ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో జైశ్వాల్‌ | Yashasvi Jaiswal 49-Year-Old Record In 2nd Test At Edgbaston | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో జైశ్వాల్‌

Jun 28 2025 1:48 PM | Updated on Jun 28 2025 5:37 PM

Yashasvi Jaiswal 49-Year-Old Record In 2nd Test At Edgbaston

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాల‌ని భార‌త్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం త‌మ జోరును ఎడ్జ్‌బాస్ట‌న్‌లో కూడా కొన‌సాగించాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌కు అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టెస్టులో జైశ్వాల్ 97 ప‌రుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డులెక్కుతాడు. జైశ్వాల్ ఇప్ప‌టివ‌ర‌కు 20 టెస్టుల్లో 52.86 సగటుతో 1,903 పరుగులు చేశాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డు భార‌త లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సునీల్ గ‌వాస్క‌ర్ ఈ ఫీట్‌ను తన 23వ టెస్ట్‌లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన టెస్టులో ఈ ఘ‌న‌త సాధించారు. గ‌వాస్క‌ర్ త‌ర్వాతి స్ధానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. గంభీర్ ఈ ఫీట్‌ను త‌న 24వ టెస్టు మ్యాచ్‌లో అందుకున్నాడు

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు
👉సునీల్ గవాస్కర్ - 23 మ్యాచ్‌లు
👉గౌతమ్ గంభీర్ - 24
👉రాహుల్ ద్రవిడ్ - 25
👉వీరేంద్ర సెహ్వాగ్ - 25
👉విజయ్ హజారే - 26
👉చెతేశ్వర్ పుజారా – 26
👉సౌరవ్ గంగూలీ - 27
👉శిఖర్ ధావన్ - 28
👉పటౌడీ - 28
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement