
ఢిల్లీ అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఓ దశలో సులువుగా డబుల్ సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన జైశ్వాల్.. అనుహ్యంగా 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యి పెవిలియన్కు చేరాడు.
ఈ మ్యాచ్లో విండీస్ బౌలర్లను జైశూ ఉతికారేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 22 ఫోర్లు ఉన్నాయి. కాగా ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ను వీక్షించిన వెస్టిండీస్ దిగ్గజాలు బ్రియన్ లారా, సర్ వివ్ రిచర్డ్స్ జైశ్వాల్ బ్యాటింగ్కు పిధా అయిపోయారు. రెండో రోజు ఆట అనంతరం జైశ్వాల్ను లారా కలిశాడు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. లారా జైస్వాల్ను అభినందిస్తూ.. "బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్ ష అంటూ సరదాగా అన్నాడు. దానికి జైస్వాల్ నవ్వుతూ "ట్రై చేస్తున్నా సర్!" అని సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది.
కష్టాల్లో విండీస్..
కాగా ఈ మ్యాచ్లో కూడా విండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బౌలర్లు తేలిపోగా.. ఇప్పుడు బ్యాటర్లు కూడా తీవ్ర నిరాశపరిచారు. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విండీస్ ఫాల్ ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 102 పరుగులు చేయాలి.
Team's interests above all 🙌
Two special partnerships 🤝
High praise from Brian Lara 👏
Yashasvi Jaiswal recounts a magnificent innings in Delhi and shares insights on his approach ✨ - By @Moulinparikh #TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19— BCCI (@BCCI) October 12, 2025
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి