస్తున్నారు?‘‘అసలు అఫ్గనిస్తాన్ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.అఫ్గనిస్తాన్లో అవి శూన్యంభారత్తో మ్యాచ్లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు! -
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ల ఒప్పందం చేసుకుంది.సుతార్కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్లపై సుతార్ తన బౌలింగ్ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం!
అప్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్కు పంపి దెబ్బకొట్టింది. వన్డౌన్లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జూన్ సిరీస్కు రుతురాజ్ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
టీమిండియాకు గుడ్ న్యూస్
త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ హామ్స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్కు మూడు రోజుల పాటు ఫిట్నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్కు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన టీమిండియా
తమ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఇప్పటివరకు ఇన్నింగ్స్ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.2018లో రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయం ఈ మ్యాచ్కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.ఆఫ్ఘనిస్తాన్పై, ముల్లాన్పూర్ (2026) – ఇన్నింగ్స్ & 300 పరుగులువెస్టిండీస్పై, రాజ్కోట్ (2018) – ఇన్నింగ్స్ & 272 పరుగులుఆఫ్ఘనిస్తాన్పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్ & 262 పరుగులుబంగ్లాదేశ్పై, మీర్పూర్ (2007) – ఇన్నింగ్స్ & 239 పరుగులుశ్రీలంకపై, నాగ్పూర్ (2017) – ఇన్నింగ్స్ & 239 పరుగులుభారత గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్పై వెస్టిండీస్ సాధించిన ఇన్నింగ్స్ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్లో పాక్ న్యూజిలాండ్పై సాధించిన ఇన్నింగ్స్ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.కాగా, ముల్లాన్పూర్ టెస్ట్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.అనంతరం భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్ను రెండు ఇన్నింగ్స్ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది.అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఆఫ్ఘన్ ను చిత్తు చేసిన టీమిండియా
-
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?
క్రికెట్లో మనకు తెలియని పదాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా వినిపించే పదాలు క్యాచ్ అవుట్, రనౌట్, రిటైర్డ్ హర్ట్ అనేవి కామన్గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గన్ రెండో ఇన్నింగ్స్లో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయినట్లు బిగ్స్క్రీన్పై ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అనే పదం చర్చకు దారి తీసింది.ఆబ్సెంట్ హర్ట్ అంటే?ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప, అతడి స్థానంలో మరొక బ్యాటర్ను ఆడించేందుకు వీలుండదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. ఆఫ్గన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం ఆఫ్గన్ ఆలౌటైన్లు ప్రకటించారు.రిటైర్డ్ హర్ట్ అంటే?ఇక రిటైర్డ్ హర్ట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయానికి గురైతే మైదానం వీడడం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆడగలననుకుంటే మళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్ క్రికెట్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.రిటైర్డ్ ఔట్ అంటే?మ్యాచ్లో ఒక ఆటగాడు గాయం లేదా అంపైర్ అనుమతి లేకుండా తనంతట తానుగా క్రీజు వీడడాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉండదు. జట్టు స్కోరు పెంచాలనుకునే క్రమంలో హిట్టర్కు అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యన రిటైర్డ్ ఔట్ను ఆయా జట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.చదవండి: ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్! -
సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్
టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో (టెస్ట్లు, దేశవాలీ మల్టీ డే మ్యాచ్లు) 100 వికెట్లు పూర్తి చేసుకున్న రేర్ లిస్ట్లో చేరాడు. ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఒకటి, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన సుందర్.. 78 ఇన్నింగ్స్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అదనంగా సుందర్ బ్యాటింగ్లో 2100 పైచిలుకు పరుగులు కూడా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనూ అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. మొత్తంగా అతడి ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ కెరీర్లో 3 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ తేడాతో పరంగా భారత్కు ఇదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ప్రత్యర్ది భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు ఇన్నింగ్స్ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి టెస్ట్లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు. -
ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మూడో రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్లో టీమిండియా ఆఫ్గన్ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీమిండియా స్పిన్నర్లు మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను తిప్పేయడంతో అఫ్గానిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ ఆఫ్గన్ ఇన్నింగ్స్ ఆఖర్లో గందరగోళం నెలకొంది. ఆఫ్గన్ ఇన్నింగ్స్లో 35.5 ఓవర్లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్గా వెనుదిరిగిన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడం ఏంటని చర్చించుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ సమయంలోనే అష్రఫ్ కాలి గాయానికి గురవ్వడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో టీమిండియా జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (100), శుబ్మన్ గిల్ (126) శతకాలతో చెలరేగగా, సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ 112 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే! -
టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే!
అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. అయితే ఆఫ్గన్పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం. అఫ్గానిస్తాన్తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్ను ఇంగ్లండ్ టూర్తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్స్వీప్కు గురైంది.అయితే వెస్టిండీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్తో) మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳A complete team performance from #TeamIndia 🤍Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4— BCCI (@BCCI) June 8, 2026చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం! -
మానవ్ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం
న్యూ చండీఘడ్లోని ముల్లాన్పూన్ వేదికగా పసికూన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఒకేసారి బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసి ఆఫ్ఘన్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్లో అరంగేట్రం స్పిన్నర్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్లో సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపు టీమిండియాకు పరుగుల పరంగా (ఇన్నింగ్స్) అతి భారీ విజయంగా నిలిచింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ను అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (22-10-33-6) తిప్పేశాడు. అతడికి ప్రసిద్ద్ కృష్ణ (11-2-37-3), సుందర్ (6.4-1-21-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున రహ్మత్ షా (60) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో ప్రతిఘటనే లేకుండా చేతులెత్తేసింది. ఈసారి సుందర్ (11-4-36-4), కుల్దీప్ (7.5-1-30-3), సుతార్ (10-2-29-1), సిరాజ్ (4-1-11-1) రెచ్చిపోవడంతో 112 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయంపాలైంది. -
జడేజా వారసుడు దొరికేశాడు.. 38 ఏళ్లలో ఒకే ఒక్కడు
భారత క్రికెట్లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్ధానం ఉంది. 37 ఏళ్ల జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రం ఆడుతున్నాడు.అతడి వయస్సు దృష్ట్యా త్వరలోనే టెస్ట్ క్రికెట్కూ వీడ్కోలు పలికే అవకాశముంది. దీంతో టీమిండియాలో జడేజా వారసుడు ఎవరన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో జడేజాను తలపిస్తున్నాడు. అతడే రాజస్తాన్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.అరంగేట్రంలో అదుర్స్ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. తన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్లో 28 పరుగులతో రాణించిన సుతార్.. ఆ తర్వాత బౌలింగ్తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.తన వేసిన తొలి ఓవర్లోనే మొదటి అంతర్జాతీయ వికెట్ను అతడు పడగొట్టాడు. ఈ రాజస్తాన్ యువ ఆటగాడు పిచ్పై బంతిని బాగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్ను టార్గెట్ చేస్తూ తనలోని బౌలింగ్ స్కిల్స్ను చూపించాడు. మొదటి ఇన్నింగ్స్లో 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుతార్.. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.సరికొత్త చరిత్రదీంతో మానవ్ సుతార్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదేవిధంగా గత 38 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్గా సుతార్ నిలిచాడు. ఇంతకముందు భారత దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వాణీ తన అరంగేట్రం(1988)లో వెస్టిండీస్పై 61 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టారు.సుతార్ సక్సెస్ వెనక ద్రవిడ్మానవ్ సుతార్ సక్సెస్ వెనక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇండియా-A, అండర్-19 జట్లకు ఆడే సమయంలో ద్రవిడ్ దృష్టిలో సుతార్ పడ్డాడు. నువ్వు బ్యాటింగ్ను ఎలాగైనా మేనేజ్ చేయగలవు, కానీ నీ బౌలింగ్పై ఎక్కువ దృష్టి పెట్టు అని ప్రతీసారి ద్రవిడ్ సలహా ఇచ్చేవాడంట.ఈ విషయాన్ని మానవ్ కోచ్ ధీరజ్ స్వయంగా తెలిపారు. కాగా ఆ సమయంలో ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఎ హెడ్గా ఉన్నాడు. ప్రస్తుతం తరం క్రికెటర్లంతా వైట్బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతుంటే, మానవ్ మాత్రం అందుకు భిన్నంగా గత ఐదు, ఆరేళ్ల నుంచి రెడ్బాల్ క్రికెట్పైనే పూర్తి దృష్టి పెట్టాడు.ఇప్పటికే ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. తన అరంగేట్ర సీజన్(2022-23 రంజీ ట్రోఫీ) రాజస్థాన్ తరఫున కేవలం 6 మ్యాచ్ల్లోనే 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు.నెట్స్లో టీమిండియా కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారధి శుబ్మన్ గిల్కు సుతార్ గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. గిల్ కూడా నెట్స్లో సుతార్ బౌలింగ్ను ఎదుర్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడంట. దగ్గనుంచి అతడి స్కిల్స్ను చూసిన గిల్.. సుత్తార్ భారత జట్టుకు ఎంపిక కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
మానవ్ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో భారత బౌలర్లు సత్తాచాటారు. అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. 113/5 ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు అదనంగా 39 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు సాధించిన సుతార్.. ఇప్పుడు మూడో రోజు ఆటలో మరో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మానవ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫాల్ ఆన్ ఆడనున్న అఫ్గాన్ఇక స్వల్ప స్కోర్కే పరిమితమైన అఫ్గానిస్తాన్ను ఫాల్ఆన్కు భారత్ అహ్హనించింది. 412 పరుగుల లోటుతో అఫ్గాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండిచా 564 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్(100), శుబ్మన్ గిల్(126) సెంచరీలతో కదం తొక్కగా.. సుదర్శన్(81), పంత్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత కెప్టెన్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ను 564/8 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అనంతరం బౌలింగ్లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 451 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టిన గిల్.. అదే జోరును అఫ్గాన్ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 126 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్తో కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101వ కెప్టెన్గా శుబ్మన్ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో కెప్టెన్గా రికార్డులకెక్కాడు. ఈ మైలురాయిని అతడు ఏకంగా 82.76 సగటుతో అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(101.51) మాత్రమే గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 69.6 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ నుంచి మాత్రం గిల్ కంటే ముందు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.అదేవిధంగా కెప్టెన్గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లలో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(14 ఇన్నింగ్స్లు) ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో దంచికొట్టిన రాహుల్... టెస్టు ఫార్మాట్లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కానీ ఈ మ్యాచ్లో భారత్కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు.చక్కటి షాట్లతో మంచి టచ్లో కనిపించిన యశస్వి జైస్వాల్ త్వరగానే అవుటవడంతో... అఫ్గాన్ శిబిరంలో ఆనందం కనిపించింది. వనడౌన్ బ్యాటర్ సుదర్శన్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. చితూచి ఆడిన ఈ జంట ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. మంచి బంతులను వదిలేసిన ఈ జోడీ... గతి తప్పిన బంతులపై విరుచుకుపడింది.దీంతో స్కోరుబోర్డు సాఫీగా సాగగా... అఫ్గాన్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జంటను విడదీయలేకపోయారు. అనుభవరాహిత్యం అఫ్గాన్ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బ్యాట్ను తాకిన బంతి... కీపర్ చేతిలో పడింది. అయితే అంపైర్ ఇది గుర్తించకపోగా... అఫ్గాన్ రివ్యూ కోరలేదు. తర్వాత రీప్లేలో అది స్పష్టంగా అవుట్ అని కనిపించింది. దీంతో బతికిపోయిన రాహుల్... టెస్టు ఫార్మాట్లో 12వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన రాహుల్రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్దే అవుట్ కావడం రాహుల్ కెరీర్లో ఇది మూడోసారి. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు ఖచ్చితంగా 100 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాటర్గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తమ కెరీర్లో రెండేసి సార్లు ఇలా వంద పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ వారిని అధిగమించాడు. అంతేకాకుండా రాహుల్ తన టెస్ట్ కెరీర్లో చేసిన చివరి మూడు సెంచరీలు కూడా ఇలా వంద పరుగులు వద్దే ముగిశాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలను ఇలా 'ఖచ్చితంగా 100' వద్దే ముగించిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. -
టీమిండియాను 'ఆరేసిన' ఈ సలీమ్ సఫీ ఎవరు..?
ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్కు నాణ్యమైన స్పిన్నర్లను అందించే దేశంగా మంచి పేరుంది. ఈ దేశానికి చెందిన చాలామంది స్పిన్నర్లు (రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు) విశ్వవ్యాప్తంగా మంచి పేరు గడించారు. స్పిన్నర్ల అడ్డా అయిన ఇలాంటి దేశం నుండి తాజాగా ఓ యువ పేసర్ వెలుగులోకి వచ్చాడు.తన కెరీర్లో రెండో టెస్ట్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అది కూడా టీమిండియా లాంటి పటిష్ట జట్టుపై. మరి ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరనుకుంటున్నారా..?అతడి పేరు మొహమ్మద్ సలీమ్ సఫీ. ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేస్ బౌలర్, ప్రస్తుతం ముల్లాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న వేల, సఫీ ఒక్కడే ఆఫ్ఘన్ల పాలిట ఆశాకిరణంగా నిలిచాడు.బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగి ఆడగా, సఫీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా.. ఇందులో 6 వికెట్లు సఫీ ఒక్కడే తీశాడంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో ఇట్టే అర్దమవుతుంది.సఫీ బౌలింగ్లో ఔటైన భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ధృవ్ జురెల్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నారు.సఫీ నేపథ్యంస్వింగ్ బౌలింగ్లో నైపుణ్యం కలిగిన సఫీ బంతిని రెండు వైపులా కదిలించే సామర్థ్యం కలిగిన పేసర్. లైన్ అండ్ లెంగ్త్లో స్థిరత్వం లేకపోయినా, రిథమ్లోకి వస్తే మాత్రం బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలడు. ఆఫ్ఘన్ తరఫున రెండో టెస్ట్ ఆడుతున్న సఫీ.. 2 వన్డేలు, ఓ టీ20 కూడా ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేయగా.. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ 28 పరుగుల వద్ద ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16) వికెట్ తీసి భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం 40 పరుగుల వద్ద ప్రసిద్ద్ కృష్ణ మరో ఓపెనర్ సెదిఖుల్లా అటల్ను (17) క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్ఘన్ను కష్టాల్లోకి నెట్టాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 524 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (100), శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. -
తప్పు మీద తప్పు.. ఆఫ్గన్ కొంపముంచిన కెప్టెన్!
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తప్పు మీద తప్పులు చేస్తోంది. తొలిరోజు కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డ అఫ్గానిస్తాన్ రెండో రోజు ఆటలోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఫలితంగా టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక మ్యాచ్పై పట్టు సాధించేలా చేసింది. తొలిరోజు ఆటలో కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అజ్మతుల్లా ఒమర్జయ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ మిస్ అయ్యాడు. దీంతో బంతి అతడి బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ అఫ్సర్ జజయ్ ఔట్ అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఔటివ్వలేదు. అయితే కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీపర్ను అడిగినప్పటికీ అతడు క్లారిటీతో లేకపోవడం వల్ల రివ్యూ వెళ్లలేదు.ఆ తర్వాత రిప్లేలో రాహుల్ బ్యాట్కు బంతి తాకినట్లు స్పైక్ రావడం కనిపించింది. దీంతో 16 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఆ తర్వాత శతకం బాదాడు. తొలిరోజు చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్వని అఫ్గానిస్తాన్ రెండోరోజు ఆటలోనూ అదే తప్పిదం చేసింది. ఈసారి గిల్ విషయంలో రివ్యూకు తీసుకోవడంలో విఫలమైంది. ఇన్నింగ్స్ 89వ ఓవర్లో ఒమర్జయ్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. అయితే ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అయితే ఒమర్జయ్ రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదిని కోరినప్పటికీ, అతడు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అవుతుందేమోనని భావించి రివ్యూ కోరలేదు. కానీ రిప్లేలో బ్యాట్కు బంతి ఎక్కడా తగలకుండా లెగ్ స్టంప్ను ఎగరేస్తున్నట్లు కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే గిల్ 109 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. ఈ రెండు తప్పుల తర్వాత కూడా ఆఫ్గన్ తమ లెక్కను సరిచేసుకోలేకపోయింది. ఆ మరుసటి బంతికే రిషబ్ పంత్ కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒమర్జయ్ వేసిన బంతిని పంత్ షాడ్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ అఫ్సర్ చేతిలో పడింది. అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు.సెకండ్ స్లిప్లో ఉన్న రహమనుల్లా గుర్బాజ్ మాత్రం బంతి పంత్ బ్యాట్కు తగిలిందని, రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదికి కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ షాహిది మాత్రం రివ్యూకు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు స్పైక్ రావడంతో కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. అలా 54 పరుగుల వద్ద ఔట్ ప్రమాదం నుంచి బయటపడిన పంత్ తన స్కోరుకు మరో 27 పరుగుల జత చేసుకున్నాడు. ఇలా మూడుసార్లు కీలక ఆటగాళ్లను ఔట్ చేసే విషయంలో ఆఫ్గన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ రివ్యూ తీసుకోవడంలో విఫలమై ఆఫ్గన్ కొంపముంచాడు. అతడి తప్పుల వల్ల టీమిండియా 550 పరుగుల మార్క్ను అందుకోగలిగింది. ఒకవేళ సరైన సమయంలో రివ్యూలు తీసుకొని ఉంటే టీమిండియా ఆట నాలుగు వందల్లోపే ముగిసి ఉండేది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తవ్వగానే గిల్ డిక్లేర్కు పిలుపునిచ్చాడు. కేఎల్ రాహుల్, గిల్ సెంచరీలు చేయగా.. పంత్, సాయి సుదర్శన్, సుందర్లు అర్థసెంచరీలతో మెరిశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో మెరవగా, జియావుర్ రెహమాన్, హస్మతుల్లా చెరొక వికెట్ తీశారు.చదవండి: ఆత్రుత ఎందుకు పంత్.. ఓపిక వహించాల్సింది! -
మహ్మద్ సిరాజ్ విధ్వంసం.. 183 స్ట్రైక్ రేట్తో మెరుపులు
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ ఆర్డర్లో సిరాజ్కు టీమ్ మేనెజ్మెంట్ ప్రమోషన్ ఇచ్చింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే ముందే 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే సలీమ్ సఫీ వేసిన ఫుల్ టాస్ బంతిని మిడ్-వికెట్ మీదుగా అద్భుతమైన ఫోర్ కొట్టి సిరాజ్ తన ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత 120 ఓవర్ వేసిన అఫ్గాన్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటేను ఈ హైదరాబాదీ ఉతికిరేశాడు. రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్గా మలిచిన సిరాజ్.. ఆ తర్వాత రెండు బంతులను వరుసగా బౌండరీలు బాదాడు. ఆ ఓవర్లో అతడు 14 పరుగులు పిండుకున్నాడు. సాధారణంగా బంతితో అద్భుతాలు చేసే సిరాజ్.. ఇప్పుడు బ్యాట్తో మెరుపులు మెరిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడి బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అన్నా నీలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిరాజ్ మొత్తంగా 183 స్ట్రైక్ రేట్తో 12 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.ಧಮಾಕಾ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ Siuuuu Raj!🔥ವೀಕ್ಷಿಸಿ | #INDvAFG | Only Test ➡️ DAY 2 | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#MohammedSiraj pic.twitter.com/6tomAfPYRb— Star Sports Kannada (@StarSportsKan) June 7, 2026 -
గంభీర్ మాట లెక్కచేయని పంత్.. ఆత్రుత ఎందుకు?
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా 500 పరుగుల దిశగా పయనిస్తోంది. మ్యాచ్లో కేఎల్ రాహుల్, గిల్ శతకాలు నమోదు చేయగా, పంత్ మాత్రం సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. షాహిది వేసిన ఇన్నింగ్స్ 103వ ఓవర్ నాలుగో బంతిని పంత్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్కు తాకి గాల్లోకి లేచిన బంతిని ఫీల్డర్ అజ్మతుల్లా ఒమర్జయ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైన పంత్ ఆఫ్గన్తో టెస్టులో మాత్రం మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే పంత్ బ్యాటింగ్ దిగడానికి ముందు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ డిఫెన్స్మోడ్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ బ్యాటింగ్ చేయాలని సూచించాడు. కానీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తన శైలికి తగినట్లు ఫాస్ట్గా ఆడేందుకే పంత్ ప్రాధాన్యమిచ్చాడు. అయితే సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కాస్త తగ్గి ఆడుంటే బాగుండేది. భారీ షాట్ ఆడాలనే ఆత్రుతతో బంతిని బలంగా బాదినప్పటికీ టైమింగ్ కుదరక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కోచ్ గంభీర్ మాట లెక్కచేయకుండా ఆడావు.. మూల్యం చెల్లించుకున్నావు’.. ‘పంత్ నువ్వు మారవా.. అంత నిర్లక్ష్యం పనికిరాదు’.. ‘నిర్లక్ష్యం పంత్ కొంపముంచింది’.. ‘తొందరెందుకు పంత్.. కాస్త ఓపిక వహిస్తే సెంచరీ అయ్యేదిగా’ అంటూ అభిమానులు కామెంట్లు చేశారు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికీ పంత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఆఫ్గన్తో టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (14), మానవ్ సుతార్ (9) పరుగులతో ఆడుతున్నారు. 500 పరుగల మార్క్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ నాలుగు వికెట్లు తీయగా, జిహుర్ రెహ్మాన్, హష్మతుల్లా చెరొక వికెట్ తీశారు.Gautam Gambhir Instructs Rishabh Pant to Play Defensively Even Before He Enters to Bat 🙏 pic.twitter.com/UgVFRkzFqi— RP17 Gang™ (@RP17Gang) June 6, 202681 RUNS BY RISHABH PANT - highest score by an Indian wicketkeeper in Tests vs Afghanistan. pic.twitter.com/1St7OXFEJN— RP17 Gang™ (@RP17Gang) June 7, 2026చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన! -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్దే ఆధిపత్యం
India vs Afghanistan test Day 2 updates and Highlights: ముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది.రెండో రోజూ భారత్దేముల్లాన్పూర్ టెస్టులో అఫ్గాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. పర్యాటక జట్టు భారత్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 451 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రెహమత్ షా(43) ఉన్నాడు.కాగా భారత అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్తో అదరగొట్టాడు. బ్యాటింగ్లో 28 పరుగులు చేసిన సుతార్, బౌలింగ్లో 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్హాస్మతుల్లా షాహిదీ(20) రూపంలో అఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో వికెట్లు ముందు షాహిదీ దొరికిపోయాడు.అఫ్గాన్ మూడో వికెట్ డౌన్గుర్భాజ్ రూపంలో అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గుర్బాజ్.. సుతార్ బౌలింగ్లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అటల్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 49/2తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్28 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టడంతో అబ్దుల్ మాలిక్ (16) ఔటయ్యాడు. మానవ్ సుతార్కు టెస్ట్ల్లో ఇది తొలి వికెట్. ఈ వికెట్ను అతడు తన తొలి ఓవర్లోనే తీయడం విశేషం. మాలిక్ ఔటయ్యాక అంపైర్లు టీ బ్రేక్కు పిలుపిచ్చారు.భారత్ భారీ స్కోర్అప్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తమ తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.సిరాజ్ అవుట్టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 22 పరుగులు చేసిన సిరాజ్.. సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ స్కోర్: 543/8భారీ స్కోర్ దిశగా భారత్రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), మానవ్ సుతార్(9) ఉన్నారు. రెండో రోజు ఆటలో భారత్.. గిల్(100), రిషబ్ పంత్(81), జురెల్(19) వికెట్లు కోల్పోయింది.పంత్ అవుట్రిషబ్ పంత్(81) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. షాహిది బౌలింగ్లో ఔటయ్యాడు.ధ్రువ్ జురెల్ అవుట్19 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సలీమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు . 102 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 456-5భారత్ నాలుగో వికెట్ డౌన్416 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 126 రన్స్ చేసిన గిల్..సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో ధ్రువ్ జురెల్ వచ్చాడు.రెండో రోజు ఆట ఆరంభంముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో రిషబ్ పంత్(50), శుబ్మన్ గిల్(106) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. మొదటి రోజు ఆటలో కేఎల్ రాహుల్ శతక్కొట్టగా.. సాయిసుదర్శన్(81) హాఫ్ సెంచరీతో రాణించారు. అఫ్దాన్ బౌలర్లలో సలీమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జియావుర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
గిల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్కు 11వ టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.అరుదైన ఫీట్టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్ల్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు.అంతేకాదు కెప్టెన్ అయిన అతి తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.అలాగే అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్-5లోకి చేరాడు. గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (20) టాప్ ప్లేస్లో ఉండగా.. సునీల్ గవాస్కర్ (11), మొహమ్మద్ అజహారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7) గిల్కు ముందున్నారు. గిల్ 6 టెస్ట్ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్లోనే సాధించడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 368-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. గిల్ (103), వికెట్కీపర్ రిషబ్ పంత్ (50) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్ షరిఫీ ఓ వికెట్ పడగొట్టారు. -
గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగిత్, కెప్టెన్ గిల్ కూడా సెంచరీ దిశగా పరిగెడుతున్నాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విషయం పక్కనబెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో తన చేతిలో ఒక అంతుచిక్కని పదార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. అయితే అవి హోమియోపతి మెడిసిన్స్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే చిన్న డబ్బాలో రౌండ్గా ఉన్న పిల్స్ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవడం కనిపించింది. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గంభీర్ ఆ పిల్స్ను వాడుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవకాశం చిక్కితే చాలు గంభీర్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఆకతాయిలు తమ నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం కనిపించింది. 'గంభీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని గంభీర్ పూర్తిగా చెడగొడుతున్నాడని, అతన్ని వెంటనే కోచ్ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని' కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఆఫ్గన్తో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 104 బంతులెదుర్కొని 13 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు రావాలని గంభీర్ తనకు చెప్పాడని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ (100) శతకం సాధించాడు. 🚨DRUG DEALER GAUTAM GAMBHIR 🚨Gautam Gambhir was seen taking drugs while on-going India vs Afghanistan test match 👀 pic.twitter.com/9gJOYoy7jg— ; (@ReignofDhoni) June 6, 2026చదవండి: ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్! -
ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్ శతకంతో సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. తాజాగా టీమిండియా సారథి శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా గిల్ నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్పై సాధించిన అర్థసెంచరీ గిల్కు తొమ్మిదోది కావడం విశేషం.ఇక గిల్ ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్లాడి 2,843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 68 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (65), రిషబ్ పంత్ (25) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ శతకం చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)చదవండి: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం! -
శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 164 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ను అందుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆతర్వాతి బంతికే జియా ఉర్ రహ్మాన్ షరిఫీ బౌలింగ్లో రహ్మానుల్లా గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ ఇలా సెంచరీ చేసిన వెంటనే ఔట్ కావడం మూడోసారి.ఈ సెంచరీ రాహుల్కు 12వ టెస్ట్ సెంచరీ. ఆఫ్ఘనిస్తాన్పై మొదటిది. 12 సెంచరీల్లో రాహుల్ సాధించిన ఆరో దేశం ఆఫ్ఘనిస్తాన్. మూడు ఫార్మాట్లో రాహుల్కు ఇది 22వ సెంచరీ. టెస్ట్ల్లో 12తో పాటు 8 వన్డే శతకాలు, 2 టీ20 శతకాలు రాహుల్ ఖాతాలో ఉన్నాయి. ఈ సెంచరీతో రాహుల్ భారత్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ (33) టాప్ ప్లేస్లో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (22), మురళీ విజయ్ (12) రాహుల్ (11) కంటే ముందున్నారు. తన 12 టెస్ట్ సెంచరీల్లో రాహుల్ 11 ఓపెనర్గా సాధంచగా.. ఒకటి మిడిలార్డర్ బ్యాటర్గా సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 64 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 276-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్ (62), వికెట్కీపర్ రిషబ్ పంత్ (2) క్రీజ్లో ఉన్నారు. -
కోహ్లి అవుట్.. రీప్లేస్మెంట్ను ప్రకటించిన బీసీసీఐ
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.కొత్త టీ20 కెప్టెన్కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదుఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.కోహ్లి స్థానంలో అతడేఅదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ను అఫ్గన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రోహిత్ సంగతేంటి?ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.మరోవైపు.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా).షెడ్యూల్జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు -
క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్!
ముల్లన్పూర్ వేదికగా భారత్, అప్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కేఎల్ రాహుల్ అర్థసెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్తో కలిసి నిలకడగా ఆడుతున్న రాహుల్ రెండో వికెట్కు అతడితో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 36 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే మ్యాచ్లో కేఎల్ రాహుల్కు ఒక లైఫ్ లభించింది. జియావు్ రెహ్మాన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతిని కేఎల్ రాహుల్ కట్ షాటే ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సరైన టైమింగ్ కుదరక బంతి బ్యాట్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే క్యాచ్ అవుట్ అంటూ కీపర్ సహా ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అప్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది రివ్యూ వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అయితే బౌలర్తో పాటు సెకండ్ స్లిప్లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్లు ఆత్మవిశ్వాసంతో రివ్యూకు వెళ్లాలని కెప్టెన్కు చెప్పినప్పటికీ, కీపర్ సందేహం వ్యక్తం చేయడంతో హష్మతుల్లా డీఆర్ఎస్కు వెళ్లలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో బంతి కేఎల్ రాహుల్ బ్యాట్కు తగిలినట్లు స్పైక్వచ్చింది. దీంతో రివ్యూ తీసుకోకుండా తప్పు చేశానే అని హష్మతుల్లా తెగ బాధపడిపోయాడు. అయితే చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేనట్లే రివ్యూ వెళ్లకుండా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం. ఈ విషయం పక్కనబెడితే కేఎల్ రాహుల్ తాను ఔట్ అని తెలిసినప్పటికీ బంతి ఎడ్జ్ అవ్వలేదంటూ అంపైర్కు సైగ చేసి పక్కదారి పట్టించాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అభిమానులు మండిపడ్డారు. తాను ఔట్ కావద్దని ప్రతీ ఆటగాడిగా స్వార్థం ఉండడం సహజమేనని, కానీ కేఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా తనంతట తాను మైదానం వీడి ఉంటే అతడిపై గౌరవం పెరిగి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. అలా కాకుండా స్పోర్ట్స్ స్పిరిట్కు విరుద్ధంగా రాహుల్ చర్య ఉందని విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో ఒక లైఫ్ పొందిన కేఎల్ రాహుల్ టీమిండియా 107 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్థశతకం మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు బౌండరీలు ఉన్నాయి. ఈ అర్థశతకంతో కేఎల్ రాహుల్ 9వేల ఫస్ట్క్లాస్ పరుగులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం.Rahul confused the AFG team and made them believe it was his bat's sound. Well Played Rahul 👏 https://t.co/enVYHa7AKe pic.twitter.com/OaWR4MrhLu— Varun (@The_MythBreaker) June 6, 2026చదవండి: పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం! -
టీమిండియాలోకి కొత్త కుర్రాడు.. ఎవరీ మానవ్ సుతార్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. భారత టెస్ట్ క్యాప్ను అందుకున్న 319వ ప్లేయర్గా సుతార్ నిలిచాడు.వాస్తవానికి హర్ష్ దూబేకు తుది జట్టులో ఆడే అవకాశముస్తుందని అంతా భావించారు. కానీ మేనెజ్మెంట్ మాత్రం సుతార్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఎవరి మానవ్ సుతార్ నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ మానవ్ సుతార్?అతడి పూర్తి పేరు.. మానవ్ జగదుసకుమార్ సుతార్. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఆగస్టు 3, 2002న రాజస్థాన్లోని శ్రీ గంగనగర్లో జన్మించాడు. తన చిన్నతనం క్రికెటర్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమించాడు. మానవ్ శ్రీ గంగానగర్ జిల్లా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి అండర్-14, అండర్-16 టైటిళ్లను అందించాడు. ఆ తర్వాత అతడు రాజస్తాన్ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అక్కడ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో రాజస్తాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం మానవ్కు లభించింది. 2022 రంజీ సీజన్లో ఆంధ్రప్రదేశ్పై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర రంజీ సీజన్లోనే సుతార్ దుమ్ములేపాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. కేవలం 6 మ్యాచ్లలోనే 39 వికెట్లు పడగొట్టి రాజస్తాన్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. తొలి 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో అతడు ఏకంగా 44 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 రెడ్బాల్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన సుతార్.. 2.94 ఏకానమీ రేట్తో 129 వికెట్లు సాధించాడు. ఇందులో ఆరు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. 8/33 అతడి అత్యుత్తమ గణాంకాలగా ఉన్నాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కు బ్యాట్తో కూడా రాణించే సత్తా ఉంది. అతడి పేరిట ఓ ఫస్ట్క్లాస్ సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగానే అతడిని జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్నామ్యాయంగా అతడిని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండియా-ఎ తరపున కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు తన అరంగేట్ర మ్యాచ్లో సీనియర్ జట్టు తరపున ఎలా రాణిస్తాడో చూడాలి. కాగా 12 ఏళ్ల తర్వాత రాజస్తాన్ నుంచి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్గా సుతార్ నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
‘అతడు జట్టులో ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్లు ఆడనుంది.రో-కో ఆడతారా?ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు.. అనంతరం న్యూజిలాండ్తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్కప్లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.గాయాల బెడదదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్తో సిరీస్కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్తో ఆఖరి వన్డే నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్కప్ గెలవదని పేర్కొన్నాడు.రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవదు’’ అని గ్రీన్స్టోన్ లోబో పేర్కొన్నాడు.సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలుఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.అభిమానుల ఆగ్రహంఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్ స్టార్
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో పాల్గోనేందుకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుండి అనుమతి లభించింది.దీంతో దాదాపు ఏడాది తర్వాత పాండ్యా వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. కాగా గత నెలలో అఫ్గాన్తో సిరీస్కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో పాండ్యాకు చోటు దక్కింది. కానీ వెన్ను గాయంతో బాధపడుతున్న పాండ్యాకు ఈ సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. దీంతో జూన్ 2న బెంగళూరులోని సీఓఈకి వెళ్లిన పాండ్యాకు వైద్యులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధించడంతో సీఓఈ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. మరోవైపు తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.ఇందులో పాసైతేనే అఫ్గాన్తో సిరీస్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో సెలక్షన్ కమిటీ భర్తీ చేయనుంది. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే టీమిండియా స్టార్, రన్మిషన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. కోహ్లి ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని రుతురాజ్ గైక్వాడ్తో భర్తీ చేశారు.పాండ్యా విషయానికి వస్తే.. చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలు ఆడి, 32.82 సగటుతో 1904 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి పేరిట 91 వన్డే వికెట్లు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి. వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదేశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (వైస్కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ENG vs NZ: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
రాహుల్, గిల్ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు సాధించింది. గిల్ 103, పంత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) నిరాశపరచగా.. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ భారీ అర్ధ శతకం (81)తో అలరించాడు. అఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీ సఫీ రెండు వికెట్లు తీయగా.. జియాఉర్ రహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.శుబ్మన్ గిల్ సెంచరీ82.5: సలీమ్ సఫీ బౌలింగ్లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ గిల్. 138 బంతుల్లో సెంచరీ చేసిన గిల్. స్కోరు: 358/3 83).మూడు వందల మార్కు దాటిన టీమిండియా.. స్కోరు: 340/3(79)గిల్ 91, పంత్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి బంతికే రాహుల్ అవుట్. క్రీజులోకి రిషభ్ పంత్. స్కోరు: 249/3 (61). గిల్ 39 పరుగులతో ఉండగా.. పంత్ రెండు పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ60.1: జియాఉర్ రహ్మాన్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. కెరీర్లో 12వ టెస్టు సెంచరీ సాధించిన కర్ణాటక బ్యాటర్.45 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-2గిల్ 8, రాహుల్ 75 పరుగులతో ఉన్నారు.సాయి సుదర్శన్ అవుట్42.4: సలీమ్ సపీ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ (81). సెంచరీకి పందొమ్మిది పరుగుల దూరంలో పెవిలియన్ చేరిన సాయి. క్రీజులోకి కెప్టెన్ శుబ్మన్ గిల్ రాగా.. రాహుల్ 72 పరుగులతో ఉన్నాడు.సాయి అర్ద శతకం31.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. స్కోరు: 133/1 (31.4)కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ29.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. టెస్టు కెరీర్లో అతడికి ఇది 21వ హాఫ్ సెంచరీ. 31 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121-1.లంచ్ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(37), సాయిసుదర్శన్(32) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సుదర్శన్, రాహుల్21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(32), సాయిసుదర్శన్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన జైశ్వాల్.. సలీం బౌలింగ్లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న భారత్భారత ఓపెనర్లు రాహుల్(16), యశస్వి జైశ్వాల్(20) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.బ్యాటింగ్ భారత్దేముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్తో రాజస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుత్తార్ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.అదేవిధంగా సాయిసుదర్శన్కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు ఛాన్స్ ఇచ్చారు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు రషీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావడంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయలేనని రషీద్ ఖాన్ గతం లోనే స్పష్టం చేశాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా అనే దానిపై ఆ జట్టు కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పం దించారు. 'రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్కు దూరమవ్వాలని రషీద్ ఎప్పుడో నిర్ణయిం చుకున్నాడు.అతడు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్లో ఆడుతుంటాడు. అయితే రషీద్ మా జట్టుకు ఫ్రంట్లైన్ బౌలర్ కావడంతో అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని భావిస్తున్న రషీద్తో నేను రెడ్బాల్ క్రికెట్లో కొనసాగాలని అడుగుతాను. కానీ ఆడతాడా లేదా అన్నది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.27 ఏళ్ల రషీద్ ఖాన్ 2023 వన్డే ప్రపంచకప్కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. అప్పటినుంచి ఎక్కువసేపు బౌలింగ్ చేయడంలో రషీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో తాను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా అని రషీద్ ఖాన్ తెలిపాడు. కాబట్టి టెస్టు క్రికెట్లో ఆడాలా వద్దా అనేది అతడి ఇష్టానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.కాగా రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్తాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది జట్టును నడిపించనున్నాడు. జట్టులో రహమనుల్లా జద్రన్, అఫ్సర్ జజాయ్, ఇక్రమ్ అలీఖిలి, అజ్మతుల్లా ఒమర్జయ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్పటినుంచి 12 మ్యాచ్లాడగా, నాలుగు విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. అఫ్గానిస్తాన్ చివరగా గతేడాది అక్టోబర్లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 73 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్గా వెలుగొందుతున్న రషీద్ ఖాన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఆరు టెస్టుల్లో 154 పరుగులు, 45 వికెట్లు; 117 వన్డేల్లో 1,393 పరుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 పరుగులు, 190 వికెట్లు తీశాడు.చదవండి: ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్! -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్తో వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.వన్డౌన్లో ఎవరు?శుబ్మన్ గిల్ సారథ్యంలోని టెస్టు జట్టులో కొత్తగా మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే కొత్తగా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో స్థానం కోసం సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ మధ్య పోటీ నెలకొంది. సాయి సుదర్శన్ చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తరఫున బరిలో దిగాడు.ఈ మ్యాచ్లో సాయి దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 15 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్తో టెస్టులో సాయికి కాకుండా పడిక్కల్కు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు.న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలిఅఫ్గన్తో శనివారం నాటి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్కు సరైన అవకాశాలు లభించలేదు. అతడు ఎక్కువగా ఇంగ్లండ్లోనే ఆడాడు. అతడికి న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలని నేను బలంగా విశ్వసిస్తున్నా.ఏదేమైనా మేము పదకొండు మందిని మాత్రమే తుదిజట్టులోకి ఎంపిక చేస్తాము కదా!.. సాయి ఫామ్ కూడా మరీ అంత చెత్తగా ఏమీ లేదు. ఇటీవల ఐపీఎల్లో అతడు 700కు పైగా పరుగులు సాధించాడు. కేవలం 4-5 మ్యాచ్ల ద్వారా సాయి ఆట తీరుపై నిర్ణయానికి రాకూడదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.పడిక్కల్ మరోసారి బెంచ్కే తద్వారా అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో సాయి సుదర్శన్లో వన్డౌన్లో ఆడిస్తామని గంభీర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో పడిక్కల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.కాగా కర్ణాటక బ్యాటర్ పడిక్కల్ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో 543 పరుగుల సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే, గంభీర్ మాత్రం సాయి వైపే మొగ్గుచూపడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చివరగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా.. ప్రత్యర్థి చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో టెస్టు ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ సైకిల్లో భాగం కాదు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తమ బలాన్ని పరీక్షించుకునే వీలు దొరికింది. కాగా టెస్టు తర్వాత టీమిండియా అఫ్గన్తో మూడు వన్డేలు ఆడనుంది.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
భారత తుది జట్టు ఇదే.. ఆ ఇద్దరి అరంగేట్రం ఫిక్స్?
ఐపీఎల్-2026 సీజన్ మెరుపులు తర్వాత సంప్రదాయ క్రికెట్ సమరానికి రంగం సిద్దమైంది. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)లో భాగం కానప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఈ ఏకైక మ్యాచ్ పైనే ఉంది. ఎందుకంటే సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత స్వదేశంలో భారత్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది.అంతకంటే ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియాకు ఘోర పరభావం ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్వదేశంలో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్ కంటే భారత్ అన్ని విధాలగా పటిష్టంగా ఉన్నప్పటికి.. మైదానంలో ఆధిపత్య క్రికెట్ ఆడగలరా? లేదా అన్నది వేచి చూడాలి. ఈ మ్యాచ్తో కొన్ని కొత్త ముఖాలు అంతర్జాతీయ క్రికెట్కు పరిచయం అయ్యే అవకాశముంది. హర్ష్ దూబే, గుర్నార్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా దేవ్దత్త్ పడిక్కల్ టెస్టుల్లో తిరిగి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ స్ధానంలో అతడిని ఆడించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2025-26లో ఈ కర్ణాటక బ్యాటర్ 54.30 సగటుతో 543 పరుగులు చేశాడు.ధ్రువ్ జురెల్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలో ఎవరికో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండడంతో జురెల్ను బెంచ్కే పరిమితం చేసే అవకాశముంది. స్పెషలిస్ట్ బ్యాటర్ను ఆడించాలనుకుంటే నితీశ్ను పక్కన పెట్టక తప్పదు. ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్దత్త్ పడిక్కల్. నితీష్ కుమార్ రెడ్డి/ ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.చదవండి: క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ -
పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!
అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. గతేడాది రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలను చేపట్టిన గిల్కు డిప్యూటీగా పంత్ ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ దారుణంగా పడిపోయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో రిషబ్ పేలవమైన ప్రదర్శనలు కనబరిచాడు. దీంతో అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో పంత్తో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అఫ్గాన్తో జరిగే టెస్టు మ్యాచ్లో ఒక సీనియర్ ఆటగాడిగా ఎలా వ్యవహరించాలనే విషయంపై గంభీర్ పంత్తో మాట్లాడాడు. ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ వెల్లడించాడు."రిషబ్ ఒక సీనియర్ ప్లేయర్గా జట్టులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడు. యువ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై గంభీర్, పంత్ మధ్య చర్చ జరిగింది. జట్టులో ఒక రోల్ మోడల్గా పంత్ నిలుస్తాడని ఆశిస్తున్నాను" అని డెష్కాట్ పేర్కొన్నాడు. కాగా 2025లో రిషబ్ మొత్తం 7 టెస్టులు ఆడి, 48.38 సగటుతో 629 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా రికార్డు బాగున్నప్పటికీ, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 27, 2, 7, 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2026లో కూడా అదే తీరును కనబరిచాడు. ఐపీఎల్లో 12 మ్యాచ్లు ఆడి కేవలం 27.88 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం లక్నో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొన్నాడు.చదవండి: AUS vs PAK: షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్దే -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
టీమిండియాలోకి కొత్త ముఖం.. కన్ఫర్మ్ చేసిన కోచ్
మరో రెండు రోజుల్లో (జూన్ 6) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ (ముల్లాన్పూర్) కోసం టీమిండియా సర్వం సిద్దం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఓ యువ ఆటగాడు అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. యువ స్పిన్నర్లు హర్ష్ దూబే, మానవ్ సుతార్లో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చని సంకేతాలు ఇచ్చాడు. దీంతో వీరిలో ఒకరు టెస్టు క్యాప్ అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ముల్లాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, రెండో స్పిన్నర్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ స్థానం కోసం హర్ష్, సుతార్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. పేసర్లుగా మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ పేర్లు ఖరారయ్యాయి. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖయంగా తెలుస్తోంది.బ్యాటింగ్ విషయానికొస్తే.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మేనేజ్మెంట్ ఒకవేళ మరో స్పెషలిస్ట్ బ్యాటర్తో బరిలోకి దిగాలని భావిస్తే.. నితీశ్ను పక్కన పెట్టి ధృవ్ జురెల్కు అవకాశం ఇవ్వవచ్చు. -
‘సొంతగడ్డపై టీమిండియా పటిష్టంగా కనిపించట్లేదు’
గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత భారత్కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా.ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లన్పూర్లో ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగం కాదు.భారత్కు అత్యంత ముఖ్యంఅయినప్పటికీ ఈ మ్యాచ్ భారత్కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ను తేలికగా తీసుకోకూడదు.టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.టెస్టు క్రికెట్పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశంఅదే విధంగా.. ‘‘అఫ్గన్తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్లకు కూడా ఎంపిక చేయండిజఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు -
ఆఫ్ఘన్ సిరీస్కు విరాట్ ప్రత్యామ్నాయం ఇతడే..!
త్వరలో (జూన్ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ సిరీస్కు విరాట్ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్ చేసిందని సమాచారం. విరాట్ రీప్లేస్మెంట్ కోసం తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్, పడిక్కల్, పాటిదార్ను కాదని రుతురాజ్వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. -
విరాట్ కోహ్లి అవుట్.. టీమిండియాలోకి హైదరాబాదీ!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు విరాట్ కోహ్లి రూపంలో భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్కు తొడ కండరాల గాయం కారణంగా కోహ్లి దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్లో కూడా గాయంతో బాధపడుతూనే ఆడాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అఫ్గాన్ సిరీస్ నుంచి తప్పుకోవాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. దీంతో కోహ్లి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.ఈ క్రమంలో విరాట్ స్ధానంలో జట్టులోకి వచ్చే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.తిలక్ వర్మహైదరాబాదీ తిలక్ వర్మ ప్రస్తుత రేసులో అందరికంటే ముందున్నాడు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న తిలక్ను.. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకునే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు మిడిలార్డర్లో రాణించే సత్తా ఉంది. అతడు ఇప్పటివరకు భారత్ తరపున కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడాడు. కాగా సెలక్టర్లు ఇటీవలే తిలక్ను శ్రీలంక టూర్ కోసం భారత-ఎ జట్టు కెప్టెన్ ఎంపిక చేశారు. ఒకవేళ తిలక్ను వన్డే జట్టులోకి తీసుకోవాలని భావిస్తే ఇండియా-ఎ టీమ్ కెప్టెన్గా మరొకరని నియమించే అవకాశముంది.దేవదత్ పడిక్కల్కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా సెలక్టర్ల రాడార్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో పడిక్కల్ భాగంగా ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున పడిక్కల్ దుమ్ములేపాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తన ప్రత్యామ్నాయ జట్టులో పడిక్కల్ను నెం.3 స్థానానికి ఎంపిక చేయడం విశేషం.రజత్ పాటిదార్ఇక ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించిన కెప్టెన్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. పాటిదార్ కూడా టాపర్డర్తో పాటు మిడిలార్డర్లో కూడా రాణించగలడు. అతడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నాడు. కానీ రుతురాజ్ భారత-ఎ జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిలో ఎవరు వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
టీమిండియాకు బిగ్ షాక్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాగా అఫ్గాన్తో మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జూన్ 9న ముల్లాన్పూర్లో భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు తొడ కండరాల గాయం బారిన పడడంతో విరాట్ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్బాల్ సిరీస్కు కోహ్లి దూరం కావడం భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన విరాట్ను భారత జెర్సీలో చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు మళ్లీ జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగననున్నాడు.మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. రోహిత్ కూడా ప్రస్తుతం తొడ కండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలలో అతడు పాసైతేనే జట్టులో కొనసాగనున్నాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో భర్తీ చేయనున్నారు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 13 న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.అఫ్గానిస్తాన్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్, కుల్దీప్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, హార్దిక్ పాండ్యాచదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
కింద పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోహిత్ నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై ముందుకు పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. రోహిత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదా అని గాబరా పడుతున్నారు.రోహిత్ త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. అతడు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్ల్లో మాత్రం తనదైన క్లాస్ను ప్రదర్శించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు.🚨🚨ROHIT SHARMA OUT OF THE FIRST 2 ODIs AGAINST AFGHANISTAN [CRICBUZZ]According to reliable sources and reports, Rohit Sharma suffered a knee twist after losing balance and is feeling discomfort. As per reports, he won't be available for the opening two games. India's… pic.twitter.com/xVn7qXcQg0— Oxygen (@Oxygen18_) June 3, 2026కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్కు రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా ఎంపికయ్యాడు. అతడు కూడా రోహిత్లాగే టెస్ట్, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు గుడ్బై చెప్పి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో రోహిత్తో పోలిస్తే విరాట్ చాలా మెరుగ్గా ఆడాడు. వరుసగా రెండో ఎడిషన్లో తన జట్టు ఛాంపియన్గా నిలపడంలో ప్రధానపాత్ర పోషించాడు. గుజరాత్తో జరిగిన ఫైనల్స్లో అజేయమైన అర్ద సెంచరీతో తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు.రోహిత్, విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్లో ఉండి, ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి ఖరాకండిగా చెప్పారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే మ్యాచ్లు జూన్ 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. -
హార్దిక్, రోహిత్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఒకవేళ అదే జరిగితే?
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్ సిమ్యులేషన్స్’లో సాధన చేస్తాడు. ఐపీఎల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్గా ఉంటేనే టీమ్లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. హిట్మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్నెస్ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదే:శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్? -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్?
అఫ్గానిస్తాన్తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్పూర్కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్ను నెట్స్లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.కెప్టెన్గా రాహుల్!కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్కు గిల్తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టుశుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)నెట్ బౌలర్లు: గుర్జప్నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ -
కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్ 2) సోషల్మీడియాలో వైరలైంది. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం ఐపీఎల్ స్టార్లకు అధిక అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.ఐపీఎల్ 2026 పెను సంచలనం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.మిడిలార్డర్లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఆల్రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్ పాండ్యా, రసిక్ సలాం దార్కు చోటు దక్కవచ్చని అంచనా.బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు అందరి నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్కే అన్షుల్ కంబోజ్, కేకేఆర్ కార్తీక్ త్యాగి, లక్నో ప్రిన్స్ యాదవ్లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.అంచనా భారత జట్టు:వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నమన్ ధిర్, ఆశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, అన్షుల్ కంబోజ్, కార్తిక్ త్యాగి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్.ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్మీడియాలో ప్రచారం మాత్రమే. ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. -
భారత టెస్ట్ జట్టులో మార్పులు.. ఐపీఎల్ స్టార్లకు ప్రత్యేక అవకాశం
త్వరలో (జూన్ 6 నుంచి) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు అదనంగా ఆరుగురు ప్లేయర్లను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో కొందరు ఐపీఎల్ 2026లో సత్తా చాటిన బౌలర్లు. వీరిని మెయిన్ జట్టులో కాకుండా నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు.బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. గుర్జప్నీత్ సింగ్, ఆకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, సరాన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్ ప్రాక్టీస్లో సహాయపడతారు.పై బౌలర్లను టీమిండియా నెట్ బౌలర్లుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026 వల్ల రెగ్యులర్ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి అని తెలుస్తోంది. ఫైనల్ వరకు ఆడిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ (రెగ్యులర్ జట్టు సభ్యులు) శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్ సెషన్స్కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు.అయితే ఈ ఎంపికలను కేవలం నెట్ బౌలర్ల అవసరంగా మాత్రమే చూడడం లేదు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. జట్టుతో కలిసి శిక్షణ పొందడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది.ఈ ఆరుగురిలో కొందరు దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ దేశీయ సీజన్లో 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే జీషన్ అన్సారీ తన లెగ్స్పిన్తో మంచి పేరు సంపాదించాడు. గుర్జప్నీత్ సింగ్, సరాన్ష్ జైన్ కూడా రెడ్బాల్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలు చేశారు.ప్రిన్స్ యాదవ్, శివాంగ్ కుమార్లకు ఐపీఎల్ 2026 ప్రదర్శనలు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ తన వేగం, క్రమశిక్షణతో ఆకట్టుకుని ఇప్పటికే అఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టులో చోటు సంపాదించాడు.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు డ్రెస్సింగ్రూమ్ వాతావరణాన్ని అనుభవించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆరుగురి ఎంపికను భవిష్యత్ భారత టెస్టు జట్టు నిర్మాణంలో ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్ టెస్టులో ప్రత్యక్షంగా ఆడే అవకాశం లేకపోయినా, జట్టుతో కలిసి పనిచేసే ఈ అనుభవం వారి కెరీర్కు కీలక మలుపుగా మారే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ కోసం భారత రెగ్యులర్ జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబే -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్తో మ్యాచ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్నెస్లోబడే...శుబ్మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్నెస్లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్లను అఫ్గన్తో సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. భారత్తో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు ఆతిథ్యమిచ్చేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పావులు కదపుతోంది. ఇదే విషయంపై ఏసీబీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అఫ్గానిస్తాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతి లేదు. దీంతో భారత్తో సిరీస్ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించడానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. అఫ్గాన్-భారత్ మధ్య టీ20 సిరీస్ ఈ ఏడాది ఆఖరిలో జరిగే అవకాశముంది."బీసీసీఐ, ఏసీబీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి ఇతర బోర్డులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపించి మ్యాచ్లు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్తాన్కు కూడా భారత క్రికెట్ బోర్డు అండగా నిలవనుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ సిరీస్ కోసం అఫ్ఘనిస్తాన్ జట్టుకు ఢిల్లీని 'హోమ్ గ్రౌండ్' గా కేటాయించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తో బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందుకోసం డీడీసీఏ 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20' షెడ్యూల్ను కూడా మార్చుకోవడానికి సిద్ధమైందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్ను తమ హోమ్ గ్రౌండ్గా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సిరీస్లు ఇండియా వేదికగా జరిగాయి.భారత్లో హోంగ్రౌండ్ అఫ్గానిస్తాన్ ఆడిన సిరీస్లు2017: ఐర్లాండ్తో సిరీస్ (గ్రేటర్ నోయిడా)2018: బంగ్లాదేశ్తో సిరీస్ (డెహ్రాడూన్)2024: న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ (గ్రేటర్ నోయిడా)ఇక హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్తో మూడు వన్డేల సిరీస్లో అఫ్గాన్ తలపడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
అతడేమి రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోంది?
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉన్న భారత క్రికెటర్లలో ఒకడు. ఎంత అలసిపోయినా అదే వేగంతో, పట్టుదలతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అది కొత్త సీజన్లోని మొదటి బంతి అయినా.. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి రోజైనా సరే సిరాజ్లో ఏ మాత్రం అలుపు కనిపించదు.2026లో సిరాజ్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా దాదాపు 6 లిస్ట్ ఎ మ్యాచ్లు, 18 టీ20 మ్యాచ్లు, 2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అంతకముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా సిరాజ్ మొత్తం 5 మ్యాచ్లు ఆడి మరోసారి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2026, ఐపీఎల్-2026లో కూడా ఈ హైదరాబాదీ భాగమయ్యాడు.సిరాజ్కు విశ్రాంతి?ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్కు సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు బీసీసీఐని సూచిస్తున్నారు. బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్లోడ్ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఏకంగా 17 మ్యాచ్లు ఆడాడు. సిరాజ్ చివరగా మే 31న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు.ఇప్పుడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే.. అఫ్గాన్తో టెస్ట్లో అతడు ఆడాల్సి ఉంది. 4 నెలల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన ఒక ఫాస్ట్ బౌలర్ను 5 రోజుల సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ ఆడమనడం ఎంతవరకు సమంజసం? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడేమి రోబో కాదు కదా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఇదే కొనసాగితే అతడు గాయాల బారిన పడే అవకాశముంది. కాబట్టి బీసీసీఐ అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సైతం హెచ్చరిస్తున్నారు. అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్ నుండి సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలతో మళ్లీ బిజీ కానున్నాడు.ముఖ్యంగా శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగే రెడ్ బాల్ సిరీస్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగనున్నాయి. ఈ సిరీస్ల సమయానికి సిరాజ్ 100% ఫిట్నెస్తో ఉండటం ముఖ్యం. కాగా అఫ్గాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ పేసర్లను వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ముల్లాన్పూర్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. జట్టులో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే వంటి స్పిన్నర్లు ఉన్నారు.చదవండి: ఒకే ఓవర్లో 6 సిక్స్లు -
ఐపీఎల్ ముగిసింది.. వారంలోపే రంగంలోకి దిగనున్న టీమిండియా
ఐపీఎల్ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ ఏడాది ఆసాంతం టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్లతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.భారత్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటనజూన్ 6-10: ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ (ముల్లాన్పూర్)జూన్ 13- ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డే (ధర్మశాల)జూన్ 17- ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డే (లక్నో)జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్తో మూడో వన్డే (చెన్నై)ఐర్లాండ్లో టీమిండియా పర్యటనజూన్ 26- తొలి టీ20 (బెల్ఫాస్ట్)జూన్ 28- రెండో టీ20 (బెల్ఫాస్ట్)టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్జులై 1- తొలి టీ20 (చెస్టర్ లీ స్ట్రీట్)జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్)జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్)జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్)జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్)జులై 14- తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్)జులై 16- రెండో వన్డే (కార్డిఫ్)జులై 19- మూడో వన్డే (లండన్)టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వేజులై 23- తొలి టీ20 (హరారే)జులై 25- రెండో టీ20 (హరారే)జులై 26- మూడో టీ20 (హరారే)టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)2 టెస్టులు, 3 టీ20లుఏషియన్ గేమ్స్ 2026 (టీ20 ఫార్మాట్, సెప్టెంబర్ 17 – అక్టోబర్ 3)ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది.భారత్లో వెస్టిండీస్ జట్టు పర్యటనసెప్టెంబర్ 27- తొలి వన్డే (తిరువనంతపురం)సెప్టెంబర్ 30- రెండో వన్డే (గౌహతి)అక్టోబర్ 3- మూడో వన్డే (ముల్లాన్పూర్)అక్టోబర్ 6- తొలి టీ20 (లక్నో)అక్టోబర్ 9- రెండో టీ20 (రాంచీ)అక్టోబర్ 11- మూడో టీ20 (ఇండోర్)అక్టోబర్ 14- నాలుగో టీ20 (హైదరాబాద్)అక్టోబర్ 17- ఐదో టీ20 (బెంగళూరు)భారత్లో శ్రీలంక జట్టు పర్యటనడిసెంబర్ 13- తొలి వన్డే (ఢిల్లీ)డిసెంబర్ 16- రెండో వన్డే (బెంగళూరు)డిసెంబర్ 19- మూడో వన్డే (అహ్మదాబాద్)డిసెంబర్ 22- తొలి టీ20 (రాజ్కోట్)డిసెంబర్ 24- రెండో టీ20 (కటక్)డిసెంబర్ 27- మూడో టీ20 (పూణే)భారత్లో జింబాబ్వే జట్టు పర్యటన2027, జనవరి 3- తొలి వన్డే (కోల్కతా)జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్)జనవరి 9- మూడో వన్డే (ముంబై)భారత్లో ఆస్ట్రేలియా పర్యటనజనవరి 21- తొలి టెస్ట్ (నాగ్పూర్)జనవరి 29- రెండో టెస్ట్ (చెన్నై)ఫిబ్రవరి 11- మూడో టెస్ట్ (గౌహతి)ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్ (రాంచీ)ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్ (అహ్మదాబాద్) -
జైస్వాల్కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు?
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీతో చెలరేగాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్తో టెస్టులో శతక్కొట్టి జట్టును గెలిపించాడు. ఆ పర్యటనలోనే అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు.టెస్టుల్లో స్టార్ ఓపెనర్గా ఎదిగిన జైస్వాల్ (Yashasvi Jaiswal).. వన్డే అరంగేట్రానికి మాత్రం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది సెలక్టర్లు అతడి నిరీక్షణకు తెరదించారు. స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేశారు.అజేయ శతకంఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి వన్డేలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన జైసూ.. 15 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అనంతరం సొంతగడ్డపై గతేడాది సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అజేయ శతకం (116)తో ఆకట్టుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా సెలక్టర్లు, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్ను సెలక్టర్లు క్షమాపణ కోరాలని సూచించాడు. స్పోర్ట్స్స్టార్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..సెలక్టర్ల ఆలోచన ఏమిటి?‘‘యశస్వి జైస్వాల్ తన చివరి వన్డే ఇన్నింగ్స్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతడు మళ్లీ వన్డే ఆడనే లేదు. సెలక్టర్లు 24 ఏళ్ల జైస్వాల్కు బదులు.. ఫిట్నెస్పై స్పష్టత లేని వెటరన్ బ్యాటర్ (రోహిత్ శర్మ) వైపు మొగ్గుచూపుతున్నారు.అతడు ఇప్పుడు ఫామ్లో కూడా లేడు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో నాలాంటి వాళ్లకు కాస్త అర్థమయ్యేలా వివరించండి. అసలు వన్డే వరల్డ్కప్-2027 సన్నద్ధత విషయంలో సెలక్టర్ల ఆలోచన ఏమిటి?ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలిరోహిత్ శర్మ విషయంలో వాళ్లు రాజీ పడాల్సి వచ్చిందో.. లేదంటే ఇంకెందుకు అతడిని కొనసాగిస్తున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనా వాళ్లు జైస్వాల్కు ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలి. కఠినమైన టెస్టు ఫార్మాట్లో ఈ యువ ఆటగాడు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.24 ఏళ్ల వయసులోపే ఎన్నెన్నో శతకాలు బాదాడు. అతడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. విరాట్ కోహ్లి విషయం పక్కనపెడితే.. రోహిత్ శర్మను ఇంకెందుకు కొనసాగిస్తున్నారు?రోహిత్ ఇంకెందుకు?అజిత్ అగార్కర్ టీమిండియా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని నాకైతే అనిపించడం లేదు. ఇప్పటికీ రోహిత్ మాత్రమే వన్డేల్లో కీలక ఓపెనర్ అని భావిస్తున్నారా? అతడికి బదులు జైస్వాల్ లేదంటే సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా!’’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023లో కెప్టెన్గా టీమిండియాను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిపాడు. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో మేనేజ్మెంట్ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. పగ్గాలు శుబ్మన్ గిల్కు అప్పగించింది. అతడి సారథ్యంలో భారత్ ఇప్పటికి ఒక్క సిరీస్ గెలవలేదు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడుతుంది. వన్డే సిరీస్లో ఫిట్నెస్కు లోబడి రోహిత్ శర్మ ఆడతాడని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ జట్టులో జైస్వాల్కు చోటు దక్కలేదు. చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
టీమిండియాతో సిరీస్లకు ఆఫ్ఘనిస్తాన్ జట్ల ప్రకటన
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-ఆఫ్ఘన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ల కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇవాళ (మే 26) ప్రకటించారు. ఈ రెండూ ఫార్మాట్ల జట్లకు హష్మతుల్లా షాహిది కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది.ఇటీవలికాలంలో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్లో లేకపోయినా, కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు.వన్డే జట్టులో అనుభవజ్ఞులైన రహ్మత్ షా, రహ్మానుల్లా గుర్బాజ్తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్కీపర్లుగా అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్లను ఎంపిక చేశారు.బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్లపై ఆఫ్ఘనిస్తాన్కు కీలకంగా మారనుంది.2027 వన్డే వరల్డ్కప్ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. బెంచ్ స్ట్రెంత్ను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు టెస్టు ఫార్మాట్లో భారత్ లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్కు ఈ సిరీస్ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ, రషీద్ ఖాన్.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ.ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్ఏకైక టెస్ట్ మ్యాచ్- జూన్ 6-10 (ముల్లాన్పూర్)తొలి వన్డే- జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే- జూన్ 17 (లక్నో)మూడో వన్డే- జూన్ 20 (చెన్నై) -
ఇదేం సెలక్షన్?.. మరీ ఇంత దారుణమా?
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరుపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ మండిపడ్డాడు. ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. రంజీల్లో సత్తా చాటిన వారికి జట్టులో చోటు ఇవ్వనపుడు.. అసలు ఇలాంటి టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అఫ్గనిస్తాన్తో స్వదేశంలో ఏకైక టెస్టు, మూడు వన్డేలకు భారత జట్టును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ప్రసిద కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు చోటిచ్చారు.60 వికెట్లు కూల్చిన ఆకిబ్ నబీఅయితే, 2025-26 రంజీ సీజన్లో జమ్మూ కశ్మీర్ తరఫున ఏకంగా 60 వికెట్లు కూల్చిన ఆకిబ్ నబీని మాత్రం పక్కనపెట్టారు. జమ్మూ జట్టు తొలిసారి రంజీ చాంపియన్గా నిలపడంలో ఈ ఫాస్ట్ బౌలర్దే కీలక పాత్ర. దీంతో సర్వత్రా ప్రశంసలు కురవగా.. అఫ్గన్తో టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అతడికి అన్యాయం చేశారుఅయితే, అనూహ్య రీతిలో సెలక్టర్లు ఆకిబ్ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్.. సెలక్షన్ కమిటీ నాయకుడు అజిత్ అగార్కర్ తీరుపై మండిపడ్డాడు. ‘‘ఈ సెలక్టర్లు ఆకిబ్ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అసలు ఇదేం సెలక్షన్?..ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. వీళ్లంతా కలిసి అతడికి అన్యాయం చేశారు. నిజంగా అతడిని పక్కనపెట్టడం అర్థంలేని చర్య. ప్రస్తుతం అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహింగచలరా? బీసీసీఐ వెంటనే వీటిని తీసేయాలిరంజీ ట్రోఫీలో ఒక సీజన్లో 60 వికెట్లు తీశాడు. అయినా సరే అతడిని ఎంపిక చేయలేదు. దేశీ క్రికెట్లో సత్తా చాటడం పనికిరాదని సెలక్టర్లు భావిస్తే.. బీసీసీఐ వెంటనే ఈ టోర్నీలను తీసేయాలి.వికెట్లు తీసే బౌలర్లను పక్కనపెట్టడం ఏమిటి? అతడి వేగం తక్కువగా ఉండొచ్చు. కానీ నిలకడగా వికెట్లు తీయడంలో అతడు దిట్ట. టీమిండియాలోకి వస్తే కోచ్లు అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. కానీ మీరేం చేస్తున్నారు?’’ అని దిలీప్ వెంగ్సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.చదవండి: సన్రైజర్స్కు తప్పని గండం.. అలా అయితేనే టాప్-2లో చోటు! -
నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ (జూన్ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.గుర్నూర్ బ్రార్కు తొలిసారి పిలుపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణతో కలిసి పేస్ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్తో టెస్టుకు ఆకిబ్ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?అతడి బౌలింగ్లో తగినంత పేస్ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్ లభించేది.టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్నెస్ సమస్యలు కూడా లేవు.ఏం మెసేజ్ ఇస్తు న్నారు?దేశీ క్రికెట్లో ఓ బౌలర్గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్ కమిటీకి ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్లో పది మ్యాచ్లలో ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్.. 44 వికెట్లతో సత్తా చాటాడు.చదవండి: నితీశ్ రెడ్డి, ఇషాన్లకు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!.. కొత్త ముఖాలు ఇవే -
అతడి గురించి అసలు చర్చించనేలేదు: అగార్కర్
వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్లలో అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న షమీ.. మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోకాగా స్వదేశంలో జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో సాగే ఈ సిరీస్లలో కొత్తగా యువ పేసర్లు గుర్నూర్బ్రార్, ప్రిన్స్ యాదవ్ (వన్డేలకు మాత్రమే)లకు సెలక్టర్లు చోటిచ్చారు.పేస్ దళ నాయకుడిగా సిరాజ్ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ పేస్ దళ నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. అతడితోడు ప్రసిద్ కృష్ణ కూడా ఉన్నాడు. ఇక వన్డే జట్టులో వీరితో పాటు అర్ష్దీప్ సింగ్కు సెలక్టర్లు చోటిచ్చారు.మరోవైపు.. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో షమీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మరోసారి పాత పాటే పాడాడు. షమీ కేవలం పొట్టి ఫార్మాట్కు మాత్రమే సిద్ధంగా ఉన్నాడంటూ మళ్లీ అతడిని ఉడికించాడు.అసలు చర్చే జరుగలేదు‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతడు టీ20 క్రికెట్ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈసారి మహ్మద్ షమీ గురించి మా మధ్య అసలు చర్చే జరుగలేదు’’ అని అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులు జమ్మూ కశ్మీర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీ గురించి చర్చ జరిగిందని.. అయితే, అతడికి కూడా స్థానం దక్కలేదని పేర్కొన్నాడు.కాగా గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా షమీని సెలక్ట్ చేయలేదన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఫిట్గా లేడన్న కారణంగానే ఎంపిక చేయలేదని అగార్కర్ నాడు పేర్కొన్నాడు.సత్తా చాటినా...ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని.. కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాదు.. రంజీ తాజా ఎడిషన్లో బెంగాల్ తరఫున సత్తా చాటి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.అయినప్పటికీ సెలక్టర్లు షమీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కూడా ఫిట్నెస్ కారణాలు చూపుతూ అతడిని పక్కనపెట్టామని అగార్కర్ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి 35 ఏళ్ల షమీ ఇక టీమిండియా తరఫున పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యమనే తేలిపోయింది.67 వికెట్లు పడగొట్టినా..కాగా వన్డే వరల్డ్కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్గా నిలవడంలోనూ ఈ రైటార్మ్ పేసర్ హస్తం ఉంది. అయితే ఆ తర్వాత.. అతడు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఇక చివరగా 2023 జూన్లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన షమీ.. రీఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. 12 మ్యాచ్లలో కలిపి 10 వికెట్లు కూల్చాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు -
నితీశ్ రెడ్డి, ఇషాన్కు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!
అఫ్గనిస్తాన్తో టెస్టు, వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..పాపం పంత్!ఐపీఎల్-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. పంత్ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను గిల్ డిప్యూటీగా నియమించారు.అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్కు చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్ కిషన్.. ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. ఏకంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్.. ఐపీఎల్-2026లో సన్రైజర్స్ తరఫునా సత్తా చాటుతున్నాడు. వారిద్దరికి విశ్రాంతిఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.కొత్త ముఖాలకు చోటుతాజా ఎడిషన్లో ఆకిబ్ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రిన్స్ను ఎంపిక చేసింది.రోహిత్, హార్దిక్ డౌటేఇక ప్రిన్స్ యాదవ్తో పాటు పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుతార్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్తో సిరీస్ ద్వారా దిగ్గజ బ్యాటర్, వన్డే రారాజు విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.టీమిండియా- అఫ్గనిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్ షెడ్యూల్ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్- ఉదయం 9.30 గంటలకు ఆరంభంతొలి వన్డే: జూన్ 14- ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంరెండో వన్డే: జూన్ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంమూడో వన్డే: జూన్ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్లు అవుట్ -
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్కు కెప్టెన్ గిల్కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్తో సిరీస్కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
‘సత్తా చాటినా.. టీమిండియాకు అతడి ఎంపిక కష్టమే’
ఐపీఎల్-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.బుమ్రాకు విశ్రాంతిప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు బౌలింగ్ విభాగంలో చోటు ఖాయం.ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేస్ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.ఆకిబ్ నబీ ఎంపికపై చర్చఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.పేస్ లేదు‘‘అఫ్గనిస్తాన్తో టెస్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆకిబ్ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్లో పెద్దగా పేస్ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్ సర్కార్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రిన్స్ యాదవ్కు అవకాశం!ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే సిరీస్కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.హర్షిత్ రాణా ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్రిన్స్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్తో ఐపీఎల్ తాజా సీజన్ ముగియనున్న సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ సిరీస్ల షెడ్యూల్👉ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్👉తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల👉రెండో వన్డే: జూన్ 17, లక్నో👉మూడో వన్డే: జూన్ 20, చెన్నై.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్తో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.వన్డేల్లో మాత్రం బుమ్రా ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.భారత జట్టులోకి ఆకిబ్ నబీ!ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.భారత్ ఇద్దరు ఫ్రంట్లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్లో విఫలమైన దేవ్దత్త్ పడిక్కల్కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ప్రిన్స్కు పిలుపు!మరోవైపు అఫ్గాన్తో వన్డే సిరీస్కు ఢిల్లీ స్పీడ్స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ సత్తాచాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్ధానంలో ప్రిన్స్ పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట.చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు -
పంత్కు షాక్.. కిషన్కు జాక్పాట్!
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ఈ సిరీస్లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్గా పంత్ స్థానంలో ఇషాన్ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే -
లీకైన భారత టెస్ట్ జట్టు.. గుజరాత్ స్టార్ ప్లేయర్పై వేటు
ఐపీఎల్ 2026 తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకముందే సోషల్మీడియా జట్టు వివరాలు లీకయ్యాయి.ఈ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నాడు. సీనియర్లు కేఎల్ రాహుల్, పంత్, జడేజా, సిరాజ్, జైస్వాల్ కొనసాగనున్నారు. షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అన్షుల్ కంబోజ్కు అవకాశం దొరికింది. రంజీ ప్రదర్శనల ఆధారంగా ఆకిబ్ నబీ, హర్ష్ దూబేకు చోటు కల్పించారు.ఆసక్తికరంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్పై వేటు పడింది. సాయి ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా, గత టెస్ట్ ప్రదర్శనల దృష్ట్యా అతనిని తప్పించినట్లు తెలుస్తోంది. సాయి స్థానంలో ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న దేవ్దత్ పడిక్కల్కు ఛాన్స్ ఇచ్చారు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్కు సీనియర్లకంతా విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది. లీకైన జట్టును బట్టి చూస్తే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మరో పక్క ఇదే జట్టు కొనసాగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. కేవలం సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇది. జట్టుపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఒక్కటైతే గ్యారెంటీ జట్టు దాదాపుగా ఇలాగే ఉండవచ్చు. ఎందుకంటే సెలెక్టర్లు ఇప్పటికే జట్టును డిసైడ్ చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఆ మ్యాచ్లు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న భారత జట్టు:శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహ్మద్ షమీ, అన్షుల్ కంబోజ్ -
షమీ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టీమిండియా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీసీసీఐలో సీరియస్గా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం షమీ ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే తారువాయి అని ఓ ప్రముఖ వెబ్సైట్ రాసుకొచ్చింది.షమీ గతకొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా ప్రతి దేశవాలీ పోటీలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లోనూ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు. వాస్తవానికి షమీ రీఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. కానీ, ఎందుకో వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సెలెక్టర్లు అతన్ని కరుణించినట్లు తెలుస్తోంది. అతడు చివరిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చాలామంది షమీ కెరీర్ ఖతమైందని అనుకున్నారు. కానీ అతడు మాత్రం ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. రోజురోజుకు మెరుగవుతూ 35 ఏళ్ల లేటు వయసులో రీఎంట్రీకి సిద్దమయ్యాడు. ప్రస్తుతం షమీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఈ మధ్యలో అతను ఎలాంటి గాయాల బారిన పడకపోతే, ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్లో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే.ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కోసం మరో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వర్క్లోడ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో సిరాజ్కు జోడీగా షమీ బంతిని షేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కార్తిక్ త్యాగి లాంటి యువ పేసర్ల పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుత ఐపీఎల్లో ఇరగదీస్తున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. -
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్, ఆకాశ్దీప్ ఐపీఎల్కు కూడా దూరమయ్యారు.కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. -
టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్లతో బిజీబిజీగా గడపడనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. కాగా అఫ్గాన్తో టెస్టు మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజులకే ప్రారంభం కానుంది.దీంతో ఈ మ్యాచ్కు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్లో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్ల దృష్ట్యా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పరిధిలోకి రాదు. కాబట్టి సీనియర్లను ఈ మ్యాచ్లో రిస్క్ తీసుకోకడదని మేనెజ్మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం టెస్టులకే పరిమితమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. అఫ్గానిస్తాన్తో టెస్టులో భారత జట్టును నడిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిషబ్ భారత తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్కు అతడు ఎంపికయ్యే సూచనలు కన్పించడం లేదు. దీంతో అఫ్గాన్తో టెస్టు మ్యాచ్లో అతడికి జట్టు పగ్గాలను అప్పగించేందుకు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. అప్పటివరకు పంత్కు విశ్రాంతి లభించనుంది. ఒకవేళ అతడు భారత వన్డే జట్టుకు ఎంపికైన తుది జట్టులో మాత్రం చోటు కష్టమే. పంత్ ఇప్పటివరకు భారత్ కెప్టెన్గా ఆరు మ్యాచ్లలో వ్యవహరించాడు.ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గాన్ టెస్టు మ్యాచ్కు దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో గుర్నూర్ బ్రార్ (ఫాస్ట్ బౌలర్), మానవ్ సుతార్ (స్పిన్నర్), హర్ష్ దూబే, ఆకిబ్ నబీ (ఫాస్ట్ బౌలర్), దేవ్ దత్ పడిక్కల్(బ్యాటర్) ఉన్నారు."ఐపీఎల్ ఫైనల్కు అఫ్గానిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా గ్యాప్ లేదు. కాబట్టి ఆటగాళ్లు వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అఫ్గాన్తో వన్డే సిరీస్, ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్లు భారత్కు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు.భారత టెస్టు జట్టులోని కొంతమంది సభ్యులు దాదాపు రెండు నెలల పాటు బిజీబిజీగా గడపనున్నారు. దీంతో వారికి అఫ్గాన్తో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. గుర్నూర్, మానవ్ సుత్తార్, పడిక్కల్, హర్ష్ దూబేలు సెలెక్టర్ల రాడార్లో ఉన్నారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా అఫ్గాన్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
టీమిండియాకు భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలుత జూన్ 6 నుంచి 10 ముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గాన్ టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.స్టార్ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా ఈ ఏకైక టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే అతడు ఐపీఎల్-2026 సీజన్ నుంచి కూడా తప్పుకొన్నాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని రూ.కోటికి కేకేఆర్ సొంతం చేసుకుంది.కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వైదొలిగాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవాడనికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి శ్రీలంకతో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భారత టెస్టు సెటాప్లో ఆకాష్ దీప్ కీలక సభ్యుడు.జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తర్వాత టెస్టుల్లో మూడో పేసర్గా ఆకాష్ దీప్ ఉన్నాడు. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో కూడా అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్లో 3 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్..13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. మరి ఇప్పుడు అతడు గాయం కారణంగా దూరం కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.బిజీ షెడ్యూల్కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టెస్టు మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే తదితర టూర్లు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ మే 31న ముగియనుండగా.. జూన్ 6న అఫ్గన్తో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్తోనే బిజీగా గడపుతారు.స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు.టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?‘‘గంభీర్ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.భారీ ఆదాయానికి బీజం వేశానుఅయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్ డెవలప్మెంట్పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించండి.మనసుతో ఆలోచించండిఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్ వేదికగా లలిత్ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. కాగా లలిత్ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్ రూపుదిద్దుకోగా.. లీగ్ తొలి చైర్మన్గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్కు మాజీ కెప్టెన్ క్షమాపణలు -
గిల్ స్థానంలో కెప్టెన్గా పంత్..?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు సమాచారం.ఒకవేళ గిల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్ పంత్ పేరు ఉంటుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.రిషబ్ పంత్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.కేఎల్ రాహుల్భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ ఉంటాడు. రాహుల్కు గతంలో భారత టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.గిల్కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్రౌండర్గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. -
సెలెక్టర్ల పరిధిలో లేని గిల్, బుమ్రా
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చంఢీఘడ్లో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్లోడ్ మరో కారణంగా తెలుస్తుంది.భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్కు వెళ్లనుంది. అనంతరం భారత్ 5 టీ20లు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్కప్కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయవచ్చు.బుమ్రా, గిల్ గైర్హాజరీలో ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం. -
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
రాబోయే అంతర్జాతీయ సీజన్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత (జూన్లో) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే సిరీస్ (టెస్ట్, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 156 వికెట్లు తీశాడు.భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్ శైలి సుదీర్ఘ ఫార్మాట్కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్ ఛాన్స్ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను 2 మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి. -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్కు జూన్లో టీమిండియాతో జరిగే సిరీస్తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా జూన్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్లో భారత్కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.మళ్లీ జూన్లోనేఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్లోనే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్తో సిరీస్ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ బరిలో దిగారు.రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్ 17- రెండో వన్డే, లక్నో👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్! -
భారత్ను పదోసారి ఫైనల్కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
అండర్ 19 ప్రపంచకప్లో భారత్ పదోసారి ఫైనల్కు చేరింది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఇన్ని సార్లు ఫైనల్స్కు చేరలేదు. ఇందులో టీమిండియా ఐదు సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్గా నిలిచి, నాలుగు సందర్భాల్లో (2006, 2016, 2020, 2024) రన్నరప్గా నిలిచింది. ఏ జట్టూ ఇన్ని సార్లు ఛాంపియన్గా, రన్నరప్గానూ నిలవలేదు. యంగ్ ఇండియా మరోసారి ఫైనల్కు చేరి అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో తిరుగులేని జట్టుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.నిన్న జరిగిన 2026 ఎడిషన్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి భారత్ను ఒంటిచేత్తో గెలిపించాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరోన్ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో (33 బంతుల్లో 68; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి తొలి వికెట్కు 90 పరుగులు, వన్డౌన్ బ్యాటర్ ఆయుశ్ మాత్రేతో (59 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్కు 114 పరుగులు, ఆతర్వాత వేదాంత్ మల్హోత్రాతో (47 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి 96 పరుగులు జోడించి, భారత్ గెలుపు ఖరారయ్యాక మూడో వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా ఆరోన్ వన్మ్యాన్ షో కారణంగా భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అత్యుత్తమ ఛేదనఈ ఛేదన అండర్ 19 వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధికం, అత్యుత్తమం. గతంలో ఏ జట్టూ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2006 ఎడిషన్లో ఐర్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది.ఆఫ్ఘన్ ఆటగాళ్లు శతకాలు వృధాఅంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆరోన్ అద్భుత సెంచరీతో భారత్ను గెలిపించడంతో ఫైజల్, ఉజైరుల్లా శతకాలు వృధా అయ్యాయి.ఇంగ్లండ్తో అమీతుమీతొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) జరిగే ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్ను ఫైనల్కు చేర్చిన ఈ ఆరోన్ జార్జ్ ఎవరు..?ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో సూపర్ సెంచరీతో భారత్ను ఫైనల్స్కు చేర్చిన ఆరోన్ జార్జ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా సెంచరీ తర్వాత చాలామంది ఆరోన్ గురించిన సమాచారం కోసం గూగుల్ చేస్తున్నారు.మన హైదరాబాదీనే..!19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినా.. జానియర్ స్దాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్పైనే ఉంటుంది.సంజూ శాంసన్లా..!అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్గా హైదరాబాద్కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(2022-23)లో బీహార్పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పరుగుల వరదగత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.అప్పడు పాక్పై..ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. -
ప్రపంచకప్ సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. హరారే వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో పాక్తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకుంటుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
IND vs PAK T20: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆరోజే
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. దోహా, ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్లుగా పాల్గొననున్నాయి. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతోఒమన్, పాకిస్తాన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’లో పోటీ పడుతుండగా... అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనున్నాయి. గతంలో ఏసీసీ ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి ‘రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్’ పేరుతో నిర్వహించనున్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ‘ఎ’ జట్లు పాల్గొననుండగా... మిగిలిన మూడు అసోసియేట్ దేశాలైన హాంకాంగ్, ఒమాన్, యూఏఈ ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున నిర్వహించనున్నారు. నవంబర్ 16నఇందులో భాగంగా నవంబర్ 16న దాయాది పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 21న సెమీఫైనల్స్ నిర్వహించనుండగా... నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. 2013 నుంచి ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభంలో అండర్–23 జట్లు పోటీపడగా... ఆ తర్వాత ‘ఎ’ జట్లకు మార్చారు. చివరిసారిగా 2024లోఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు విజేతగా నిలవగా... భారత్, అఫ్గానిస్తాన్ ఒక్కోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాయి. చివరిసారిగా 2024లో జరిగిన ఈ టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచింది. ఒమన్లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై అఫ్గాన్ విజయం సాధించింది. చదవండి: పీఎకేల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ -
ఆసియా కప్-2025 విజేతలుగా మనోళ్లే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ రూపంలో మినీ క్రికెట్ సంగ్రామం అభిమానులకు కావాల్సినంత మజా పంచనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుంది. ఆతిథ్య హక్కులు భారత్వే అయినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో గత ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్ ఈవెంట్ జరుగనుంది.పాకిస్తాన్ను చిత్తు చేసిగ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. కాగా చివరగా 2022లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరుగగా.. నాటి ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్ను చిత్తు చేసి టైటిల్ గెలిచింది. ఆనాడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్ ఫోర్ దశలో ఊహించని రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత్అయితే, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024 (T20 World Cup) ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్ను గెలుచుకుంది. ఈ టోర్నీలో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. అంతేకాదు.. అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి ఓటమిపాలైంది.చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియాదేఇదిలా ఉంటే.. గత ఆసియా కప్-2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగగా రోహిత్ సేన విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే, యాభై ఫార్మాట్లోనే జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ సేన టైటిల్ గెలిచి సత్తా చాటింది.పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా తటస్థ వేదికైన దుబాయ్లో టీమిండియా తమ మ్యాచ్లు ఆడింది. ఈ టోర్నీలో పాక్ జట్టు గెలుపున్నదే లేకుండా నిష్క్రమించగా.. శ్రీలంక అసలు ఈ ఈవెంట్కు అర్హతే సాధించలేదు. మరోవైపు.. బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.అఫ్గనిస్తాన్ అద్భుత ప్రదర్శనలుఅయితే, టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించడంతో పాటు.. సెమీస్ చేరి అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా తొలిసారి పాకిస్తాన్ను ఓడించి సెమీ ఫైనల్ దగ్గరగా వచ్చింది.కానీ.. ఆఖరి నిమిషంలో ఒత్తిడిలో చిత్తై లీగ్ దశలోనే నిష్క్రమించినా.. తొలిసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది అఫ్గన్ జట్టు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ను ఓడించి సత్తా చాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆసియా కప్ విజేత ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విజేత టీమిండియానే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త‘‘టీమిండియా అద్భుత నైపుణ్యాలు గల జట్టు. కచ్చితంగా హాట్ ఫేవరెట్ టీమిండియానే. అయితే, టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రదర్శనలను ఓసారి పరిశీలించాలి.ముఖ్యంగా అఫ్గనిస్తాన్. గత కొన్నాళ్లుగా ఈ ఫార్మాట్లో వాళ్లు అద్భుత విజయాలు అందుకుంటున్నారు. కచ్చితంగా పాకిస్తాన్కు అఫ్గనిస్తాన్ గట్టి పోటీ ఇస్తుంది. అఫ్గన్ల ఆత్మవిశ్వాసం, ఫామ్ అసాధారణంగా ఉన్నాయి.కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు అఫ్గనిస్తాన్ను కూడా ఈ టోర్నీలో స్ట్రాంగ్ కంటెండర్గా పేర్కొనవచ్చు’’ అని వార్తా సంస్థ ANIతో మదన్ లాల్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో మొదలయ్యే ఆసియా కప్-2025 టోర్నీ సెప్టెంబరు 28న ఫైనల్తో ముగుస్తుంది.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్పై గంభీర్ ఫైర్.. నాడు.. -
ఆసీస్తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!?
ముంబై స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తనుష్ కోటియన్కు తొలిసారి భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టుల కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మూడో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ స్ధానాన్ని 26 ఏళ్ల తనీష్ భర్తీ చేయనున్నాడు.స్పోర్ట్స్స్టార్ నివేదిక ప్రకారం..కోటియన్ మంగళవారం (డిసెంబర్ 24) ఆస్ట్రేలియాకు పయనం కానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ నుంచి కోటియన్ వైదొలగనున్నాడు. ఈ టోర్నీలో సోమవారం హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో తనుష్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్లో రెండు వికెట్లతో సత్తాచాటిన ఈ ముంబైకర్.. బ్యాటింగ్లో 39 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు తనుష్కు దక్కింది.ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదుర్స్.. కాగా తనీష్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 33 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కోటియన్.. 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లోనూ కోటియన్కు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. 33 మ్యాచ్ల్లో 41.21 2523 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ విజేతగా ముంబై నిలవడంలో కోటియన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన అతడు 29 వికెట్లతో పాటు 500 పైగా పరుగులు చేశాడు.అంతేకాకుండా బీజీటీ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో భారత్-ఎ జట్టు తరపున అనాధికారిక టెస్టు మ్యాచ్ కూడా ఆడాడు. బౌలింగ్లో ఓ కీలక వికెట్ పడగొట్టిన తనుష్.. బ్యాటింగ్లో 44 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో అతడు అశ్విన్ వారుసుడిగా ఎదిగే ఛాన్స్ ఉంది. ఇక ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్ జట్టు ఇదే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, తనుష్ కోటియన్* -
IND A Vs AFG A: టీమిండియాకు బిగ్ షాక్.. సెమీస్లో అఫ్గాన్ చేతిలో ఓటమి
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్-ఎ జట్టు ప్రయాణం ముగిసింది. అల్ఎమరత్ వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరిగిన రెండో సెమీఫైనల్లో 20 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బ్యాటర్లలో రమణ్దీప్ సింగ్(64) ఆఖరి వరకు పోరాడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. రమణ్దీప్, బదోని(31) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్,రహమన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక, అఫ్గాన్ జట్లు తలపడనున్నాయి. -
IND A Vs AFG A: అఫ్గాన్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో ఒమన్ వేదికగా భారత్-ఎతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్-ఎ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరద్దరితో పాటు కరీం జనత్( 20 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' Sediqullah hit two birds with ZERO stones! ⚡@ACBofficials #MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/MNdGmFiNgb— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024 -
భారత్ వర్సెస్ అఫ్గాన్ సెకెండ్ సెమీస్.. తుది జట్లు ఇవే
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో సెకెండ్ సెమీఫైనల్కు రంగం సిద్దమైంది. రెండో సెమీఫైనల్లో భాగంగా అల్ అమెరత్(ఒమన్) వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అన్షుల్ కాంబోజ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు అఫ్గానిస్తాన్ మాత్రం ఏకంగా నాలుగు మార్పులు చేసింది. బిలాల్ సమీ, మహమ్మద్ ఇషాక్, అల్లా గజన్ఫర్, జుబైద్ అక్బరీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు కూడా ఆజేయంగా నిలిచాయి. అదే జోరును సెమీస్లో కనబరచాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.తుది జట్లుఇండియా-ఎ : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రమణదీప్ సింగ్, నిశాంత్ సింధు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్, ఆకిబ్ ఖాన్ఆఫ్ఘనిస్తాన్-ఎ: సెదిఖుల్లా అటల్, జుబైద్ అక్బరీ, దర్విష్ రసూలీ(కెప్టెన్), మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, షరాఫుద్దీన్ అష్రఫ్, అబ్దుల్ రెహమాన్, అల్లా గజన్ఫర్, కైస్ అహ్మద్, బిలాల్ సమీ -
T20 WC: ఈసారి ఫైనలిస్టులు ఈ జట్లే: భజ్జీ కామెంట్స్ వైరల్
పొట్టి క్రికెట్ తాజా ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు నాలుగు రోజుల్లో వరల్డ్కప్-2024 టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్-1 నుంచి టీమిండియా, అఫ్గనిస్తాన్.. అదే విధంగా గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా- అఫ్గనిస్తాన్ ట్రినిడాడ్ వేదికగా.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరుగనున్నాయి.తొలి మ్యాచ్ ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుండగా.. రిజర్వ్ డే కూడా ఉంది. ఇక రెండో సెమీ ఫైనల్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది. ఈ మ్యాచ్కు మాత్రం రిజర్వ్ డే లేదు.కాగా చాలా మంది మాజీ క్రికెటర్లు ఊహించినట్లుగానే ఈసారి టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరగా.. అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ కూడా రేసులోకి దూసుకువచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. టీ20 ప్రపంచకప్-2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ.. ‘‘ఈసారి వాళ్లు కూడా ఫైనల్కు వస్తారనే అనిపిస్తోంది.ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్తో అఫ్గన్ తలపడే అవకాశం ఉందని.. రోహిత్ సేన ఈ మ్యాచ్లో గెలుస్తుందని తన అభిప్రాయం వెల్లడించాడు. కాగా జూన్ 29న వరల్డ్కప్-2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో గల కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక. -
ఒకరితో చెప్పించుకునే స్థితిలో రోహిత్ లేడు: టీమిండియా దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనేలేదు. ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం 76 పరుగులే చేశాడు.ఇక కీలకమైన సూపర్-8 తొలి మ్యాచ్లోనూ రోహిత్ విఫలమైన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా 13 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేశాడు రోహిత్.అఫ్గన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా అఫ్గనిస్తాన్పై గెలిచినప్పటికీ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై మాత్రం విమర్శలు వచ్చాయి.లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోలేడంటూ రోహిత్ను ఉద్దేశించి నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘అతడు అనుభవం ఉన్న ఆటగాడు. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. నిజానికి తన ఆట ఎలా ఉండాలో ఒకరితో చెప్పించుకోవాల్సిన స్థితిలో రోహిత్ శర్మ లేనే లేడు.ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో అతడికి సంబంధం లేదు. అయితే, ఒక్కోసారి మన బలహీనతలు తెలిసిన బౌలర్ ఎదురుగా ఉన్నపుడు ఆన్సైడ్ హిట్టింగ్ చేయడం కరెక్ట్ కాదని మీరు అనొచ్చు.ఇలాంటి సమయంలో ఎక్స్ట్రా కవర్ మీదుగా ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడవచ్చు కదా అని భావించవచ్చు. ఇవి కేవలం బయట నుంచి చూసి చెప్పేవి మాత్రమే.తీరికగా కూర్చుని.. ఎవరు ఎలాంటి షాట్ ఆడాలో చెప్పడం తేలికే. కానీ మైదానంలో దిగి ఆడితేనే కదా తెలిసేది’’ అంటూ గావస్కర్ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా సూపర్-8 దశను అఫ్గన్పై విజయంతో మొదలుపెట్టిన టీమిండియా.. శనివారం తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్కు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలో నిరాశపరిచిన కింగ్ కోహ్లి.. ఇప్పుడు సూపర్-8లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.సూపర్-8లో భాగంగా బార్బోడస్ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. సరిగ్గా 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఇక ఈ మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ పరంగానే కాకుండా ఫీల్డింగ్లో కూడా నిరాశపరిచాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కోహ్లి జారవిడిచాడు. ఎన్నో సంచలన క్యాచ్లు అందుకున్న కింగ్ కోహ్లి.. ఈ మ్యాచ్లో సునాయస క్యాచ్ను జారవిడిచడంతో అంతా ఆశ్చ్యర్యపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతులు తలపై పెట్టుకుని షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లి విడిచిపెట్టిన క్యాచ్ పెద్ద కాస్ట్లీగా మారలేదు. ఎందకుంటే ఆ తర్వాతి ఓవరే జద్రాన్(8) అక్షర్పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.pic.twitter.com/MkAFbNakRq— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) June 20, 2024 -
వాళ్లిద్దరు సూపర్.. జట్టులో మార్పులకు సిద్ధం: రోహిత్ శర్మ
వెస్టిండీస్లో పిచ్ల గురించి తమకు అవగాహన ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గత రెండేళ్లుగా విండీస్లో అనేక టీ20 మ్యాచ్లు ఆడామని.. ఆ అనుభవం ఇప్పుడు అక్కరకు వస్తోందని తెలిపాడు.తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందని.. అందుకే అఫ్గనిస్తాన్పై అలవోకగా విజయం సాధించామని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో తమ తొలి మ్యాచ్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 32) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 181 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ భారత బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 47 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.కాగా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ అఫ్గన్పై విజయానికి బౌలర్లే కారణమంటూ వారికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘మా బౌలింగ్ విభాగంలో టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ విధిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు.వారిపై మాకు నమ్మకం ఉంది. ఇక బుమ్రా ఏం చేయగలడో మా అందరికీ తెలుసు. అతడి సేవలను మరింత తెలివిగా ఉపయోగించుకోవడం ముఖ్యం.అతడు జట్టులో ఉన్నాడంటే కచ్చితంగా తన వంతు బాధ్యత పూర్తి చేస్తాడు. ఇక సూర్య, హార్దిక్ భాగస్వామ్యం వల్లే మేము మెరుగైన స్కోరు చేయగలిగాం. తదుపరి మ్యాచ్లలో ప్రత్యర్థి జట్టు బలాబలాలకు అనుగుణంగా అవసరమైతే మా తుదిజట్టులో మార్పులు చేసుకుంటాం. ఏదేమైనా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే మంచిదని భావిస్తున్నాం.ఒకవేళ అత్యవసరమైతే ముగ్గురు సీమర్లతో వెళ్లడానికి కూడా నేను సిద్ధమే’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తదుపరి బంగ్లాదేశ్తో శనివారం మ్యాచ్ ఆడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
మరీ ఓవర్ చేయకు: పంత్ క్యాచ్.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమెరికా వేదికగా లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగుక ముందుకు సాగిన రోహిత్ సేన.. వెస్టిండీస్లో జరుగుతున్న సూపర్-8లోనూ శుభారంభం చేసింది.గ్రూప్-1లో భాగంగా అఫ్గనిస్తాన్ గురువారం నాటి మ్యాచ్లో జయభేరి మోగించింది. అఫ్గన్ జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ ఇన్నింగ్స్లో పంత్- రోహిత్ క్యాచ్ల విషయంలో పోటాపోటీగా తలపడ్డారు.బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో జరిగిన ఈ మ్యాచ్లో పంత్ మొత్తంగా మూడు క్యాచ్లు అందుకోగా.. రోహిత్ శర్మ రెండు క్యాచ్లు పట్టాడు. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్ను కుల్దీప్ యాదవ్ వేశాడు.ఈ క్రమంలో రెండో బంతిని అఫ్గన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో పంత్ పరిగెత్తుకు వెళ్లి బంతిని అందుకున్నాడు.ఆ సమయంలో రోహిత్ కూడా పంత్కు సమీపంలోనే ఉండగా.. ఎగ్జైట్మెంట్లో పంత్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సంతోషం పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఈ క్యాచ్ నీదేలే.. నేనేమీ అడ్డుపడను’’ అన్నట్లుగా రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్గా మారింది.కాగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో పంత్.. రహ్మనుల్లా గుర్బాజ్(11), గుల్బదిన్ నయీబ్(17), నవీన్ ఉల్ హక్(0) క్యాచ్లు అందుకోగా.. రోహిత్ శర్మ ఇబ్రహీం జద్రాన్(8), నూర్ అహ్మద్(12) ఇచ్చిన క్యాచ్లను ఒడిసిపట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన బుమ్రా.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ది బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 24 బంతులు వేసిన బుమ్రా ఏకంగా 20 డాట్ బాల్స్ సంధించి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మెరుపు ప్రదర్శనతో విరుచుకుపడటంతో భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత ప్రపంచకప్లో బుమ్రా చెలరేగడం ఇది తొలిసారి కాదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. గ్రూప్ దశలో ఐర్లాండ్పై 2/6, పాకిస్తాన్పై 3/14 మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి రెండు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మరింత డోస్ పెంచిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవలేదు కానీ.. జట్టు గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. బుమ్రాకు జతగా బ్యాటింగ్లో సూర్యకుమార్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. ఓవరాల్గా ఆఫ్ఘన్పై గెలుపులో అందరూ తలో చేయి వేసి టీమిండియాకు సూపర్ విక్టరీ అందించారు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32).. బౌలింగ్లో అర్ష్దీప్ (4-0-36-3), కుల్దీప్ (4-0-32-2), అక్షర్ పటేల్ (3-1-15-1), రవీంద్ర జడేజా (3-0-20-1) భారత్ గెలుపుకు దోహదపడ్డారు. -
కోహ్లికి 121 మ్యాచ్లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.స్కై మెరుపులు..టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024: సత్తా చాటిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్లో విరాట్ 2022 టీ20 వరల్డ్కప్లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్లో బాదిన ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్లో మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
T20 World Cup 2024: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. తుది జట్టులో కుల్దీప్
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-8 మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మార్పు చేశాయి. భారత్కు సంబంధించి సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. ఆప్ఘనిస్తాన్ తరఫున కరీమ్ జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
అఫ్గాన్తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్కు నో ఛాన్స్
టీ20 వరల్డ్కప్-2024లో సూపర్ ఎయిట్ సమరానికి టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా అఫ్గానిస్తాన్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ దిశగా అడుగులు వేయాలని టీమిండియా భావిస్తుంటే.. అఫ్గాన్ కూడా న్యూజిలాండ్ మాదిరే భారత్కు కూడా షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్తో పోరుకు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు మెనెజ్మెంట్ అఫ్గాన్తో మ్యాచ్లో అదనపు స్పిన్నర్ను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్పై వేటు వేసి చైనామన్ కుల్దీప్ యాదవ్కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కుల్దీప్ ఇప్పటివరకు ఈ ఏడాది టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్తో పాటు మరో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బెంచ్లో ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో చాహల్ కంటే కుల్దీప్నే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ యాదవ్ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుమెనెజ్మెంట్ చాహల్ కంటే కుల్దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఒక్కటి మినహా జట్టులో ఇంకా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.అఫ్గాన్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
Ind vs Afg: అతడు వద్దు.. కోహ్లి విషయంలో అలా చేయొద్దు!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా అఫ్గనిస్తాన్తో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లీగ్ దశలో న్యూయార్క్ పిచ్పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డ బ్యాటర్లు.. బ్రిడ్జ్టౌన్ పిచ్పై బ్యాట్ ఝులిపించాలని పట్టుదలగా ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ.. స్కిల్ సెషన్స్ను సద్వినియోగం చేసుకున్నారు టీమిండియా స్టార్లు. ఇక విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి.. టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.అమెరికాలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వెస్టిండీస్లో ఓ పేసర్పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఓపెనింగ్ జోడీని మారిస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.కోహ్లి విషయంలో ప్రయోగాలు వద్దుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించగల కోహ్లి.. అఫ్గన్తో పోరులోనూ ఓపెనర్గానే రావాలని ఆకాంక్షించాడు.న్యూయార్క్లో పరిస్థితులు వేరని.. విండీస్ పిచ్లపై కోహ్లి కచ్చితంగా బ్యాట్తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఆటగాడని.. అతడి విషయంలో ప్రయోగాలు అనవసరం అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ను తప్పించి.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అఫ్గనిస్తాన్తో సూపర్-8 మ్యాచ్కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: -
కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్-8 కోసం వెస్టిండీస్కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా అఫ్గనిస్తాన్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.‘‘రాహుల్.. మీరు ఇక్కడ మ్యాచ్లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాపకాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్తో అన్నాడు.ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తా’’ అంటూ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు.కాగా 1997లో బార్బడోస్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్ ద్రవిడ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: T20 WC 2024: అఫ్గాన్తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్లోకి వస్తాడా? -
అఫ్గాన్తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్లోకి వస్తాడా?
టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8లో తమ తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సూపర్-8 రౌండ్ను విజయంతో ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకున్న భారత జట్టు తీవ్రంగా శ్రమించింది.అఫ్గాన్తో అంత ఈజీ కాదు..అయితే అఫ్గానిస్తాన్తో మ్యాచ్ అంత ఈజీ కాదు. ఒకప్పుడు అఫ్గాన్ వేరు ఇప్పుడు అఫ్గాన్ వేరు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టును మట్టికరిపించిన అఫ్గాన్.. భారత్, ఆస్ట్రేలియా వంటి వరల్డ్క్లాస్ జట్లకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. అఫ్గాన్ గ్రూపు-స్టేజిలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. సూపర్-8 రౌండ్ గ్రూపు-1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్తో పాటు అఫ్గానిస్తాన్ చోటు దక్కించుకుంది. అఫ్గాన్ బలాలు, బలహీనతలు..అఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే అఫ్గాన్ ప్రధాన బలం బౌలింగ్ అనే చెప్పాలి. అఫ్గాన్ జట్టులో అద్బుతమైన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉన్నారు. ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజిలో వెస్టిండీస్పై మినహా మిగితా మూడు మ్యాచ్ల్లోనూ అఫ్గాన్ బౌలర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు.తొలి మ్యాచ్లో ఉగండాను కేవలం 58 పరుగులకే ఆలౌట్ చేసిన రషీద్ సేన.. అనంతరం వరల్డ్క్లాస్ కివీస్ను 75 పరుగులకే అఫ్గాన్ బౌలర్లు కుప్పకూల్చారు. ఆ తర్వాతి మ్యాచ్లో పపువా న్యూగినిను 95 పరుగులకే కట్టడి చేశారు.ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫరూఖీ తన కెరీర్లోనే సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఆడిన ఫరూఖీ 12 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అతడితో పాటు మరో పేసర్ నవీన్ ఉల్ హాక్ తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో కెప్టెన్ రషీద్ ఖాన్తో పాటు ఆల్రౌండర్ మహ్మద్ నబీ సత్తాచాటుతున్నారు. అయితే స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం అఫ్గాన్కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ముజీబ్ ఉర్ రెహ్మన్ స్ధానంలో నూర్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. నూర్కు కూడా తన స్పిన్మయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడిచేసే సత్తా ఉంది. ఇక బ్యాటింగ్లో ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ సంచలన ఫామ్లో ఉన్నారు. వారు మరోసారి చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. వీరిద్దరితో పాటు గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా వంటి ఆల్రౌండర్లు సైతం బ్యాట్తో పర్వాలేదన్పిస్తున్నారు.అయితే అఫ్గాన్కు ఉన్న ఏకైక బలహీనత మిడిలార్డర్. అఫ్గాన్ బ్యాటింగ్ విభాగంలో మిడిలార్డర్ అంత పటిష్టంగా కన్పించడం లేదు. నజీబ్ జద్రాన్, కరీం జనత్, నబీ వంటి వారు తమ స్ధాయికి దగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. మరి సూపర్-8లోనైనా వీరు ముగ్గురూ తమ బ్యాట్కు పనిచెబుతారో లేదో వేచి చూడాలి. ఇక చివరగా అఫ్గానిస్తాన్ను తక్కువగా అంచనా వేస్తే భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోక తప్పదు.కోహ్లి ఫామ్లోకి వస్తాడా?కాగా అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. గ్రూపు స్టేజిలోకి దారుణమైన ప్రదర్శన కనబరిచిన కోహ్లి.. సూపర్-8లోనైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో కూడా దాదాపు రెండేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కింగ్ కోహ్లి.. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్పైనే తన రిథమ్ను తిరిగి పొందాడు. ఆ మ్యాచ్లో విరాట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో మళ్లీ అఫ్గాన్తో మ్యాచ్లో జరగనున్న నేపథ్యంలో విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని కింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 మ్యాచ్లకు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అమెరికాలో లీగ్ దశ మ్యాచ్లు పూర్తి చేసుకున్న రోహిత్ సేన.. ఇప్పటికే వెస్టిండీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా సూపర్-8లో తమ తొలి మ్యాచ్లో గురువారం అఫ్గనిస్తాన్తో తలపడనుంది టీమిండియా. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తదితరులు ప్రాక్టీసులో తలమునకలయ్యారు.విండీస్ పిచ్లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్లో చెమటోడుస్తున్నాడు.పిచ్ ఎలా ఉండబోతోంది?ఇదిలా ఉంటే.. టీమిండియా- అఫ్గనిస్తాన్కు మ్యాచ్కు వేదికైన బ్రిడ్జ్టౌన్(బార్బడోస్) పిచ్ ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. న్యూయార్క్లోని నసావూ వికెట్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బ్రిడ్జ్టౌన్ పిచ్ను పరిశీలించిన రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి తమవైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని మరింత మెరుగుపరచుకునేందుకు స్కిల్ సెషన్స్ను ఉపయోగించుకుంటున్నాం.మాకిది అలవాటేతొలి మ్యాచ్ తర్వాత మూడు- నాలుగు రోజుల వ్యవధిలోనే మేము మళ్లీ రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. విరామం లేని షెడ్యూల్ వల్ల కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే, మాకిది అలవాటే.ప్రస్తుతం మా దృష్టి మొత్తం సమిష్టిగా ఎలా రాణించాలన్న అంశం మీదే ఉంది. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు. అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.పిచ్ ఎలా ఉంది బుమ్రాఈ సందర్భంగా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి.. ‘‘పిచ్ ఎలా ఉంది’’ అని రోహిత్ శర్మ ప్రశ్నించగా.. అతడు బాగానే ఉందంటూ బదులిచ్చాడు. కాగా సూపర్-8 మ్యాచ్ల వేదికలకు అనుగుణంగా టీమిండియా బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక అఫ్గన్ తర్వాత టీమిండియా శనివారం బంగ్లాదేశ్, సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.చదవండి: పాకిస్తాన్ను వీడి.. ఇండియా హెడ్కోచ్గా వచ్చెయ్: భజ్జీ -
T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 వరల్డ్కప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్లు చివరి దశకు వచ్చాయి. ఈ దశలో మరో 11 మ్యాచ్లు జరగాల్సి ఉన్నా.. సూపర్-8కు చేరే జట్లపై ఓ అంచనా వచ్చేసింది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య పోటీ నెలకొంది. గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా సూపర్-8కు క్వాలిఫై కాగా.. శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్లో నేపాల్, నెదర్లాండ్స్ అధికారికంగా సూపర్-8 రేసులో ఉన్నప్పటికీ.. అనధికారికంగా బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్ను ఖరారు చేసుకుంది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సైపర్-8కు అర్హత సాధించగా.. అధికారికంగా మిగతా జట్లన్నీ సూపర్-8 రేసులో ఉన్నాయి. వీటిలో ఐర్లాండ్, కెనడా నామమాత్రంగా రేసులో ఉండగా.. ప్రధాన పోటీ యూఎస్ఏ, పాక్ మధ్యలోనే నెలకొంది. ఇవాళ (జూన్ 14) జరుగబోయే మ్యాచ్లో యూఎస్ఏ.. ఐర్లాండ్ను ఓడించినా లేక ఈ మ్యాచ్ రద్దైనా యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్తో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!సూపర్-8 బెర్త్లపై ఓ అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్లపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ దశలో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆప్ట్రేలియా జట్లతో పోటీడనుంది. గ్రూప్-డి నుంచి సూపర్-8 బెర్త్ రేసులో నెదర్లాండ్స్ కంటే బంగ్లాదేశ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.జూన్ 20- భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్జూన్ 22- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు)జూన్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా -
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్గా రికార్డు
గువాహటి: భారత ఫుట్బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్ల మైలురాయిని తాకారు.


